• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: WEF

నరేంద్రమోడీ మరో వింత పేరే నాలుగో పారిశ్రామిక విప్లవం !

26 Friday Oct 2018

Posted by raomk in Communalism, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

4th industrial revolution, INDIA, Naredra Modi, WEF, WEF 4th industrial revolution

Image result for narendra modi, 4th industrial revolution

ఎం కోటేశ్వరరావు

భాయియోం, బహెనోం దేశాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవం 4.0 వైపు నడిపిస్తున్నానంటూ మన ఘనత వహించిన ప్రధాని నరేంద్రమోడీ అక్టోబరు పదకొండవ తేదీన ఒక మహోపన్యాసం చేశారు. ప్రపంచ ఆర్ధిక వేదిక న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో రాజీవ్‌ గాంధీ ప్రధానిగా వున్న సమయంలో మాట్లాడితే దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోతానని చెప్పేవారు.ప్రధాని నరేంద్రమోడీ కంటే పక్షం రోజుల ముందే నాలుగున్నరేండ్లయినా రాజధాని శాశ్వత భవనాలను కట్టలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి వచ్చారు. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో చేసిన ఒక వుపన్యాసంలో ఒక రూపాయి పెట్టుబడి అవసరం లేని ‘ఆవు’ వ్యవసాయం గురించి కూడా ప్రపంచానికి వివరించి వచ్చారు. నాలుగోపారిశ్రామిక విప్లవంలోని ప్రధాన అంశాలలోని ఐటి, బయోటెక్నాలజీ నిపుణులు కూడా వాటిని పక్కన పడేసి ఆవు వ్యవసాయానికి పూనుకొని అంతకంటే ఎక్కువ ఆదాయం సంపాదించాలని సలహా కూడా ఇచ్చివచ్చినట్లు మనం వార్తలు చదువుకున్నాం. ఒకే నోటితో పరస్పర విరుద్ధ అంశాలు మాట్లాగల నేర్పరులు కొందరు రాజకీయవేత్తలు. అసలు నాలుగో పారిశ్రామిక విప్లవం అంటే ఏమిటి? అందుకు మన దేశంలో పరిస్ధితులు అనువుగా వున్నాయా?

నాలుగో పారిశ్రామిక విప్లవం గురించి తెలుసుకొనే ముందు మన దేశంలో మొదటి మూడు విప్లవాలు జరిగాయా, ఎంతవరకు అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. వుట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా- వుట్టి కొట్టలేనయ్య ఆకాశాన్ని అందుకుంటాడా ! మొదటి విషయం ఏ విప్లవం అయినా ఒక రోజులో లేదా ఒక తేదీనో ప్రారంభం కాదు, ముగియదు. ప్రధమ సోషలిస్టు విప్లవం రష్యాలో 1917 అక్టోబరు ఏడున జరిగింది అని చెబుతాం. దానర్ధం ఆ రోజు విప్లవపరిణామలు ఒక మలుపు తిరిగి మరోపరిణామానికి నాంది పలికింది అని తప్ప విప్లవం జయప్రదమైందని కాదు. అలాగే పాఠాల్లో మనం చదువుకొనే పారిశ్రామిక విప్లవం కూడా అలాంటిదే. ఒక తేదీ ఏమీ లేదు.1760 నుంచి 1820-40సంవత్సరాల మధ్య కాలంలో అంతకు ముందున్న వుత్పాదకపద్దతులు అంటే చేతితో తయారు చేసే ప్రక్రియలో యంత్రాలను ప్రవేశపెట్టటం, వాటిని నడిపేందుకు ఆవిరిని వుపయోగించటం, రసాయనాల తయారీ వంటి పరిణామాలన్నీ ఆ 80సంవత్సరాల కాలంలో బాగా అభివృద్ధి చెందాయి. రెండవ పారిశ్రామిక విప్లవకాలంలో అంటే 1870-1914 సంవత్సరాల మధ్య కాలంలో అంతకు ముందున్న పరిశ్రమలను కొనసాగించటం, కొత్తవాటిని ఏర్పాటు చేయటంతో పాటు ఆవిరి స్ధానంలో యంత్రాలను నడిపేందుకు విద్యుత్‌ వినియోగం, చమురును కనుగొనటం, వాటితో వుత్పత్తిని ఇబ్బడి ముబ్బడి చేయటం వంటి పరిణామాలు జరిగాయి. ఆ తరువాత నుంచి 1980, నేటి వరకు జరిగిన సాంకేతిక అభివృద్ధిని మూడవ పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం ఎప్పుడు ప్రారంభమైందో చెప్పుకొనే ముందు దీని ప్రధాన లక్షణాలను చెప్పుకోవాల్సి వుంది.రోబోలు, కృత్రిమ మేథ, డిజిటల్‌, నానో టెక్నాలజీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బయోటెక్నాలజీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌,3డి ప్రింటింగ్‌, డ్రైవర్‌తో పని లేకుండా నడిచే వాహనాల వంటివి దీనిలో వున్నాయి. ప్రపంచ ఆర్ధిక వేదిక(అదే మన చంద్రబాబు నాయుడు సిఎంగా వున్నపుడు ప్రతి సంవత్సరం దవోస్‌ వెళ్లి వస్తుంటారు. ఎందుకు వెళతారో, దాని వలన రాష్ట్ర ప్రజలకు చేతి చమురువదలటం తప్ప సాధించిందేమిటో ఇంతవరకు మనకు తెలియదు)ను ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ క్లాస్‌ ష్కవాబ్‌ నాలుగో పారిశ్రామిక విప్లవం అనే ఒక పుస్తకాన్ని రాశారు. మిగతా మూడు విప్లవాలం కంటే ఆధునాత సాంకేతిక పరిజ్ఞానమే నాలుగోదాని ప్రత్యేకత అంటారు. ఈ పరిజ్ఞానంతో వందల కోట్ల జనం ఇంటర్నెట్‌ వెబ్‌తో అనుసంధానం అవుతారని, వాణిజ్య, ఇతర సంస్ధల సామర్ధ్యం గణనీయంగా పెరుగుతుందని, మెరుగైన సంపదల యాజమాన్య పద్దతులతో సహజపర్యావరణాన్ని తిరిగి సృష్టించేందుకు తోడ్పడవచ్చునని చెప్పారు.2016లో జరిగిన ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశ ఇతివృత్తానికి ‘నాలుగవ పారిశ్రామిక విప్లవంలో సంపూర్ణత సాధన’ అని నామకరణం చేశారు. ఈ పద ప్రయోగం ఇదే మొదటి సారి. అదే ఏడాది అక్టోబరు పదిన శాన్‌ ఫ్రాన్సిస్‌కో నగరంలో నాలుగవ పారిశ్రామిక విప్లవ కేంద్రం పేరుతో విప్లవ పరిణామాలను అధ్యయనం చేయటానికి, సలహాలు ఇవ్వటానికి ఒక సంస్ధను ఏర్పాటు చేశారు. రెండు సంవత్సరాల తరువాత మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రపంచ ఆర్ధిక వేదిక ఆధ్వర్యాన ఏర్పాటుచేసి అలాంటి కేంద్రానికే అక్టోబరు 11వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేశారు.

Image result for narendra modi, 4th industrial revolution cartoons

ఆ రోజు మోడీగారు చెప్పిందాని సారాంశం ఇలా వుంది. మొదటి, రెండవ పారిశ్రామిక విప్లవాలు జరిగే నాటికి భారత దేశం స్వతంత్రంగా లేదు. మూడవది జరిగిన సమయంలో అపుడే వచ్చిన స్వాతంత్య్రంతో ఎదురైన సవాళ్లను ఎదుర్కొనేందుకు కుస్తీలు పడుతోంది. ఇప్పుడు నాలుగవ పారిశ్రామిక విప్లవానికి పెద్ద ఎత్తున దోహదపడుతుంది. సాంకేతిక పురోగతితో వుపాధి నష్టం జరుగుతుందని భయపడనవసరం లేదు, వుద్యోగాల స్వభాన్నే మార్చివేస్తుంది, మరిన్ని అవకాశాలను పెంచుతుంది.దీని ఫలితాలను పొందేందుకు అవసరమైన విధానపరమైన మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుంది. ప్రపంచ పరిశోధన మరియు అమలు కేంద్రంగా మారేందుకు అవసరమైన అవకాశాలు భారత్‌లో వున్నాయి. ఇంతకు ముందు వచ్చిన విప్లవాలు భారత్‌ను ఏమార్చాయి, నాలుగో విప్లవానికి భారత్‌ వంతు విస్మయకారిగా వుంటుంది.

ఇలా సాగిన వుపన్యాసంతో పాటు పనిలో పనిగా తన ప్రభుత్వం సాధించిన ఘనత గురించి కూడా చెప్పుకున్నారనుకోండి. తమ కారణంగానే టెలిఫోన్‌ సాంద్రత 93శాతానికి పెరిగిందని, 50కోట్ల మంది మొబైల్‌ ఫోన్లు వాడుతున్నారని, ప్రపంచంలో అత్యధికంగా మొబైల్‌ డాటా వాడుతున్నారని తక్కువ రేట్లకు దొరుకుతోందని, వినియోగం నాలుగు సంవత్సరాలలో 30రెట్లు పెరిగిందని, 120 కోట్ల మందికి ఆధార కార్డులు ఇచ్చామని, తాను అధికారంలోకి వచ్చిన 2014నాటికి కేవలం 59 గ్రామాలకు ఆప్టిక్‌ ఫైబర్‌ లైన్లు వుంటే త్వరలో రెండున్నర లక్షలకు చేరనున్నాయని చెప్పుకున్నారు. ఇది కూడా మరొక అర్ధ. అసత్యం. నేషనల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌నెట్‌ వర్క్‌(నోఫెన్‌) అనే కేంద్ర ప్రభుత్వ పధకానికి 2011లో అనుమతి ఇచ్చారు.దీన్నే డిజిటల్‌ ఇండియా పేరుతో ఏదో తానే ప్రారంభించినట్లు మోడీ గొప్పలు చెప్పుకుంటారు. ఆ పధక కార్యాచరణ ప్రణాలిక ప్రకారం 2012 అక్టోబరు నాటికి రాజస్ధాన్‌,ఆంధ్రప్రదేశ్‌, త్రిపుర రాష్ట్రాలలోని 59గ్రామాలలో పైలట్‌ పధకాన్ని అమలు చేయాలి. 2014 మార్చి, 2015 మార్చి నాటికి ఏటా లక్ష చొప్పున రెండులక్షల గ్రామాలకు, 2015సెప్టెంబరు నాటికి 50వేల గ్రామాలకు ఆ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. అయితే ఆ లక్ష్యాన్ని 2016 డిసెంబరు వరకు పొడిగించారు. మోడీగారు చెప్పినట్లే గడువు తీరి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి లక్ష గ్రామాలకే విస్తరించింది. తన అసమర్ధపాలనలో ఎప్పటికి పూర్తవుతాయో మోడీగారు చెబితే నిజాయితీగా వుండేది. నాలుగున్నర సంవత్సరాలలో లక్షగ్రామాలకు కూడా నెట్‌ వర్క్‌ విస్తరించలేదు, ఏర్పాటు చేసింది కూడా ఎంత వేగంతో పని చేస్తుందో తెలియని స్ధితిలో మోడీగారు మనకు డిజిటల్‌ విప్లవం గురించి చెబుతారు, నాలుగవ పారిశ్రామికవిప్లవంలో భాగస్వాములను చేస్తామంటున్నారు.

డిజిటల్‌ టెక్నాలజీ ఎంతో ప్రయోజనకారి అన్నది వాస్తవం. అన్న ప్రాసన నాడే ఆవకాయ అన్నట్లుగా, మెట్లు ఎ్క కుండానే మేడ ఎ్కవచ్చు అన్నట్లు అభివృద్ధిలో మిగతాదేశాలు అధిగమించిన దశలను మనం దాటకుండానే ఒక గెంతువేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని అందుబాటులోకి తెచ్చుకోవచ్చని, అభివృద్ధి చెందిన దేశాలలో అందుబాటులోకి వచ్చినవన్నీ మన కోసం కూడా సిద్దంగా వున్నాయని, అసలు ఇప్పటికే మనం ఆ దశలో ప్రవేశించిన విషయాన్ని అనేక మంది గుర్తించటం లేదని కొందరు చెబుతునాారు. వుపాధిని ఫణంగా పెట్టి ప్రవేశపెట్టే యాంత్రీకరణ సామాన్యులకు మేలు చేస్తుందా? ఎలా చేస్తుంది అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే పెట్టుబడిదారులు లేరు. అమెరికా, ఇతర అనేక దేశాలలో యాంత్రీకరణ ఎంతో ఎక్కువ, దాని వలన కార్పొరేట్లకు లాభాలు పెరిగాయి తప్ప అదనంగా వుత్పత్తి అయిన సంపదలో జనానికి దక్కిన వాటా ఎంత? అక్కడ ఆర్ధిక అసమానతలు భరించరాని విధంగా పెరిగాయని పెట్టుబడిదారీ మేథావి అయిన థామస్‌ పికెటీ చెప్పిన విషయాన్ని ఎలా మరచిపోగలం.ఇప్పటికే వుపాధిరహిత అభివృద్ధి జరుగుతోంది. పని చేసే జనం తక్కువగా వున్న దేశాలకు ఆటోమేషన్‌ లేదా రోబోలు అవసరం గావచ్చు. ఏటా కోటీ ఇరవై నుంచి కోటీ 30లక్షల మంది వరకు యువత తమకు వుపాధికావాలని వస్తున్న మన దేశంలో మన పరిశ్రమలలో వాటిని ప్రవేశపెడితే జరిగేదేమిటి? బెంగలూరులోని కెనరా బ్యాంకులో కన్నడం మాట్లాడే ఒక రోబో ఏ కౌంటర్‌కు వెళ్లాలో కస్టమర్లకు చెబుతుందట. సదరు బ్యాంకుకు వచ్చే కస్టమర్లకు ఏ కౌంటర్‌ ఎక్కడుందో తెలిపే సూచనలు ప్రదర్శిస్తే సరిపోయేదానికి గొప్పలు చెప్పుకోవటానికి గాకపోతే ఎంతో ఖర్చు పెట్టి రోబోను పెట్టాల్సిన అవసరం ఏముంది? కన్నడేతరులు వస్తే ఏ భాష రోబో దగ్గరకు వెళ్లాలి.

మన దేశంలో ఆటోమేషన్‌ జరిగితే ఇప్పుడున్న ప్రతి నాలుగు వుద్యోగాలకు ఒకటి పోతుందని ఒక అంచనా. శ్రమశక్తి మీద ఆధారపడిన పరిశ్రమలు,వ్యవసాయం, వృత్తులు మిగతా దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ వున్న మన దేశంలో ఇంకా అంతకంటే ఎక్కువే పోయినా ఆశ్చర్యం లేదు. మూడు సంవత్సరాల క్రితం ప్రపంచ ఆర్ధిక వేదిక రూపొందించిన ఒక నివేదిక ప్రకారం నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రపంచవ్యాపితంగా వుపాధిని దెబ్బతీస్తుందన్నది నిరాకరించజాలని అంశమని తేలింది. ఆఫీసు,అడ్మినిస్ట్రేషన్‌, వుత్పాదకత, తయారీ, నిర్మాణ రంగాల మీద ప్రభావం చాలా ఎక్కువగా వుంటుంది. కొన్ని పరిశ్రమలను మూతవేయాలి, అనేకాన్ని అవసరాలకు అనుగుణ్యంగా మార్చుకోవాలి. అధునాత వుత్పాదకయంత్రాలు, పద్దతుల వలన వుత్పత్తి ఇబ్బడి ముబ్బడి అవుతుంది, ఆ మేరకు వుపాధిపెరగదు, అంతకు ముందుకంటే తగ్గినా ఆశ్చర్యం లేదు. అందువలన వుపాధి చర్చను పక్కన పెట్టి ముందుకు పోవాలని పెట్టుబడిదారులు సహజంగానే కోరుకుంటారు.ప్రతి పారిశ్రామిక విప్లవం సమాజంలో అసమానతలను పెంచింది తప్ప సంపదల పంపిణీని సమంగా పంచలేదు. సాంకేతిక ప్రగతి పెరిగిన కొద్దీ కొద్ది మంది చేతుల్లో పోగుపడుతున్న సంపదల వాటా కూడా పెరిగిపోతోంది.

Image result for BJP, 4th industrial revolution cartoons

ఎవరు కాదన్నా అవునన్నా మన దగ్గర వున్న కొనుగోలు శక్తి కలిగిన మధ్యతరగతి మార్కెట్‌ను ఎలా సొమ్ము చేసుకుందామా అని చూడటం తప్ప ప్రయివేటు రంగానికి మరొకటి పట్టదు. అదే చైనాలో మధ్యతరగతి మార్కెట్‌ను పెంచటంతో పాటు దిగువన వున్నవారిని కూడా మధ్యతరగతిగా మార్చే విధంగా సంపదల పంపిణీ జరగటమే దాని విజయానికి మూలం. మన జనానికి స్మార్ట్‌ ఫోన్‌ ఇస్తే దానిని ఎంత మంది వినియోగించగలరు అన్నది ప్రశ్నార్ధకంగా వున్న తరుణంలో అంతకు మించిన పరిజ్ఞానంతో ప్రమేయం వుండే నాలుగోపారిశ్రామిక విప్లవం గురించి మాట్లాడుకుంటున్నాం. దేశంలోని గ్రామాలన్నింటినీ విద్యుదీకరించామని నరేంద్రమోడీ ఘనంగా ప్రకటించిన వారం తిరగక ముందే 125కోట్ల మంది జనాభా వున్న భారత్‌లో 15శాతం మందికి(అంటే21కోట్ల మందికి) విద్యుత్‌ అందుబాటులో లేదని ప్రకటించింది. వారికి సెల్‌ఫోన్లు ఇచ్చినా ఛార్జింగ్‌ చేసుకోలేరు. ఈ ఏడాది జనవరి నాటికి మన దేశంలో ఇంటర్నెట్‌ను వినియోగించేవారు నూటికి 26శాతం మందే వున్నారట. ప్రస్తుతం మన దేశానికి ఏటా వచ్చే ఆదాయం ఒక రూపాయి అనుకుందాం. దానిలో వ్యవసాయరంగంలో వున్న 51శాతం కార్మికుల నుంచి 12పైసలు, 22శాతం మంది పని చేస్తున్న పారిశ్రామిక రంగం నుంచి 28, సేవారంగాలలో పని చేస్తున్న 27శాతం మంది నుంచి 60పైసల ఆదాయం వస్తోందని లెక్కలు చెబుతున్నాయి. మన జిడిపిలో 60శాతం సేవారంగం నుంచి వుండటం ఒక అస్ధిరతకు సూచిక. పశ్చిమ దేశాల ఆర్ధిక స్ధితిపై ఆధారపడి ఐటి, పొరుగుసేవల ఆదాయం వుంటుంది. అవి సజావుగా వున్నంత వరకు ఇబ్బంది లేదు, దెబ్బతింటే మనమూ నష్టపోతాం. చైనా విషయానికి వస్తే వ్యవసాయం నుంచి 2017లో 7.9శాతం, పరిశ్రమల నుంచి 40.5, సేవారంగం వాటా 51.6శాతం వుంది. ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగా పేరుపొందిన చైనా మాదిరి మనం కూడా పారిశ్రామిక రంగాన్ని పటిష్టపరుచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.కృత్రిమ మేధస్సు అంటే ఆటోమేషన్‌ యంత్రాలు, రోబోలు రానున్న దశాబ్దంలో 20శాతం వుద్యోగాలను హరించనున్నాయని అంచనా. టాక్సీ డ్రయివర్లు, చేపలు పట్టటం, బేకరీ, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలలో అయితే 80-90శాతం వుద్యోగాలు పోతాయని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆటోమేషన్‌, రోబోలతో పనులు చేయించేందుకు అవసరమైన అత్యున్నత నైపుణ్యం కలిగిన కొద్ది మందికి డిమాండ్‌ వుంటుంది.గతంలో దేశం నీకేమిచ్చిందనే కంటే దేశానికి నీవేమిచ్చావనేది దేశభక్తి అని నూరిపోశారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో వుద్యోగాలు హరించే అవకాశాన్ని ముందుగానే తెలిసిన పెట్టుబడిదారీ మేథావులు మనకు వుద్యోగభద్రత కంటే నైపుణ్యం ముఖ్యమని చెబుతున్నారు.

మన నరేంద్రమోడీగారు 2022 నాటికి(చాలా మంది ఈ సంవత్సరం ఎందుకు అని అడుగుతున్నారు అప్పటికి మన స్వాతంత్య్రానికి 75ఏండ్లు నిండుతాయి) రైతాంగ ఆదాయాలు రెట్టింపు చేస్తామని వూదరగొడుతున్నారు. అదే సంవత్సరానికి మన పరిశ్రమల్లో సాంకేతిక పరిజ్ఞానం వుపయోగించటం గురించి కూడా లక్ష్యాలను నిర్ణయించింది.మనలో చాలా మందిమి కార్లు,బస్సులను గడిగేందుకు మనుషుల బదులు యంత్రాలను వాడటం చూసి వుంటాము. పరిశ్రమల్లో పని చేసే ప్రతి వేల మంది కార్మికులకు ఎన్ని పారిశ్రామిక రోబోలు వున్నాయనే అంశాన్ని రోబో సాంద్రత అని పిలుస్తున్నారు. 2016లెక్కల ప్రకారం ప్రపంచ రోబో సాంద్రత సగటు 74. మన దేశంలో మూడు, అత్యధికంగా దక్షిణ కొరియాలో 631. సింగపూర్‌ 488,జర్మనీ 309, జపాన్‌ 303, అమెరికా 198,బ్రిటన్‌ 71, చైనా 68, బ్రెజిల్‌ 10, రష్యా 3తో వుంది. మన దేశంలో ఏటా 24శాతం పెంచుకుంటూ పారిశ్రామిక రోబోలను మన పారిశ్రామికవేత్తలు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో మొత్తంగా రోబో సాంద్రత మూడే అయినప్పటికీ ఆటోమొబైల్‌ రంగంలో అది 58గా వుంది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు పోటీబడి రాయితీలు ఇచ్చేది రోబోల ఏర్పాటుకు తప్ప కార్మికులకు వుపాధి కల్పించేందుకు కాదు.

ఆధునిక యంత్రాలు, కంప్యూటర్లు, రోబోల మీద పని చేసే నిపుణులైన మానవశ్రమ శక్తి తప్ప కండలను కరగించే శారీరక శ్రమ చేసే వారు కాదని పెట్టుబడిదారీ ప్రతినిధులైన ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ ఎప్పుడో గుర్తించాయి. అలాంటి వారిని తయారు చేయాలంటే ధనిక దేశాలలో ఎంతో ఖర్చు అవుతుంది. కనుక మన వంటి దేశాలలో ఇంజనీరింగ్‌,మెడికల్‌ కాలేజీలను ఇబ్బడి ముబ్బడిగా పెట్టాలని సలహాయిచ్చి చౌకగా దొరికే ఇంజనీర్లను తయారు చేయాలని కోరింది. దాని ఫలితమే చెట్టుకొకటి పుట్టకొకటిగా వెలిసిన ఇంజనీరింగ్‌ కాలేజీలు. మన విద్యావ్యాపారులు కొన్ని చోట్ల కొందరు నిపుణులను తయారు చేస్తున్నప్పటికీ అత్యధికులకు నైపుణ్యం తప్ప సర్టిఫికెట్‌లు ఇచ్చి జనాన్ని మార్కెట్లోకి తోలుతున్నాయి. వారి ప్రతిభా, ప్రావిణ్యాల గురించి 2017లో యాస్పరింగ్‌ మైండ్స్‌ అనే సంస్ధ ఒక సర్వే చేసి నమ్మలేని నిజాలను వెల్లడించింది. విద్యావ్యాపారులు దాన్ని తోసిపుచ్చగా ఐటి కంపెనీల యజమానులు నిర్ధారించారు.తొంభై అయిదు శాతం ఇంజనీరింగు పట్టభద్రులు సాప్ట్‌వేర్‌ అభివృద్ధి వుద్యోగాలకు పనికి రారన్నది సర్వేసారం. పోనీ అది అతిశయోక్తితో కూడింది అనుకుందాం. పది సంవత్సరాల క్రితం మెకెన్సీ సంస్ధ పాతికశాతం మంది మాత్రమే వుద్యోగాలకు పనికి వస్తారు అన్నది. ఇలాంటి పరిస్ధితికి కారకులు ఎవరు? అన్నింటినీ మాకు వదలి పెట్టండి దేశాన్ని ఎలా ముందుకు తీసుకుపోతామో చూడండి అనే ప్రయివేటు రంగం కాదా ! విద్యావ్యాపారంలో లేని పారిశ్రామిక సంస్ధను ఒక్కదానిని చూపమనండి, ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో అదే లాభసాటి వ్యాపారం. ఈరోజు ఇంజనీరింగ్‌ చదివి వుద్యోగం పేరుతో పనిచేస్తున్న అనేక మందికి చాలా మంది అడ్డామీది రోజువారీ కూలీకి వస్తున్న మొత్తాలకంటే తక్కువే అన్నది చేదు నిజం. గతంలో విదేశీ తెల్లజాతి మెకాలే తమకు అవసరమైన గుమస్తాలను తయారు చేసే విద్యావిధానం, వ్యవస్ధలను ఏర్పాటు చేస్తే నేటి మన నల్లజాతి మెకాలేలు కారుచౌక ఇంజనీరింగ్‌ గుమస్తాలను సరఫరా చేస్తున్నారు.’ఈ రోజు ఢిల్లీలో 60శాతం మార్కులు తెచ్చుకున్నవారు కూడా బిఏ ఇంగ్లీష్‌ కోర్సు సీటు తెచ్చుకోలేరుగాని ఇంజనీరింగ్‌కాలేజిలో సులభంగా చేరిపోతున్నారని’ టెక్‌ మహీంద్రా సిఇఓ సిపి గుర్నానీ వ్యాఖ్యానించారు. నాలుగో పారిశ్రామిక విప్లవం గురించి చెబుతున్న మన రాజకీయవేత్తలు, విధాన నిర్ణేతలకు ఏ నిపుణులు ఎందరు కావాలో, అందుకు అనుసరించాల్సిన ప్రణాళికలేమిటో ఎవరైనా చెప్పగలరా ? ఇంజనీరింగ్‌,మెడికల్‌ కాలేజీల్లో సంపూర్ణ అర్హతలు కలిగిన బోధకులు వున్నారా, అవసరమైన ప్రయోగశాలలు వున్నాయా లేదా అని ఎవరైనా పట్టించుకుంటున్నారా? వీరు దేశాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవంలోకి దేశాన్ని తీసుకుపోతారా? మనం నమ్మేయాలా ?

ఇటీవలి కాలంలో నైపుణ్య అభివృద్ధి గురించి ప్రధాని మోడీ, మాట్లాడని ముఖ్యమంత్రి లేరు. అందుకోసం వందల కోట్లరూపాయలు తగలేస్తున్నారు.నివేదికల్లో అసంఖ్యాకంగా నిపుణులను సృష్టిస్తున్నారు. నరేంద్రమోడీ సర్కార్‌ చర్యల వలన ఇప్పటికే తన ఆదాయం రెట్టింపైందని చత్తీస్‌ఘర్‌కు చెందిన గిరిజన మహిళా రైతు చెప్పిన అంశాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకుంది. తీరా చూస్తే అధికారులు తనను అలా చెప్పమన్నారని ఆమె ఒకటీవి బృందానికి చెప్పింది. ఆ వార్తను ప్రసారం చేసిన సదరు ఎడిటర్‌, యాంకర్‌ను వుద్యోగాల నుంచి ఇంటికి పంపే విధంగా మోడీ సర్కార్‌ టీవీ ఛానల్‌ యాజమాన్యంపై వత్తిడి తెచ్చిన వుదంతం తెలిసిందే. అలాంటి వారందరినీ లెక్కలోకి తీసుకున్నా మన దగ్గర వున్న నిపుణులైన పనివారలెందరో చూస్తే దిమ్మదిరుగుతుంది. మన దగ్గర నిపుణులైన పనివారలే తక్కువ, అవసరమైన వృత్తి శిక్షణ ఇచ్చే సామర్ధ్యం కూడా మన దగ్గర లేదని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం కార్మికుల సంఖ్యతో పోలిస్తే వృత్తిశిక్షణ సామర్ధ్యం చైనాలో 11.5శాతం కాగా అమెరికాలో 6.7, అదే మన దేశంలో 0.8శాతం మాత్రమే. దేశాల వారీగా దక్షిణ కొరియాలో 96, జపాన్‌లో 80, జర్మనీలో 75, బ్రిటన్‌లో 68శాతం మంది వున్నారు. రెండుశాతమే మన దగ్గర అని చెప్పుకోకపోవటమే మంచిది.

ఒక వైపు ప్రధాని నరేంద్రమోడీ పురోగామి మహోపన్యాసాలు మరోవైపు ఆయన అనుయాయులేమో స్త్రీల రుతుస్రావం అపవిత్రమంటూ వీధుల్లో అల్లరి, దాడులు చేస్తుంటారు. పనిలేని వారు ఏదో చేశారన్నట్లుగా కొందరు అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గానూ, సిమ్లాను శ్యామలాగా మార్చేందుకు, మసీదులను పడగొట్టి గుడులు ఎలా కట్టాలా అని, మరి కొందరు అయ్యప్ప గుడికి వచ్చే మహిళా భక్తులు మీద ఎలా దాడులు చెయ్యాలా అని తిరుగులేని తిరోగామి ఆచరణలో మునిగి తేలుతుంటారు. మోడీ, ఆయన అనుయాయులను తయారు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ దళం చేస్తున్న వాదనల ప్రకారం రాజారామ్మోహన్‌ రాయ్‌ బ్రిటీష్‌ వారితో చేతులు కలిపి మన పవిత్ర సతీసహగమన ఆచారాన్ని మట్టికలిపారు. వితంతు పునర్వివాహ నిషేధం, బహుభార్యాత్వం, దేవదాసీ వంటి మన హిందూ ఆచారాలు సాంప్రదాయాలను తిరిగి పునరుద్దరించాల్సిందే. అవి లేకుండా పోయిందని చెబుతున్న మన గత గౌరవం, ఘనత తిరిగిరాదు. వాటన్నింటి పునరుద్ధరణ ప్రపంచంలో మరోమారు మన దేశాన్ని వున్నత స్ధానంలో వుంచుతుంది. అందుకుగాను వున్న రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. మనువు కంటే ముందే మన ఆచారాలు వున్నాయి గనుక వాటిని క్రోడీకరించటం తప్ప కొత్తగా చేసిందేమీ లేని మనుస్మృతిని తిరిగి ప్రవేశపెట్టాలి. సాంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణ పేరిట సామాజిక మాధ్యమం, వీధుల్లో వేస్తున్న వీరంగాలను చూస్తే అంతపనీ చేసినా ఆశ్చర్యం లేదు. అందుకే అంతరకు వచ్చినపుడు ఏం చేయాలో, ఏ వైపున వుండాలో ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే ఆలోచించుకోవటం మంచిది. ఇలాంటి వారి నాయకత్వంలో మహా అయితే కుక్కతోకపట్టుకొని గోదావరి కాక పోతే గత నాలుగేండ్లలో మరింతగా మురికి అయిందని వార్తలు వచ్చిన గంగానదిని ఈదగలమేమోగానీ నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రవేశించగలమా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా ప్రపంచీకరణ హీరోగా మారిందా ?

21 Saturday Jan 2017

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, Chinese President, Donald trump, globalisation, Oxfam, WEF, World Economic Forum 2017, Xi Jinping

Image result for IS really China became Globalisation Hero

ఎం కోటేశ్వరరావు

   అమెరికా, బ్రిటన్‌ వేరే అజండాలతో ముందుకు పోతుంటే దవోస్‌ నిర్వాహకులు చైనా కమ్యూనిస్టుపార్టీ అనే కొత్త హీరోను ముందుకు తెచ్చారు అంటూ ప్రపంచ ధనికుల పత్రిక ఫోర్బ్స్‌ శీర్షిక పెట్టింది. వర్తమాన పరిస్థితులలో ఇలా రాసినందుకు ప్రపంచంలోని కమ్యూనిస్టులు, వామపక్ష శక్తులు గర్వపడాలా లేక ప్రపంచ ధనికుల వేదికలో హీరోగా మారినందుకు లేదా మార్చినందుకు చైనా సోషలిజం గురించి అనుమానించాలా అన్న సందేహం ఎవరికైనా కలగటం సహజం. ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాలలో పాల్గొన్న తొలి చైనా అధ్యక్షుడిగా చరిత్రకెక్కిన గ్జీ జిన్‌పింగ్‌ ప్రపంచీకరణను గట్టిగా సమర్ధించినట్లు వార్తలలో వ్యాఖ్యలు వెలువడ్డాయి. వీటిని చూసిన తరువాత చూశారా మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం, చైనాలో పభుత్వ పెట్టుబడిదారీ విధానం తప్ప సోషలిజం, కమ్యూనిజం లేదు పాడు లేదు అని చెబుతున్నవారు మరింతగా రెచ్చి పోవచ్చు. రాబోయే రోజులలో చైనా కంటే మన దేశ అభివృద్ధి రేటు ఎక్కువగా వుంటుందని, అమెరికా తరువాత రెండో స్ధానంలో వున్న ‘మందుభాయీలను’ వెనక్కు నెట్టి ఆ స్ధానాన్ని ఆక్రమించాలని, పెద్ద నోట్ల రద్దు ద్వారా ప్రపంచంలో ఏ దేశాధినేత చేయని సాహసం చేశారని వంది మాగధుల పొగడ్తలు అందుకుంటున్న మన ప్రధాని నరేంద్రమోడీ ఈ సమావేశాల వైపు కన్నెత్తి చూడలేదు. మోడీగారు స్వదేశంలో కంటే విదేశాలలో ఎక్కువగా ఎందుకు వుంటున్నారన్న విమర్శకు విదేశీ పెట్టుబడుల సాధనకు అని సిద్దం చేసుకున్న సమాధానం చెప్పారు. దవోస్‌ అంటే ప్రపంచ పెట్టుబడిదారులందరూ చేరే కేంద్రం. అలాంటి కేంద్రాన్ని సందర్శిస్తే అన్ని దేశాల పెట్టుబడిదారులను అక్కడే కలుసుకోవచ్చని నరేంద్రమోడీకి తట్టలేదా లేదా చెప్పిన వారు లేరా ? కనీసం చంద్రబాబును చూసైనా నేర్చుకోవచ్చు. చంద్రబాబూ ఆ సమావేశాలకు పోయి నేనూ వెళితే నా గొప్పేముంటుంది అనుకున్నారా ? సరే చంద్రబాబు నాయుడు తన పరివారంతో అత్యంత ఖరీదైన ఈ జాతరకు క్రమం తప్పకుండా వెళ్ళటం పెద్దలతో కలిసిన ఫొటోలు, ప్రకటనలు గుప్పించటం, తడిచి మోపెడు ఖర్చును జనంపై రుద్దటం గత ఆనవాయితీ, షరా మామూలే అనుకోండి. రాజుల సొమ్ము రాళ్లపాలైందన్న సామెతను తిరగరాసుకుంటే ఆంధ్రుల సొమ్ము చంద్రబాబు పరివార విదేశీ యాత్రలపాలు అని చెప్పాల్సి వుంటుంది. గతంలో చేసిన యాత్రలు, దిగిన ఫొటోలు, అయిన ఖర్చులు, పొందిన హామీలు, సాధించిన పెట్టుబడులపై శ్వేత పత్రం సమర్పిస్తే అసలు బండారం బయట పడుతుంది.

Image result for wef 2017

    ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు స్విడ్జర్లాండ్‌లోని దవోస్‌లో ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశాలు జరిగాయి. ‘ ప్రతి స్పందక మరియు జవాబుదారీ నాయకత్వం ‘ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలను నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచంలో అమలు జరుగుతున్న విధానాల పర్యవసానాల గురించి నేతలు ప్రతిస్పందించటం లేదని, జవాబుదారీయుతంగా వ్యవహరించ కుండా ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటున్నారనే విమర్శలు నానాటికీ పెరుగుతున్న నేపధ్యంలో ఈ ఇతివృత్తాన్ని ఎంచుకున్నారని భావించాలి. ప్రపంచీకరణను మరింత ముందుకు తీసుకు పోయే క్రమంలో ఎదురువుతున్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు ప్రపంచ బడా కార్పొరేట్‌ సంస్ధలు ఏర్పాటు చేసుకున్న వేదిక ఇది. కాల క్రమంలో కొన్ని మార్పులకు లోనైనప్పటికీ మౌలిక లక్ష్యం మారలేదు. ఏటా కనీసం ఐదువందల కోట్ల డాలర్లకు పైబడి లావాదేవీలు నిర్వహించే బడా కంపెనీలకు మాత్రమే దీనిలో సభ్యత్వం ఇస్తారు. ఎగ్జిబిషన్లలో ప్రవేశం పొందాలంటే ప్రవేశ రుసుం మాదిరి దీని సమావేశాలకు హాజరుకావాలంటే 68వేల స్విస్‌ ఫ్రాంక్‌లు (ఒక ఫ్రాంక్‌ మన రు 67.75 సమానం) అంటే 46లక్షల రూపాయలు చెల్లించాలి. ఇక ఎగ్జిబిషన్‌లోకి వెళ్లిన తరువాత జెయింట్‌ వీల్‌, రంగుల రాట్నం, ఫొటో తీయించుకోవటం ఇలా ప్రతిదానికి ఒక్కో రేటు చెల్లించాలి. దవోస్‌ సమావేశాలలో అలా అన్ని విభాగాలలో ప్రవేశం పొందాలంటే ఆరులక్షల ఫ్రాంకులు అంటే 40 కోట్ల 64లక్షల రూపాయలు చెల్లించాలి. అంత మొత్తం చెల్లించిన కంపెనీ సిఇఓ తనతో పాటు నలుగురిని తీసుకు వెళ్ల వచ్చు. అదనంగా తలకు 18వేల స్విస్‌ ఫ్రాంకులు చెల్లించాలి. చంద్రబాబు అండ్‌కోకు అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేదా ఆయన ద్వారా లబ్ది పొంద చూసే ఏ అనిల్‌ అంబానీయో, మరొక బడా కార్పొరేట్‌ కంపెనీయో ఆ ఖర్చులను భరించాల్సి వుంటుంది.

    దవోస్‌ వేదిక ప్రపంచీకరణను మరింత ముందుకు తీసుకుపోవాలని చూస్తుంటే ప్రపంచీకరణను వ్యతిరేకించే శక్తులు ఆ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయటం, నిరసనలు తెలపటం, పోటీ సమావేశాలు పెట్టటం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కేవలం ఎనిమిదిమంది చేతులలో ప్రపంచంలోని 360 కోట్ల మంది పేదల దగ్గరున్న వాటికి సమానమైన సంపదలు కేంద్రీకృతమయ్యాయని ఆక్స్‌ఫామ్‌ సంస్ధ వెల్లడించటం దీనిలో భాగమే. అటువంటి అంతరాలు పెంచే ప్రపంచీకరణను కమ్యూనిస్టు చైనా వ్యతిరేకించాలి కదా ? ఆ పని చేయకుండా జిన్‌పింగ్‌ అలా మాట్లాడటం ఏమిటి ? అన్న ప్రశ్న వెంటనే వస్తుంది.

    ఐరోపా యూనియన్‌లో చేరితో ప్రయోజనం జరుగుతుందని అనుకున్నాము. అటువంటిదేమీ కనిపించటం లేదు కనుక బయటికి పోయి, విడిగా మా లావాదేవీలు మేము నిర్వహించుకుంటాం అంటూ జరిపిన ప్రజాభిప్రాయ సేకరణే బ్రెక్సిట్‌ అన్నది తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో, ఎన్నికలు ముగిసిన తరువాత మెక్సికో, చైనా తదితర దేశాల నుంచి చేసుకొనే దిగుమతులపై పది నుంచి 50శాతం వరకు పన్ను విధిస్తామని, అమెరికా వుద్యోగాలను బయటికి పంపే కంపెనీలపై చర్య తీసుకుంటామని ఇంకా అనేక రక్షణ చర్యలు తీసుకోవటం తద్వారా వుద్యోగాలు కల్పిస్తానంటూ ఎన్నికల సందర్భంగా అమెరికా వూరూ వాడా అంతా తిరిగి చెప్పారు. ఇంకా అనేక ధనిక దేశాలలో అలాంటి మాటలు మాట్లాడేవారి వైపే మొగ్గేందుకు జనం సిద్ధ పడుతున్నారన్నది పరిణామాల విశ్లేషణ.( ప్రపంచ సంస్ధలకు మన మార్కెట్‌ తెరిచిన మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని ముఖ్యమైన యుపిఏ ప్రభుత్వ విధానాలన్నింటినీ, రూపాయి విలువ పతనాన్ని బిజెపి పదేళ్లపాటు వ్యతిరేకించి జనంలో వున్న అసంతృప్తిని సొమ్ము చేసుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు అంతకంటే దారుణంగా ఆ విధానాలనే మరింతగా అమలు జరుపుతోంది, దానికి తగిన మూల్యం చెల్లిస్తుంది అది వేరే విషయం. ) నిజానికి ఇవన్నీ ప్రపంచ ధనిక దేశాలు ఇంతకాలం నుంచి చెబుతున్న ప్రపంచీకరణ , ప్రపంచ వాణిజ్య సంస్ధ, దాని తరఫున జరుగుతున్న చర్చల ప్రక్రియకు విరుద్దం.

    పెట్టుబడిదారీవర్గం, సామ్రాజ్యవాదులు వాణిజ్యం పేరుతో ప్రపంచం మీద వలసవాదాన్ని రుద్ధి ఎవరి బలం కొద్దీ వారు ప్రపంచాన్ని ముక్కలుగా చేసి పంచుకున్నారన్నది గత చరిత్ర. దానికి ప్రతిఘటన ఎదురుకావటం, చివరకు యుద్ధాలతో సామ్రాజ్యవాదులు చావు దెబ్బలు తిని తోక ముడిచారు. ఆ తరువాత తమ దోపిడీని కొనసొగించేందుకు రూపొందించిన నయా వలస లేదా నూతన దోపిడీ పద్దతులలో భాగమే ప్రపంచీకరణ. ఇది కమ్యూనిస్టులు కోరుకున్నది లేదా ముందుకు తెచ్చిన అవగాహన కాదు. ప్రపంచ కార్మికులారా ఏకం కండు అన్న పిలుపు దోపిడీ సమాజాన్ని కూలదోయటానికి, సమసమాజాన్ని నిర్మించటానికి తప్ప దోపిడీకి కాదు.

    బ్రిటీష్‌ వారి స్ధానంలో ప్రపంచ సామ్రాజ్యవాదుల, పెట్టుబడిదారుల నాయకురాలిగా ముందుకు వచ్చిన అమెరికా ఒకవైపు ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను ఆక్రమించుకోవటంతో పాటు మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో ఆవిర్బవించిన నూతన సోషలిస్టు రాజ్యాలను, వాటికి మార్గదర్శనం చేస్తున్న కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని దెబ్బతీయటం అనే లక్ష్యాన్ని కూడా ఎంచుకున్నారు. దానిలో భాగంగానే సోషలిస్టు దేశాలను దెబ్బతీయటానికి, వాటికి ఆధునిక పరిజ్ఞానం, అవసరమైన పెట్టుబడులు అందకుండా చేసి సోషలిజం విఫలమైంది, పెట్టుబడిదారీ విధానమే దిక్కు అని చెప్పేందుకు గతంలో పెట్టుబడిదారీ దేశాలు అనేక చర్యలు, ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.దానిలో భాగంగానే అమెరికన్లు దశాబ్దాల తరబడి క్యూబాను అష్టదిగ్బంధనం కావించారు. ఈ పూర్వరంగంలోనే చైనాతో సహా మిగిలిన సోషలిస్టు దేశాలు సోషలిస్టు సంస్కరణలకు తెరతీశాయి. వీటిపై కమ్యూనిస్టుపార్టీలు, లేదా వామపక్ష మేథావులలో కొన్ని భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. ఫోర్బ్స్‌ వంటి పత్రికలు చైనా అధ్యక్షుడి ప్రసంగానికి ప్రపంచీకరణను సమర్ధించే హీరోగా వర్ణిస్తే చైనాలో అంతర్భాగంగా వుంటూ పెట్టుబడిదారీ వ్యవస్ధను కలిగి వున్న హాంకాంగ్‌ మీడియా విలన్‌గా పేర్కొన్న విషయాన్ని గమనించాలి.

   చైనా సంస్కరణలతో నిమిత్తం లేకుండానే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే నూతన పరిస్థితులలో మార్కెట్లను స్వాధీనం చేసుకొనేందుకు నూతన ఎత్తుగడలతో సామ్రాజ్యవాదులు నాంది పలికారు. దాని పర్యవసానమే బ్రెట్టన్‌ వుడ్‌ కవలలుగా పిలుస్తున్న ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధ. అవి రెండూ అంతర్జాతీయ ద్రవ్య విధానాన్ని రూపొందించాయి. ఆ విధానంలో అంతర్భాగంగా వుండే వాణిజ్యం సాఫీగా సాగేందుకు, పెట్టుబడులకు రక్షణ కల్పించటంతో పాటు వాణిజ్య సరళీకరణకు గాను వివిధ దేశాలు అప్పటి వరకు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలను సడలించేందుకు వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందం( జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ టారిఫ్‌ (గాట్‌)పై 23 దేశాలు జెనీవాలో ఏడు నెలలపాటు చర్చలు జరిపి 1947 అక్టోబరు 30న సంతకాలు చేశాయి. తరువాత దాని అమలులో తలెత్తే సమస్యల పరిష్కారానికి చర్చలు ఎవరు ప్రారంభిస్తే లేదా ఎక్కడ ప్రారంభమైతే ఆ దఫా చర్చలు అని పిలిచేవారు. అలా ఫ్రాన్స్‌లోని అనెసీలో రెండవ దఫా చర్చలు 1949లో 34 దేశాలతో ప్రారంభమై ఐదు నెలల్లో ఐదువేల సరకులపై పన్నుల తగ్గింపునకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. 1950 టొరొక్వే(బ్రిటన్‌) ఎనిమిదినెలలు, 1956 జనీవా-2 ఐదునెలలు, 1960 దిలియాన్‌(అమెరికా మంత్రి) 11నెలలు, 1964 కెన్నడీ(అమెరికా అధ్యక్షుడు) 37నెలలు, 1973 టోక్యో 74నెలలు, 1986 వురుగ్వే 87నెలల చర్చల తరువాత ఒప్పందాలు కుదిరాయి. ఆ తరువాత ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటివో) వునికిలోకి వచ్చింది. దాని ఆధ్వర్యంలో 2001లో ప్రారంభమైన దోహా చర్చలు 16 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. ఎప్పుడు వస్తాయో తెలియని స్ధితి. దీనికి కారకులు ఎవరు? మీ ఇంటి కొస్తే మాకేం పెడతావ్‌, మా ఇంటి కొస్తూ మాకేం తెస్తావ్‌ అంటున్న ధనిక దేశాల అత్యాశ, పెట్టుబడిదారీ వ్యవస్ధలో పెరుగుతున్న సంక్షోభమే అన్నది కొందరి అభిప్రాయం.

   గాట్‌ ఒప్పందం చేసుకున్న తొలి 23 దేశాలలో చైనా ఒకటి అయినప్పటికీ ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన ఏడాదికి చైనాలో కమ్యూనిస్టుల నాయకత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వాన్ని 1970దశకం వరకు ఐక్యరాజ్యసమితి గుర్తించలేదు. అందువలన ప్రపంచ వాణిజ్య చర్చలలో అది భాగస్వామి కాలేదు. 1978లో చైనా సంస్కరణలకు తెరతీసి విదేశీ పెట్టుబడులు, సంస్థల ప్రవేశానికి వీలు కల్పించిన తరువాత 1986లో పరిశీలక హోదాతో అనుమతించారు. తరువాత మిగతా ఏ దేశానికీ లేని విధంగా కఠినమైన షరతులు విధించి 2001లో ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనాకు పూర్తి సభ్వత్వం ఇచ్చారు.ఈ పూర్వరంగంలో చైనా అధ్యక్షుడి మాటలను పరిశీలించాల్సి వుంటుంది.

     పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది అది ఎలుకలను పడుతుందా లేదా అన్నది కీలకం అన్న చైనా సామెత మాదిరి తమ దేశంలోని 95 కోట్ల మంది జనాభా(1978)కు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమదైన లక్షణాలతో కూడిన సోషలిస్టు సంస్కరణలను ప్రవేశపెడుతున్నట్లు చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రకటించింది. అప్పటికే మార్కెట్లకోసం అర్రులు చాస్తున్న అమెరికా, తదితర పెట్టుబడిదారీ దేశాలు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూనే, అక్కడి సోషలిస్టు వ్యవస్ధను కూడా దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాయి. అందుకు చైనా సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్‌ ఒక మాట చెప్పారు. మంచి గాలి, వెలుతురు కోసం కిటికీలను తెరుస్తాము. వాటితో పాటు ఈగలు, దోమలు కూడా వస్తాయి. అయితే వాటిని ఎలా అదుపు చేయాలో మాకు తెలుసు అన్నారు. దానికి అనుగుణ్యంగా తియన్‌మెన్‌ స్క్వేర్‌ పేరుతో జరిగిన కుట్రను చైనా ప్రభుత్వం వమ్ము చేసింది.

   బ్రిటీష్‌ వారు తమ లాభాల కోసం వేసుకున్న రైళ్లలో వారిని దేశం నుంచి పంపివేసేందుకు స్వాతంత్య్ర పోరాటం సాగించిన మహాత్మాగాంధీకూడా ప్రయాణించారు. అవే రైళ్లు గాంధీతో పాటు ఆయన ప్రాణాలు తీసిన హిందూ మతోన్మాది గాడ్సేను కూడా మోశాయన్నదీ తెలిసిందే. అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటీ అన్నట్లుగా ప్రపంచీకరణను ధనిక దేశాలు ఒకందుకు ప్రారంభిస్తే దాని ద్వారా వచ్చిన నూతన అవకాశాన్ని చైనా, వియత్నాం సోషలిస్టు దేశాలు తమ జనాభా జీవన ప్రమాణాలు పెంచేందుకు వుపయోగించుకున్నాయి. ప్రపంచీకరణ విధానాల ద్వారా తమకు అందుబాటులోకి వచ్చిన చైనా మార్కెట్‌లో లాభాలు పిండుకోవాలని ప్రపంచ ధనిక దేశాలు ఆశించాయి. తమ దగ్గర వున్న అపార శ్రమశక్తిని, ప్రజానుకూల యాజమాన్య పద్దతులను పెట్టుబడిగా పెట్టి జనం కోసం పని చేయాలని కమ్యూనిస్టులు భావించారు. నలభై సంవత్సరాల లావాదేవీలు లేదా అనుభవాన్ని మదింపు చేస్తే తేలిందేమిటి? పశ్చిమ దేశాల ఎగుమతి మార్కెట్‌పై ఆధారపడిన చైనా అదిరిపోయే అభివృద్ది రేటుతో ముందుకు పోయింది. దాని నుంచి దిగుమతులు చేసుకున్న పశ్చిమ దేశాల కార్పొరేట్‌ శక్తులు లాభాలు ఆర్జించాయి. అందుకే మన దేశంలోని కార్పొరేట్‌ శక్తులు కూడా చైనా నుంచి లబ్దిపొందాలని చూస్తున్నాయి. అందుకే వాటికి ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్‌, బిజెపి వంటి జాతీయ పార్టీలతో పాటు చంద్రబాబు, కెసిఆర్‌ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు కూడా చైనా మోజుతో యాత్రలు చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీతో అధికారిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. అమెరికా నుంచి అరువుతెచ్చుకున్న పద్దతులతో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం ఒకవైపు జనంలో కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకతలను రెచ్చగొడుతూనే మరోవైపు అధికారికంగా ఆ మడి బట్టలను విప్పి గట్టున పెట్టి చైనాతో సంబంధాలను కొనసాగించక తప్పనివిధంగా కార్పొరేట్లు దాని మెడలను వంచాయి.

   పెట్టుబడిదారీ విధాన పంధాను అనుసరిస్తున్న దేశాల పాలకవర్గాలు ప్రపంచీకరణ పేరుతో కార్పొరేట్లను మాత్రమే పెంచి తమ కార్మికవర్గానికి హాని చేసే విధానాలు అనుసరిస్తున్నాయి. లాటిన్‌ అమెరికా దేశాల అనుభవం అదే. అందుకే అక్కడ ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలను వ్యతిరేకించిన శక్తుల వెనుక జనం సమీకృతమయ్యారు. కొన్ని మినహాయింపులతో సోషలిస్టు విధానాలను అనుసరిస్తున్న చైనా అదే ప్రపంచీకరణను తన కార్మిక వర్గ జీవన ప్రమాణాల మెరుగుదలకు వుపయోగిస్తున్నది. అందుకే ధనిక దేశాలలో తలెత్తిన సంక్షోభ ప్రభావం పడి కొంత మేర అభివృద్ధి వేగం తగ్గింది తప్ప సంక్షోభంలో పడలేదు. అయినప్పటికీ కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. చైనాలో బిలియనీర్లు ఎలా అభివృద్ధి చెందుతున్నారు? కార్మికవర్గాన్ని దోపిడీ చేయకుండా అది ఎలా సాధ్యం అవుతుంది? వారు చైనా సోషలిస్టు వ్యవస్ధలను కొనసాగనిస్తారా? మరో సందర్భంలో వాటి గురించి చర్చించవచ్చు.ప్రపంచీకరణ పేరుతో మన వంటి దేశాలలో జనంపై రుద్దుతున్న భారాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక వర్గం పోరాటాలు చేయాల్సిందే. దానిలో ఎలాంటి రాజీ వుండనవసరం లేదు. చైనాలో కమ్యూనిస్టులు అధికారంలో వున్నారు. ప్రపంచీకరణ ఫలితాలను జనాలకు అందిస్తున్నారు. ఒకే దేశం రెండు వ్యవస్ధల పేరుతో 2050 వరకు హాంకాంగ్‌, మకావో ప్రాంతాలలో పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగనిస్తామని వాటి విలీనం సందర్భంగా ఒప్పందం చేసుకున్నారు కనుక, సంస్కరణలలో భాగంగా పరిమితంగా అయినా ప్రయివేటు పెట్టుబడులను అనుమతించింది కనుక వారు కూడా లబ్ది పొందుతూ వుండవచ్చు. ఆ విధానాల వలన తలెత్తే సమస్యలతో రాబోయే రోజులలో ఏం చేస్తారన్నది చైనీయుల అంతర్గత వ్యవహారం.

   చైనా అధ్యక్షుడు దవోస్‌ సమావేశంలో రక్షణాత్మక చర్యల గురించి చెప్పిన అంశాలు తన వరకు వచ్చేసరికి అమలు జరపటం లేదని చైనాలో అంతర్భాగమైనా పెట్టుబడిదారీ వ్యవస్ధను కలిగి వున్న హాంకాంగ్‌ నుంచి వెలువడే పత్రికలు, అక్కడి పెట్టుబడిదారీ మేథావులు జన్‌పింగ్‌ను ఒక విలన్‌గా వర్ణిస్తున్నారు. తమ దేశానికి చెందిన సంస్ధలను విదేశాలలో పెట్టుబడులకు ప్రోత్సహిస్తున్న చైనా ప్రభుత్వం స్వదేశంలో విదేశీ పెట్టుబడులపై అనేక ఆంక్షలను విధిస్తున్నదని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందచేస్తూ స్ధానిక కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలనే షరతులు పెడుతున్నదని వారు విమర్శిస్తున్నారు.

   దవోస్‌ సమావేశాలలో చైనా అధ్యక్షుడు ప్రపంచీకరణపై సిద్ధాంత చర్చ చేయలేదు. ప్రస్తుతం అమలులో వున్న దానికి భిన్నంగా రక్షణాత్మక చర్యలలో భాగంగా ఎవరైనా వాణిజ్య యుద్ధానికి తలపడితే విజేతలంటూ ఎవరూ వుండరన్నది ప్రధాన హెచ్చరిక. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడే విధంగా లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. ఆకస్మికంగా వాటిలో మార్పులు చేస్తే అన్ని దేశాలూ నష్టపోతాయి. అంటే బయట గాలీ, వెలుతురు వుంటే ఎవరైనా అవి లేని ఒక గదిలోకి వెళ్లి తలుపులు మూస్తే ఎలా వుంటుందో రక్షణాత్మక చర్యలకు ఎవరు పాల్పడినా అలాగే వుంటుందని గ్జీ హితవు చెప్పారు. ద్రవ్య పెట్టుబడి అధిక లాభాల కోసం వెంటపడటం, ఏ మాత్రం క్రమబద్దీకరణ లేకపోవటం వల్లే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు మూలం అన్నారు. తాము ప్రపంచీకరణకు కట్టుబడి వున్నామని, మరింతగా క్రమబద్దీకరణకు ప్రయత్నిస్తున్నామని, పెట్టుబడులు పెట్టేవారికి మెరుగైన సమాన అవకాశాలు కల్పిస్తామని అన్నారు. తమది కమ్యూనిస్టు నమూనా అంటూ అందరికీ సరిపోయే ఒకే పద్దతి లేదన్నారు. సముద్రం మధ్యలో తుపానులొస్తే వెనక్కు తిరిగిపోయే అలవాటును ప్రోత్సహించకూడదని చెప్పారు.

   అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్లు అమెరికా ప్రయోజనాలకే పెద్ద పీట అంటూ రక్షణాత్మక చర్యలు చేపడితే అమెరికా-చైనా రెండూ నష్టపోతాయని, అందువలన మాటలు తప్ప రెండు దేశాలూ రాజీపడతాయని ఐరోపాలోని వారు భావిస్తున్నారు. చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వాణిజ్య యుద్ధ పర్యవసానాల గురించి హెచ్చరించింది. చైనా తనకు కావాల్సిన వ్యవసాయ వుత్పత్తులను పెద్ద మొత్తంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే, చైనా నుంచి అమెరికన్లు దుస్తులు, బొమ్మలు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకొని లబ్ది పొందుతోంది. అమెరికాలో చైనా వాణిజ్యం, ఇతర ఆర్ధిక లావాదేవీల కారణంగా 26లక్షల వుద్యోగాలు కల్పిస్తున్నదని, అమెరికా జిడిపికి 1.2శాతం సమకూర్చిందని 2015 నివేదికలో అమెరికా-చైనా వాణిజ్య మండలి నివేదిక పేర్కొన్నది. చైనా నుంచి వస్తు దిగుమతుల కారణంగా అమెరికాలోని ప్రతి కుటుంబానికి సగటున ఏడాదికి 850 డాలర్లు ఆదాఅవుతున్నాయని ఒక విశ్లేషణ తెలిపింది. అన్నింటి కంటే అనేక అమెరికన్‌ కంపెనీలు చైనాలో ఫ్యాక్టరీలను పెట్టి తమకు అవసరమైన వస్తువులను చౌకగా తయారు చేసుకొని తిరిగి తమ దేశానికే దిగుమతి చేసుకుంటున్నాయి. అందువలన ట్రంప్‌ చెప్పినట్లు చైనా నుంచి వచ్చే వాటిపై దిగుమతి సుంకం విధిస్తే నష్టపోయే వాటిలో అమెరికన్‌ కంపెనీలు కూడా వుంటాయని గ్లోబల్‌ టైమ్స్‌ విశ్లేషకులు హెచ్చరించారు. అదే విషయాన్ని దవోస్‌లో చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్‌పింగ్‌ సామెతలతో, తమలపాకులతో కొట్టినట్లుగా చెప్పారు. దానిని గ్రహించకుండా ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి దిగితే అది మన దేశంతో సహా ప్రపంచమంతటికీ తీరని నష్టాలకు దారి తీస్తుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మంచి వార్తలు సరే , చెడు సమాచారం మాటేమిటి మోడీ జీ ?

28 Wednesday Sep 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Political Parties

≈ Leave a comment

Tags

cotton, joblessness, Modi, WEF, WEF rankings

ఎం కోటేశ్వరరావు

   ప్రపంచంలో పోటీ ఆర్ధిక వ్యవస్ధల జాబితాలో భారత్‌ సూచిక ఒక్క ఏడాదిలోనే ఏకంగా 16 పాయింట్లు పెరిగిందని బిజెపి బాకా లొట్టలు వేసుకుంటూ చెప్పటం విన్నాను. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ బాకాలుగా మన ఆకాశవాణి, దూరదర్శన్‌లు పని చేస్తాయి గనుక బిజెపి బాకా అన్నందుకు ఆ పార్టీ వారు అన్యధా భావించవద్దు. ఎవరైనా అభ్యంతరం అంటే గతంలో కాంగ్రెస్‌ బాకాలని తమ పార్టీ నేతలు చేసిన విమర్శలను ముందుగా వుపసంహరించుకోమని కోరాలి. నీకిది నాకది అంటూ వాటాలు వేసుకొని పంచుకొనే విదేశీ, స్వదేశీ బడా కార్పొరేట్‌ సంస్ధలు మరింతగా మన మార్కెట్‌లో ప్రవేశించేందుకు, పూర్తిగా దిగువ స్ధాయికి విస్తరించి లాభాలు పెంచుకొనేందుకు, మన జనజీవితాలను మరింతగా అవి కట్టడి చేసేందుకు వీలుగా గత రెండున్నర సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ పడుతున్న కష్టం లేదా శ్రమకు ఇది గుర్తింపు అనటం నిస్సందేహం. సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వర్ణించినట్లు ఏదేశంలో అయినా పేపర్‌వాలా లేదా ఒక చాయ్‌వాలా అయినా అపర కోటీశ్వరుడయినా పెట్టుబడిదారీ దేశంలో అధికారానికి వస్తే ఇలాగే జరిగింది. అదేమిటో కాంగ్రెస్‌-బిజెపి, తెలుగుదేశం మరొక పార్టీ ఏది అధికారంలో వున్నా అందరినీ కోటీశ్వరులను చేయాలనే మహత్తర యావలో ముందుగా అప్పటికే వున్న కోటీశ్వరులను మరింతగా ఎంత ఎత్తుకు పెంచవచ్చో చూసేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి పార్టీలన్నీ ఒకతానులో ముక్కలే, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్నట్లు ఏ పార్టీ అధికారంలో వుంటే దానిలోనే చేరిపోతారు. ఎవరి ఇంట్లో చూసినా ఎప్పుడూ అన్ని పార్టీల కండువాలూ,జండాలూ, కర్రలూ సిద్దంగా వుంటాయి.

    మధ్యలో కొన్నేండ్ల జనతా పార్టీ, నేషనల్‌ ఫ్రంట్‌ ,బిజెపి పాలన పదేండ్లు మినహా 1947 నుంచి 2014వరకు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్‌ మన దేశంలో అధిక సంపదలు గల వ్యక్తులుగా 2013 నాటికి 1,56,000 మందిని తయారు చేసింది.http://www.ndtv.com/india-news/india-home-to-1-98-lakh-millionaires-world-wealth-report-2015-1217902. చాయ్‌ వాలా నరేంద్రమోడీ ప్రారంభమే జెట్‌ వేగంతో వూపందుకు కుంది కనుక 2014 నాటికే వారి సంఖ్య 1,98,000 వేలకు పెరిగింది. ధనికులలో దారిద్య్రరేఖ నుంచి ఎగువకు ఒక్క ఏడాదిలో నలభై రెండువేల మందిని చేర్చారు.ఈ స్పీడున 2017 నాటికి మొత్తం 3,43,000 మంది ఆ స్థాయికి చేరుకోవచ్చట.http://www.rediff.com/business/slide-show/slide-show-1-117-lakh-ultra-high-networth-individuals-in-india/20140724.htm#1 అరవై సంవత్సరాలలో కాంగ్రెస్‌ చేయలేని దానిని ఐదు సంవత్సరాలలో చేసి చూపుతామని, మంచి రోజులను తెస్తామని బిజెపి, వారికి మద్దతుగా అపర చాణుక్యుడు చంద్రబాబు నాయుడు, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వంటి వారు చెప్పిన మాటలకు, చేసిన బాసలకు అర్ధం ఇదన్న మాట. ఇంతకీ అధిక సంపద అంటే ఎంతయ్యా అంటే వ్యక్తిగతంగా పాతిక కోట్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగిన కలిమి కలిగిన వారు. అంతకంటే తక్కువ వున్న వారు ధనికులలో దారిద్య్రరేఖకు దిగువ వున్నట్లు లెక్క. గతంలో వాజ్‌పేయి అధికారం చివరి రోజుల్లో భారత్‌ వెలిగిపోతోందని ప్రచారం చేసి ఎన్నికలలో పాల్గొన్నారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు వాజ్‌పేయి కంటే నరేంద్రమోడీ తెలివిగల వారు కనుక ప్రారంభం నుంచి భారత్‌ వెలిగిపోతోంది అన్న ప్రచారం చేయటంలో కిటుకు ఇదే. తొలి ఆరునెలల్లోనే ప్రధాని మోడీ నాయకత్వంలో ‘చారిత్రాత్మక, అసాధారణ’ విజయాలను సాధించారని స్వయంగా ఆయన ఆత్మ అమిత్‌ షా సుష్పష్టంగా చెప్పారు.http://www.financialexpress.com/economy/shades-of-india-shining-amit-shah-says-extraordinary-modi-govt-has-made-common-mans-life-easier/13416/

     బాకాలెప్పుడూ విజయగానాలే చేస్తుంటాయి. అప్రియాలను వినపడ, కనపడనివ్వవు. పోటీ ఆర్ధిక వ్యవస్ధల జాబితాలో భారత్‌ సూచిక పైకి గంతు వేసిన వార్తతో పాటు దేశంలో నిరుద్యోగిత ఐదు సంవత్సరాల రికార్డుకు చేరింది. మొదటి సంతోష వార్తను ప్రపంచ కుబేరులు ఏర్పాటు చేసుకున్న ప్రపంచ ఆరి&ధక వేదిక అనే ఒక ప్రభుత్వేతర సంస&ధ చెబితే రెండవ దుర్వార్తను స్వయంగా మన కార్మిక మంత్రిత్వశాఖే వెల్లడించింది. పై వార్తతో ఆనంద పడిన వారు అదెంత వరకు వాస్తవమో ఎలాంటి సందేహాలు వెలిబుచ్చలేదు గాని రెండో వార్తను చూసి ఇదంతా తొండి, లెక్కలు సరిగ్గా వేయలేదు, సర్వే పరిమితంగా వుంది, రాష్ట్రాలలో జరుగుతున్న వాటిని పరిగణనలోకి తీసుకోలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నరేంద్రమోడీని బదనాం చేయటానికి కొత్తగా కార్మిక శాఖేమీ కొత్త పద్దతిని ప్రవేశపెట్టులేదు, గతం నుంచీ అనుసరిస్తున్నదే అది. కార్మికశాఖ వివరాల ప్రకారం 2011-12లో నిరుద్యోగిత 3.8శాతం వుంటే 2015-16లో 5శాతానికి చేరింది. ఇదే కాలంలో మహిళలలో నిరుద్యోగిత రేటు 6.9 నుంచి 8.7కు పెరిగింది. దీన్ని కూడా నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన ‘చారిత్రాత్మక, అసాధారణ ‘ విజయమే మరి. గత కొద్ది సంవత్సరాలుగా ఒక వైపు కొద్ది తేడాలతో వృద్ధి రేటు కొనసాగుతుండగా వుపాధి పడిపోవటాకి కారణాలు ఏమిటో మన పెద్దలు చెప్పాలి. మన జిడిపి వృద్ధి రేటు గురించి చెప్పుకోవాలంటే సామాన్యులకు అదొక అంతుబట్టని ఆల్జీబ్రా. ప్రభుత్వం లెక్కించే తీరులో, ప్రాతిపదిక సంవత్సరాలలో మార్పు కారణంగా అంకెలు మారిపోతుంటాయి. అందువలన ఒక మార్పు జరిగిన తరువాత పూర్వపు అంకెలతో పోల్చుకుంటే మనకు సరైన అర్ధం దొరకదు. వుదాహరణకు 2011 ప్రాతిపదిక లెక్కల ప్రకారం అంకెలన్నీ మారిపోయాయి. 2011-12 ధరల ప్రకారం జిడిపి 2012-13 నుంచి 2015-16 సంవత్సరాల మధ్య 5.2,5.6,7.2,7.6గా నమోదెంది. అదే సంవత్సరాలలో వర్తమాన ధరల ప్రకారం 13.9, 13.3, 10.8, 8.7గా వుంది. ఒక సూచిక పెరుగుదలను, మరొకటి తగ్గుదలను చూపుతున్నది.http://statisticstimes.com/economy/gdp-growth-of-india.php దున్నబోతే దూడల్లో, మెయ్యబోతే ఆవుల్లో అన్నట్లుగా రాజకీయ నాయకులు జనం దగ్గరకు వచ్చేసరికి తమకు వాటంగా వున్న అంకెలను గుమ్మరిస్తారు. జిడిపి రేటును ఎటుతిప్పి ఎలా తిప్పినా నిరుద్యోగం వంటి విషయాలకు వచ్చే సరికి అలాంటి గారడీ కుదరదు. అందుకే అవి నిజాలను వెల్లడిస్తాయి.

    ఈ మధ్య కురిసిన వర్షాలకు దెబ్బతిన్నది పోగా మిగిలిన పత్తి పంట చేతికి వస్తే మంచి ధర వస్తుందేమో అని రైతాంగం ఆశగా ఎదురు చూస్తోంది. ఈ వార్త చదివితే ఆశపడాలో ఆగ్రహించాలో ఆలోచించుకోవటం మంచిది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పత్తిని శ్రీలంక రాజధాని కొలంబో రేవులో నిల్వ చేసుకొనే వీలు గురించి చర్చించటానికి దక్షిణభారత మిల్లుల యజమానుల సంఘ ప్రతినిధులు ఏడుగురితో కూడిన ప్రతినిధి వర్గం అక్టోబరు మొదటి వారంలో కొలంబో వెళ్ల నుంది.http://www.thehindu.com/business/Industry/cotton-mills-explore-colombo-storage-facility/article9154812.ece సెప్టెంబరుతో ముగిసే పత్తి సంవత్సరంలో మన దేశం 20 లక్షల బేళ్ల పత్తి దిగుమతి చేసుకున్నదని, వచ్చే ఏడాది దిగుమతి మొత్తం ఇంకా పెరగనుందని మిల్లుల అసోసియేషన్‌ అధ్యక్షుడు సెంథిల్‌ కుమార్‌ చెప్పారు. భారత్‌, ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అంతర్జాతీయ వ్యాపారులు మలేషియాలో పత్తి నిల్వలు చేశారని, దిగుమతి వ్యవధి, ఖర్చు తగ్గింపు చర్యలలో భాగంగా తూత్తుకుడి రేవులో నిల్వ చేసుకొనేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరామని, ఈ లోగా కొలంబో రేవులో నిల్వ చేసుకొనే అవకాశాల గురించి చర్చించేందుకు వారి ఆహ్వానంపై వెళుతున్నట్లు తెలిపారు. అక్కడ రెండు లక్షల బేళ్లను నెల రోజుల పాటు ఎలాంటి రుసుము చెల్లించకుండా నిల్వ వుంచవచ్చునని చెప్పారు. మన దేశ అవసరాలకు మించి పత్తి వుత్పత్తి చేస్తున్న మన రైతాంగానికి విదేశీ దిగుమతులు వెన్ను విరిచేవే తప్ప మరొకటి కాదు. పత్తి దిగుమతి అంటే ఇక్కడ దొరికే రేటు కంటే తక్కువ అయితేనే మిల్లుల వారు మొగ్గు చూపుతారు. అంతకంటే తక్కువ ధరకు రైతులు అమ్మితేనే ఇక్కడ కొనుగోలు చేస్తారు.అదే జరిగితే ఇక్కడి రైతులేం కావాలి మరి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 924 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: