పబ్‌జీపై దాడిలో మోడీజీ నిజాయితీ ఎంత ?

చైనా కమ్యూనిస్టు దేశం, నియంతృత్వం ఉంటుంది, అక్కడ ఏమైనా చేయగలరు, మనది ప్రజాస్వామిక దేశం అక్కడ చేస్తున్న మాదిరి ఇక్కడ చేయటం కుదరదు అనే వాదన ఇటీవల అనేక సందర్భాలలో కొందరు ముందుకు తెస్తున్నారు. బాధ్యతను తప్పించుకొనేందుకు అదొక సాకు తప్ప మరొకటి కాదు. తప్పుదారి పడుతున్న పిల్లలను సరైన దారిలోకి తెస్తామంటే ప్రజాస్వామ్యం అడ్డుకుంటుందా ? ఒక వేళ అడ్డుకునేట్లయితే భావి తరాలను చెడగొట్టే అలాంటి ప్రజాస్వామ్యం మనకెందుకు ? పబ్‌జి యాప్‌ను నిషేధిస్తే చైనా కంపెనీ టెన్సెంట్‌కు లక్ష కోట్ల రూపాయల నష్టమని కొందరు చెబుతున్నారు. పదిశాతం వాటా ఉన్న కంపెనీకే అంతనష్టమైతే తనదని కూడా చూసుకోకుండా చైనా కమ్యూనిస్టులు దాన్ని నిషేధించారు. మరి మన ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు కొనసాగనిచ్చినట్లు ? పోతే పోనీయండి పిల్లలు ఏమైతే మాకేం అని పాలకులు అనుకుంటున్నారా ?

Continue reading