• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: April 2020

ఐఆర్‌ఎస్‌ అధికారులపై వేటు: మోడీ బాబాకు అంత ఆగ్రహం ఎందుకు !

30 Thursday Apr 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

A stroke on IRS officers, CBDT, CBDT chargesheets three IRS officers, IRS officers, RBI

मोदी सरकार की 20 बड़ी 'उपलब्धियां ...

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ కారణంగా యావత్‌ ప్రపంచం, మన దేశం కూడా అత్యంత కష్టకాలంలో ఉంది. గతంలో ప్లేగు, కలరా వంటి మహమ్మారులు ప్రబలినపుడు జనం పెద్ద సంఖ్యలో దిక్కులేని చావులకు గురైయ్యారు తప్ప ఇంతటి ఆర్దిక విపత్కర పరిస్ధితి బహుశా మన దేశంలో ఇదే ప్రధమం కావచ్చు.
మన దేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యవ్యవస్ధ కలిగినది అని చెప్పుకుంటాం. అఫ్‌కోర్స్‌ ఆ వైఖరితో విబేధించేవారిని అనుమతించినంత కాలం అది ప్రజాస్వామిక వ్యవస్ధగానే ఉంటుంది. ఎవరైనా కొత్త ఆలోచనను ముందుకు తేవటం లేదా సూచనలు చేయటం తప్పుకాదు. దాన్ని చర్చించి లేదా చర్చించకుండానే పాలకులు పక్కన పెట్టేయవచ్చు. గతంలో అనేక మంది ఎన్నో విలువైన సూచనలు చేశారు. వాటిని పాలకులు చర్చించకుండానే పక్కన పెట్టారు. పాలకులు చేసిన అనేక ప్రతిపాదనలు, చర్యలను జనం తిప్పికొట్టారు. ఇది ప్రజాస్వామ్య సూత్రం. కానీ అసలు సూచన చేయటమే తలకొట్టివేసే తప్పిదం అన్నట్లుగా ఎవరైనా వ్యహరించటాన్ని ఏమనాలి?
దేశంలో ఇప్పుడు ఏం జరుగుతోంది? అరవైతొమ్మిది వేల కోట్ల రూపాయల పెద్దల రుణాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు సాంకేతికంగా రద్దు చేసినట్లు స్వయంగా రిజర్వుబ్యాంకే ఒక సమాచార హక్కు అర్జీదారుకు సమాధానమిచ్చింది. ఇదే విషయాన్ని గృహబందీకి ముందు ముగిసిన పార్లమెంట్‌ సమావేశాల్లో అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. రుణాల రద్దు గురించి వ్యాఖ్యలు చేసిన రాహుల్‌ గాంధీకి రద్దుకు అర్ధం తెలియకపోతే తమ నేత మన్మోహన్‌ సింగ్‌ను అడిగి తెలుసుకొమ్మని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో యాభై మంది ఐఆర్‌ఎస్‌ అధికారులు కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యల నిమిత్తం ఆదాయం పెంపుదలకు సూచనలు చేసినందుకు ఐఆర్‌ఎస్‌ అసోసియేషన్‌ నేతలుగా ఉన్న ముగ్గురు సీనియర్‌ అధికారుల మీద నరేంద్రమోడీ సర్కార్‌ వేటు వేసింది. ఈ ప్రతిపాదనలు దేశం కొంపను ముంచుతాయన్నట్లుగా చిత్రించింది. కొద్ది మంది కార్పొరేట్లకు, ధనికులకు లక్షల కోట్ల రూపాయల రుణాల రద్దు, రాయితీలు ఇచ్చినపుడు మునగని కొంప వారి నుంచి పన్ను రూపంలో తాత్కాలిక అత్యవసర చర్యగా కొన్ని లక్షల కోట్లు వసూలు చేస్తే ఎలాా మునుగుతుంది ? ఒక చర్యను అడ్డగోలుగా సమర్ధించుకున్న కేంద్రం మరొక చర్య మీద ఆగ్రహం వ్యక్తం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?
మన ప్రధాని నరేంద్రమోడీ ఒక్కసారి కూడా విలేకర్ల సమావేశంలో మాట్లాడకుండా మౌనవృతంలో ఇప్పటికే ప్రపంచ పాలకుల్లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు.కోవిడ్‌-19(కరోనా వైరస్‌) మహమ్మారి విషయంలో మోడీ బాబాగా మారుతున్న తీరు తెన్నులు బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రుల సమావేశాల్లో, ఇతరంగా దేశ ప్రజల నుద్దేశించి మాట్లాడిన సందర్భాలలో చెప్పిన మాటలు, ప్రవచనాలే అందుకు పెద్ద నిదర్శనం. వాటిని పునశ్చరణ చేస్తే భక్తులకు ఆగ్రహం, అంతకంటే చదువరులకు సమయం దండగ అవుతుంది. గృహబందీ ప్రకటించటం ద్వారా మోడీ తన తెలివి తేటలను అమోఘంగా వ్యక్తపరిచారని,జనం ప్రాణాలను కాపాడారని భజన చేస్తున్నవారి గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. చైనాలో మన కంటే రెండు నెలల ముందు అమలు జరిపిన గృహబందీని గుర్తు తెచ్చుకొంటే దాన్నే మన దేశంలో అమలు జరపటం అనితర ఆలోచన, పెద్ద గొప్ప అని ఎవరైనా అంటే ఎందుకు కాదు అని తలవంచుకొని పోవటం తప్ప వారితో వాదించి లాభం లేదు.
భారతీయ జనతా పార్టీ పెద్దలు దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా ఉంటారు. తమ మోడీ గనుకే జిడిపిలో మన దేశాన్ని ఐదవ స్ధానంలో తేగలిగారని ఊరూ వాడా వాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం ఏడవ స్ధానంలోకి తిరోగమించాం. అంతకంటే దిగజార్చలేదుక కనుక అదీ గొప్పేకదా అంటారేమో, దాన్ని కాసేపు పక్కన పెడదాం. కరోనా వైరస్‌ దాడిని ఎదుర్కొనేందుకు అనేక దేశాలు ఉద్దీపన పధకాలు ప్రకటిస్తున్నాయి. వాటిలో లోపాల గురించి లేదా కార్పొరేట్‌ రంగానికే పెద్ద పీట అన్న విమర్శలు-వాస్తవాల గురించి కూడా కాసేపు మరచిపోదాం. మన దేశం ఇంతవరకు ప్రకటించిన తక్షణ ప్రత్యక్ష ఉద్దీపన పధకం లక్షా 75వేల కోట్ల రూపాయలు మన జిడిపిలో 0.7శాతం. ఇదే సమయంలో తక్షణ ఉద్దీపన చర్యలకు గాను అమెరికా 9.1, జర్మనీ 6.9, బ్రిటన్‌ 4.5, ఫ్రాన్స్‌ 2.4శాతం ప్రకటించాయి. ఇవిగాక వాయిదా వేసిన, ఇతర ఉద్దీపనలు కూడా కలుపుకుంటే చాలా ఉన్నాయి. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకుంటున్న మనం వీటి సరసన ఎక్కడ ఉన్నాం, ఇంత తక్కువ ప్రకటిస్తే మన నాయకత్వాన్ని అంగీకరిస్తాయా ? ఎందుకు మూట ముడి విప్పటం లేదు, ఆ దేశాలకు మల్లే పరిస్ధితి విషమించిన తరువాత విప్పుతామంటారా ? మరోవైపు మన మోడీ గారి దోస్తు ట్రంప్‌ రెండవ పాకేజీ కూడా ప్రకటించారు. ఆయనకేం నవంబరులో ఎన్నికలున్నాయి కనుక రెండు కాదు నాలుగు ప్రకటిస్తాడు, మనకేం ఎన్నికలున్నాయి అంటారా ? అదైనా చెప్పండి, జనం ఆశలేమీ పెట్టుకోకుండా తిరిగి ఎన్నికలు వచ్చే వరకు తమదారి తాము చూసుకుంటారు. అసలు సమస్య ఏమిటి ?
మోడీ బాబా గారు ఇంతవరకు చేసిన ప్రసంగాలు, ప్రకటించిన కార్యక్రమాల్లో మన సంకల్పాన్ని ప్రదర్శించే చప్పుట్లు కొట్టటం, నూనె, కొవ్వొత్తి దీపాలు వెలిగించటం, విద్యుత్‌ దీపాలు ఆర్పించటం, రోజూ చేతులు కడుక్కోవాలనే అంశాలు తప్ప మరొకటేమీ లేవు. కావాలంటే ప్రతి రోజూ చప్పట్లు కొడదాం, దీపాలు వెలిగిద్దాం, సంకల్పాన్ని పదే పదే ప్రకటిద్దాం. కానీ అది చాలదే ! గృహబందీ పొడిగింపు, సడలింపులకు సంబంధించి ముఖ్యమంత్రులతో మాట్లాడటం తప్ప ప్రధాని నరేంద్రమోడీ లేదా కేంద్ర ప్రభుత్వం ఇతరంగా ఆర్ధిక పరిస్ధితి గురించి సూచనలు, సలహాలను కోరుతూ ముఖ్యమంత్రులతో లేదా ఇతరులతో ఎలాంటి ప్రత్యేక వీడియో సమావేశాలను నిర్వహించలేదు, సూచనలు పంపాలని కోరలేదు. మన ఖజానా పరిస్ధితి ఇలా ఉంది ఏం చేద్దామని అడిగితే కేంద్రానికి పోయేదేముంది ?
ఇక బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని కావాలని ఎగవేసిన యాభై సంస్ధల పెద్దలకు దాదాపు 69వేల కోట్ల రూపాయలను గతేడాది సెప్టెంబరు నాటికి రద్దు చేసినట్లు రిజర్వుబ్యాంకు వెల్లడించింది. ఇలాంటి మొత్తాలు దాదాపు ఎనిమిది లక్షల కోట్లు, ఇంకా ఎక్కువే ఉంటాయి. అయితే సాంకేతిక భాషలో చెప్పాలంటే వీటిని సాంకేతికంగా రద్దు చేయరు. వసూలు చేయాల్సిన పారు బాకీల కింద రోజువారీ చిట్టాల నుంచి తొలగించి తరువాత వసూలు చేసే ఖాతాలో చూపుతారు. అయితే మన ”సమర్ధ ” ప్రధాని మోడీ గారి ఏలుబడిలో ఈ మొత్తంలో ఎంత వసూలు చేశారన్నది ముఖ్యం. గత పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులను రద్దు చేస్తే ఆర్ధిక మంత్రి నిర్మలమ్మగారు సెలవిచ్చినదాని ప్రకారం కేవలం ”పక్కన పెడితే ” దానిలో 80శాతం నరేంద్రమోడీగారి ఏలుబడిలోనే జరిగింది. ఇవన్నీ ప్రతిపక్షాల బుర్రలో పుట్టినవి కాదు, రిజర్వుబ్యాంకు చెప్పిన లెక్కల ప్రకారమే నండోరు.కాంగ్రెస్‌ ఏలుబడిలో కావాల్సిన వారికి అప్పులు ఇప్పించారని చెప్పిన బిజెపి వారు అలాంటి కాంగ్రెస్‌ అనుకూలుర నుంచి గోళ్లూడగొట్టి ఎందుకు వసూలు చేయలేదు ? మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు వంటి వారందరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కాంగ్రెస్‌ నుంచి బిజెపిలో చేరటమే దీనికి కారణమా ? పక్కన పెట్టిన (రద్దు చేసిన) బాకీలను వసూలు చేస్తున్నామని బ్యాంకులు, ప్రభుత్వం చెబుతోంది. ఎన్ని లక్షల కోట్లు పక్కన పెట్టారు, ఎన్ని లక్షల కోట్లు వసూలు చేశారో ఎవరికైనా చెబుతున్నారా ? పది హేను నుంచి 20శాతం వరకు మాత్రమే వసూలు శాతం ఉందని ఒక అంచనా, దాని ప్రకారం, నరేంద్రమోడీ తొలి ఏలుబడిలో రద్దు చేసినట్లు చూపిన 5,55,603 కోట్లకు గాను కనిష్టంగా 80వేల కోట్లు, గరిష్టంగా అయితే లక్షా పదివేల కోట్లకు మించి లేవు, అంతకు ముందు రద్దు చేసిన మొత్తంతో సహా ఏడులక్షల కోట్లనుకుంటే లక్షా40వేల కోట్లకు మించి తేలటం లేదు. విజయమల్య తాను చెల్లిస్తాను మహాప్రభో అంటున్నా తీసుకోవటం లేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎంతకాలం వసూలును సాగదీస్తారు. వీరికి- వారికి పర్సెంటేజ్‌లు ఇంకా కుదరలేదా అని జనం అనుకుంటున్నారు.
బడా బడా బాబులకు వేల కోట్ల రుణాలు రద్దు చేశారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించినందుకు అది రద్దు కాదు, కావాలంటే మీ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను అడిగి తెలుసుకో అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్వీట్ల మీద ట్వీట్లతో సమాధానమిచ్చారు. అమ్మా నిర్మలమ్మా మీరు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజమే అనుకుందాం. అదే రీతిలో అనేక అంశాలకు మీరు కూడా నరేంద్రమోడీ గారిని అడిగి తెలుసుకొని జనానికి చెప్పాలమ్మా ? మచ్చుకు ఒక్కటి, నెలన్నరగా పెట్రోలు, డీజిలు రేట్ల సవరణ చేయకపోవటాన్ని ఏమనాలో కాస్త చెబుతారా ? అసలే ఉపాధిపోయి, ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న జనాన్ని లాక్‌డౌన్‌ సమయంలోనూ బాదటం లేదా, జేబులు కొల్లగొట్టటటాన్ని ఏమనాలి? గృహబందీకి ముందు చివరిగా మార్చి16న పెట్రోలు, డీజిలు రేట్లను సవరించారు. నాటి నుంచి నేటి వరకు ఎలాంటి సవరణ లేదు, ఈ మధ్య కాలంలో రికార్డు స్ధాయిలో ముడి చమురు రేట్లు పడిపోయాయి. అంతర్జాతీయ రేట్లు తగ్గితే తగ్గింపు, పెరిగితే పెంపు విధానం ప్రకారం ప్రతి రోజూ సవరిస్తామన్నారు కదా గత నెలన్నరగా ఎందుకు నిలిపివేశారు ? చమురు బిల్లు తగ్గింది, జనం దగ్గర వసూలు పెరిగింది, పోనీ ఆమేరకైనా జనానికి సంక్షేమ చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. డబ్బు పోగేసి ఎవరికి ధారాదత్తం చేయాలనుకుంటున్నారు, గతంలో కార్పొరేట్లకు ప్రకటించిన రాయితీలను ఈ విధంగా జనం నుంచి వసూలు చేస్తున్నారా ? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.
తొలిసారి ప్రకటించిన నామమాత్ర పాకేజి తప్ప మరోసారి ఆలోచన లేదని అన్ని తరగతుల నుంచి విమర్శలు వెల్లువెత్తినా దున్నపోతు మీద వానకురిసినా మిన్నకున్నట్లు ఏమీ మాట్లాడరు. ఐఆర్‌ఎస్‌ అధికారులు ఒక సలహా చెబితే వారినేతలను ఉద్యోగాల నుంచి పక్కన పెట్టి మీ మీద ఇతర చర్యలు ఎందుకు తీసుకో కూడదో సంజాయిషీ ఇవ్వండని నోటీసులు ఇచ్చారు. ఇదెక్కడి విపరీతం ? వారు తయారు చేసిన సిఫార్సుల పత్రాన్ని ప్రధాని, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు డైరెక్టర్లకు, ఆర్ధికశాఖకు పంపారు. అదే ప్రతిని మీడియాకు విడుదల చేశారు. యువ అధికారులను తప్పుదారి పట్టించారని, ఆ సూచన పత్రాన్ని అనుమతి లేకుండా బహిరంగ పరిచారు కనుక అది ఉద్యోగ నిబంధనలను అతిక్రమించటమే అంటూ ఈనెల 27వ తేదీలోగా రాతపూర్వకంగా లేదా స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటీసులు జారీ చేసింది. ముగ్గురు అధికారులను బాధ్యతల నుంచి తొలగించింది. ఈశాన్య ప్రాంత దర్యాప్తు విభాగం ముఖ్య డైరెక్టర్‌ సంజరు బహదూర్‌,ఐఆర్‌ఎస్‌ అధికారుల అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి,డిఓపిటి డైరెక్టర్‌ శ్రీ ప్రకాష్‌ దూబే, ఢిల్లీ ఆదాయపన్ను ముఖ్య కమిషనర్‌ మరియు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి అయిన ప్రశాంత భూషణ్‌ మీద చర్య తీసుకున్నారు. వారు చేసిందేమిటి ?
ప్రభుత్వం ఇచ్చిన సంజాయిషీ నోటీసు ప్రకారం దూబే, బహదూర్‌ ఆదాయపెంపుదల గురించి ఒక నివేదికను తయారు చేయమని తమ జూనియర్‌ అధికారులను కోరారు. ఆ నివేదికను ప్రశాంత భూషణ్‌ బహిర్గతం చేశారు. ఈ చర్యలు అనుమతి లేనివి, తమ విధులను పక్కన పెట్టి ఇతర పనులు చేయటంగా, ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకమైనవి వర్ణించారు. యువ అధికారులు తయారు చేసిన ఈ సూచనలను ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొని ఉండేది, కానీ ఈ ఉదంతంలో అధికారిక పద్దతుల్లో ప్రభుత్వానికి పంపకుండా బహిరంగ పరచటంతో ఇప్పటికే ఆర్ధిక వ్యవస్ధ వత్తిడికి గురైన స్దితిలో ఈ నివేదిక భయాందోళనలను, పన్ను విధాన అనిశ్చితి పరిస్ధితిని కలిగించిందన్నది ప్రభుత్వ పెద్దల వాదన. ఈ నివేదిక వివరాలు బయటకు వచ్చిన తరువాత భయంతో ఏ ఒక్క పారిశ్రామిక, వాణిజ్యవేత్త లేదా ఇతర ధనికులు భయంతో ఆత్మహత్యల వంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడినట్లు ఎలాంటి వార్తలు లేవు. ఏ విదేశీ కంపెనీ కూడా మన దేశం నుంచి బయటకు పోతామని, ఏ స్వదేశీ సంస్ధ కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించలేదు. కోట్లాది మందికి ఉపాధిపోయినా, వలస కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తీవ్ర ఆందోళనకు గురైనా, రాష్ట్రాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురైనా చీమ కుట్టినట్లుగా కూడా లేని కేంద్ర సర్కార్‌ ఈ ప్రతిపాదనల మీద ఎందుకు అంతలా వణికిపోయినట్లు ? అదృష్టం కొద్దీ వారు నివేదికను బహిర్గతం చేసిన సమయంలో మార్కెట్‌లు మూతపడి ఉన్నాయట. అతిశయోక్తి గాకపోతే స్టాక్‌ మార్కెట్‌ ఆ నివేదికకు ముందు ఎన్నివేల పాయింట్లు పతనమైందో జనానికి తెలియదా ? మరి దానికి కారకులెవరు ?
ఐఆర్‌ఎస్‌ అధికారులేమీ ధనికుల ఆస్ధులను స్వాధీనం చేసుకోమని చెప్పలేదే, కోటి రూపాయలకు పైబడిన ఆదాయం వస్తున్నవారి మీద ఆదాయపన్ను 40శాతం విధించాలని, నాలుగుశాతం కోవిడ్‌-19 సెస్‌ విధించాలని, ఐదు కోట్ల రూపాయలకు పైబడిన సంపదలు కలిగిన వారి మీద సంపద పన్ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. సంఘపరివార్‌ ప్రమాణాల ప్రకారం చూసినా ఇదేమీ దేశద్రోహం కాదు, సూచనలు చేసిన వారు తుకడే తుకడే గ్యాంగు అసలే కాదు, పోనీ వారు చెప్పినట్లు వసూలు చేస్తే వచ్చే సొమ్ము పాకిస్ధాన్‌ లేదా అది పంపే ఉగ్రవాదులకు పోయేది కాదు. సామాన్యులు, మధ్యతరగతి వారి నుంచి ఎంత వీలైతే అంత పిండి కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలు గత ఐదు సంవత్సరాలుగా అనుసరిస్తున్న పెద్దలకు దానికి భిన్నమైన ఇలాంటి ప్రతిపాదనలు కేంద్ర సర్వీసు ఉన్నతాధికారుల నుంచి రావటం మింగుడు పడలేదు. ఆగ్రహానికి కారణం ప్రతిపాదనలు చేసినందుకు కాదట, వాటిని బహిర్గత పరచినందుకట. ప్రతి రోజూ కేంద్రానికి ఇలాంటి అనేక ప్రతిపాదనలు వస్తుంటాయి, ఇంతవరకు ఎన్నింటిని బయట పెట్టారు. బహుశా తమ ప్రతిపాదనలు కూడా అలా బీరువాలకే పరిమితం అవుతాయని, బహిరంగ పరిస్దే చర్చిస్తారని భావించి బహిర్గత పరచి వుండవచ్చు. ఇలాంటి ప్రతిపాదనల మీద చర్చ జరిగితే లేదా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే ధనికులకు ఆగ్రహం కలుగుతుంది. అవును, ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో తాత్కాలికంగా కొంత కాలం అయినా ఎందుకు అమలు జరపరు అని కాస్త బుర్ర ఉన్న జనంలో చర్చ జరుగుతుంది. వాట్సాప్‌లో తప్పుడు ప్రచారం ఎంత జరిగినా పర్లేదు గానీ ఇలాంటి అంశాలు జనం మెదళ్లలోకి ఎక్కితే దాన్ని ” నయా లేదా కాషాయ దేశ భక్తులు ” తట్టుకోలేరు. అందుకే తమదైన శైలిలో ఐఆర్‌ఎస్‌ అధికారులను కొందరు అర్బన్‌ నక్సల్స్‌ అని నిందిస్తూ పోస్టులు పెట్టారు. ఎంత దుర్మార్గం ?
దేశంలోని 140 కోట్ల మంది జనాభాకు కోటీ 75లక్షల కోట్ల మేరకు ఉద్దీపన ప్రకటించిన కేంద్రం,అంతకు కొద్ది వారాల ముందు వేళ్ల మీద లెక్కించదగిన ధనికులకు లక్షా 45వేల కోట్ల రూపాయల పన్ను రాయితీ తగ్గించిన విషయం మరువగలమా ? కొత్త పరిశ్రమలకు పన్ను రేట్లు తగ్గించారు. ఆ విధానాన్ని ఐఆర్‌ఎస్‌ అధికారులు తప్పు పడుతూ బజారుకెక్కితే అది ఉద్యోగ నిబంధనలకు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కనుక చర్య తీసుకున్నామంటే అర్ధం ఉంది. వారా పని చేయలేదే ! దేశం, ప్రపంచం యావత్‌ ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ఎదుర్కొంటున్న సమయంలో ఉద్యోగా మరొకరా అన్నదానితో నిమిత్తం లేకుండా సూచనలు చేయటాన్ని కూడా మన ప్రజాస్వామ్య వ్యవస్ధ అంగీకరించదా ?దీన్ని ప్రజాస్వామ్యం అనాలో నియంతృత్వం అని వర్ణించాలో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు.

baba ji ka thullu by modi
నూరు పూవులు పూయనివ్వండి, నూరు ఆలోచనలను తర్కించనివ్వండి ఇది చైనాలో మావో ఇచ్చిన ఒక ఉద్యమ పిలుపు. చైనా ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారాలను, విధానాల మీద సవిమర్శలను వ్యక్తం చేయనివ్వాలన్న కమ్యూనిస్టు పార్టీ నిర్ణయాన్ని అమలు చేసేందుకు మావో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.(కొందరు నూరు పూవులు పూయనివ్వండి, వెయి ఆలోచనలను వికసించనివ్వండి అని కూడా దీన్ని వర్ణించారు. దీనిలో కూడా తప్పులేదు). అలాంటి ఆలోచనలను ఆహ్వానించిన కారణంగానే నేడు ప్రపంచంలో రెండవ ధనిక దేశంగా చైనా ఎదిగింది. సరే కొందరు కమ్యూనిస్టు నియంతృత్వం అని ఆరోపించే వారు, అది నిజమే అని నమ్మేవారు ఉన్నారు, రాబోయే రోజుల్లో కూడా ఉంటారు. ఇది చైనా వ్యవహారం కనుక పక్కన పెడదాం. మన దేశం విపత్కర పరిస్ధితుల్లో ఉన్నపుడు ఆదాయ పెంపు సూచనలు చేస్తే వాటితోనే దేశ ఆర్ధిక వ్యవస్ధ తలకిందులై పోతుందన్నట్లుగా భయపడటం అంటే గత ఐదేండ్లలో మన పెరుగుదల వాపా, బలుపా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా ”మందు” రెమిడెసివిర్‌ -కందకు లేని దురద కత్తి పీటలకా !

28 Tuesday Apr 2020

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

Remdesivir, remdesivir clinical trial, remdesivir clinical trial coronavirus facts and myths

Gilead says Remdesivir trial posted online prematurely was ...

ఎం కోటేశ్వరరావు
చైనాకు వ్యతిరేకంగా ఏ చెత్తను మార్కెట్లో పెట్టినా ఆమ్ముడవుతుందా ? కొన్ని మీడియా సంస్ధలు అలాంటి చెత్త వార్తలను అమ్మి సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాయా ? ఏమో ! చైనా ” మందు ” జాగ్రత్త అనే శీర్షికతో ఒక ప్రముఖ తెలుగు పత్రిక సోమవారం నాడు ఒక వార్తను ప్రచురించింది. తప్పుడు వార్తలు రాసేందుకు, రాయించేందుకు కూడా ” సమగ్రశిక్షణ ” అవసరం అని కాస్త జాగ్రత్తగా చదివిన వారికి అర్ధం అవుతుంది. ఇంతకూ ఏమిటట?
జనవరి 20న కరోనా వ్యాప్తిపై ప్రకటన, తరువాతి రోజే రంగంలోకి ” వూహన్‌ లాబ్‌ ”, రెమ్‌డెసివిర్‌ ఔషధం పేటెంట్‌కు దరఖాస్తు. ఈ అంశాల మీద ఆ కథను అల్లారు. వైరస్‌ వ్యాప్తి గురించి ఆరు రోజుల పాటు బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వమే మోకాలడ్డిందని ఇంకా ఏవేవో రాసిన వాటిని పునశ్చరణ చేయనవసరం లేదు. దీనర్ధం ఏమంటే వైరస్‌ పరిశోధనలు చేస్తూ దాన్ని ఒక పధకం ప్రకారం బయటకు వదలిన చైనాలోని వూహాన్‌ వైరాలజీ సంస్ధ దాని నిరోధానికి అవసరమైన ఔషధాన్ని కూడా ముందే తయారు చేసి పెట్టుకుందని జనాల బుర్రలకు ఎక్కించే యత్నమే.
ఈ వార్తను లండన్‌ నుంచి ప్రచురితమయ్యే డెయిలీ మెయిల్‌ డాట్‌కామ్‌ 25వ తేదీ బిఎస్‌టి(బ్రిటీష్‌ సమ్మర్‌ టైమ్‌) రాత్రి పది గంటలకు ప్రచురించింది. దానికి మనం నాలుగున్నర గంటలను కలుపుకుంటే మన సమయం రాత్రి రెండున్నర అవుతుంది. ఆ వార్త లేదా ఏదైనా ఏజన్సీ వార్తను గానీ తీసుకొని పైన చెప్పిన కథను వండి వడ్డించి ఉండాలి. దాని సంగతి తరువాత చూద్దాం. ముందుకొన్ని విషయాలు ఇక్కడ చెప్పుకోక తప్పదు. చైనా గురించి మీడియాలో వచ్చేది, దాని వ్యతిరేక దేశాల నేతలు, శాస్త్రవేత్తలు చెప్పేదంతా నిజమే అని నమ్మేవారు నమ్మవచ్చు. అలా నమ్మకాన్ని ఖరారు చేసుకొనే ముందు భిన్న కథనాలు కూడా ఉన్నాయని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సవినయ వినతి. అవన్నీ ఎక్కడ కుదురుతాయి… మా వీనులకు విందు, చెవులకు ఇంపుగా ఉండేది, బుర్రకు కిక్కునిచ్చేదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం అనే వారి నిజాయితీకి జోహార్లు.
కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ప్రకటనలు బయటకు రాగానే చైనా గూఢచారులు కెనడా లాబ్‌ నుంచి అపహరించి వూహాన్‌ లాబ్‌ నుంచి బయటకు వదిలారు, చైనా ప్రమాదకర జీవ ఆయుధాలను తయారు చేస్తోంది అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజంగా బయటకు వదల దలచుకొంటే కెనడా లాబ్‌ నుంచే చైనా గూఢచారులు బయటకు పంప వచ్చు కదా ! దున్న ఈనిందంటే ముందు దూడను గాటన కట్టేయమన్నట్లుగా చాలా మంది నమ్మేశారు. నిజంగానే ఎవరైనా ఒక వైరస్‌ను బయటకు వదిలితే దానికి సరిహద్దులు,దేశాలు, రంగు బేధాల తేడాలుండవు, ఎక్కడ అనువుగా వుంటే అక్కడకు పాకి తన ప్రభావం చూపుతుందనే లోకజ్ఞానం ఈ సందర్భంగా పని చేసి ఉంటే ఇప్పుడు కరోనా ప్రళయ తాండవానికి కకావికలౌతున్న దేశాలన్నీ జాగ్రత్తలు తీసుకొని ఉండేవి. లక్షలాది ప్రాణాలను కాపాడేవి. కొంత మంది కావాలని కాదు గానీ ప్రమాదవశాత్తూ బయటకు వచ్చి ఉంటుందని సన్నాయి నొక్కులు నొక్కుతూ నమ్మింపచేసేందుకు ప్రయత్నించారు. ప్లేగు, మసూచిని కావాలని అంటించిన దేశాలను, రసాయన బాంబులు, గ్యాస్‌లో జనాన్ని మట్టు పెట్టిన దుర్మార్గాన్ని ప్రపంచం చూసింది. ఒక వైరస్‌ను సృష్టించి వదలిన దేశం గురించి చరిత్రలో నమోదు కాలేదు. కొన్ని అనుమానాలు వ్యక్తం అయినా ఎక్కడా రుజువు కాలేదు. ఒక కొత్త వైరస్‌ తొలుత ఎక్కడ బయటపడితే దాన్ని ఆదేశమే తయారు చేసింది అనే నిర్ధారణకు వచ్చేట్లయితే ఆ వరుసలో చైనా కంటే ముందు అనేక దేశాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి ఇంతకు ముందే తెలుసు. తాజాగా తలెత్తిన కోవిడ్‌-19 వైరస్‌ కొత్తరకం అని కృత్రిమ సృష్టి కాదని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధ, అనేక మంది ఆ రంగంలో పని చేస్తున్నవారు ప్రకటించినా, కొందరు పని గట్టుకొని చేస్తున్న ప్రచారానికి మీడియా ఎలాటి విమర్శనాత్మక దృష్టి లేకుండా ఏకపక్షంగా ప్రాధాన్యత ఇస్తోంది.
రెండవ అంశం ఈ వైరస్‌ను అమెరికన్లే తయారు చేసి తమ దేశం మీద ప్రయోగించినట్లు అనుమానిస్తున్నట్లు చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఒక విమర్శ చేశాడు. అమెరికా మిలిటరీ దాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నాడు. అమెరికాలోని మేరీలాండ్‌లో ఉన్న ఫోర్ట్‌ డెట్‌రిక్‌ అమెరికా మిలిటరీ లాబ్‌ నుంచి వైరస్‌లు బయటకు రాకుండా నివారించేందుకు తగిన రక్షణ ఏర్పాట్లు లేనందున ఏడాది క్రితమే దాన్ని మూసివేశారని వెంటనే వార్తలు వచ్చాయి. అయితే తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేశారు తప్ప మూసివేయలేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రకటించింది.
ఇక రెమిడెసివిర్‌ ఔషధం కధను చూద్దాం. కరోనా వైరస్‌ కొత్తది కాదు, గతంలోనే గుర్తించారు. దానిలో అనేక రకాలు ఉన్నాయి. తాజాగా తలెత్తినదానిని కోవిడ్‌-19 అని పేరు పెట్టారు. గతంలో తలెత్తిన కరోనా వైరస్‌, ఇతర వైరస్‌లకు వ్యాక్సిన్‌లు, ఔషధాలు తయారు చేసే సంస్ధలు ఎన్నో గతంలోనే పేటెంట్లకు దరఖాస్తులు చేశాయి. అంటే అవి ముందే మందులను తయారు చేసి వైరస్‌ను ఇప్పుడు సృష్టించాయని భావించాలా ? కుట్ర సిద్దాంతాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే కోవిడ్‌-19ను అమెరికానే సృష్టించిందని అనుకోవాలి? అది అలాంటి ప్రయత్నాలు చేయకపోతే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గిలీడ్‌ కంపెనీ నాలుగు సంవత్సరాల క్రితమే కరోనా వైరస్‌ చికిత్సకు రెమిడెసివిర్‌ను అనుమతించాలని పేటెంట్‌కు దరఖాస్తు ఎందుకు చేసినట్లు ? ప్రపంచ వ్యాపితంగా వినియోగించేందుకు నాలుగు సంవత్సరాల క్రితమే దరఖాస్తు చేసినట్లు గిలీడ్‌ కంపెన చెప్పినట్లు డెయిలీ మెయిల్‌ రాసింది. కోవిడ్‌-19కు అది పని చేస్తుందని తేలితే భవిష్యత్‌లో సరఫరా చేసేందుకు గాను ప్రస్తుతం చికిత్సలో దాని పని తీరును నిర్ధారించుకునే పనిలో ఉన్నామని గిలీడ్‌ చెబుతోంది. నిజానికి ఆ ఔషధాన్ని ఎబోలా వైరస్‌కోసం గిలీడ్‌ తయారు చేసింది. ఇది కరోనాకూ పని చేస్తుందేమో అని అది నిర్ధారించుకుంటోంది. అదే ఔషధం తయారీకి తమకు పేటెంట్‌ ఇవ్వాలని ఊహాన్‌ వైరాలజీ సంస్ధ జనవరి 21న దరఖాస్తు చేసిందట. అది నిజంగా కరోనా కోసమో కాదో తెలియదు, కరోనా కోసమే అయితే ఏ తరగతి కోసమో అంతకంటే తెలియదు, దరఖాస్తులోని వివరాలు ఏడాది తరువాత గానీ బయటకు రావు. అలాంటిది ముందే కరోనా మందుకు పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసినట్లు ఏ ఆధారాలతో రాస్తారు ? ఒక వేళ నిజంగానే రెమ్‌డెసివిర్‌కు చైనా సంస్ధ దరఖాస్తు చేస్తే అంతకు ముందే ఉన్న గిలీడ్‌ కంపెనీకి ఇవ్వకుండా చైనా సంస్ధకు ఎలా ఇస్తారు ? నిజంగా ఆ ఫార్ములాను ఎవరైనా తస్కరిస్తే మరొక పేరుతో దరఖాస్తు చేస్తారు తప్ప అదే పేరుతో ఎలా చేస్తారు ? మరీ అంత అమాయకంగా ఎవరైనా ఉంటారా ? ఎప్పుడో నాలుగేండ్ల క్రితం దరఖాస్తు చేసిన దానికే ఇంతవరకు అనుమతి రాకపోతే జనవరిలో చేసిన దానికి వెంటనే అనుమతి ఎలా వస్తుంది ? ఇదంతా చూస్తే కందకు లేని దురద కత్తిపీటకు అన్నట్లు గిలీడ్‌ కంపెనీ తాపీగా ఉన్నా జర్నలిస్టులు కొందరు గోక్కుంటున్నారు.
ఇక రెమ్‌డెసివవిర్‌ గత కొద్ది వారాలుగా వార్తల్లో ఉంది. ఆ ఔషధాన్ని తయారు చేశారు గానీ ఎక్కడా ఉత్పత్తి చేయటం లేదు. ఎబోలా కోసం తయారు చేసిన దానిని ఇప్పుడు కరోనాకు ఉపయోగపడుతుందేమో చూద్దాం అన్నట్లుగా గిలీడ్‌ కంపెనీ ఉంది.కోవిడ్‌-19 రోగులు 63 మంది మీద ప్రయోగిస్తే 36 మందికి కాస్త గుణం కనిపించిందని, ఇంకా ప్రయోగదశలోనే ఉందని, ప్రపంచంలో ఎక్కడా చికిత్సకు అనుమతించలేదని కంపెనీ సిఇఓ డేనియల్‌ ఓడే ఏప్రిల్‌ 10న ప్రకటించినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్త పేర్కొన్నది.ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఫలితాలు వెల్లడైన తరువాత వినియోగం గురించి పరిశీలిస్తామని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్‌) శాస్త్రవేత్త రామన్‌ గంగా ఖేద్‌కర్‌ చెప్పారు. 2015లో ఇదే కంపెనీ తయారు చేసిన హెపటైటిస్‌ సి ఔషధం గురించి చేతులు కాల్చుకున్న ఐసిఎంఆర్‌ అంత రెమ్‌డెసివర్‌ గురించి ఆసక్తి ప్రదర్శించటం లేదని కూడా వార్తలు వచ్చాయి. పనికి వచ్చేట్లయితే జనరిక్‌ ఔషధం తయారు చేసేందుకు గిలీడ్‌ కంపెనీ స్వచ్చందంగా అనుమతిస్తే తయారు చేయవచ్చని కొందరు అంతకు ముందు ఆలోచన చేశారు. మరికొన్ని వార్తల ప్రకారం ఇదే ఔషధంపై చైనాలోని రెండు ఆసుపత్రులలో 28 మగ చిట్టెలుకల మీద ప్రయోగాలు జరపగా వాటిలో వీర్య కణాల సంఖ్య తగ్గినట్లు, అసహజత పెరిగినట్లు ప్రాధమిక పరశీలనల్లో వెల్లడైంది.దీని గురించి ఎలాంటి నిర్దారణలకు ఇంకా రాలేదని ఏప్రిల్‌ 23న ఒక వెబ్‌సైట్‌ పేర్కొన్నది. ఇలాగే అమెరికా, బ్రిటన్‌, మరికొన్ని దేశాలలో కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది కోవిడ్‌-19కు పని చేయదని తేలినట్లు గిలీడ్‌ కంపెనీ గతశుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపిందని కూడా వార్తలు వచ్చాయి.
చైనా దరఖాస్తు గురించి తమకు తెలుసునని, అయితే వచ్చే ఏడాది ఆ వివరాలను ప్రచురించేంత వరకు దాని గురించి తామేమీ చెప్పలేమని గిలీడ్‌ చెప్పింది. ఎబోలాకు తయారు చేసిన తమ ఔషధం కరోనాకు పనికి వస్తుందా లేదా అన్న అధ్యయనాన్ని నిలిపివేసినట్లు కూడా పేర్కొన్నది. ఒక కంపెనీ తయారు చేసిన దాన్ని మరొక దేశంలో పేటెంట్‌ కోరినా మంజూరు కాదు.గిలీడ్‌ కంపెనీ తమ ప్రయోజనాలకు భంగం కలుగుతోందని ఫిర్యాదు అయినా చేసి ఉండేది, ఒక వేళ అదే నిజమైతే ఈ పాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశ కంపెనీ తయారు చేసిన దాన్ని చైనా తస్కరించిందని ఈ పాటికే నానా యాగీ చేసి ఉండేవాడు. బహుశా ఈ ఔషధ ప్రయోగాల గురించి చెప్పి ఉంటే అది నిజమని నమ్మి కొద్ది రోజుల్లో వాక్సిన్‌ తయారు చేయాలని రెండు నెలల క్రితం ట్రంప్‌ బహిరంగంగా విలేకర్ల సమావేశంలో చెప్పాడని అనుకోవాల్సి వస్తోంది. కోవిడ్‌ -19 చికిత్సకోసం అమెరికా, ఐరోపాల్లో వాక్సిన్ల పేటెంట్‌ గురించి నంబర్లతో సహా సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతోంది. ఎఎఫ్‌పి వార్తా సంస్ధ వాటి గురించి నిర్ధారణ చేసుకొని అవన్నీ నకిలీ అని తేల్చింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా వైరస్‌ ముట్టడి – రక్షణ కరవైన కర్షకులు !

25 Saturday Apr 2020

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

COVID- 19 pandemic Agriculture, Covid-19 lockdown, India’s farmers, India’s farmers feed produce to animals

Saving the food value chain amid Covid lockdown - The Hindu ...

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ ప్రపంచానికి కునుకు లేకుండా చేస్తోంది. కర్షకులను అయోమయంలోకి నెడుతోంది. ఎటు నుంచి ఎవరి మీద దాడి చేస్తుందో తెలియని స్ధితి. కనిపించే, చేతికి చిక్కే శత్రువుతో పోరాడగలం గానీ వైరస్‌లు సాధారణ కంటికి కనపడవు, ఉన్న ఔషధాలతో అంతం కావు. ఒక దానికి వ్యాక్సిన్‌ తయారు చేస్తే అది మార్కెట్లోకి వచ్చే సరికి వైరస్‌లు తమ స్వభావాన్ని మార్చుకోవటంతో ప్రయోజనం లేకుండా పోతోంది. కరోనా కూడా అలాంటిదే, ఇప్పటికి 33 మార్పులకు లోనైనట్లు గుర్తించారు. ఇంకా ఎన్ని విధాలుగా మారి ప్రపంచం మీద దాడి చేయనుందో తెలియదు. అంతిమంగా ఏ వైరస్‌ను అయినా అదుపు చేయగలం లేదా అది బలహీనమై పోయి మానవ శరీరాల చేతిలోనే చావు దెబ్బలు తింటుందన్నది గత చరిత్ర. అయితే ఇప్పుడు కరోనా నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియదు. మే మూడవ తేదీతో గృహబందీ(లాక్‌డౌన్‌) ఎత్తివేస్తారని భావిస్తున్నప్పటికీ ఇది రాస్తున్న సమయానికి వైరస్‌ వ్యాప్తిని చూస్తే కొన్ని సడలింపులు ఉన్నప్పటికీ మే నెలాఖరు వరకు, పరిస్ధితి విషమిస్తే తరువాత కూడా కొనసాగవచ్చన్నది ఒక అభిప్రాయం. ఇప్పటికే అనేక విధాలుగా నష్టపోయిన రైతాంగానికి ఏరువాక దగ్గరపడుతుండటంతో ఏమి చేయాలో తోచని స్ధితి అంటే అతిశయోక్తి కాదు.
కరోనా మహమ్మారి ప్రపంచం మీద ఎలా పర్యవసానాలకు నాంది పలుకుతుందో, అవి ఏవిధంగా ఉంటాయో వైరస్‌ తీరుతెన్నుల మాదిరే తెలియటం లేదు. క్షణ క్షణానికి వైరస్‌ రోగులు, మరణాల సంఖ్య మారుతున్నట్లే ఒక రోజు వేసిన అంచనాలు మరో రోజుకు పాతబడి పనికి రాకుండా పోతున్నాయి. వ్యవసాయ రంగం మీద ప్రభావాలను ఈ సందర్భంగా చూద్దాం. మన దేశంలో 50 నుంచి 60శాతం వరకు జనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. సరిగ్గా పొలాల నుంచి వివిధ పంటలు ముఖ్యంగా రబీ, దోఫసలీ(దీర్ఘకాల) పంటలు రైతుల ఇండ్లకు వచ్చే సమయంలో వైరస్‌ వ్యాప్తి కారణంగా గృహబందీని ప్రకటించారు. ఫలితంగా రైతాంగం, వారి మీద ఆధారపడిన వ్యవసాయ కూలీలు తీవ్రంగా ప్రభావితులయ్యారు. పంటలను కోసే దిక్కు లేకుండా పోయింది కొన్ని చోట్ల, యంత్రాలు ఒక ప్రాంతం నుంచి మరోచోటికి తరలే అవకాశాలు లేక కూలీల కొరత ఏర్పడింది. కొన్ని చోట్ల చెరకు, మిర్చి కోతలకు వచ్చిన వలస లేదా అతిధి కూలీలు సీజను ముగిసి తమ ప్రాంతాలకు వెళ్లే సమయంలో ఎక్కడికక్కడ చిక్కుకు పోయారు. అకాల వర్షాల కారణంగా కళ్లాల్లో ఉన్న ధాన్యం, మిర్చి వంటికి తడిచిపోయాయి. పండ్లు కోసేవారు, కోసినా మార్కెట్లకు తరలించే సదుపాయాల్లేక చెట్ల మీదనే పండిపోతున్నా రైతాంగం గుడ్లప్పగించి చూస్తూ వదలివేయటం తప్ప మరొకటి చేయలేని స్ధితి.అన్ని చోట్లా ఏ పంటకూ కనీస మద్దతు ధర రావటం లేదు. ముఖ్యంగా పంట్ల తోటల రైతాంగ పరిస్ధితి దారుణంగా తయారైంది. పంటలు కాస్త బాగా పండాయి అనుకున్న స్ధితిలో గృహబందీ దేశంలోని 14 కోట్ల రైతు కుటుంబాలకు పిడుగుపాటులా మారింది.
మన దేశ వ్యవసాయ రంగంలో పరిస్ధితిని చూద్దాం. కరోనా వైరస్‌ రాక ముందే గతేడాది మధ్య నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ముఖ్యంగా ఉల్లి, బంగాళాదుంపలు, కూరగాయల వంటి వాటి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుదల నమోదు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉల్లి ధరలు తగ్గినా మిగతావి తగ్గలేదు. తరువాత కరోనా కారణంగా డిమాండ్‌ బలహీనపడి ద్రవ్యోల్బణం తగ్గవచ్చని మార్చి 27న ఆర్‌బిఐ ఒక నివేదికలో పేర్కొన్నది. 2018-19 కంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి 2019-20లో 2.4శాతం పెరిగి 29.2 కోట్ల టన్నులకు పెరగవచ్చని అంచనా. మార్చి ఒకటవ తేదీ నాటికి భారత ఆహార సంస్ధ వద్ద7.76 కోట్ల టన్నుల ధాన్యం నిలవ ఉంది. వ్యూహాత్మక, అత్యవసరాలకోసం అవసరమైన 2.14 కోట్ల టన్నుల కంటే ఇవి మూడు రెట్లు ఎక్కువ. రబీ పంట సేకరణ కూడా జరిగితో మరో మూడు కోట్ల టన్నులు పెరుగుతాయని అంచనా.

Flower trade wilts under lockdown across the country - The Hindu ...
దేశంలో భిన్నమైన వ్యవసాయ ప్రాంతాలు ఉన్నాయి. పంటలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వివిధ తరగతులకు ప్రకటించిన ఉద్దీపన లక్షా 70వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఇది జిడిపిలో కేవలం 0.7శాతమే. కనీసం ఐదు నుంచి పదిశాతం వరకు సాయం చేయాలన్న సూచనలను కేంద్రం పట్టించుకోలేదు. అంతకు మించి రైతు ప్రతినిధులతో కనీసం చర్చలే జరపలేదు. అడిగితే ఎంతో కొంత సాయం చేయాల్సి వస్తుందన్న కారణంతో గావచ్చు రాష్ట్రాలను ప్రతిపాదనలు పంపమని కూడా అడగలేదు. కేంద్ర ప్రకటించిన మొత్తంలో ఇరవైవేల కోట్ల రూపాయలు గతంలోనే ప్రకటించి పిఎం కిసాన్‌ పధకం కింద మూడు విడతలుగా అందచేసే ఆరువేల సాయంలో మొదటి విడత రెండు వేల రూపాయలను ముందుగా విడుదల చేయటం తప్ప అదనపు సాయం కాదు. ఇక వ్యవసాయ కూలీలకు పని లేకుండానే స్వల్ప మొత్తంలో 182 నుంచి 202కు వేతనం పెంచి అదే పెద్ద సాయం అన్నట్లుగా చిత్రించారు. వచ్చే మూడు మాసాలకు అదనపు ఆహార ధాన్యాలు, జనధన్‌ ఖాతాలున్న వారికి నెలకు ఐదువందల రూపాయల చొప్పున మూడు నెలలపాటు ఇస్తామని ప్రకటించారు. ఇవిగాక పిఎం కేర్‌ నిధుల నుంచి వలస, అసంఘటిత కార్మికులకు మరికొంత సాయం చేస్తామని చెప్పారు. ఇవి అవసరాలతో పోలిస్తే నామమాత్రమే. రైతాంగ రుణాలకు సంబంధించి మూడు లక్షల రూపాయల వరకు మూడు శాతం వడ్డీ రాయితీతో రుణాలను మే31వరకు మూడునెలలు వసూలు వాయిదాను ప్రకటించారు. అసలు పంటలే అమ్ముకోలేని స్ధితి, అమ్ముకున్నా కనీస మద్దతుధరల కంటే వందల రూపాయలు తక్కువగా అమ్ముకోవాల్సి వస్తున్న రైతాంగానికి ఇవి కంటి తుడుపు మాత్రమే.
ఈతి బాధలు, కరోనా వంటి మహమ్మారులు తలెత్తినపుడు మన దేశంలో ముందు ప్రభావితులౌతున్నది రైతాంగంలో 85శాతంగా ఉన్న సన్న, చిన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు, చేతి వృత్తులు దెబ్బతిని వ్యవసాయ కూలీలు, ఇతర పనులకు మరలిన పేదలే అన్నది స్పష్టం. ఫ్యాక్టరీలు, కార్యాలయాల్లో పని చేసే వారికి కొంతమందికైనా ఏదో ఒక సామాజిక రక్షణ ఉంటుంది. గ్రామీణ కార్మికులకు అవేమీ ఉండవు. కరోనా ఉద్దీపన పేరుతో తీసుకుంటున్న చర్యలు మొత్తంగా వట్టిస్తరి మంచినీళ్లు తప్ప మరొకటి కాదన్నది తేలిపోయింది. పాస్ఫరస్‌, పొటాసియం ఉండే ఎరువులకు రూ.22,186 కోట్ల రూపాయల మేర సబ్సిడీ ఇవ్వనున్నట్లు గృహబందీ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అనేక మంది ఇది బడ్జెట్‌లో ప్రకటించిన దానికి అదనం అనుకుంటున్నారు, కానే కాదు. ప్రతి ఏడాది ఎరువులకు ఇస్తున్న సబ్సిడీ మొత్తాలు 75వేల కోట్ల రూపాయలకు మించటం లేదు. దానిలోనే ఒక ఎరువుకు తగ్గించినా, మరొకదానికి పెంచినా సర్దుకోవాలి. ఇప్పుడు కూడా అదే జరిగింది. రూపాయి విలువ మరింత దిగజారిన కారణంగా దిగుమతి చేసుకొనే ఎరువుల ధరలు పెరగవచ్చు, అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో మాంద్యం కారణంగా కంపెనీలు తెగబడి చమురు మాదిరి ఎరువులను కూడా తగ్గించి అమ్మితే తగ్గవచ్చు. ఇది రాస్తున్న సమయానికి అలాంటి సూచనలేవీ కనిపించటం లేదు.

The great lockdown gums up animal farms
ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంట్‌కు సమర్పించిన 2020-21 బడ్జెట్‌ పత్రాల ప్రకారం అంతకు ముందు సంవత్సరంలో పాస్ఫరస్‌, పొటాసియం ఎరువుల సబ్సిడీ అంచనా రూ.26,335 కోట్లుగా చూపారు. వాస్తవానికి ఎంత ఖర్చు చేసిందీ మనకు వచ్చే ఏడాది పత్రాలలో గానీ తెలియదు. కేంద్ర సమాచార శాఖ మంత్రి విలేకర్లతో ఇలా చెప్పారు. ” 2020-21కి ఫాస్పేటిక్‌ మరియు పొటాసియం ఎరువులకు సబ్సిడీ రూపంలో ఖర్చు రూ. 22,186 కోట్లకు పెంచాలని నిర్ణయించాము, ఈ సబ్సిడీ పధకం ప్రతి ఏడాదీ ఉండేదే, ఈ ఏడాది ఐదు నుంచి ఏడు శాతం అదనంగా ఇవ్వాలని నిర్ణయించాము” అన్నారు. అంటే గత ఏడాది అంచనా మొత్తం కంటే ఖర్చు గణనీయంగా తగ్గి ఉండాలి. గత ఏడాది కంటే ఎరువులు, ఆహార సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. గత సంవత్సరం 80వేల కోట్ల రూపాయల అంచనా కాగా దాన్ని 70వేల కోట్లకు సవరించారు. ఈ ఏడాది ఆ 70వేల కోట్లనే అంచనాగా చూపారు. ఆహార సబ్సిడీని కూడా రూ.1.84లక్షల కోట్ల నుంచి 1.15లక్షల కోట్లకు తగ్గించారు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే భారత ఆహార సంస్ధను అప్పుల పాలు చేసి ఆ పేరుతో దాన్ని మూసివేసేందుకు ఎంచుకున్నదారి ఇది. బడ్జెట్‌లోటును తగ్గించే దొడ్డిదారి. ఎఫ్‌సిఐ లాభాల ప్రాతిపదికన పని చేసే వాణిజ్య సంస్ధ కాదు. ఇటీవలి సంవత్సరాలలో దాని బడ్జెట్‌కు నిధులు కేటాయించని కారణంగా అది జాతీయ చిన్న మొత్తాల పొదుపు సంస్ధ నుంచి అధిక వడ్డీకి అప్పులు చేస్తున్నది. గతేడాది మార్చి ఆఖరుకు దాని అప్పులు రెండు లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయి. దాన్ని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయటం లేదు.ఈ ఏడాది ఇంకా కోత పెట్టింది. అంటే కేటాయించిన మొత్తం పోను ఎఫ్‌సిఐ మరింత ఎక్కువగా ఈ ఏడాది అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా పధకం కింద ఉన్న 67శాతం మందిని 20శాతానికి కుదించాలని, రేషన్‌ దుకాణాల ద్వారా ఇస్తున్న సరకుల ధరలను పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సర్వే సూచించింది. అది కేంద్ర ప్రభుత్వం తయారు చేసేదే కనుక మోడీ సర్కార్‌ ఆలోచనకు ప్రతిబింబం. దీనిలో భాగంగానే ఎఫ్‌సిఐని నిర్వీర్యం చేసి రాష్ట్రాలకే ధాన్యం కొనుగోలు బాధ్యతను ఇప్పటికే బదలాయించారు. వారెలా చేస్తున్నదీ చూస్తున్నాము.
బడ్జెట్‌ పత్రాల ప్రకారం 2019-20లో నేరగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్న మొత్తాలకు కేటాయించిన 75వేల కోట్ల రూపాయలకు గాను ఖర్చయింది రూ.54,370 కోట్ల రూపాయలే. ఇరవై ఒక్కవేల కోట్ల రూపాయలను ”పొదుపు” చేసింది. ఈ పధకం కింద దేశంలోని 14కోట్ల రైతు కుటుంబాలకు గాను లబ్దిపొందింది కేవలం 8.4కోట్ల కుటుంబాలే అని అంచనా. కరోనా కారణంగా తలెత్తిన పరిస్ధితిలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకొనేందుకు కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవు. ఆరోగ్య సేవలను ప్రయివేటు రంగానికి అప్పగించాలన్న నిర్ణయాన్ని వేగంగా అమలు జరుపుతున్నారు. కరోనా సందర్భంగా అదెంత ప్రమాదకర పోకడో ప్రపంచ వ్యాపితంగా వెల్లడైంది. ఇలాంటి మహమ్మారులు, ప్రకృతి ప్రళయాల సమయాల్లో ఎఫ్‌సిఐ లేదా మరొక ప్రభుత్వ సంస్ధ లేకపోతే ఎంత నష్టమో ఇప్పటికే రైతాంగానికి అర్ధం అయింది.
మన దేశం వెలుపల పరిస్ధితి ఎలా ఉందో చూద్దాం. ఇప్పటికే చైనా, ఇతర ఐరోపా దేశాలతో ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్దం అమెరికా రైతాంగానికి ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్దితిలోకి నెట్టింది. కరోనా కారణంగా చైనా ఆర్ధిక స్ధితి కూడా తాత్కాలికంగానే అయినా గణనీయంగా దెబ్బతిన్నట్లు స్వయంగా వారే ప్రకటించారు. ఇప్పుడు ట్రంప్‌ తన ఎన్నికల కోసం కరోనా వైరస్‌ పేరుతో రాజకీయం చేయాలని చూస్తున్నాడు. అవసరమైతే వాణిజ్య ఒప్పందాలను నిలిపివేస్తానని బెదిరిస్తున్నాడు. అమెరికాకు చైనా ఎంత దూరమో చైనాకు కూడా అమెరికా అంతే దూరంలో ఉంటుంది. చైనాకు వచ్చే ఆర్ధిక ఇబ్బందులు దానికే పరిమితం కావు,చైనాతో పోల్చితే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ ఎంత బలహీనంగా ఉందో చెప్పనవసరం లేదు.చమురు నిల్వ ఖాళీ లేక, ఉన.్నది అమ్ముడు పోక చమురు ధరలు పడిపోవటంతో కొనుగోలుదార్లు అమ్మకం దార్లకు ఎదురు డబ్బులు ఇచ్చి నష్టాలను తగ్గించుకున్నారు.కరోనా కారణంగా అనేక ప్రాంతాల్లో అమెరికా రైతులు పాలు అమ్ముడుపోక గోతుల్లో పోస్తున్నారని, కూరగాయల తోటలను దున్నివేస్తున్నారని వార్తలు వచ్చాయి. పంటలకు పదిశాతం, పశువులకు 12శాతం ధరలు పడిపోతాయని, రైతుల నిఖర ఆదాయాలు 20బిలియన్‌ డాలర్లు తగ్గుతాయని ఆహార మరియు వ్యవసాయ విధాన పరిశోధనా సంస్ద అంచనా వేసింది. అమెరికాలో అలా జరగటం అంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో వారు ప్రపంచ మార్కెట్లో మరింత చౌకగా వాటిని కుమ్మరిస్తారు. పందొమ్మిది బిలియన్‌ డాలర్ల మేరకు వ్యవసాయ రంగానికి ఇచ్చేందుకు ట్రంప్‌ చర్యలు తీసుకుంటున్నాడు. మన దేశంలో అలాంటి నష్టం ఎంత జరిగిందో అంచనా వేసేవారు లేరు, వేసినా పరిహారం ఇచ్చేవారూ లేరు.
ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారుతోందన్నది అందరూ అంగీకరిస్తున్న అంశం. వేగతీవ్రత అంచనాలో తేడాలుండవచ్చు.2020లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. కరోనా ప్రారంభంలో నష్టం జరిగితే అది చైనాకే పరిమితం అవుతుందన్నది ఎక్కువ మంది జోశ్యం. ఇప్పుడు ప్రపంచాన్ని కమ్ముకుంటున్నది. మన పరిస్ధితి గురించి కేంద్ర పెద్దలు అంగీకరించినా లేకున్నా గతేడాది కాలంగా దిగజారుతూనే ఉంది.ప్రపంచంలో గతేడాది ఆహార వస్తువుల ధరలు ప్రారంభంలో తగ్గినప్పటికీ కరోనా కారణంగా ఇటీవల ధరలు పెరిగినట్లు ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులు తెలుపుతున్నాయి. అనేక దేశాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎగుమతులపై ఆంక్షలు విధించటం, వినియోగదారులు నిల్వలు చేసుకోవటం ఒక కారణంగా చెబుతున్నారు. వియత్నాం నిషేధం కారణంగా ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 15శాతం తగ్గాయి, మన దేశం, థారులాండ్‌ కూడా ఆంక్షలు విధిస్తే ప్రపంచ మార్కెట్లో ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది.

No crops if lockdown extended: Karnataka farmers wary of distress ...
గోధుమలను అత్యధికంగా ఎగుమతి చేసే రష్యా, గోధుమ పిండిని ఎగుమతి చేసే కజకస్తాన్‌ కూడా ఎగుమతుల మీద ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఇంకా అనేక దేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. దీన్ని ”ఆహార జాతీయవాదం ” తలెత్తటంగా అభివర్ణిస్తున్నారు. అమెరికాలో చమురు వినియోగం గణనీయంగా పడిపోవటంతో మొక్కజొన్నల నుంచి తయారు చేసే ఎథనాల్‌కు సైతం డిమాండ్‌ పడిపోయింది. ఫలితంగా మొక్కజొన్నల ధరలు పడిపోయాయి. అమెరికా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం బియ్యం, గోధుమల ఉత్పత్తి రికార్డు స్ధాయిలో ఈ ఏడాది 126 కోట్ల టన్నులు ఉండవచ్చని, ఇది వినియోగం కంటే ఎక్కువ కనుక ఆంక్షలు సడలిస్తే సరఫరా మెరుగుపడవచ్చని భావిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి తీరుతెన్నులను బట్టి అంచనాలు, జోశ్యాలు మారిపోవచ్చు. అమెరికాలో గుడ్లు, పాలు, మాంసం సరఫరా తగ్గటంతో ధరలు ముఖ్యంగా గుడ్ల ధరలు 180శాతం వరకు పెరిగాయి. గత నెలలో జనం అవసరాలకు మించి కొనుగోలు చేయటం దీనికి ఒక కారణంగా భావిస్తున్నారు.చైనా పాల దిగుమతులు ఈ ఏడాది 19శాతం తగ్గుతాయని, అదే సమయంలో ప్రపంచంలో దిగుబడి తగ్గే అవకాశాలు లేనందున పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గవచ్చని భావిస్తున్నారు. 2018 చివరిలో చైనాలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కారణంగా దేశంలోని సగం పందులను చంపివేయటంతో మాంసం ధరలు గణనీయంగా పెరిగాయి. పంది మాంసం బదులు గొడ్డు మాంసానికి మరలటంతో దాని ధరలు కూడా పెరిగాయి. కరోనా కారణంగా అన్ని చోట్లా ధరలు పడిపోయాయి.అయితే అమెరికాలో రాబోయే రోజుల్లో కొరత ఏర్పడవచ్చనే భయంతో జనం కొనుగోళ్లకు ఎగబడటంతో అక్కడ ధరలు పెరిగాయి.
ఈ ఏడాది కరోనా దాదాపు ప్రపంచమంతటా కొత్త సమస్యను తెచ్చి పెట్టింది. ఆయా వ్యవసాయ సీజన్లలో వలస లేదా అతిధి కూలీలు ఎక్కడ పని దొరికితే లేదా అవసరం మేరకు వలస పోవటం సర్వసాధారణం. గృహబందీ, రవాణా లేకపోవటం వలన ఈ ఏడాది కొరత తీవ్రమైంది. సీజనల్‌ వలస కూలీలు రాని కారణంగా తమకు రానున్న మూడు నెలల్లో రెండు లక్షల మంది అవసరమని ఫ్రాన్స్‌ అంచనా వేసింది. ఇండ్లలో చిక్కుకు పోయిన వారు పనులకు రావాలని వ్యవసాయ మంత్రి బహిరంగ విజ్ఞప్తి చేశాడు. నిరుద్యోగులైన కాటరింగ్‌ కార్మికులు వ్యవసాయ పనులకు రావాలని జర్మనీ అధికారులు కోరుతున్నారు. అక్కడ పండ్లు, కూరగాయల కోతకు ఏటా మూడులక్షల మంది వస్తారు. ఉక్రెయిన్‌ నుంచి వ్యవసాయ పనులకోసం కూలీలు పోలాండ్‌కు వలస వెళతారు. వారిని స్వదేశానికి పంపకుండా అక్కడే కొనసాగేందుకు అనుమతి ఇవ్వాలని రైతుల యూనియన్‌ ప్రభుత్వాన్ని కోరింది. వ్యవసాయ కూలీలు ఎక్కడకు పోవాలనుకుంటే అక్కడకు స్వేచ్చగా అనుమతించాలని ఐరోపా యూనియన్‌ సభ్య దేశాలను కోరింది. బ్రిటన్‌లో కూరగాయలు, పండ్ల కోతకు 80వేల మంది అవసరమని, వారికి ప్రత్యేక పాకేజ్‌ ఇచ్చేందుకు 93లక్షల పౌండ్లను ప్రభుత్వం మంజూరు చేయాలని రైతు సంఘాలు కోరాయి. ఇతర చోట్ల పనులు కోల్పోయిన వారిని వ్యవసాయరంగానికి మరలేట్లు ప్రోత్సహించాలని ఇతరులు కూడా కోరుతున్నారు. అమెరికాలో వ్యవసాయ కూలీల సంఖ్య చాలా తక్కువ, ఎక్కువ భాగం యంత్రాలతోనే పని నడుస్తుంది. అయితే మనుషులు అవసరమైన చోట పని చేసేందుకు పక్కనే ఉన్న మెక్సికో నుంచి హెచ్‌ 2ఏ వీసాలతో అనుమతిస్తారు. ఈ సంవత్సరం కరోనా కారణంగా అలాంటి వారు కనీసం అరవైవేల మంది తగ్గుతారని అంచనా వేశారు. ఇప్పటికే వచ్చి పని చేస్తున్నవారి వీసాలను పొడిగించాలని కోరుతున్నారు. ఒక వైపు వ్యవసాయేతర రంగాలలో పని చేసేందుకు ఇతర వీసాలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌ సర్కార్‌ వ్యవసాయంలో పని చేసే వారికి మాత్రం వీసాలు అదనంగా ఇవ్వాలని చూస్తోంది. అనేక దేశాలు ప్రకటిస్తున్న ఉద్దీపన పధకాలలో వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్న మొత్తాల వివరాలు ఇంకా తెలియనప్పటికీ మన కంటే మెరుగ్గా ఉంటాయని చెప్పవచ్చు.

Indian Farmers Struggle to Harvest, Sell Crops During COVID ...
మన రైతాంగ విషయానికి వస్తే ఈ ఏడాది ఇప్పటికే జరిగిన నష్టంతో పోల్చితే నామ మాత్రమే అయినా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఇస్తున్న ఆరువేల రూపాయలను రెట్టింపు చేయాలి.దీన్ని కౌలు రైతులకు కూడా వర్తింప చేయాలి. కరోనా కారణంగా నష్టపోయిన పంటలకు బీమా పధకాన్ని వర్తింప చేసి పరిహారం ఇవ్వాలి. గ్రామీణ కార్మికులకు కనీసం వందరోజుల ఉపాధిని కల్పించాలి. ఉచితంగా అందచేస్తున్న ధాన్యం మొత్తాలను రెట్టింపు చేయాలి. కార్డులు లేనివారికి కూడా ఉదారంగా సాయం చేయాలి. ఖరీఫ్‌ సీజన్‌లో తీసుకున్న రుణాలకు చిన్న సన్నకారు రైతులకు వడ్డీ రద్దు చేయాలి. వచ్చే ఏడాది పంటల కనీస మద్దతు ధరలను ఒకటిన్నర రెట్లు పెంచాలి.
ఏప్రిల్‌ 17న అంతర్జాతీయ రైతాంగ పోరాటదినం జరిగింది. ఎనభై దేశాలకు చెందిన 180 రైతు సంఘాలు ఒక ప్రకటన చేస్తూ కరోనా కారణంగా ఇండ్లకే పరిమితం అవండి, మౌనంగా ఉండవద్దు అని పిలుపునిచ్చాయి. ప్రపంచ జనాభా కడుపు నింపేందుకు పూనుకోవటంతో పాటు రైతాంగ హక్కుల కోసం పోరాడాలన్నదే దాని సారాంశం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనాపై విచారణ సరే ముందు అమెరికా, జర్మనీ నేరాల మాటేమిటి !

22 Wednesday Apr 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#China biological weapons, american crimes against humanity, COVID- 19 pandemic, Donald trump angry at China, German crimes against humanity

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ తొలుత బయట పడిన ఊహాన్‌ నగరంలో జరిగిందేమిటో తెలుసుకొనేందుకు తమ తనిఖీదార్లను అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశాడు. ఈ డిమాండ్‌ను చైనా తోసి పుచ్చింది. కరోనా గురించి సకాలంలో హెచ్చరించని కారణంగా తమ దేశానికి జరిగిన నష్టం 20లక్షల కోట్ల డాలర్లు చైనా చెల్లించాల్సిందే అని అమెరికన్లు కొందరు తమ దేశంలో దావా దాఖలు చేశారు. చైనా మీద కేసులు అమెరికా కోర్టుల్లో దాఖలు చేయటం ఏమిటో, అవి విచారణ జరిపే ప్రహసనం ఏమిటో రాబోయే రోజుల్లో చూద్దాం. ఇదే విధంగా తమకు 149 బిలియన్‌ యూరోల నష్టపరిహారం చెల్లించాలని జర్మన్‌ పత్రిక బిల్డ్‌ పేర్కొన్నది. రాబోయే రోజుల్లో ఇంకా ఇతర దేశాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్‌లు రావచ్చు. అవెంత ఉంటాయో తెలియదు. ఈ డిమాండ్లు న్యాయసమ్మతమేనా ? ఆచరణ సాధ్యమేనా ?
నావరకు అయితే కొన్ని చిన్న చిన్న షరతులతో న్యాయసమ్మతమే, ఆచరణ సాధ్యమే ! అదెలాగో తరువాత చూద్దాం.ఈ వార్తలను చూసి చాలా మంది చైనా తిక్క కుదిరింది అనుకుంటున్నారు. దాఖలు చేయని కేసులను కూడా వేసినట్లే సంబర పడుతున్నారు. ముందు తమ దేశాల్లో కరోనా నివారణ చేయకుండా ఇదేమిటి అనుకొనేవారు కూడా లేకపోలేదు. ఇలాంటి నష్ట పరిహారం కోరేవారు నిజంగా సాధించేందుకు అవకాశాలున్నాయని నమ్ముతున్నారా ? లేక ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు ట్రంప్‌ ఇలాంటి కేసులను వేయిస్తున్నాడా అన్నది అనుమానమే. అసలు ఇప్పుడున్న ప్రపంచ వ్యవస్ధలో అలాంటి అవకాశాలు ఉన్నాయా? ఐక్యరాజ్య సమితి నిర్ధారించిన మార్గదర్శక సూత్రాల మేరకు అంతర్జాతీయ నేరాలుగా పరిగణించిన వాటిని విచారించేందుకు అంతర్జాతీయ న్యాయ స్ధానం ఉంది. చైనాలో వెలువడిన కరోనా వైరస్‌ అలాంటి నేరంగా ఎవరూ ఎక్కడా నిర్ధారించలేదు. చరిత్రలో ఎప్పుడైనా నిజంగా తప్పు చేసిన ఏ దేశమైనా ఎవరికైనా పరిహారం చెల్లించిందా ?


అమెరికా ఏమిటి ఏ దేశమైనా దేని గురించి అయినా స్వంత విచారణలు జరుపుకోవచ్చు. కోరుకున్న తీర్పులు రాసుకోవచ్చు. రద్దు కింద అమ్ముకోవటానికి తప్ప అవి దేనికి పనికి వస్తాయి ? ఆ దేశాలన్నీ ముందు చైనాలో వైరస్‌ను ఎలా అరికట్టారో తమ దేశాలలో ఎలా జనం ప్రాణాలు తీస్తున్నారో తెలుసుకోవాలి. ఇతర దేశాల్లోకి స్వంత దర్యాప్తు బృందాలను పంపటానికి ఏ దేశానికీ హక్కు లేదు, అవకాశం అంతకంటే లేదు. అదే నిజంగా ఉంటే పాకిస్ధాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలను ఈ పాటికే మన కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసి ఉండేది, అదే విధంగా పాక్‌ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మన మీద చేసిన ఆరోపణలను విచారించే వారు. అమెరికాలో అత్యధిక కేసులు ఐరోపా నుంచి దిగుమతి అయ్యాయి. అందువలన ఆ దేశాల మీద ముందు అమెరికా దర్యాప్తు జరపాలి. ఇప్పటికే ప్రపంచ పోలీసుగా తనకు తాను బాధ్యత తీసుకున్న అమెరికా దాదాపు అన్ని చోట్లా చావు దెబ్బతిన్నది. ఇప్పుడు ప్రపంచ న్యాయమూర్తిగా మారదలచుకున్నట్లు కనిపిస్తోంది. అత్యాశగాకపోతే అది సాధ్యమేనా ?
చైనాలోని ఉహాన్‌ వైరాలజీ సంస్ధ అధిపతి, చైనా మిలిటరీ మేజర్‌ జనరల్‌ తమ దేశంలో కరోనా వ్యాప్తి, మరణాలకు కారకులని, నష్టపరిహారంగా 20లక్షల కోట్ల డాలర్లు చెల్లించాలని అమెరికాలోని ఒక లాయర్‌, మరో ఫొటోల కంపెనీ, మరో ఇద్దరు కేసులు దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ పిచ్చి కేసుకు ప్రపంచ వ్యాపితంగా ప్రచారం తప్ప మరొక లాభం ఉండదు. అది కోరిన మొత్తం చైనా జిడిపికంటే ఎక్కువ. అంటే చైనా మొత్తాన్ని అమ్మినా అంత సొమ్ము రాదు, అసలు కొనే వారెవరు అన్నది వేరే విషయం. ఆస్ట్రేలియా ఎలాంటి నష్ట పరిహారం కోరలేదుగానీ అమెరికా ఏది మాట్లాడితే దానికి వత్తాసుగా పలుకుతోంది. ఇక జర్మనీలో అత్యధిక ఆదరణ కలిగిన పత్రిక ” బిల్డ్‌ ” సంపాదకులు తమ దేశానికి చైనా కారణంగా వివిధ రంగాలకు 149 బిలియన్‌ యూరోల మేరకు నష్టం జరిగిందని ఆ మొత్తం చెల్లించాలని రాశారు. అయితే ఇందుకోసం ఎలాంటి కేసులు గట్రా దాఖలు చేయలేదు.
ఇక చైనా మీద విచారణ అంశాన్ని దానికి గాను నేను ముందే చెప్పిన షరతుల సంగతి చూద్దాం. ఎప్పుడో క్రీస్తు పూర్వం సంభవించిన వైరస్‌ల మూలాలు ఏదేశంలోనివో ఇప్పుడు నిర్ధారించటం కష్టం. ఎందుకంటే నాడున్న దేశాలు లేదా సామ్రాజ్యాలు నేడు లేవు గనుక నిందితులు ఫలానా అని నిర్దారించలేము. నిజానికి ఏ దేశం తప్పుచేసినా విచారణ జరిపేందుకు ప్రపంచ రాజ్యాలు ఏక క్రీవంగా అంగీరించి ముందు ఐరాస భద్రతా మండలిలో తీర్మానం ఆమోదించాలన్న చిన్న షరతును ముందు నెరవేర్చాలి. ఆ మేరకు ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కనుక మొదటి ప్రపంచ యుద్ధాన్ని తీసుకుందాం, లేదూ ఎవరైనా అంతకు ముందు నుంచే విచారణ ప్రారంభించాలి అంటే అభ్యంతరమూ లేదు.చైనాకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం లేదు.
కరోనా వైరస్‌ను చైనా తయారు చేసిందనటానికి ఎలాంటి ఆధారాలు లేవు. మానవాళి చరిత్రలో అతి పెద్ద మహమ్మారి ప్లేగు వ్యాధి అని తెలిసినా కొన్ని వందల సంవత్సరాలు గడచి నందున దానికి సంబంధించిన అంశాలు పూర్తిగా నిర్దారించలేము. మనకు బాగా తెలిసిన స్పానిష్‌ ఫ్లూ(ప్రపంచానికి తెలిసిన తొలి హెచ్‌1ఎన్‌1 వైరస్‌). మొదటి ప్రపంచ యుద్ధం చివరిలో ప్రబలింది. ఇది ఐరోపాలోనా, అమెరికాలోనా ఎక్కడ ప్రారంభమైంది అన్న అంశం మీద వివాదం ఉంది. భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఎక్కువ పరిశీలనలు అమెరికా వైపే వేలు చూపుతున్నాయి. నిజానికి ట్రంప్‌కు, జర్మన్‌ పత్రిక బిల్డ్‌ సంపాదకులకు, వారిని సమర్ధించే వారికి చిత్తశుద్ధి ఉంటే ఈ వైరస్‌ ఎక్కడ ప్రారంభమైందో ఇప్పుడు ఉన్న ఆధారాల ప్రకారం నిర్ధారించాలి. చైనాలో విచారణకు తమ నిపుణులను అంగీకరించాలని ట్రంప్‌ కోరాడు. అలా ఒక దేశం కాకుండా భద్రతా మండలిలో ఇప్పుడు అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా సభ్యరాజ్యాలుగా ఉన్నాయి కనుక వాటి ప్రతినిధులను ఎంపిక చేసి విచారణ జరిపించాలి. ఆ నివేదిక ప్రాతిపాదికన నష్టాలను నిర్ధారించి ఆ మొత్తాలను బాధిత దేశాలకు పంచాలి. ఇదేమీ పెద్ద షరతు కాదు, అసాధ్యమైంది అంతకంటే కాదు.


1918 జనవరి నుంచి 1920 డిసెంబరు వరకు ప్రపంచ వ్యాపితంగా నాడు ప్రపంచంలో ఉన్న మూడో వంతు జనాభా 50 కోట్ల మందికి సోకింది. కోటీ 70లక్షల నుంచి ఐదు కోట్ల మందికి, మరికొందరి అంచనాల ప్రకారం పది కోట్ల మంది దుర్మరణం చెందారు. ఇది మొదటి ప్రపంచ యుద్దంలో పాల్గొన్న దేశాలు గావించిన నష్టానికి అదనం, ప్రపంచ ఆధిపత్యం కోసం యుద్దాన్ని తెచ్చిన దేశాలు, స్పానిష్‌ ఫ్లూ నష్టాలను కలిపి లేదా విడిగా తేల్చి దానిలో ఎవరి వాటా ఎంతో ఎలా చెల్లిస్తారో అమెరికా, ఐరోపా దేశాలు ముందు తేల్చుకోవాలి. ఆ యుద్ధంలో స్పెయిన్‌ తటస్ధంగా ఉంది. అయితే ఆ సమయంలోనే తలెత్తిన ఫ్లూ సోకి రాజు 13వ ఆల్‌ఫోన్సో మరణించటంతో నేటి మాదిరే నాటి పత్రికలు కూడా వెనుకా ముందూ చూడకుండా స్పెయిన్‌లోనే పుట్టిందని దానికి స్పానిష్‌ ఫ్లూ అని రాశాయి. తరువాత స్పెయిన్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిసినా ఆ పేరు వాడుకలో ఉండిపోయింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ద కరోనాకు కోవిడ్‌-19 అని పేరు పెట్టినా చైనా వైరస్‌ అని నిందిస్తున్న మాదిరి అన్నమాట. ఈ ఫ్లూ కొనసాగింపుగా 2009లో స్వైన్‌ ఫ్లూ వచ్చింది కనుక దీన్ని కూడా చేర్చి విచారణ జరపాలి. ఇది పుట్టింది అమెరికాలోనా, మెక్సికోలోనా మరొక చోటా అన్నది ఆ దేశాలు తేల్చాలి. పనిలో పనిగా ఎయిడ్స్‌ను ఎక్కడ తయారు చేసి ప్రపంచం మీద వదిలారో కూడా తేల్చి పరిహారం చెల్లించాలి.
మన కళ్ల ముందే ఇరాక్‌లో మారణాయుధాలు, జీవ రసాయన ఆయుధాల గుట్టలు ఉన్నట్లు ప్రచారం చేసిన అమెరికన్ల గురించి తెలుసు. ఆ పేరుతో ఇరాక్‌ మీద దాడి చేసి పదిలక్షల మంది ప్రాణాలు తీశారు. దేశాన్ని సర్వనాశనం చేశారు. తీరా తమ తనిఖీలో ఎలాంటి జీవ, రసాయన ఆయుధాలు లేవని స్వయంగా అమెరికన్లే ప్రకటించారు. అంతే కాదు ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రవేశించి అపార ప్రాణ నష్టానికి కారకులయ్యారు. ఇస్లామిక్‌ తాలిబాన్‌(ఉగ్రవాదులు)లను సృష్టించారు. ఈ రోజు వారు ప్రపంచ వ్యాపితంగా చేస్తున్న దుర్మార్గాలకు గాను ఎవరు పరిహారం చెల్లిస్తారు, ట్రంప్‌ మెడపట్టి బాధిత దేశాలన్నీ నష్టపరిహారం కోరాలి. విచారణకు డిమాండ్‌ చేయాలి. పాక్‌ ఉగ్రవాదులు తాలిబాన్ల శిక్షణలోనే తయారయ్యారు కనుక మన మోడీ గారు కూడా స్నేహితుడనే విషయాన్ని పక్కన పెట్టి ఈ విషయంలో అమెరికా, ట్రంప్‌ను పరిహారం కోరాలి.

American Crime Case #23: The Afghanistan and Iraq War Logs and the ...
రెండవ ప్రపంచ యుద్ధంలో మిగతా వన్నీ పక్కన పెడితే కొన్ని దేశాలు ప్రత్యేకంగా చేసిన నేరాలు ఉన్నాయి. వాటిని విచారణ జరిపి శిక్షలు కూడా వేశారు. ఆ యుద్దం ముగింపు దశలో అమెరికన్లు జపాన్‌లోని నాగసాకి,హిరోషిమా పట్టణాల మీద వేసిన రెండు అణుబాంబులు ఎంత మందిని బలితీసుకున్నాయో తెలుసు. తొలిసారి అవసరం లేకపోయినా చేసిన ఈ దాడికి అమెరికన్లు జపాన్‌కు ఎంత నష్టపరిహారం ఇస్తారో ముందు తేల్చాలి. అమెరికా మిత్ర దేశంగా జపాన్‌ ఉంది కనుక ఆ పరిహారాన్ని తీసుకోవాలా లేదా అన్నది వేరే విషయం. జపాన్‌ మిలిటరీ చైనా పట్టణాలపై ప్లేగు బాంబులు వేసి ప్లేగు వ్యాధిని వ్యాపింప చేసి దొరికి పోయి విచారణ ఎదుర్కొన్న విషయం దాస్తే దాగేది కాదు. అందువలన దానికి చైనాకు ఎంత నష్ట పరిహారం ఇస్తారో జపాన్‌ కూడా తేల్చాలి. వియత్నాం ఇతర ఇండో చైనా దేశాలేమీ ఎవరి మీదా దాడులు చేయలేదు, దురాక్రమణకు పాల్పడలేదు. అయినా జపాన్‌, ఫ్రెంచి, అమెరికా సామ్రాజ్యవాదులు దశాబ్దాలతరబడి దాడులు చేసి కలిగించిన అపార నష్టానికి ఆ మూడు దేశాలు నష్టపరిహారం చెల్లించాలి, ఎవరి వాటా ఎంతో అవే తేల్చుకోవాలి.
ఇక జర్మనీ సంగతి. రెండవ ప్రపంచ యుద్దం సందర్భంగా 60లక్షల మంది యూదులు, కోటీ పదిలక్షల మంది ఇతరులను బలిగొన్న నాజీ సైన్యాలను నడిపింది జర్మనీ. గ్యాస్‌ ఛాంబర్లలో ఏ రసాయనాన్ని పంపి హత్యలు చేశారో వెల్లడించాలి. దానికి ఎంతో నష్టపరిహారం చెల్లించాలో ముందు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బిల్డ్‌ సంపాదకుడు తగుదునమ్మా అంటూ ఆధారాలు లేని చైనాను నష్టపరిహారం అడుగుతున్నాడు.
మన దేశాన్ని బ్రిటన్‌ ఆక్రమించి మనక ఎంత నష్టం కలిగించిందో తెలిసిందే. అందువలన దాని మీద కూడా విచారణ జరిపి నష్టపరిహారాన్ని రాబట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వ్యక్తులు లేదా దేశాల మీద ఆపాదించినంత మాత్రాన నేరంచేసినట్లు కాదు. చైనా మీద కూడా ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు.పైన చెప్పుకున్న దేశాల నేరాలు ఇప్పటికే రుజువయ్యాయి. అందువలన నిందితులను, నష్టపరిహారాన్ని తేల్చి తరువాత చైనా సంగతి మాట్లాడాల్సి ఉంటుంది. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడిన చరిత్ర ఇప్పటి వరకు సామ్రాజ్యవాదులదే, ఏ సోషలిస్టు దేశానికి అలాంటి చరిత్ర లేదు. ఒక వేళ ఎవరైనా నిరూపిస్తే దానికి ఎలాంటి అభ్యంతరం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆహారం కోసం ఆరు గంటలపాటు క్యూలో కార్లున్న అమెరికా ”పేదలు” !

20 Monday Apr 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

US food banks, US food stamps

Food Banks Are Overrun, as Coronavirus Surges Demand - The New ...

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాతలు చేసే అన్నదానం ఇతర సాయం కోసం మన దేశంలోని పేదలు ఎలా ఎదురు చూస్తున్నారో నిత్యం చూస్తున్నాం. అత్యంత ధనిక దేశమైన అమెరికా పేదలు అదేపని చేస్తున్నారు. మనకు వారికీ తేడా ఏమిటంటే మన పేదలకు కాళ్లకు చెప్పులు కూడా ఉండవు. అమెరికా పేదలకు విలాసవంతమైన కార్లుంటాయి. అక్కడా ఇక్కడా పేదలు చేయి చాచటం ఒకేవిధంగా ఉంటుంది. మన పిల్లలు అనేక మంది ఇప్పుడు అమెరికాలో చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. వారికి కనీసం దాతలు లేదా ప్రభుత్వం అందచేసే ఆహారం ఏమేరకు అందుతోందో లేదో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలియదు. ఆహార కూపన్లకు అర్హులో కాదో కూడా చెప్పలేము. మన దేశంలోని వలస కూలీలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో అర్ధం చేసుకుంటే అమెరికా స్ధాయిలో అక్కడ ఉపాధి కోసం వెళ్లిన వారు కూడా ఇలాగే ఉండి ఉంటారు.
మన రైతాంగం పండించిన పంటలను విధిలేక అయినకాడికి అమ్ముకోవటం లేదా కూలీ ఖర్చులు కూడా రాకపోతే పొలాల్లోనే దున్నివేయటం కొత్త కాదు. ఇప్పుడు అమెరికాలో రైతులు అనేక చోట్ల ఇప్పుడు అదే చేస్తున్నారు. చికాగో సన్‌ టైమ్స్‌ పత్రిక ఏప్రిల్‌ 15న రాసిన సంపాదకీయం ప్రకారం పితికిన పాలను కొనే వారు లేక రైతులు గోతుల్లో పోస్తున్నారు. కూరగాయల పొలాలను దున్ని పంటను మట్టిలో కలిపివేస్తున్నారు. అమెరికా ఎదుర్కొంటున్న ఈ నూతన సవాలును కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అది కోరింది. ఇది రాస్తున్న సమయానికి ప్రపంచంలో కరోనా మరణాలు లక్షా 65వేలు కాగా ఒక్క అమెరికాలోనే 40వేల మంది చనిపోయారు. ప్రపంచంలో 24లక్షల మంది వైరస్‌బారిన పడితే అమెరికాలో ఏడులక్షల 65వేల మంది ఉన్నారు. తన ఏలుబడిలో ఇంత దారుణం ఎలా జరిగిందో దర్యాప్తు జరిపించాల్సిన అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం తమ నిపుణులను చైనా పంపి కరోనా వైరస్‌ ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో దర్యాప్తు చేయిస్తానని కబుర్లు చెబుతున్నాడు. అమెరికాలో ఇంతగా పరిస్దితి ఎందుకు దిగజారిందో ఏదో ఒక దేశం కాదు కనీసం ఐక్యరాజ్యసమితి బృందాన్ని అయినా అధ్యక్షుడు అనుమతిస్తాడా !
పరిస్ధితులు బాగున్నాయి అనుకున్నపుడే అమెరికాలో ఆహార భద్రత లేని కుటుంబాలు 1.43కోట్లు ఉన్నట్లు 2018 వ్యవసాయ శాఖ నివేదిక పేర్కొన్నది. గత నాలుగువారాల్లో నిరుద్యోగులుగా మారామని, భృతి ఇవ్వాలని కోరుతూ 2.2కోట్ల మంది లేదా అమెరికా కార్మికవర్గంలో 13శాతం దరఖాస్తు చేశారు.వీరిలో దాదాపు సగం మంది యజమానులు ఆరోగ్యబీమా కల్పించిన వారే. ఇప్పుడు నిరుద్యోగులు కావటంతో ఆ రక్షణ ఉద్యోగం నుంచి తొలగించిన మూడు నెలలవరకు మాత్రమే ఉంటుంది. తరువాత కొనసాగాలంటే కార్మికులు తమ జేబుల నుంచి ఆ మొత్తాన్ని చెల్లించాలి లేదా బీమా లేకుండా జీవించాలి. భృతి దరఖాస్తుదారుల్లో 59 మంది మహిళలు ఉన్నారంటే నిరుద్యోగం వారి మీద ఎలాంటి ప్రభావం చూపనుందో అర్ధం చేసుకోవచ్చు.రోడె ఐలాండ్‌లోని పదిలక్షల మంది జనాభాలో 1.66లక్షల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారు. రోజుకు నాలుగు వందల దరఖాస్తులు వస్తున్నాయి.
ఆహార భద్రత లేని వారు అమెరికాలో 2019లో 3.7కోట్ల మంది ఉన్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. వీరిలో కోటీ పదిలక్షల మంది పిల్లలు,54లక్షల మంది వృద్దులు ఉన్నారు. కరోనా కేసుల మాదిరి ఈ సంఖ్యలు రోజు రోజుకూ మారిపోతున్నాయి. పేదలకు ఆహారం అందచేసే ఫీడింగ్‌ అమెరికా అనే ధార్మిక సంస్థ ఇప్పుడు నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అంతే కాదు అవసరమైన ఆహారాన్ని నిల్వచేసేందుకు అది నిర్వహించే ఆహార బ్యాంకులు, ఇతర సామూహిక వంటశాలలకు తగిన విస్తీర్ణం కలిగిన గోడవున్లు కూడా లేవని వార్తలు వస్తున్నాయి. కొత్తగా ఆహారం కోసం లైన్లలో నిలుస్తున్నవారికి అధిక ధరల్లో ఆహారం కొనాల్సి వస్తోంది. సూపర్‌ మార్కెట్ల నుంచి వచ్చే విరాళాలు నాటకీయంగా పడిపోయాయి. గార్డియన్‌ పత్రిక విలేకర్లు సేకరించిన సమాచారం ప్రకారం పెన్సిల్వేనియా ఆహార బ్యాంకులు వారానికి పదిలక్షల డాలర్లు అదనంగా ఖర్చు చేస్తున్నా వచ్చిన వారందరికీ ఆహారం అందచేయలేకపోతున్నాయి. అనేక కేంద్రాల బడ్జెట్లు తారుమారవుతున్నాయి. బియ్యం ధరలు మూడు రెట్లు పెరిగాయి, అవి బంగారంలా మారాయి, డబ్బాల్లో నిల్వఉండే పండ్లు, కూరగాయలు దొరకటం లేదు.గత సంవత్సరం నాలుగు కోట్ల మంది అమెరికన్లు 200 ఆహార బ్యాంకులు, 60వేల వంటశాలల వండిన ఆహారం లేదా వంట వస్తువులను పొందారు.

Electric car drivers face queues and quarrels
లాస్‌ వేగాస్‌లో విలాసవంతమైన కార్లు వేసుకొని తెల్లవారు ఝామున నాలుగు గంటలకు వచ్చి ఆరుగంటల పాటు వరుసలో ఉండి ఆహారాన్ని తీసుకుపోతున్నవారు ఉన్నారు. గత వారం శాన్‌ ఆంటోనియోలో అసాధారణ రీతిలో పదివేల మంది కార్లలో ఆహారం కోసం వచ్చారు. అదే సాధారణ సమయాల్లో నాలుగు వందల మంది వచ్చే వారు. కంపెనీల్లో లేఆఫ్‌లు పెరగటమే దీనికి కారణం. అనేక చోట్ల ఆహార బ్యాంకుల వద్ద భద్రతా సిబ్బందిని నియమించాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఇండ్లకే ఆహారం సరఫరా చేస్తున్నారు. సియాటిల్‌ నగరంలోని ఒక ఆహారబ్యాంకు బడ్జెట్‌ ఇప్పటి తీరును బట్టి ఎనిమిది రెట్లు పెరిగే అవకాశం ఉంది. ట్రంప్‌ వాణిజ్య యుద్దం కారణంగా ఆహార బ్యాంకులకు 2019లో 0.54 మిలియన్‌ డాలర్లకు వచ్చిన సరకులను కొనుగోలు చేయటానికి 2018లో 1.1మిలియన్‌ డాలర్లు కాగా ఈఏడాది అదే సరకుల విలువ 1.71 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. కరోనాకు ముందు లూసియానాలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఆకలితో ఉంటే ఇప్పుడు ముగ్గురిలో ఒకరు ఉన్నారు.
అమెరికన్లకు పొదుపు అలవాటు లేదు, ఉద్యోగాలు లేదా అప్పులు చేసి అవసరమైనవి కొనుగోలు చేసి బతికే విధంగా తయారయ్యారు. గత ఏడాది వివరాల ప్రకారం అమెరికన్లు 14లక్షల కోట్ల డాలర్ల మేరకు అప్పులు కలిగి ఉన్నారు. వాటిలో కార్ల రుణాలు 1.3లక్షల కోట్ల డాలర్లు, క్రెడిట్‌ కార్డు బకాయిలు లక్ష కోట్ల డాలర్లు, విద్యా రుణాలు 1.48 లక్షల కోట్లు, 9.4లక్షల కోట్ల తనఖా రుణాలు ఉన్నాయి.కొరత పోషకాహార సహాయ పధకానికి ఆహార కూపన్ల కోసం దరఖాస్తు చేసే వారికి గత డిసెంబరులో ట్రంప్‌ సర్కార్‌ సవరించిన నిబంధనల కారణంగా కనీసం ఏడు లక్షల మంది అనర్హులయ్యారని అంచనా. విధించిన షరతులను బాధితులు రుజువు చేయటం కష్టంగా మారింది. పద్దెనిమిది-49 సంవత్సరాల మధ్య వయస్సు వారు తమ మీద ఎవరూ ఆధారపడిలేరని, తాము వారానికి 20గంటలు పనిచేశామని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇవి చేసినా వారు మినహాయింపులు పొందిన ప్రాంతాలు, రాష్ట్రాలలో ఉన్నవారై ఉండాలి. దారిద్య్రరేఖ కింద ఉన్న వారి సంఖ్యను తక్కువ చేసి చూపేందుకు,నిరుద్యోగ భృతి చెల్లింపును ఎగవేసేందుకు ఈ పని చేశారు.

Rice is like gold': US food banks face shortfalls of millions of ...
అమెరికాలో రోజు రోజుకూ వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. ఎప్పటికి అదుపులోకి వస్తాయో చెప్పలేని స్ధితి. మరోవైపు నవంబరులో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి కూరుకుపోతున్నట్లు ఆందోళన పెరుగుతోంది. కరోనాకు ముందు, వ్యాధి తొలి రోజుల్లో ఎన్నికల్లో ట్రంప్‌ విజయం ఖాయం అని భావించిన వారు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. ట్రంప్‌ వైఫల్యం, మూర్ఖత్వం పౌరుల ప్రాణాల మీదకు తెచ్చింది. మరోవైపు డెమోక్రటిక్‌ పార్టీ తరఫున జోబిడెన్‌ అభ్యర్ధిత్వం ఖరారైంది. ప్రస్తుతం దేశమంతా కరోనా కల్లోలంలో మునిగి ఉంది. ముఫ్పైకోట్ల మంది గృహబందీలో ఉన్నారు. ఎప్పుడు తొలగించేది తెలియని స్ధితి. ఒక వైపు ఆకలి మరోవైపు నిరుద్యోగం, ఆర్ధిక మాంద్యం పెరుగుతున్న స్ధితిలో వాటి మీద కేంద్రీకరించకుండా జనాన్ని తప్పుదారి పట్టించేందుకు ట్రంప్‌ చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ధ మీద ప్రారంభించిన ప్రచార యుద్దం అతగాడికే ఎదురుతిరిగే అవకాశాలున్నాయన్నది ఒక అంచనా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పెద్దన్న ట్రంప్‌ పిచ్చిపనులపై నిజమైన దేశభక్తుల మౌనం తగదు మోడీ గారూ !

19 Sunday Apr 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

COVID- 19 pandemic, Donald trump angry at WHO, Donald Trump Madness, Narendra Modi, WHO

Donald Trump 'imitates Indian Prime Minister Narendra Modi's ...

ఎం కోటేశ్వరరావు
అమెరికా పెద్దన్న డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికన్ల ప్రాణాలు తీస్తున్నాడు, యావత్‌ ప్రపంచాన్ని అలవికాని ఆర్ధిక బాధల్లోకి నెడుతున్నాడు. ఈ వైఫల్యాన్ని, నేరాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థను, చైనాను దెబ్బతీసేందుకు పూనుకున్నాడు. ఈ వ్యాఖ్యతో ప్రారంభించిన ఈ రాతలో ఇంకేమి ఉంటుందిలే అని చప్పరించే వారు తమ సమయాన్ని వృధా చేసుకోనవసరం లేదని మనవి. ప్రాణ, విత్త, మానభంగములందు అసత్యాలు చెప్పవచ్చని మన పెద్దలు చెప్పారు. ట్రంప్‌ దానికి ఎన్నికలను కూడా జోడించాడు. నవంబరులో జరగాల్సిన ఎన్నికల్లో గట్టెక్కేందుకు ట్రంప్‌ ఎంతకైనా తెగించేందుకు సిద్దపడుతున్నాడని వేరే చెప్పనవసరం లేదు.
ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్ధలు ఏ ఒక్కరి సొత్తో కాదు. వాటిని ప్రారంభించే రోజు సంస్ధాపక సభ్య దేశాలలో కొన్నింటికి దురాలోచనలు మరికొన్నింటికీ దూరాలోచనలు ఉన్నాయి. ఎన్ని లోపాలున్నా అంతకంటే మెరుగైన ప్రపంచ వ్యవస్ధను ఏర్పాటు చేసుకొనే వరకు ఉన్నవాటిని రక్షించుకోవటం తప్ప మరొక మార్గం లేదు. ఈ రోజు ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనాకు అనుకూలంగా పని చేస్తోందని లేదా చైనా ఆ సంస్ధ మీద పెత్తనం చేస్తోందని నిజంగా నమ్మేవారు 1945 నుంచి 1971 వరకు చైనాను ఐక్యరాజ్యసమితి, దాని సంస్ధల గడప తొక్కనివ్వలేదని, చైనా పేరుతో తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌నే చైనాగా పరిగణిస్తూ అమెరికా మోకాలడ్డిందని, ఐరాసలో అనుమతించినా 2000 సంవత్సరం వరకు ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనాకు భాగస్వామ్యం కల్పించలేదని కూడా తెలుసుకోవాలి. మరో విధంగా చెప్పాలంటే పెత్తనం చేసింది. ఈ రోజు చైనా పెత్తనం చేస్తోందంటూ బుడిబుడి రాగాలు తీస్తోంది. ఇంతకాలం అమెరికా తప్పుడు పనులు చేసింది కనుకనే ఐరాసలో దానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి, అదేపని చైనా లేదా మరొక దేశం చేస్తే వాటికీ అదే పునరావృతం అవుతుంది. ఇప్పుడు చైనా అలాంటి తప్పులు చేస్తోందా? ఉదాహరణలు ఉంటే ఎవరైనా చెప్పాలి మరి !
ఐక్యరాజ్యసమితికి రూపకల్పన చేసిన సమయానికి అమెరికా అగ్రరాజ్యం. నిబంధనల కూర్పులో దానిదే పైచేయి. ఇప్పుడు వాటినే అది ప్రశ్నిస్తోంది. ఐరాస, దాని సంస్దలు సమర్ధవంతంగా లేదా ప్రజాస్వామ్య బద్దంగా పని చేయాలంటే సంస్కరణలు తేవాలి. దానికి బదులు అమెరికా వంటి దేశాలు అర్ధంతరంగా నిధులు నిలిపివేస్తే నష్టపోయేది మన వంటి లేదా ఇంకా దరిద్రంలో ఉన్న దేశాలే. ఇలాంటి చర్యలకు బ్లాక్‌మెయిల్‌ లేదా బెదరింపు అని తప్ప మరొక భావం, అర్ధం లేదు. పెద్దన్న బెదరింపులను నరేంద్రమోడీ ఎందుకు ప్రశ్నించటం లేదో తెలియదు. మన ప్రయోజనాలను రక్షించుకోవటమే దేశభక్తి అని అంగీకరిస్తే ఆచరణలో అది కనిపించాలి కదా ! అమెరికా మెడలు వంచి గత ఆరు సంవత్సరాలలో మనం సాధించిందేమిటి ? కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎవరి కోసం పని చేస్తున్నట్లు ?
అమెరికా తన ఆయుధాలను అమ్ముకొనేందుకు అనేక చోట్ల ప్రాంతీయ ఉద్రిక్తతలు, అంతర్యుద్ధాలను రెచ్చగొడుతోంది. గతంలో మన మీద పాకిస్ధాన్‌ను ఎగదోసింది, ఇప్పుడు మనలను దాని మీదకు ఎగదోస్తోంది. రెండు దేశాలకూ అవసరమైన ఆయుధాలను అందిస్తోంది, డాలర్లను జేబులో వేసుకుంటోంది. మనం ప్రాణాలను కాపాడే హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు ఇస్తే దానికి బదులు ప్రాణాలు తీసే ఆయుధాలను మనకు అమెరికా అందచేస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన పౌరుల ప్రాణ రక్షణకు అవసరమైన వెంటిలేటర్ల బదులు ఇతర దేశాల్లో ప్రాణాలు తీసే ఆయుధ తయారీకే ట్రంప్‌ ప్రాధాన్యత ఇస్తున్నాడు.
ఆఫ్ఘనిస్తాన్‌లో నాటి సోవియట్‌ యూనియన్‌ పలుకుబడిని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలిబాన్ల పేరుతో మత ఉ గ్రవాదులను తయారు చేసింది. సోవియట్‌ ఉపసంహరణ తరువాత వారు ఏకుమేకై అమెరికాకే తలనొప్పిగా తయారయ్యారు. అక్కడ తన సైన్యాన్ని నిర్వహించటం పెద్ద భారంగా మారింది, చివరకు ఉపసంహరణకు ఆ తాలిబాన్లతోనే చర్చలు జరపాల్సిన దుర్గతి ట్రంప్‌కు పట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌, ప్రపంచ సంపదలు, మిలిటరీ రీత్యా వ్యూహాత్మక ప్రాంతాల మీద పట్టు సాధించటం అమెరికా కార్పొరేట్ల అసలు లక్ష్యం. అక్కడి అధ్యక్షులందరూ వాటి కాపలాదారులు, సేవకులే.
బడ్జెట్‌ను సర్దుబాటు చేయలేక సతమతం అవుతున్న ట్రంప్‌ అధికారంలోకి రాగానే పొదుపు చర్యల్లో భాగంగా ఐక్యరాజ్యసమితి నిర్వహించే శాంతి పరిరక్షక కార్యకలాపాలకు అంద చేస్తున్న నిధుల కోత పెట్టాలని ప్రతిపాదించాడు. తరువాత అన్ని ఐరాస కార్యక్రమాలకు సగం కోత కోయాలని పార్లమెంట్‌ను కోరాడు.శాంతి పరిరక్షక కార్యకలాపాలకు కేటాయించే నిధుల మీద ఉన్న ఆంక్షలను 2001లో తొలగించారు. ట్రంప్‌ ప్రతిపాదనలను చర్చించిన పార్లమెంట్‌ శాంతిపరిరక్షక కార్యకలాపాల మొత్తాలకు తిరిగి పరిమితి విధించింది. దాంతో వాటికి అమెరికా అందచేస్తున్న మొత్తం 28 నుంచి 25శాతానికి తగ్గిపోయింది. ఆమొత్తం 2019లో 20 కోట్ల డాలర్లు. ఇదే సమయంలో రానున్న పది సంవత్సరాల కాలంలో శాంతి పరిరక్షక కార్యకలాపాలకు వంద కోట్ల డాలర్లు ఇవ్వాలని చైనా నిర్ణయించింది. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటు వేస్తున్న దేశాలకు చేస్తున్న సాయానికి కూడా కోత పెట్టాలని ట్రంప్‌ కార్యాలయం ప్రతిపాదించింది.
ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత ఈ ఏడాది జనవరి 19నాటికి 1095 రోజుల్లో ఆడిన అబద్దాల సంఖ్య 16,241 అని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక ఒక విశ్లేషణలో వెల్లడించింది. నోరు తెరిస్తే రోజూ ఏదో ఒక అబద్దం ఆడిన అధ్యక్షుడు అమెరికా చరిత్రలో మరొకరు లేరు. ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధులు నిలిపివేసేందుకు ఆడిన అబద్దాలు ఎన్నో ! చైనా చెప్పినట్లు చేస్తోంది, చైనా దాచిన సమాచారాన్ని సమర్ధించింది. ఊహాన్‌లో కరోనా వ్యాప్తి పెద్ద సమస్య కాదని చెప్పిందట, అమెరికా సరిహద్దులను చైనాకు తెరిచి ఉంచాలని తొలుత సలహా ఇచ్చిందట. ఆరోగ్య సంస్ధ ఒక వేళ చెప్పిందే అనుకుందాం, మాకంటే మొనగాండ్లు లేరని విర్రవీగే సిఐఏ, ఎఫ్‌బిఐ తెలివి తేటలు ఏమయ్యాయి. చైనా సమాచారాన్ని దాచిందే అనుకుందాం, నష్టపోయేది వారే కదా ! ఎదుటి వాడు తొడకోసుకుంటే తెలిసి ఎవరైనా మెడకోసుకుంటారా ? అమెరికా, ఐరోపా దేశాలు చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ద చెప్పిన వాటిని పెడచెవిన పెట్టి తమ పౌరుల ప్రాణాల మీదకు తేవటాన్ని ఏమనాలి ?
అసలేమి జరిగిందో చూద్దాం. కరోనా వైరస్‌ నిర్ధారణ గాక ముందు డిసెంబరు 31న చైనా ఒక ప్రకటన చేస్తూ ఊహాన్‌ నగరంలో న్యుమోనియా కేసులు అసాధారణంగా నమోదైనట్లు వెల్లడించింది. జనవరి ఏడవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక నూతన కరోనా వైరస్‌ వ్యాప్తిలోకి వచ్చినట్లు నిర్ధారించింది. పన్నెండవ తేదీనాటికి దాని పూర్తి జన్యువును నిర్ధారించింది. తొమ్మిది రోజుల తరువాత తన తొలి శాస్త్రవేత్తల బృందాన్ని ఊహాన్‌ నగరానికి పంపింది. జనవరి 30న ఏక కాలంలో అనేక మందికి సోకే అంటువ్యాధిగా ప్రజారోగ్యానికి ప్రమాదం వచ్చిందని, అంతర్జాతీయ సమాజం అత్యవసరమైన అంశంగా పరిగణించాలని ప్రకటించింది. అయితే ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు వ్యాపించుతుందని స్పష్టమైన ఆధారాలు లేవని చైనా చేసిన ప్రకటనను జనవరి 14న ప్రపంచ ఆరోగ్య సంస్ధ ట్వీట్‌ చేసింది. తరువాత వచ్చిన సమాచారం మేరకు ఆ తప్పిదాన్ని సరిచేసుకుంది.కానీ ట్రంప్‌ చెప్పినట్లు అమెరికాను లేదా ప్రపంచాన్ని గానీ తప్పుదారి పట్టించలేదు. నిజానికి ఐరోపా ధనిక దేశాలు, ట్రంప్‌, యావత్‌ అమెరికా యంత్రాంగం ఆ హెచ్చరికలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ద ప్రకటనలను పట్టించుకోనవసరం లేదని జనవరి 22న ట్రంప్‌ చెప్పాడు. ఫిబ్రవరి పదవ తేదీన న్యూహాంప్‌షైర్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ ఏప్రిల్‌ నాటికి వాతావరణం వేడెక్కుతుంది, కరోనా వైరస్‌ ఎలా వచ్చిందో అలాగే ఆశ్చర్యకరంగా అదృశ్యం అవుతుంది అన్నాడు. ఫిబ్రవరి 26న విలేకర్లతో మాట్లాడుతూ ఇది ఫ్లూ, ఫ్లూ వంటిది, అమెరికాలో ప్రతి ఏటా వేలాది మంది ఫ్లూతో మరణిస్తుంటారని తెలియదా అన్నాడు. మార్చి తొమ్మిదవ తేదీన కరోనాను తాము సమర్దవంతంగా ఎదుర్కొన్నామని ప్రకటించాడు. అత్యధిక కేసులు, మరణాలో అమెరికాలో మరణ మృదంగం మోగుతుంటే ఇలాంటి పెద్ద మనిషి ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధను తప్పుపడుతున్నాడు. తన తప్పిదం లేదని జనాన్ని నమ్మించేందుకు అబద్దాల మీద అబద్దాలు ఆడుతున్నాడు. కట్టుకథలను మీడియాకు అందిస్తున్నాడు.

Ingram Pinn's illustration of the week: 'A beautiful timeline ...
ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాల్సి ఉంది. చైనాలో కరోనా వైరస్‌ గురించి ఒక వైద్యుడు ముందే హెచ్చరించాడన్నది ఒక అంశం. అది నిజమై ఉండవచ్చు.ఒక ప్రాంతంలో తలెత్తిన ఒక ప్రమాదకర వైరస్‌ను ఎవరో ఒకరు లేదా ఒక బృందం ముందుగా అనుమానించటం లేదా కనుగొనటం సహజమే. అయితే అది యావత్‌ సమాజాన్ని భయాందోళనకు గురిచేసేది అయితే ముందుగా ప్రభుత్వంతో సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోకుండా, ఏర్పాట్లు చేయకుండా బయటకు వెల్లడిస్తే సమాజం అల్లకల్లోలం అవుతుంది. సదరు వైద్యుడు తాను అనుమానించిన అంశాన్ని నిర్దారిస్తూ సోషల్‌ మీడియాలో తన సహచరులతో పంచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు సుధాకర్‌ ఆసుపత్రిలో తగిన రక్షణ పరికరాలు లేవని, పోలీసుల ప్రవర్తన సరిగా లేదని తప్పుపట్టటం, మంత్రులతో సహా ఎవరూ పట్టించుకోవటం లేదని బహిరంగంగా చేసిన విమర్శను సహించని ప్రభుత్వం అతని మీద చర్య తీసుకుంది. అలాంటిది ఒక వైరస్‌ భయంకరమైనదని ఒక బృందం లేదా సంస్ధ నిర్దారించకుండా ఒక వైద్యుడు సోషల్‌ మీడియాలో ప్రచారం చేయటాన్ని ఏ సర్కార్‌ అయినా ఎలా తీసుకుంటుంది ? తప్పుపడుతూ చైనా సర్కార్‌ ఆ వైద్యుడిపై చర్య తీసుకుంది. అతను చెప్పింది నిజమైంది గనుక తరువాత తన చర్యను సరిదిద్దుకుంది. ఒక వేళ అవాస్తవం అయి ఉంటే ?
2009, 10 సంవత్సరాలలో స్వైన్‌ ఫ్లూ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. అది 1918-19లో ప్రపంచాన్ని వణికించి లక్షల మంది ప్రాణాలను బలిగొన్న స్పానిష్‌ ప్లూ హెచ్‌1ఎన్‌1 ఇన్‌ఫ్లూయంజా వైరస్‌ తాలుకు కొత్త రకం .పక్షులు, పందులు, మనుషుల నుంచి పునర్వర్గీకరణం చెందింది. ఇది పందుల నుంచి వ్యాపించిన వైరస్‌ కావటంతో దాన్నీ స్వైన్‌(పంది)ఫ్లూ అని పిలిచారు.ఇది కనీసం 70 నుంచి 140 కోట్ల మందికి సోకిందని అంచనా వేశారు. అయితే మరణించిన వారు 1.5లక్షల నుంచి 5.75లక్షల మంది ఉంటారని అంచనా వేశారు.అధికారికంగా ఆయా దేశాలు ప్రకటించిన మేరకు 67లక్షల 24,149 మందికి వ్యాధి సోకగా మరణించిన వారి సంఖ్య 19,654 మాత్రమే. ప్రతి ఏటా ప్రపంచంలో ఫ్లూ(జలుబు) కారణంగా మరణించే వారు రెండున్నర నుంచి ఐదు లక్షల మంది వరకు ఉంటారని, దీనితో పోల్చుకుంటే స్వైన్‌ ప్లూతో మరణించిన వారు తక్కువే అని కొందరు పోలిక చెప్పారు. కొందరు ఆరోపిస్తున్నట్లు కరోనాకు చైనాయే కారణమైతే ఏటా లక్షల మందిని బలిగొంటున్న ఫ్లూ వైరస్‌ను ఎవరు వదులుతున్నట్లు ?
స్వైన్‌ ఫ్లూ తొలుత మెక్సికోలోని పందుల ఫారాల నుంచి సోకి 2009 మార్చి తొమ్మిదవ తేదీన ఒక ఐదు సంవత్సరాల బాలుడిలో బయటపడింది. ఏప్రిల్‌ చివరిలో 50 రోజుల తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రజారోగ్యానికి ముప్పు తెచ్చే అంటువ్యాధిగా ప్రకటించింది. అంత సమయం ఎందుకు తీసుకున్నట్లని ఎవరూ ఆనాడు సంస్ధను తప్పుపట్టలేదు. నిధులు నిలిపివేయలేదు. అన్ని అంశాలను నిర్ధారించుకున్న తరువాతే ఒక బాధ్యతాయుత సంస్ధ వ్యవహరిస్తుంది. తాము అనేక నివారణ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ఆ రోజుల్లో గొప్పలు చెప్పుకున్నప్పటికీ అక్టోబరు 24న నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్ధితిని ప్రకటించాడు. అన్ని నెలలు ఎందుకు ఆలస్యం చేసినట్లు ? మరణాల సంఖ్య అధికార రీత్యా ప్రకటించిన మేరకు తక్కువే అయినా అగ్రస్ధానంలో అమెరికాయే ఉంది. ఇక మన దేశం విషయానికి వస్తే అమెరికా నుంచి వచ్చిన ఒక వ్యక్తి స్వైన్‌ ఫ్లూను మోసుకు వచ్చాడు. హైదరాబాదు విమానాశ్రయంలో మే 13వ తేదీన గుర్తించారు, ఆగస్టు నాటికి అనేక రాష్ట్రాలకు విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికులు 937 మంది మరణించగా ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏలుబడిలో గుజరాత్‌ 488 మరణాలతో రెండవ స్ధానంలో నిలిచింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనా మీద ఆధారపడింది అనటం ఎంతవరకు వాస్తవం ? ప్రపంచ ఆరోగ్య సంస్దకు మేము ఏటా 40 నుంచి 50 కోట్ల డాలర్లు అందచేస్తున్నాము, అదే చైనా నాలుగు కోట్ల డాలర్లు, అంతకంటే తక్కువే ఇస్తోంది. ఒక ప్రధాన ప్రాయోజిత దేశంగా ఉన్న తమకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ పూర్తి జవాబుదారీగా ఉండాలని కోరే హక్కు మాకుంది అని ట్రంప్‌ సెలవిచ్చాడు. అంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తున్నంత మాత్రాన అమెరికా చెప్పినట్లు ఏ సంస్ధ అయినా నడవాలా ?
అంటు వ్యాధుల నివారణ సమాచారం ఎవరి దగ్గర ఉంటే ఆ దేశాల మీద ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆధారపడటం సహజం. ప్రజారోగ్యం విషయంలో చైనా ప్రత్యేక చర్యలు, 2003లో కరోనా తరగతికి చెందిన సారస్‌ను చైనాలో సమర్దవంతంగా అరికట్టిన చరిత్ర, దానికి సంబంధించి వారి దగ్గర ఉన్న సమాచారం మరొక దేశం దగ్గర లేదు. కనుకనే కరోనా నిర్దారణ కాగానే చైనా సమాచారం మీద ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆధారపడింది తప్ప నిధులు ఎక్కువ పొందో లేక మరొక ప్రలోభంతోనో కాదు. ప్రపంచ రాజకీయాల్లో ఐరోపా యూనియన్‌ అమెరికాతో ఉంటుంది తప్ప చైనా మిత్రపక్షం కాదు. అలాంటిది నిధులు నిలిపివేయాలన్న ట్రంప్‌ చర్యను ఖండిస్తూ తీవ్ర విచారం ప్రకటించింది. నిందల వలన ఎలాంటి ప్రయోజనం లేదు. వైరస్‌కు సరిహద్దులు లేవు. ఐక్యరాజ్యసమితికి ప్రత్యేకించి నిధుల లేమితో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్దను బలపరచాలి, వాక్సిన్ల తయారీ పరీక్షల అభివృద్ధికి తోడ్పడాలని జర్మన్‌ విదేశాంగ మంత్రి హెయికో మాస్‌ వ్యాఖ్యానించాడు.
తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు ట్రంప్‌ చైనా మీద, ప్రపంచ ఆరోగ్య సంస్ధ మీద నిందలు వేశాడు. ఐక్యరాజ్యసమితి సంస్ధలను తన రాజకీయాలు, దుర్మార్గ చర్యలకు ఉపయోగించుకోవటం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు వాటిని తన కనుసైగలతో నడిపించిన అమెరికా ఇప్పుడు ప్రాభవం కోల్పోతుండటంతో ఇతర దేశాలు అలాగే వ్యవహరిస్తున్నాయనే అనుమానపు జబ్బుకు గురైంది.
మన కళ్ల ముందే ఇరాక్‌లో ఏం జరిగిందో చూశాము. ఇరాన్‌కు వ్యతిరేకంగా పని చేసినంతకాలం ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుసేన్‌కు అన్ని రకాల ఆయుధాలను అందించి పదేండ్ల పాటు యుద్దం చేయించటంలో అమెరికా పాత్ర బహిరంగ రహస్యం. తరువాత అదే సద్దామ్‌ అమెరికా వ్యతిరేకిగా మారటంతో సద్దామ్‌ను వదిలించుకొనేందుకు ఇరాక్‌లో మారణాయుధాలను గుట్టలుగా పోశారని అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రచారం ప్రారంభించాయి. అమెరికా పన్నిన వ్యూహంలో చిక్కుకున్న సద్దామ్‌ కువైట్‌పై దాడి చేసి అమెరికా సైనిక జోక్యానికి అవకాశం కల్పించాడు.
భద్రతా మండలిలో తీర్మానం చేయించి ఇరాక్‌లో మారణాయుధాలను వెతికే పేరుతో అంతర్జాతీయ అణు ఇంధన సంస్ద ప్రతినిధి బృందాన్ని పంపారు.దానితో పాటు అమెరికా ప్రతినిధులు కూడా వెళ్లారు. దానిలో సిఐఏ ఏజంట్లు ఉన్నారని అప్పుడే వార్తలు వచ్చాయి.రెండు బృందాలు కలసి రెండు సంవత్సరాల పాటు ఇరాక్‌లో తిష్టవేసి వంద కోట్ల డాలర్లు ఖర్చు చేసి 1,625 మంది 1,700 స్దలాలను వెతికి చివరికి ప్రకటించిందేమంటే ఎలాంటి ఆయుధ ఆనవాళ్లు లేదా జీవ, రసాయన ఆయుధ కార్యక్రమాలు లేవని తేల్చారు. బుష్‌ విచారం వ్యక్తం చేశాడు. అయితే తమ చర్యను సమర్దించుకొనేందుకు ఆ కార్యక్రమాలను రద్దు చేసిన ఆనవాళ్లు దొరికాయని ప్రకటించి అమెరికా, ఇతర దేశాల యుద్ద నేరాలను కప్పిపుచ్చారు. ఆ పేరుతో ఇరాక్‌ను ఆక్రమించిన అమెరికా సేనలు చివరకు సద్దామ్‌ హుసేన్‌ను ఉరితీసి తమ తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.అమెరికా దాడి కారణంగా లక్షా తొమ్మిదివేల మంది మరణించినట్లు వికీలీక్స్‌ బయటపెట్టిన అమెరికా పత్రాల్లో ఉండగా మరో అంచనా ప్రకారం పదిలక్షల మంది ఇరాకీయులు అమెరికా కారణంగా మరణించారు. ఆల్‌ ఖైదాకు ఇరాక్‌ పాలకులకు ఎలాంటి సంబంధం లేదని సిఐఏ రహస్య పత్రాలు వెల్లడించాయి. అమెరికా చెప్పిన వన్నీ అబద్దాలే అని తేలిపోయింది. అలాంటి అమెరికా చైనా,ప్రపంచ ఆరోగ్య సంస్ధ గురించి ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే నమ్మటం ఎలా ?

ఊహాన్‌లో సంభవించిన కరోనా మరణాల సంఖ్యను సవరించినట్లు చైనాయే స్వయంగా ప్రకటించింది. దీన్ని చూపి చూశారా చైనా నిజాలను దాచిందని మేం ముందే చెప్పాం అంటూ అమెరికా లేదా ఎవరైనా వాదించవచ్చు. వివిధ కారణాలతో కోటి మంది జనాభా ఉన్న ఊహాన్‌లో రోజూ అనేక మంది మరణిస్తుంటారు. అధికార యంత్రాంగం కరోనా మరణాలను కొన్నింటిని సహజ మరణాలుగా నమోదు చేసి ఉండవచ్చు. తరువాత విచారణలో కాదని తేలినందున అంకెలను సవరించారు. అదేమీ నేరం కాదే. మరణాలు, శ్మశానాల్లో అస్ధికలశాల సంఖ్య గురించి పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. నిజంగా వాటిని అక్కడి ప్రభుత్వాలు, పాలకులు నమ్మితే, పెద్ద సంఖ్యలో మరణించినట్లు చెబుతున్నదానికి ఆధారాలుంటే, అలాంటి ప్రమాదకారి కరోనా కట్టడికి అమెరికా, ఇతర ఐరోపా దేశాలు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం చెప్పిన వారు లేరు. పాత చింతకాయ పచ్చడినే కొత్తగా వండి వడ్డిస్తున్నారు.
ఒక్క ప్రపంచ ఆరోగ్య సంస్ధ మీదనే కాదు అనేక సంస్ధల మీద ట్రంప్‌ సర్కార్‌ దాడి చేసింది. అదిరించి బెదిరించి లొంగదీసుకోవాలని చూసింది. ఆప్ఘనిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన అమెరికన్ల మీద , ఇతర దేశాలపై అమెరికా విధించిన ఆర్ధిక ఆంక్షలు, ప్రయాణ నిషేధాలపై విచారణ జరుపుతున్న అంతర్జాతీయ నేర కోర్టు న్యాయమూర్తులు, సిబ్బందిని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పని చేసిన జాన్‌ బోల్టన్‌ బెదిరించాడు. అంతర్జాతీయ మానవహక్కుల ఉల్లంఘనల గురించి నిత్యం ఇతర దేశాలపై దుమెత్తిపోసే అమెరికా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్ధ నుంచి వైదొలిగిన తొలి దేశంగా చరిత్రలో నమోదైంది. అమెరికాలో దారిద్య్రం గురించి ఒక నివేదికను రూపొందించేందుకు ధైర్యం చేసిన ప్రొఫెసర్‌ ఫిలిప్‌ ఆల్‌స్టన్‌ను ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ విమర్శించాడు. ప్రపంచవ్యాపితంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి వలసపోవటం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. అసలు అమెరికా అంటేనే వలస వచ్చిన వారితో కూడిన దేశం, అలాంటిది ప్రపంచ వలసల చర్చల నుంచి అమెరికా వైదొలిగింది. యునెస్కో నుంచి వైదొలిగి శాశ్వత పరిశీలక దేశంగా ఉంటానని ప్రకటించింది. వాతావరణ మార్పులు, యూదుల పట్ల వ్యతిరేకత, వారి మీద జరిగిన మారణకాండ వంటి అంశాల మీద యునెస్కో పని చేయటం, దానిలో అమెరికా పాత్ర బయటకు రావటం సహించలేని అమెరికా ఈ చర్యకు పాల్పడింది. పాలస్తీనియన్లు, ఇతర చోట్ల నిర్వాసితులుగా మారిన వారి సహాయ చర్యలు చేపట్టే సంస్ధకు తామింకేమాత్రం నిధులు అందచేసేది లేదని ట్రంప్‌ సర్కార్‌ ప్రకటించింది. ఇలాంటి చర్యలను చూసిన తరువాత అనేక మందిలో సందేహాలు తలెత్తుతున్నాయి. ఐక్యరాజ్యసమితిని అమెరికా మిత్రునిగా చూస్తోందో శత్రువుగా భావిస్తోందా అన్నవే అవి. ఇదంతా ఇంటర్నెట్‌లో వెతికితే ఎవరికైనా దొరికే సమాచారమే !
ఇటీవలి కాలంలో ఏమి చేసినా చివరికి ప్రధాని నరేంద్రమోడీని అవమానించినా అమెరికా, ట్రంప్‌ను బలపరిచే, గుడ్డిగా వెనకేసుకు వచ్చే, చైనా మీద బురద చల్లే ఒక అనాలోచిత ధోరణి మన దేశంలో వెల్లడి అవుతోంది. అమెరికాను నమ్మితే కుక్కతోకను బట్టి గోదావరిని దాటే యత్నం లాంటిదే. నరేంద్రమోడీని లేదా మరొకరిని వ్యక్తిగా లేదా ఒక రాజకీయవేత్తగా విమర్శిస్తే దాని సంగతి వారు చూసుకుంటారు. ప్రధాని పదవిలో ఉన్నపుడు అవమానాలు పాలుకావటం అంటే దేశ వ్యవస్ధనే అవమానించటంతో సమానం. అమెరికా పౌరుడు బిల్‌ గేట్సే తమ ప్రభుత్వ చర్యను విమర్శించాడు. కానీ మన పాలకపక్షాలకు ఆ మాత్రం ధైర్యం కూడా లేదు. ముందు కరోనా నివారణకు మన ప్రాధాన్యత అని మన ప్రభుత్వ ప్రతినిధి ఒక ముక్తాయింపు ఇచ్చారు. మిగతా దేశాలకు ఆ మాత్రం తెలియక విమర్శించినట్లా ?

Who's Ready to Die for Trump's Ego? | Common Dreams Views
ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధులు ఆగిపోతే నష్టపోయేది మనవంటి దేశాలే అని గుర్తించటం అవసరం. అమెరికా, ఇతర ఐరోపా దేశాలలోని బహుళజాతి ఔషధ గుత్త సంస్ధలు ప్రజారోగ్యం, మహమ్మారులకు సంబంధించిన సమాచారంపై గుత్తాధిపత్యంతో ఔషధాలు, వాక్సిన్ల తయారీకి పూనుకోవటం తెలిసిందే. మన వంటి వర్ధమాన దేశాలకు అవసరమైన సలహాలు, సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి మాత్రమే పొందగలం. నిధులు లేక దాని కార్యకలాపాలు కుంటుపడితే నష్టపోయేది మన దేశం, మన ఔషధ కంపెనీలే అని గుర్తించాలి. కామెర్ల ఔషధం మన దేశ సంస్ధలు తయారు చేయక ముందు విదేశీ రకాలకు ఎంత ధర చెల్లించామో తెలిసినదే. మన వంటి దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఎంతగానో తోడ్పడుతోంది. అందువలన ట్రంప్‌ చర్యను యావత్‌ సభ్య సమాజం నిరసించాలి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య సంస్ధలో మన దేశానికి వ్యతిరేకంగా అమెరికా ఎన్నో కేసులను దాఖలు చేసింది. రాబోయే రోజుల్లో ఇంకా అలాంటివి ఎన్నో చూడాల్సి రావచ్చు. అందుకే కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ప్రపంచ సంస్ధలను కాపాడుకొనేందుకు పూనుకోవాలి. ట్రంప్‌ను ఏ విధంగా సమర్ధించినా అది దేశద్రోహం తప్ప దేశభక్తి కాదు !

(అమెరికా పెద్దన్న ట్రంప్‌కు ఆరోగ్య సంస్ధ మీద ఆగ్రహం ఎందుకు -2 ముగింపు)

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా పెద్దన్న ట్రంప్‌కు ఆరోగ్య సంస్ధ మీద ఆగ్రహం ఎందుకు -1

17 Friday Apr 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

COVID- 19 pandemic, Donald trump, Donald trump angry at WHO, UNO, WHO

Donald Trump | WHO Coronavirus | US President Donald Trump Latest ...
ఎం కోటేశ్వరరావు
ప్రపంచ పెద్దన్న డోనాల్డ్‌ ట్రంప్‌కు అకారణంగా కోపం వచ్చింది. వయసు మీద పడిన ప్రభావం అనుకుందామా ? కొద్ది రోజుల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్దను, చైనాను పొగిడి వెంటనే తెగడటాన్ని ఏమనాలి ? ప్రపంచ ఆరోగ్య సంస్ధకు 50కోట్ల డాలర్ల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు. తన ఆంగ్లం మీద, విడిగా మాట్లాడిన అంశాల మీద జోకులు పేల్చినా, పరువు తీసినా నోరు మెదపని చిన్నన్న నరేంద్రమోడీ ఈ పరిణామం మీద మాట్లాడతారని ఎలా అనుకుంటాం ! ప్రపంచ వ్యాపితంగా కరోనా నిరోధ చర్యలను సమన్వయపరచాలని కోరుతున్న మోడీ ఈ ఆపద సమయంలో తన జిగినీ దోస్తు తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టకపోయినా మరొక్కసారి ఆలోచించన్నా అని ఎందుకు ప్రాధేయపడలేకపోయారు ? అసలు ఈ చర్యకు ట్రంప్‌ చెబుతున్న కారణం ఎంతమేరకు నిజం ?
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు కర్ర ఉన్నవాడిదే గొర్రె. బలమైన దేశాలు బలహీనమైన వాటిని వలసలుగా చేసుకున్నాయి. వలసల ఆక్రమణలో ముందున్న వాటితో వెనుకబడినవి ఏదో ఒక పేరుతో గిల్లి కజ్జాలు పెట్టుకొని అనేక ప్రాంతీయ యుద్దాలకు తలపడ్డాయి.మన బొబ్బిలి యుద్దం, పక్కనే ఉన్న మైసూరు యుద్దాలు అవే. ఇలాంటివి మరింత ముదిరి బలవంతంగా ప్రపంచాన్ని పంచుకొనేందుకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. దాంతో సమస్య పరిష్కారం కాలేదు. సంధి ప్రయత్నంగా నానాజాతి సమితి పేరుతో మరో యుద్ధం రాకూడదని ఒక ఏర్పాటు చేసుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో పరాజిత దేశాలు తిరిగి పుంజుకొని మరోమారు వాటా కోసం తలపడ్డాయి. ఫలితమే రెండవ ప్రపంచ యుద్దం. దాని పర్యవసానం వలసల ఏర్పాటు సాధ్యం కాకుండా చేసింది. నానాజాతి సమితి స్ధానంలో ఏర్పడిందే ఐక్యరాజ్య సమితి. దానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధతో సహా అనేక సంస్ధలు అనుబంధంగా ఏర్పడ్డాయి. ఈ వ్యవస్ధలోనూ విజేతలదే పెత్తనం. అందునా రెండు ప్రపంచ యుద్ధాలలో ప్రత్యక్షంగా లేదా ప్రధాన యుద్ధ రంగాలలో పాల్గొనకుండా అటూ ఇటూ ఆయుధాలను అమ్మి సొమ్ముచేసుకున్న అమెరికా పరోక్షంగా ప్రపంచాన్ని, పెత్తనాన్ని తన చేతుల్లోకి తీసుకొనేందుకు ప్రయత్నించింది. సోవియట్‌ యూనియన్‌ అడ్డుకోవటంతో దాని ఆటలు పూర్తిగా సాగలేదు.1970దశకంలో చైనాకు ఐరాసలో స్ధానం కల్పించారు. సోవియట్‌-చైనా మధ్య తలెత్తిన విబేధాలను సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించిన అమెరికా తీవ్ర ఆశాభంగం చెందింది. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత చైనాను దెబ్బతీయాలని ప్రయత్నించారు. అయితే ఆ క్రమంలో చైనా బలపడింది, అమెరికా ఇతర దేశాల ఆశలు నెరవేరలేదు. ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ, ఇతర ప్రపంచ సంస్ధలతో తాము అనుకున్న లబ్ది చేకూరటం లేదు అని అర్దం చేసుకున్న అమెరికా అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు ఈ సంస్ధలను విమర్శించటం ప్రారంభించింది. అది ఐరాసకే పరిమితం కాలేదు. తాను ఏర్పాటు చేసిన మిలటరీ కూటమి నాటోను కూడా వదల్లేదు. ఐక్యరాజ్యసమితి సంస్ధలకు ఇస్తున్న విరాళాలను తగ్గించేందుకు పూనుకుంది. నాటో ద్వారా తాము ఐరోపాను రక్షిస్తుంటే అందుకయ్యే ఖర్చును పూర్తిగా మేమే ఎందుకు భరించాలి సభ్యదేశాలు కూడా పంచుకోవాలి అని ట్రంప్‌ బహిరంగంగానే ప్రకటించాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు కరోనా సందర్భాన్ని వినియోగించుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధుల నిలిపివేత నిర్ణయం తీసుకున్నాడు. దానికి అతకని సాకులు చెప్పాడు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధ , మిగతా ఐరాస సంస్ధల భవితవ్యం ఏమిటి ? ఈ అంశాలను అర్ధం చేసుకోవాలంటే నేపధ్యంలోకి పోకుండా సాధ్యం కాదు.
ప్రపంచ శాంతి, భద్రతల కోసమే ఐరాసను ఏర్పాటు చేశారు. మార్కెట్లకోసం జరుగుతున్న పోటీలో అవాంఛనీయ పోకడల నివారణకు ఏర్పాటు చేసిందే ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ). ప్రపంచీకరణ పేరుతో ఈ వ్యవస్ధ ద్వారా లబ్ది పొందాలనుకున్న ధనిక దేశాలు ఆచరణలో తాము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అని గ్రహించగానే ఈ సంస్ధను నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నాయి. ధనిక దేశాలలో 2008 ఆర్ధిక సంక్షోభం తరువాత వివిధ దేశాలు డబ్ల్యుటిఓతో నిమిత్తం లేకుండా తీసుకున్న రక్షణాత్మక చర్యలు, చేసుకున్న ద్వౌపాక్షిక ఒప్పందాల తీరు తెన్నుల గురించి అలయన్స్‌ అండ్‌ యులెర్‌ హెర్మ్‌స్‌ ఎకనమిక్‌ సంస్ధ గతేడాది నవంబరులో ఒక నివేదికను విడుదల చేసింది. అగ్రరాజ్యం అమెరికా 790, జర్మనీ 390,బ్రిటన్‌ 357, ఫ్రాన్స్‌ 262, కెనడా 199, ఆస్ట్రేలియా 174 చర్యలు, ఒప్పందాలు చేసుకున్నాయి. ధనిక దేశాల దెబ్బను తట్టుకొనేందుకు వర్ధమాన దేశాల్లో మన దేశం 566, బ్రెజిల్‌ 302, చైనా 256 చర్యలు తీసుకున్నట్లు ఆ నివేదిక తెలిపింది. గత పన్నెండు సంవత్సరాలలో వాణిజ్య విధానం ఆయా దేశాల లక్ష్యాల సాధనకు ఒక ఆయుధంగా మారింది. జాతీయ భద్రత పేరుతో తన మిత్రదేశాలైన కెనడా, మెక్సికో ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా 2018 మేనెలలో 25,10శాతాల చొప్పున దిగుమతి పన్ను విధించింది. తాము కూడా ప్రతీకార చర్యలకు పూనుకుంటామని హెచ్చరించటంతో ఏడాది తరువాత రద్దు చేసింది. ఐరోపా యూనియన్‌ దేశాలు కూడా మిత్రదేశాలే అయినా 7.5బిలియన్‌ డాలర్ల మేరకు అమెరికా పన్నులు విధించింది. ఇక చైనా గురించి ఏకంగా వాణిజ్య యుద్దమే ప్రారంభించింది.కరోనా కారణంగా అది తాత్కాలికంగా ఆగిపోయింది. చైనా వస్తువుల మీద తాము విధించిన పన్ను దెబ్బకు భయపడిపోయి ఆ మేరకు ధరలు చైనా సంస్ధలు ధరలు తగ్గిస్తాయని ట్రంప్‌ పేరాశలు పెట్టుకున్నాడు. అయితే చైనా కూడా ప్రతి చర్యలు తీసుకుంది. మరోవైపు చైనా వస్తువులపై విధించిన పన్ను మొత్తాలను అధిక ధరల రూపంలో అమెరికా వినియోగదారులే చెల్లించాల్సి రావటంతో ట్రంప్‌ దిక్కుతోచని స్ధితిలో ఉండగా కరోనా వచ్చింది.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఉంది. గత ఏడుదశాబ్దాలుగా ఐరాస, దాని అనుబంధ సంస్ధల కార్యాలయాలు చాలా మేరకు అక్కడే ఉన్నాయి. వాటికయ్యే ఖర్చులో గణనీయ మొత్తం అమెరికా భరిస్తోంది. అయితే తాను ఖర్చు చేసిన ప్రతిడాలరుకు ఎంతలాభం వస్తుందో అమెరికా లెక్కవేసుకుంటుంది. అంతర్జాతీయ సంస్ధల కార్యకలాపాల నిమిత్తం వచ్చే ప్రతినిధి వర్గాలు, దేశాధినేతలు చేసే ఖర్చు, ఐరాస సిబ్బంది చెల్లించే పన్నులు అన్నీ వివిధ ప్రయివేటు సంస్ధలు, న్యూయార్క్‌ నగర ఖజానాలో పడతాయి.వాణిజ్యం, రియలెస్టేట్‌ పెరుగుతుంది. (ఇక్కడ ఏపి ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి మూడు ప్రాంతాల్లో రాజధానులు, కార్యాలయాల ఏర్పాటు ద్వారా అభివృద్ధి సాధిస్తామని చెప్పటం, తెలంగాణాలో కొత్త జిల్లాలు ఏర్పడినపుడు వాటి కార్యాలయాల ఏర్పాటు ప్రాంతాల ఎంపికలో రాజకీయాలను గుర్తు చేయటం సముచితంగా ఉంటుంది)

WHO | Publications
2017లో ఐక్యరాజ్యసమితి ఖర్చు 50బిలియన్‌ డాలర్లు కాగా అమెరికా పదిబిలియన్‌ డాలర్లు వివిధ రూపాలలో అందచేసింది. ఇంత ఖర్చు ఎంతకాలం భరిస్తాం, అసలు మనం ఎందుకు భరించాలి అనే ప్రశ్నలను ట్రంప్‌ యంత్రాంగం ఆనాడే లేవనెత్తింది. కోత పెట్టాల్సిందే అని ట్రంప్‌ ప్రతిపాదించాడు. ఐరాసలో ప్రస్తుతం 193 దేశాలు ఉన్నాయి. ప్రతి సభ్యరాజ్యం ఎంత సొమ్ము సభ్యత్వరుసుముగా చెల్లించాలో ఒక ఫార్ములా ఉంది. ఆయా దేశాల జాతీయ ఆదాయం, జనాభా, ఇతర మరికొన్ని అంశాలను బట్టి అది నిర్ణయం అవుతుంది.హెచ్చు తగ్గులను బట్టి మారుతూ ఉంటుంది.ఈ మొత్తాలను విధిగా చెల్లించాలి, లేకుంటే ఐరాస నుంచి వెళ్లిపోవాలి. ఈ సొమ్ముతో ఐరాస రోజువారీ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అది గాక ఐరాస చేపట్టే కార్యక్రమాలు అది ఆరోగ్య పధకం కావచ్చు లేదా ఏదైనా దేశంలో శాంతిస్ధాపక కార్యక్రమం వంటివి కావచ్చు. వీటికి దేశాలు, సంస్ధలూ విరాళాల రూపంలో ఐరాసకు అందచేస్తున్నాయి. ఇక్కడే తిరకాసు ఉంది, ట్రంప్‌ ప్రస్తుతం ఈ మొత్తాన్నే నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు.
ఒక్కసారి వెనుక్కు చూసుకుంటే ఇరాక్‌లో సద్దామ్‌ హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి ప్రపంచ మానవాళికి ముప్పు తలపెట్టాడనే తప్పుడు ప్రచారంతో అమెరికా, దాని తైనాతీ దేశాలు ఇరాక్‌ మీద దాడి చేసి ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఆయుధాలను వెతికే పేరుతో అంతర్జాతీయ అణుశక్తి సంస్ధను రంగంలోకి దించారు. ఇలాంటి కార్యక్రమాలకు దేశాలు ఇచ్చే విరాళాలను బట్టి అవి నడుస్తాయి. డబ్బు లేకపోతే ఎలాంటి కార్యకలాపాలూ ఉండవు. అందుకే అమెరికా పెద్ద మొత్తంలో విరాళం అందచేసింది. తిరిగి ఆ మొత్తాలను ఐరాస పేరుతో వేతనాలు, ఇతర రూపాల్లో తన సైనికులు, ఇతర అధికారులు, వారి అవసరాల కోసం ఖర్చు చేసింది. 2018లో ఐరాస సాధారణ బడ్జెట్‌లో 22శాతం, శాంతి స్ధాపక కార్యక్రమాల కోసం 28శాతం బడ్జెట్‌ను అమెరికా భరించింది. అయితే 2019లో శాంతికార్యక్రమాలకు 25శాతానికి మించి ఇవ్వలేమని కోత పెట్టింది. సభ్యత్వ రుసుము బకాయి, ఇతర బకాయిలను వాటిలోనే సర్దుకోవాలని చెప్పింది. అంటే శాంతి కార్యక్రమాలకు గణనీయంగా విరాళాన్ని తగ్గించింది. ఇది సంచలనాత్మక అంశం కాదు కనుక మీడియా కూడా పట్టించుకోలేదు. సాధారణ సమయాల్లో ఏవైనా సంచలనాత్మక నివేదికలు, ప్రకటనలు చేస్తే తప్ప ప్రపంచ ఆరోగ్య సంస్ధ గురించి కూడా జనానికి, మీడియాకు అంతగా పట్టదు. ఇప్పుడు కరోనా వ్యతిరేక పోరులో అది ముందు ఉంది కనుక, దాని పాత్రను వివాదం చేసి ఆ ముసుగులో ట్రంప్‌ విరాళాన్ని తగ్గించేందుకు అవకాశాన్ని వినియోగించుకున్నాడు కనుక పెద్ద చర్చనీయాంశమైంది.

Donald Trump: 'Disgusted' facial expressions 'help' presidential ...
ముందే చెప్పుకున్నట్లు 2017లో అమెరికా ఐరాసకు అందచేసిన పది బిలియన్‌ డాలర్లలో దాని సభ్యత్వ సొమ్ము 3.5బిలియన్లు కాగా, మిగిలిన సొమ్ము విరాళం. దీనిలో యూనిసెఫ్‌ పేరుతో పిల్లల సంక్షేమానికి, ఆహార కార్యక్రమం, శరణార్ధుల సంక్షేమం ఇతర కార్యక్రమాలకు ఇచ్చే నిధులు ఉన్నాయి. 2018లో ట్రంప్‌ విరాళాల్లో 30 కోట్ల డాలర్ల కోత విధించిన కారణంగా పాలస్తీనా నిర్వాసితుల సంక్షేమాన్ని అమలు చేసే సిబ్బందిలో 250 మందిని తొలగించారు. ఐరోపా, గల్ఫ్‌ దేశాలు అదనంగా ఇచ్చి కొంత మేరకు ఆదుకున్నప్పటికీ అమెరికా కోత ఫలితంగా లక్షా40వేల మందికి ఆహారం, 70వేల మందికి మంచినీరు అందచేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ధకు విధిస్తున్న కోత దాని కార్యక్రమాలు అంటే ప్రధానంగా పేద దేశాల్లో, మనవంటి దేశాల్లో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రపంచ వాక్సిన్‌ల వ్యాపారంలో పెద్ద వాటా కలిగి ఉన్న బిల్‌గేట్స్‌ తమ సంస్ధ ఇస్తున్న పది కోట్ల విరాళాన్ని 25కోట్ల డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించాడు. ఇలా ఏదో రూపంలో ప్రపంచ ఆరోగ్య సంస్ద కార్యక్రమం కొనసాగుతుందనేది వేరే విషయం, మానవత్వం, మానవతా పూర్వక సాయం గురించి నిత్యం కబుర్లు చెప్పే అమెరికా ఎందుకు ఇలాంటా అమానవీయ చర్యకు పాల్పడింది ? ఇరవైలక్షల కోట్ల డాలర్ల జిడిపి ఉన్న దేశానికి 50 కోట్లు ఒక లెక్కలోనివా ? (మిగతా అంశాలు మరో వ్యాసంలో చూద్దాం)

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కనుచూపు మేరలో హెలికాప్టర్‌ మనీ కానరావటం లేదు కెసిఆర్‌ సార్‌ !

16 Thursday Apr 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana, USA

≈ Leave a comment

Tags

covid 19 India Stimulus package, COVID-19, Helicopter money, KCR

KCR Explains About Helicopter Money | CM KCR Press Meet | 11/04 ...

ఎం కోటేశ్వరరావు
గృహబందీ 2.0(లాక్‌డౌన్‌) మే నెల మూడవ తేదీ వరకు అమల్లో ఉంటుందని ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఉపన్యాసం దేశంలోని అన్ని తరగతులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యమంత్రుల తరగతిలో తెలంగాణా వజీర్‌ ఆలా కె.చంద్రశేఖరరావు మరింత ఆశాభంగం చెంది ఉండాలి. మీడియా ముందుకు రావటానికి బిడియ పడే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పైకి బయట పడకపోయినా పెద్దన్న చెప్పింది జరిగేట్లు చూడమని దేవుళ్లందరినీ గృహబందీ కారణంగా లోలోపల అయినా వేడుకొని ఉంటారు. ఎందుకంటే ఆర్ధిక పరిస్ధితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడేట్లు ఉంది మరి.
గృహబందీ పొడిగించటం అని వార్యం అని తేలిపోయి, లాంఛన ప్రకటన వెలువడటమే తరువాయి అన్న దశలో హెలికాప్టర్‌ మనీ అందచేయాలని కెసిఆర్‌ ప్రతిపాదించారు. గతంలో పెద్ద నోట్ల రద్దు జరిగిన వెంటనే ఆ ”ఖ్యాతి”లో తన వాటా ఎక్కడ తగ్గుతుందో అన్న తొందరలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సలహా తనదే అని తన భుజాలను తానే చరుచుకున్న విషయం తెలిసిందే. సరే తరువాత ఏమైందో చెప్పుకుంటే అంత బాగోదు. మనోభావాలు దెబ్బతినవచ్చు.
మన కెసిఆర్‌ సార్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడక ముందే అమెరికా, జపాన్‌, ఇతర దేశాల పత్రికల్లో ఇతరంగా దీని గురించి చర్చ ప్రారంభమైంది. విలేకర్ల ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా నోరు మూయిస్తారు గనుక, ఏ విలేకరైనా ప్రశ్న అడిగితే కెసిఆర్‌ ముందు అవమానాల పాలుకావటంతో పాటు ఆఫీసుకు వెళ్లే సరికి ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియని స్ధితి కనుక దాని మంచి చెడ్డలు కెసిఆర్‌ ద్వారా తెలుసుకొనే అవకాశం ఉండదు.
ప్రస్తుత సంక్షుభిత స్దితిలో దీన్ని ప్రతిపాదిస్తే తాను ఖ్యాతి పొందవచ్చన్న ఆలోచనగానీ లేదా నరేంద్రమోడీ అలాంటి పని చేయవచ్చన్న అత్యాశగానీ కారణాలు ఏమైనా కెసిఆర్‌ ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ప్రధాని ప్రసంగం లేదా కేంద్రం నుంచి రెండవ విడత వెలువడుతుందని భావిస్తున్న ఉద్దీపన 2.0గానీ అలాంటి ఆలోచన కలలో కూడా పెట్టుకోవద్దు అని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే సామాన్యులు ఉన్న ఉపాధి కోల్పోయి గోచిపాతలతో మిగిలారు. ప్రభుత్వాల సంక్షేమ పధకాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దశలో కూడా ముందస్తు ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ మీద లీటరుకు కరోనా సమయంలోనే మూడేసి రూపాయల పన్ను పెంచి రాబోయే రోజుల్లో మరింతగా పెంచేందుకు పార్లమెంటులో ముందస్తు అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే. అలాంటి సర్కార్‌ జనానికి పన్ను పోటు తగ్గిస్తుందని లేదా ధనికుల దగ్గర మూలుగుతున్న సంపదల్లో కొద్ది మొత్తం తీసుకొని కరోనా కష్టకాలాన్ని గట్టెక్కిస్తుందని ఎవరైనా ఊహించగలరా ? మునిగిపోతున్న పడవలో ప్రయాణించే వారికి గడ్డిపోచ కనిపించినా దాన్ని పట్టుకొని బయటపడదామని చూస్తారు. రాష్ట్రాల పరిస్ధితి ఇలాగే ఉంది కనుక చంద్రశేఖరరావు అలాంటి ఆశతో హెలికాప్టర్‌ మనీ కోసం చూస్తున్నారని అనుకోవాలి.
చాలా మంది తెలంగాణా ముఖ్య మంత్రికి ఇలాంటి మహత్తర ఆలోచన ఎలా తట్టిందబ్బా అనుకుంటున్నారు. రెండు విషయాలు జరిగి ఉండవచ్చు. ఒకటి ముఖ్యమంత్రి పత్రికలు లేదా ఇంటర్నెట్లో వార్తలు చదువుతూ ఉండి ఉండాలి.రెండవది ఎప్పటికప్పుడు సరికొత్త అంశాలు నాకు నివేదించాలి అని అధికార యంత్రాంగానికి పని చెప్పి ఉండాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి మీడియా సమావేశానికి ముందురోజు అంతర్జాతీయ మీడియాలో ఈ వార్తలు వచ్చాయి. మరో రూపంలో అంతకు ముందే మన దేశంలో కూడా కొంత మంది ఇలాంటి సూచనలే చేశారు. ఇక జరిగిందేమిటో మీరే ఊహించుకోవచ్చు.
పూర్వం వైద్యులు చేయగలిగింది చేశాం చివరి ప్రయత్నంగా మీకు అంగీకారమైతే గరళ ప్రయోగం చేద్దాం అనేవారని చదువుకున్నాం. అంటే రోగి ఆటో ఇటో అన్నమాట. ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర సంక్షోభానికి గురైనపుడు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమై చేతులెత్తేసే స్దితిలో జనానికి చేతి నిండా డబ్బు ఇస్తే ఆర్ధిక వ్యవస్ధ కోలుకుంటుందనే ఒక దివాలాకోరు ఆలోచన ఇది. దీనికి హెలికాప్టర్‌ మనీ అని ఎందుకు పేరు పెట్టారు ? హెలికాప్టర్లు, మోటారు వాహనాలు, రైళ్లు లేని రోజుల్లో గనుక ఇలాంటి పరిస్ధితి మీద ఆలోచన వచ్చి ఉంటే దానికి గుర్రపు బండి లేదా గుర్రపు డబ్బు అనే వారేమో. ఎందుకంటే అప్పుడు అదే వేగంగా, కొండలు, గుట్టల మీద ప్రయాణించే సాధనం కనుక.
1969లో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారింది. ఆ సమయంలో వినిమయాన్ని పెంచటం ద్వారా ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించాలన్న ఆలోచనతో ఆర్ధికవేత్త మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ హెలికాప్టర్ల ద్వారా జన సమూహాలకు డబ్బును జారవిడిచి జనానికి డబ్బు అందించి కొనుగోలుశక్తిని పెంచవచ్చని తొలిసారిగా ఆ పద్దతి, పదప్రయోగం చేశాడు. హెలికాప్టర్లతో వేగంగా డబ్బు సంచులు మోసుకుపోవచ్చు, జనానికి అత్యంత సమీపానికి వాటిని దించవచ్చు.అలాంటిది మరొక సాధనం లేదు. నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించి జనానికి అందచేయటం ఇక్కడ కీలకం, దాన్ని తిరిగి జనం నుంచి వసూలు చేయాలా లేదా అంటే అది ఆయా ప్రభుత్వాల వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఉచితంగా ఇవ్వాలన్నదే హెలికాప్టర్‌ మనీ ఉద్ధేశ్యం. అనూహ్యంగా ఈ పని చేయాలని మిల్టన్‌ చెప్పాడు తప్ప చెయ్యలేదనుకోండి !

KCR Explains About Helicopter Money
ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది ఈ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు ? ప్రపంచంలో సంక్షోభం ఏర్పడినపుడు ఆర్ధిక వ్యవస్ధలను తిరిగి గాడిలో ఎలా పెట్టాలి అన్నది ఒక చర్చ. ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేసి అంటే ఆస్తుల కల్పన ద్వారా ఉపాధి కల్పించి జనం చేతుల్లో డబ్బు ఉండేట్లు చూడటం. దీన్ని కీన్స్‌ సిద్దాంతం అంటారు. గతంలో అమెరికాలో ఇదే చేశారు. పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనలు, వివిధ సేవలకు భవనాల(ఆసుపత్రులు, పాఠశాలల) వంటి మౌలిక సదుపాయాలు కలిగించటం దానిలో భాగమే. అవే తరువాత అమెరికా అభివృద్దికి ఎంతో తోడ్పడ్డాయి. మన దేశంలో స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల నిర్మాణం అలాంటిదే. కీన్స్‌కు విరుద్దమైనది మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ సిద్దాంతం. మౌలిక సదుపాయాల కల్పన అంటే వెంటనే జరిగేది కాదు. కొంత వ్యవధి పడుతుంది. కనుక ఎటిఎం మిషన్‌లో ఇలా కార్డు పెట్టగానే అలా డబ్బు వచ్చినట్లు జనానికి డబ్బు ఇచ్చి ఖర్చు చేయించటం ద్వారా వెంటనే వస్తువులకు డిమాండ్‌ పెంచవచ్చు అనే వినిమయదారీ సిద్ధాంతం మిల్టన్‌ది. హెలికాప్టర్‌ మనీ ప్రతిపాదనలు చేసే వారు దీన్ని నమ్ముతున్నారని అర్ధం.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 1.75వేల కోట్ల ఉద్దీపన పధకం ప్రకటించింది. ఇది ఏమూలకూ చాలదు. మన జిడిపి విలువ 2020అంచనా 203 నుంచి 245లక్షల కోట్ల రూపాయల వరకు ఉంది. దీనిలో పైన చెప్పుకున్న మొత్తం0.86 నుంచి 0.7శాతమే. ఇది ఏమూలకూ చాలదు, కనీసం ఐదుశాతం ఉద్దీపనకు కేటాయించాలి అంటే పది నుంచి 12లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని అనేక మంది చెబుతున్నారు. దీని కోసం నోట్ల ముద్రణ ఒక మార్గం అయితే, పరిమాణాత్మక సడలింపు అంటే మార్కెట్‌లో డబ్బు సరఫరాను పెంచటం మరొక పద్దతి. దీనిలో కూడా నోట్ల ముద్రణ కొంత మేరకు ఉంటుంది. 2008 సంక్షోభం తరువాత అమెరికాలో ఈ పద్దతిని కొంత మేరకు అమలు జరిపారు గానీ సంక్షోభం పరిష్కారం కాలేదు, త్వరలో మరొక సంక్షోభంలో కూరుకుపోతుందని కరోనాకు ముందే వార్తలు వచ్చాయి.
ముఖ్య మంత్రి కెసిఆర్‌ ప్రతిపాదించిన హెలికాప్టర్‌ మనీ పధకాన్ని కేంద్రం అమలు జరిపితే ఏం జరుగుతుంది ? కొంత సొమ్మును రాష్ట్రాలకు కేటాయిస్తారు. దాన్ని తిరిగి కేంద్రానికి ఇవ్వనవసరం లేదు.రాష్ట్రాలు తాము ఇవ్వదలచుకున్న వారికి ఆ సొమ్మును పంపిణీ చేస్తాయి, జనం సరకులు కొనుగోలు చేస్తే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. సరకులు అమ్ముడు పోతే తయారీ డిమాండ్‌ పెరుగుతుంది. ఉపాధి దొరుకుతుంది, తద్వారా కార్మికుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది మరింత డిమాండ్‌ను పెంచుతుంది. ఇది ఒక అంచనా, అభిప్రాయం. అయితే పరిస్ధితులు బాగోలేనపుడు, రేపేం జరుగుతుందో తెలియనపుడు మనవంటి దేశాలలో సహజంగానే జనం తమ ఖర్చులను తగ్గించుకుంటారు, డబ్బును పొదుపు చేసి తమదగ్గరే ఉంచుకుంటారు. బ్యాంకుల్లో సొమ్మును ఏం చేస్తారో అనే అపనమ్మకం కారణంగా జనం ఇటీవల బ్యాంకుల్లో సొమ్ముదాచుకోవటం లేదనే వార్తల విషయం తెలిసిందే. ఒక వేళ అదే జరిగితే హెలికాప్టర్‌ మనీ పధక లక్ష్యం నీరుకారిపోతుందన్నది ఒక అభిప్రాయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు పెద్ద మొత్తంలో రాయితీలు ఇచ్చాయి. ఆ సొమ్మంతా తిరిగి పెట్టుబడులుగా మార్కెట్లోకి రాలేదు. తమ రిజర్వుసొమ్ము, ఇతర ఖాతాల్లో వారు దాచుకున్నారు. జనానికి తగిన ఆదాయం లేకపోవటం, వస్తుకొనుగోలుకు చేసే వ్యయానికి తగిన డబ్బు లేకపోవటంతో గ్రామీణ ప్రాంతాలలో వస్తు వినియోగం తగ్గింది. మరోమాటలో కొనుగోలు శక్తి పడిపోయింది. ఇది పరిశ్రమల మీద పడి నిరుద్యోగం పెరిగింది, అనేక సంస్ధల మూతకు దారి తీసింది. ఈ పరిస్ధితి కొనుగోలు శక్తిని మరింత దెబ్బతీసింది. అది మరింత నిరుద్యోగానికి కారణమైంది. స్వయం సహాయ సంస్ధల ఏర్పాటు లక్ష్యం స్వయం ఉపాధిని కల్పించటం, కానీ జరిగిందేమిటి ? వాటికి ఇచ్చే రుణాలను వేరే అవసరాలకు వినియోగించినందున అసలు లక్ష్యం వెనుకబడిపోయింది.
పశ్చిమ దేశాలలో ముఖ్యంగా అమెరికా వంటి దేశాలలో పరిస్ధితులు వేరు. ఈ రోజు ఎంత వస్తే అంత ఎలా ఖర్చు చేయాలి అనే వినిమయ సంస్కృతి పెరిగిపోయింది. మరోవిధంగా చెప్పాలంటే అప్పుచేసి పప్పుకూడు. నిరుద్యోగ భృతి వంటి హామీలున్నాయి గనుక అక్కడ జనం అలా తయారయ్యారు. మనకా సామాజిక రక్షణ లేదు. డబ్బు వస్తే ముందు పొదుపు ఎలా చేయాలా అని చూస్తాం. ఈ వైఖరి మన దేశాన్ని ఇప్పటి వరకు రక్షిస్తోంది. కానీ కార్పొరేట్‌ కంపెనీలు అమెరికా పద్దతికి నెట్టాలని చూస్తున్నాయి. దానిలో భాగమే ఎన్ని క్రెడిట్‌ కార్డులు కావాలంటే అన్ని కార్డులు ఇవ్వటం, వాయిదాల పద్దతిలో వస్తువుల అందచేత వంటివి.
మన నరేంద్రమోడీ గారు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఎంత దగ్గరి స్నేహితుడో అందరికీ తెలిసిందే జనధన్‌ ఖాతాలున్న వారికి నెలకు ఐదువందల చొప్పున మూడునెలలు ఇస్తామని ప్రకటించారు. డాలర్లలో ఏప్రిల్‌ 16 డాలరు మారకపు విలువ రూ.76.75లో 19.51 డాలర్లు. అదే ట్రంప్‌ నెలకు పెద్ద వారికి 1200 డాలర్లు, పిల్లలకు ఐదు వందల చొప్పున ప్రకటించారు, కానీ పెద్ద వారికి మూడువేలు, పిల్లలకు 1500చెల్లించాల్సిన అవసరం ఉందని గతంలో ట్రంప్‌ వద్ద కొంతకాలం సమాచార అధికారిగా పని చేసిన ఆంథోనీ కారముసి చెప్పాడు. వడ్డీ రేటు సున్నాకు దగ్గరలో ఉన్నందున, మరిన్ని అప్పులను కొనుగోలు చేస్తామని ఫెడరల్‌ రిజర్వు(మన రిజర్వుబ్యాంకు వంటిది) చెప్పిన కారణంగా మరింత సొమ్ము చలామణిలోకి వస్తుందని, గత మూడు వారాల్లో ఒక లక్ష కోట్ల డాలర్లను చలామణిలోకి తెచ్చినట్లు(ఏప్రిల్‌ తొమ్మిది నాటికి మన రూపాయల్లో 76 లక్షల కోట్లు ) కారముసి చెప్పాడు.
హెలికాప్టర్‌ మనీ సరఫరా గురించి ఆలోచించే వారు రాగల ముప్పును కూడా గమనంలోకి తీసుకోవాలనే హెచ్చరికలు కూడా వెలువడ్డాయి. జనం దగ్గరకు ఒక్కసారిగా డబ్బు చేరినపుడు డిమాండ్‌ మేరకు సరకులు లేకపోతే ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో గృహబందీ సమయంలో జరుగుతున్నది అదే. జనం దగ్గర పరిమితంగానే డబ్బులున్నాయి, అయినా సరకుల రవాణాపై ఆంక్షలున్న కారణంగా ధరలు పెరిగాయి. సరకులు ఉన్నా ఆయాచితంగా ఒక్కసారిగా డబ్బు జనం చేతుల్లోకి వస్తే ధరలు పెరుగుతాయి, దాని పర్యవసానం వేతన పెరుగుదల ఉంటుంది, ద్రవ్యోల్బణాన్ని రిజర్వు బ్యాంకులు, ప్రభుత్వాలు ఎలా అడ్డుకుంటాయో కూడా చూడాలని కూడా హెచ్చరిస్తున్నారు. అసలు అమెరికా మిల్టన్‌ ఫ్రైడ్‌మాన్‌ కూడా ఒకసారి అమలు జరపాలి తప్ప మరోసారి పునరావృతం కాకూడదని కూడా చెప్పాడని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజాకర్షక రాజకీయవేత్తలు ఇదేదో బాగుందని తాము చేయాల్సిన వాటిని కూడా చేయకుండా ప్రింటింగ్‌ ప్రెస్‌లవైపు పరుగులు తీస్తారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఇలా చేస్తే రిజర్వుబ్యాంకుల స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని,ఆర్ధిక అరాచకం పెరుగుతుందని, దీర్ఘకాలిక దుష్ప్రభావాలు పడతాయని, ఇప్పుడంత అవసరం లేదనే వారు మరికొందరు.

CM KCR about Helicopter Money| KCR Press meet| 4D NEWS #helicopter ...
సార్వత్రిక కనీస ఆదాయ పధకాన్ని ముందుకు తెచ్చిన వామపక్ష భావాలున్న ఆర్ధికవేత్తలు ఇటీవల హెలికాప్టర్‌ మనీని ముందుకు తెచ్చారని దీనివలన ప్రభుత్వాలు చేసే ఖర్చు పడిపోతుందన్నది ఒక విమర్శ. ఈ పధకాన్ని అమలు జరిపితే వనరుల కేటాయింపు, కష్టపడేవారికి ప్రోత్సాహకాలు కరవు అవుతాయన్నది మరొక వాదన. అయితే గతంలో పెదవి విరిచిన వారు కూడా మరొక మార్గం ఏమీ కనిపించక ఏదో ఒకసారికి అయితే సరే అన్నట్లుగా తలూపుతున్నారు. నేరుగా నగదు పంపిణీ చేయకపోతే ఆర్ధిక వ్యవస్ధ మరింత దిగజారుతుందన్నది కొందరి హెచ్చరిక.
చివరిగా చెప్పవచ్చేదేమంటే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రతిపాదించినట్లుగా కేంద్రం హెలికాప్టర్‌ మనీ అంద చేసే అవకాశాలు దాదాపు లేవు. కరోనా కారణంగా అనేక మంది చెబుతున్నట్లు అభివృద్ధి రేటు తిరోగమనంలోకి దిగిపోయి తిరిగి పైకి లేచే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లినపుడు గరళం పోయాల్సిన పరిస్ధితి వస్తే తప్ప ఇలాంటి పరిస్ధితి రాదు. అందువలన బంగారు తెలంగాణా ముఖ్యమంత్రిగా ఒకవైపు చెప్పుకుంటూ మరోవైపు బీద అరుపులు అరిస్తే, జనాన్ని విస్మరిస్తే అన్ని తరగతుల్లో విస్వసనీయత సమస్య తలెత్తుతుంది. అదే జరిగితే రాజకీయంగా, పార్టీ పరంగా అనూహ్యపరిణామాలకు నాంది అవుతుంది. అలాంటి పరిస్ధితిని కెసిఆర్‌ కొని తెచ్చుకుంటారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనా మీద రగలాల్సిన ” జ్యోతి ” కమ్యూనిస్టుల మీదనా ?

15 Wednesday Apr 2020

Posted by raomk in AP, Current Affairs, NATIONAL NEWS, Opinion, STATES NEWS, Telangana, Telugu

≈ Leave a comment

Tags

a telugu journalist spews venom on communists, anti communists, Communists, Journalist attack on communists, venom on communists

సత్య
ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు వ్యతిరేక విషం చిమ్మే నాగుల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఇప్పుడు కరోనా వైరస్‌ను కూడా అవకాశంగా తీసుకొని అదే పని చేసే వారి గురించి ప్రస్తావించాల్సి వస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా చైనాలో బయటకు కనిపించిన కరోనాను అక్కడి కమ్యూనిస్టులే కట్టడి చేశారన్నది తలలో బుర్రవున్న ప్రతివారికీ స్పష్టంగా తెలుస్తోంది. మన దేశంలో కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ఎలా అదుపు చేస్తోందో జనానికంతటికీ తెలుసు.
కమ్యూనిస్టులు లేదా కమ్యూనిస్టు పార్టీలు విమర్శలకు అతీతం కాదు. తప్పు చేశారనిపించినా, విధానాలను తప్పు పడుతూ ఎవరైనా విమర్శించే హక్కు కలిగి ఉంటారు. దానికి ఏదో ఒక ప్రాతిపదిక, సందర్భం, తర్కం ఉండాలి. అవి లేనపుడు మోకాలికీ బోడి గుండుకు ముడివేసేందుకు ప్రయత్నిస్తే వృధా ప్రయాస. గత లోక్‌సభ ఎన్నికల తరువాత కొత్తగా నరేంద్రమోడీ భజన సమాజంలో చేరిన ఒక తెలుగు పత్రిక సీనియర్‌ జర్నలిస్టు అదేపని చేశారు. పోనీ చేసిన విమర్శ అందరికీ వర్తింప చేస్తే అదొక తీరు. కాదే ! గాజు కొంపలో కూర్చొని కమ్యూనిస్టుల మీద రాళ్లు వేస్తే కుదరదు.
బాబా నరేంద్రమోడీ గారు మండల దీక్షలో సప్తపది పాటించాలని సెలవిచ్చారు. చంద్రబాబా భక్తులుగా కొనసాగుతూనే మోడీ బాబా భజన బృందంలో చేరిన వారు పగలు ఒకరికి, రాత్రి ఒకరికి చెక్కభజన చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. ” విచిత్రమేమంటే శ్రమజీవుల పార్టీలుగా చెప్పుకుంటున్న వృద్ధ కమ్యూనిస్టుల పార్టీల్లో కూడా వీరెవరూ సభ్యులుగా ఉన్నట్లు కనపడటం లేదు. ఉంటే వారు లాక్‌డౌన్‌ ప్రకటించిన వెంటనే నిర్భయంగా అజయ భవన్‌, గోపాలన్‌ భవన్‌, మఖ్దుం భవన్‌లకు వెళ్లి సేదదీరే వాళ్లు ”.అని ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన వలస కార్మికుల గురించి రాశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కడ చిక్కుకుపోయిన వారిని అక్కడే పరిమితం చేశారు. ఆ పెద్ద మనిషి చెప్పినట్లు శ్రమ జీవులు కమ్యూనిస్టు పార్టీలు లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా చేరుకొనే వీలు లేదని తెలియనంత ఆమాయక చక్రవర్తి అయితే కాదు కదా ? ఒక వేళ ఎవరైనా వచ్చి ఉంటే ఏమి చేసి ఉండే వారో మనకు తెలిసేది. అనేక సందర్భాలలో కమ్యూనిస్టుల కార్యాలయాలు ఆశ్రితులకు నిలయాలుగా మారిన చరిత్ర ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక బిజెపిని విమర్శించినట్లు ఉండాలి, మాట అనకుండా ఎంత తెలివిని ప్రదర్శించారో చూడండి.”సంస్ధాపక దినం సందర్భంగా బిజెపి ప్రపంచంలో అతి పెద్ద పార్టీ అని దాని సభ్యత్వం 18కోట్లకు పెరిగిందని చెప్పుకున్నారు. ఇవాళ లాక్‌డౌన్‌ మూలంగా జీవితాలు దుర్భరమైన కోట్లాది మందిలో ఒక్కరైనా బిజెపిలో సభ్యులుగా ఉన్నారా అని ఆలోచించుకోవాల్సి ఉంటుంది ” అన్నారు. కమ్యూనిస్టుల వెనుక పేదలు లేరని ఇలాంటి వారే వేరే సందర్భాలలో రాస్తారు. బిజెపి లేదా తెలుగుదేశం వంటి పార్టీలకు పేదలు ఓట్లు వేయకుండానే వారు అధికారానికి వచ్చారని చెప్పదలచుకున్నారా ? మరి ఆ పార్టీలకు కమ్యూనిస్టులకంటే పెద్దవి, ఎక్కువ సంఖ్యలో కార్యాలయాలు ఉన్నాయే, వాటి గురించి ఎందుకు ప్రస్తావించలేదు ?
ఇక్కడ కమ్యూనిస్టుల మీద రాళ్లేస్తున్న పెద్ద మనిషికి ఒకటే కన్ను పని చేస్తున్నదా ? కష్టకాలంలో శ్రమజీవులకు ఆశ్రయం కల్పించటంలో కమ్యూనిస్టులు, కాని వారు, పార్టీలు, వ్యక్తులు, కమ్యూనిస్టు ఆఫీసులు, ఇండ్లేమిటి ఎక్కడైనా ఆశ్రయం కల్పించాల్సిందే. అనేక చోట్ల కమ్యూనిస్టులు అలాంటి సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. ఈ రాతలు రాసిన పెద్దమనిషి తన ఇంట్లో ఎంత మందికి ఆశ్రయం కల్పించారు? లేదూ తాను పని చేస్తున్న సంస్ధ పేరుతో ప్రభుత్వం నుంచి పొందిన భూములలో కట్టించిన కార్యాలయాల్లో ఎంత మందికి ఆశ్రయం కల్పించారో ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. సదరు విలేకరి, మీడియా శ్రమజీవులను పట్టించుకోరా లేక పట్టదా ? కరోనా పేరుతో ఎంతోకాలంగా పని చేస్తున్న వారిని ఇండ్లకు పంపిన తమ యాజమాన్య ” ఔదార్యం ” సంగతి ముందు చూడాలి. ఉద్యోగులను ఎవరినీ తొలగించవద్దని చెప్పిన తమ బాబా మోడీ ఉపదేశాలకు ఇచ్చిన విలువ ఏమిటి ? కమ్యూనిస్టు పార్టీలు తమ శక్తి కొద్దీ చేయాల్సిందేదో చేస్తున్నాయి, వాటికి సర్టిఫికెట్లు అవసరం లేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు తప్ప పార్టీల కార్యాలయాల వైపు తొంగి చూడటమే రాజకీయం. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు అన్నీ మూతబడ్డాయి. ఇలాంటి సమయాల్లో చిక్కుకు పోయిన వలస కార్మికులను అలాంటి చోట్లకు తరలించి ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులది. తమను స్వస్ధలాలకు పంపాలని ముంబైలోని బాంద్రా రైల్వేష్టేషన్‌కు అంత మంది పేదలు వస్తుంటే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న యంత్రాంగం ఏమి చేస్తున్నట్లు ? స్టేషన్‌కు చేరకుండానే వెనక్కు ఎందుకు పంపలేదు ? వచ్చిన వారిని నచ్చ చెప్పి పంపాల్సిన యంత్రాంగం లాఠీలకు పని చెప్పటాన్ని ఏమనాలి ?
” చింత చచ్చినా పులుపు చావనట్లు పదవుల కోసం ఒకరి కాళ్లను మరొకరు లాగేందుకు గంటల తరబడి పొలిట్‌బ్యూరో సమావేశాలు నిర్వహించే వారికి కష్టజీవుల గురించి ఆలోచించే సమయం ఎక్కడ ఉంటుంది ” అని రాయి వేశారు. కమ్యూనిస్టులు కేరళలో మాత్రమే అధికారంలో ఉన్నారు. అక్కడ వారేమి చేస్తున్నదీ యావత్‌ ప్రపంచం చూసిందీ. పొలిట్‌ బ్యూరోలో పేదల గురించి చర్చించారు కనుకనే కేరళ పార్టీకి ఇచ్చిన మార్గదర్శకాల మేరకు దేశంలో ఏ రాష్ట్రం, కేంద్రం కూడా చేయని విధంగా ఇప్పటి వరకు కరోనాను కట్టడి చేయటమే కాదు, ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకున్నారో చూసేందుకు లాక్‌డౌన్‌కు ముందే అనేక రాష్ట్రాల అధికార బృందాలను అక్కడకు రప్పించగలిగారు. లక్షలాది మంది వలస కూలీలను, రాష్ట్ర ప్రజలను ఎలా ఆదుకుంటున్నారో దాస్తే దాగేది కాదు. నిజాన్ని చూడలేని ఉష్ట్రపక్షుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కమ్యూనిస్టుల గురించి మార్చి 21వరకు నరేంద్రమోడీ, ఆయన మంత్రులు, యావత్‌ యంత్రాంగం ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? నిత్యం వారి చుట్టూ తిరిగే ఆ విలేకరికి అవేమీ కనిపించవా ? పొలిట్‌బ్యూరో కాకపోతే మరో పేరుతో మిగతా పార్టీలకు కమిటీలు లేవా ? అవి సమావేశాలు కావటం లేదా ?
కరోనా సమయంలో డోనాల్డ్‌ ట్రంప్‌ను రప్పించి భజనలో మునిగిపోయిందెవరో జనానికి తెలుసు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బిజెపి నేతలు పడిన పాట్లు దేశమంతటా చూసింది. అనేక చోట్ల నిత్యం చేస్తున్న కుట్రల గురించి ఒంటి కన్ను వారికి నిజంగా కనిపించవు. కమ్యూనిస్టులెక్కడా ఏ ప్రభుత్వాన్ని కూల్చిన లేదా కుట్ర చేసిన దాఖలా లేదు, ఎవరి కాళ్లనూ లాగలేదు. ఇప్పుడు చూడాల్సింది, జర్నలిస్టులు ప్రాధాన్యత ఇవ్వాల్సింది కమ్యూనిస్టులు పొలిట్‌బ్యూరో ఏమి చర్చిస్తున్నారన్నదానికా, పాలకులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నారో చూడాలా ? కమ్యూనిస్టులైనా, మరొక ప్రతిపక్ష పార్టీ పాత్ర అయినా పరిమితం. కమ్యూనిస్టు పార్టీల పొలిట్‌బ్యూరో సమావేశాలు, కానీ పార్టీల ఏకవ్యక్తి నిర్ణయాలూ ఇవాళ కొత్తేమీ కాదు. అసలు ఆ విలేకరి సమస్య ఏమిటి ?
మోడీ సర్కార్‌కు ముందస్తు చూపు, శ్రద్ద ఉంటే విదేశాల నుంచి వచ్చిన వారందరినీ ముందునుంచే క్వారంటైన్‌లో పెట్టి ఉంటే పరిస్ధితి ఇలా ఉండేది కాదు. ఒక పక్క మలేషియాలో, మరో వైపు పాకిస్ధాన్‌లో తబ్లిగీ జమాత్‌ సమావేశాలకు వచ్చిన వారు కరోనా వైరస్‌ను అంటించారని తెలిసినా నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమావేశాలకు విదేశాల నుంచి వచ్చే వారిని ఎలా అనుమతించారో, వైద్య పరీక్షలు చేయకుండా, క్వారంటైన్‌లోకి పెట్టకుండా మార్చినెలలో ఎలా వదలి పెట్టారో, దానికి బాధ్యులెవరో కేంద్రాన్ని, నరేంద్రమోడీని అడిగే దమ్ము సదరు జర్నలిస్టుకు లేదు.ఉన్న ఒక్క కన్నూ కమ్యూనిస్టుల మీద పెట్టారు కనుక కనుక ఇవేవీ కనిపించలేదను కోవాలి.
పదవి ఉన్న కాలంలో తమకు, తమ యాజమాన్యానికి పాకేజ్‌లు ఇచ్చిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఏమి చేస్తున్నదో ఎలా కాలక్షేపం చేస్తున్నదో సదరు జర్నలిస్టుకు తెలియదను కోవాలా ? కష్టకాలంలో రాష్ట్రం వదలి పారిపోయి హైదరాబాదులో దాక్కున్నారని వైసిపి చేసిన విమర్శలు వినిపించటం లేదా? కనిపించటం లేదా ? చంద్రబాబు నాయుడికీ పొలిట్‌ బ్యూరో ఉంది. ఆయనేమి చేస్తున్నారో తెలుసా ? ఎవరితో సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా పని చేస్తున్నారా ? హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు చంద్రబాబు ఎందుకు ప్రయత్నించలేదో చెబుతారా ? ఇష్టమైన పార్టీలకు చేసుకొనే భజన మీద కేంద్రీకరించకుండా మధ్యలో కమ్యూనిస్టుల మీద ఇలాంటి అవాకులు చెవాకులు ఎవరిని సంతుష్టీకరించేందుకు చేస్తున్నట్లు ? కరోనా మీద, దాన్ని నిర్లక్ష్యం చేసిన వారి మీద రగలాల్సిన ” జ్యోతి ” కమ్యూనిస్టుల మీదనా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మే 3వరకు గృహ బందీ – జనానికి నరేంద్రమోడీ వట్టిస్తరి-మంచినీళ్లు !

14 Tuesday Apr 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

how narendra modi disappointed entire nation, lock down extension, Lock down extension up to May 3rd

PM Narendra Modi Extends Lockdown Until May 3, Other Key ...

ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీ కరోనా, గృహబందీ(లాక్‌డౌన్‌) మూడవ ప్రసంగంలో సప్తపది అనే పదాన్ని వినియోగించారు. ఏడు అంశాలను పేర్కొన్నారు కనుక ప్రాసకోసం ప్రయోగించారని సరిపెట్టుకోవాలా ? నిజానికి అది హిందువుల సంప్రదాయ వివాహ శుభ సందర్భంగా నిర్వహించే ఒక క్రతువు. వివాహంలో సూత్రధారణ తరువాత నవ వధువులు అగ్ని గుండం చుట్టూ ఏడు అడుగులు నడవటాన్ని సప్తపది అంటారు. అయితే విశ్వాసులు ఎంతో పవిత్రమైనదిగా భావించే ఈ క్రతువును పాటించిన వారు కాళ్లపారాణి ఆరక ముందే భార్యలను వదలివేసే భర్తలు, భర్తలను వదలివేసే భార్యలను మనం చూస్తున్నాం. దీనికి ఇంకా ఏమైనా అర్ధాలున్నాయేమో నాకు తెలియదు. వివాహం వేరు, కరోనా లేదా మరొక మహమ్మారి మీద పోరాడటం వేరు. రెండూ పరస్పర విరుద్దమైనవి. మోడీ ప్రసంగం విని, చూసిన వారికి పిడుక్కీ బియ్యానికి ఒకటే మంత్రం చదివినట్లుగా సప్త పది ప్రయోగం అనిపిస్తే అది వారి తప్పుకాదు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య పదివేలు దాటింది. ఈ నేపధ్యంలో అనేక మంది గృహబందీ వ్యవధిని పొడిగించాలని సూచించారు, అనేక రాష్ట్రాలు ఏప్రిల్‌ 30వరకు పొడిగించాలని ముందే నిర్ణయించి ప్రకటించాయి. దీనికి మోడీ గారు కొత్త ట్టిస్ట్‌ ఇచ్చి మండల దీక్షగా ( అయ్యప్ప, దానికి అనుకరణగా ఇతర దీక్షలు) ధ్వనింప చేస్తూ మే మూడవ తేదీ వరకు 19రోజులు పొడిగించారు. ఇవన్నీ పక్కన పెడదాం.దేశమంతా ఎంతగానో ఎదురు చూసిన మోడీ పలుకుల్లో కొత్తదనం ఏముంది ? జనం లేదా అనేక రంగాలు కోరుతున్న అంశాలను ఎక్కడైనా ప్రస్తావించారా ? ఏమి ప్రస్తావించారు అనేది ముఖ్యం. తెలుగులో ఒక లోకోక్తి లేదా సామెతల గురించి చాలా మంది వినే ఉంటారు. వాటిలో ఒకటి వట్టి మాటలకు కడుపులు నిండుతాయా ? రెండవది వట్టిస్తరి – మంచినీళ్లు. ఇంతకు మించి మోడీగారి ప్రసంగంలో మరొకటి కనిపించలేదు.
మొదటి రెండు ఉపన్యాసాలలో చప్పట్లు, దీపాల వెలిగింపు పిలుపు ఇచ్చారు. మూడవ దానిలో ఇప్పటికే జనమందరూ పాటిస్తున్న అంశాల సప్తపది సుభాషితం తప్ప ఎలాంటి కార్యక్రమం లేదు. దీని గురించి నెటిజన్లు వ్యంగ్యంగా స్పందించారు. కొందరు హాస్యాన్ని పండించేందుకు ప్రయత్నించారు. రెండో పిలుపు సందర్భంగా దీపాల వెలుగు పేరుతో దీపావళి జరుపుకున్నవారు ఇప్పుడు అలాంటి మరొక అవకాశం రాలేదే అని నిరాశపడి ఉంటారు. ఈనెల 20వరకు మరింత గట్టిగా గృహబందీ అమలు తరువాత ఏమి చేయాలనేది ఆ తరువాత నిర్ణయిస్తారు. ఆ తేదీ నాటికి కొత్త కేసులేవీ నమోదు కానట్లయి బందీ నిబంధనల సడలింపుకు సంబంధించి బుధవారం నాడు మార్గదర్శక సూత్రాలను విడుదల చేస్తామని మోడీ ప్రకటించారు.
సామాజిక మాధ్యమంలో వెల్లడైన ధోరణి చూస్తే తరువాత ఏమిటి అని అనేక మంది ప్రశ్నించారు.హిందీ సినిమాల్లో మాదిరి ప్రసంగంలో 80శాతం ఏమీ లేదన్నది ఒక వ్యాఖ్య. మిగతా కొన్ని ఇలా ఉన్నాయి. ఆయనెందుకు అలా మాట్లాడారు మనం ఏమన్నా నాలుగేండ్ల పిల్లలమా ? మోడీ చెప్పదలచుకున్న సందేశానికి 30నిమిషాలు అవసరం లేదు. ప్రసంగం మోడీకి రాజకీయంగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమని మోడీ చెప్పటం మా ఛానల్‌ చందాదారులుగా చేరండి అని చెప్పిట్లుగా ఉంది. మోడీ ప్రసంగాన్ని ముందుకు జరిపే బటన్‌ ఇచ్చి ఉండాల్సింది. పావు గంటసేపు అబద్దాలు, చెత్త మాట్లాడారు. పావు గంటసేపు సరకులేకుండా మాట్లాడారు. వాస్తవాలను మరుగుపరచి మాటల జడివాన కురిపిస్తూ ఎలా మాట్లాడవచ్చో నేర్చుకున్నాను. వైద్యులు, వైద్య సిబ్బందికి పిపిఇ కిట్స్‌ ఏర్పాటు, దేశమంతటా కరోనా పరీక్షల పెంపు, పేదల సంరక్షణ, ఆరోగ్యవసతుల కల్పన, ఆర్ధిక వ్యవస్ద మరియు ఉపాధి పునరుద్దరణ, ఔషధాల కొరత, వలస కార్మికుల గురించి ప్రస్తావన లేకుండా చక్కగా ప్రసంగించారు.
నరేంద్రమోడీ ప్రసంగం గురించి ఇంతకంటే ఎక్కువ రాయనవసరం లేదు. పరీక్షా సమయాల్లో ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్నవారు వ్యవహరించే తీరు తెన్నులను బట్టి జనం స్పందిస్తారు. పొగిడిన నోళ్లతోనే నవ్వుతారు. ఇక మోడీ గారి ‘సప్తపది’ గురించి చూస్తే 1.వృద్దుల సంరక్షణ, 2. ఇంట్లోనే ఉండండి, ఇంట్లో తయారు చేసిన ముఖతొడుగులు ధరించండి, 3.వ్యాధి నిరోధక చర్యలు తీసుకోండి.4,ఆరోగ్యసేతు యాప్‌ ఉపయోగించండి, 5. పేదలను ఆదుకోండి, ఆహారం అందించండి, 6. ఉద్యోగులను ఆదుకోండి, తొలగించవద్దు, 7. ఆరోగ్య సిబ్బంది, పోలీసు తదితర యంత్రాంగ సేవలను అభినందించండి. వీటిలో కొత్త అంశాలేమి ఉన్నాయి గనుక.

PM Modi's Covid Lockdown Address Not Up To Congress' Expectations ...
కేవలం నాలుగు గంటల వ్యవధి మాత్రమే ఇస్తూ గృహబందీని మే 25 నుంచి ప్రధాని మోడీ ప్రకటించారు. దాంతో అందరూ చెప్పలేని ఇబ్బందులు పడ్డారు. అయినా ఆరోగ్యం, ప్రాణాలే ముఖ్యం కనుక జనం సర్దుకున్నారు. ఈ 21 రోజుల్లో అనేక సామాజిక, ఆర్ధిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి జనాన్ని, అసలే ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న రాష్ట్రాలను ఆదుకోవటం గురించి ఎదురు చూసిన వారికి ప్రధాని ప్రసంగం తీవ్ర నిరాశపరచింది. ఇబ్బందులు పడుతున్నవారికి కావాల్సింది ప్రధాని మోడీ మాదిరి కార్చిన కడవల కొద్దీ కన్నీరు, సానుభూతి, జనం ముందు తలవంచటం కాదు. ఇప్పటికే సామాన్యులు, మధ్యతరగతి వారు తమ వంతు త్యాగాలు చేశారు. ఇంకేమాత్రం చేసే స్ధితిలో లేరు.
గతంలో వాజ్‌పేయి పాలించినా, కాంగ్రెస్‌ లేదా ఇతర పార్టీల ప్రధానుల ఏలుబడిలో ఉన్నా మన దేశంలో సంపద కొద్ది మంది దగ్గర పోగుపడే విధానాలే అనుసరించారు, ఇప్పుడు నరేంద్రమోడీ కూడా అదే చేస్తున్నారు.కరోనా కష్టాలను తెచ్చింది నిజం. కానీ ఇప్పుడు జనాన్ని ఆదుకొమ్మని చెబుతుంటే రాష్ట్రాల, దేశ ఆర్ధిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నవారికి ఇంతకాలం సంపదలు పోగేసుకున్న వారు గుర్తుకు రాకపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఈ కష్ట కాలంలో వారేమి చేస్తున్నారు, పాలకులు వారి నుంచి వసూలు చేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు.2018లో ప్రతి రెండు రోజులకు ఒకరు డాలర్‌ బిలియనీర్‌గా మారారు. అంటే సంపద కోట్లు దాటటం. ప్రపంచ చరిత్రలో 2016 రెండవ త్రైమాసిక కాలం నుంచి 2018లో అదే సమయానికి ప్రపంచ సంపదల్లో 82శాతం ఒక శాతం మంది చేతిలో ఉన్నాయి. చరిత్రలో ఇంత పెరుగుదల ఎన్నడూ నమోదు కాలేదని ఆక్స్‌పామ్‌ సంస్ద తెలిపింది. 2006 నుంచి 2015వరకు జరిపిన పరిశీలన ప్రకారం సామాన్య కార్మికుల ఆదాయం ఏడాదికి సగటున రెండు శాతం పెరిగితే బిలియనీర్ల సంపద దానికి ఆరురెట్లు ఎక్కువగా పెరిగింది. మన దేశం విషయానికి వస్తే ఒకశాతం ధనికుల వద్ద 58శాతం పోగుపడింది. ఈ మధ్యకాలంలో ఈ పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉంది. 2017 బడ్జెట్‌ వివరాల ప్రకారం మన దేశంలో ఒక శాతం ధనికులు 73శాతం కలిగి ఉంటే పేదలుగా ఉన్న 67కోట్ల మంది జనం సంపద కేవలం ఒకశాతమే పెరిగింది. బిలియనీర్ల పెరుగుదల ఆర్ధిక వ్యవస్ధ వైఫల్యం తప్ప అభివృద్ధి సూచిక కాదు. ఒక ప్రముఖ పరిశ్రమ సిఇఓ ఏడాదికి పొందుతున్న ఆదాయ స్దాయికి దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో కనీసవేతనాలకు పని చేసే కార్మికుడు చేరాలంటే 941 సంవత్సరాలు పడుతుంది.
కార్పొరేట్‌ సంస్ధలకు ఏటా లక్షల కోట్ల రూపాయలను వివిధ రూపాలలో ప్రభుత్వం కట్టబెడుతున్నది. వాటికి తోడు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కావాలని ఎగవేస్తుంటే ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నది. కార్పొరేట్‌ కంపెనీలు సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్‌) కింద మూడు సంవత్సరాల నిఖర లాభాల సగటులో రెండుశాతం మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంది. కరోనా పూర్వరంగంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసర పరిస్దితి అవసరాలకోసం పిఎం-కేర్‌ (ప్రధాని పౌరసహాయం మరియు ఉపశమన నిధి) నిధిని ఏర్పాటు చేసింది. కరోనా నివారణను అత్యవసర పరిస్ధితిగా పరిగణిస్తున్నారు. 2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ నిధికి కంపెనీలు ఇచ్చే మొత్తాలను సిఎస్‌ఆర్‌ కింద ఖర్చు చేసినట్లుగానే పరిగణించి ఆ మేరకు మినహాయింపులు ఇస్తారు. అదే కంపెనీలు ముఖ్య మంత్రి సహాయ నిధికి ఇచ్చే మొత్తాలకు ఇది వర్తించదు. అయితే రాష్ట్రాలలో విపత్తు సహాయం లేదా అత్యవసర నిధికి కూడా ఈ మొత్తాలను ఇస్తే మినహాయింపు ఇస్తారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ మీడియాలో ప్రచారం పొందుతున్న బడా కంపెనీలన్నీ ఆ సొమ్మును పిఎం కేర్‌కు బదలాయిస్తున్నాయా లేక నిజంగా విరాళాలు ఇస్తున్నాయా అన్నది తరువాత గానీ బయట పడదు. అనుకోని అవాంతరాలు వచ్చినపుడు కంపెనీలు సిఎస్‌ఆర్‌ నిధి నుంచి కార్మికులకు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించే మొత్తాలను కూడా ఈ నిధిఖాతాలో రాయవచ్చు. కరోనా సమయంలో తాత్కాలిక, కాజువల్‌, రోజువారీ కార్మికులకు సాయం చేయవచ్చు. కంపెనీ నిఖర ఆస్ధుల విలువ ఐదు వందల కోట్లు లేదా వెయ్యి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపే కంపెనీలు అంతకు ముందు సంవత్సరంలో నిఖరలాభం ఐదు కోట్లు ఉన్నవి సామాజిక బాధ్యత కింద రెండుశాతం మొత్తాలను ఖర్చు చేయాల్సి ఉంది.గడచిన ఐదు ఆర్ధిక సంవత్సరాలలో ఈ మేరకు కంపెనీలు 52వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు నివేదించాయి.
నరేంద్రమోడీ సర్కార్‌ ఈ కంపెనీలను విరాళంగా తీసుకున్న మొత్తాలను తన ప్రభుత్వం చేస్తున్న ఖర్చుగా చూపుతున్నది. నిజానికి ఇలాంటి సందర్భాలలో లక్షల కోట్ల రూపాయల రిజర్వు నిధుల నిల్వలున్న కార్పొరేట్‌ కంపెనీల నుంచి కొంత శాతం మొత్తాలను విధిగా ప్రభుత్వాలకు జమచేసేట్లు చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిజానికి ఆ సొమ్ము కష్టపడి పనిచేసిన కార్మికులదీ, ప్రజలది తప్ప మరొకటి కాదు. అలాంటి ప్రత్యేక పధకాలను ప్రకటిస్తారని అనేక మంది ఎదురు చూశారు. ప్రధాని తన ప్రసంగంలో కొన్ని చెప్పకూడని మాటలు చెప్పారు. కనీసం ఒక్క కరోనా కేసు కూడా మన దేశంలో నమోదు కాక ముందే నివారణకు ఏర్పాట్లు చేసినట్లు మోడీ తన ప్రసంగంలో చెప్పారు. ఇది విమర్శించటానికి తగిన సందర్భం కాదు కానీ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాని చెప్పిందే నిజమైతే విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షించి క్వారంటైన్‌ ఎందుకు చేయలేదు ? విదేశాల నుంచి నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమావేశాలకు రాదలచుకున్న వారి వీసాలను ఎందుకు రద్దు చేయలేదు, వచ్చిన వారిని పరీక్షించి క్వారంటైన్‌ ఎందుకు చేయలేదు, రోగులకు చికిత్స ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నలకు ఎవరు జవాబులు చెప్పాలి. తొలి కేసు జనవరిలోనే నమోదైన విషయం అందరికీ తెలిసిందే మార్చి 22న జనతా కర్ఫ్యూ, 25 నుంచి గృహబందీ ప్రకటించారు.

Coronavirus India: PM Modi New Twitter Bio Pic After Address To ...
గత ఇరవై ఒక్క రోజులుగా రాష్ట్రాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కోట్లాది మంది వలస కార్మికులు అనేక చోట్ల చిక్కుకు పోయారు, వారు తమ ఇండ్లకు వెళ్లే అవకాశాలు ఈనెల 20వ తేదీవరకు ఉండవు. తరువాత ఉంటాయో లేదో తెలియదు. వారి అవసరాలను ఎవరు చూడాలి? వారుంటున్న ప్రాంతాలలో పారిశుధ్యం,తదితరాల పరిస్ధితి ఏమిటి? అందుకు కేంద్రం వద్ద ఉన్న పధకాలేమిటి ? రాష్ట్రాలు తమకున్న పరిమిత వనరులతో వారిని ఆదుకోగలవా ? పోనీ అప్పోసప్పో చేసి ఖర్చు చేస్తే కేంద్రం భరిస్తుందా ? అదనపు ఖర్చు భరిస్తున్న రాష్ట్రాలకు పరిస్ధితి తీవ్రతను బట్టి కేంద్రం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదా ? అప్పులు తీసుకొనేందుకు అడ్డువస్తున్న నిబంధనలను కూడా కేంద్రం, రిజర్వుబ్యాంకు సవరించలేదనే అంశాల గురించి పట్టించుకోవనవసరం లేదా ? వైద్య పరికరాల సరఫరాను కేంద్రం పర్యవేక్షించాల్సిన అగత్యం లేదా ? చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను ఆదుకొనేందుకు కేంద్రం చేసే సాయం ఏమిటి ? కార్మికులను తొలగించవద్దని సలహా చెబితే సరిపోతుందా ? ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారం లేదా కనీసం ప్రస్తావన అయినా ఉంటుందనుకున్న వారిని ప్రధాని తీవ్ర నిరాశకు గురిచేయలేదా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: