• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: September 2016

THE DIRTY TRUTH

30 Friday Sep 2016

Posted by raomk in BJP, Current Affairs, Environment, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Environment, Narendra Modi, sanitation target, toilet, toilet for every citizen

Explosive analysis by new Hindi magazine says government far from meeting its sanitation target
Narendra Modi, Rajnath Singh, Nitish Kumar, Akhilesh Yadav, Sonia Gandhi and many others way behind in meeting the
‘toilet for every citizen’ target in their constituencies
  • Prime Minister Narendra Modi has promised a toilet for every citizen by October 2, 2019. But can he do it?
 Down To Earth Hindi’s inaugural edition does a reality check. Analyses the number of toilets built in constituencies of a number of politicians in the last two years, and finds the going tough. Even Modi’s own constituency – Varanasi — will not meet its target before 2048!
  • Highlights the challenge the nation faces on October 2, the 122nd birth centenary of the Father of the Nation, who had proclaimed that sanitation is more important than freedom
 Down To Earth Hindi is a new environment-development monthly which Centre for Science and Environment (CSE), headed by Sunita Narain, will help publish
New Delhi, September 30, 2016: It is a promise to the nation that has been made in all earnestness. And the Prime Minister and his party in power have every intention of keeping it. With the next elections looming up in 2019, will the government be able to keep this promise made to a nation that leads the world in open defecation?
No, going by the rate at which toilets have been constructed in the last two years – says an analysis done byDown To Earth Hindi, whose inaugural issue will be launched here to coincide with Mahatma Gandhi’s birth anniversary on October 2.
Says Richard Mahapatra, managing editor of Down To Earth: “Prime Minister Narendra Modi has promised a toilet for every citizen of India by October 2, 2019 – the year when the country will celebrate the 125th birth anniversary of Gandhi. Our analysis says that is easier said than done – in fact, the NDA government might find it easier to win the election than to fulfill this promise.”
In this first-of-its-kind assessment, Down To Earth Hindi has analysed the ‘toilet building’ performance (over the last two years) of a number of Central ministers, chief ministers and a few opposition leaders. In 2015-16, a mere 7,327 toilets were built in Varanasi, Modi’s constituency against a target of 2,34,489 (till October 2019). The magazine says at this rate, the target cannot be met before 2048!
In the case of home minister Rajnath Singh, whose constituency is Lucknow, the achieved number is 5,332 against a target of 1,86177 – Singh can hope to reach the target only by 2051.
Uttar Pradesh chief minister Akhilesh Yadav has a target of 5,47,739 toilets to be built by October 2019 in his constituency, Kannauj. He has managed only 8,309. At this rate, he will take 66 years to reach his target (by 2082)!
Sonia Gandhi’s constituency, Rae Bareli, has a target of 2,87,703, and the achieved number has been 6,581; the expected year of completion is 2060.
The other key political figures whose performance has been assessed include external affairs minister Sushma Swaraj; defence minister Manohar Parikkar; water resources minister Uma Bharti; surface transport minister Nitin Gadkari; Congress party leader Rahul Gandhi; Bihar chief minister Nitish Kumar; Haryana chief minister Manohar Lal Khattar; Madhya Pradesh chief minister Shivraj Singh Chauhan; Chhattisgarh chief minister Raman Singh, among others (see link below for the complete analysis).
The magazine has clearly set down the method of calculation used to reach these figures. It uses the same method to estimate that 82.3 million (or 823 lakh) toilets are yet to be constructed across India by October 2, 2019. This means the country needs to build 2.3 million (23 lakh) toilets every month – or a formidable 56 toilets every minute – to meet the target!
Says Sushmita Sengupta, programme manager-water, CSE and the lead author of this analysis: “As per our estimation and going by the prevailing rate, India will not be able to meet its target by 2019 as promised by the Prime Minister – but only by 2022.”
Says Sunita Narain, who unveiled the inaugural issue of the magazine here today: “This analysis by Down To Earth Hindi is also to remind us that building toilets is only a small part of the movement towards access to sanitation for all. Firstly, as we build toilets, we must ensure that they are used, that they are functional. Secondly, we must have clear answers to questions of how can we manage and treat our waste, our excreta.”

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అబ్బ ! అపర ‘దేశ భక్తుల’కు దిమ్మ తిరిగే భలే తీర్పు చెప్పారు కదా !!

30 Friday Sep 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, fitting tribute to Rohit Vemula, HCU, Rohith Vemula, sfi, so called 'nationalists", University of Hyderabad (UoH), UoH, Vemula Rohit

ఎం కోటేశ్వరరావు

   రోహిత్‌ వేముల ఆత్మహత్య నేపధ్యంలో సెప్టెంబరు 28న జరిగిన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్ధి సంఘ ఎన్నికలలో సంఘపరివార్‌ శక్తులు, వారికి వంత పాడిన మీడియా చిత్రించిన ‘దేశద్రోహులు’ ఘన విజయం సాధించారు. అపర’ దేశ భక్తులు ‘గా చెప్పుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ, ప్రసార మాధ్యమాల నీరాజనాలు అందుకున్న ఏబివిపి అభ్యర్ధులు అన్ని స్ధానాలలో పరాజయం పాలయ్యారు. ఢిల్లీలోని లోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కూడా ఇదే ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఒక పరిణామం లేదా వుదంతంపై ఎవరైనా మైనారిటీ అయినా మెజారిటీ అయినా భిన్నాభిప్రాయం వ్యక్తం చేయటం, అలాంటి వారికి చెప్పే అవకాశం ఇవ్వాలన్న ప్రజాస్వామిక డిమాండ్‌ను బలపరిచే వారిని కూడా దేశద్రోహులుగా చిత్రిస్తున్న నిరంకుశ, ఫాసిస్టు ధోరణులు వ్యక్తమౌతున్నాయి. దేశమంతటినీ ఆకర్షించిన ఈ రెండు విశ్వవిద్యాలయాల విద్యార్ధుల ఆందోళనల పూర్వరంగంలో వచ్చిన ఈ ఫలితాల తరువాత అయినా భిన్నాభి ప్రాయం వ్యక్తం చేసే వారిని దేశద్రోహులుగా చిత్రించటం, వేధించటం మానుకుంటారా ?

     మానుకోరు అని గట్టిగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఆ రెండు విశ్వవిద్యాలయాల సమస్య కాదు. అంతకంటే లోతైనది. విద్యారంగంలో మనువాద భావజాలాన్ని రుద్దాలన్న తీవ్ర ప్రయత్నంతో పాటు వామపక్ష, ప్రజాస్వామిక భావజాల వ్యాప్తిని అడ్డుకోవాలన్న అంతకంటే తీవ్రమైన ప్రయత్నం జరుగుతోంది. అందుకు నిదర్శనం హర్యానా కేంద్రీయ విశ్వవిద్యాలయ వుదంతం. మహాశ్వేతాదేవి రాజకీయ అభిప్రాయాలు, వైఖరితో అందరూ ఏకీభవించాలని లేదు. ఆమె రచనలలోని వస్తువుతో కూడా ఎవరైనా విబేధించవచ్చు. ప్రముఖ రచయిత్రులలో ఒకరు అన్న అభిప్రాయంతో మాత్రం విబేధించాల్సిన అవసరం లేదు.ఆమె రాసిన ‘ద్రౌపది’ కథ ఆధారంగా రూపొందించిన ఒక నాటికను హర్యానా విశ్వవిద్యాలయంలోని ఆంగ్లం మరియు విదేశీ భాషల విభాగం వారు ప్రదర్శించారు. జూలై 28న మరణించిన మహాశ్వేతాదేవి సంస్మరణగా సెప్టెంబరు 21న ఆ విభాగంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ స్నేహస్థ రూపొందించిన నాటికను ప్రదర్శించారు. ఆ నాటిక ప్రదర్శన తరువాత దేశంలో కాశ్మీర్‌తో సహా అనేక రాష్ట్రాలలో జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లు, గిరిజన యువతులపై జరుగుతున్న అత్యాచారాలు, సైనికుల అనుచిత చర్యల వివరాలను డాక్టర్‌ స్నేహస్ధ చదివి వినిపించారు. ఈ విషయం స్ధానిక పత్రికలలో వార్తగా వచ్చింది.1970 దశకంలో ఒక ఆదివాసీ మహిళ ప్రత్యేక పోలీసుల కస్టడీలో అత్యాచారానికి గురి కావటం కథాంశం. గిరిజనోద్యమ నాయకుల గురించి వివరాలు వెల్లడించాలని పోలీసులు కోరితే నిరాకరించిన యువతిపై అత్యాచారం జరిపి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించటం. దీనిలో సైనికుల గౌరవానికి భంగం కలిగించేలా వుందంటూ కొందరు మాజీ సైనికులు అభ్యంతరం చెప్పారు, వెంటనే ఎబివిపి, మరో విద్యార్ధి సంస్ధ ఇండియన్‌ నేషనల్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ నిరసన తెలుపుతూ ప్రదర్శనలు చేశాయి. నాటికలో పల్గొన్నవారిపై చర్య తీసుకోవాలని విశ్వవిద్యాలయం ముందు నిరసన తెలిపారు. ఒక సంఘర్ష సమితిని ఏర్పాటు చేసి ఛాన్సలర్‌ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ప్రతిదానిని సంచలనాత్మకం చేసేందుకు ఎదురు చూసే మీడియా దీన్ని కూడా జెఎన్‌యు వుదంతంతో పోల్చి నాటికను ప్రదర్శించిన వారికి ‘జాతి వ్యతిరేకం’ ముద్ర తగిలించింది.

    భావ ప్రకటనా స్వేచ్చను కాపాడాల్సిన,సమర్ధించాల్సిన విశ్వవిద్యాలయ అధికారులలో ఒకరైన రిజిస్ట్రారు సెప్టెంబరు 22వ తేదీన కొన్ని బృందాలు తెలుపుతున్న అభ్యంతరాలను వుటంకిస్తూ ర్‌ స్నేహస్థ సైన్యానికి వ్యతిరేకంగా చేసినట్లు చెబుతున్న ఆరోపణపై రెండు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలంటూ ఒక లేఖ రాశారు.దీనిపై దర్యాప్తు చేసేందుకంటూ వైస్‌ ఛాన్సలర్‌ ఒక ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాంగం కూడా విడిగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బ్రిటీష్‌ వారు 1876లోనే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా నాటకాలు ప్రదర్శిస్తే వాటిని సెన్సార్‌ లేదా నిషేధించేందుకు నాటక ప్రదర్శనల చట్టం చేశారు. ఇన్నేండ్ల తరువాత విశ్వవిద్యాలయ అధికారుల తీరు చూస్తే అదే చట్టం ఇంకా అమలులో వున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం ఒక్కటే ఇక్కడ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులు అధికారులుగా వుండటం తప్ప వేరు కాదు. రోహిత్‌ వేముల ఆత్మహత్య సందర్భంగా సంతాపం తెలుపుతూ కొంత మంది విద్యార్ధు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టగా ఈ విశ్వవిద్యాలయంలోని ఏబివిపి సభ్యులు వారిపై దాడి చేశారు, విశ్వవిద్యాలయ ప్రాంగణంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

     ద్రౌపది నాటిక విషయానికి వస్తే జెఎన్‌యు, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో మాదిరి కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రచారం చేసేందుకే ఒక పెద్ద కుట్రలో భాగంగా మారుమూల గ్రామీణ ప్రాంతంలో వున్న ఈ విశ్వవిద్యాలయంలో నాటికను ప్రదర్శించారని హర్యానా ఏబివిపి నేత ప్రమోద్‌ శాస్త్రి ఆరోపించారు. విశ్వవిద్యాలయాలు శాస్త్రవిషయాలు, పరిశోధనల కోసం ఏర్పాటు అయ్యాయని అలాంటి చోట ప్రతి అంశంపై చర్చలు జరపవచ్చని నాటికను రూపొందించిన స్నేహస్ధ సమర్ధించారు.ఆమె రాసిన నాటిక ప్రదర్శనకు అధికార యంత్రాంగం అనుమతించిందని, దానిలో చేసిన విమర్శకు ఎవరైనా సైనికుల మనోభావాలు గాయపడి వుంటే క్షమించాలని ఆ వివాదానికి స్వస్థిపలికేందుకు ప్రయత్నించారు. అయితే యురిలో సైనిక శిబిరంపై పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులు జరిపిన దాడి, సైనికుల మరణం నేపధ్యంలో ఎబివిపి దీనిని సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించింది.

    ఢిల్లీ విశ్వవిద్యాలయ కాలేజీ లెక్చరర్‌ షైకత్‌ ఘోష్‌ హర్యానా విశ్వవిద్యాలయ వుదంతం గురించి వ్యాఖ్యానిస్తూ రెండు సంవత్సరాల క్రితం సంఘపరివార్‌ భావజాలాన్ని విమర్శిస్తూ తన దర్శకత్వంలో ‘వెల్‌కం టు మెషిన్‌ ‘ అనే నాటిక ప్రదర్శనను రెండు సంవత్సరాల క్రితం ఏబివిపి అడ్డుకున్నదని భావ ప్రకటనా స్వేచ్చను ఆటంకపరచటంలో భాగ మే ఇదన్నారు.

    ప్రజా వుద్యమాల అణచివేతలో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరపటంలో పోలీసులు, పారా మిలిటరీ, సైనికుల తీరు తెన్నుల గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణా సాయుధ పోరాటం సందర్భంగా ఎందరో మానవతులను నిజాం పోలీసులు, రజాకార్లతో పాటు మలబార్‌ స్షెషల్‌ పోలీసులు, మిలిటరీ జరిపిన దారుణాలు చరిత్రలో నమోదయ్యే వున్నాయి. తరువాత కాలంలో కూడా అనేక వుద్యమాలు, ఆందోళనలు, పోరాటాల సందర్భంగా ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగాయి. వీటిని గురించి చెప్పటమంటే మొత్తం సైన్యం, పారామిలిటరీ, పోలీసులు అలాంటి వారని నిందించటం లేదా వారి సేవలను కించపరచటం కాదు. ప్రపంచంలో ప్రతిదేశంలో ప్రజా వుద్యమాలు, తిరుగుబాట్లను అణచటంలో పాలకవర్గానికి అత్యాచారం ఒక ఆయుధం. దానిని ప్రయోగించటంలో భారత పాలకవర్గమేమీ తక్కువ తినలేదు.

      చివరగా ఒక్క మాట ! ‘రోహిత్‌ చనిపోతే నేను వెళ్లలేదు… రకరకాల నేతలు పరామర్శకు వచ్చారు, నేను వెళ్లటం మంచిదా కాదా అన్న మీమాంసలో మౌనంగా వుండాల్సి వచ్చింది. ఏ సిఎం కూడా ఇలా జరగాలని కోరుకోడు’ :తమ పార్టీ అధికారానికి వస్తే ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కెసిఆర్‌  మాటలివి.

     అబ్బ ! భలే తెలివిగా చెప్పిండు కదా !! అని అప్పుడు ఆయన భక్తులెందరో ప్రశంసించారు. ఇప్పుడా రోహిత్‌ వేముల ఆత్మార్పణ అజెండాపైనే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బుధవారం నాడు జరిగిన విద్యార్ధి సంఘ ఎన్నికలలో రోహిత్‌ వేముల అసలు దళితుడే కాదు, బిసి అంటూ సమస్యను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన సంఘపరివార్‌ శక్తులను మట్టి కరిపించి అక్కడి విద్యార్ధులు తిరుగులేని తీర్పు చెప్పారు. రోహిత్‌కు తగిన నివాళి ఇది. ఇప్పుడైనా రోహిత్‌ వేముల మరణం గురించి కెసిఆర్‌కు మీ మాంస తీరిందా? ఇంకా కొనసాగుతోందా? కొత్తది తలెత్తిందా ? అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా పాడు పొట్టకు అన్నమే వేతామురా , పోయినోడు ఎలాగూ పోయాడు, కేంద్రంలో బతికి వున్నవారితో తగాదా ఎందుకు ? పోనందుకు విమర్శలు ఎలాగూ రానే వచ్చాయి. నిండా మునిగిన వాడికి చలేమిటి ? అనుకుంటున్నారా !

     రోహిత్‌ మరణానికి కారకడని విద్యార్ధులు వేలెత్తి చూపుతున్న వైస్‌ ఛాన్సలర్‌, అతగాడిపై ఎస్‌సిఎస్‌టి అత్యాచారాల చట్టం కింద పెట్టిన కేసుపై ఇంతవరకు ఏ చర్యా తీసుకోకపోవటానికి…. తస్సాదియ్యా ఇంకా పెద్దమ్మలా పట్టుకున్న మీ మాంస కొనసాగటమే కారణం కదా !

    నిజమే వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు మీద విద్యార్ధులు ఎస్‌ఎసిఎస్‌టి చట్టం కింద పెట్టిన కేసులో ముందుకు పోతే నరేంద్రమోడీతో ఒక పంచాయతీ, పోకపోతే విద్యార్ధులతో మరొక పంచాయతీ. మధ్యమానేరు నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ ఇళ్లు కట్టిస్తానని తెలియక వాగ్దానం చేశాను కనుక క్షమించమని ముఖ్యమంత్రి కెసిఆర్‌ చెప్పారు. రేపు మిగతా విషయాలలో కూడా ఇలాగే చెప్పి క్షమించమంటారేమో ? పాలకుల తెలివి తేటలకు కొదవలేదు, తవ్వినకొద్దీ వస్తూనే వుంటాయి ! పాలితులకే వెంటనే లైటు వెలగటం లేదా !!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Indian Railways Launched Various Services to the Nation

30 Friday Sep 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Indian Railways, Railways

Shri Suresh Prabhakar Prabhu, Minister of Railways during a function held at Rail Bhawan Yesterday i.e. 29.09.2016, as a part of fulfilment of Budget Announcements 2016-17, launched and dedicated following services to the nation : –

  1. Liberalised station to station special freight rates policy
  2. Policy providing sub quota of 33 % to women within reserved categories for the allotment in catering units.
  3. Policy giving preference to local domicile holders for commercial licenses at stations.
  4. New system of allocating vacant berths after final charting to wayside stations.
  5. Launch of the new “Train at a Glance” and new Time Table effective from 1st October 2016.

Shri Rajen Gohain, Minister of State for Railways was especially present on the occasion. Chairman, Railway Board, Shri A.K. Mittal, Member Traffic Mohd. Jamshed and other Railways Board Members and dignitaries were also present on the occasion.

Speaking on the occasion, Minister of Railways Shri Suresh Prabhakar Prabhu said that the Indian Railways is striving hard to achieve full passengers’ satisfaction in all respects and today’s initiatives are part of our such endeavours.  He said that the introduction of new policy providing sub-quota of 33% to women in catering units is a step towards women empowerment and their increased participation in Railways.  He said that Railways will continue to introduce such new reformative steps.

Speaking on the occasion, Minister of State for Railways Shri Rajen Gohain said that Indian Railways being the biggest organization of the country has lots of complex projects to implement throughout the country. But overcoming the difficulties and complexities, Railways is implementing its budget announcements in a very promised manner which is a landmark in itself.

Salient Features of the initiatives : –

POLICY PROVIDING SUB QUOTA OF 33 % TO WOMEN WITHIN RESERVED CATEGORIES FOR THE ALLOTMENT IN CATERING UNITS

  • In compliance of Budget Announcement 2016-17, a Sub Quota of 33% for women in allotment of each of the reserved catering units is being introduced on Indian Railways in order to extend economic empowerment for women.
  • Current Status of Reservation at Minor Catering Units (Stalls / Trolleys / Khomchas)
  • A1, A, B, and C Category stations – 25% of the Units are reserved for various categories like SC (6%), ST (4%), BPL (3%), OBC (3%), Minorities (3%), Freedom Fighters (4%) and Physically Challenged persons (2%).
  • D, E and F Category stations – 49.5% of the Units are reserved for various categories like SC (12%), ST (8%), OBC (20%) and Minorities (9.5%).
  • 33% sub quota reservation for women shall ensure allotment of minimum 8% stalls to women at A1, A, B & C category station and minimum 17% at D, E and F category station.
  • There are approximately 8000 Minor Catering Units over Indian Railways.
  • Under this provision, Railways shall ensure that women participation does not fall below a specific level.

POLICY GIVING PREFERENCE TO LOCAL DOMICILE HOLDERS FOR COMMERCIAL LICENSES AT STATIONS

In compliance of Budget Announcement 2016-17, a process of giving weightage to district Domicile Holders for commercial licenses at stations is being proliferated at all stations over Indian Railways.

  • The proliferation would help to build local ownership and rural empowerment along with socio – economic development.
  • The weightage to district domicile holders is being proliferated for allotment of Catering Units at all categories of stations.
  • The proliferation of weightage to district Domicile Holders at all category of stations will ensure protection of livelihood of the small vendors.
  • The allotment of Minor Units over Indian Railways will ensure local ownership and will also promote regional / local cuisine, which is always a preferred choice.
  • The weightage parameter would range from 20% to the local District Domicile holders to 12% to the State Domicile holders in techno-commercial scores.

TRANSFER OF VACANT BERTHS FOR OPTIMAL UTILISATION OF BERTHS

 IR is introducing the facility of transfer of berths remaining vacant after second charting at the train originating station to the next and subsequent stations for clearing the waitlisted passengers at such stations.

  • The PRS system will automatically allot vacant berths available at the originating stations after preparation of second chart to the subsequent stations where waitlisted passengers are available. The passenger will get SMS on his registered mobile indicating the coach and berth number allotted. This will help passengers boarding at road side stations to get confirmed berths. Presently they get their berths confirmed only if confirmed berths from the pooled quota (PQ) allotted to the station are cancelled.
  • The TTEs will be able to allot vacant berths on board after departure of the train only upto the next station where quota is available for the train. In case no person boards the train at the next station he can further allot/extend the same to the next quota station.
  • At present about 3 lakh berths per year go unutilised while there may be demand at intermediate stations. This system will help in better utilization of available berths at the time of departure of trains from the originating station and also reduce the discretion available with TTEs in allotting the berths.

 

LIBERALISED STATION TO STATION SPECIAL FREIGHT RATES POLICY

 Section 32 of the Railways Act, 1989 empowers railway administration to quote Station to Station Rate (STS) in respect of carriage of various commodities.

  • Railway Board used to issue guidelines to Zonal Railways for implementation of STS rates. Last guidelines on this subject were issued by Board in 2002, which were in operation till 2006. In November 2015, Zonal Railways were advised to exercise power vested with them to quote STS rates as per the Railways Act, 1989.
  • On request from Zonal Railways and to enable them to garner more traffic from road and other modes,   broad guidelines are being issued to Zonal Railways for finalising STS rates.
  • Salient features of the proposed policy are as under:

 Existing as well as new traffic shall be eligible.

  • Concession shall be granted up to a maximum of 30% on the incremental traffic over and above the benchmark NTKM. Benchmark NTKM is defined as average NTKMs of corresponding periods of previous 24 months.
  • Concession shall be in the form of percentage discount over the Normal Tariff Rate (NTR). It should be ensured that the concessional freight should not be less than the NTR of Class 100.
  • Concession shall be admissible to Block rake, two/multi point rake, Mini Rake etc.
  • Concession may be granted for retention of traffic also up to maximum of 15%. In case of container traffic, STS discount upto maximum of 15% shall be given to commodities charged at Container Class Rate (CCR).
  • STS scheme will be applicable for all terminals namely goods sheds, sidings, ports, CRTs, PFTOs etc.
  • To avail STS, Rail users shall be required to apply to the DRM with details, who shall forward the same for approval of GM through CCM, COM and FA&CAO.  If Railway administration approves grant of concession under STS, an agreement shall be executed between Railway and customer.
  • The agreement shall be done for a maximum period of three years at a time and for not less than one year.  Any change in freight rate (excluding imposition of any surcharge) shall not be applicable on the customer during the currency of the agreement or for one year, whichever is less.
  • Commodities excluded from STS are –

o   All commodities with classification below Class-100.

o   All commodities under Main Commodity Head “Coal & Coke”

o   Iron ore (all types)

o   Military traffic, POL and RMC

  • Targeted customer:  Food grain, Cement, Clinker, Dolomite, Limestone, Steel companies, Fly ash, etc.
  • Expected additional loading: 10 million tonne per annum.

LAUNCH OF NEW TAG             The launch of  Trains at a Glance 2016– the new Time Table effective from the 1st October has also been launched.

A BRIEF OVERVIEW

With over 66 thousand kilometres of route ( 1/3 rd of which is electrified), more than 7000 stations, above 10,000 locomotives and more than 60 thousand coaches, Indian Railways runs above 13000 passenger carrying trains  – to take about 23 million passengers to their destinations –  everyday.

The journey in Passenger Operations in the last two years has been one of sustained efforts to provide additional capacities, improve the quality of travel experienceand to reach out to all types of passengers including those in far flung areas. As can be seen, funds to the tune of 8.56 Lakh crore are already tied up for these purposes for 2-15-19 and have started bringing results.

Additional  services provided in last 2 years include 308 new trains, 99 extensions, 118 trains whose frequency was increased and permanent addition of 1610 additional coaches.

We have also met additional demand by running more than 70 thousand special trains  including those to meet extra rush, election movements, military and para-military movements, and tourist trains. Besides, more than 2.5 lakh extra coach trips have also been provided – as per need.

We have been migrating to better coaches – with more comfort and speed.  38 trains have been provided the modern LHB coaches and 40 trains converted to the faster and superior MEMU coaches.

We have also added trains to new areas including  Sri Mata VaishnodeviKatra, Arunachal Pradesh , Barak Valley and many more.

 

In the current Year, the efforts to improve service levels in passenger operations have gained further momentum. What has already been done in the current year includes premium trains like Mahamana and Gatimaan express,aneven more accelerated transition to superior coaches including the new DeenDayalu coaches started from August,  More Permanent augmentations, and further efforts to meet additional demands.

The current year has seen several large religious and other congregations of people which have been managed effectively,  to the comfort of our passengers , with record running of special trains and extra coaches and effective overall bandobast,. This includes the SimhasthaMela in Ujjain, the krishnapushkaram on the Krishna Basin and so on. The arrangements for the ensuing Durga Puja rush are also completely in place.

 

 

The highlights of the improvements planned in the new Time table that will come into effect from the 1st October, 2016, include most importantly, the specifics of the 4 new brands of train products.

Further, in this timetable, we have also reduced the journey times in 350  existing trains, 75 of which have made it to the superfast category.

We have converted 240 operational halts into commercial stoppages and have for the first time, provided in the time table, train connectivities to the North Eastern states of Tripura, Manipur and Mizoram.

 

Also incorporated in this  Time Table – are  36 pairs of new services, some of which have been introduced in this financial year and some that will be coming soon- like the  10 pairs of Humsafar trains, 7 Antyodaya, 3 Tejas and 3 UDAY trains besides a number of other mail express trains, extensions, increase in frequency, diversions etc.

 

Infact, the  4 diversions mentioned at the end of the last slide shall become effective from the 1 st October. These will cater to a long pending demand of the people of Cuttack who will now get a direct connectivity instead of the detour these trains were earlier taking.

 

The contours of the new train products incorporated in the New Time Table are brought out here. The Humsafar as you are aware would be the fully AC service with optional catering,Antyodayathe long distance unreserved superfast train for common man, Tejas will have all modern on board features like entertainment , wifi and local cuisines, etc and UDAY will be an AC  doublecker train on the busiest routes.

 

Coming to the specific routes and schedules of the new train products,

 

The 10 Humsafar Express trains will run between……

  1. Sealdah- Jammu Tawi via Lucknow, Varanasi
  2. Bhubaneshwar – rishnarajapuram via Vijaywada
  3. Gorakhpur – Anandvihar via Lucknow
  4. Howra – Yeshwantpur via vijaywada
  5. Durg- Nizamuddin via Jhansi
  6. Ahmedabad- Chennai via Pune
  7. Tirupati- Jammutawi via Jhansi
  8. Bandra- Patna via Jabalpur
  9. Sriganganagar-Trichurapalli via Ahmedabad
  10. Kamakhya-Bangalore via Cuttack

The  7 Antyodaya express trains will run between…

  1. Darbhanga – Jallandhar via Gorakhpur
  2. Tatanagar- LomanyaTilak  Terminus via Bilaspur
  3. Santragachi – Chennai via Vijaywada
  4. Bilaspur – Ferozepur via Jhansi
  5. Bandra – Gorakhpur via Vadodra
  6. Howrah – Ernakulam via Vajaywada
  7. Jaynagar _ Udhna via Patna

 

The 3 Tejas trains will run between….

  1. New Delhi – Chandigarh
  2. Lucknow – AnandVihar
  3. Mumbai CST – Madgaon

 

And The three UDAY Trains will run between…..

  1. Coimbatore – Bangaluru  via Salem
  2. Bandra – Jamnagar via Surat
  3. Vishakhapatnam – Vijaywada

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కుదేలైన బాంబే స్టాక్‌ మార్కెట్‌ – యధావిధిగా కరాచీ స్టాక్‌

29 Thursday Sep 2016

Posted by raomk in Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BSE sensex, India-Pakistan, Indian army, KSE, pakistan, surgical strike

పాక్‌ వుగ్రవాద శిబిరాలపై భారత సర్జికల్‌ దాడి పర్యవసానం

ఎంకెఆర్‌

    సరిహద్దు దాటేందుకు ఆక్రమిత కాశ్మీర్‌ ప్రాంతంలో తిష్ట వేసిన వుగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు భారత సైన్యం గత అర్ధరాత్రి దాటిన తరువాత దాడులు చేసిందని వారి గుడారాలను కొన్నింటిని ధ్వంసం చేసి అనేక మందిని మట్టు పెట్టి తెల్లవారే సరికి మన సైన్యం పక్కాగా తిరిగివచ్చిందని సైనిక అధికారులు ప్రకటించారు. అయితే పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఒక ప్రకటన చేస్తూ అలాంటి దాడులేమీ జరగలేదని, సరిహద్దులలో ఎప్పుడూ జరిపే మాదిరి భారత సైన్యం కాల్పులు జరిపిందని ఇద్దరు తమ సైనికులు మరణించారు, ఇతరులు తొమ్మిది మంది గాయపడ్డారు తప్ప వేరే ఏమీ జరగలేదని, భారత్‌వి కట్టుకథలని ప్రకటించారు. మన సైన్యం జరిపిన చర్యను సర్జికల్‌ దాడి అని పేర్కొన్నారు.ఈ దాడిలో ఎంత మంది మరణించారు, ఎన్ని శిబిరాలను ధ్వంసం చేశారన్నది అధికారికంగా ఎవరూ చెప్పటం లేదు. నిర్దిష్ట సమాచారం వుంది కనుక ఈ దాడులు చేశాం పని అయిపోయింది కనుక వెనక్కు తిరిగి వచ్చాం అంతే తప్ప నిరంతరం కొనసాగించే పధకాలేవీ లేవని కూడా మన సైనిక ప్రతినిధులు ప్రకటించారు.

    ఈ దాడితో స్టాక్‌ మార్కెట్లలో కంపెనీల వాటాల ధరలు పతనమై మదుపర్లు నష్టపోయారు. మన సైన్యం చేసిన ప్రకటనను పక్కాగా నమ్మి బెంబేలెత్తిన వాటాల విక్రయదారులు అమ్మకాలకు పూనుకోవటంతో బుధవారం నాటితో పోల్చితే గురువారం నాడు బొంబాయి స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచిక 465 పాయింట్లు లేదా 1.64 శాతం పతనమైంది. అదే విధంగా భారత సైన్యం దాడులేమీ జరపలేదు, ఎప్పటి మాదిరే సరిహద్దుల్లో కాల్పులు జరపటం తప్ప మరొకటేమీ జరగలేదన్న పాక్‌ ప్రభుత్వ ప్రకటనను అక్కడి విక్రయదారులు కూడా గట్టిగా విశ్వసించటంతో కరాచీ స్టాక్‌ సూచిలో కేవలం 59.5 పాయింట్లు లేదా 0.15 శాతమే పతనమైంది. అంటే అక్కడి విక్రయదారులు, మదుపర్లు తాపీగా వున్నారన్నది స్పష్టం.దాడులు జరిపినప్పటికీ వాస్తవాధీన రేఖ వెంబడి జరిగే వ్యాపార లావాదేవీలు యురి వద్ద (మన సైనికులను చంపిన సైనిక కేంద్రం వున్న ప్రాంతం) గురువారం నాడు యధావిధిగా జరిగాయి. మన దేశం నుంచి 26 ట్రక్కులు అవతలకు వెళితే అవతల నుంచి పది ట్రక్కులు మన వైపు వచ్చాయి.

   మన సైన్యం జరిపిన దాడిలో ఏం జరిగింది అన్నది చూద్దాం . సైనికాధికారులు చేసిన బహిరంగ ప్రకటనలో గణనీయంగా వుగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారు మరణించి వుంటారు అన్నారు తప్ప సంఖ్యను పేర్కొనలేదు.సర్జికల్‌ దాడులు, సైనిక వర్గాల కథనాలను బట్టి వచ్చిన వార్తల ప్రకారం పాక్‌ ఆక్రమిత ప్రాంతంలోకి 500 మీటర్ల నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు చొరబడి కాల్బలం, హెలికాప్టర్ల కమాండోలు వుమ్మడిగా దాడి చేసి తెల్లవారక ముందే తిరిగి వచ్చారు.కాల్బలం భూమి మీద వెళితే వారికి రక్షణగా ఎంఐ 17 హెలికాప్టర్లు కాపలా కాశాయి. దాడులు చేయటాన్ని డ్రోన్ల ద్వారా వీడియోలు కూడా తీశారు. వాటిని తగు సమయంలో బయట పెడతామని అధికారులు చెప్పారు.గత రెండు నెలల కాలంలో 19 సార్లు వుగ్రవాదులు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించారు.

    సర్జికల్‌ దాడులలో నిర్ధిష్ట లక్ష్యాలు మాత్రమే నాశనం అవుతాయి. వాటి పరిసరాలలో నష్టం జరిగినా అది పెద్దగా వుండదు. పాకిస్థాన్‌ను పూర్తి స్థాయిలో ఆశ్చర్య పరచటంలో సఫలీ కృతమయ్యామని, మన వైపు నుంచి ఎవరూ మరణించలేదని సైనిక వర్గాలు తెలిపాయి.దాడులు జరిపిన ప్రాంతంలో కొండలు, అడవులు, పర్వతాలు వున్నాయి. దాడులు జరిపిన ప్రాంతంలో ఏడు వుగ్రవాద శిబిరాలు లేదా గుడారాలు వున్నాయి. ప్రతి శిబిరంలో 30లేదా 40 మంది , మరొక 20 మంది వుగ్రవాదులు పరిసరాలలో వుంటారు. ప్రతి చోట దారి చూపే వారు, మద్దతుదారులు వుంటారు. వాటిపై గత వారం రోజులుగా మన సైన్యం కన్నువేసి వుంచింది. మన కమాండోలను హెలికాప్టర్ల ద్వారా రాత్రి 12.30 – తెల్లవారు ఝామున 4.30 వుగ్రవాద శిబిరాలు వున్న ప్రాంతాలలో దాడులు చేయించి సురక్షితంగా వెనక్కు తీసుకు వచ్చారు. అయితే అధికారులు చెప్పిన వివరాలను సమాచార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ తోసిపుచ్చారు.అసలు హెలికాప్టర్లు సరిహద్దు రేఖను దాటలేదని, దాడిలో పాల్గొనలేదని చెప్పారు.(హిందూ పత్రిక ప్రతినిధి)

    దాడులు చేసిన మన సైన్యానికి ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. పాక్‌ ప్రకటనలో కూడా తమ సైనికులు ఇద్దరు మరణించారని తప్ప ఇతరంగా చెప్పలేదు. అడవులు, కొండలు,ఎత్తయిన పర్వత ప్రాంతాలలో వున్న గుడారాలపై దాడులు జరపటం తప్ప వాటిలో వున్న ఎందరు మరణించారన్నది లెక్కలు తేల్చటం అందునా చీకటిలో లెక్కించటం సాధ్యం కాదు, అంచనాలను మాత్రమే అనధికారికంగా చెప్పిన అంశాలు మీడియాలో వస్తున్నాయి.

    యురి సైనిక శిబిరంపై పాక్‌ వుగ్రవాదులు దాడులు చేసినపుడు మన సైన్యం నిద్రపోతున్నదని, డ్యూటీలు మారటాన్ని అవకాశంగా తీసుకొని శిబిరం పరిసరాలలో పెరిగిపోయిన గడ్డిలో దాక్కొని వచ్చారని చెప్పిన విషయం తెలిసినదే. బుధవారం రాత్రి జరిపిన దాడి సమయాన్ని బట్టి, మన కేమీ నష్టం జరగలేదనటాన్ని చూస్తే ఆ సమయంలో సరిహద్దులలో వున్న పాక్‌ సైన్యం, వుగ్రవాదులు కూడా గాఢ నిద్రలో వుండి వుంటారా ? ఏ క్షణంలో అయినా దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటామన్న భారత ప్రకటనలను తేలికగా తీసుకున్నారా అన్న సందేహాలు కలగటం సహజం. సర్జికల్‌ దాడులు జరపటం భారత సైన్యానికి కొత్త కాదు, గతేడాది మయన్మార్‌ సరిహద్దులలోని వుగ్రవాద శిబిరాలపై కూడా ఇలాంటి దాడులే జరిపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసినదే. వుగ్రవాద నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలకు సైన్యం ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చ స్చేఛ్చను ప్రభుత్వం ఇచ్చిందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మంచి వార్తలు సరే , చెడు సమాచారం మాటేమిటి మోడీ జీ ?

28 Wednesday Sep 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Political Parties

≈ Leave a comment

Tags

cotton, joblessness, Modi, WEF, WEF rankings

ఎం కోటేశ్వరరావు

   ప్రపంచంలో పోటీ ఆర్ధిక వ్యవస్ధల జాబితాలో భారత్‌ సూచిక ఒక్క ఏడాదిలోనే ఏకంగా 16 పాయింట్లు పెరిగిందని బిజెపి బాకా లొట్టలు వేసుకుంటూ చెప్పటం విన్నాను. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ బాకాలుగా మన ఆకాశవాణి, దూరదర్శన్‌లు పని చేస్తాయి గనుక బిజెపి బాకా అన్నందుకు ఆ పార్టీ వారు అన్యధా భావించవద్దు. ఎవరైనా అభ్యంతరం అంటే గతంలో కాంగ్రెస్‌ బాకాలని తమ పార్టీ నేతలు చేసిన విమర్శలను ముందుగా వుపసంహరించుకోమని కోరాలి. నీకిది నాకది అంటూ వాటాలు వేసుకొని పంచుకొనే విదేశీ, స్వదేశీ బడా కార్పొరేట్‌ సంస్ధలు మరింతగా మన మార్కెట్‌లో ప్రవేశించేందుకు, పూర్తిగా దిగువ స్ధాయికి విస్తరించి లాభాలు పెంచుకొనేందుకు, మన జనజీవితాలను మరింతగా అవి కట్టడి చేసేందుకు వీలుగా గత రెండున్నర సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ పడుతున్న కష్టం లేదా శ్రమకు ఇది గుర్తింపు అనటం నిస్సందేహం. సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వర్ణించినట్లు ఏదేశంలో అయినా పేపర్‌వాలా లేదా ఒక చాయ్‌వాలా అయినా అపర కోటీశ్వరుడయినా పెట్టుబడిదారీ దేశంలో అధికారానికి వస్తే ఇలాగే జరిగింది. అదేమిటో కాంగ్రెస్‌-బిజెపి, తెలుగుదేశం మరొక పార్టీ ఏది అధికారంలో వున్నా అందరినీ కోటీశ్వరులను చేయాలనే మహత్తర యావలో ముందుగా అప్పటికే వున్న కోటీశ్వరులను మరింతగా ఎంత ఎత్తుకు పెంచవచ్చో చూసేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి పార్టీలన్నీ ఒకతానులో ముక్కలే, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్నట్లు ఏ పార్టీ అధికారంలో వుంటే దానిలోనే చేరిపోతారు. ఎవరి ఇంట్లో చూసినా ఎప్పుడూ అన్ని పార్టీల కండువాలూ,జండాలూ, కర్రలూ సిద్దంగా వుంటాయి.

    మధ్యలో కొన్నేండ్ల జనతా పార్టీ, నేషనల్‌ ఫ్రంట్‌ ,బిజెపి పాలన పదేండ్లు మినహా 1947 నుంచి 2014వరకు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్‌ మన దేశంలో అధిక సంపదలు గల వ్యక్తులుగా 2013 నాటికి 1,56,000 మందిని తయారు చేసింది.http://www.ndtv.com/india-news/india-home-to-1-98-lakh-millionaires-world-wealth-report-2015-1217902. చాయ్‌ వాలా నరేంద్రమోడీ ప్రారంభమే జెట్‌ వేగంతో వూపందుకు కుంది కనుక 2014 నాటికే వారి సంఖ్య 1,98,000 వేలకు పెరిగింది. ధనికులలో దారిద్య్రరేఖ నుంచి ఎగువకు ఒక్క ఏడాదిలో నలభై రెండువేల మందిని చేర్చారు.ఈ స్పీడున 2017 నాటికి మొత్తం 3,43,000 మంది ఆ స్థాయికి చేరుకోవచ్చట.http://www.rediff.com/business/slide-show/slide-show-1-117-lakh-ultra-high-networth-individuals-in-india/20140724.htm#1 అరవై సంవత్సరాలలో కాంగ్రెస్‌ చేయలేని దానిని ఐదు సంవత్సరాలలో చేసి చూపుతామని, మంచి రోజులను తెస్తామని బిజెపి, వారికి మద్దతుగా అపర చాణుక్యుడు చంద్రబాబు నాయుడు, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వంటి వారు చెప్పిన మాటలకు, చేసిన బాసలకు అర్ధం ఇదన్న మాట. ఇంతకీ అధిక సంపద అంటే ఎంతయ్యా అంటే వ్యక్తిగతంగా పాతిక కోట్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగిన కలిమి కలిగిన వారు. అంతకంటే తక్కువ వున్న వారు ధనికులలో దారిద్య్రరేఖకు దిగువ వున్నట్లు లెక్క. గతంలో వాజ్‌పేయి అధికారం చివరి రోజుల్లో భారత్‌ వెలిగిపోతోందని ప్రచారం చేసి ఎన్నికలలో పాల్గొన్నారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు వాజ్‌పేయి కంటే నరేంద్రమోడీ తెలివిగల వారు కనుక ప్రారంభం నుంచి భారత్‌ వెలిగిపోతోంది అన్న ప్రచారం చేయటంలో కిటుకు ఇదే. తొలి ఆరునెలల్లోనే ప్రధాని మోడీ నాయకత్వంలో ‘చారిత్రాత్మక, అసాధారణ’ విజయాలను సాధించారని స్వయంగా ఆయన ఆత్మ అమిత్‌ షా సుష్పష్టంగా చెప్పారు.http://www.financialexpress.com/economy/shades-of-india-shining-amit-shah-says-extraordinary-modi-govt-has-made-common-mans-life-easier/13416/

     బాకాలెప్పుడూ విజయగానాలే చేస్తుంటాయి. అప్రియాలను వినపడ, కనపడనివ్వవు. పోటీ ఆర్ధిక వ్యవస్ధల జాబితాలో భారత్‌ సూచిక పైకి గంతు వేసిన వార్తతో పాటు దేశంలో నిరుద్యోగిత ఐదు సంవత్సరాల రికార్డుకు చేరింది. మొదటి సంతోష వార్తను ప్రపంచ కుబేరులు ఏర్పాటు చేసుకున్న ప్రపంచ ఆరి&ధక వేదిక అనే ఒక ప్రభుత్వేతర సంస&ధ చెబితే రెండవ దుర్వార్తను స్వయంగా మన కార్మిక మంత్రిత్వశాఖే వెల్లడించింది. పై వార్తతో ఆనంద పడిన వారు అదెంత వరకు వాస్తవమో ఎలాంటి సందేహాలు వెలిబుచ్చలేదు గాని రెండో వార్తను చూసి ఇదంతా తొండి, లెక్కలు సరిగ్గా వేయలేదు, సర్వే పరిమితంగా వుంది, రాష్ట్రాలలో జరుగుతున్న వాటిని పరిగణనలోకి తీసుకోలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నరేంద్రమోడీని బదనాం చేయటానికి కొత్తగా కార్మిక శాఖేమీ కొత్త పద్దతిని ప్రవేశపెట్టులేదు, గతం నుంచీ అనుసరిస్తున్నదే అది. కార్మికశాఖ వివరాల ప్రకారం 2011-12లో నిరుద్యోగిత 3.8శాతం వుంటే 2015-16లో 5శాతానికి చేరింది. ఇదే కాలంలో మహిళలలో నిరుద్యోగిత రేటు 6.9 నుంచి 8.7కు పెరిగింది. దీన్ని కూడా నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన ‘చారిత్రాత్మక, అసాధారణ ‘ విజయమే మరి. గత కొద్ది సంవత్సరాలుగా ఒక వైపు కొద్ది తేడాలతో వృద్ధి రేటు కొనసాగుతుండగా వుపాధి పడిపోవటాకి కారణాలు ఏమిటో మన పెద్దలు చెప్పాలి. మన జిడిపి వృద్ధి రేటు గురించి చెప్పుకోవాలంటే సామాన్యులకు అదొక అంతుబట్టని ఆల్జీబ్రా. ప్రభుత్వం లెక్కించే తీరులో, ప్రాతిపదిక సంవత్సరాలలో మార్పు కారణంగా అంకెలు మారిపోతుంటాయి. అందువలన ఒక మార్పు జరిగిన తరువాత పూర్వపు అంకెలతో పోల్చుకుంటే మనకు సరైన అర్ధం దొరకదు. వుదాహరణకు 2011 ప్రాతిపదిక లెక్కల ప్రకారం అంకెలన్నీ మారిపోయాయి. 2011-12 ధరల ప్రకారం జిడిపి 2012-13 నుంచి 2015-16 సంవత్సరాల మధ్య 5.2,5.6,7.2,7.6గా నమోదెంది. అదే సంవత్సరాలలో వర్తమాన ధరల ప్రకారం 13.9, 13.3, 10.8, 8.7గా వుంది. ఒక సూచిక పెరుగుదలను, మరొకటి తగ్గుదలను చూపుతున్నది.http://statisticstimes.com/economy/gdp-growth-of-india.php దున్నబోతే దూడల్లో, మెయ్యబోతే ఆవుల్లో అన్నట్లుగా రాజకీయ నాయకులు జనం దగ్గరకు వచ్చేసరికి తమకు వాటంగా వున్న అంకెలను గుమ్మరిస్తారు. జిడిపి రేటును ఎటుతిప్పి ఎలా తిప్పినా నిరుద్యోగం వంటి విషయాలకు వచ్చే సరికి అలాంటి గారడీ కుదరదు. అందుకే అవి నిజాలను వెల్లడిస్తాయి.

    ఈ మధ్య కురిసిన వర్షాలకు దెబ్బతిన్నది పోగా మిగిలిన పత్తి పంట చేతికి వస్తే మంచి ధర వస్తుందేమో అని రైతాంగం ఆశగా ఎదురు చూస్తోంది. ఈ వార్త చదివితే ఆశపడాలో ఆగ్రహించాలో ఆలోచించుకోవటం మంచిది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పత్తిని శ్రీలంక రాజధాని కొలంబో రేవులో నిల్వ చేసుకొనే వీలు గురించి చర్చించటానికి దక్షిణభారత మిల్లుల యజమానుల సంఘ ప్రతినిధులు ఏడుగురితో కూడిన ప్రతినిధి వర్గం అక్టోబరు మొదటి వారంలో కొలంబో వెళ్ల నుంది.http://www.thehindu.com/business/Industry/cotton-mills-explore-colombo-storage-facility/article9154812.ece సెప్టెంబరుతో ముగిసే పత్తి సంవత్సరంలో మన దేశం 20 లక్షల బేళ్ల పత్తి దిగుమతి చేసుకున్నదని, వచ్చే ఏడాది దిగుమతి మొత్తం ఇంకా పెరగనుందని మిల్లుల అసోసియేషన్‌ అధ్యక్షుడు సెంథిల్‌ కుమార్‌ చెప్పారు. భారత్‌, ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అంతర్జాతీయ వ్యాపారులు మలేషియాలో పత్తి నిల్వలు చేశారని, దిగుమతి వ్యవధి, ఖర్చు తగ్గింపు చర్యలలో భాగంగా తూత్తుకుడి రేవులో నిల్వ చేసుకొనేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరామని, ఈ లోగా కొలంబో రేవులో నిల్వ చేసుకొనే అవకాశాల గురించి చర్చించేందుకు వారి ఆహ్వానంపై వెళుతున్నట్లు తెలిపారు. అక్కడ రెండు లక్షల బేళ్లను నెల రోజుల పాటు ఎలాంటి రుసుము చెల్లించకుండా నిల్వ వుంచవచ్చునని చెప్పారు. మన దేశ అవసరాలకు మించి పత్తి వుత్పత్తి చేస్తున్న మన రైతాంగానికి విదేశీ దిగుమతులు వెన్ను విరిచేవే తప్ప మరొకటి కాదు. పత్తి దిగుమతి అంటే ఇక్కడ దొరికే రేటు కంటే తక్కువ అయితేనే మిల్లుల వారు మొగ్గు చూపుతారు. అంతకంటే తక్కువ ధరకు రైతులు అమ్మితేనే ఇక్కడ కొనుగోలు చేస్తారు.అదే జరిగితే ఇక్కడి రైతులేం కావాలి మరి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికన్లకు జలుబు చేస్తే భారత్‌లో ముక్కులు చీదాలా ?

27 Tuesday Sep 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Americans, cold, Farmers, indians, runny nose, wheat import

Image result for  cold to one runny nose to another one cartoon

ఎం కోటేశ్వరరావు

    రష్యాలో వాన పడితే భారత్‌లో గొడుగులు పడతారని గతంలో కమ్యూనిస్టుల మీద ఒక ఆరోపణ వుండేది. కమ్యూనిస్టులు అంతర్జాతీయ వాదులు కనుక సోవియట్‌ సోషలిజాన్ని దెబ్బతీసేందుకు జరిగే ప్రతి ప్రయత్నాన్ని విమర్శించేవారు కనుక కమ్యూనిస్టు వ్యతిరేకులు అలా వ్యాఖ్యానించే వారు. పోనీయండి ఇప్పుడా సోవియట్‌ లేదు, కమ్యూనిస్టులు ఎవరికీ గొడుగులు పట్టటం లేదు. నిజానికి బ్రిటీష్‌ రాణి కుటుంబంలో ఎవరైనా సమర్తాడితే మన దేశంలో బంతులు పెట్టిన వారి వారసులే అలాంటి విమర&శలు చేశారు. ఇప్పుడా బ్రిటీష్‌ వారూ పోయారు గనుక దాన్నీ వదిలేద్దాం. అమెరికన్లకు జలుబు చేస్తే మన దేశంలో ముక్కులు తుడుకుంటున్నవారి గురించి ఇప్పుడు మన ఆలోచించాలి.గొడుగులు పట్టినా,సమర్త బంతులు పెట్టినా మరొకరికి పెద్దగా హాని వుండదు. కానీ జలుబు అంటే అదొక అంటు వ్యాధి ఒక పట్టాన వదలదు, ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తుందని తెలిసిందే. అందుకే అమెరికా జలుబుకు ఇక్కడ ముక్కులు చీదుతున్నవారి గురించి జర జాగ్రత్త !

      అమెరికాలో గాడిద పార్టీ (డెమోక్రాట్స్‌ )తరఫున హిల్లరీ క్లింటన్‌, ఏనుగు (రిపబ్లికన్‌ ) పార్టీ తరఫున డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారం చేసుకుంటున్నారు. ఇద్దరూ ఇద్దరే నవంబరు వారు వరకు ఒక రోజు హిల్లరీ గెలుస్తుందని వార్తలు వస్తాయి, మరొక రోజు ట్రంప్‌ గెలుస్తాడని వార్తలు రాస్తారు, సోమవారం నాడు ట్రంప్‌ది పైచేయిగా వుందన్న వార్తలు రావటంతో చూసి మన దేశంతో సహా ప్రపంచంలో బంగారం ధరలు తగ్గాయని, స్టాక్‌ మార్కెట్ల సూచీలు పడిపోయాయని, చమరు ధరలు పెరిగాయని వార్తలు వచ్చాయి.ఓకే ట్రంప్‌ పచ్చి మితవాది కనుక అతగాడు వైట్‌ హౌస్‌లో అడుగుపెడితే తమకు కలసి రాదని అమెరికన్లు అనుకుంటే అక్కడి వ్యాపారాలపై దాని ప్రభావం పడాలి. డెమోక్రాట్ల నేత ఒబామా గత ఎనిమిది సంవత్సరాలుగా చేసిన మంచేమిటి ? ఏమీ లేకపోబట్టే కదా అమెరికన్లు ట్రంప్‌కు ఓటేస్తే ఏమిటి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు .ఎక్కడో 14వేల కిలోమీటర్ల దూరంలో వున్న మన మీద దాని ప్రభావం పడటం ఏమిటి ? ఆకాశంలో తిరుగుతూ నిత్యం మనల్ని కాపాడుతున్న మన దేవతలు ఏం చేస్తున్నట్లు ? పోనీ మన ప్రధాని నరేంద్రమోడీ విదేశాల్లో తిరుగుతూ ఇక్కడి వ్యవహారాలను విస్మరిస్తున్నారా ? మన సమాచార, ప్రసార, ప్రచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడి నోటి వెంట ఎప్పుడూ మంచి వార్తలే వినిపిస్తున్నాయి, మంచి రోజులనే చూపుతున్నారు కదా !

     మన రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్ల సవరణ గురించి ఆలోచిస్తున్నదంటే మన కంపెనీల స్టాక్‌ రేట్లపై ప్రభావం పడుతున్నదంటే అర్దం వుంది. అమెరికా రిజర్వుబ్యాంకు(ఫెడరల్‌ రిజర్వు) సమీక్షించబోతున్నది అనగానే మన స్టాక్‌ మార్కెట్‌లన్నీ రెండు మూడు రోజులు గందరగోళపడిపోతాయి. మన రూపాయి పాపాయి లబలబలాడి పోతుంది. ఏమిటీ దానికీ మనకు వున్న బాదరాయణ సంబంధం, ఆ లంకెను తెగగొట్టటానికి గతంలో వున్న కాంగ్రెస్‌ పాలకులు ప్రయత్నించలేదు, లేదా వారికి చేతకాలేదు అనుకుందాం సమర్ధ ప్రధాని నరేంద్రమోడీ పాలనలో కూడా ఈ పరిస్థితి ఏమిటి ? అమెరికాతో లంకె మనకు లాభం చేస్తున్నదా నష్టం తెస్తున్నదా ? నరేంద్రమోడీ అధికారానికి వచ్చినప్పటి నుంచి మన రూపాయి పతనమైనా మన ఎగుమతులు పెరగలేదు, పరిశ్రమలు పూర్తిగా వుత్పత్తి చేయటం లేదు. మేకిన్‌ ఇండియా పిలుపు మేరకు ఎన్ని పరిశ్రమలు మన దేశానికి వచ్చి వస్తూత్పత్తి చేసి ఎంత మేరకు ఎగుమతులు చేస్తున్నాయో ఎవరూ చెప్పరు.రెండున్నర సంవత్సరాలు కావస్తోంది, మంచి రోజులంటే ఇంకెన్నాళ్లు ? అమెరికా ఎన్నికలు మనల్ని మరికొద్ది వారాల పాటు నిదురపోనివ్వన్నమాట. ప్రతివారం ఏదో ఒక దేశం పర్యటించి మన ప్రధాని నరేంద్రమోడీ మనకు పెట్టుబడులు, పరిశ్రమలు తెస్తున్నట్లు చెబుతున్నారు కదా. మన పరిశ్రమలు, మన వ్యాపారాలు బాగుంటే మన కంపెనీల వాటాలు పడిపోవటం ఏమిటి? మనల్ని అమెరికన్లకు తోకలుగా మార్చారా ? లేకపోతే అక్కడేదో జరిగితే ఇక్కడ తోకలు వూగటం ఏమిటి ?

    మన దేశానికి ఆహార ధాన్యాల కొరత లేదు, ఇప్పటికే గోదాముల్లో బియ్యం, గోధుమల నిల్వలు పెరిగాయి, వాటిని అమ్మి వేస్తామని బిజెపి వారు చెప్పారు. కొనేందుకు డబ్బు లేక మన దేశంలో ఆహారధాన్యాలు నిల్వ వుండిపోతున్నాయి తప్ప ఎక్కువై కాదన్నది సత్యం. ఇప్పటికే రైతులు తమకు గిట్టుబాటు ధరలు రావటం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ స్థితిలో విదేశాల నుంచి చౌకగా వచ్చే ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటే ఇక్కడి రైతుల పరిస్థితి ఏమిటో బిజెపి సర్కార్‌ ఆలోచిస్తోందా ? అనుమానమే ! ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి మన వ్యాపారులు 25వేల టన్నుల గోధుమలు దిగుమతికి కొనుగోళ్లు చేశారన్నది నేటి వార్త. ఎందుకట ! ఇప్పటి వరకు వున్న దిగుమతి పన్ను 25శాతాన్ని గత శుక్రవారం నాడు పదిశాతానికి తగ్గించారు. విదేశీ గోధుమలను దిగుమతి చేసుకుంటే మన దేశంలో గోధుమలను పండించే రైతులేం కావాలి. వారి వుత్పత్తులకు ధరలు పడిపోవా ? అదే జరిగితే నరేంద్రమోడీ వాగ్దానం చేసినట్లు 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు ఎలా అవుతాయి ? ఎవరైనా గట్టిగా అడిగితే వారు దేశ భక్తులా కాదా అని పోలీసులు రికార్డులు తిరగేస్తారు, సంఘపరివార్‌ సంస్ధల వారు దాడులకు పూనుకుంటారు?రోజూ భయంతో చస్తూ బతికే కంటే ఒక రోజు ధైర్యంతో పోతేనే జనం గుర్తు పెట్టుకుంటారు.గోధుమల దిగుమతి అవసరం మనకు వుందా ? జూన్‌ 16వ తేదీన మన కేంద్రమంత్రి పాశ్వాన్‌ గారు మన దేశంలో నిల్వలు పెరిగిపోతున్నాయని, చౌక దిగుమతులను అరికట్టేందుకు 25శాతం పన్ను విధింపును పొడిగిస్తున్నట్లు గొప్పగా ప్రకటించారు. అంత పన్ను వున్నప్పటికీ అపర దేశ భక్తులైన మన వ్యాపారులు వినియోగదారుల సేవకోసం అప్పటికే ఈ ఏడాదిలో పదిలక్షల టన్నులకు పైగా దిగుమతి చేసుకున్నారు. జూలై ఒకటి నాటికి ఎన్ని గోధుమలు నిల్వ వుండాలో మన నరేంద్రమోడీ సర్కార్‌ ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. దానికి మించి కోటీ ఇరవై లక్షల టన్నులు అదనంగా వున్నాయని, మొత్తం నిల్వలు 4కోట్ల టన్నులకు చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు. మరి సెప్టెంబరు కూడా పూర్తి గాక ముందే పన్ను శాతాన్ని పదికి ఎందుకు తగ్గించినట్లు ? నిల్వలు తగ్గిపోయాయా ? జనానికి అదనంగా అందచేయాలని సర్కార్‌ నిర్ణయించిందా ? అలాంటి ప్రకటనలేమీ లేవు. అసలు విషయం ఏమంటే గోధుమలు పండే వుత్తరాది రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి దక్షిణాది రాష్ట్రాల పిండి మిల్లులకు తరలించే గోధుమల ధర కంటే కొన్నివేల మైళ్ల దూరాన వున్న ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల నుంచి ఓడల్లో దిగుమతులు చేసుకోవటం చౌకగా వుండటమే. అయితే దానికి మన దేశంలోని గోధుమలలో ప్రొటీన్లు తక్కువగా వుంటాయని, పీజాలు, పాస్టాలు తయారు చేయటానికి పనికి రావని కాకమ్మ కబుర్లు చెబుతున్నారు.ఈ దిగుమతులు పదేళ్ల నాటి రికార్డును అధిగమిస్తాయని ఒక కంపెనీ అంచనా వేస్తోంది. ఈ ఘనత రికార్డును కూడా నరేంద్రమోడీ ఖాతాలోనే వేయాలి మరి. పన్ను తగ్గింపు వెనుక ఏమైనా జాతీయ-అంతర్జాతీయ గోధుమ వ్యాపారుల ముడుపులు వుండి వుంటాయా ? ఏమో ! గత ఎన్నికలలో పెట్టిన పెట్టుబడి మీద అసలు, లాభం సంపాదించుకోవాలి, వచ్చే ఎన్నికలకు పెట్టుబడులు సమకూర్చుకోవాలి కదా ! ఏడాది కేడాది ఓట్ల ధరలు మండిపోతున్న రోజులివి. దీపం వుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, రైతులు ఎలా పోతేనేం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జర్నలిస్టుల ముసుగులో పోలీసులు- మీడియాలో కట్టు కథలు !

27 Tuesday Sep 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ap special asistance, ap special status, cia, fake news, fake stories, fake stories in media, FBI, journalism, journalist, Police agents as journalist, pope on journalism, popefrancis

జర్నలిస్టులు నోటి మాటతో చంపగలరు: పోప్‌ ఫ్రాన్సిస్‌

     కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న నందమూరి బాలకృష్ణ సినిమా డైలాగ్‌ తెలిసిందే. జర్నలిస్టులు నోటి మాటతో ఓ వ్యక్తిని చంపగలరు అని సాక్షాత్తూ పోప్‌ ప్రాన్సిస్‌ అన్నారంటే మీడియా మీద అంతకంటే తీవ్ర విమర్శ ఇంకేమి కావాలి.

ఎం కోటేశ్వరరావు

     జర్నలిజం, జర్నలిస్టుల పాత్ర, తీరు తెన్నుల గురించి ప్రపంచ వ్యాపితంగా ప్రతి రోజూ ఏదో ఒక మూల చర్చ జరుగుతూనే వుంది. ప్రసార మాధ్యమాల విస్తృతితో వారి సంఖ్య, కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో మీడియాలో అనేక అవాంఛనీయ ధోరణులు కూడా రోజు రోజుకూ పెరిగిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. అవాంఛనీయ శక్తులు మీడియా రంగాన్ని క్రమంగా ఆక్రమిస్తున్నాయి. ప్రపంచాన్ని చాపమాదిరిగా చుట్టి తమ చంకన పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా, బ్రిటన్‌, జర్మనీ వంటి సామ్రాజ్యవాద శక్తులు ప్రపంచ పౌరులను తప్పుదారి పట్టించేందుకు తమ అజెండాను అమలు జరిపేందుకు కట్టుకధలు, విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మీడియాలో కట్టుకథలను చొప్పించటం, అందుకు గాను గూఢచారులు, పోలీసులకు జర్నలిస్టుల ముసుగు వేయటం, జర్నలిస్టులను డబ్బుతో లొంగదీసుకొని వారి పేర్లతో కట్టుకధలను ప్రచారంలో పెట్టటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి పరిణామాలపై విహంగ వీక్షణమిది.

   దర్యాప్తు సమాయాలలో ఎఫ్‌బిఐ(మన సిబిఐ మాదిరి) ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో పని చేయవచ్చని ఆ సంస్ధ ఇన్సపెక్టర్‌ జనరల్‌ తాజాగా ప్రకటించారు. ప్రధాన స్రవంతి మీడియా, ఇతర సామాజిక మాధ్యమాలలో కూడా పోలీసు ఏజంట్లు ప్రవేశించి పని చేయటం కొత్త కాదని, ఎప్పటి నుంచో జరుగుతున్నదని కూడా వెల్లడించారు. అయితే ఎవరు జర్నలిస్టుల ముసుగులో వున్న పోలీసులో ఎవరు కాదో తెలియటం అంత సులభం కాదు. వివిధ దేశాలలో ముఖ్యంగా అమెరికా వంటి చోట్ల పెద్ద సంఖ్యలో పోలీసు ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో మీడియాలో తిష్ట వేశారు.లేదా జర్నలిస్టులను తమ ఏజంట్లుగా మార్చుకొని తమ అజెండా, కార్యకలాపాలను వారితో నిర్వహిస్తున్నారు. కాబట్టి వార్త లేదా వాస్తవాలు పవిత్రం, వ్యాఖ్యలు మీ ఇష్టం అనేది ఇంకే మాత్రం చెల్లదు. పోలీసు ఏజంట్లు, అవాంఛనీయ శక్తులు మీడియాలో ప్రవేశించిన తరువాత వార్తలకున్న పవిత్రత ఎప్పుడో గంగలో కలిసింది. కనుక వాస్తవాల పేరుతో పచ్చి అవాస్తవాలు, వ్యాఖ్యల పేరుతో తమకు అనుకూలమైన కథనాలను ప్రచారంలో పెడుతున్నారన్నది జనం గ్రహించాలి. ఈ పని పోలీసులే కాదు, అధికారంలో వున్న రాజకీయ పార్టీలు కూడా గుండుగుత్తగా మీడియా సంస్ధలతో కుమ్మక్కు, కొనుగోలు చేసి తమ బాకాలుగా మార్చుకోవటం తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ పార్టీ, ఏ వ్యక్తులు ఈ పని చేశారని ప్రశ్నించే వారికి చేయని ప్రధాన పార్టీ, వ్యక్తులు ఎవరు అందరూ చేశారన్నదే సమాధానం !

    రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ ‘ఆపరేషన్‌ మోకింగ్‌ బర్డ్‌ ‘ పేరుతో మీడియాలో తన ఏజంట్లను ప్రవేశపెట్టటానికి తెరతీసింది. అది నిధులిచ్చి వివిధ సంస్ధల పేరుతో కొన్ని పత్రికలను కూడా నడిపించింది. ఒక్క సిఐఏ మాత్రమే కాదు, ఎఫ్‌బిఐ కూడా అదే పనిచేసిందని కొద్ది రోజుల క్రితం ఆ సంస్ధ స్వయంగా ఏకంగా ఒక నివేదికనే విడుదల చేసింది. ఆసక్తి వున్న వారు ఆ లింక్‌లో పూర్తి నివేదిక చదవచ్చు.https://oig.justice.gov/reports/2016/o1607.pdf తన చర్యలను సమర్ధించుకొనేందుకు, నిజమే కదా అలాంటి సందర్బాలలో వాస్తవాలను బయట పెట్టటం, నిందితులను పట్టుకొనేందుకు ఏ పద్దతి అనుసరించినా తప్పేముంది అని జనం అనుకొనేందుకు వీలు కలిగించే అంశాలనే ఎఫ్‌బిఐ ఆ నివేదికలో పొందుపరచిందని వేరే చెప్పనవసరం లేదు. మచ్చుకు ఆ నివేదిక నుంచి అలాంటి వుదాహరణనే చూడవచ్చు.

    2007 జూన్‌లో ఒక 15 ఏండ్ల హైస్కూలు బాలుడు సియాటిల్‌ పట్టణ సమీపంలోని ఒక హైస్కూలు సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగానికి వారం రోజుల పాటు ఇమెయిల్స్‌ పంపుతూ బాంబు బెదరింపులకు పాల్పడ్డాడట. ప్రతి రోజూ స్కూలును ఖాళీ చేయించటం తనిఖీ చేసి బాంబులేవీ లేవని నిర్ధారించుకోవటం జరిగింది. ఆ మెయిల్స్‌ ఎక్కడి నుంచి పంపుతున్నదీ పసిగట్టకుండా వుండేందుకు ఒక సారి ఒక దగ్గర నుంచి పంపిన మెయిల్‌ను మరొకసారి అక్కడి నుంచి కాకుండా వేరే చోటు నుంచి పంపాడట.దీంతో అతడిని పట్టుకోవటం పెద్ద సవాలుగా మారింది. ఎవరైనా ఏ కంప్యూటర్‌ నుంచి పని చేస్తున్నారో, అది ఎక్కడ వుందో తెలుసుకొనే ఒక రహస్య సాప్ట్‌వేర్‌ను జత చేసి అసోసియేటెడ్‌ ప్రెస్‌ (మన పిటిఐ, యుఎన్‌ఐ మాదిరి వార్తా సంస్ధ) ఎడిటర్‌ పేరుతో ఒక తప్పుడు వార్త, ఫొటోల లింక్‌లను సామాజిక మాధ్యమాలలోకి వదిలాడు. వాటిపై క్లిక్‌ చేసిన వారి చిరునామా ఆ లింక్‌లను పంపిన వారికి వెంటనే చేరి పోతుంది. ఆ వుచ్చులో పడిన ఆ కుర్రాడు దొరికిపోయి నిజాన్ని ఒప్పుకున్నాడట. ఆ నిందితుడిని ఎలా పట్టుకుందీ మీడియాకు చెప్పలేదు. అయితే దానిని పసిగట్టిన ఒక వెబ్‌సైట్‌ కొద్ది రోజుల తరువాత ఎలా పట్టుకుందీ వెల్లడించిందట. ఏడు సంవత్సరాల తరువాత సియాటిల్‌ టైమ్స్‌ అనే పత్రిక ఎఫ్‌బిఐ ఏజంటు జర్నలిస్టు ముసుగులో బాంబు బెదరింపులకు పాల్పడ్డ విద్యార్ధిని పట్టుకున్నట్లు వెల్లడించింది. తమ వార్తా సంస్ధ జర్నలిస్టు ముసుగులో ఎఫ్‌బిఐ ఏజంట్లు దర్యాప్తు చేయటాన్ని నిరసిస్తూ ఏపి వార్తా సంస్ధ ప్రభుత్వానికి లేఖ రాసింది. దాంతో అనేక పత్రికలు ఎఫ్‌బిఐ ఎత్తుగడలను ప్రశ్నిస్తూ వార్తలు రాశాయి. ఒక వారం తరువాత ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికకు రాసిన లేఖలో సంస్ధ మార్గదర్శక సూత్రాల ప్రకారం అలాంటి పని చేయవచ్చని తమ చర్యను సమర్ధించుకున్నారు.

   దేశ రాజధాని, రాష్ట్ర రాజధానులు, ఇతర పెద్ద నగరాలలో అనేక మంది పోలీసు ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో విలేకర్ల సమావేశాలకు హాజరవుతుంటారు. ఎవరైనా అభ్యంతర పెడితే మౌనంగా వెళ్లిపోతారు. లేదా విలేకర్ల సమావేశాలు జరిగే చోట బయట వేచి వుండి విలేకర్ల వెంటపడి ఎవరేం చెప్పారో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తారు.అమెరికన్‌ ఎఫ్‌బిఐ చర్యలను నిరసిస్తూ రిపోర్టర్స్‌ కమిటీ ఫర్‌ ప్రీడమ్‌ ఆఫ్‌ ద ప్రెస్‌ ( పత్రికా స్వేచ్చ కోసం పని చేసే విలేకర్ల కమిటి ) మరో 25 సంస్ధల తరఫున ఒక లేఖ రాస్తూ ఎఫ్‌బిఐ చర్య జర్నలిస్టుల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని, స్వతంత్రకు భంగం కలిగిస్తుందని అభ్యంతరం తెలిపింది. అయితే ఎఫ్‌బిఐ ఇలాంటి వాటిని ఏ మాత్రం ఖాతరు చేయలేదు. జర్నలిస్టుల ముసుగులో తన ఏజంట్లు పనిచేసేందుకు వున్నతాధికారుల అనుమతి తీసుకోవాలంటూ ఒక చిన్న నిబంధన చేర్చి 2016 మార్గదర్శ సూత్రాలను తయారు చేసింది. అంటే తాను చేసే తప్పుడు పనులకు అధికారిక ముద్ర వేయటం, మరింత బరితెగించి చేయటం తప్ప మరొకటి కాదు.

     ఇది ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు. పోలీసులు, గూఢచారులు అల్లే కట్టుకధలు, వక్రీకరణలు, తప్పుడు సమాచారానికి విశ్వసనీయత కలిగించేందుకు జర్నలిస్టుల పేర్లను వాడుకోవటం కూడా జరుగుతోంది. జర్మనీలోని అతి పెద్ద పత్రికలలో ఒకటైన ఫ్రాంక్‌ఫర్టర్‌ అల్‌జెమినీ జీటుంగ్‌ పత్రికకు రెండు దశాబ్దాలకు పైగా సంపాదకుడిగా వున్న జర్మన్‌ జర్నలిస్టు డాక్టర్‌ యుడో అల్‌ కొటే రష్యాకు చెందిన ఆర్‌టి న్యూస్‌ అనే టీవీలో ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించి వుద్యోగం పోగొట్టుకున్నాడు. గూఢచారులు తయారు చేసిన కధనాలను తన పేరుతో ప్రచురించాలని వత్తిడి చేశారని, దానిని తిరస్కరించినందుకు యాజమాన్యం వుద్యోగం నుంచి తొలగించింది. తనకు పిల్లలు లేనందున ఎవరూ తనను బెదిరించలేరంటూ అనేక విషయాలు వెల్లడించిన ఆ జర్నలిస్టు మాటల్లోనే ఏం జరిగిందో చూడండి.’ నేను పాతికేండ్లుగా జర్నలిస్టుగా వున్నాను. జనానికి నిజం చెప్పకుండా మోసం చేసేందుకు, అబద్దాలు చెప్పేందుకు నాకు శిక్షణ ఇచ్చారు. రష్యాతో యుద్ధానికి తలపడేందుకు గాను ఐరోపా పౌరుల ముంగిటికి కూడా యుద్ధాన్ని తెచ్చేందుకు జర్మన్‌, అమెరికన్‌ మీడియా గత కొద్ది నెలలుగా ప్రయత్నించటాన్ని చూశాను.గతంలో నేను చేసింది సరైంది కాదని ఇంకే మాత్రం దీనిని సహించకూడదని, ప్రతిఘటించాలని నిర్ణయించుకున్నాను. రష్యాకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు, తిమ్మిని బమ్మిని చేసి జనాన్ని నమ్మించేందుకు గతంలో ప్రయత్నించాను. ఒక్క జర్మన్లనే కాకుండా యావత్‌ ఐరోపా వాసులను మోసం చేసేందుకు ముడుపులు తీసుకున్న నా సహజర్నలిస్టులు చేసింది కూడా సరైంది కాదని , తాను స్వయంగా సిఐఏ కధనాలను తన పేరుతో అందించానని తెలిపారు.ప్రధాన మీడియా సంస్ధలలోని జర్నలిస్టులను అవినీతి పరులుగా చేయటం పశ్చిమ దేశాల మీడియాలో అందరూ అంగీకరించే సిఐఏ రోజువారీ వ్యవహారం. ఎవరైనా అందుకు అంగీకరించకపోతే వారికి మరో చోట ఎక్కడా వుద్యోగాలు రానివ్వరు లేదా అర్ధంతరంగా ముగిసిపోతాయి. సిఐఏ అవినీతి గురించి బట్టబయలు చేస్తూ ‘జర్నలిస్టుల కొనుగోలు’ పేరుతో రాసిన పుస్తకానికి సంబంధించి సమీక్షలను జర్మనీలోని ప్రధాన పత్రికలలో రాకుండా అడ్డుకున్నారని కూడా తెలిపారు. తనకు ఎదురైన అనుభవాల గురించి వెల్లడిస్తూ లిబియా అధ్యక్షుడు గడాఫీ విషవాయువుల ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నట్లు కట్టుకధలు ప్రచురించాలని 2011లో తనను అదేశించారని, ఇరాన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో వార్తల సేకరణకు వెళ్లిన తాను విషవాయు దాడిలో గాయపడ్డానని సద్దాం హుస్సేన్‌ వుపయోగించిన విషవాయువుల గురించి రాయవద్దని కూడా చెప్పారని, ఆ సమయంలో సద్దాం అమెరికాకు స్నేహితుడిగా వుండటమే కారణమని పేర్కొన్నారు. అమెరికా నుంచి వెలువడై టైమ్స్‌ పత్రిక యాజమాన్య స్ధాయిలోనే సిఐఏ మనుషులు వున్నందున దశాబ్దాల తరబడి దానిలో సిఐఏ కధనాలు వెలువడేవని జర్మన్‌ జర్నలిస్టు వెల్లడించారు.

   కొన్ని సార్లు సమాచారాన్ని వక్రీకరించటానికి లేదా ఎంపిక చేసిన సమాచారాన్ని వార్తలుగా ఇచ్చేందుకు తమకు అమెరికా ప్రభుత్వం, విదేశీ ప్రభుత్వాలు డబ్బు చెల్లించేవని, ఆ సమాచారాన్ని వీక్షకులు, చదువరులకు ఎలా అందచేయాలో కూడా ప్రభుత్వాలే ఎడిట్‌ చేసి ఇచ్చేవని మూడు సార్లు ఎమ్మీ అవార్డు పొందిన జర్నలిస్టు అంబర్‌ లేయాన్‌ వెల్లడించారు.’ అనేక అంశాలకు సంబంధించి ఏం జరుగుతోందన్న మన అవగాహనను అనేక సార్లు పూర్తిగా అదుపు చేశారు. అందుకు పెద్ద వుదాహరణ ‘వుగ్రవాదంపై పోరు’ ఇంకా స్పష్టంగా అయితే వుగ్రవాదం గురించి తప్పుడు చిత్రీకరణ. వీటన్నింటికీ ఇస్లామిక్‌ తీవ్రవాదులే అనే దానికి అనుగుణంగా మా బుర్రలను తయారు చేశారు.అందుకు 9/11 మంచి వుదాహరణ. సామూహిక మారణాయుధాల పేరుతో మధ్యప్రాచ్యంపై దాడి చేయటాన్ని సమర్ధించుకొనేందుకు ఎవరైతే ఈ వుదంతాన్ని వుపయోగించుకొనేందుకు ప్రవర్తించారో వారే దానిని సృష్టించారు. జన్యుమార్పిడి ఆహారం, ఔషధాలు, పండిత చర్చలు మొదలైన వాటన్నింటికీ సంబంధించి వాటికి అనుగుణ్యంగా మన అవగాహనను మలిచారు ‘ అని ఆమె చెప్పారు. ప్రపంచ కార్పొరేట్‌, సామ్రాజ్యవాదుల చేతులలో మీడియా పురోగామి, సోషలిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఒక సైద్ధాంతిక, ప్రచారదాడి అస్త్రంగా తయారైంది. లాటిన్‌ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాదుల విధానాన్ని వ్యతిరేకిస్తున్న వెనెజులా వామపక్ష ప్రభుత్వం, అక్కడి అధికార సోషలిస్టు పార్టీకి వ్యతిరేకంగా మీడియా జరిపిన విషపు దాడి, వ్యాపింప చేసిన అవాస్తవాల గురించి స్పెయిన్‌కు చెందిన లాయర్‌, విశ్లేషకుడైన ఫెర్నాండో కసాడో ఒక గ్రంధమే రాశాడు. వెనెజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌, ఆయన భావజాలమైన 21వ శతాబ్దపు సోషలిజాన్ని ప్రపంచ మీడియా ప్రధమ శత్రువుగా ఎందుకు పరిగణిస్తోంది, నిజమైన వెనెజులాకు, మీడియా చిత్రిస్తున్నదానికి తేడా వుందేమిటి అన్న ఆలోచన ఫెర్నాండోకు కలిగి వివరాల్లోకి వెళ్లారు. అది ఒక పెద్ద పుస్తకంగా తయారైంది. దాని గురించి స్పుత్నిక్‌ అనే పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రపంచ మీడియా తరచూ వాస్తవాలను వక్రీకరించి వాటినే ‘నిజాలు’గా జనం ముందుంచేందుకు పని చేస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయంటూ వాటిలో మొదటిది, ముఖ్యమైనది 21వ శతాబ్దపు సోషలిజంతో మీడియా సైద్ధాంతిక దాడికి పూనుకోవటం. బడా మీడియా అంతా కంపెనీల చేతుల్లో వుంది, వాటి ప్రధాన ప్రేరణ లాభాలు. ఈ కంపెనీలకు ఇతర కంపెనీలకు వున్న తేడా ఏమిటంటే ఇవి వస్తువులకు బదులు సమాచారాన్ని విక్రయిస్తాయి. బడా మీడియా సంస్ధలు తరచూ తమ సిద్ధాంతాలు, వాణిజ్య ప్రయోజనాలకు అదే విధంగా తమకు ప్రకటనలు ఇచ్చే వారి ప్రయోజనాలకు ముప్పు వచ్చినపుడు దాడులకు తెరతీస్తాయి. ‘ ఇరాక్‌ కంటే మరింత ప్రమాదకరమైనది వెనెజులా అంటే ఆశ్చర్యం ఎందుకు ?’ అనే శీర్షికతో న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించిన వ్యాసాన్ని చూడండి, ఇతర విషయాలతో పాటు ఇరాక్‌లో కంటే వెనెజులాలో ఎక్కువ మంది జనాన్ని చంపినట్లు దానిలో రాశారు. మీడియా సాయంతో అబద్దాలు నిజాలుగా మారిపోతున్నాయి. అటు వంటి తిమ్మిని బమ్మిని సమాచారం తరచుగా ప్రచురితమైతోంది. అత్యంత దారుణమైన విషయం ఏమంటే ఇటువంటి ప్రచారం పశ్చిమ దేశాల మీడియాతో పాటు లాటిన్‌ అమెరికా పత్రికలు కూడా చేస్తున్నాయి. కొంత మంది జర్నలిస్టులకు ఎలాంటి పక్షపాతం వుండదు, వారికి వాస్తవ పరిస్థితి తెలుసు, మంచి వేతనాలు, మెప్పు పొందాలంటే ఎడిటర్లు కోరుకున్నది తప్ప వాస్తవాలను రాసే అవకాశం వుండటం లేదు. ఇలాంటి ప్రచురణ సంస్ధల దృష్టి మరిన్ని లాభాలు, అందుకోసం సంచలనాత్మకతకు పాల్పడటం తప్ప తాము ప్రచురిస్తున్నది వాస్తవమా కాదా అనే దానితో వాటికి నిమిత్తం లేదు ‘ అని ఫెర్నాండో వ్యాఖ్యానించారు.

    కట్టు కథలు, సత్యదూరమైన అంశాలు పత్రికలు, టీవీలలోనే కాదు, సామాజిక మాధ్యమాలలో కూడా పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి.ప్రముఖ వ్యక్తుల బొమ్మలు పెట్టి వారి పేర్లతో కొటేషన్లు పెడతారు. వాటిలో వాస్తవం ఎంతో కూడా ఆలోచించ కుండా అనేక మంది వాటిని లైక్‌ చేస్తూ షేర్‌ చేస్తుంటారు. అంతవరకైతే అదొక తీరు, దాని మీద వ్యాఖ్యానాలు, సంస్కార రహితమైన బూతు, తిట్లు విపరీతం. వుదాహరణకు అమెరికా పదహారవ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ 1861-65 మధ్య పదవిలో వున్నారు. ఆయనను 1965లో హత్య చేశారు. ఆయన బొమ్మతో ఒక కొటేషన్‌ పెట్టి వదిలారు. దానిలో ఇంటర్నెట్‌లో ఒక కొటేషన్‌, దాని పక్కనే ఒక బొమ్మ పెట్టిన వాటన్నింటినీ నమ్మ వద్దు అని రాసి వుంది. అది వాస్తవమే. అయితే ఆ విషయాన్ని అబ్రహాం లింకన్‌ చెప్పారని ఆయనకు ఆపాదించటమే నకిలీ. ఎందుకంటే ఆయన మరణించిన వంద సంవత్సరాల తరువాత ఇంటర్నెట్‌కు అంకురార్పణ జరిగింది. పాపం లింకన్‌కు ఇంటర్నెట్‌ అనే పదమే తెలిసి వుండదు. ఇలా అనేకం వున్నాయి. మన దేశంలో కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి నకిలీ ప్రయోగాలు అనేక జరుగుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ గొప్పతనాన్ని గురించి చెప్పేందుకు ఒక ఫొటోను ప్రయోగించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాల సందర్బంగా గదులను శుభ్రం చేసిన ఒక నిరాండంబర వ్యక్తిగా చిత్రించే ప్రయత్నంలో భాగంగా అది జరిగింది. ఇలా చాలా చెప్పుకోవచ్చు.

జర్నలిస్టులు నోటి మాటతో చంపగలరు: పోప్‌ ఫ్రాన్సిస్‌

     కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న నందమూరి బాలకృష్ణ సినిమా డైలాగ్‌ తెలిసిందే. జర్నలిస్టులు నోటి మాటతో ఓ వ్యక్తిని చంపగలరు అని సాక్షాత్తూ పోప్‌ ప్రాన్సిస్‌ అన్నారంటే మీడియా మీద అంతకంటే తీవ్ర విమర్శ ఇంకేమి కావాలి.సెప్టెంబరు 23న ఇటలీ జర్నలిజం గిల్డ్‌ జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్పిత కధనాలు, గాలి వార్తలపై ఆధారపడి ఐరోపాకు వస్తున్న శరణార్ధుల వంటి మానవత్వ సంక్షోభ సమయాలలో వారికి వ్యతిరేకంగా రాస్తున్న వార్తలు ఒక రకమైన వుగ్రవాదం తప్ప మరొకటి కాదన్నారు. విమరశ న్యాయమైనదే,దుర్నడతలను ఆక్షేపించటానికి అది అవసరం కూడా అని నేను అంటాను, అయితే జర్నలిజం కొంత మంది వ్యక్తుల లేదా దేశాల మానవ వినాశకర ఆయుధం కాకూడదు. గాలి కబుర్ల అలవాటు వుగ్రవాదపు అలవాట్లలో ఒకటి. వుగ్రవాదుల మాదిరి నాశనం చేయటానికి గాలి కబుర్ల వారు మాటల బాంబులు వేస్తారు ‘ అని కూడా చెప్పారు.

     మీడియా ఒకసారి విశ్వసనీయత కోల్పోతే దాని పర్యవసానాలు ముందుగా ఫీల్డ్‌లో పని చేసే విలేకర్లు అనుభవిస్తారన్నది అనేకసార్లు రుజువైంది. దాడుల వుదంతాలు పెరగటం కూడా వాటిలో ఒకటి. యురి సైనిక కేంద్రంపై వుగ్రవాదుల దాడి తరువాత సెప్టెంబరు 20వ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో కొంత మంది జర్నలిస్టులు ఇళ్లకు వెడుతుండగా వారు ప్రయాణిస్తున్న వాహనంపై మీడియా అని రాసి వుండటాన్ని చూసిన కొందరు నిరసనకారులు వాహనంపై దాడికి దిగారు. మీడియా రాజ్య ప్రచార సాధనంగా మారిందని, జర్నలిస్టులు నిజాలు దాస్తున్నారని జనం భావించటమే దీనికి కారణం తప్ప వేరు కాదు. కాశ్మీర్‌లో జర్నలిస్టులు అటు జనం ఇటు సైనిక, పోలీసుల మధ్య నలిగిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. అటు భద్రతా దళాలు జర్నలిస్టులను పాకిస్తానన లేదా వేర్పాటు వాద హురియతన ఏజంట్లని, ఇటు జనం ప్రభుత్వ ఏజంట్లని నిందిస్తున్నారు.మన రాష్ట్రంలో కూడా అనేక సందరా&భలలో తమ న్యాయమైన సమస్యలపై పోరాడుతున్నపుడు మీడియాలో వాటిని విస్మరించినా లేదా అప్రాధాన్యంగా ఇచ్చినా జర్నలిస్టులు కుమ్మక్కయ్యారని ఆరోపించటం లేదా విమరి&శంచటం చూస్తున్నాం.

     అవాంఛనీయ ఘటనలు ముఖ్యంగా వుగ్రవాద దాడులు, మత ఘర్షణలు జరిగినపుడు కొంత మంది వుగ్రవాదులను కాల్చి చంపామనో, విద్రోహులను పట్టుకున్నామనో పోలీసులు కల్పిత కథలు, సంఘటనలను ప్రచారంలో పెట్టటం తెలిసిందే.అధికార యంత్రాంగం, అధికారంలో వున్న వారి పరువు పోకుండా చూడటం కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు. కొంత మంది అమాయకులను కాల్చి చంపి వుగ్రవాదులను హతమార్చామని చెప్పిన వుదంతాలు కూడా వున్నాయి. తమ రేటింగ్‌లను పెంచుకొనేందుకు చిలవలు పలవలుగా కొన్ని వుదంతాలపై మీడియా స్పందించటం కూడా తెలిసిందే. తమకు ఇష్టం లేని వార్తలను తొక్కి పెట్టటం అన్నది లేదా వివిధ కారణాలతో కొన్ని వార్తలకు ప్రాముఖ్యత కల్పించటం మన దేశంలో కూడా జరుగుతున్నది. దీనికి తాజా వుదాహరణ జమ్మూ-కాశ్మీర్‌లో యురి సైనిక స్ధావరంపై వుగ్రవాదులు దాడి జరిపి నిద్రమంచాల మీద వున్న 18 మంది సైనికులను చంపిన ఘటన గురించి తెలిసిందే. ఇలాంటి సమయాలలో దేశ పౌరుల్లో మనో నిబ్బరం కల్పించే పేరుతో ప్రభుత్వం పైన చెప్పిన మాదిరి కొన్ని కట్టుకధలను ప్రచారంలో పెట్టటం చేస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే చేస్తుంది కనుక అంత వరకు ఆగటం ఎందుకు మనమే అలాంటి కట్టుకధలను ప్రచారంలో పెట్టి రేటింగ్స్‌ పెంచుకోవాలని కొన్ని మీడియా సంస్ధలు అలాంటి కట్టుకథనే వండి వడ్డించాయి.

    మన సైన్యంలోని ప్రత్యేక దళాలు ఆక్రమిత కాశ్మీర్‌ ప్రాంతంలోకి రహస్యంగా ప్రవేశించి వుగ్రవాద స్ధావరాలపై దాడి చేసి 20 మంది వుగ్రవాదులను హతమార్చి బదులుకు బదులు తీర్చుకున్నాయంటూ టీవీ ఛానల్స్‌, పత్రికలు ఒక వార్తను ప్రచారంలో పెట్టాయి. నిజానికి అలా జరిగి వుంటే అదొక పెద్ద సమస్యగా మారి వుండేది. తామలాంటి దాడులు చేయలేదని మన సైన్యం ఒక ప్రకటన చేసింది. అయితే ఒక వెబ్‌సైట్‌ మాత్రం తాను రాసిన కథనం వాస్తవమేనని, వాస్తవాలను నిర్ధారించుకున్నానని చెప్పుకుంది. అదే వార్తను ప్రసారం చేసిన ఇతర మీడియా మాత్రం మిన్నకుండి పోయింది తప్ప అలాంటి దుస్సాహసానికి పాల్పడలేదు. యురి ఘటనతో మధ్యతరగతి, యువత ఆగ్రహంతో స్పందించటాన్ని అవకాశంగా తీసుకొని వారిని సంతృప్తిపరచే అనేక కథనాలను బడా మీడియా సంస్ధలు ప్రచారంలో పెట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దాని గురించి మల్లగుల్లాలు పడుతోంది తప్ప అసలు ఎలా జరిగిందో కూడా ఇంతవరకు స్పష్టంగా చెప్పలేకపోయింది. సైనిక శిబిరంలో గడ్డి దుబ్బులుగా పెరిగిందని, పక్కనే వున్న నది ద్వారా సరిహద్దులు దాటిన వుగ్రవాదులు దానిలో దాగి వుండి దాడులకు పాల్పడ్డారనే ఒక కథనాన్ని కూడా ప్రచారంలో పెట్టారు.

    మీడియా ఇటీవలి కాలంలో మరొక బాధ్యతను కూడా పుచ్చుకుంది. ఎవరు దేశ భక్తులో,ఎవరు దేశ ద్రోహులో, ఏది దేశ ద్రోహుల కేంద్రంగా వుందో కూడా ప్రకటించేస్తోంది. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ(జెఎన్‌యు) విద్యార్ధి యూనియన్‌ మాజీ అధ్యక్షుడు కన్నయ్య, మరికొందరు విద్యార్ధులు, కొన్ని సంస్ధలను అలాగే జమ కట్టి నకిలీ వీడియోలను కూడా తయారు చేసి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ విశ్వవిద్యాలయం దేశద్రోహులకు మద్దతు ఇచ్చే శక్తులకు నిలయంగా మారిందని, దానిని మూసివేయాలని, అక్కడి విద్యార్ధినీ, విద్యార్ధులు మద్యం తాగుతూ, వ్యభిచారానికి పాల్పడుతున్నారని అందుకు నిదర్శనంగా మద్యం సీసాలు, నిరోధ్‌లు పెద్ద సంఖ్యలో కనిపించాయని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వాటి అనుబంధ సంస్ధల నేతల ఆరోపణలకు విశ్వసనీయత కలిగిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేయటంలో మీడియాలోని మెజారిటీ సంస్ధలు తమ పంతు పాత్ర పోషించాయి. పాటు అనేక మంది విద్యార్దులపై తప్పుడు కేసులు పెట్టించిన విషయం తెలిసిందే. ఆ కేసులలో వున్న విద్యార్ధులను కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా వార్తలను సేకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై బిజెపి మద్దతుదారులైన లాయర్లు దాడికి పాల్పడిన వుదంతం కూడా తెలిసిందే. జాతి వ్యతిరేకులకు మద్దతు ఇస్తున్నారంటూ మహిళాజర్నలిస్టులను కూడా వదల కుండా అవమానించిన ఘటనలు ఇంకా కళ్ల ముందున్నాయి.

    అలాంటి వుదంతానికి కేంద్ర బిందువుగా వున్న జెఎన్‌యు విశ్వవిద్యాయ విద్యార్ధి సంఘానికి సెప్టెంబరులో జరిగిన ఎన్నికలలో దేశభక్తులకు ప్రతినిధులుగా వున్నామని చెప్పుకున్న ఎబివిపి అభ్యర్ధులను విద్యార్ధులు చిత్తు చిత్తుగా ఓడించారు. వేర్పాటు వాదులు, వుగ్రవాదులకు మద్దతు ఇచ్చే దేశద్రోహులుగా ముద్రవేసిన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ విద్యార్ధి సంఘాల కూటమికి ఘన విజయం చేకూర్చారు. ఈ వార్తను మీడియా మొత్తంగా తొక్కి పెట్టింది లేదా ఎవరూ గమనించని విధంగా అప్రాధాన్యంగా ఇచ్చింది. అదే అక్కడ ఎబివిపి గెలిచి వుంటే ఎంత హంగామా జరిగి వుండేదో వూహించుకోవచ్చు.

     ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే వుమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా వాగ్దానం చేసిన ప్రత్యేక తరగతి హోదా కల్పన విషయాన్నే చూద్దాం. దీనికి సంబంధించి కొన్ని పత్రికలలో, ఛానల్స్‌లో ఎన్ని కట్టుకధలు ప్రచురితం, ప్రసారమయ్యాయో చూశాము. కొన్ని రోజులు ప్రత్యేక హోదా గురించి కసరత్తు జరుగుతోందని, ప్రకటన వెలువడటమే తరువాయని కొన్ని కధలు. ప్రత్యేక హోదా ప్రకటించకపోతే తెలుగుదేశం పార్టీ బిజెపితో తెగతెంపులు చేసుకుంటుందని, ఏదో ఒకటి తేల్చుకోవాలని, తానిక ఢిల్లీ రానని చంద్రబాబు నాయుడు అల్టిమేటం ఇచ్చారని మరికొన్ని కథలు. ఇవన్నీ ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి లేదా కొందరికి ప్రయోజనం కలిగించేందుకు వండి వార్చిన కధలన్నది జనానికి బాగా అర్ధమైంది. ప్రత్యేక హోదా వలన వచ్చే లాభాల గురించి చెప్పిన వారే తీరా దాన్ని ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తరువాత హోదా వలన ప్రయోజనం లేదని అంతకంటే మెరుగైనా పాకేజి వల్లనే ఎక్కువ ప్రయోజనమనే వార్తలు, వాదనలకు పెద్ద ఎత్తున చోటు కల్పించటాన్ని ఏమనాలి?

    మీడియాలో ఇలాంటి వ్యవహారాలు రోజు రోజుకూ పెరిగి పోతున్న కారణంగానే అది అందచేసే వార్తలకు విశ్వసనీయత వుండటం లేదు. ఒక కొత్త వార్తను ఒక ఛానల్‌ లేదా ఒక పత్రికలో చూసి నమ్మే పరిస్ధితులు అంతరించాయి. ఇది మీడియా సంస్ధల విశ్వసనీయతనే కాదు, వాటిలో పని చేస్తున్న జర్నలిస్టుల విశ్వసనీయతనే దెబ్బతీస్తున్నాయి. కిరాయి రాతగాళ్లుగా జనం భావించే రోజులు దాపురించాయి. ఏ మీడియా సంస్ధలో పని చేస్తే దాని యాజమాన్య వైఖరికి అనుగుణంగా ఆ జర్నలిస్టుల రాతలూ, వాదనలూ మారిపోతుండటమే దీనికి కారణం అని వేరే చెప్పనవసరం లేదు. స్వతంత్ర భావాలు, తాము చూసిన దాన్ని వీక్షకులు, చదువరులకు అందించే పరిస్థితి లేదు. ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే వుద్యోగానికి వుద్వాసన. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం పట్ల విమర్శనాత్మక వ్యాఖ్యలు, వైఖరిని ప్రదర్శించిన కారణంగా ఒక సీనియర్‌ జర్నలిస్టును ఆ సంస్ధ నుంచి తొలగించేదాకా అధికారంలో వున్న పెద్దలు వత్తిడి చేశారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మీడియాను ఒక లాభదాయకమైన వ్యాపారంగా భావించి పెట్టుబడులు పెట్టిన యాజమాన్యాలు ప్రభుత్వంతో వైరం తెచ్చుకొని తమ లాభాలను వదులుకోవటానికి సిద్ధంగా వుండవని వేరే చెప్పనవసరం లేదు. అందువల్లనే మీడియాలో జర్నలిస్టుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీతో మిలాఖత్‌ అవుతున్న యాజమాన్యాలు చట్టాలను, వేతన సిఫార్సులను అమలు జరపకపోయినా,అసలు వేతనాలు చెల్లించకపోయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రాజకీయ నేతలు తమకు అనుకూలమైన వార్తలు రాయకపోతే యజమానులకు ఫిర్యాదులు చేస్తామనే బెదిరింపులు రాజధాని నుంచి మండల కేంద్రం వరకు వున్న విలేకరులకు ఏదో ఒక సందర్భంగా ఎదురై వుంటుందన్నది కాదనలేని సత్యం.

గమనిక:ఈ వ్యాసం అక్టోబరు నెల ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి’లో ప్రచురణ నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రష్యన్‌ ఎన్నికల ఫలితాలు – ఓట్లు, సీట్ల మాయాజాలం

23 Friday Sep 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA

≈ Leave a comment

Tags

Communist Party of the Russian Federation, Duma, Duma elections, RUSSIA, Russia’s Duma, Russia’s Duma Elections

 

Image result for State Duma Building

ఎంకెఆర్‌

    గత ఆదివారం నాడు (సెప్టెంబరు 18న) రష్యన్‌ పార్లమెంట్‌ డ్యూమా ఎన్నికలు జరిగాయి.ఆ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీతో సహా మిగిలిన ప్రతిపక్షాలన్నీ సగానికిపైగా సీట్లను కోల్పోగా అధికార పార్టీ స్వల్పంగా ఓట్ల శాతాన్ని పెంచుకొని మూడింట రెండువంతులకు సీట్లు పొందింది. అనేక మంది ఎందుకిలా జరిగిందని ఆశ్చర్యపోతున్నారు. మొత్తం 450 స్ధానాలకు గాను 225 నియోజకవర్గ ప్రాతిపదిన, మిగిలిన 225 దామాషా ఓటింగ్‌ ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో గత పాతిక సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ శాతం ఓటింగ్‌ నమోదు కావటం ఒక కొత్త రికార్డు అయితే అధికార పక్షం ఐక్య రష్యా పార్టీ అంతకు ముందున్న 238 ను 343కు పెంచుకొని సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ విధంగా విజయం సాధించటానికి మారిన ఎన్నికల పద్దతి, ఎన్నికలలో అక్రమాలే ప్రధాన కారణం అని ఫలితాల అనంతరం వెలువడుతున్న వార్తలు, విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. గత ఎన్నికలలో అన్ని స్ధానాలూ దామాషా ప్రాతిపదికన పార్టీలకు కేటాయించారు. ఈ సారి సగం మాత్రమే వుండటం, అనేక మంది పోటీ పడిన కారణంగా మైనారిటీ ఓట్లతోనే అధికారపక్షం ప్రత్యక్ష ఎన్నికల విభాగంలో అత్యధిక సీట్లను గెలుచుకోవటం సాధ్యమైంది. సాధారణంగా ఓటింగు డిసెంబరులో జరుగుతుంది, అటువంటి దానిని అధికార పార్టీ పట్టుబట్టి సెప్టెంబరుకు మార్పించింది. తక్కువ ఓట్లు పోలు కావటానికి ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. దీని కంటే ఎన్నికలు ఒక ప్రహసనమని భావించిన మెజారిటీ ఓటర్లు ప్రభుత్వంపై వ్యతిరేకత వున్నప్పటికీ ప్రతిపక్షాల మీద విశ్వాసం లేకపోవటం కూడా తోడై ఓటింగ్‌కు దూరంగా వున్నారు. మన దేశంలో మాదిరి ఓట్ల అమ్మకం, కొనుగోలు కూడా జరిగినట్లు చెబుతున్నారు. ఎన్నికలకు కొద్ది వారాల ముందు లెవడా అనే ఏజన్సీ నిర్వహించిన ఒక సర్వేలో ప్రతి నలుగురిలో ఒకరు తమ ఓటును 5000 రూబుళ్లకు అమ్మేందుకు సుముఖంగా వున్నట్లు తేలింది. రష్యా జనాభాలో 2.3 కోట్ల మంది లేక 16శాతం దారిద్య్రరేఖ ప్రమాణం నెలకు 174 డాలర్ల కంటే తక్కువ ఆదాయం పొందుతున్నవారు వున్నారు. గత ఎన్నికల మాదిరే ఈ ఎన్నికలలో కూడా అధికార పక్షం పాల్పడిన అక్రమాలు, అవినీతి గురించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఓటర్ల కంటే బ్యాలట్‌ బాక్సులలో పడిన ఓట్లు ఎక్కువగా వున్నట్లు , కొన్ని చోట్ల అసలు ఓటర్లు లేకుండానే సిబ్బందే ఓట్లతో బాక్సులను నింపినట్లు తేలటం, మరికొన్ని చోట్ల దొంగ ఓట్లు వేసినట్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీలకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ శాతాలను కూడా ప్రకటించటం వంటి అ క్రమాలు చోటు చేసుకున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అనేక పోలింగ్‌ కేంద్రాలలో ఓటింగ్‌ ఫలితాలను రద్దు చేసినట్లు స్వయంగా రష్యా వార్తా సంస్ధ ఇటార్‌ -టాస్‌ పేర్కొన్నది. నిజానికి అవి సముద్రంలో కాకి రెట్ట వంటివి. ఈ సారి పార్లమెంట్‌కు ప్రజాస్వామిక సంస్కరణలకు వ్యతిరేకులైన పచ్చి మితవాదులు పాలక పక్షం నుంచి గణనీయంగా ఎన్నికైనట్లు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.

    గత ఎన్నికల్లో పాల్పడిన అవినీతి కారణంగా ప్రపంచవ్యాపితంగా నగుబాట్ల పాలైన అధ్యక్షుడు పుతిన్‌ ఎన్నికలను పారదర్శకంగా, అక్రమాలకు తావు లేకుండా జరిపేందుంటూ ఎన్నికలకు ముందు మానవహక్కుల న్యాయవాదిగా గౌరవ మన్ననలను పొందిన ఎలా పాం ఫిలోవాను నియమించారు. అయినప్పటికీ దిగువ యంత్రాంగం మొత్తం అధికార పక్ష కనుసన్నలలో పనిచేసేదిగా వుండటంతో సైంటిఫిక్‌ రిగ్గింగ్‌ జరిపి అధికారపక్షం మెజారిటీ సీట్లను తెచ్చుకున్నది. అక్రమాల గురించి సామాజిక మీడియాలో కుప్పలు తెప్పలుగా వెల్లడిస్తున్నారు. తొమ్మిది ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అనేక పోలింగ్‌ బూత్‌లలో ఎన్నికలను రద్దు చేసినట్లు పాం ఫిలోవా గురువారం నాడు ప్రకటించారు. దర్యాప్తులో ఇంకా మరిన్ని అక్రమాలు వెల్లడయ్యే అవకాశం కూడా వుందన్నారు. పరిశీలక సంస్ధలలో ఒకటైన ఐరోపా భద్రత, సహకార సంస్ధ (ఓయిసిడి) కూడా ఎన్నికలు సక్రమంగా జరగలేదని, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వలేదని పేర్కొన్నది.

    గతంలో 2007 ఎన్నికలలో అధికార ఐక్య రష్యా గరిష్టంగా 315 సీట్లు , తరువాత కనిష్టంగా 2011లో 238 సీట్లు, తాజాగా 343 సీట్లు తెచ్చుకుంది. సోవియట్‌ కూలిపోయిన తరువాత 1993లో జరిగిన తొలి ఎన్నికలలో నమోదైన 54.8శాతంమే ఇప్పటి వరకు కనిష్టంగా వుంది. అలాంటిది తాజా ఎన్నికలలో 48శాతానికి పడిపోయింది.అయితే ఇది కూడా ముందే చెప్పుకున్నట్లు ఓటర్ల కంటే ఎక్కువగా పడిన బ్యాలట్లను కూడా లెక్కిస్తే వచ్చిన సంఖ్య. అందువలన అంతకంటే తక్కువ మందే ఓటర్లు పాల్గొన్నట్లు చెబుతున్నవారు కూడా లేకపోలేదు. రాజధాని మాస్కో, మరో పెద్ద నగరమైన సెంట్‌ పీటర్స్‌ బర్గ్‌లో 35, 33 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైనట్లు ప్రకటించారు.

    నాలుగు వందల యాభై స్ధానాలకు గాను అధికారపక్షం 343 పొందగా రెండవ పార్టీగా రష్యన్‌ కమ్యూనిస్టుపార్టీ 42, మూడవ పార్టీగా పచ్చిమితవాద పక్షం ఎల్‌డిపిఆర్‌ 39, న్యాయమైన రష్యా పార్టీ 23 గెలుచుకుంది. మరో రెండు పార్టీలు ఒక్కొక్క స్ధానం, నేరగాడిగా గతంలో ఇంటర్‌ పోల్‌ వెతికిన వ్యక్తి ఏకైక స్వతంత్ర అభ్యర్ధిగా ఎన్నికయ్యాడు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 225 సీట్లలో అధికారపక్షం 203 గెలుచు కుంది. ఒక పరిశీలకుడు సెర్గీ షిఫిలికిన్‌ చెప్పిన దాని ప్రకారం అధికార పక్షానికి వచ్చినట్లు చెబుతున్న ఓట్లలో 45శాతం లేదా కోటీ 20 లక్షల ఓట్లు బోగస్‌. పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లు 37శాతానికి మించి లేరు, ఈ లెక్కన పోలైన ఓట్లలో అధికారపక్షానికి వచ్చినట్లు చెబుతున్న 54 శాతం కాకుండా 40శాతమే వాస్తవ ఓట్లు అయి వుండాలి.

    గత మూడు ఎన్నికలలో వరుసగా వివిధ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం , సీట్లు ఎలా వున్నాయో దిగువ పట్టికలో చూస్తే అధికార పార్టీ ఎన్నికల విధానంలో ఎందుకు మార్పు తెచ్చిందో దాని కారణంగా ఫలితాలపై ఎలాంటి ప్రభావం పడిందో అవగతం అవుతుంది.

ఏడాది        ఐక్య రష్యా       కమ్యూనిస్టు       ఎల్‌పిడిఆర్‌       జస్ట్‌ రష్యా

2007        64.30-315      11.57-57         8.14-40        7.74-38

2011        49.32-238      19.19-92        11.67-56      13.24-64

2016        54.19-343       13.34-42       13.16-39        6.23-23

         గత ఎన్నికలతో పోల్చితే కమ్యూనిస్టు పార్టీ , జస్ట్‌ రష్యా ఓట్ల శాతం తగ్గిందన్నది స్పష్టం. ఆ మేరకు అధికార పార్టీకి పెద్దగా పెరగపోయినా సీట్లు గణనీయంగా పెరగటానికి ఎన్నికల విధానంలో చేసిన మార్పే అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.దామాషా ప్రాతిపదికన కేటాయించిన 225 సీట్లలో ఐక్య రష్యాకు 140, కమ్యూనిస్టుపార్టీకి 35,ఎల్‌పిడిఆర్‌కు 34, జస్ట్‌ రష్యాకు 16 వచ్చాయి. నియోజకవర్గాలలో వరుసగా ఈ పార్టీలకు 203, ఏడు, ఏడు, ఐదు, మరో రెండు చిన్న పార్టీలకు ఒక్కొక్కటి దక్కాయి.ఒక స్వతంత్ర అభ్యర్ధి గెలిచాడు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దళిత,గిరిజన వుద్ధరణ బండారం – మోడీని నిలదీయాల్సిందే మరి !

20 Tuesday Sep 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

Narendra Modi, sc, ST's upliftment, Tribal & Scheduled Caste Sub Plan)

ఎం కోటేశ్వరరావు

   పోనీయండి వదిలేద్దాం ! రాజకీయ నాయకులన్న తరువాత జనం ముందు చెప్పేదొకటి, అధికారానికి వచ్చాక చేసేదొకటి . అందరూ అంతే . అది కాంగ్రెస్‌ అయినా బిజెపి, తెలుగు దేశం లేదా టిఆర్‌ఎస్‌ ఎవరైతేనేం అందరూ మహానుభావులే . ఇంక చూడాల్సింది కమ్యూనిస్టులనే ! వారెలా వుంటారో తెలియదు, ఇలాంటి మాటలు ఏదో ఒక సందర్భంలో వినే వుంటారు కదా ! మీరూ వదిలేసే వుండి వుంటారు. ఎందుకంటే ఎవరి పాపాన వారు పోతారని కదా మన ముందు తరాల వారు మనకు నేర్పింది. మాతాత, మానాన్న వారు స్వర్గంలో వున్నారో, నరకంలో వున్నారో అసలు ఎక్కడికైనా ఇంకా చేరారో లేదో తెలియదు. ఎందుకంటే వారి దగ్గర నుంచి స్వర్గానికి పోతే రంభ, వూర్వశి, తిలోత్తమలు కనిపించారని గానీ, లేక పాపం చేసి నరకానికి పోయి సలసలా కాగే నూనెలో పడి బొబ్బలెక్కినట్లు గానీ ఎస్‌ఎంఎస్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇ మెయిల్‌ వర్తమానం ఏదీ ఇంతవరకు రాలేదు. మా తాత పోయినపుడు ఆయనకు ఫోన్‌ అనేది ఒకటుందని మాత్రమే తెలుసు.అక్కడకు వెళ్లిన తరువాత మిగతావన్నీ తెలుసుకొని వుండాలి. ఎందుకంటే స్వర్గం, నరకంలో అంతా వేద విజ్ఞానంతో అందరి కంటే టెక్నాలజీలో ముందు వుండి వుంటారు కదా ! ఇంతకీ ఇంత వుపోధ్ఘాతం ఎందుకంటారా ?

    అధికారంలో వున్న వారిని విమర్శించటమే నేరం, దేశ ద్రోహంగా పరిగణించి కేసులు పెడుతున్న రోజులివి. కొంత మంది గురించి తాతగారి నాన్నగారి భావాలకు దాసులు అని ఒకప్పుడు ఒక కవి చెప్పాడు .అయితే మాటకు కట్టుబడి వుండకపోతే ఎవరినైనా నిలదీయాల్సిందేనని మాతాత, మానాన్న కూడా చెప్పారు.నాటి జాతీయ వాదులను నేడు దేశానికి హాని చేసిన వారిగా, నాడు బ్రిటీష్‌ వారి అడుగులకు మడుగులొత్తిన వారిని అపర దేశభక్తులుగా చూపుతున్న స్దితి. అందువలన నిలదీయాలన్న మా తాతగారి నాన్న గారి భావాలు తిరోగమనం కాదు, అందువలన నన్ను దేనికి ప్రతినిధిగా చూస్తారో మీ ఇష్టం. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలను అమలు జరపటం లేదు గనుక నిలదీయాల్సిందే మరి. కొద్ది రోజుల క్రితం ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని అనేక అంశాలపై మాట్లాడుతూ దళితుల గురించి కూడా మాట్లాడారు. సామాజిక అసమానతల గురించి అడిగిన అంశంపై మోడీ ఇలా చెప్పారు.’ కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి వాటిని ఖండించాల్సిన అవసరం వుంది.నాగరిక సమాజంలో వాటికి చోటు లేదు. శాంతి భద్రతల సమస్య రాష్ట్రాలకు సంబంధించిన అంశం. కొంత మంది కొన్ని సమస్యలను ఎంపిక చేసుకొని మోడీ వాటికి కారకుడంటున్నారు. దీని వలన ఏ ప్రయోజనం నెరవేరుతుందో నాకు తెలియదు, కానీ ఇది దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ఇది ఎంతో లోతుగా వేళ్లూనుకున్న సామాజిక సమస్య. సామాజిక అసమానతల మీద రాజకీయం చేయటం సమాజానికి అపకారం చేయటమే. తర తరాలుగా ఎవరైతే అన్యాయానికి గురయ్యారో ఈ రోజు చూస్తే బిజెపిలో గిరిజన ఎంపీలు, ఎంఎల్‌ఏలు గణనీయ సంఖ్యలో వున్నారు. నేను బిఆర్‌ అంబేద్కర్‌ 125వ జన్మదినాన్ని వుత్సవంగా జరిపినప్పటి నుంచి ఆయన జన్మదినాన్ని ఐక్యరాజ్య సమితి , అలాగే 102 దేశాలు పాటించిన తరువాత, రెండు రోజుల పాటు ఆయన జీవితం, చేసిన కృషి గురించి పార్లమెంట్‌లో చర్చించిన తరువాత మోడీ అంబేద్కర్‌ భక్తుడా అనే ఆలోచనతో అనేక మందికి ఒక సమస్య ఏర్పడింది. తమకు తామే సంరక్షకులుగా ప్రకటించుకున్న కొందరు వుద్రిక్తతను సృష్టించటానికి ప్రయత్నిస్తున్నారు. మోడీ దళితులతో వుండటం, స్వయంగా గిరిజనులకోసం అంకితం కావటాన్ని వారు ఇష్టపడటం లేదు. అణచివేతకు, అణగారిన, అవకాశాలు రాని దళితులందరి అభివృద్ధి కోసం కోసం నేను అంకిత మయ్యాను.’ ఇంకా కొన్ని విషయాలు చెప్పారు, గానీ ఇప్పటికే చాలా ఎక్కువైంది.

    తాజాగా ఇండియా స్పెండ్‌ అనే వెబ్‌సైట్‌ నిఖిల్‌ ఎం బాబు అనే ఒక జర్నలిస్టు రాసిన విశ్లేషణకు ‘దళితులు, గిరిజనులకు కేటాయించి ఖర్చు పెట్టని మొత్తం వ్యవసాయ బడ్జెట్‌కు ఎనిమిది రెట్లు ‘ అనే శీర్షికను పెట్టారు.ఈ విషయంలో కాంగ్రెస్‌, మరొక పార్టీ అన్న తేడా లేదు. వారి అభివృద్ధికి తాను అంకితమైనట్లు చెప్పుకున్న నరేంద్రమోడీ హయాంలో మిగతావారితో పోల్చితే ఖర్చు పెట్టని మొత్తం హిమాలయాల్లా పెరిగి పోతున్నట్లు వెల్లడైంది. కొత్త బిచ్చగాడికి లేదా దొంగ భక్తుడికి పంగనామాలెక్కువుంటాయని పెద్దలు వూరికే చెప్పారా ! ఆ వెబ్‌ సైట్‌ నిర్వాహకులు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం మేరకు గత మూడున్నర దశాబ్దాల కాలంలో దళితులు, గిరిజనులకు కేటాయించి ఖర్చు పెట్టని సొమ్ము అక్షరాలా రెండు లక్షల 80వేల కోట్లు. వారికోసం కేటాయించిన రిజర్వుడు వుద్యోగాలు తగిన అభ్యర్ధులు లేని కారణంగా కొన్నాళ్లు వాటిని ఖాళీలుగా చూపి తరువాత ఇతరులతో నింపివేయటం మనం చూస్తున్నదే. అయితే వుప ప్రణాళికల కింద కేటాయించిన సొమ్ము ఫలాన్ని అందుకొనేందుకు తగినంత సంఖ్యలో ఆ నిర్భాగ్యులు కూడా లేరా ? మరోవైపు ఇంత మొత్తం కేటాయించినా ఆ తరగతులు ఇంకా అభివృద్ధి చెందలేదంటే అదంతా వృధా అయిందని తాత్పర్యాలు చెప్పే పండితులు కూడా లేకపోలేదు.

     ప్రణాళికా సంఘం నూతన అవతారం లేదా ఎన్‌డిఏ ప్రభుత్వ నూతన సృష్టి నీతి అయోగ్‌ సిఇఓ అమితాబ్‌ కాంత్‌ ఏమంటారంటే రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖలు ఏం చేస్తున్నాయో పర్యవేక్షించటం తప్ప మరింతగా ఖర్చు చేయాల్సిన బాధ్యత వాటిదే. ప్రస్తుత ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నది అన్నారు. ఖర్చు చేయని మొత్తాలను తిరిగి కేంద్రానికి పంపాల్సి వుంటుందని వేరే చెప్పనవసరం లేదు. అలా వెనక్కు ఇచ్చిన మొత్తం వ్యవసాయ బడ్జెట్‌ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ లేదా వచ్చే పది హేను సంవత్సరాలలో గ్రామీణ రోడ్ల నిర్మాణానికి సరిపడే మొత్తం, లేదా నేపాల్‌, సెర్బియ, జోర్డాన్‌ దేశాల స్థూల జాతీయాదాయం కంటే ఎక్కువట. ఈ మొత్తం 2.8లక్షల కోట్లరూపాయలను దేశంలోని పాతిక కోట్ల దళితులు, గిరిజనులకు పంచితే తలా రు.11,289 రూపాయలు వస్తాయట.

     కేంద్ర ప్రభుత్వ మార్గదర్శ సూత్రాల ప్రకారం జనాభాలో దళితులు, గిరిజనుల దామాషా ప్రాతిపదిక 16.6,8.6 శాతం చొప్పున వారి అభివృద్ధి వుప ప్రణాళికలకు బడ్జెట్లలో కేటాయింపులు జరపాలి. 2006లో ప్రణాళికా సంఘం జారీ చేసిన నిబంధనల ప్రకారం సకాలంలో ఖర్చు చేయని నిధులు మురిగి పోతాయి. అలా మురగబెట్టటంలో దళితుల నిధుల విషయంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌, వుత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, గిరిజన నిధులకు సంబంధించి ఝార్కండ్‌, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ మొదటి మూడు స్ధానాలలో వున్నాయి. తెలంగాణా కొత్త రాష్ట్రం, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, భూములు ఇస్తామని చెప్పిన పెద్దల పాలనలో వున్న చోట 2014-15లో ఖర్చు చేయని నిధులు 61శాతం లేదా 4,643 కోట్లరూపాయలని విశ్లేషించారు.

    నరేంద్రమోడీ సర్కార్‌ను ఎందుకు తప్పు పట్టాల్సి వస్తున్నదంటే బిజెపి లేదా దాని మాతృసంస్ధ సంఘపరివార్‌ నేతలు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలను నిత్యం విమర్శిస్తున్నారు. అందుకు వారిని తప్పుపట్టటం లేదు, ఆ విధానాలు దేశాన్ని సర్వనాశనం చేశాయన్నది వాస్తవం. వారి స్ధానంలో అధికారానికి వచ్చిన బిజెపి తెచ్చిన మార్పులేమిటన్నది ప్రశ్న. ఒక రోజు వేసుకున్న చొక్కా మరుసటి రోజు మార్చినట్లుగా కాంగ్రెస్‌ స్ధానంలో బిజెపి వచ్చింది తప్ప విధానాలు మారలేదు. దళిత, గిరిజన వుప ప్రణాళికల నిధుల ఖర్చుకు సంబంధించి అవి అమలులోకి వచ్చిన 35 సంవత్సరాల నుంచి ఏ విధానాలను అనుసరిస్తున్నారో వాటిలో ఎలాంటి మార్పు చేయలేదు. ఆ తరగతులకు అంకితమైనట్లు చెప్పుకున్న పెద్ద మనిషి హయాంలో కూడా ఖర్చు పెట్టకుండా తిరిగి కేంద్రానికి చేరుతున్నాయి. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అంటే ఇదేనా ?

      కర్ణాటకలో వున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్ధిక సంవత్సరం ముగియటానికి మూడునెలల ముందు ఈ ఏడాది జనవరిలో అక్కడి ముఖ్యమంత్రి సిద్ద రామయ్య సమీక్షిస్తూ నిధులలో కేవలం 0.87శాతమే ఖర్చు చేసినందుకు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారట. 2005-14 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సి వుప ప్రణాళిక నిధులు రు.19,367 కోట్లు, గిరిజన వుప ప్రణాళిక నిధులు రు.6,922 కోట్లు ఖర్చు చేయలేదు. కాంగ్రెస్‌-బిజెపి ఏదో ఒక పార్టీ లేదా వాటితో సంబంధం వున్న వారే అందునా గిరిజనులే ముఖ్యమంత్రులుగా వున్న ఝార్కండ్‌లో ఇదే కాలంలో రు.17,107 కోట్ల గిరిజన నిధులు ఖర్చు చేయలేదట. నరేంద్రమోడీ ప్రభుత్వ విజయాల గురించి మన తెలుగోడు వెంకయ్య నాయుడు ప్రతి ఏటా ఒకసారి వూరూ వాడా తిరిగి గొప్పగా ప్రచారం చేసి వెళ్లారు. దళితులు, గిరిజనులకు తమ తొలి ఏడాది పాలనా కాలంలోనే అంతకు ముందుతో పోల్చితే 25శాతం బడ్జెట్‌ పెంచామని చెప్పారు. నిజమే, అయితే అది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు చూడండి.

    కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సంబంధించి షెడ్యూల్డు కులాల, తెగల వుప ప్రణాళికల నిధుల తీరు తెన్నులు ఎలా వున్నాయో చూడండి. (కటాయింపులు, ఖర్చు కోట్ల రూపాయలలో, ఖ.చే.పె ఖర్చు చేయని మొత్తం పెరుగుదల )

ఏడాది         కేటాయింపు       ఖర్చు           ఖర్చుచేయనిది      కే.పెరుగుదల     ఖ.చే.పె

2012-13     58,823.14    53,345.04       5,478.1 — —

2013-14     66,159.52    56,761.17       9,398.35                   12               72

2014-15      82,935.00   49,955.79      32,979.21                  25              251

నరేంద్రమోడీ ఏలుబడి మొదటి సంవత్సరంలో కేటాయింపు పెరుగుదల 25శాతం అయితే ఖర్చు పెట్టని మొత్తం పెరుగుదల 251 శాతం వుంది. ఇదేమిటని నిలదీయాలా వద్దా ? పాపం తగిలిపోతారని వదిలేద్దామా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆఫ్ఘనిస్తాన్‌కు మిలిటరీ సాయం అంటే తాలిబాన్లకు ఆహ్వానమే !

18 Sunday Sep 2016

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, UK, USA

≈ Leave a comment

Tags

Afghanistan, INDIA, military supplies, Narendra Modi, talibans

Image result for MI-24/25 attack helicopters

అమెరికా వుచ్చులోకి దేశాన్ని నెడుతున్న నరేంద్రమోడీ ప్రమాదకర క్రీడ

సత్య

     అమెరికాతోనూ, వుగ్రవాదులతో జట్టు కట్టి బాగుపడిన దేశం గానీ, ముప్పును తప్పించుకున్న నేతలు గానీ అరుదుగా కనిపిస్తారు. అకాలీదళ్‌ను దెబ్బతీసేందుకు భింద్రన్‌ వాలే అనే ఖలిస్తాన్‌ వుగ్రవాదిని పెంచి పెద్ద చేసి ఇందిరా గాంధీ, ఒక దశలో తమిళ ఎల్‌టిటియి వుగ్రవాదులకు ఆయుధాలు ఇచ్చి తరువాత మారిన పరిస్థితుల్లో వారిని అణచివేతకు సైన్యాన్ని పంపి రాజివ్ గాంధీ వారి చేతుల్లోనే బలైన వుదంతం మన కళ్ల ముందే జరిగింది. తాలిబాన్లను తయారు చేసి చివరకు వారి చేతుల్లో చావు దెబ్బలు తిని ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సేనలను వుపసంహరించుకున్న అమెరికా నిర్వాకాన్ని చూశాము. ఇంత జరిగాక వాటి నుంచి గుణపాఠాలేమీ తీసుకోకుండా నరేంద్రమోడీ సరికొత్త ప్రమాదకర క్రీడ మొదలు పెట్టారు. ఇప్పటివరకు మన దేశం అనుసరించిన విదేశాంగ విధానానికి భిన్నంగా స్నేహ సంబంధాలను మెరుగుపరుచుకోవటం లేదా ఏర్పరుచుకోవటానికి బదులు ఇరుగు పొరుగు దేశాలతో గిల్లి కజ్ఞాలకు దిగి కొత్త ప్రమాదాలను కొని తెచ్చుకొనే విధంగా ఎన్‌డిఏకు మార్గదర్శకత్వం వహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ దేశాన్ని ప్రమాదకర స్ధితిలోకి నెడుతోంది.

    కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ ఆప్ఘనిస్తాన్‌కు ఒక బిలియన్‌ డాలర్ల సాయం చేయటానికి నిర్ణయించుకకుంది. ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ న్యూఢిల్లీ పర్యటన సందర్బంగా ఆ మొత్తాన్ని ప్రకటించారు .అందుకు గాను వెంటనే అమెరికా సర్కార్‌ మోడీ ప్రభుత్వాన్ని పొగడ్తల వరదలో ముంచెత్తింది. సాయం ప్రకటించింది మన దేశం, లబ్ది పొందేది ఆఫ్ఘనిస్తాన్‌. మధ్యలో అమెరికా పొగడ్తలు ఎందుకు ? వాటిని చూసి మీడియాలోని మోడీ భక్తులు కొందరికి ఒంటి మీద బట్టలు ఎందుకు నిలవటం లేదు. అష్రాఫ్‌ మన దేశ పర్యటనకు ముందు తాలిబాన్లు ఒక ప్రకటన చేస్తూ తమను అణచేందుకు ఆఫ్ఘన్‌ ప్రభుత్వానికి భారత్‌ మిలిటరీ సాయం అందచేస్తున్నదని దానిని నిలిపివేయాలని వినతితో కూడిన హెచ్చరిక చేశారు.

     మన అవసరాల కోసం మనమే ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ, ఎవరిస్తామంటే వారి దగ్గర అందిన కాడికి అప్పు చేస్తున్నాం కదా ? అటువంటపుడు మనం మరొక దేశానికి సాయం చేయటం ఏమిటి ? మనమే విదేశాల నుంచి మిలిటరీ ఆయుధాలు కొంటున్నాం కదా వాటిలో కొన్నింటిని ఆఫ్ఘనిస్తాన్‌కు ఇవ్వటం ఏమిటి ? ఈ ఏడాది మార్చి నెలాఖరుకు మన విదేశీ అప్పు 485.6 బిలియన్‌ డాలర్లు. దానిలోంచి లేదా మనం చేయి చాపి తెచ్చుకున్న మొత్తంలోంచి ఒక బిలియన్‌ డాలర్లు ఆఫ్ఘనిస్తాన్‌కు సాయంగా ఇస్తున్నాం. అంటే దాదాపు ప్రతి ఒక్కరం తలకు 60 రూపాయల చొప్పున విరాళం ఇస్తున్నట్లు. తాజా వందకోట్లతో కలిసి ఇంతవరకు మొత్తం సాయం 200 కోట్ల డాలర్లకు చేరుకోనుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటానికి, విద్య, వైద్య సాయం అందించటానికి అవసరమైన సాయం ఏ దేశానికి అందించినా ఎవరూ తప్పు పట్టరు. అయితే ఎక్కడో స్విచ్‌ వేస్తే మరెక్కడో లైట్‌ వెలిగినట్లు ఇలాంటి సాయాలను ఏ దేశం కూడా చివరికి చైనా వంటి సోషలిస్టు దేశాలు సైతం వుత్తి పుణ్యానికే చేయవు. ఏదో ఒక ప్రతిఫలం ఇంకా చెప్పాలంటే తనకు అవసరమైన వాటి కోసమో లేదా తన దగ్గరవున్న వస్తువులకు మార్కెట్‌ కోసమో, రాజకీయ ప్రయోజనం కోసమో ఏదో ఒక లక్ష్యం లేకుండా వుండదు. ఆప్ఘనిస్తాన్‌తో మనకు సరిహద్దు సంబంధాలు లేవు, పొరుగు దేశం కాదు, మధ్యలో పాకిస్తాన్‌ వుంది.ఈ నేపధ్యంలో మోడీ సర్కార్‌ ఆర్ధిక సాయానికే పరిమితం కాకుండా మిలిటరీ ఆయుధాలు ఎందుకు అందిస్తున్నట్లు ? ఎవరికైనా సందేహం కలగక తప్పదు. పోనీ ఆర్ధిక, మిలిటరీ సాయం అందించటం ద్వారా మనం ఆశిస్తున్న ప్రయోజనాలేమిటి ? మన్‌కీ బాత్‌తో సహా ఎక్కడా మనకు చెప్పలేదు.

    మన దేశం గురించి చెప్పుకోవాలంటే గత రెండు దశాబ్దాలుగా చైనా తరువాత అత్యధిక సగటు వృద్ధి రేటుతో ముందుకు పోతున్న ఏకైక దేశం. అభివృద్ధి ఫలం అంతా కొద్ది మంది బిలియనీర్ల చేతుల్లోకి పోతున్నది. గత పది సంవత్సరాలలో ప్రపంచంలో బిలియనీర్లు సగటున 68శాతం వృద్ధి చెందితే మన దేశంలో 330 శాతం వుంది. ఇంత వేగంగా కొంత మంది చేతుల్లోకి డబ్బు చేరుతున్నది కనుకనే వారిని చూసి ప్రతివారూ ఏదో విధంగా తాము కూడా ఇలా చూసి అలా తిరిగే లోపల కోటీశ్వరులు కావాలనుకుంటున్నారు. మన దగ్గర అణ్వాయుధాలున్నాయి వాటిని వుపయోగించలేము కనుక ఇతర ఆయుధాలను విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాము. అంతరిక్ష రంగంలో కూడా అనేక విజయాలు సాధించాము. పెద్ద మిలిటరీ, వైమానిక దళం వుంది. అయినా ధనిక దేశాల ముందు చేయి చాపుతున్నాం, మనకు వచ్చిన మొత్తంలో లేదా అప్పు చేసి కొంత మొత్తాన్ని మన దగ్గర చేయి చాచే వారికి ఇస్తున్నామన్న విషయం ‘నయా దేశ భక్తులతో’ సహా కొంత మందికి మింగుడు పడకపోవచ్చు. ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం 2011లో మన దేశం చేయి చాస్తున్న వరుసలో ఆరవ స్ధానంలో వున్నాం. మనం 2011లో 3.2, 2012లో 1.6, 2013లో 2.4 బిలియన్‌ డాలర్లు తీసుకున్నాంhttps://thelogicalindian.com/story-feed/exclusive/know-everything-about-how-much-india-receives-and-donates-foreign-aid/  మన కంటే దరిద్రపు దేశాలకు ఇచ్చేందుకు 2015-16లో మన బడ్జెట్‌లో 1.6 బిలియన్‌ డాలర్లు కేటాయించాం.మనం చేస్తున్న సాయంలో భూటాన్‌కు గణనీయ మొత్తం ఇచ్చాం. ముందే చెప్పుకున్నట్లు ఎలాంటి ప్రయోజనం లేకుండా కాదు సుమా ! మన సాయంతో వారు హిమాలయ పర్వత ప్రాంతాలలో జల విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మిస్తారు, 2020 నాటికి మన దేశం వారి నుంచి పదివేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాం. భూటాన్‌ నుంచి విద్యుత్‌ తెచ్చుకుంటున్నాం, తెచ్చుకుంటాం మరి ఆప్ఘనిస్తాన్‌ నుంచి మోడీగారు ఏం తెస్తారు ? వుగ్రవాదాన్ని, తాలిబాన్లనా ?

   ఆఫ్ఘనిస్తాన్‌ అంటే చాలా మందికి తెలిసినట్లు వుండి వివరాలు లోతుగా తెలియని దేశం. రాబందులు ఆకాశంలో తిరుగుతుంటాయి, ఎక్కడ కళేబరం కనిపిస్తే అక్కడ వాలి పోతాయి. ప్రపంచంలో మిలిటరీ, ఆర్ధిక, రాజకీయంగా కీలక ప్రాంతాలుగా వున్న వాటిని తమ ఆధీనం చేసుకొనేందుకు అమెరికా సామ్రాజ్యవాదులు కూడా నిత్యం అలాగే ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటైన ఆఫ్ఘనిస్తాన్‌లో పాగావేసేందుకు పూనుకున్న సమయంలో దానిని పసిగట్టిన మిలిటరీలోని అభ్యుదయ వాదులైన అధికారులు తిరుగుబాటు చేసి దేశాధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ి పొరుగునే వున్న నాటి సోవియట్‌ యూనియన్‌ మద్దతు ఇవ్వటమే కాదు, ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు, దానిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న శక్తులను అణచివేసేందుకు వారి ఆహ్వానం మేరకు మిలిటరీ సాయాన్ని కూడా పంపింది. ఆ ప్రభుత్వాన్ని కూల్చి వేసే కుట్రలో భాగంగానే అధికారంలో వున్న వారిని కమ్యూనిస్టులని ప్రచారం చేశారు. అయితే మిలిటరీ అధికారులు కమ్యూనిజం పట్ల అభిమానం వున్నవారు నుక తాము కమ్యూనిస్టులం కాదని ఖండించలేదు. కమ్యూనిస్టుల కారణంగా ఇస్లాం మతానికి ముప్పు ఏర్పడింది, దానిని కాపాడుకోవాలంటే తాలిబాన్లుగా మారి ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వాన్ని కూల్చివేయాలని అమెరికన్లు ఒక పధకం ప్రకారం రెచ్చగొట్టారు. అందుకు పక్కనే వున్న పాకిస్థాన్‌కు అలాంటి వారిని తరలించి అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చి సాయుధులను చేసి పంపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ముసుగులో తిష్ట వేయటానికి అమెరికా పూనుకుందన్న విషయం గ్రహించగానే మరో పొరుగు దేశం ఇరాన్‌ కూడా తన మద్దతుదారులను అక్కడ వుంచేందుకు అది కూడా తాలిబాన్లను తయారు చేసింది. మొత్తం మీద వారూ వీరూ తయారు చేసిన వారు అక్కడి వామపక్ష ప్రభుత్వానికి, వారికి సాయంగా వచ్చిన సోవియట్‌ సేనల మీద దాడులు, వత్తిడి తెచ్చి చివరకు వుపసంహరించుకొనే విధంగా, వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోయటంలో జయప్రదం అయ్యారు. తరువాత ఆ తాలిబాన్లే అమెరికా, పాకిస్థాన్‌కు ఏకు మేకయ్యారు. వారిని నాశనం చేయటానికి అమెరికా సైన్యాన్ని దించి చావు దెబ్బలు తిన్నది, దేశాన్ని సర్వనాశనం చేసింది, చివరకు తాలిబాన్లను అదుపు చేయలేక ఒక తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సేనలను వుపసంహరించుకుంది. వుగ్రవాదులను గానీ, మరొక సంఘవ్యతిరేక శక్తుల అణచివేత గానీ ఆయా దేశాల అంతర్గత వ్యవహారం మాత్రమే. పొరుగువారు వెళ్లి ఆ పని చేయటం తగని పని. తమకు హాని చేసే వుగ్రవాదాన్ని రూపుమాపే శక్తి ఆ సమాజాలకు అంతర్గతంగానే వుంటుంది. కానీ అమెరికా ఆ పేరుతో అనేక దేశాలలో జోక్యం చేసుకొంటోంది, చావు దెబ్బలు తింటోంది. ఇప్పుడు వుగ్రవాద వ్యతిరేక పోరు, ఆప్ఘనిస్తాన్‌ పునరుద్దరణ పేరుతో అక్కడే తిష్టవేసింది. తాలిబాన్లను అణచివేసేందుకు తమతో పాటు ఇతర దేశాలు కూడా అన్ని రకాలుగా భాగం పంచుకోవాలని వత్తిడి తెస్తూ తన భారాన్ని తగ్గించుకుంటున్నది. ఆ వుచ్చులోకి భారత్‌ను లాగుతున్నది. నరేంద్రమోడీ సర్కార్‌ ఎలాంటి ముందు వెనుకలు చూడకుండా ఆ బాటలో ముందుకు పోతున్నది.

     ఆప్ఘనిస్తాన్‌ను అన్ని విధాలుగా నాశనం చేసింది అమెరికా, తామరతంపరగా తాలిబాన్లను సృష్టించి ప్రపంచంలో అనేక దేశాలకు వారిని ఎగుమతి చేసింది అమెరికా, గతంలో దేశ భక్తులుగా ప్రచారం చేసిన వారిని ఇప్పుడు టెర్రరిస్టులుగా చిత్రిస్తూ వారిపై పోరు, అభివృద్ధి పేరుతో జరిగే ఖర్చును ప్రపంచ దేశాలన్నీ పంచుకోవాలని వత్తిడి తెస్తోంది అమెరికా. గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం తాలిబాన్ల చేతిలో నాశనమైన పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించేందుకు అంగీకరించి నిర్మించింది. దానిని నరేంద్రమోడీ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఇప్పుడు మరొక వంద కోట్ల డాలర్ల సాయం ప్రకటించారు. ఇది కాకుండా ఇప్పటికే రష్యా తయారీ ఎంఐ-25 గన్‌షిప్‌ హెలికాప్టర్లను మూడింటిని పంపారు. మరొకదానిని పంపనున్నారు. తమకు మరిన్ని మారణాయుధాలు,ఎంఐ-35 గన్‌షిప్‌ హెలికాప్టర్లు కూడా కావాలని అక్కడి ప్రభుత్వం కోరుతున్నది. ఇలా ఆయుధాలు ఇవ్వటం ఇప్పటివరకు అనుసరిస్తున్న విదేశాంగ విధానానికి భిన్నం. అమెరికా ఆదేశాల మేరకు తాలిబాన్లను తయారు చేసిన పాకిస్తాన్‌ తరువాత కాలంలో అమెరికా ఆదేశాల మేరకు ఆ తాలిబాన్లనే అణచివేయటం ప్రారంభించింది. తమ దేశంలో తలదాచుకున్న ఒసామాబిన్‌ లాడెన్‌ను హతమార్చటానికి అమెరికాకు తోడ్పడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఇప్పుడు ఐఎస్‌ వుగ్రవాదులు, తాలిబాన్లు కలిసి పాకిస్థాన్‌పై దాదాపు ప్రతి రోజూ దాడులు చేస్తున్నారు.దానికి తోడు ఆఫ్ఘన్‌లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్ధితి. చాలా ప్రాంతాలపై ప్రభుత్వానికి అదుపు లేదు. తాలిబాన్లదే పెత్తనం. తెగల వారీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరిది ఆధిపత్యం. కాబూల్‌ గద్దెపై ఎవరుంటే ఆ తెగవారు చూసీ చూడనట్లు వుంటారు తప్ప మిగతావారు శత్రువులే. తమ అణచివేతకు తోడ్పడుతున్న పశ్చిమ దేశాలలో తాలిబాన్లు, ఐఎస్‌ తీవ్రవాదులు దాడులకు పాల్పడటాన్ని చూస్తున్నాము. ఇప్పటికే పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులతో నిత్యం కాశ్మీర్‌ రావణకాష్టంలా మండుతున్నది. ఇప్పుడు తాలిబాన్‌ -ఐఎస్‌ తీవ్రవాదులను కూడా మోడీ సర్కార్‌ ఆహ్వానించేందుకు పూనుకున్నట్లు కనిపిస్తున్నది. మనదైన స్వతంత్ర విదేశాంగ విధానం మనకు వుండాలి తప్ప మరొక దేశం అది అమెరికా లేదా మరేదైనా దాని ప్రయోజనాలకు, ఎత్తుగడలకు అనుగుణంగా వుంటే నష్టపోయేది మనమే. ఇప్పటికైనా మించి పోయింది లేదు. మేలుకోవటం మంచిది. మొండిగా వ్యవహరిస్తే జరిగే పరిణామాలకు ఎన్‌డిఏదే బాధ్యత అవుతుంది.

  చైనా ప్రభుత్వం సాయం చేస్తున్నదంటే అది ప్రభుత్వ రంగ కంపెనీలకు ఆర్డర్లు సంపాదించుకుంటున్నది. దాని ద్వారా వచ్చే లాభం, ప్రయోజనం ప్రజలకు చెందుతుంది. బిల్‌ గేట్స్‌ వంటి కార్పొరేట్లు అంద చేసే సాయం వారి కంపెనీలకు ఆర్డర్లకోసం వుపయోగపడుతుంది. అమెరికా,జపాన్‌, బ్రిటన్‌ ప్రభుత్వాలు చేసే సాయం ఆ దేశాలలోని కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలకు లంకె వుంటుంది. నరేంద్రమోడీ సర్కార్‌ వున్న ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మటం లేదా మూసివేతలకు పూనుకుంది. పెట్టుబడులు పెడుతున్నది ప్రయివేటు కార్పొరేట్‌ కంపెనీలే అంటే సాయం పేరుతో ఏటా బడ్జెట్‌ నుంచి కేటాయించే 160 కోట్ల డాలర్ల సాయంలో ఎక్కువ విదేశాలలో పెట్టుబడులు పెట్టే భారతీయ కార్పొరేట్లకు అందచేస్తున్న సబ్సిడీ అవుతుంది తప్ప మరొకటి కాదు. మన జనానికి సబ్సిడీలలో కోత, కార్పొరేట్లకు మోత !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: