• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: WHO

ప్రాణాలు తీస్తున్న అధిక పని గంటలు -పనిలేక నిరుద్యోగుల ఆత్మహత్యలు !

18 Sunday Jul 2021

Posted by raomk in Current Affairs, Economics, employees, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA, Women

≈ Leave a comment

Tags

#workers Health, extreme work weeks, ILO, Long working hours, Occupational diseases, overwork in India, WHO


ఎం కోటేశ్వరరావు


పని సందర్భంగా వడదెబ్బ సంబంధిత అత్యధిక గాయాలు, సమస్యలు పరిగణనలోకి రావటం లేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక జూలై 15న ఒక విశ్లేషణ ప్రచురించింది. వడగాలులు శ్రమ జీవులను ప్రత్యేకించి పేదవారిని అనూహ్య పద్దతులలో ఎలా గాయపరుస్తాయో తాజా సమాచారం వెల్లడించిందని పేర్కొన్నది. దాని సారాంశం ఇలా ఉంది. తీవ్ర వడగాడ్పులు సంభవించినపుడు పెద్ద సంఖ్యలో వడదెబ్బలే కాదు పడిపోవటం, యంత్రాలను సరిగా పనిచేయించలేకపోవటం, వాహనాల మధ్య ఇరుక్కుపోవటం వంటివి కూడా గణనీయంగా ఉంటున్నాయి. పని స్ధలాల్లో ఇతర కారణాలతో తగిలే గాయాలకు కాలిఫోర్నియాలోనే అదనంగా ప్రతి సంవత్సరం వడదెబ్బ గాయాలు ఇరవై వేలు తోడవుతున్నాయి. వీటి వలన పని మీద కేంద్రీకరించటం కష్టం అవుతోంది. పశ్చిమ అమెరికా, బ్రిటీష్‌ కొలంబియాలో ఇటీవలి వడగాడ్పులకు 800 మంది మరణించారు. బహిరంగ ప్రదేశాల్లోనే కాదు ఉత్పాదక యంత్రాలు, గోడవున్లలో పని చేసే వారికి కూడా వడగాడ్పులు ముప్పు తెస్తున్నాయి. వడగాడ్పు గాయాల వలన వేతనాలను కోల్పోవటం, వైద్య ఖర్చు పెరగటం, ఉష్ట్రోగ్రతలు పెరిగే కొద్దీ వేతన వ్యత్యాసం కూడా పెరుగుతోంది. 2001 నుంచి 2018వరకు కాలిఫోర్నియాలో గాయాలకు పరిహారం చెల్లించిన కోటీ పదిలక్షల నివేదికలను పరిశోధకులు విశ్లేషించారు. తేదీలు, పని ప్రాంతాలు, వడగాడ్పుల తీవ్రత, గాయాల సంఖ్య తీరుతెన్నులను విశ్లేషించగా వేడి ఎక్కువగా ఉన్నపుడు గాయాలు ఎక్కువగా నమోదైనట్లు తేలింది. అధికారికంగా సగటున 850 గాయాలైనట్లు నివేదికలు చూపాయి. అయితే వాస్తవ గాయాలతో పోల్చితే ఇవి చాలా తక్కువ. అరవై డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉన్నపుడు తగిలిన గాయాలతో పోల్చితే 85-90 డిగ్రీలు ఉన్నపుడు ఐదు నుంచి ఏడుశాతం, వంద డిగ్రీలకు పెరిగినపుడు పది నుంచి 15శాతం పెరిగాయి. వడ దెబ్బ గాయాలు గరిష్ట వేతనాలు పొందే వారితో పోల్చితే కనిష్ట వేతనాలు పొందే కార్మికులకు ఐదు రెట్లు ఎక్కువ ఉన్నాయి.వడదెబ్బ తగల కుండా కొన్ని చర్యలు తీసుకున్న తరువాత కేసులు సంఖ్య తగ్గింది తప్ప తీరుతెన్నులు మాత్రం అలాగే ఉన్నాయి.


మనది ఉష్టమండల ప్రాంతం. ఉష్ణోగ్రతలు అమెరికా కంటే ఎక్కువ నమోదౌతున్నాయి.వేసవిలో 110-115 మధ్య ఉన్న సందర్భాలు ఎన్నో. రికార్డు స్ధాయిలో రాజస్దాన్‌లో 124 కూడా నమోదైంది. అధిక ఉష్ణోగ్రత నమోదైనపుడు వడదెబ్బ తగలకుండా నివారణ చర్యలు తీసుకున్న సంస్దలు ఎన్ని ఉన్నాయన్నది ప్రశ్నార్దకం. అమెరికా మాదిరి మన దేశంలో కూడా పరిశోధన చేస్తే తప్ప తీవ్రత బయటకు రాదు. వడదెబ్బ ఒక్కటే కాదు కష్టజీవుల జీవితాలను దెబ్బతీస్తున్న వృత్తి రుగ్మత అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఓవర్‌టైమ్‌ కూడా ఒకటి.ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యుహెచ్‌ఓ) తొలిసారిగా అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ)తో కలసి దీర్ఘపని గంటల మీద నిర్వహించిన సర్వే ప్రకారం ఏడాదికి ఆ కారణంగా మరణిస్తున్నవారు 7,45,000 మంది(ఇది 2016 సంఖ్య) ఉన్నారట. గుండెపోటు, హృదయ సంబంధ వ్యాధులు దీనికి కారణం. ఆగేయ ఆసియా, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంత దేశాలలోని కార్మికులు ఎక్కువగా ప్రభావితులౌతున్నారు.ఆసియాలో గుండెపోటు ముప్పు మామూలుగానే ఎక్కువ, దీనికి అధిక పని గంటల సమస్య మరింత పెంచుతోంది. వారానికి 35-40 గంటల పాటు పని చేసేవారితో పోల్చితే 55 గంటలు, అంతకు మించి పని చేసే వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు 35శాతం, గుండె సంబంధ వ్యాధులతో ప్రాణాలు కోల్పోయే ముప్పు 17శాతం ఎక్కువగా ఉంది. ఈ కారణంగా మరణిస్తున్న వారిలో నాలుగింట మూడు వంతులు మధ్యవయస్కులు లేదా వృద్దులు ఎక్కువగా ఉన్నారు. రోజుకు ఎక్కువ గంటలు పని చేసిన వారిలో ఇది పని మానేసిన తదుపరి జీవితంలో, కొన్ని సందర్భాలలో దశాబ్దాల తరువాత కూడా ప్రభావం చూపుతోంది. అధిక పని గంటలు అంటే భౌతిక శ్రమే చేయనవసరం లేదు, ఇతరత్రా పనిలో ఎక్కువ గంటలు ఉన్నా ముప్పు ఉంటుంది.పిల్లలతో సహా అధిక గంటలు పని చేస్తున్నవారు ప్రపంచ జనాభాలో తొమ్మిదిశాతం ఉన్నారు.2000 సంవత్సరం తరువాత వీరి సంఖ్య పెరుగుతోంది.


వృత్తిపరంగా తలెత్తే రుగ్మతలకు కారణాలు అనేక వాటిలో సింహభాగం అధిక పని గంటలే అని తేలింది. ఎక్కువ సేపు భౌతిక శ్రమ చేయటం ముప్పు కారణమైతే, అది లేకుండా ఇతరంగా ఎక్కువ గంటలు పని చేసే వారు మద్యం, పొగాకు వినియోగం, తక్కువ సేపు నిద్రపోవటం, వ్యాయామం లేకపోవటం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వంటి అంశాలు కూడా ముప్పును పెంచుతున్నాయి. దీర్ఘకాలం పనిచేసే వారి సంఖ్య ప్రపంచ వ్యాపితంగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి సమయంలో అది మరింత పెరిగింది. అధికపని చేసినందుకు ప్రతిఫలం కూడా అన్ని సందర్భాలలో ఉండటం లేదు. ఇంటి నుంచి పని చేసే వారు సగటున 3.6 గంటలు ఎక్కువ సేపు విధి నిర్వహణలో ఉంటున్నారని తేలింది. యజమానులు వృత్తి రుగ్మతలను పరిగణనలోకి తీసుకోవాలని, తక్కువ పని గంటలు ఉంటే ఉత్పత్తి ఎక్కువ వస్తుందని గ్రహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్ద పేర్కొన్నది. అప్పగించిన ప్రాజెక్టు పనులు నిర్ణీత గడువులోగా పూర్తికావాలనే లక్ష్యాలు నిర్ణయిస్తున్నందున వాటికోసం ఇంట్లో లేదా పని స్ధలాల్లో ఎక్కువ సేపు పని చేయటంతో పాటు వత్తిడి సమస్య కూడా తలెత్తుతోంది. అధిక పని గంటల కారణంగా గుండెపోటు, హృదయ సంబంధ వ్యాధులతో మరణిస్తున్న వారిలో నాలుగింట మూడు వంతుల మందికి గుండెకు రక్త ప్రసరణ తగ్గిన కారణంగా తలెత్తే ఇస్కీమిక్‌ హృదయ వ్యాధి మూలం అని తేలింది. దీనికి వత్తిడి, అధికరక్తపోటు కారణం.ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 15శాతం మంది కార్మికులకు మాత్రమే వృత్తిపరమైన రుగ్మతల చికిత్స ప్రత్యేక సేవలు అందుబాటులో ఉన్నాయి. తమిళనాడులోని తిర్పూరు-కోయంబత్తూరు ప్రాంతంలోని నూలు, వస్త్ర, దుస్తుల పరిశ్రమలో వెలువడే పత్తి ధూళి కారణంగా కార్మికుల్లో బ్రోంకైటిస్‌, టీవి, బరువు తగ్గటం, వినికిడి శక్తి నష్టపోవటం వంటి రుగ్మతలు తలెత్తుతున్నాయని విశ్లేషణలో తేలింది. ఈ పరిశ్రమల్లో పని చేసే వారి జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. ఎన్‌ఎస్‌ఎస్‌ 2018 సర్వే ప్రకారం 83శాతం మంది కార్మికులకు ఆరోగ్య బీమా లేదు.


అధిక గంటలు పని చేస్తున్న వారు ఆసియాలో ఎక్కువగానూ ఐరోపాలో తక్కువగానూ ఉన్నారు. తగిన ప్రతిఫలం లేదా ఆదాయం లేని కారణంగా ఆసియాలోని అనేక ప్రాంతాలలో రోజుకు ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తున్నవారెందరో. పని గంటల పరిమితులు ఉన్నప్పటికీ వాటికి వక్రభాష్యాలు, మరొక కారణమో చెప్పి ఎక్కువ పని గంటలు చేయిస్తున్నారు. అదొక లాభసాటి వ్యవహారంగా కూడా ఉంటోంది. ఒకరిని అదనంగా నియమించుకొని పని చేయించుకోవటం కంటే ఆ మేరకు ఇద్దరో ముగ్గురి చేతో ఓవర్‌ టైమ్‌ చేయించుకోవటం యజమానికి లాభం కనుకనే ఆ పని చేస్తున్నారు.


పని చేయటంలో జపనీయులను ఆదర్శంగా తీసుకోవాలని కొంత మంది చెబుతారు. అక్కడి కార్మికులు నిరసన తెలియచేయాలంటే సమ్మెల కంటే అదనంగా ఉత్పత్తి చేసి యజమానుల మీద వత్తిడి చేస్తారనే కథలు కూడా బాగానే వినిపిస్తారు.సెలవులు తీసుకోవాలంటే సిగ్గుపడతారని ఆకాశానికి ఎత్తుతారు. 1970దశకంలో చమురు సంక్షోభం తలెత్తినపుడు అక్కడి కార్మికవర్గం మీద పెట్టుబడిదారులు 70గంటల పనిని రుద్దారు.అలా పని చేయటం గర్వకారణం, జపనీయుల దేశభక్తికి నిదర్శనం అన్నట్లు ప్రచారం చేసి సాధారణం కావించారు. ఇప్పుడు అనేక దేశాల్లో పెట్టుబడిదారీ వర్గం అదే చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ప్రపంచ కార్మిక సంస్ధ చేసిన సర్వే అంశాలవే. అయితే జపాన్‌లో 70గంటల పని రుద్దుడు పర్యవసానం ఏమిటి ? అక్కడి పని సంస్కృతికి మరోపేరు ” కరోషి ” అంటే అధికపనితో చావు. ఇలాంటి చావులు పెరిగిన కారణంగా పని గంటల గురించి అక్కడ పునరాలోచన ప్రారంభమైంది. అనేక మంది కార్మికులు పని వత్తిడి తట్టుకోలేక కార్యాలయాల మీద నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకున్నవారున్నారు. ఇదొక సామాజిక సమస్యగా మారింది. ప్రతి ఏటా కరోషీ బాధితులు పెరుగుతున్నారు. ఏటా పదివేల మంది మరణిస్తున్నారని అంచనా. కానీ ప్రభుత్వ లెక్కల్లో రెండు వందలు మాత్రమే ఉంటున్నాయి. మరీ ఎక్కువ వత్తిడి చేస్తే మొదటికే మోసం వస్తుందని లేదా పరిహారం చెల్లించాల్సిన కారణాల వలన గానీ ఇటీవలి కాలంలో కొందరు యజమానులు తమ సిబ్బందికి బలవంతంగా సెలవులను ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. సెలవులకు వేతనాలు పొందుతున్న కార్మికులు 2018లో 52.4శాతం మందే ఉన్నారు. సెలవు తీసుకుంటే వేతనం ఇవ్వరు గనుక అనేక మంది వాటి జోలికి పోరు. చూశారా జపాను వారు సెలవులు కూడా తీసుకోకుండా పని చేస్తారని బయటి ప్రపంచం సుద్దులు చెబుతుంది.


ఆర్ధిక సహకార మరియు అభివృద్ది సంస్ధ (ఓయిసిడి) సభ్య దేశాలలో పదకొండు చోట్ల వారానికి 50 గంటల కంటే ఎక్కువే పని చేస్తున్నారు.నాలుగు దేశాల్లో అధిక గంటలు పని చేసే వారు టర్కీలో 33, మెక్సికోలో 29, కొలంబియాలో 26.6, దక్షిణ కొరియాలో 25.2, జపాన్‌లో 17.9శాతం మంది ఉన్నారని ఓయిసిడి చెబుతోంది.పని-కుటుంబం, వ్యక్తిగత జీవితాలను సమన్యయ పరచుకోవటంలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది లాభాలు తప్ప మరొకటి పట్టని పెట్టుబడిదారీ వ్యవస్ధ సృష్టించిన సమస్య తప్ప మరొకటి కాదు.


తాజాగా మాన్‌పవర్‌ గ్రూప్‌ సంస్ధ జరిపిన సర్వే ప్రకారం అధిక గంటలు పని చేసే దేశాల్లో మనం ప్రధమ స్దానంలో ఉన్నాం.1981-1996 మధ్య కాలంలో పుట్టిన వారిని మిలీనియల్స్‌ అంటున్నారు.వీరు మన దేశంలో 52, చైనాలో 48, అమెరికాలో 45, బ్రిటన్‌లో 41 గంటలు పని చేస్తున్నారని సర్వేలో తేలింది. తీవ్ర పోటీ, పని చేయకపోతే ఉద్యోగం ఊడుతుందన్న భయం వంటి అంశాలు రోజుకు పది గంటల కంటే ఎక్కువ సేపు పనిలో ఉండేట్లు చేస్తున్నాయి. ఫోర్డ్‌ కంపెనీ చేసిన సర్వే ప్రకారం వారానికి 12 గంటలు ఉద్యోగులు వాహనాలు నడపటానికి వెచ్చిస్తున్నారు. అంటే పని గంటలకు ఇది అదనం. ఉదాహరణకు 52 పని గంటలైతే అందుకోసం మరోపన్నెండు గంటల పాటు ప్రయాణంలో వెచ్చించాల్సి వస్తోంది.


మన దేశంలో సంభవిస్తున్న ఆత్మహత్యలలో పదిశాతం నిరుద్యోగం, దారిద్య్రం, దివాలా వంటి కారణాలతో జరుగుతున్నాయి. ఒకవైపు అధిక గంటలు పని చేసే వారు అత్యధికులుండగా మరో వైపు అసలు పనే లేని నిరుద్యోగులు కనిపిస్తారు. అధిక గంటలు పనిచేసే దేశాలలో మనది ఐదవ స్ధానమని ఐఎల్‌ఓ తెలిపింది. 2020-21 ప్రపంచ వేతన నివేదికలో అతి తక్కువ కనీస వేతనాలు చెల్లిస్తున్న దేశాల్లో మనది ఒకటని కూడా వెల్లడించింది. 2019 మన జాతీయ గణాంక సంస్ద సర్వే ప్రకారం రోజులో పదో వంతు కూడా దేశ ప్రజలు తీరుబడి కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. కార్మికశక్తిలో మహిళల శాతం తగ్గిపోతున్నదని ప్రపంచబ్యాంకు పేర్కొన్నది, గత సంవత్సరం 20.3శాతమే ఉన్నారని, అంతకు ముందుకంటే గణనీయంగా తగ్గినట్లు తెలిపింది. మన దేశంలో వారానికి నాలుగు దినాలు, రోజుకు పన్నెండు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది యజమానుల లబ్ది కోసం తప్ప మరొకటి కాదు. ఓవర్‌టైమ్‌కు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా చేయటమే ఇది. అధిక పని గంటలు, వృత్తి రుగ్మతల కారణంగా తలెత్తే పర్యవసానాల గురించి మన దేశంలో సమగ్రమైన చట్టాలు చేయాల్సి ఉంది. ఉన్న చట్టాలనే నీరుగార్చేందుకు పూనుకుంటున్న పాలకుల హయాంలో అది జరిగేనా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సరఫరాలు ఆపొద్దు, ధరలు పెంచొద్దని చైనాను కోరిన మోడీ సర్కార్‌ !

14 Friday May 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, Science, UK, USA

≈ 1 Comment

Tags

Big Pharma Vaccine Profits, BJP Propaganda, China's vaccine diplomacy, Narendra Modi Failures, vaccination Policy, Vaccine Nationalism, WHO


ఎం కోటేశ్వరరావు


మన దేశంలో ఆక్సిజన్‌, ఇతర ఔషధాల ధరలు ముఖ్యంగా కరోనా చికిత్సలో వినియోగించే వాటి ధరలు ఎలా పెరుగుతున్నాయో, బ్లాక్‌ మార్కెట్‌ ఎలా ఉందో పదే పదే చెప్పనవసరం లేదు.బాధితులు, వారి బాధలు పంచుకున్నవారందరికీ అనుభవమే. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్దితిని విధించి ముఖ్యమైన ఔషధాలు,వాక్సిన్లకు కంపల్సరీ లైసెన్సింగ్‌ విధానం కింద అనుమతులు ఇచ్చి అవసరాల మేరకు ఉత్పత్తిని పెంచేందుకు, ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ లేవు. ఇదేం పనయ్యా బాబూ అని ఎవరైనా ప్రశ్నిస్తే బిజెపి ప్రతినిధులు ఆరోగ్యం రాష్ట్రాలకు సంబంధించింది అని ఎదురుదాడులకు దిగుతున్నారు. మరోవైపున తొలి దశలో కరోనాను జయించింది తమ ప్రధాని మోడీ అని ఆయన లేకపోతే అదుపుఅయ్యేది కాదని, జనం ప్రాణాలు నిలిచేవి కాదంటూ పాడిన భజన గీతాల సంగతేమిటి, ఇప్పుడు ఇలా తాళం మార్చారేమిటి అని అడిగితే కష్ట కాలంలో సహకరించాల్సింది పోయి దెప్పి పొడుపులు, విమర్శలా అంటూ విరుచుకు పడుతున్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువారు అంటూ సుమతీ శతకకారుడు బహుశా ఇలాంటి వారి గురించే చెప్పి ఉంటాడు.

మన దేశంలో కరోనా వాక్సిన్‌ ధరల మీద కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించలేదు. కేంద్రానికి ఇచ్చే వాక్సిన్లకు ఒక రేటు, రాష్ట్రాలకు ఇచ్చేదానికి ఒక రేటు, ప్రయివేటు ఆసుపత్రులకు అమ్మేది ఒక రేటు. ఒక వైపు సామాజిక మాధ్యమాలు, సాంప్రదాయ మాధ్యమాల్లో బిజెపి ప్రతినిధులు ఇప్పటికీ చైనా వైరస్‌ అంటూ దాడులు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ జనానికి తెలియాల్సిందేమంటే చైనా వస్తువులను బహిష్కరిస్తాం, చైనాకు బుద్ది చెబుతాం, కాళ్ల దగ్గరకు రప్పిస్తాం అని ఏడాది నుంచి ప్రగల్భాలు పలుకుతున్న వారు తేలు కుట్టిన దొంగల మాదిరి అదే చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతుల గురించి మాత్రం మాట్లాడటం లేదు. గుండెలు తీసిన బంట్ల సంగతేమోగానీ అలాంటి వారిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం రవాణా విమానాలు ఆపేసి మనలను దెబ్బతీసిందంటూ చైనాను నిందించారు. ఆ సమస్య పరిష్కారం అయిన విషయం మాత్రం జనానికి చెప్పకుండా ఇంకా అదే అభిప్రాయంతో ఉండాలని కోరుకొనే వారు మాత్రమే దాన్ని మూసిపెడతారు.


తాజా విషయానికి వస్తే భారత్‌ దిగుమతి చేసుకొనే వైద్యపరమైన వస్తువుల సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా చూడండి సారో అని మన దేశం చైనా నాయకత్వాన్ని అభ్యర్ధిస్తున్నది. ఈ సమాచారం కొందరికి మింగుడు పడకపోవచ్చు. నరేంద్రమోడీ విఫల ప్రధాని అంటే మింగుడు పడుతోందా ! ఇదీ అంతే !! నిజం త్వరగా ఎక్కదు. చైనా ప్రత్యేక ప్రాంతంగా ఉన్న హాంకాంగ్‌లోని భారత కాన్సుల్‌ జనరల్‌ ప్రియాంక చౌహాన్‌ అక్కడి నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పత్రిక విలేకరితో మాట్లాడారు.” చైనా సరఫరా వ్యవస్ద తెరిచే ఉండాలని, ఉత్పత్తుల ధరలు స్ధిరంగా ఉండాలన్నది ఈ దశలో మా ఆకాంక్ష. సరఫరా గిరాకి వత్తిడి కొంత పెరిగినప్పటికీ ఉత్పత్తుల ధరలు స్ధిరంగా, అంచనాకు అందేట్లు ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వ స్ధాయిలో కూడా మద్దతు, ప్రయత్నాలు అవసరం. అయితే ఈ విషయంలో చైనా ప్రభుత్వ పలుకుబడి ఎంత ఉంటుందో, ఏమి చేయగలదో నాకు సమాచారం లేదు, అయితే వారు చేయగలరు, అలా చేస్తే మేము స్వాగతిస్తాం ” అని ప్రియాంక చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. సూటిగా మన రాజకీయ నాయకత్వం అడిగేందుకు ముఖం చెల్లక తడిక రాయబారం చేశారన్నది స్పష్టం.


మనకు అవసరమైన ముఖ తొడుగులు, పిపిఇ కిట్లు అన్నీ మనమే తయారు చేసుకోగలుగుతున్నట్లు కాషాయ దళాలు ప్రచారం చేస్తున్నాయి. మంచిదే, ఇంతకంటే కావాల్సింది ఏముంది ? మేకిన్‌ ఇండియా కింద గత ఏడు సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడిగా ప్రపంచానికే వస్తువులను ఎగుమతి చేస్తున్నాము కదా అని పగటి కలలు కంటున్న వారున్నారు. మే 14వ తేదీ హిందూ పత్రిక వార్త వారి కళ్లు తెరిపిస్తుందా ? దాని ప్రకారం మన దేశం చైనా కంపెనీలకు ఏప్రిల్‌ నుంచి 40వేల ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లకు ఆర్డరు పెడితే 21వేలు మనకు వచ్చాయి. వీటితో పాటు ఐదువేల వెంటిలేటర్లు, రెండు కోట్ల పది లక్షల ముఖతొడుగులు( మాస్కులు), 3,800 టన్నుల ఔషధాలు భారత్‌కు ఎగుమతి చేసినట్లు చైనా కస్టమ్స్‌శాఖలో నమోదైనట్లు దానిలో పేర్కొన్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అని కొట్టి పారవేస్తే చేసేదేమీ లేదు. ప్రచారానికి – వాస్తవానికి ఉన్న తేడాను జనానికి చెప్పేందుకే ఈ విషయాలు తప్ప నరేంద్రమోడీని దెప్పాలని కాదు. ఇప్పటి వరకు విదేశీ పత్రికలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాయి. ప్రభుత్వమే కనపడటం లేదని మన దేశానికి చెందిన అవుట్‌లుక్‌ పత్రిక తాజా ముఖచిత్రంగా ప్రచురించినందున మోడీని వెతికి తెచ్చి ఎక్కడికి పోయారని ప్రశ్నించాలి తప్ప దెప్పి ప్రయోజనం ఏముంది ? ఒక వేళ ప్రశ్నించినా నోరు విప్పుతారా ?

కరోనా మహమ్మారి నుంచి రక్షణకు వినియోగించే వాక్సిన్లకు కొంత కాలం పాటు పేటెంట్‌ హక్కుల అమలు నిలిపివేయాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో)లో దక్షిణాఫ్రికా, మన దేశం కూడా ప్రతిపాదించాయని, నరేంద్రమోడీ చొరవ ఎలాంటిదో చూడండి, చివరికి అగ్రరాజ్యం అమెరికా కూడా అంగీకరించింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.(మనకు అవసరమైన వాక్సిన్‌ ముడిపదార్దాలనే ఇచ్చేందుకు అంగీకరించని వారు పేటెంట్ల రద్దుకు అంగీకరిస్తారా ? ) దీనితో పాటు కంపల్సరీ లైసెన్సు విధానం కింద గతంలో నాట్కో కంపెనీకి కాన్సర్‌ ఔషధ తయారికి అనుమతి ఇచ్చినట్లుగా వాక్సిన్లకు సైతం ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రజారోగ్య నిపుణులు, ఆ రంగంలో పని చేస్తున్నవారు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందువలన మన ప్రభుత్వం ప్రపంచ సంస్ధలో అలాంటి ప్రతిపాదన చేయటం మంచిదే, ఎవరు చేసినా అభినందించాల్సిందే. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు ఏం జరుగుతోంది. ఇదే నరేంద్రమోడీ సర్కార్‌ మే తొమ్మిదవ తేదీన సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో దానికి విరుద్దమైన వాదన చేసింది. సుప్రీం కోర్టు సూచించిన విధంగా కంపల్సరీ లైసెన్సు నిబంధనను ఈ దశలో ఉపయోగిస్తే, మేథోసంపత్తి హక్కుల ఒప్పందానికి విరుద్దంగా చర్యలు తీసుకుంటే ప్రతికూల ఫలితాలు వస్తాయని వాదించింది. ప్రచారం కోసం, జనాన్ని మభ్యపెట్టేందుకు ప్రపంచ వాణిజ్య సంస్దలో ఒక వైఖరి, తన అధికారాన్ని వినియోగించాల్సి వచ్చే సరికి కార్పొరేట్‌ కంపెనీల అనుకూల వాదనలు. ఎంత దగా ! పోనీ ఇప్పటి వరకు సానుకూలంగా వ్యవహరించి నరేంద్రమోడీ సర్కార్‌ సాధించింది ఏమిటి ? కోవిషీల్డ్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలు, పరికరాల ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించినపుడు దానికి రాని ప్రతికూల ఫలితాలు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పూనుకుంటే మనకు వస్తాయా ? ఒక వేళ వస్తే ఏమిటి ? మిన్ను విరిగి మీద పడుతుందా ? చైనాకు వ్యతిరేకంగా మనం చతుష్టయం పేరుతో అమెరికాతో జతకట్టి బస్తీమే సవాల్‌ అన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి వారు మనకు అవసరమైన వాటిని అందచేస్తున్నారా లేదా ? అమెరికా ఒక వైపు తమ జనం కోసం యుద్దసమయాల్లో వినియోగించే చట్టాలకు దుమ్ముదులిపి అమలు జరుపుతుంటే దాని భాగస్వామి అని చెప్పుకొనే మనం మన సార్వభౌమ అధికారాన్ని వినియోగించలేనంత దుర్బలంగా ఉన్నామా ? అసలు నరేంద్రమోడీ గారి సమస్య ఏమిటి ? ఇంత విపత్తు వస్తే కనీసం ప్రతిపక్షాలతో అఖిలపక్ష సమావేశం వేసి పరిస్ధితిని వివరించి సలహాలను కోరేందుకు తీరికలేనంతగా ఏం చేస్తున్నట్లు ? కేంద్రం చెబుతున్నట్లు ఆరోగ్య సమస్య రాష్ట్రాలదే అయినపుడు కేంద్రంలో ప్రధాని, ఇతర మంత్రులకు గోళ్లు గిల్లు కుంటూ కూర్చోవటం తప్ప ఇప్పుడు మరొక పనేముంటుంది. తీవ్రత తక్కువ మొదటి దశలో మోడీ చేయించిన పళ్లాలు, గ్లాసుల మోత, దీపాలు వెలిగించటం వంటి చర్యలన్నింటినీ జనం పాటించారుగా, ఇప్పుడు ఆ చొరవ ఏమైనట్లు ? పిచ్చిదో ఎచ్చిదో ఏదో ఒకటి ఎందుకు చేయించటం లేదు ? ఏమీ లేదు, ఎంత హడావుడి చేస్తే అంతగా జనం కేంద్రం వైపు చూస్తారు. ఉచిత వాక్సిన్‌ సరఫరాకే చేతులెత్తేసి అధిక భారాన్ని రాష్ట్రాల మీద నెట్టింది. గతేడాది మాదిరి 27లక్షల కోట్ల ఆత్మనిర్భర వంటి బూటకపు ప్రకటనలు చేస్తే నమ్మే జనం లేరు. అందుకే ప్రజాస్వామ్యబద్దంగా రాష్ట్రాల నిర్ణయానికే వదిలేస్తున్నానంటూ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు.

కోవిషీల్డు లేదా కోవాగ్జిన్‌కు గానీ ప్రయోగాలు పూర్తిగాక ముందే అత్యవసర వినియోగం పేరుతో ముందుగానే అనుమతి ఇచ్చారు. దాదాపు అన్ని దేశాలూ అదే చేశాయి. కోవిషీల్డు మన స్వంత తయారీ కాదు. దాని మాదిరే రష్యా స్పుత్నిక్‌ వాక్సిన్‌ ఉత్పత్తికి రెడ్డీలాబ్స్‌ ఒప్పందం చేసుకుంది. ఈ రెండింటితో పాటు దానికి, ఇతర వాక్సిన్లకు అనుమతి ఇచ్చి ఉంటే ఇప్పుడు తలెత్తిన వాక్సిన్‌ గిరాకీని సులభంగా అధిగమించి ఉండేవారం కదా ? రెండు కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనం కాపాడేందుకు చూపిన శ్రద్ద వేగంగా వాక్సిన్‌ తయారీ మీద ఎందుకు లేకపోయింది. మొదటి డోసు తీసుకున్న తరువాత నెల రోజుల్లోగా రెండవ డోసు తీసుకోవాలని చెప్పింది ప్రభుత్వమూ, నిపుణులే. ఇప్పుడున్న నెలన్నర – రెండు నెలల వ్యవధిని పొడిగించి మూడు నుంచి నాలుగు నెలల్లోపు కోవిషీల్డు తీసుకోవచ్చు అంటున్నారు. జనం దేన్ని నమ్మాలి ?
ప్రపంచంలో 184 వాక్సిన్లను జంతువుల మీద ప్రయోగించి పరిశీలిస్తున్నారు. ఆరోగ్యవంతులైన యువతీయువకుల మీద 32 వాక్సిన్లు మొదటి దశ ప్రయోగంలోనూ, 35 వాక్సిన్లు వివిధ తరగతుల మీద రెండవ దశ, 25వాక్సిన్ల ప్రభావం గురించి మూడవ దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. పద్నాలుగు వాక్సిన్లను వినియోగిస్తున్నారు. అవన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి పొందినవే. ఎవరు ముందుకు వస్తే వాటి తయారీకి మన దేశం ఆహ్వానించి ఉంటే వెంటనే అన్ని వయస్సుల వారికి వాక్సిన్‌ పూర్తయ్యేది, రోజుకు నాలుగువేల మరణాలు తప్పి ఉండేవి కదా ? ఎందుకు ఇవ్వలేదు ?
ఔషధాల తయారీలో మన దేశం పురోగమించిన మాట వాస్తవం. అది చైనా కంటే ఎక్కువ అని కొందరు అనుకుంటారు, అనుకోనివ్వండి మనకు ఇబ్బంది లేదు. మన ఔషధ పరిశ్రమలకు అవసరమైన ముడి సరకు పూర్తిగా లేదా పాక్షికంగా తయారైన వాటిని మన ఫార్మారంగం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్న పచ్చినిజం తెలిసిందే. ఇప్పుడు చైనా నుంచి మన దేశం అత్యవసర ఔషధాలను తెచ్చుకుంటున్నది దానికి లేని అభ్యంతరం తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆమోదించిన చైనా వాక్సిన్‌ తెచ్చుకొనేందుకు, జనం ప్రాణాలను కాపాడేందుకు ఇబ్బంది ఏమిటి ? చైనా వాక్సిన్లు అంతగా పని చేయవని ఆ దేశ నిపుణులే చెప్పారని కట్టుకధలు ప్రచారం చేశారు. చైనాలో ఏటా ఐదు వందల కోట్ల డోసులను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఉంది. మన దేశంలో ఐసిఎంఆర్‌తో కలసి భారత బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ పూర్తిగా వినియోగ అనుమతి మన దేశంలోనే ఉంది. మరో 14 దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతించారు. ఇదే సమయంలో చైనాలో తయారైన నాలుగు వాక్సిన్లలో ఒకటైన సినో ఫార్మ నాలుగు దేశాల్లో పూర్తి వినియోగం 50 దేశాల్లో అత్యవసర అనుమతి పొందింది. మరొకటి కరోనా వాక్సిన్‌ పూర్తి వినియోగం చైనాలో, మరో 35దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందింది. మరో రెండు పరిమితంగా అనుమతి పొందాయి. అందువలన మన దేశం వాక్సిన్ల రంగంలో ముందుంది అని చెప్పుకోవటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు.


నరేంద్రమోడీ ప్రపంచ ఫార్మా కంపెనీలను దెబ్బతీసినందున అవన్నీ కక్ష కట్టాయంటూ ఆయన భక్తులు మహిమలను అంటగట్టి ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో తయారయ్యే వాక్సిన్లు మన అవసరాలకే సరిపోని స్ధితి కళ్ల ముందు కనిపిస్తుంటే ఇలాంటి అతిశయోక్తులను చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు. ఆపని చేసింది చైనా అన్నది పచ్చి నిజం. వాక్సిన్‌ మానవ హక్కు. ఎవరు జాతీయ వాదంతో సంకుచితంగా వ్యవహరిస్తున్నారు, ఎవరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారో ప్రపంచం చూస్తూనే ఉంది. ఏప్రిల్‌ 25 నాటికి చైనా 41.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేసి 20 కోట్ల డోసులను ఎగుమతి చేసి మిగిలిన దాన్ని తన దగ్గర ఉంచుకుంది. అమెరికా 26.8 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి మొత్తం అంతర్గత వినియోగానికి ఉంచుకుంది. బ్రిటన్‌ కూడా అదే మాదిరి 2.3 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి మొత్తం ఉంచుకుంది. ఐరోపా యూనియన్‌ 22 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి తొమ్మిది కోట్ల డోసులు ఎగుమతి చేసి మిగిలింది తన సభ్య దేశాలకు వినియోగించింది. మన దేశం 19.6 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి పన్నెండున్నర కోట్ల డోసులు మన దేశంలో వినియోగించి మిగతాది ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు ఎవరు ప్రపంచ ఫార్మాను దెబ్బతీసినట్లు ? ఎవరు ప్రపంచాన్ని ఆదుకొనేందుకు ముందుకు వచ్చినట్లు ? నేడు ఆంగ్లో-శాక్జన్‌ (అమెరికా-బ్రిటన్‌) దేశాలు వాక్సిన్ల తయారీకి అవసరమైన ముడిపదార్దాలను దాచివేస్తున్నాయని కడుపు మండిన ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ వ్యాఖ్యానించాడు. మన ప్రధాని నరేంద్రమోడికి నోరు పెగల్లేదు.


చైనా వాక్సిన్‌ సినోఫార్మకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి ఇవ్వటంతో ఇప్పుడు పెద్ద ఎత్తున వాక్సిన్‌ పేద దేశాలకు అందేందుకు వీలు కలిగింది. త్వరలో చైనా మరో వాక్సిన్‌ సిన్‌వాక్‌ కూడా అనుమతి రాబోతున్నదని వార్తలు. మన కోవాగ్జిన్‌కు ఇంకా రాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్ధలోని సభ్య దేశాలలో 192 కోవాక్స్‌ పేరుతో వాక్సిన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ప్రాంతాలకు 2021 చివరి నాటికి 200 కోట్ల డోసుల వాక్సిన్‌ అందించాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు కోవాక్స్‌ పధకంలో భాగంగా 5.4 కోట్ల డోసులను 121 దేశాలకు అందించింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో వాక్సిన్ల ద్వారా ఫైజర్‌ కంపెనీ 350 కోట్ల డాలర్లు సంపాదించింది. మోడెర్నా కంపెనీ ఏడాదిలో 1900 కోట్ల డాలర్లను సంపాదించనుందని అంచనా. కార్పొరేట్‌ కంపెనీల లాభాల కోసం మహమ్మారిని దీర్ఘకాలం పొడిగిస్తున్నారా ? అంటూ ప్రపంచబ్యాంకు మాజీ అధిపతి, ఆర్ధికవేత్త జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ మరొకరితో కలసి రాసిన వ్యాసంలో ప్రశ్నించారు. ఫైజర్‌, మోడెర్నా కంపెనీలు ఎంఆర్‌ఎన్‌ఏ వాక్సిన్ల తయారీలో గుత్తాధిపత్యం వహిస్తున్నాయి. వాటి తయారీకి ఇతరులను అనుమతించటం లేదు. ఎంతకాలం వీలైతే అంతకాలం మహమ్మారిని పొడిగించి సొమ్ము చేసుకోవాలన్నది వాటి ఎత్తుగడ. వైరస్‌ కొత్త రూపం సంతరించుకుంటున్న కారణంగా వాటికి అవసరమైన వాక్సిన్ల కోసం తమ వనరులను పదిలపరచుకోవాలని పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయన్నది స్పష్టం. కోవాక్స్‌ పధకానికి కోటి డోసులు ఉచితంగా సమకూర్చుతామని చైనా ఇప్పటికే వాగ్దానం చేసింది. వాక్సిన్‌తో పని లేకుండానే వైరస్‌ను అదుపు చేసిన చైనా పెద్ద ఎత్తునవాక్సిన్‌ తయారు చేస్తూ అత్యవసరమైన ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నది. మరోవైపు తన జనానికి తాపీగా వాక్సిన్‌ వేస్తున్నది. మరోవైపు దాని ఉత్పత్తిలో సగం కంటే తక్కువ ఉన్న మనం దేశం చైనా కంటే వేగంగా వాక్సిన్‌ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది.


మన దేశంలో ఆగస్టు -డిసెంబరు నాటికి మొత్తం 216 కోట్ల డోసుల వాక్సిన్‌ అందుబాటులోకి రానున్నదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వికె పాల్‌ చెప్పారు. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీలు కూడ అత్యవసర వినియోగం కింద తయారీకి దరఖాస్తు చేసుకోవాలని కోరినట్లు పాల్‌ తెలిపారు. ఆయన చెప్పినట్లు, అనుకున్నట్లు సవ్యంగా జరిగితే డిసెంబరు నాటికి గాని మన జనాభాకు వాక్సిన్‌ వేసే అవకాశం లేదు. కొందరు చెబుతున్నట్లు ప్రతివారికీ బూస్టర్‌ మూడో డోసు వేయాల్సి వస్తే , మూడో తరంగంలో వస్తుందని చెబుతున్న కొత్త వైరస్‌కు పాత వాక్సిన్లు పనికి రాకపోతే పరిస్ధితి ఏమిటి ? చైనా వాక్సిన్‌ సిన్‌ఫార్మకు అనుమతి ఇస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన ప్రకటనలో చైనా మరో 15వాక్సిన్ల తయారీ పురోగమనంలో ఉన్నట్లు తెలిపింది. వాక్సిన్ల తయారీలో చైనా – రష్యా సహకరించుకోనున్నాయి. మరి మనం ఎక్కడ ? అది ఉత్పత్తి కావచ్చు, వాక్సిన్‌ దౌత్యం కావచ్చు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పెద్దన్న ట్రంప్‌ పిచ్చిపనులపై నిజమైన దేశభక్తుల మౌనం తగదు మోడీ గారూ !

19 Sunday Apr 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

COVID- 19 pandemic, Donald trump angry at WHO, Donald Trump Madness, Narendra Modi, WHO

Donald Trump 'imitates Indian Prime Minister Narendra Modi's ...

ఎం కోటేశ్వరరావు
అమెరికా పెద్దన్న డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికన్ల ప్రాణాలు తీస్తున్నాడు, యావత్‌ ప్రపంచాన్ని అలవికాని ఆర్ధిక బాధల్లోకి నెడుతున్నాడు. ఈ వైఫల్యాన్ని, నేరాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థను, చైనాను దెబ్బతీసేందుకు పూనుకున్నాడు. ఈ వ్యాఖ్యతో ప్రారంభించిన ఈ రాతలో ఇంకేమి ఉంటుందిలే అని చప్పరించే వారు తమ సమయాన్ని వృధా చేసుకోనవసరం లేదని మనవి. ప్రాణ, విత్త, మానభంగములందు అసత్యాలు చెప్పవచ్చని మన పెద్దలు చెప్పారు. ట్రంప్‌ దానికి ఎన్నికలను కూడా జోడించాడు. నవంబరులో జరగాల్సిన ఎన్నికల్లో గట్టెక్కేందుకు ట్రంప్‌ ఎంతకైనా తెగించేందుకు సిద్దపడుతున్నాడని వేరే చెప్పనవసరం లేదు.
ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్ధలు ఏ ఒక్కరి సొత్తో కాదు. వాటిని ప్రారంభించే రోజు సంస్ధాపక సభ్య దేశాలలో కొన్నింటికి దురాలోచనలు మరికొన్నింటికీ దూరాలోచనలు ఉన్నాయి. ఎన్ని లోపాలున్నా అంతకంటే మెరుగైన ప్రపంచ వ్యవస్ధను ఏర్పాటు చేసుకొనే వరకు ఉన్నవాటిని రక్షించుకోవటం తప్ప మరొక మార్గం లేదు. ఈ రోజు ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనాకు అనుకూలంగా పని చేస్తోందని లేదా చైనా ఆ సంస్ధ మీద పెత్తనం చేస్తోందని నిజంగా నమ్మేవారు 1945 నుంచి 1971 వరకు చైనాను ఐక్యరాజ్యసమితి, దాని సంస్ధల గడప తొక్కనివ్వలేదని, చైనా పేరుతో తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌నే చైనాగా పరిగణిస్తూ అమెరికా మోకాలడ్డిందని, ఐరాసలో అనుమతించినా 2000 సంవత్సరం వరకు ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనాకు భాగస్వామ్యం కల్పించలేదని కూడా తెలుసుకోవాలి. మరో విధంగా చెప్పాలంటే పెత్తనం చేసింది. ఈ రోజు చైనా పెత్తనం చేస్తోందంటూ బుడిబుడి రాగాలు తీస్తోంది. ఇంతకాలం అమెరికా తప్పుడు పనులు చేసింది కనుకనే ఐరాసలో దానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి, అదేపని చైనా లేదా మరొక దేశం చేస్తే వాటికీ అదే పునరావృతం అవుతుంది. ఇప్పుడు చైనా అలాంటి తప్పులు చేస్తోందా? ఉదాహరణలు ఉంటే ఎవరైనా చెప్పాలి మరి !
ఐక్యరాజ్యసమితికి రూపకల్పన చేసిన సమయానికి అమెరికా అగ్రరాజ్యం. నిబంధనల కూర్పులో దానిదే పైచేయి. ఇప్పుడు వాటినే అది ప్రశ్నిస్తోంది. ఐరాస, దాని సంస్దలు సమర్ధవంతంగా లేదా ప్రజాస్వామ్య బద్దంగా పని చేయాలంటే సంస్కరణలు తేవాలి. దానికి బదులు అమెరికా వంటి దేశాలు అర్ధంతరంగా నిధులు నిలిపివేస్తే నష్టపోయేది మన వంటి లేదా ఇంకా దరిద్రంలో ఉన్న దేశాలే. ఇలాంటి చర్యలకు బ్లాక్‌మెయిల్‌ లేదా బెదరింపు అని తప్ప మరొక భావం, అర్ధం లేదు. పెద్దన్న బెదరింపులను నరేంద్రమోడీ ఎందుకు ప్రశ్నించటం లేదో తెలియదు. మన ప్రయోజనాలను రక్షించుకోవటమే దేశభక్తి అని అంగీకరిస్తే ఆచరణలో అది కనిపించాలి కదా ! అమెరికా మెడలు వంచి గత ఆరు సంవత్సరాలలో మనం సాధించిందేమిటి ? కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎవరి కోసం పని చేస్తున్నట్లు ?
అమెరికా తన ఆయుధాలను అమ్ముకొనేందుకు అనేక చోట్ల ప్రాంతీయ ఉద్రిక్తతలు, అంతర్యుద్ధాలను రెచ్చగొడుతోంది. గతంలో మన మీద పాకిస్ధాన్‌ను ఎగదోసింది, ఇప్పుడు మనలను దాని మీదకు ఎగదోస్తోంది. రెండు దేశాలకూ అవసరమైన ఆయుధాలను అందిస్తోంది, డాలర్లను జేబులో వేసుకుంటోంది. మనం ప్రాణాలను కాపాడే హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు ఇస్తే దానికి బదులు ప్రాణాలు తీసే ఆయుధాలను మనకు అమెరికా అందచేస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన పౌరుల ప్రాణ రక్షణకు అవసరమైన వెంటిలేటర్ల బదులు ఇతర దేశాల్లో ప్రాణాలు తీసే ఆయుధ తయారీకే ట్రంప్‌ ప్రాధాన్యత ఇస్తున్నాడు.
ఆఫ్ఘనిస్తాన్‌లో నాటి సోవియట్‌ యూనియన్‌ పలుకుబడిని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలిబాన్ల పేరుతో మత ఉ గ్రవాదులను తయారు చేసింది. సోవియట్‌ ఉపసంహరణ తరువాత వారు ఏకుమేకై అమెరికాకే తలనొప్పిగా తయారయ్యారు. అక్కడ తన సైన్యాన్ని నిర్వహించటం పెద్ద భారంగా మారింది, చివరకు ఉపసంహరణకు ఆ తాలిబాన్లతోనే చర్చలు జరపాల్సిన దుర్గతి ట్రంప్‌కు పట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌, ప్రపంచ సంపదలు, మిలిటరీ రీత్యా వ్యూహాత్మక ప్రాంతాల మీద పట్టు సాధించటం అమెరికా కార్పొరేట్ల అసలు లక్ష్యం. అక్కడి అధ్యక్షులందరూ వాటి కాపలాదారులు, సేవకులే.
బడ్జెట్‌ను సర్దుబాటు చేయలేక సతమతం అవుతున్న ట్రంప్‌ అధికారంలోకి రాగానే పొదుపు చర్యల్లో భాగంగా ఐక్యరాజ్యసమితి నిర్వహించే శాంతి పరిరక్షక కార్యకలాపాలకు అంద చేస్తున్న నిధుల కోత పెట్టాలని ప్రతిపాదించాడు. తరువాత అన్ని ఐరాస కార్యక్రమాలకు సగం కోత కోయాలని పార్లమెంట్‌ను కోరాడు.శాంతి పరిరక్షక కార్యకలాపాలకు కేటాయించే నిధుల మీద ఉన్న ఆంక్షలను 2001లో తొలగించారు. ట్రంప్‌ ప్రతిపాదనలను చర్చించిన పార్లమెంట్‌ శాంతిపరిరక్షక కార్యకలాపాల మొత్తాలకు తిరిగి పరిమితి విధించింది. దాంతో వాటికి అమెరికా అందచేస్తున్న మొత్తం 28 నుంచి 25శాతానికి తగ్గిపోయింది. ఆమొత్తం 2019లో 20 కోట్ల డాలర్లు. ఇదే సమయంలో రానున్న పది సంవత్సరాల కాలంలో శాంతి పరిరక్షక కార్యకలాపాలకు వంద కోట్ల డాలర్లు ఇవ్వాలని చైనా నిర్ణయించింది. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటు వేస్తున్న దేశాలకు చేస్తున్న సాయానికి కూడా కోత పెట్టాలని ట్రంప్‌ కార్యాలయం ప్రతిపాదించింది.
ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత ఈ ఏడాది జనవరి 19నాటికి 1095 రోజుల్లో ఆడిన అబద్దాల సంఖ్య 16,241 అని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక ఒక విశ్లేషణలో వెల్లడించింది. నోరు తెరిస్తే రోజూ ఏదో ఒక అబద్దం ఆడిన అధ్యక్షుడు అమెరికా చరిత్రలో మరొకరు లేరు. ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధులు నిలిపివేసేందుకు ఆడిన అబద్దాలు ఎన్నో ! చైనా చెప్పినట్లు చేస్తోంది, చైనా దాచిన సమాచారాన్ని సమర్ధించింది. ఊహాన్‌లో కరోనా వ్యాప్తి పెద్ద సమస్య కాదని చెప్పిందట, అమెరికా సరిహద్దులను చైనాకు తెరిచి ఉంచాలని తొలుత సలహా ఇచ్చిందట. ఆరోగ్య సంస్ధ ఒక వేళ చెప్పిందే అనుకుందాం, మాకంటే మొనగాండ్లు లేరని విర్రవీగే సిఐఏ, ఎఫ్‌బిఐ తెలివి తేటలు ఏమయ్యాయి. చైనా సమాచారాన్ని దాచిందే అనుకుందాం, నష్టపోయేది వారే కదా ! ఎదుటి వాడు తొడకోసుకుంటే తెలిసి ఎవరైనా మెడకోసుకుంటారా ? అమెరికా, ఐరోపా దేశాలు చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ద చెప్పిన వాటిని పెడచెవిన పెట్టి తమ పౌరుల ప్రాణాల మీదకు తేవటాన్ని ఏమనాలి ?
అసలేమి జరిగిందో చూద్దాం. కరోనా వైరస్‌ నిర్ధారణ గాక ముందు డిసెంబరు 31న చైనా ఒక ప్రకటన చేస్తూ ఊహాన్‌ నగరంలో న్యుమోనియా కేసులు అసాధారణంగా నమోదైనట్లు వెల్లడించింది. జనవరి ఏడవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక నూతన కరోనా వైరస్‌ వ్యాప్తిలోకి వచ్చినట్లు నిర్ధారించింది. పన్నెండవ తేదీనాటికి దాని పూర్తి జన్యువును నిర్ధారించింది. తొమ్మిది రోజుల తరువాత తన తొలి శాస్త్రవేత్తల బృందాన్ని ఊహాన్‌ నగరానికి పంపింది. జనవరి 30న ఏక కాలంలో అనేక మందికి సోకే అంటువ్యాధిగా ప్రజారోగ్యానికి ప్రమాదం వచ్చిందని, అంతర్జాతీయ సమాజం అత్యవసరమైన అంశంగా పరిగణించాలని ప్రకటించింది. అయితే ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు వ్యాపించుతుందని స్పష్టమైన ఆధారాలు లేవని చైనా చేసిన ప్రకటనను జనవరి 14న ప్రపంచ ఆరోగ్య సంస్ధ ట్వీట్‌ చేసింది. తరువాత వచ్చిన సమాచారం మేరకు ఆ తప్పిదాన్ని సరిచేసుకుంది.కానీ ట్రంప్‌ చెప్పినట్లు అమెరికాను లేదా ప్రపంచాన్ని గానీ తప్పుదారి పట్టించలేదు. నిజానికి ఐరోపా ధనిక దేశాలు, ట్రంప్‌, యావత్‌ అమెరికా యంత్రాంగం ఆ హెచ్చరికలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ద ప్రకటనలను పట్టించుకోనవసరం లేదని జనవరి 22న ట్రంప్‌ చెప్పాడు. ఫిబ్రవరి పదవ తేదీన న్యూహాంప్‌షైర్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ ఏప్రిల్‌ నాటికి వాతావరణం వేడెక్కుతుంది, కరోనా వైరస్‌ ఎలా వచ్చిందో అలాగే ఆశ్చర్యకరంగా అదృశ్యం అవుతుంది అన్నాడు. ఫిబ్రవరి 26న విలేకర్లతో మాట్లాడుతూ ఇది ఫ్లూ, ఫ్లూ వంటిది, అమెరికాలో ప్రతి ఏటా వేలాది మంది ఫ్లూతో మరణిస్తుంటారని తెలియదా అన్నాడు. మార్చి తొమ్మిదవ తేదీన కరోనాను తాము సమర్దవంతంగా ఎదుర్కొన్నామని ప్రకటించాడు. అత్యధిక కేసులు, మరణాలో అమెరికాలో మరణ మృదంగం మోగుతుంటే ఇలాంటి పెద్ద మనిషి ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధను తప్పుపడుతున్నాడు. తన తప్పిదం లేదని జనాన్ని నమ్మించేందుకు అబద్దాల మీద అబద్దాలు ఆడుతున్నాడు. కట్టుకథలను మీడియాకు అందిస్తున్నాడు.

Ingram Pinn's illustration of the week: 'A beautiful timeline ...
ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాల్సి ఉంది. చైనాలో కరోనా వైరస్‌ గురించి ఒక వైద్యుడు ముందే హెచ్చరించాడన్నది ఒక అంశం. అది నిజమై ఉండవచ్చు.ఒక ప్రాంతంలో తలెత్తిన ఒక ప్రమాదకర వైరస్‌ను ఎవరో ఒకరు లేదా ఒక బృందం ముందుగా అనుమానించటం లేదా కనుగొనటం సహజమే. అయితే అది యావత్‌ సమాజాన్ని భయాందోళనకు గురిచేసేది అయితే ముందుగా ప్రభుత్వంతో సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోకుండా, ఏర్పాట్లు చేయకుండా బయటకు వెల్లడిస్తే సమాజం అల్లకల్లోలం అవుతుంది. సదరు వైద్యుడు తాను అనుమానించిన అంశాన్ని నిర్దారిస్తూ సోషల్‌ మీడియాలో తన సహచరులతో పంచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు సుధాకర్‌ ఆసుపత్రిలో తగిన రక్షణ పరికరాలు లేవని, పోలీసుల ప్రవర్తన సరిగా లేదని తప్పుపట్టటం, మంత్రులతో సహా ఎవరూ పట్టించుకోవటం లేదని బహిరంగంగా చేసిన విమర్శను సహించని ప్రభుత్వం అతని మీద చర్య తీసుకుంది. అలాంటిది ఒక వైరస్‌ భయంకరమైనదని ఒక బృందం లేదా సంస్ధ నిర్దారించకుండా ఒక వైద్యుడు సోషల్‌ మీడియాలో ప్రచారం చేయటాన్ని ఏ సర్కార్‌ అయినా ఎలా తీసుకుంటుంది ? తప్పుపడుతూ చైనా సర్కార్‌ ఆ వైద్యుడిపై చర్య తీసుకుంది. అతను చెప్పింది నిజమైంది గనుక తరువాత తన చర్యను సరిదిద్దుకుంది. ఒక వేళ అవాస్తవం అయి ఉంటే ?
2009, 10 సంవత్సరాలలో స్వైన్‌ ఫ్లూ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. అది 1918-19లో ప్రపంచాన్ని వణికించి లక్షల మంది ప్రాణాలను బలిగొన్న స్పానిష్‌ ప్లూ హెచ్‌1ఎన్‌1 ఇన్‌ఫ్లూయంజా వైరస్‌ తాలుకు కొత్త రకం .పక్షులు, పందులు, మనుషుల నుంచి పునర్వర్గీకరణం చెందింది. ఇది పందుల నుంచి వ్యాపించిన వైరస్‌ కావటంతో దాన్నీ స్వైన్‌(పంది)ఫ్లూ అని పిలిచారు.ఇది కనీసం 70 నుంచి 140 కోట్ల మందికి సోకిందని అంచనా వేశారు. అయితే మరణించిన వారు 1.5లక్షల నుంచి 5.75లక్షల మంది ఉంటారని అంచనా వేశారు.అధికారికంగా ఆయా దేశాలు ప్రకటించిన మేరకు 67లక్షల 24,149 మందికి వ్యాధి సోకగా మరణించిన వారి సంఖ్య 19,654 మాత్రమే. ప్రతి ఏటా ప్రపంచంలో ఫ్లూ(జలుబు) కారణంగా మరణించే వారు రెండున్నర నుంచి ఐదు లక్షల మంది వరకు ఉంటారని, దీనితో పోల్చుకుంటే స్వైన్‌ ప్లూతో మరణించిన వారు తక్కువే అని కొందరు పోలిక చెప్పారు. కొందరు ఆరోపిస్తున్నట్లు కరోనాకు చైనాయే కారణమైతే ఏటా లక్షల మందిని బలిగొంటున్న ఫ్లూ వైరస్‌ను ఎవరు వదులుతున్నట్లు ?
స్వైన్‌ ఫ్లూ తొలుత మెక్సికోలోని పందుల ఫారాల నుంచి సోకి 2009 మార్చి తొమ్మిదవ తేదీన ఒక ఐదు సంవత్సరాల బాలుడిలో బయటపడింది. ఏప్రిల్‌ చివరిలో 50 రోజుల తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రజారోగ్యానికి ముప్పు తెచ్చే అంటువ్యాధిగా ప్రకటించింది. అంత సమయం ఎందుకు తీసుకున్నట్లని ఎవరూ ఆనాడు సంస్ధను తప్పుపట్టలేదు. నిధులు నిలిపివేయలేదు. అన్ని అంశాలను నిర్ధారించుకున్న తరువాతే ఒక బాధ్యతాయుత సంస్ధ వ్యవహరిస్తుంది. తాము అనేక నివారణ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ఆ రోజుల్లో గొప్పలు చెప్పుకున్నప్పటికీ అక్టోబరు 24న నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్ధితిని ప్రకటించాడు. అన్ని నెలలు ఎందుకు ఆలస్యం చేసినట్లు ? మరణాల సంఖ్య అధికార రీత్యా ప్రకటించిన మేరకు తక్కువే అయినా అగ్రస్ధానంలో అమెరికాయే ఉంది. ఇక మన దేశం విషయానికి వస్తే అమెరికా నుంచి వచ్చిన ఒక వ్యక్తి స్వైన్‌ ఫ్లూను మోసుకు వచ్చాడు. హైదరాబాదు విమానాశ్రయంలో మే 13వ తేదీన గుర్తించారు, ఆగస్టు నాటికి అనేక రాష్ట్రాలకు విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికులు 937 మంది మరణించగా ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏలుబడిలో గుజరాత్‌ 488 మరణాలతో రెండవ స్ధానంలో నిలిచింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనా మీద ఆధారపడింది అనటం ఎంతవరకు వాస్తవం ? ప్రపంచ ఆరోగ్య సంస్దకు మేము ఏటా 40 నుంచి 50 కోట్ల డాలర్లు అందచేస్తున్నాము, అదే చైనా నాలుగు కోట్ల డాలర్లు, అంతకంటే తక్కువే ఇస్తోంది. ఒక ప్రధాన ప్రాయోజిత దేశంగా ఉన్న తమకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ పూర్తి జవాబుదారీగా ఉండాలని కోరే హక్కు మాకుంది అని ట్రంప్‌ సెలవిచ్చాడు. అంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తున్నంత మాత్రాన అమెరికా చెప్పినట్లు ఏ సంస్ధ అయినా నడవాలా ?
అంటు వ్యాధుల నివారణ సమాచారం ఎవరి దగ్గర ఉంటే ఆ దేశాల మీద ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆధారపడటం సహజం. ప్రజారోగ్యం విషయంలో చైనా ప్రత్యేక చర్యలు, 2003లో కరోనా తరగతికి చెందిన సారస్‌ను చైనాలో సమర్దవంతంగా అరికట్టిన చరిత్ర, దానికి సంబంధించి వారి దగ్గర ఉన్న సమాచారం మరొక దేశం దగ్గర లేదు. కనుకనే కరోనా నిర్దారణ కాగానే చైనా సమాచారం మీద ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆధారపడింది తప్ప నిధులు ఎక్కువ పొందో లేక మరొక ప్రలోభంతోనో కాదు. ప్రపంచ రాజకీయాల్లో ఐరోపా యూనియన్‌ అమెరికాతో ఉంటుంది తప్ప చైనా మిత్రపక్షం కాదు. అలాంటిది నిధులు నిలిపివేయాలన్న ట్రంప్‌ చర్యను ఖండిస్తూ తీవ్ర విచారం ప్రకటించింది. నిందల వలన ఎలాంటి ప్రయోజనం లేదు. వైరస్‌కు సరిహద్దులు లేవు. ఐక్యరాజ్యసమితికి ప్రత్యేకించి నిధుల లేమితో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్దను బలపరచాలి, వాక్సిన్ల తయారీ పరీక్షల అభివృద్ధికి తోడ్పడాలని జర్మన్‌ విదేశాంగ మంత్రి హెయికో మాస్‌ వ్యాఖ్యానించాడు.
తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు ట్రంప్‌ చైనా మీద, ప్రపంచ ఆరోగ్య సంస్ధ మీద నిందలు వేశాడు. ఐక్యరాజ్యసమితి సంస్ధలను తన రాజకీయాలు, దుర్మార్గ చర్యలకు ఉపయోగించుకోవటం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు వాటిని తన కనుసైగలతో నడిపించిన అమెరికా ఇప్పుడు ప్రాభవం కోల్పోతుండటంతో ఇతర దేశాలు అలాగే వ్యవహరిస్తున్నాయనే అనుమానపు జబ్బుకు గురైంది.
మన కళ్ల ముందే ఇరాక్‌లో ఏం జరిగిందో చూశాము. ఇరాన్‌కు వ్యతిరేకంగా పని చేసినంతకాలం ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుసేన్‌కు అన్ని రకాల ఆయుధాలను అందించి పదేండ్ల పాటు యుద్దం చేయించటంలో అమెరికా పాత్ర బహిరంగ రహస్యం. తరువాత అదే సద్దామ్‌ అమెరికా వ్యతిరేకిగా మారటంతో సద్దామ్‌ను వదిలించుకొనేందుకు ఇరాక్‌లో మారణాయుధాలను గుట్టలుగా పోశారని అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రచారం ప్రారంభించాయి. అమెరికా పన్నిన వ్యూహంలో చిక్కుకున్న సద్దామ్‌ కువైట్‌పై దాడి చేసి అమెరికా సైనిక జోక్యానికి అవకాశం కల్పించాడు.
భద్రతా మండలిలో తీర్మానం చేయించి ఇరాక్‌లో మారణాయుధాలను వెతికే పేరుతో అంతర్జాతీయ అణు ఇంధన సంస్ద ప్రతినిధి బృందాన్ని పంపారు.దానితో పాటు అమెరికా ప్రతినిధులు కూడా వెళ్లారు. దానిలో సిఐఏ ఏజంట్లు ఉన్నారని అప్పుడే వార్తలు వచ్చాయి.రెండు బృందాలు కలసి రెండు సంవత్సరాల పాటు ఇరాక్‌లో తిష్టవేసి వంద కోట్ల డాలర్లు ఖర్చు చేసి 1,625 మంది 1,700 స్దలాలను వెతికి చివరికి ప్రకటించిందేమంటే ఎలాంటి ఆయుధ ఆనవాళ్లు లేదా జీవ, రసాయన ఆయుధ కార్యక్రమాలు లేవని తేల్చారు. బుష్‌ విచారం వ్యక్తం చేశాడు. అయితే తమ చర్యను సమర్దించుకొనేందుకు ఆ కార్యక్రమాలను రద్దు చేసిన ఆనవాళ్లు దొరికాయని ప్రకటించి అమెరికా, ఇతర దేశాల యుద్ద నేరాలను కప్పిపుచ్చారు. ఆ పేరుతో ఇరాక్‌ను ఆక్రమించిన అమెరికా సేనలు చివరకు సద్దామ్‌ హుసేన్‌ను ఉరితీసి తమ తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.అమెరికా దాడి కారణంగా లక్షా తొమ్మిదివేల మంది మరణించినట్లు వికీలీక్స్‌ బయటపెట్టిన అమెరికా పత్రాల్లో ఉండగా మరో అంచనా ప్రకారం పదిలక్షల మంది ఇరాకీయులు అమెరికా కారణంగా మరణించారు. ఆల్‌ ఖైదాకు ఇరాక్‌ పాలకులకు ఎలాంటి సంబంధం లేదని సిఐఏ రహస్య పత్రాలు వెల్లడించాయి. అమెరికా చెప్పిన వన్నీ అబద్దాలే అని తేలిపోయింది. అలాంటి అమెరికా చైనా,ప్రపంచ ఆరోగ్య సంస్ధ గురించి ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే నమ్మటం ఎలా ?

ఊహాన్‌లో సంభవించిన కరోనా మరణాల సంఖ్యను సవరించినట్లు చైనాయే స్వయంగా ప్రకటించింది. దీన్ని చూపి చూశారా చైనా నిజాలను దాచిందని మేం ముందే చెప్పాం అంటూ అమెరికా లేదా ఎవరైనా వాదించవచ్చు. వివిధ కారణాలతో కోటి మంది జనాభా ఉన్న ఊహాన్‌లో రోజూ అనేక మంది మరణిస్తుంటారు. అధికార యంత్రాంగం కరోనా మరణాలను కొన్నింటిని సహజ మరణాలుగా నమోదు చేసి ఉండవచ్చు. తరువాత విచారణలో కాదని తేలినందున అంకెలను సవరించారు. అదేమీ నేరం కాదే. మరణాలు, శ్మశానాల్లో అస్ధికలశాల సంఖ్య గురించి పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. నిజంగా వాటిని అక్కడి ప్రభుత్వాలు, పాలకులు నమ్మితే, పెద్ద సంఖ్యలో మరణించినట్లు చెబుతున్నదానికి ఆధారాలుంటే, అలాంటి ప్రమాదకారి కరోనా కట్టడికి అమెరికా, ఇతర ఐరోపా దేశాలు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం చెప్పిన వారు లేరు. పాత చింతకాయ పచ్చడినే కొత్తగా వండి వడ్డిస్తున్నారు.
ఒక్క ప్రపంచ ఆరోగ్య సంస్ధ మీదనే కాదు అనేక సంస్ధల మీద ట్రంప్‌ సర్కార్‌ దాడి చేసింది. అదిరించి బెదిరించి లొంగదీసుకోవాలని చూసింది. ఆప్ఘనిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన అమెరికన్ల మీద , ఇతర దేశాలపై అమెరికా విధించిన ఆర్ధిక ఆంక్షలు, ప్రయాణ నిషేధాలపై విచారణ జరుపుతున్న అంతర్జాతీయ నేర కోర్టు న్యాయమూర్తులు, సిబ్బందిని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పని చేసిన జాన్‌ బోల్టన్‌ బెదిరించాడు. అంతర్జాతీయ మానవహక్కుల ఉల్లంఘనల గురించి నిత్యం ఇతర దేశాలపై దుమెత్తిపోసే అమెరికా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్ధ నుంచి వైదొలిగిన తొలి దేశంగా చరిత్రలో నమోదైంది. అమెరికాలో దారిద్య్రం గురించి ఒక నివేదికను రూపొందించేందుకు ధైర్యం చేసిన ప్రొఫెసర్‌ ఫిలిప్‌ ఆల్‌స్టన్‌ను ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ విమర్శించాడు. ప్రపంచవ్యాపితంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి వలసపోవటం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. అసలు అమెరికా అంటేనే వలస వచ్చిన వారితో కూడిన దేశం, అలాంటిది ప్రపంచ వలసల చర్చల నుంచి అమెరికా వైదొలిగింది. యునెస్కో నుంచి వైదొలిగి శాశ్వత పరిశీలక దేశంగా ఉంటానని ప్రకటించింది. వాతావరణ మార్పులు, యూదుల పట్ల వ్యతిరేకత, వారి మీద జరిగిన మారణకాండ వంటి అంశాల మీద యునెస్కో పని చేయటం, దానిలో అమెరికా పాత్ర బయటకు రావటం సహించలేని అమెరికా ఈ చర్యకు పాల్పడింది. పాలస్తీనియన్లు, ఇతర చోట్ల నిర్వాసితులుగా మారిన వారి సహాయ చర్యలు చేపట్టే సంస్ధకు తామింకేమాత్రం నిధులు అందచేసేది లేదని ట్రంప్‌ సర్కార్‌ ప్రకటించింది. ఇలాంటి చర్యలను చూసిన తరువాత అనేక మందిలో సందేహాలు తలెత్తుతున్నాయి. ఐక్యరాజ్యసమితిని అమెరికా మిత్రునిగా చూస్తోందో శత్రువుగా భావిస్తోందా అన్నవే అవి. ఇదంతా ఇంటర్నెట్‌లో వెతికితే ఎవరికైనా దొరికే సమాచారమే !
ఇటీవలి కాలంలో ఏమి చేసినా చివరికి ప్రధాని నరేంద్రమోడీని అవమానించినా అమెరికా, ట్రంప్‌ను బలపరిచే, గుడ్డిగా వెనకేసుకు వచ్చే, చైనా మీద బురద చల్లే ఒక అనాలోచిత ధోరణి మన దేశంలో వెల్లడి అవుతోంది. అమెరికాను నమ్మితే కుక్కతోకను బట్టి గోదావరిని దాటే యత్నం లాంటిదే. నరేంద్రమోడీని లేదా మరొకరిని వ్యక్తిగా లేదా ఒక రాజకీయవేత్తగా విమర్శిస్తే దాని సంగతి వారు చూసుకుంటారు. ప్రధాని పదవిలో ఉన్నపుడు అవమానాలు పాలుకావటం అంటే దేశ వ్యవస్ధనే అవమానించటంతో సమానం. అమెరికా పౌరుడు బిల్‌ గేట్సే తమ ప్రభుత్వ చర్యను విమర్శించాడు. కానీ మన పాలకపక్షాలకు ఆ మాత్రం ధైర్యం కూడా లేదు. ముందు కరోనా నివారణకు మన ప్రాధాన్యత అని మన ప్రభుత్వ ప్రతినిధి ఒక ముక్తాయింపు ఇచ్చారు. మిగతా దేశాలకు ఆ మాత్రం తెలియక విమర్శించినట్లా ?

Who's Ready to Die for Trump's Ego? | Common Dreams Views
ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధులు ఆగిపోతే నష్టపోయేది మనవంటి దేశాలే అని గుర్తించటం అవసరం. అమెరికా, ఇతర ఐరోపా దేశాలలోని బహుళజాతి ఔషధ గుత్త సంస్ధలు ప్రజారోగ్యం, మహమ్మారులకు సంబంధించిన సమాచారంపై గుత్తాధిపత్యంతో ఔషధాలు, వాక్సిన్ల తయారీకి పూనుకోవటం తెలిసిందే. మన వంటి వర్ధమాన దేశాలకు అవసరమైన సలహాలు, సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి మాత్రమే పొందగలం. నిధులు లేక దాని కార్యకలాపాలు కుంటుపడితే నష్టపోయేది మన దేశం, మన ఔషధ కంపెనీలే అని గుర్తించాలి. కామెర్ల ఔషధం మన దేశ సంస్ధలు తయారు చేయక ముందు విదేశీ రకాలకు ఎంత ధర చెల్లించామో తెలిసినదే. మన వంటి దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఎంతగానో తోడ్పడుతోంది. అందువలన ట్రంప్‌ చర్యను యావత్‌ సభ్య సమాజం నిరసించాలి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య సంస్ధలో మన దేశానికి వ్యతిరేకంగా అమెరికా ఎన్నో కేసులను దాఖలు చేసింది. రాబోయే రోజుల్లో ఇంకా అలాంటివి ఎన్నో చూడాల్సి రావచ్చు. అందుకే కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ప్రపంచ సంస్ధలను కాపాడుకొనేందుకు పూనుకోవాలి. ట్రంప్‌ను ఏ విధంగా సమర్ధించినా అది దేశద్రోహం తప్ప దేశభక్తి కాదు !

(అమెరికా పెద్దన్న ట్రంప్‌కు ఆరోగ్య సంస్ధ మీద ఆగ్రహం ఎందుకు -2 ముగింపు)

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా పెద్దన్న ట్రంప్‌కు ఆరోగ్య సంస్ధ మీద ఆగ్రహం ఎందుకు -1

17 Friday Apr 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

COVID- 19 pandemic, Donald trump, Donald trump angry at WHO, UNO, WHO

Donald Trump | WHO Coronavirus | US President Donald Trump Latest ...
ఎం కోటేశ్వరరావు
ప్రపంచ పెద్దన్న డోనాల్డ్‌ ట్రంప్‌కు అకారణంగా కోపం వచ్చింది. వయసు మీద పడిన ప్రభావం అనుకుందామా ? కొద్ది రోజుల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్దను, చైనాను పొగిడి వెంటనే తెగడటాన్ని ఏమనాలి ? ప్రపంచ ఆరోగ్య సంస్ధకు 50కోట్ల డాలర్ల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు. తన ఆంగ్లం మీద, విడిగా మాట్లాడిన అంశాల మీద జోకులు పేల్చినా, పరువు తీసినా నోరు మెదపని చిన్నన్న నరేంద్రమోడీ ఈ పరిణామం మీద మాట్లాడతారని ఎలా అనుకుంటాం ! ప్రపంచ వ్యాపితంగా కరోనా నిరోధ చర్యలను సమన్వయపరచాలని కోరుతున్న మోడీ ఈ ఆపద సమయంలో తన జిగినీ దోస్తు తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టకపోయినా మరొక్కసారి ఆలోచించన్నా అని ఎందుకు ప్రాధేయపడలేకపోయారు ? అసలు ఈ చర్యకు ట్రంప్‌ చెబుతున్న కారణం ఎంతమేరకు నిజం ?
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు కర్ర ఉన్నవాడిదే గొర్రె. బలమైన దేశాలు బలహీనమైన వాటిని వలసలుగా చేసుకున్నాయి. వలసల ఆక్రమణలో ముందున్న వాటితో వెనుకబడినవి ఏదో ఒక పేరుతో గిల్లి కజ్జాలు పెట్టుకొని అనేక ప్రాంతీయ యుద్దాలకు తలపడ్డాయి.మన బొబ్బిలి యుద్దం, పక్కనే ఉన్న మైసూరు యుద్దాలు అవే. ఇలాంటివి మరింత ముదిరి బలవంతంగా ప్రపంచాన్ని పంచుకొనేందుకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. దాంతో సమస్య పరిష్కారం కాలేదు. సంధి ప్రయత్నంగా నానాజాతి సమితి పేరుతో మరో యుద్ధం రాకూడదని ఒక ఏర్పాటు చేసుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో పరాజిత దేశాలు తిరిగి పుంజుకొని మరోమారు వాటా కోసం తలపడ్డాయి. ఫలితమే రెండవ ప్రపంచ యుద్దం. దాని పర్యవసానం వలసల ఏర్పాటు సాధ్యం కాకుండా చేసింది. నానాజాతి సమితి స్ధానంలో ఏర్పడిందే ఐక్యరాజ్య సమితి. దానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధతో సహా అనేక సంస్ధలు అనుబంధంగా ఏర్పడ్డాయి. ఈ వ్యవస్ధలోనూ విజేతలదే పెత్తనం. అందునా రెండు ప్రపంచ యుద్ధాలలో ప్రత్యక్షంగా లేదా ప్రధాన యుద్ధ రంగాలలో పాల్గొనకుండా అటూ ఇటూ ఆయుధాలను అమ్మి సొమ్ముచేసుకున్న అమెరికా పరోక్షంగా ప్రపంచాన్ని, పెత్తనాన్ని తన చేతుల్లోకి తీసుకొనేందుకు ప్రయత్నించింది. సోవియట్‌ యూనియన్‌ అడ్డుకోవటంతో దాని ఆటలు పూర్తిగా సాగలేదు.1970దశకంలో చైనాకు ఐరాసలో స్ధానం కల్పించారు. సోవియట్‌-చైనా మధ్య తలెత్తిన విబేధాలను సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించిన అమెరికా తీవ్ర ఆశాభంగం చెందింది. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత చైనాను దెబ్బతీయాలని ప్రయత్నించారు. అయితే ఆ క్రమంలో చైనా బలపడింది, అమెరికా ఇతర దేశాల ఆశలు నెరవేరలేదు. ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ, ఇతర ప్రపంచ సంస్ధలతో తాము అనుకున్న లబ్ది చేకూరటం లేదు అని అర్దం చేసుకున్న అమెరికా అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు ఈ సంస్ధలను విమర్శించటం ప్రారంభించింది. అది ఐరాసకే పరిమితం కాలేదు. తాను ఏర్పాటు చేసిన మిలటరీ కూటమి నాటోను కూడా వదల్లేదు. ఐక్యరాజ్యసమితి సంస్ధలకు ఇస్తున్న విరాళాలను తగ్గించేందుకు పూనుకుంది. నాటో ద్వారా తాము ఐరోపాను రక్షిస్తుంటే అందుకయ్యే ఖర్చును పూర్తిగా మేమే ఎందుకు భరించాలి సభ్యదేశాలు కూడా పంచుకోవాలి అని ట్రంప్‌ బహిరంగంగానే ప్రకటించాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు కరోనా సందర్భాన్ని వినియోగించుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధుల నిలిపివేత నిర్ణయం తీసుకున్నాడు. దానికి అతకని సాకులు చెప్పాడు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధ , మిగతా ఐరాస సంస్ధల భవితవ్యం ఏమిటి ? ఈ అంశాలను అర్ధం చేసుకోవాలంటే నేపధ్యంలోకి పోకుండా సాధ్యం కాదు.
ప్రపంచ శాంతి, భద్రతల కోసమే ఐరాసను ఏర్పాటు చేశారు. మార్కెట్లకోసం జరుగుతున్న పోటీలో అవాంఛనీయ పోకడల నివారణకు ఏర్పాటు చేసిందే ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ). ప్రపంచీకరణ పేరుతో ఈ వ్యవస్ధ ద్వారా లబ్ది పొందాలనుకున్న ధనిక దేశాలు ఆచరణలో తాము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అని గ్రహించగానే ఈ సంస్ధను నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నాయి. ధనిక దేశాలలో 2008 ఆర్ధిక సంక్షోభం తరువాత వివిధ దేశాలు డబ్ల్యుటిఓతో నిమిత్తం లేకుండా తీసుకున్న రక్షణాత్మక చర్యలు, చేసుకున్న ద్వౌపాక్షిక ఒప్పందాల తీరు తెన్నుల గురించి అలయన్స్‌ అండ్‌ యులెర్‌ హెర్మ్‌స్‌ ఎకనమిక్‌ సంస్ధ గతేడాది నవంబరులో ఒక నివేదికను విడుదల చేసింది. అగ్రరాజ్యం అమెరికా 790, జర్మనీ 390,బ్రిటన్‌ 357, ఫ్రాన్స్‌ 262, కెనడా 199, ఆస్ట్రేలియా 174 చర్యలు, ఒప్పందాలు చేసుకున్నాయి. ధనిక దేశాల దెబ్బను తట్టుకొనేందుకు వర్ధమాన దేశాల్లో మన దేశం 566, బ్రెజిల్‌ 302, చైనా 256 చర్యలు తీసుకున్నట్లు ఆ నివేదిక తెలిపింది. గత పన్నెండు సంవత్సరాలలో వాణిజ్య విధానం ఆయా దేశాల లక్ష్యాల సాధనకు ఒక ఆయుధంగా మారింది. జాతీయ భద్రత పేరుతో తన మిత్రదేశాలైన కెనడా, మెక్సికో ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా 2018 మేనెలలో 25,10శాతాల చొప్పున దిగుమతి పన్ను విధించింది. తాము కూడా ప్రతీకార చర్యలకు పూనుకుంటామని హెచ్చరించటంతో ఏడాది తరువాత రద్దు చేసింది. ఐరోపా యూనియన్‌ దేశాలు కూడా మిత్రదేశాలే అయినా 7.5బిలియన్‌ డాలర్ల మేరకు అమెరికా పన్నులు విధించింది. ఇక చైనా గురించి ఏకంగా వాణిజ్య యుద్దమే ప్రారంభించింది.కరోనా కారణంగా అది తాత్కాలికంగా ఆగిపోయింది. చైనా వస్తువుల మీద తాము విధించిన పన్ను దెబ్బకు భయపడిపోయి ఆ మేరకు ధరలు చైనా సంస్ధలు ధరలు తగ్గిస్తాయని ట్రంప్‌ పేరాశలు పెట్టుకున్నాడు. అయితే చైనా కూడా ప్రతి చర్యలు తీసుకుంది. మరోవైపు చైనా వస్తువులపై విధించిన పన్ను మొత్తాలను అధిక ధరల రూపంలో అమెరికా వినియోగదారులే చెల్లించాల్సి రావటంతో ట్రంప్‌ దిక్కుతోచని స్ధితిలో ఉండగా కరోనా వచ్చింది.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఉంది. గత ఏడుదశాబ్దాలుగా ఐరాస, దాని అనుబంధ సంస్ధల కార్యాలయాలు చాలా మేరకు అక్కడే ఉన్నాయి. వాటికయ్యే ఖర్చులో గణనీయ మొత్తం అమెరికా భరిస్తోంది. అయితే తాను ఖర్చు చేసిన ప్రతిడాలరుకు ఎంతలాభం వస్తుందో అమెరికా లెక్కవేసుకుంటుంది. అంతర్జాతీయ సంస్ధల కార్యకలాపాల నిమిత్తం వచ్చే ప్రతినిధి వర్గాలు, దేశాధినేతలు చేసే ఖర్చు, ఐరాస సిబ్బంది చెల్లించే పన్నులు అన్నీ వివిధ ప్రయివేటు సంస్ధలు, న్యూయార్క్‌ నగర ఖజానాలో పడతాయి.వాణిజ్యం, రియలెస్టేట్‌ పెరుగుతుంది. (ఇక్కడ ఏపి ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి మూడు ప్రాంతాల్లో రాజధానులు, కార్యాలయాల ఏర్పాటు ద్వారా అభివృద్ధి సాధిస్తామని చెప్పటం, తెలంగాణాలో కొత్త జిల్లాలు ఏర్పడినపుడు వాటి కార్యాలయాల ఏర్పాటు ప్రాంతాల ఎంపికలో రాజకీయాలను గుర్తు చేయటం సముచితంగా ఉంటుంది)

WHO | Publications
2017లో ఐక్యరాజ్యసమితి ఖర్చు 50బిలియన్‌ డాలర్లు కాగా అమెరికా పదిబిలియన్‌ డాలర్లు వివిధ రూపాలలో అందచేసింది. ఇంత ఖర్చు ఎంతకాలం భరిస్తాం, అసలు మనం ఎందుకు భరించాలి అనే ప్రశ్నలను ట్రంప్‌ యంత్రాంగం ఆనాడే లేవనెత్తింది. కోత పెట్టాల్సిందే అని ట్రంప్‌ ప్రతిపాదించాడు. ఐరాసలో ప్రస్తుతం 193 దేశాలు ఉన్నాయి. ప్రతి సభ్యరాజ్యం ఎంత సొమ్ము సభ్యత్వరుసుముగా చెల్లించాలో ఒక ఫార్ములా ఉంది. ఆయా దేశాల జాతీయ ఆదాయం, జనాభా, ఇతర మరికొన్ని అంశాలను బట్టి అది నిర్ణయం అవుతుంది.హెచ్చు తగ్గులను బట్టి మారుతూ ఉంటుంది.ఈ మొత్తాలను విధిగా చెల్లించాలి, లేకుంటే ఐరాస నుంచి వెళ్లిపోవాలి. ఈ సొమ్ముతో ఐరాస రోజువారీ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అది గాక ఐరాస చేపట్టే కార్యక్రమాలు అది ఆరోగ్య పధకం కావచ్చు లేదా ఏదైనా దేశంలో శాంతిస్ధాపక కార్యక్రమం వంటివి కావచ్చు. వీటికి దేశాలు, సంస్ధలూ విరాళాల రూపంలో ఐరాసకు అందచేస్తున్నాయి. ఇక్కడే తిరకాసు ఉంది, ట్రంప్‌ ప్రస్తుతం ఈ మొత్తాన్నే నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు.
ఒక్కసారి వెనుక్కు చూసుకుంటే ఇరాక్‌లో సద్దామ్‌ హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి ప్రపంచ మానవాళికి ముప్పు తలపెట్టాడనే తప్పుడు ప్రచారంతో అమెరికా, దాని తైనాతీ దేశాలు ఇరాక్‌ మీద దాడి చేసి ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఆయుధాలను వెతికే పేరుతో అంతర్జాతీయ అణుశక్తి సంస్ధను రంగంలోకి దించారు. ఇలాంటి కార్యక్రమాలకు దేశాలు ఇచ్చే విరాళాలను బట్టి అవి నడుస్తాయి. డబ్బు లేకపోతే ఎలాంటి కార్యకలాపాలూ ఉండవు. అందుకే అమెరికా పెద్ద మొత్తంలో విరాళం అందచేసింది. తిరిగి ఆ మొత్తాలను ఐరాస పేరుతో వేతనాలు, ఇతర రూపాల్లో తన సైనికులు, ఇతర అధికారులు, వారి అవసరాల కోసం ఖర్చు చేసింది. 2018లో ఐరాస సాధారణ బడ్జెట్‌లో 22శాతం, శాంతి స్ధాపక కార్యక్రమాల కోసం 28శాతం బడ్జెట్‌ను అమెరికా భరించింది. అయితే 2019లో శాంతికార్యక్రమాలకు 25శాతానికి మించి ఇవ్వలేమని కోత పెట్టింది. సభ్యత్వ రుసుము బకాయి, ఇతర బకాయిలను వాటిలోనే సర్దుకోవాలని చెప్పింది. అంటే శాంతి కార్యక్రమాలకు గణనీయంగా విరాళాన్ని తగ్గించింది. ఇది సంచలనాత్మక అంశం కాదు కనుక మీడియా కూడా పట్టించుకోలేదు. సాధారణ సమయాల్లో ఏవైనా సంచలనాత్మక నివేదికలు, ప్రకటనలు చేస్తే తప్ప ప్రపంచ ఆరోగ్య సంస్ధ గురించి కూడా జనానికి, మీడియాకు అంతగా పట్టదు. ఇప్పుడు కరోనా వ్యతిరేక పోరులో అది ముందు ఉంది కనుక, దాని పాత్రను వివాదం చేసి ఆ ముసుగులో ట్రంప్‌ విరాళాన్ని తగ్గించేందుకు అవకాశాన్ని వినియోగించుకున్నాడు కనుక పెద్ద చర్చనీయాంశమైంది.

Donald Trump: 'Disgusted' facial expressions 'help' presidential ...
ముందే చెప్పుకున్నట్లు 2017లో అమెరికా ఐరాసకు అందచేసిన పది బిలియన్‌ డాలర్లలో దాని సభ్యత్వ సొమ్ము 3.5బిలియన్లు కాగా, మిగిలిన సొమ్ము విరాళం. దీనిలో యూనిసెఫ్‌ పేరుతో పిల్లల సంక్షేమానికి, ఆహార కార్యక్రమం, శరణార్ధుల సంక్షేమం ఇతర కార్యక్రమాలకు ఇచ్చే నిధులు ఉన్నాయి. 2018లో ట్రంప్‌ విరాళాల్లో 30 కోట్ల డాలర్ల కోత విధించిన కారణంగా పాలస్తీనా నిర్వాసితుల సంక్షేమాన్ని అమలు చేసే సిబ్బందిలో 250 మందిని తొలగించారు. ఐరోపా, గల్ఫ్‌ దేశాలు అదనంగా ఇచ్చి కొంత మేరకు ఆదుకున్నప్పటికీ అమెరికా కోత ఫలితంగా లక్షా40వేల మందికి ఆహారం, 70వేల మందికి మంచినీరు అందచేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధకు విధిస్తున్న కోత దాని కార్యక్రమాలు అంటే ప్రధానంగా పేద దేశాల్లో, మనవంటి దేశాల్లో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రపంచ వాక్సిన్‌ల వ్యాపారంలో పెద్ద వాటా కలిగి ఉన్న బిల్‌గేట్స్‌ తమ సంస్ధ ఇస్తున్న పది కోట్ల విరాళాన్ని 25కోట్ల డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించాడు. ఇలా ఏదో రూపంలో ప్రపంచ ఆరోగ్య సంస్ద కార్యక్రమం కొనసాగుతుందనేది వేరే విషయం, మానవత్వం, మానవతా పూర్వక సాయం గురించి నిత్యం కబుర్లు చెప్పే అమెరికా ఎందుకు ఇలాంటా అమానవీయ చర్యకు పాల్పడింది ? ఇరవైలక్షల కోట్ల డాలర్ల జిడిపి ఉన్న దేశానికి 50 కోట్లు ఒక లెక్కలోనివా ? (మిగతా అంశాలు మరో వ్యాసంలో చూద్దాం)

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

So, what is the Zika virus?

30 Saturday Jan 2016

Posted by raomk in Current Affairs, Health, INTERNATIONAL NEWS, Latin America, Readers News Service, USA, Women

≈ Leave a comment

Tags

Brazil, WHO, Zika virus

 

 

By Peter Gelling

NEED TO KNOW: 

The Zika virus may be the Ebola of 2016, just a lot less deadly. The virus is spreading rapidly throughout the Americas. The World Health Organization said the virus is spreading “explosively.” Health officials are warning of a pandemic. And the news media is starting to take notice.

So, what is the Zika virus? Zika is spread through a certain kind of mosquito that thrives in warmer climates. It’s named after a forest in Uganda and is usually found in Africa and Asia. In fact, until 2015, almost no one in the Western Hemisphere had ever been infected with it.

That’s now changed in a big way. Last May, the Zika virus began showing up in patients in Brazil. And since people in the Americas have no immunity to it, the virus began to spread quickly. Millions of people may already be infected across South and Central America.

The Zika virus, however, is not like Ebola. It won’t kill you. Most people who contract Zika won’t even notice. Those who do will have a fever, joint pain, maybe red eyes. All of it is treatable and it’s unlikely a patient would even have to be admitted to the hospital.

There is one exception: pregnant women. Scientists suspect that a rise in the number of cases of pregnant women giving birth to children with abnormally small heads and brains — a condition called microcephaly — is related to the rise in Zika.

Typically Brazil sees about 150 microcephaly cases a year. It is right now investigating some 4,000 cases. The connection between Zika and microcephaly, however, is circumstantial. Scientists are still researching to see if Zika is actually the cause.

WANT TO KNOW: 

Whether the connection between Zika and microcephaly is true or not, many pregnant women in South and Central America are worried. So are their governments. Some governments are even recommending that women postpone getting pregnant for the next two years.

The growing health crisis in Brazil, where the most cases of microcephaly have been reported, has sparked a new public debate over women’s rights to abortion for troubled pregnancies.

Brazil’s 1940 penal code made abortion a crime in all but two cases: pregnancy from rape and when terminating a pregnancy is necessary to save the mother’s life, writesGlobalPost Senior Correspondent Will Carless. The only amendment to those laws came more than 70 years later, in 2012, when the Supreme Court ruled that women could also terminate a pregnancy if the fetus was diagnosed with anencephaly, a rare condition where the child is born missing pieces of the brain and skull.

The sudden reported uptick in microcephaly cases has reinvigorated a cadre of powerful women’s rights activists in Brazil, some of whom are already preparing a fresh appeal to the Supreme Court to consider granting the right to abortion in the case of microcephaly.

It won’t be easy. Abortion is a controversial subject in Brazil, and the country’s political climate is not friendly to the debate. Conservative politicians have even recently pushed for a harsh new bill that would require rape victims to undergo physical exams before being allowed an abortion because, you know, they haven’t been through enough already.

STRANGE BUT TRUE: 

And while everyone is freaking out about Zika, our old friend swine flu has come back for a sentimental and rather deadly visit. In Russia, Ukraine and Armenia, the virus has killed more than 150 people.

Swine flu had its moment in 2009, you might remember, when it grew to a global pandemic and killed tens of thousands. There is no need to panic this time, though. Since 2009, the virus has become a seasonal sickness that can be treated with vaccinations. The WHO says there is no danger of a new pandemic.

That isn’t stopping people in some parts of Russia and Ukraine from wearing surgical masks on public streets. The paranoia is real. One Russian politician even suggested the outbreak was planted by the United States.

This article appeared in globalpost.com

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

WHO warns of widespread misunderstanding of superbug threat

16 Monday Nov 2015

Posted by raomk in Uncategorized

≈ Leave a comment

Tags

superbug, WHO

 LONDON | BY KATE KELLAND

People across the world are confused about the major threat to public health posed by drug-resistant superbugs and do not know how to stop that risk growing, the World Health Organization (WHO) said on Monday.

Ramping up its fight against antibiotic resistance with a survey of public awareness, the United Nations health agency said 64 percent of those asked believed wrongly that penicillin-based drugs and other antibiotics can treat colds and flu, despite the fact such medicines have no impact on viruses.

Around a third of people surveyed also wrongly believed they should stop taking antibiotics when they feel better, rather than completing the prescribed treatment course, the WHO said.

“The findings … point to the urgent need to improve understanding around antibiotic resistance,” said Keiji Fukuda, the WHO’s special representative for antimicrobial resistance.

“One of the biggest health challenges of the 21st century will require global behaviour change by individuals and societies.”

Antibiotic resistance happens when bacteria mutate and adapt to become resistant to the antibiotics used to treat the infections they cause. Over-use and misuse of antibiotics exacerbate the development of drug resistant bacteria, often called superbugs.

Superbug infections — including multi-drug-resistant forms of tuberculosis, typhoid and gonorrhoea — kill hundreds of thousands of people a year, and the trend is growing.

“The rise of antibiotic resistance is a global health crisis,” the WHO’s director-general Margaret Chan said in a statement. “It is reaching dangerously high levels in all parts of the world.”

The WHO surveyed 10,000 people across 12 countries — Barbados, China, Egypt, India, Indonesia, Mexico, Nigeria, Russia, Serbia, South Africa, Sudan and Vietnam — and found many worrying misconceptions.

Three quarters of respondents think antibiotic resistance means the body is resistant to the drugs, for example, whereas in fact it is the bacteria themselves that become resistant to antibiotics and their spread causes hard-to-treat infections.

Some 66 percent believe individuals are not at risk of a drug-resistant infection if they personally take their antibiotics as prescribed.

And nearly half of those surveyed think drug resistance is only a problem in people who take antibiotics often. In fact, anyone, anywhere, of any age, can get a superbug infection.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన : అంబానీకి ” మంచి యుద్ధం ” అదానీకి ”మంచి రోజులు ” !
  • కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం !
  • నరేంద్రమోడీకి వివరించేందుకు త్రివిధ దళాధిపతులు – ప్రధానికి తెలియకుండానే అగ్నిపథ్‌ను ప్రకటించారా ?
  • నాడు జైకిసాన్‌లపై దాడి నేడు అగ్నిపథ్‌ పేరుతో జై జవాన్లకు ఎసరు : నరేంద్రమోడీ తానాషాహీ నహీ చెలేగీ అంటున్న యువత !
  • అమెరికా దేశాల శిఖరాగ్ర సభ – జో బైడెన్‌కు భంగపాటు !

Recent Comments

మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన ( రెండవ…
మోడీ ఎనిమిదేండ్ల పాల… on మోడీ ఎనిమిదేండ్ల పాలన (మొదటి భ…
SHEIK ALI HUSSAIN on ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపా…
raomk on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…
యూహెచ్ ప్రీతమ్ on రంగనాయకమ్మ గారూ”కుహనా మి…

Archives

  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 924 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: