• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: ycp jagan

జిల్లా పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్న తెలుగు దేశం – పుదుచ్చేరి తరహా పాకేజ్‌ కోసమైనా పవన్‌ తాట తీస్తారా !

02 Friday Apr 2021

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, STATES NEWS, Telangana

≈ Leave a comment

Tags

chandrababu naidu, jana sena party, Pawan kalyan, special status to Puducherry, tdp, ycp jagan


ఎం కోటేశ్వరరావు


పుదుచ్చేరిలో పాగా వేసేందుకు బిజెపి చేసిన వాగ్దానం ఆ పార్టీకి ఆంధ్రప్రదేశలో ఎదురు తన్నిందా ? జరిగిన పరిణామాలను చూస్తే పెద్ద ఇరకాటంలో పడిందనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఐదు సంవత్సరాల క్రితం బీహార్‌ ఎన్నికల సమయంలో నరేంద్రమోడీ స్వయంగా ప్రత్యేక పాకేజ్‌లను ప్రకటించారు. తరువాత వాటికి అతీగతీ లేదు. ఇప్పుడు అమిత్‌ షా మాటల్లో చెప్పాలంటే పుదుచ్చేరి వాసుల విషయంలో జుమ్లా (అవసరార్దం అనేకం చెబుతుంటాం) కూడా కావచ్చు. తరువాత నిబంధనలు అంగీకరించటం లేదు, ఇతర రాష్ట్రాలు అభ్యంతర పెడుతున్నాయంటే చేసేదేమీ లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదాను డిమాండ్‌ చేసిన పార్టీగా గొప్పలు చెప్పుకున్న బిజెపి తరువాత ఆ విషయంలో చేసిన వాగ్దానాన్ని తుంగలో తొక్కి రాష్ట్ర ద్రోహిగా ప్రజల ముందు తన స్వరూపాన్ని వెల్లడించుకుంది. ప్రత్యేక హౌదా ముగిసిన అధ్యాయంగా, కొత్తగా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హౌదాలేమీ ఉండవు అని చెప్పి ఓట్లు వేసినా వేయకపోయినా దానికే తాము కట్టుబడి ఉంటామని అది కూడా తమ ఘనతే అన్నట్లుగా వ్యవహరించింది. ఇప్పుడు పుదుచ్చేరిలో పాగా వేసేందుకు అక్కడి ప్రజలకు ప్రత్యేక హౌదా ఎరవేసింది. తమకు అధికారం అప్పగిస్తే ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంత హౌదా కల్పించి జమ్మూకాశ్మీరుకు ఇచ్చిన మాదిరి కేంద్ర పన్నుల వాటాను 25 నుంచి 40శాతానికి పెంచేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నది. అదే విధంగా కేంద్ర పధకాలకు గాను ప్రస్తుతం 70శాతం కేంద్ర పాలిత ప్రాంతం, 30శాతం కేంద్ర వాటాగా ఉన్నదానిని 30:70శాతాలుగా మారుస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. దీని మీద తెలుగుదేశం నేత లోకేష్‌ ట్వీట్లు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హౌదాకోసం పోరాడుతుందా అని ప్రశ్నించారు. ప్రత్యేక హౌదాకోసం ఒక్క ప్రభుత్వం, అధికారపక్షమే కాదు, ఎవరైనా పోరాడవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ అలాంటి నైతిక హక్కును కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌కు కావాలని కోరిన ప్రత్యేక హౌదాకు, పుదుచ్చేరికి ఇస్తామంటున్న హౌదాకు సంబంధం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్దించుకున్నారు.
కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసిన కేంద్రం దానికి నలభైశాతం నిధులు ఇవ్వకపోతే అక్కడ దాని పరువు దక్కదు, తిరిగి రాష్ట్ర హౌదా ఇస్తామని చెబుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న మరొక రాష్ట్రం ఢిల్లీ. అక్కడ ప్రభుత్వానికి అధికారాలను తగ్గించి, లెప్టినెంట్‌ గవర్నరకు ఎక్కువ అధికారాలు కట్టబెట్టేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. అలాంటిది పుదుచ్చేరికి అధికారాలు, నిధులను ఎలా పెంచుతారు ? ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఒక ప్రాతిపదిక మరొక రాష్ట్రానికి మరొక ప్రాతిపదికా అన్న ప్రశ్న ముందుకు రానుంది. పుదుచ్చేరికి ఇలాంటి ప్రత్యేక హౌదా ఇచ్చేందుకు ప్రాతిపదిక ఏమిటి అన్నది ప్రశ్న. ఏ కమిటీ లేదా ఏ ఆర్ధిక సంఘం సిఫార్సులు దీనికి అవకాశం కల్పిస్తున్నాయి ? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదాకు బదులు ప్రత్యేక పాకేజి ఇస్తామని చెప్పిన కేంద్రం ఇలాంటిదానినే ఎందుకు అమలు జరపకూడదు ? ఇప్పటికే ఇరకాటంలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ పుదుశ్చేరి తరహా హౌదాకోసమైనా కేంద్ర తాట తీసేందుకు, తోలు వలిచేందుకు తన పవర్‌ను చూపుతారా ? పులిలా గాండ్రిస్తారా, పిల్లిలా మ్యావ్‌ అంటారా ?

ఏపిలో ముద్దులాట – తెలంగాణాలో దెబ్బలాట : నాగార్జున సాగర్‌లో పవన్‌ కల్యాణ్‌ మద్దతు ఎవరికి ?

ఆంధ్రప్రదేశ్‌లో తమ కూటమి అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన రాష్ట్రంలో కొత్త రాజకీయ అంకానికి తెరలేపింది. దాని మీద పవన్‌ కల్యాణ్‌ వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. మరో మూడు సంవత్సరాల వరకు ఎన్నికలు లేకపోయినా ఇప్పుడే ప్రకటించటం గురించి చర్చ జరుగుతున్నది. స్ధానిక సంస్దల ఎన్నికలలో ఫలితాలు, విశాఖ ఉక్కు వంటి ఇతర అంశాలను చూసిన తరువాత బిజెపితో తెగతెంపులు చేసుకుంటామని కొద్ది రోజుల క్రితం పవన్‌ కల్యాణ్‌ చేసినట్లు చెబుతున్న హెచ్చరికల నేపధ్యంలో సోము వీర్రాజు తిరుపతి ఎన్నికల ఆపద మొక్కుగా ఈ ప్రకటన చేశారు తప్ప మరొకటి కాదన్నది ఒక అభిప్రాయం. పవన్‌ కల్యాణ్‌ అంటే ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలకు సైతం ఎంతో ఇష్టమని, పవన్‌ కల్యాణ్‌ను ఎంతో గౌరవంగా చూడాలని వారు చెప్పారని వీర్రాజు చెప్పారు. బిజెపి ఎక్కడా ఇంత వరకు ఇంత ముందుగా లేదా ఎన్నికల సమయంలో గానీ ముఖ్యమంత్రి అభ్యర్దులను ప్రకటించలేదు, దానికి భిన్నంగా ఈప్రకటన చేయటం రాజకీయ అవకాశవాదం అంటున్నవారు లేకపోలేదు. తిరుపతిలో తమ అభ్యర్దిని రంగంలోకి దించకపోతే బిజెపికి మద్దతు ఇచ్చేది లేదని కాపు సామాజిక తరగతికి చెందిన కొన్ని సంఘాల నేతలు హెచ్చరించిన నేపధ్యంలో వారిని బుజ్జగించి ఏమార్చేందుకు ఈ ప్రకటన చేసి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. రామాయణంలో పిడకల వేట మాదిరి సోము వీర్రాజు ప్రకటనకు వైసిపి అసంతృప్త ఎంపీ రఘురామ కృష్టం రాజు మరో వ్యాఖ్యానం చెప్పారు. తమ పార్టీలో ఏదైనా జరుగుతోందా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుందన్నట్లుగా ఈ ప్రకటనతో జరిగేదేమీ లేదని, తిరుపతి ఎన్నికల నేపధ్యంలో సోము వీర్రాజు ఒక బిస్కెట్‌ వేశారని వైసిపి నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం మీద వీర్రాజు ప్రకటన నవ్వుల పాలైందని, పవర్‌ స్టార్‌ పరువు తీసిందని కొందరి అభిప్రాయం. అసలు తమది పెద్ద పార్టీ అయితే ముఖ్యమంత్రి అభ్యర్దిగా పవన్‌ కల్యాణ్‌ అని ప్రకటించటానికి వీర్రాజు ఎవరని కొందరు జనసైనికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బిజెపి-పవన్‌ కల్యాణ్‌ సంబంధాలు సజావుగా లేవన్నది స్పష్టం. తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల రోజున పోలింగ్‌ జరుగుతుండగా తెరాస అభ్యర్ది సురభి వాణీ దేవికి మద్దతు ప్రకటిస్తూ పవన్‌ కల్యాణ్‌ చేసి ప్రకటనే అందుకు నిదర్శనం. ఎన్ని ఓట్లు ఉన్నాయి లేవు అన్నది పక్కన పెడితే నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో పవన్‌ కల్యాణ్‌ ఏమి చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణా బిజెపి నేతలు తనను అవమానించారనే ఆగ్రహంతో పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు.

రుణ ఊబిలో జగనాంధ్ర ప్రదేశ్‌ – నిజాలను ఎంతకాలం దాస్తారు ?

కొన్ని సంక్షేమ పధకాలకు ఏదో ఒక సాకుతో కోత పెట్టక తప్పని స్ధితి, అది ఇంకా పూర్తి కావాల్సిన మండల, జిల్లా పరిషత్‌, అదే విధంగా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల మీద పడకుండా చూసుకోవాల్సిన అగత్యం ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే ఓట్‌ఆన్‌ అకౌంట్‌తో అవన్నీ పూర్తయ్యేంత వరకు కాలక్షేపం చేద్దామనే ఆలోచనతో బడ్జెట్‌ను వాయిదా వేశారన్నది కాదనలేని సత్యం. దానికి అధికార పార్టీ ఏ సాకులు చెప్పినా అవి అతికేవి కాదు. అప్పుల గురించి కాగ్‌ చేసిన హెచ్చరిక, అది మీడియాలో చర్చకు దారి తీయటంతో ప్రభుత్వం తాజాగా సమాచార శాఖ ద్వారా ఒక పెద్ద వివరణ విడుదల చేసింది. దాన్ని రాసిన వారు ప్రభుత్వాన్ని సమర్ధించేందుకు ఎన్నో సాము గరిడీలు చేశారు. కేంద్ర ప్రభుత్వమే రికార్డు స్ధాయిలో అప్పులు చేసింది, మేమెంత అన్నట్లుగా చివరకు అప్పులు తీసుకురాక తప్పటం లేదు, సమర్ధనీయమే అని సమర్ధనకు పూనుకుంది. పోనీ దీనిలో అయినా నిజాయితీ ఉందా ?

అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పుచేశాడన్నట్లు !


సమాచార శాఖ వివరణలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. కరోనా కారణంగా తలెత్తిన ఆర్ధిక పరిస్దితి కారణంగా కేంద్ర ప్రభుత్వమే 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 18,48,655 కోట్లు అప్పు చేసింది. దేశ చరిత్రలో ఇంత మొత్తం అప్పు ఎన్నడూ చేయలేదు.కేంద్ర ప్రభుత్వ పని తీరు మొత్తం దేశానికి ఒక సూచిక.2014-19 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ అప్పు 56,48,471 కోట్ల నుంచి 84,68,085 కోట్లకు పెరిగింది. వృద్ది 49.92శాతం, వార్షిక వృద్ది రేటు 8.44శాతం. అదే రాష్ట్ర విషయంలో పైన చెప్పుకున్న కాలంలోనే 1,11,528 నుంచి 2,59,087 కోట్లకు పెరిగింది, వృద్ది 132.31శాతం, వార్షిక వృద్ది రేటు 18.36శాతం. ఇదంతా తెలుగు దేశం పాలనా కాలంలో జరిగింది.
కేంద్రంలో మోడీ 2.0, రాష్ట్రంలో వైసిపి 1.0 పాలనా కాలంలో అంటే 2019 మార్చి నుంచి 2021 మార్చినెల వరకు కేంద్ర అప్పులు 84,48,085 కోట్ల నుంచి 1,12,50,391 కోట్లకు, వృద్ది రేటు 32.86, వార్షిక వృద్ది రేటు 15.26శాతం ఉండగా రాష్ట్ర అప్పులు 2,59,087 నుంచి 3,48,998 కోట్లకు, వృద్ది రేటు 34.70, వార్షిక వృద్ది రేటు 16.06 శాతం ఉంది.
ఈ అంకెలతో ఎవరికీ పేచీ లేదు. వాటికి చెప్పే వ్యాఖ్యానాలే వివాదాస్పదం. సమాచార శాఖ విడుదల చేసిన అంకెలు వాస్తవమేనా ? ముఖ్యంగా వైసిపి రెండు సంవత్సరాల పాలనలో అప్పుగా పేర్కొన్న 3,48,998 కోట్ల రూపాయల అంకెలను ఏడాది క్రితం బడ్జెట్‌లోనే పేర్కొన్నారు. వాటిలో మార్పులేమీ లేవా ? సమర్ధనీయంగా పాలన ఉంటే అప్పులు తగ్గాలి, లేకపోతే పెరగాలి, పదిహేను నెలల నాటి అంకెలనే వల్లెవేస్తే కుదరదు. తెలుగుదేశం సర్కార్‌ చివరి ఏడాది రూ. 38,151 కోట్ల మేర అప్పులు తెచ్చింది. దాన్ని తీవ్రంగా విమర్శించిన జగన్‌ తొలి ఏడాది ఆ మొత్తాన్ని 52వేల కోట్లకు పెంచారు. వర్తమాన సంవత్సరానికి 48,295 కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. కాగ్‌ చెప్పిన అంశాల ప్రకారం నవంబరు చివరి నాటికే రాష్ట్రం 73,811 కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. నెలకు 9,226 కోట్ల రూపాయల చొప్పున ఉంది, మొత్తం అప్పు 3,73,140 కోట్లుగా ఉంది,డిసెంబరు-మార్చినెలల మధ్య ఇదే తీరున అప్పులు తెస్తే మరో 37 వేల కోట్ల రూపాయలు అప్పులు చేయవచ్చని అంచనా వేసింది. అంటే అప్పు నాలుగు లక్షల పదివేల కోట్ల చేరువలో ఉంటుంది. ఈ మొత్తంగాక వివిధ ప్రభుత్వ సంస్దలు తీసుకున్న అప్పులకు రాష్ట్ర ప్రభుత్వమే హామీదారుగా ఉంటుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే పరిగణించాలి. అయితే ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం విధించిన జిఎస్‌డిపిలో మూడుశాతం రుణ పరిమితి దాటలేదు అని లెక్కల్లో చూపేందుకు ఆ మొత్తాలను విడిగా చూపుతున్నారు. చంద్రబాబు నాయుడి సర్కార్‌ చేసిన పనినే జగన్‌ ప్రభుత్వం కూడా చేస్తోంది. అందువలన అప్పు నాలుగున్నరలక్షల కోట్ల వరకు ఉన్నా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు వెల్లడించకపోయినా మూడు నెలల్లో ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో వాటిని వెల్లడించకతప్పదు. అందుకే పాత అంకెలను వల్లెవేస్తే తరువాత విమర్శకులకు మరో అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన అప్పు 97వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు ఏలుబడిలో అది 2018-19 నాటికి రెండులక్షల 57వేల 509 కోట్ల రూపాయలకు చేరింది. ఇవి గాక రాష్ట్ర ప్రభుత్వశాఖలు తీసుకున్న మరో 54వేల 250 కోట్ల రూపాయల అప్పులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే మొత్తం అప్పు మూడు లక్షల 11వేల కోట్లకు చేరింది. ఆ మొత్తాన్ని జగన్‌ సర్కార్‌, 3,02,202, 67,171 చొప్పున మొత్తం 3,69,373 కోట్లకు పెంచింది. 2021 మార్చి నాటికి 3,48,998 అప్పు పెరుగుతుందని పేర్కొన్నది, వీటికి అదనంగా హామీగా ఉన్న అప్పును కలుపుకోవాల్సి ఉంది. లక్ష్యానికి మించి అదనంగా చేసిన అప్పు, ప్రభుత్వం హామీ ఇచ్చిన అప్పులు మొత్తం నాలుగున్నర లక్షల కోట్లు దాటటం ఖాయం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2020వరకు నాలుగు సంవత్సరాలలో 27.92శాతంగా ఉన్న అప్పు 2021 మార్చి నాటికి 34.55 శాతానికి పెరుగుతుందని ఆర్ధిక మంత్రి బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించారు. వాస్తవానికి ఇది ఇంకా పెరగవచ్చు.
సమాచారశాఖ విడుదల చేసిన వివరణ పత్రంలో చెప్పినదాని ప్రకారం 2014-19 మధ్య రుణాల చెల్లింపు మొత్తం రు.25వేల కోట్లకు పెరిగింది. తెచ్చిన అప్పులను ఉత్పాదక ఖర్చుగా చేసి ఉంటే అనేక రంగాలు గణనీయంగా అభివృద్ది చెంది ఉండేవి, కాని అలా జరగలేదు అని పేర్కొన్నారు. తెలుగుదేశం అలా చేయలేదు సరే తమ రెండు సంవత్సరాల పాలనలో వైసిపి తెచ్చిన అప్పులను నవరత్న అనుత్పాదక సంక్షేమ పధకాలకు తప్ప ఇతరంగా ఏ ఉత్పాదక కార్యకలాపాల మీద ఖర్చు చేశారు, ఏమి సాధించారు అన్నదే ప్రశ్న.

నూతన ఎన్నికల కమిషనర్‌-పాత సవాళ్లు !


ఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనరుగా మాజీ ప్రధాన కార్యదర్శి, తరువాత రాష్ట్రప్రభుత్వ సలహాదారుగా ఉన్న నీలం సాహ్ని పదవీ బాధ్యతలు స్వీకరించారు.సాధారణంగా అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనరు నియామకం పెద్ద చర్చనీయాంశం కాదు. అనేక మంది కమిషనర్ల నియామకం-పదవీ బాధ్యతల విరమణ వార్తలు కూడా గతంలో తెలిసేవి కాదు. కేంద్రంలో టిఎన్‌ శేషన్‌, రాష్ట్రంలో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎన్నికల కమిషన్లకు ఉన్న అధికారాలు ఎలాంటివో దేశానికి చూపించారు. గత ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వమూ-రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య జరిగిన ప్రచ్చన్న, ప్రత్యక్ష యుద్దంలో మొత్తం మీద ఎన్నికల కమిషనర్‌దే పై చేయి అన్నది స్పష్టం. కింద పడినా గెలుపు మాదే అన్నట్లుగా అధికార పార్టీ నేతలు ఎంతగా, ఎలా సమర్దించుకున్నా వాస్తవాలు, కోర్టు తీర్పులు దానినే నిర్ధారిస్తాయి. తమ ఇష్టాను సారంగా ఒక ఎన్నికల కమిషనరును తొలగించటం సాధ్యం కాదని తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించి ముక్కు పగల కొట్టించుకుంది. కొత్త ఎన్నికల కమిషనరు ముందు అధికారపక్షం వైపు నుంచి గతం మాదిరి ఎలాంటి సమస్యలు తలెత్తకపోవచ్చు. అయితే ప్రతిపక్షాల నుంచి అలాంటి పరిస్దితిని ఆశించలేము. మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు పూర్తయిన తరువాత మధ్యలో మధ్యంతర ఎన్నికలు వస్తే తప్ప లోక్‌సభ, అసెంబ్లీ గడువు ప్రకారం మూడు సంవత్సరాల పాటు అసలు ఎన్నికల కమిషనరు గురించి వార్తలే ఉండకపోవచ్చు.
స్వేచ్చగా ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవటంతో జిల్లాపరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీని మీద పార్టీలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు మరింత నీరుగారి పోతారని భయపడుతున్నారు. ఎన్నికలలో పాల్గొనాలా ? బహిష్కరించాలా అన్న తర్జన భర్జనలో బహిష్కరించాలని మెజారిటీ తెలుగుదేశం నేతలు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసినందున బహిష్కరించినా పోటీలో ఉన్న కారణంగా ఎన్నికలైతే జరుగుతాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎదురైన పరాజయాల నేపధ్యంలో తమకు అంతకు మించి భిన్నమైన ఫలితాలు రావన్నది తెలుగుదేశం అభిప్రాయం అన్నది స్పష్టం.
ఇక ఎన్నికల కమిషనరు విషయానికి వస్తే గతేడాది నామినేషన్ల సమయంలో అధికారపార్టీ ప్రత్యర్ధుల మీద దాడి చేసి నామినేషన్లు వేయనివ్వకుండా బలవంతపు ఏకగ్రీవాలు చేయించిందనే ఆరోపణలు, విమర్శల మీద ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. గత ఎన్నికల కమిషనరు కొందరు పోలీసు, జిల్లా కలెక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఒక వేళ గత కమిషనరు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే నూతన కమిషనరు విమర్శల పాలవుతారు, చర్యలకు ఉపక్రమిస్తే మరోమారు ప్రభుత్వంతో కయ్యం పెట్టుకోవాల్సి వస్తుంది. కేంద్రానికి గత కమిషనరు రాసిన లేఖలో తన రక్షణ విషయాలతో పాటు ఎన్నికల్లో అక్రమాల గురించిన ప్రస్తావన కూడా ఉన్నందున ఆ లేఖను వెనక్కు తీసుకుంటారా లేదా అన్నది ప్రశ్న.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనాను వెనక్కు నెట్టి వైఎస్‌ జగన్‌ కక్ష కొరడాను తీస్తున్నారా !

14 Sunday Jun 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

instead of corona, tdp, ycp jagan, YS jagan, ys jagan targeting opposition

కరోనాను వెనక్కు నెట్టి వైఎస్‌ జగన్‌ కక్ష కొరడాను తీస్తున్నారా !
ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌తో సహజీవనం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కొద్ది వారాల క్రితం వ్యాఖ్యానించారు. ఆ వ్యాధి తీవ్రత గురించి అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో అసందర్భ వ్యాఖ్య చేసి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు కేసులు మరింత ఆందోళనకరంగా పెరుగుతున్నపుడు బతికిన వారు బతుకుతారు, చచ్చేవారిని ఎలాగూ ఆపలేము, మిగతా సంగతులు చూసుకుందాం అన్నట్లుగా పరిస్ధితి తయారౌతోందా అనిపిస్తోంది.
కోర్టుల్లో తగులుతున్న ఎదురు దెబ్బలు తమ ప్రజాపునాదిని దెబ్బతీసేవిగా లేవనే నిర్దారణకు వైసిపి నాయకత్వం వచ్చినట్లు కనిపిస్తోంది. జనం కులాల వారీ సమీకరణ అయినపుడు, భ్రమల్లో ఉన్నపుడు నిజమే అనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే కేసులు కోర్టుల్లో కొట్టి వేసినప్పటికీ ఏదో ఒక విధంగా ప్రతిపక్ష నేతలను కొంత కాలమైనా జైలు పాలు చేయాలనే ధోరణితో వైసిపి నాయకత్వం వున్నట్లు జనం అనుకుంటున్నారు. తెలుగుదేశం, వైసిపి, తెరాస వంటి ప్రాంతీయ పార్టీల్లో నాయకత్వమైనా, అనుచరులైనా అంతా ఒకరే. తెలుగుదేశంలో అంతా చంద్రబాబే, వైసిపిలో సర్వం జగన్మయం, ఏకోపాసన.
తెలుగుదేశం నేతలు పైకి బింకాలు పోవచ్చుగానీ మానసికంగా తామూ ఏదో ఒకనాడు ఏదో ఒక కేసులో శిక్షగా కాకున్నా కస్టడీలో అయినా ఏడు ఊచలు లెక్కపెట్టక తప్పదని చాలా మంది లోలోపల అనుకుంటూ ఉండాలి. అధికార రాజకీయం అన్న తరువాత దేన్నయినా భరించాలి మరి. ఏ కారణంతో జైలుకు వెళ్లి వచ్చినా మంచి చెడ్డలను చూడకుండా నీరాజనాలు పట్టే జనాలు ఎలాగూ ఉన్నారని నిర్ధారణ అయింది కనుక ఎవరూ జైలు గురించి ఆందోళనపడాల్సిన పనిలేదు. ప్రతిపక్ష పార్టీ నేతల ఆందోళనల్లా తమ కార్యకర్తలు, మద్దతుదార్లను ఎంత మేరకు నిలుపుకోగలమన్నదే.
కరోనా విషయంలో చేయాల్సిందేదో చేస్తున్నాం, ఇప్పుడు అవినీతి అంతానికి ప్రాధాన్యత ఇస్తున్నామని జనానికి కనిపించేందుకు, రాజకీయ రచ్చను కొనసాగించేందుకు వైసిపి పూనుకున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతల అరెస్టులు స్పష్టం చేస్తున్నాయి. ఉన్న సొమ్మును సంక్షేమ పధకాలకు ఖర్చు చేయటం, అభివృద్ధి పనులకు నిధుల లేమి అన్నది ఒక వాస్తవం. ఏడాది పూర్తి అవుతున్న సమయంలో కొంత మంది ఎంఎల్‌ఏలు, ఎంపీలలో వెల్లడైన అసమ్మతి అధికార పార్టీలో జరుగుతున్న మధనానికి చిహ్నం. అమృతం వస్తుందా హాలా హలం వస్తుందా ? దేన్ని ఎవరికి ఇస్తారు అన్నది వెండి తెరమీద చూడాల్సిందే.
చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని చెప్పుకొనేందుకు వినసొంపుగానే ఉంటుంది. అనేక ఉదంతాలలో కేసులు బనాయించటం తప్ప అంగుళం కూడా ముందుకు పోని స్ధితి తెలిసిందే. అంటే అవసరమైనపుడు వాటిని బయటకు తీస్తారు. మాజీ మంత్రి, ఎంఎల్‌ఏగా ఉన్న కె అచ్చన్నాయుడిని అరెస్టు చేయటాన్ని తప్పు పట్టనవసరం లేదుగానీ, తీరు కక్షపూరితంగా కనిపిస్తోంది. మైనర్‌ ఆపరేషన్‌ చేయించుకున్న అచ్చన్నాయుడికి స్వస్ధత చేకూరే వరకు, అంతగా అవసరం అయితే కొద్ది రోజుల పాటు గృహనిర్బంధంలోనే ఉంచి తరువాత చట్టపరంగా కోర్టుకు అప్పగించవచ్చు. దానికి బదులు అరెస్టు చేసి గంటల కొద్దీ తిప్పిన తీరుతో ఆపరేషన్‌ గాయం పెద్దది కావటంతో చివరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాల్సివచ్చింది. మరోమారు ఆపరేషన్‌ అవసరం లేదు అని వైద్యులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి స్ధితిలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయాల్సినంత అత్యవసరం ఆ కేసులో ఉందా అంటే నిస్సందేహంగా లేదు.
అనంతపురం జిల్లా మాజీ శాసనసభ్యుడు, తెలుగుదేశం నేత జెసి ప్రభాకర రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌ రెడ్డిని మోటారు వాహనాల కొనుగోలు అక్రమాల కేసులో అరెస్టు చేశారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు హాజరవుతానని చెప్పినప్పటికీ పిలవ కుండా కావాలని అరెస్టు చేశారని ఆయన చెబుతున్నారు.దానిలో వాస్తవం ఏమిటో ఎవరూ నిర్ధారణ చేయలేరు. అవినీతి, అక్రమాల కేసుల్లో ఉన్న ప్రతి నిందితుడు న్యాయస్ధానాల్లో రుజువయ్యేవరకు నిర్ధోషినని, కావాలని ఇరికించారనే చెబుతాడు.అప్రూవర్‌లుగా మారిన ఉదంతాలలో తప్ప ఇంతవరకు ఏ నేరగాడూ లేదా నేరగత్తె స్వచ్చందంగా నేరాన్ని అంగీకరించిన ఉదంతం మనకు సాధారణంగా కనపడదు. ప్రస్తుతం అనేక కేసులలో ముద్దాయిలుగా ఉన్న వారు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వారి వాదనలు ఏమిటో అందరికీ తెలిసిందే.
ఇఎస్‌ఐ అక్రమాల కేసుల్లో మంత్రిగా అచ్చెన్నాయుడి అవినీతి, మోటారు వాహనాల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో జెసి కుటుంబ సభ్యుల అవినీతి నిగ్గు తేలేవరకు వారంతా నిందితులే.అవసరమైతే జైలుకు పోవాల్సిందే. పదహారు నెలల పాటు జైల్లో ఉండి, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ విచారణకు హాజరుకావాల్సిందే అని కోర్టుతో చెప్పించుకున్న వైఎస్‌ జగన్మోహనరెడ్డే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. గతంలో వైసిపి నేతలు జైలు పాలయినపుడు ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు, ఇప్పుడు తమ నేతల అరెస్టుల గురించి ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేయటం సహజమే. గత ఐదు సంవత్సరాల పాలనలో వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేసులు దాఖలైతే మిగిలిన వారు కూడా రిమాండ్‌ లేదా జైలు పాలు కావచ్చన్న భయంలో వారిలో ఉండటం సహజం. తమ ఏలుబడిలో రాజకీయ ప్రత్యర్ధులను, సమస్యల మీద ఉద్యమించినందుకు తప్పుడు కేసులు పెట్టి సామాన్యులను ఎందరిని జైలు పాలు లేదా కస్టడీలకు పంపిందీ గుర్తుకు తెచ్చుకుంటే తెలుగుదేశం నేతలకు వారి మద్దతుదార్లకు కాస్త ఊరట కలుగుతుందేమో !
గతంలో కూడా అధికారంలో ఉన్నవారి మీద ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేయటం తెలిసిందే. అయితే వారు అధికారానికి వచ్చిన తరువాత వాటిని మరచిపోయినట్లు వ్యవహరించారు. కానీ ఇప్పుడు పరిస్ధితులు మారాయి. అధికారం కోసం ఎంతకైనా తెగించే ధోరణులు ప్రబలిన కారణంగా అంతే స్ధాయిలో కక్షలూ పెరిగాయి. ప్రతిపక్షంలో ఉండి తమను ఎదిరించిన వారిని ఆర్ధికంగా దెబ్బతీయటం, రాజకీయంగా అవమానించటం అనే కక్షపూరిత ధోరణులు దక్షిణాదిలో తొలుత తమిళనాడులో ప్రారంభమయ్యాయి.అధికార రాజకీయ కక్షలు ఎంత తీవ్రంగా ఉంటాయో,నీచ స్ధాయికి దిగజారుతాయో మాజీ ముఖ్యమంత్రి జయలలిత విషయంలో చూశాము. ఎంజిఆర్‌ మరణించినపుడు మృతదేహం దగ్గర ఆమెపై జరిగిన దాడి, గెంటివేత ఒకటైతే ఆ తరువాత రెండు సంవత్సరాలకు అసెంబ్లీలో ప్రతిపక్షనాయకురాలిగా ఉన్న ఆమెపై దాడి, చీరలాగివేసి అవమానించిన తీరు ఎరిగినదే. ఈ నేపధ్యంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎలాంటి పరిణామాలను చూడాల్సి ఉంటుందో !
ఇలాంటి కక్ష, దెబ్బతీసే ధోరణులు పపంచమంతటా ఉన్నాయి. అందువలన తమ నేతకు కక్ష సాధించే లక్షణం లేదని ఎవరైనా వైసిపి కార్యకర్తలు, నేతలు చెప్పుకుంటే అది ఆత్మవంచనే అవుతుంది. ముందే చెప్పుకున్నట్లు కేసుల్లో అరెస్టు చేయటం వేరు. అరెస్టు చేసిన తీరు విపరీతంగా ఉన్నపుడు దానిలో కక్ష పాలు లేదని ఎలా చెప్పగలరు ? అచ్చెన్నాయుడిని అరెస్టు చేయదలచుకుంటే సాధారణంగానే ఆపని చేయవచ్చు గానీ అర్దరాత్రి అంత హైడ్రామా ఆడాల్సిన పనిలేదు. సినిమాల్లో పేరు మోసిన బందిపోటు, గజదొంగలు, లేదా స్మగ్లర్లను పట్టుకొనే మాదిరి దృశ్యాలకు తెరతీయాల్సినపని లేదు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతల మీద ఇప్పటికే బనాయించిన కేసులు,రాబోయే కేసుల గురించి జనానికి ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒక సాధారణ అంశంగానే తీసుకుంటున్నారు. అందుకే మీడియా ముందు నేతలు గుండెలు బాదుకుంటున్నా అవన్నీ మామూలే అనుకుంటున్నారు. తెలుగుదేశం పాలనలో లేదా అంతకు ముందు కాంగ్రెస్‌ పాలనలో అవినీతి జరగలేదని ఎవరూ చెప్పటం లేదు సమర్ధించటమూ లేదు. అందుకు బాధ్యులైన వారు రాజకీయ నేతలైనా, వారికి సహకరించి వాటా పొందిన ఉన్నత అధికారులైనా సరే విచారణ, కేసులను ఎదుర్కోవాల్సిందే.
రాజకీయ నేతలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి లేకపోతే అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుందని యనమల రామకృష్ణుడి ఉదంతం తెలియచేస్తోంది. మాజీ ఎంఎల్‌ఏ పిల్లి అనంత లక్ష్మి కుమారుడికి యనమల స్వగ్రామంలో రెండవ వివాహం చేసేందుకు ఏర్పాటు చేయగా దానికి ఎనమలతో పాటు సోదరుడు కృష్ణుడు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. అది తెలిసిన అనంత లక్ష్మి కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ వివాహాన్ని నిలిపివేయించింది. ఆమె దళిత యువతి, తన భర్తకు రెండవ వివాహం చేయించేందుకు ప్రయత్నించారని, తనను బెదిరించారని ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార చట్టం కింద కేసుదాఖలు చేసింది. ఈ ఉదంతంలో పాలకపార్టీ పెద్దల ప్రమేయంతో ఆ యువతి కేసు దాఖలు చేసిందని తెలుగుదేశం నేతలు చెప్పుకోవచ్చు. ఒక వివాహంలో సమస్యలు వచ్చి విడాకులు తీసుకోకుండానే మరో వివాహం చేయటం, దానికి హాజరు కావటం ఒక అక్రమాన్ని ప్రోత్సహించటమే అవుతుంది. మాకు వివరాలు తెలియదు అంటే చట్టం అంగీకరించదు.
ఆర్ధిక మూలాలను దెబ్బతీసే ఎత్తుగడలు ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణాలో ప్రస్తుతం ఉన్న పాలకులు కొత్తగా ప్రారంభించినవేమీ కాదు. అంతకు ముందే నాంది పలికారు. దానిలో భాగమే ప్రతి పార్టీలో గెలిచిన నేతలను అధికారపక్షం వైపు ఆకర్షించటం లేదా పరోక్షంగా బెదిరించటం అన్నది బహిరంగ రహస్యం. ఇప్పటికే అవి పరాకాష్టకు చేరాయి. రానున్న రోజుల్లో సాధారణం అవుతాయి. ఎన్నికల్లో డబ్బు అన్నది ప్రధాన పాత్ర వహిస్తున్నందున ఓటర్లు కూడా నేతల నైతిక ప్రవర్తనకు బదులు జేబులను చూస్తున్నారు.ఇది పార్టీలు మారేందుకు, అధికారం ఎక్కడుంటే అక్కడకు చేరేందుకు రాజకీయనేతలకు మరింత వెసులుబాటు కలిగిస్తోంది.
గత పాలకుల అవినీతిపై కేసులు బనాయించటం, జైలు పాలు చేయటం రాబోయే రోజుల్లో ఏ పర్యవసానాలకు దారి తీస్తుంది ? అధికారపక్షంలో ఉన్నవారి అవినీతి మీద ప్రతిపక్షం నిరంతరం ఒక కన్నువేసి ఉంచుతుంది. ఎప్పటికప్పుడు బయటపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. అధికారగణం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అధికారపక్షం తన అవినీతిని కప్పి పుచ్చుకొనేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది, కొత్త పుంతలు తొక్కిస్తుంది.
వైఎస్‌ జగన్మోహనరెడ్డి, అనుయాయుల మీద ఉన్న కేసులు ఆశ్రిత పెట్టుబడిదారుల నుంచి లబ్దిపొందారన్న స్వభావం కలిగినవి. ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కొందరు పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలకు అనుచిత లబ్ది కలిగిస్తే దానికి ప్రతిగా జగన్‌ కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో ప్రతి లబ్ది కలిగించారన్నవి, మరికొన్ని ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు ఎదుర్కొనేవి స్వయంగా అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించినవి. ఏవైనా చిన్నవా, పెద్దవా అన్నది కాదు. అక్రమాలకు పాల్పడ్డారా లేదా అన్నదే అసలు సమస్య. కోట్లాది రూపాయలను అక్రమంగా వెనుకేసుకొని జైలుపాలైతే కుటుంబ సభ్యులు వాటిని దర్జాగా అనుభవిస్తారు. అలాంటి ఘరానా పెద్దలు జైల్లో ఉన్నా వారి భోగాలకు కొదవ ఉండదు. కొన్నేండ్లు జైల్లో ఉండి వచ్చినంత మాత్రాన సమాజంలో గౌరవానికి ఎలాంటి ఢోకా ఉండటం లేదు. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగవేసిన వారికి సంబంధించి ఆస్తుపాస్తులేవైనా ఉంటే వాటిని జప్తుచేసి ఎంతో కొంత రాబట్టేందుకు అవకాశం ఉంది. అవినీతి కేసులో ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయినా, లేదా కొన్ని కంపెనీలు, వ్యక్తులకు కట్టబెట్టినా ఆ మొత్తాన్ని రాబట్టినపుడే భవిష్యత్‌లో అవినీతికి పాల్పడే వారికి కాస్త బెరకు ఉంటుంది. అందుకు తగిన విధంగా వైసిపి ప్రభుత్వం బనాయిస్తున్న కేసులు ఉన్నాయా? ప్రజల సొమ్మును తిరిగి వసూలు చేసే సత్తా ప్రభుత్వానికి ఉందా అన్నదే ఇప్పుడున్న సవాలు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆనందం-విషాదం

16 Wednesday Mar 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

CHANDRABABU, Narendra Modi sarkar, NDA, special status to Andhra pradesh, Ycp, ycp jagan

ఢిల్లీలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లందనే నినాదంతో వునికిలోకి వచ్చిన పార్టీ అదే ఢిల్లీపై నోరు మెదపలేని స్థితిలో పడిందంటే నిజంగా ఎంత కష్ట కాలం వచ్చింది.బహుశా ఎన్‌టిరామారావు ఈ పరిస్థితిని వూహించి వుండరు.

ఎం కోటేశ్వరరావు

     ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో ప్రభుత్వం మీదా, శాసన సభాపతి మీదా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను చాకచక్యంగా తిప్పి కొట్టగలిగామని తెలుగుదేశం పార్టీలు శ్రేణులు చంకలు కొట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదూ ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా అరటి పండు వలిచి అరచేతిలో పెట్టినట్లుగా చెప్పటంతో తెలుగు తమ్ముళ్లలో ఆనందం ఆవిరై నీరు గారి పోతున్నారు. ప్రత్యేక హోదా లేదని ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అడుగుతూ విసిగిస్తున్నారు అర్ధం కాదా మీకు ముందు బయటకు పొండి అన్న రీతిలో కేంద్ర మంత్రి అరుణ్‌ జెట్లీ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం, బిజెపి ఎంపీలతో మాట్లాడినట్లు తెలుగు దేశం పార్టీకి అనుకూలమైన పత్రికలోనే వార్తలు వచ్చాయి. హాస్యాస్పదం, విచారకరం ఏమంటే అది జరిగిన మరుసటి రోజే అలా మాట్లాడితే ఎలా దొరా మంచి మనసు చేసుకొని మా సంగతి చూడండి, మరొక మాట చెప్పండి అన్నట్లుగా విభజస సమయంలో తమకు ఇచ్చిన హామీలు అమలు జరపాలని అధికార తెలుగుదేశం పార్టీ బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కంద్రానికి మరోసారి విన్నవించుకుంది. ఢిల్లీలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లందనే నినాదంతో వునికిలోకి వచ్చిన పార్టీ అదే ఢిల్లీపై నోరు మెదపలేని స్ధితిలో పడిందంటే నిజంగా ఎంత కష్ట కాలం వచ్చింది.బహుశా ఎన్‌టిరామారావు ఈ పరిస్థితిని వూహించి వుండరు.

     ముందుగా ఆనందం గురించి చూద్దాం. ఒకసారి నీతి తప్పిన తరువాత ఎన్నిసార్లు తప్పినా ఒకటే అని తెలుగు దేశం పార్టీ గత రెండు రోజులలో రుజువు చేసింది. తొలిసారి పడితే సిగ్గు. ప్రతిసారీ పడితే అది ఎబ్బెట్టుగా వుంటుంది. కనుక అసలు తొలిసారే సిగ్గు పడనివారు దాని స్థానంలో పండుగ చేసుకోవటంలో ఆశ్చర్యం ఏముంది. గతంలో కాంగ్రెస్‌,బిజెపి ఇతర పార్టీలు చేసినా ఇప్పుడు తెలుగుదేశానికి అయినా అది వర్తిస్తుంది. కాకపోతే సందర్భం తెలుగుదేశం పార్టీ గనుక దాని గురించి ముచ్చటించుకోక తప్పదు. ఇతర పార్టీల అజెండా,గుర్తులపై ఎన్నికైన వారు పార్టీ మారాలనుకుంటే తాము ఎన్నికైన స్థానానికి రాజీనామా చేసి ఇష్టమొచ్చిన పార్టీలో చేరవచ్చు. చేర్చుకొనే వారికి కూడా అభ్యంతరం వుండనవసరం లేదు. ఆ నీతికి కట్టుబడి వుంటే అయినట్లే అని వారూ వీరు అనుకోవటం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీలో చేరిన ఎనిమిది మంది వైసిపి సభ్యులను పార్టీలో చేర్చుకోవటమే రాజ్యాంగం, స్ఫూర్తికి కూడా విరుద్దం. వారిపై ఫిరాయింపు నిరోధక చట్టం వేటు పడకుండా వుండాలంటే అవిశ్వాస తీర్మానాలపై ఓటింగ్‌ సందర్బంగా వారు ఎన్నికైన పార్టీ విప్‌ జారీ చేయకుండా వుండేందుకు తగిన వ్యవధి లేకుండా తక్షణమే అనుమతించి ఓటింగ్‌ కూడా పెట్టి తీర్మానం వీగి పోయిందని సంతోషించారు. వెంటనే సభాపతిపై పెట్టిన అవిశ్వాసంపై అంతకంటే దారుణంగా ముందుగా అసలు నిబంధనలనే ఎత్తివేసి ఓటింగ్‌ పెట్టి రెండోసారి ‘ఘనవిజయం’ సాధించారు. మొదటిది చాణక్యం అనుకుందాం, మరి రెండవది ?

     ఒక తప్పుడు సాంప్రదాయం లేదా పద్దతికి తెరతీశారు. ఇలాంటి చర్య వలన సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు గౌరవం పెరగదు. గాంధీ పేరు గుర్తున్నంత కాలం గాడ్సే కూడా వుంటాడన్నట్లు పార్లమెంటరీ వ్యవస్ధలో చెడు సాంప్రదాయంతో గట్టెక్కిన స్పీకర్‌గా చరిత్రకు ఎక్కారు. స్పీకర్లు పాలక పార్టీకి చెందిన వారిగానే వుంటారు, పైకి ఏం చెప్పినా, నిబంధనలు ఎలా వున్నా పాలకపార్టీని కాపాడటానికి స్పీకర్లు తమ స్థానాలను వుపయోగిస్తున్నట్లు దాదాపు అన్ని శాసనసభల, పార్లమెంట్‌ అనుభవం. అందుకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ అతీతం కాదు. గతంలో తెలుగుదేశం అధికారంలో వుండగా స్పీకర్‌ ప్రవర్తన, దానిపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ రాజశేఖరెడ్డి ఎలా వ్యవహరించారో తెలియంది కాదు. తెలుగుదేశం ప్రతిపక్షంలో వుండగా కూడా అదేపని చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై దాడిలో భాగంగా ఆ పార్టీకి చెందిన స్పీకరుపై ప్రతిపక్ష వైసిపి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు అదే ఎత్తుగడలను వుపయోగిస్తోంది. వుత్తమ, చెడు సాంప్రదాయాల గురించి భవిష్యత్‌లో జరిగే చర్చలో అప్పుడు ఇప్పుడూ స్పీకర్‌గా ఎవరున్నారో వారిని ప్రస్తావిస్తారు తప్ప అలాంటి తప్పుడు సలహాలు చెప్పిన వారిని కాదు.

     నిజానికి తెలుగు దేశం పార్టీకి స్పీకరు స్థానాన్ని, దానిలో వున్న గౌరవనీయ సభ్యుడిని ఫణంగా పెట్టాల్సిన అవసరం వుందా ? ఫిరాయించిన వారి మద్దతు లేకపోతే ప్రభుత్వం నిలబడే స్థితి లేదా అంటే అలాంటిదేమీ లేదు. పాలకపార్టీలో లుకలుకలున్నాయా అంటే అదీ లేదు. అంతా సర్దుబాటే తప్ప కుమ్ములాట బాట అవసరం ఏముంది. ఎక్కడ అధికారం వుంటే అక్కడ అనుభవించి తరువాత ఎవరు అధికారానికి వస్తే అభివృద్ది పేరుతో ఆ పార్టీలో చేరటానికి, చేర్చుకోవటానికి తలుపులు బార్లా తెరిచి వుంటాయి గనుక భవిష్యత్‌కూ ఢోకా వుండదని ఫిరాయింపుదార్లు రుజువు చేశారు. అవిశ్వాస తీర్మానాలు పెట్టటం అన్నది పార్లమెంటరీ చరిత్రలో ప్రతిపక్షానికి వున్న ఒక హక్కు, అవకాశం. ప్రస్తుతం శాసనసభలో వున్న బలాబలాల రీత్యా వైసిపి పెట్టిన తీర్మానాలు ఓడిపోతాయని ఆ పార్టీకి తెలుసు, పాలకపక్షానికి తెలుసు. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలను ఎండగట్టటానికే ఈ అస్త్రాన్ని వాడతారు. అక్రమంగా పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వాలను కాపాడే క్రమంలో ప్రతిపక్ష పార్టీకి మరొక అస్త్రాన్ని అందించటంతప్ప ఇంత అప్రతిష్ట మూటగట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా వుత్తమ సాంప్రదాయలను నెలకొల్పాలని లేదా ముందుకు తీసుకుపోవాలని కోరుకొనే వారికి తప్ప ఈక్షణం గడిచిందా లేదా ప్రత్యర్ధిపై దెబ్బతీశామా లేదా అని చూసే వారికి విమర్శలు పట్టవు.

     ఇక రెండో అంశం విషాదం. చంద్రబాబుపై అవిశ్వాసం, స్పీకర్‌పై అవిశ్వాసంలో విజయ తెలుగుదేశం పార్టీకి ఆనందం, వైసిపి విషాదం క్షణ భంగురాలు. ప్రత్యేక హోదా గురించి మరింత వివరణ,స్పష్టత వచ్చింది కనుక తమ అవిశ్వాస తీర్మానాలు ఓడిపోయాయని, తమ పార్టీ జంప్‌ జిలానీలపై వేటు వేసే అవకాశం చేజారిందని వైసిపి నేతలు విషాదంలో మునగనవసరం లేదు. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యోగం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదారాదని, ప్రత్యేకంగా నిధులు కూడా రావని చంద్రబాబుకు, వెంకయ్య నాయుడికి తెలియని విషయం కాదు. ఆ విషయం తాము చెప్పకుండానే జనం గ్రహించాలని, తమపై ఎలాంటి ఆగ్రహం ప్రదర్శించకుండా చెవుల్లో పూలు పెట్టుకొని తలలాడించాలని వారు కోరుకుంటున్నారు. రాష్ట్ర విభజనే ఒక రాజకీయం. ప్రత్యేక హోదా మరొక రాజకీయం, ప్రతిదీ రాజకీయమే, ఒక్క సిపిఎం తప్ప ఎవరికి వారు ఈ రాజకీయంలో తమ వంతు పాత్రను రక్తి కట్టించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను తప్పుదారి పట్టించారు. మంగళవారం నాటి పార్లమెంట్‌ చర్చలో విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకుండా మోసం చేసిందని వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎదురుదాడికి దిగారు. నిజమే కాంగ్రెస్‌ మోసం చేసింది. ప్రత్యేక హోదా ఐదు కాదు పది సంవత్సరాలు కావాలని కోరిన వెంకయ్య అది చట్టంలో పొందుపరచలేదనే విషయాన్ని అప్పుడు ఎలా మరిచి పోయారు ? ఆ సమయంలో బిజెపి, తెలుగు దేశం ఎంపీలు ఏ గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారు? చిన్న పిల్లలేం కాదే, చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం చెప్పారే తప్ప ఒక కన్నును పొడుస్తుంటే ఎందుకు వూరుకున్నారు? పోనీ తరువాత అయినా చట్టాన్ని సవరించి ప్రత్యేక హోదాను చేర్చటానికి ఏ పార్టీ అడ్డుచెప్పింది? ఎందుకు ఆపని చేయలేదు. ఇప్పటికైనా చట్టసవరణ చేయవచ్చు కదా ?

    ఎందుకు గతంలో చేయలేదు, ఇపుడు చేయటం లేదంటే. రాష్ట్ర విభజన జరిగే సమయంలోనే 14వ ఆర్ధిక సంఘం ముసాయిదా తయారైంది. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించటాన్ని నిలిపివేయాలనే సిఫార్సు చేసే ఆలోచనలో వుంది. ఒక వేళ కాంగ్రెస్‌-బిజెపిలు ఆంధ్రప్రదేశ్‌ విషయంలో చట్టంలో చేర్చినా తరువాత వెలువడే ఆర్ధిక సంఘం సిపార్సులకు అది వ్యతిరేకం కనుక ఏ రాష్ట్రం అభ్యంతరం చెప్పినా, కోర్టుకు వెళ్లినా అది చెల్లదు. అందుకనే తెలివిగా దాని ప్రస్తావన లేకుండా చట్టం చేశారు. బిజెపి తెలిసి కూడా మౌనం దాల్చింది. తరువాత ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవకాశం లేకుండా ఆర్ధిక సంఘం సిపార్సులు అమలులోకి వచ్చాయి. అందువలన రాజకీయాలు తప్ప చట్ట సవరణ చేసే అవకాశం లేదు. ఒక వేళ చేస్తే అనేక రాజ్యాంగ సమస్యలు వస్తాయి. అందుకే ఎవడికి పుట్టిన బిడ్డరా అన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పట్ల వ్యవహరిస్తున్నారు.

    బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలోప్రత్యేక హోదా అమలుకోసం కేంద్రాన్ని అర్ధిస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో చంద్రబాబు నాయుడు ఎంతో వినమ్రతతో తన బాడీ లాంగ్వేజ్‌ను సవరించుకొని మాట్లాడారు. బిజెపి సభ్యుడు విష్ణుకుమార్‌ రాజు తమ కేంద్ర ప్రభుత్వాన్ని, అన్నింటికీ మించి తమ వెంకయ్య నాయుడిని జనం ఎక్కడ అపార్ధం చేసుకుంటారో అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం లక్షా 40వేల కోట్ల రూపాయల పాకేజి ఇచ్చిందని , ఏ విద్యా సంస్ధకు ఎన్ని వందల కోట్లు ఇచ్చిందో లెక్కలు చెప్పారు. ఆ మాటలు విన్నవారికి ఎవరికైనా అత్యాశ కాకపోతే ఇంకా ఎక్కడి నుంచి కేంద్రం ఇస్తుందనే భావం లుగుతుంది. అందుకే వెంటనే చంద్రబాబు నాయుడు చర్చమధ్యలో జోక్యం చేసుకొని అన్ని విద్యాసంస్థలకు కలిపి ఇప్పటికి ఇచ్చింది 172 కోట్లేనని, విష్ణుకుమార్‌ రాజు చెప్పే మొత్తాలు అవి పూర్తయ్యే నాటికి వస్తాయని అసలు విషయం చెప్పారు. అందువలన ఇప్పటివరకు చేసిన సాయం లేదా ప్రకటించిన సాయం గురించి అటు చంద్రబాబు ఇటు బిజెపి రెండూ కూడా అంకెల గారడీ చేస్తున్నాయి తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. ఇలాంటి తీర్మానాలు ప్రతి రోజూ పంపినా అవి నరేంద్రమోడీ చెత్తబుట్ట నింపటానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అదనపు ఖర్చు తప్ప మరొక ప్రయోజనం వుండదన్నది స్పష్టం. అందుకే రాష్ట్ర విభజన, ఆ సందర్భంగా ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్‌ యువతకు పెద్ద విషాదం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: