కమ్యూనిజం కంటే ముందే పుట్టిన కాపిటలిజం బతికి బట్టకట్టేందుకు అనేక ఎదురు దెబ్బలు తగిలినా నిరంతరం ప్రయత్నిస్తున్నపుడు దానిని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న కమ్యూనిజం మాత్రం తనకు తగిలిన ఎదురు దెబ్బ,అనుభవాల నుంచి ఎందుకు పాఠాలు తీసుకోకూడదు, కాలానుగుణంగా మారటం అంటే అవకాశవాదం కాదు, నవీకరించుకోవటం.
లాటిన్ అమెరికాలోని ఎల్ సాల్వడార్ లో 2009 నుంచి అధికారంలో వున్న కమ్యూనిస్టులతో కూడిన వామపక్ష ఫరబిందో మార్టి నేషనల్ ఫ్రంట్ (ఎఫ్ఎంఎల్ఎన్) ఏర్పడిన 35 సంవత్సరాల తరువాత తొలిసారిగా జాతీయ మహాసభను ఈ నెలాఖరులో జరుపుకోనుంది. కమ్యూనిస్టుల పయనం ఎలాంటి ఆటంకాలు లేని రహదారి మీద లేదా నల్లేరు మీద బండిలా సాగదని చెప్పేందుకే ఈ వుదాహరణ. కమ్యూనిజానికి దగ్గరదారులు లేవు. వుంటే ఈ పాటికి ఎప్పుడో అన్ని దేశాలలో వచ్చి వుండేది. జనాన్ని మోసం చేయటానికి ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి అన్నట్లుగా కేవలం అధికారం కోసమే జనాకర్షక నినాదాలు ఇవ్వటం కమ్యూనిస్టుల విధానం కాదు. కమ్యూనిజం కంటే ముందే పుట్టిన కాపిటలిజం బతికి బట్టకట్టేందుకు అనేక ఎదురు దెబ్బలు తగిలినా నిరంతరం ప్రయత్నిస్తున్నపుడు దానిని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న కమ్యూనిజం మాత్రం తనకు తగిలిన ఎదురు దెబ్బ,అనుభవాల నుంచి ఎందుకు పాఠాలు తీసుకోకూడదు, కాలానుగుణంగా మారటం అంటే అవకాశవాదం కాదు, నవీకరించుకోవటం. తొలి దశ పెట్టుబడిదారీ విధాన ఎత్తుగడలు, రూపానికి, వర్తమాన ఎత్తుగడలు, రూపానికి ఎంతో తేడా వుంది. కమ్యూస్టులలో కూడా అందుకు అనుగుణంగా మార్పు రాకుండా దాన్ని నాశనం చేయటం ఎలా సాధ్యం ?
ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమంలో వచ్చిన సైద్దాంతిక చీలిక ప్రభావంతోనే 1980కి ముందు ఎల్సాల్వెడార్లో ఐదు విప్లవ సంస్ధలుగా విప్లవకారులు చీలి వున్నారని గమనించాలి. అనుభవాలు, ప్రత్యేక పరిస్ధితులు వారిని ఐక్యపరిచాయి. మూడున్నర దశాబ్దాల తరువాత ఐక్య పార్టీ తొలి జాతీయ సభ జరుగుతోంది. అందువలన భారత కమ్యూనిస్టు వుద్యమంలో కూడా ఎవరి కి వారు ప్రత్యేకంగా కొనసాగుతూనే ఎల్సాల్వెడార్ మాదిరి అంగీకృత కార్యక్రమం మేరకు ఎందుకు కలసి పని చేయకూడదు.
ఈ పూర్వరంగంలోనే భారత్లోని వివిధ వామపక్షాలు, కమ్యూనిస్టు పార్టీలు నవీకరణ చెందటం అవసరం. ఎవరికి వారు తమ వైఖరే సరైనదనే పట్టుదలకు పోయినట్లయితే ఎల్ సాల్వడార్ వంటి చోట్ల అపూర్వ ఐక్యత సాధ్యమయ్యేది కాదు, ఆ దిశగా ఎందుకు ఆలోచించకూడదు ? లాటిన్ అమెరికాలో విప్లవ సాధనపై అనేక పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఆ కారణంగానే ఎవరికి వారు తమ పద్దతుల్లో కార్యకలాపాలు సాగించారు. అనేక అనుభవాల తరువాత ఎల్సాల్వెడార్లో వున్న పరిస్ధితులలో 1980లో ఐదు విప్లవ పార్టీలు ఎవరి రాజకీయ అవగాహనకు వారు కట్టుబడి వుంటూనే వుమ్మడి శత్రువును దెబ్బతీసేందుకు ఒకే నాయకత్వం, ఒకే గెరిల్లా వ్యూహం, ఒకే దళంగా వుండాలన్న స్ధూల ఏకాభిప్రాయానికి వచ్చారు. అ క్రమంలో ఆ సంస్ధలు ఐక్య కార్యక్రమానికి కట్టుబడి వుంటూనే తమ సంస్ధల భిన్న రాజకీయ విధానాలను కూడా సమీక్షించుకున్నాయి. పదమూడు సంవత్సరాల గెరిల్లా పోరాటం తరువాత 1992లో అక్కడి ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలకు వచ్చారు. ఆ తరువాత బహిరంగంగా పనిచేసే ఒక రాజకీయ పార్టీగా అవతరించింది. ఎన్నికలలో పాల్గొన్నది. చివరకు 2009లో వామపక్ష అభిమాని అయిన ఒక జర్నలిస్టును అధ్యక్షపదవికి నిలిపి విజయం సాధించింది. ఐదు సంవత్సరాల తరువాత గతేడాది జరిగిన ఎన్నికలలో స్వయంగా తన అభ్యర్ధిని నిలిపి విజయం సాధించింది. ఒక వామపక్ష పార్టీ ఇన్ని సంవత్సరాల పాటు జాతీయ సభను జరపకుండా ఐక్యతను కొనసాగించటం కమ్యూనిస్టులందరూ తీసుకోవలసిన పాఠం. దోపిడీ నుంచి సాల్వెడారియన్లును విముక్తి చేయాలన్న మహత్తర లక్ష్యమే ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వారిని ఐక్యంగా వుంచింది. మొత్తంగా ప్రపంచంలో సోషలిస్టు వ్యవస్ధలకు తగిలిన ఎదురుదెబ్బల పూర్వరంగంలో ఆ ఐక్యత మరింత పరిణితి చెందిందనటానికిది ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలి.
భారత కమ్యూనిస్టు వుద్యమంలో చీలికలు ఎందుకు అని ఆవేదన చెందే వారు ఎల్సాల్వెడార్ వంటి దేశాల అనుభవాలను తీసుకోవాల్సి వుంది. అంతే తప్ప కమ్యూనిస్టులు చీలిపోయారు కనుక భవిష్యత్ లేదని నిరాశకు లోనుకావాల్సిన అవసరం లేదు. మొదటి, రెండవ ప్రపంచ యుద్దాలలో జర్మనీ, జపాన్ సామ్రాజ్యవాదులకు తగిలిన ఎదురు దెబ్బలు సామాన్యమైనవా ?అయినా ఆ దేశాలు అస్త్రసన్యాసం చేశాయా ? లేదే , తమకు పోటీగా వచ్చిన అమెరికాను ఎదుర్కొనేందుకు తమదైన పద్దతుల్లో ప్రయత్నిస్తున్నాయా లేదా ? కమ్యూనిస్టులు మాత్రం అలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు ?ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమంలో వచ్చిన సైద్దాంతిక చీలిక ప్రభావంతోనే 1980కి ముందు ఎల్సాల్వెడార్లో ఐదు విప్లవ సంస్ధలుగా విప్లవకారులు చీలి వున్నారని గమనించాలి. అనుభవాలు, ప్రత్యేక పరిస్ధితులు వారిని ఐక్యపరిచాయి. మూడున్నర దశాబ్దాల తరువాత ఐక్య పార్టీ తొలి జాతీయ సభ జరుగుతోంది. అందువలన భారత కమ్యూనిస్టు వుద్యమంలో కూడా ఎవరి కి వారు ప్రత్యేకంగా కొనసాగుతూనే ఎల్సాల్వెడార్ మాదిరి అంగీకృత కార్యక్రమం మేరకు ఎందుకు కలసి పని చేయకూడదు. కాల క్రమంలో ఐక్యపార్టీగా అవతరించవచ్చు. ఐక్యతకు తొందర పడే వారు నేపాల్ పరిణామాలను విస్మరించకూడదు. కమ్యూనిస్టుల మధ్య ఐక్యత అనేది ఒక కార్యక్రమ ప్రాతిపదికగా మాత్రమే సాధ్యమౌతుంది.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన సమయంలోనే దేశాన్ని బ్రిటీష్ వారి నుంచి ఎలా విముక్తి చేయాలనే అంశంలో నాయకుల మధ్య భిన్న అభిప్రాయాలు వున్నాయి. ఆ మాటకు వస్తే అది ఒక్క కమ్యూనిస్టులకే పరిమితం కాలేదు. కాంగ్రెస్లోనూ తలెత్తాయి. సుభాష్ చంద్రబోస్ తీసుకున్న భిన్నవైఖరి, మార్గం గురించి వేరే చెప్పనవసరం లేదు. బ్రిటీష్ వారికి సలాం కొట్టిన కాషాయ దళ పెద్దల గురించి చెప్పుకోనవసరం లేదు. అందుకే నేటి బిజెపి లేదా అంతకంటే ముందున్న భారతీయ జనసంఫ్ులో గానీ జాతీయ వుద్యమంలో పాల్గొన్నవారెవరూ మనకు కనిపించరు. కమ్యూనిస్టులు తమకు ప్రమాదకారులుగా కనిపించారు గనుక ఆంగ్లేయులు వారిని మొగ్గలోనే తుంచేందుకు ప్రయత్నించారని ఇంతకు ముందే చెప్పుకున్నాము. వాస్తవానికి 1920 దశకంలో కమ్యూనిస్టుల కార్యకలాపాల కంటే వారి గురించి బ్రిటీష్ పాలకులు పడిన భయమే అధికారిక నివేదికల్లో ఎక్కువగా వుందంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ నాయకుడు బిపిన్ చంద్రపాల్ ‘వైష్ణవులు బృందావనానికి పోయివచ్చినట్లే బోల్షివిక్ు ఇండియాకు వస్తున్నారని’ రాశారంటే నాటి పరిస్ధితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. తొలి మూడు కేసులలో ఎక్కువ సంఖ్యలో అరెస్టు, శిక్షలువేశారు. మరో రెండు కేసులను పరిమితంగా ఒకరిద్దరిపై బనాయించారు. మొత్తం ఐదు పెషావర్ కుట్ర కేసులు 1927 వరకూ నడిచాయి. నిజానికి వారిపై ఎలాంటి కుట్ర రుజువు కాలేదు.
( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)
