• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: February 2017

మళయాళ నటికి మరుగుజ్జు యోధుల బెదిరింపులు !

20 Monday Feb 2017

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

Aami actress, BJP’s trolling army, Manju warrier, Trolls

ఎం కోటేశ్వరరావు

    మత, మితవాద శక్తులు వివాదాస్పదం గావించిన మళయాళ చిత్రం ‘ఆమీ ‘ నిర్మాణం సజావుగా సాగుతుందా? సాగినా ప్రేక్షకులను చూడనిస్తారా అనే వూహాజనిత ప్రశ్నలను కాసేపు పక్కన పెడదాం. అసలు ఈ చిత్రంలో ఏ ముందో చూడకుండానే దర్శకుడు, నటీ నటులపై వత్తిడి తీసుకురావటం,సామాజిక మీడియాలో బెదిరింపులకు పాల్పడం మన దేశంలో కొన్ని శక్తుల అసహన ధోరణులు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపించటం లేదూ ! తన జాతీయతను ఎవరూ ప్రశ్నించజాలరని, తాను హిందువునే అంటూ రచయిత్రి కమలా సురయ్య జీవిత కథ ఆధారంగా నిర్మించే చిత్రంలో కమల పాత్ర ధరించటానికి తనకు హక్కుందని, తాను నటిస్తానని సినీ నటి మంజు వారియర్‌ స్పష్టం చేశారు. సుప్రసిద్ధ నటి విద్యాబాలన్‌ మాదిరి మంజుపై కూడా తిరోగామి శక్తులు వత్తిడిని ఇంకా పెంచుతాయా? ఆమె వాటిని తట్టుకొని చెప్పినట్లు చిత్రంలో నటించగలరా అన్న సందేహాలు వుండనే వుంటాయి.

     భిన్నాభిప్రాయాన్ని, అసమ్మతి, విమర్శలను జాతి వ్యతిరేకంగా చిత్రించే నాజీ పోకడలను జనం మెదళ్లలోకి క్రమంగా ఎక్కిస్తున్న తరుణమిది. మన దేశం స్వల్పకాలం ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని చూసింది తప్ప నాజీ, ఫాసిజం స్వరూపాన్ని చూడలేదు. అలాగని నిజమైన ప్రజాస్వామిక వ్యవస్ధను కూడా చూడలేదన్నది కూడా అంతే వాస్తవం. ఇది నిజంగా ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన పరిస్ధితి.మనకు తెలియని వాటి గురించి జనానికి తెలియచేయటం కంటే తెలిసినట్లుండి, నిజంగా తెలియని ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చెబితే దానికి వ్యతిరేకమైన నియంతృత్వం గురించి చైతన్యవంతులను గావించటం సులభం అవుతుంది.

   తాము మాంసం తింటామని తెలియ చేసేందుకు ఎముకలను మెడలో వేసుకు తిరగరన్నది తెలిసిందే. అలాగే నియంతలు, ప్రజాస్వామ్యాన్ని ఏడునిలువుల లోతున పాతిపెట్టాలనుకొనే శక్తులు కూడా అదే మాదిరి ప్రవర్తిస్తాయి.తమ భావజాలాన్ని, రాజకీయాలను వ్యతిరేకించే వారిని సామాజిక మాధ్యమంలో ఎలా వేధిస్తారో, వెంటాడుతారో ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. ఇప్పుడు సినీనటి మంజు వారియర్‌ను కూడా అలాగే వేధించి, వెంటాడుతున్నారు. సాహితీలోకంలో, కేరళలో మాధవికుట్టి అనే పేరుతో రచనలు చేసి జీవిత చివరి కాలంలో కమలా సురయ్యాగా మారిన కమలాదాస్‌ గురించి పరిచయం చేయనవసరం లేదు. కేరళలోని ఒక ఛాందసవాద నాయర్‌ కుటుంబంలో జన్మించిన ఆమె తన రచనలలో స్త్రీ, పురుష లైంగిక సంబంధాలు, సమాజంలోని అక్రమ సంబంధాల గురించి నిర్మొహమాటంగా చర్చించటం కొంత మందికి మింగుడు పడలేదు.ఆమె రచయిత్రిగానే గాక పత్రికల్లో వివిధ అంశాలపై రచనలు చేశారు. ప్రముఖ రచయిత్రుల సరసన స్ధానం సంపాదించారు. తన 65వ ఏట ఆమె హిందూమతాన్ని వదలి ముస్లింగా మారారు. ఆ సమయంలో పెద్దవివాదమే చెలరేగింది. నాడు ఆమెపై ధ్వజమెత్తిన పరంపరకు చెందిన వారే ఇప్పుడు మరోసారి మరో రూపంలో దాడికి దిగారు. తన 75వ ఏట 2009లో ఆమె మరణించారు. ఆమె హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా మతం మారారని కొందరు ఆక్షేపిస్తే ఒక ముస్లిం పారిశ్రామికవేత్తతో వున్న సంబంధాల కారణంగా మతం మారారని కొందరు నిందించారు. ఇప్పుడు ఆమె జీవిత కథా ఇతివృత్తంతో సినిమా తీస్తున్న దర్శకుడు కమల్‌గా సుప్రసిద్ధుడైన కమాలుద్దీన్‌ మహమ్మద్‌ మాజిద్‌ అనే ఒక ముస్లిం అని అతగాడు తీస్తున్న సినిమా గనుక అది లవ్‌ జీహాద్‌ను ప్రోత్సహించేదిగా వుంటుందని కొందరు ధ్వజమెత్తారు. తొలుత కమలాదాస్‌ పాత్రకు విద్యాబాలన్‌ను ఎంపిక చేసి మేకప్‌ టెస్టులు, దుస్తులు అన్నీ సిద్ధం చేసుకొని చిత్రీకరణకు వెళ్లబోయే ముందు కథనాన్ని మార్చిన కారణంగా తాను నటించలేనని ప్రకటించారు. హిందూత్వ శక్తుల దాడికి భయపడి ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారని గతేడాదే మళయాల చిత్రసీమలో, మీడియాలో వార్తలు వచ్చాయి.

   దర్శకుడు కమల్‌ విషయానికి వస్తే నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చర్యను విమర్శించాడు. సినిమాహాళ్లలో జాతీయ గీతాలాపన సందర్భంగా లేచి నిలబడని వారిపై పోలీసులు చర్యలు తీసుకోవటాన్ని విమర్శించారు. రాజకీయంగా బిజెపి, హిందూత్వశక్తులు ఇది మింగుడు పడలేదు. జాతీయ గీతాన్ని గౌరవించకపోతే ఈ దేశం వదలి పోవాలని కూడా కొందరు బిజెపి నేతలు కమల్‌ను కోరారు. విద్యాబాలన్‌ వెనక్కు తగ్గిన తరువాత మంజూ వారియర్‌ను సంప్రదించగా ఆమె అంగీకరించారు. గతంలో ఆమె కమల్‌ చిత్రాలలో నటించారు. సామాజిక మాధ్యమాలలో తనపై దాడి, వేధింపులకు దిగిన వారికి మంజు వారియర్‌ అదే మాధ్యమం ద్వారా తన ఫేస్‌బుక్‌లో సమాధానమిచ్చారు.

    ‘ నేను కమల్‌ సార్‌ను నా గురువుగా చూస్తాను. ఇరవై సంవత్సరాల తరువాత ఆయనలోని ఒక గొప్ప కళాకారుడితో పని చేసే అవకాశం వచ్చినందుకు వుద్విగ్నతకు లోనవుతున్నాను తప్ప ఆయన రాజకీయాలను చూసి కాదు. నా దేశమే నా రాజకీయాలు. ప్రార్ధనలు చేసేందుకు నేను రోజుకు రెండుసార్లు దేవాలయాని వెళతాను. అదే విధంగా ఒక చర్చి, ఒక మసీదు ముందుకు వెళ్లినపుడు కూడా నేను అదే మాదిరి భక్తితో తలవంచుతాను.’ అని మంజు పేర్కొన్నారు. భిన్న రాజకీయాలు, భావజాలాలు వున్న వారు అనేక మంది కలసి పని చేస్తున్నారంటే ఒక మంచి సినిమా నిర్మాణ లక్ష్యం తప్ప మరొకటి కాదు.

    మంజుపై తిరోగామి శక్తులు దాడి, బెదిరింపులకు దిగితే ఆమె అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ సామాజిక మాధ్యమంలో స్పందించారు. తాను హిందువునని చెప్పుకోవటం సంఘపరివార్‌కు లొంగిపోవటంగా కూడా వర్ణించినవారు లేకపోలేదు. కొందరు ఎత్తుగడగా ఆమె అలా ప్రకటించిందన్న వారు కూడా వున్నారు. దేశంలో నెలకొన్న అసహన ధోరణుల నుంచి రక్షణ పొందేందుకు ఆమె జాతీయత కింద రక్షణ పొందారని ప్రముఖ రచయిత ఎంఎన్‌ కరాసెరీ వ్యాఖ్యానించారు. ‘ఆమె అభత్రాభావానికి లోనైవుంటే అందుకు ఆమెను నేను తప్పుపట్టటం లేదు. ఆమె ఇప్పటికే తన జీవితంలో అనేక విషాదాలను చూశారు. ఆమె సున్నిత మనస్కురాలైన కళాకారణి తప్ప రాజకీయవేత్తకాదు. ఆమెకు విద్వేష రాజకీయాలు తెలియవు ‘ అన్నారు. మత జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చే వారికి కళ అన్నా కళాకారులన్నా ప్రేమ వుండదు. అందువల్లనే ఎంఎఫ్‌ హుస్సేన్‌, సల్మాన్‌ రష్డి వంటి వారి చిత్రాలు, రచనలను వ్యతిరేకిస్తారు. సృజనాత్మక స్వేచ్చను వ్యతిరేకించటంలో హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఒకటే అని కూడా కరసెరీ వ్యాఖ్యానించారు. ‘కమలా సురయ్యా జీవితం నిజంగా ఎంతో సమ్మోహనమైంది. స్త్రీ లైంగికత్వం గురించి ఎంతో నిజాయితీగా ఆమె రచనలను విప్లవాత్మకం కావించింది. ఆమె జీవిత చరమాంకంలో ప్రేమ కోసం ఇస్లాంలోకి మారటంద్వారా విమర్శలపాలయ్యారు.ఆమె జీవిత మంతా వివాదాల మయం. ఒక కళాకారిణికి ఇవన్నీ ఎన్నో సవాళ్లను ముందుకు తెస్తాయి. మంజు ఒక యువ మహిళ, ఆమెకు సూక్ష్మ రాజకీయ బేధాలను గ్రహించలేకపోవచ్చు, తన పాత్రను అంగీకరించే సమయంలో దాని పరిధిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని వుండవచ్చు ‘ అన్నారు.

    సామాజిక మీడియాలో మంజు వారియర్‌పై దాడి, బెదిరింపులు, హెచ్చరికలు చేస్తున్నవారు తమ రాజకీయ భావాలను వెల్లడించకపోయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో వారంతా ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారానికి చెందిన వారు లేదా దాని ప్రభావానికి లోనైన వారన్నది స్పష్టం. మీడియా ప్రతినిధులు ఈ వివాదం, బెదిరింపుల గురించి ప్రశ్నించినపుడు సామాజిక మీడియాలో ప్రచారం వెనుక తమ పాత్ర లేదని బిజెపి సీనియర్‌ నాయకులు చెప్పారు.’ సామాజిక మీడియాలో చర్చ జరుగుతున్న కారణంగా ఈ చిత్రానికి వ్యతిరేకంగా బిజెపి మరియు సంఘపరివార్‌ ప్రచారం నిర్వహిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి, సామాజిక మీడియాలో వస్తున్నది బిజెపి వైఖరి కాదు. దానికి మా బాధ్యత లేదు ‘ అని బిజెపి కార్యదర్శి బి గోపాల కృష్ణన్‌ చెప్పారు. తమపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ఆ వివాదం లేదా ప్రచారంపై తమ వైఖరి ఏమిటో బిజెపి ఇంతవరకు ప్రకటించకపోవటం విశేషం. అనేక సందర్భాలలో కాగల కార్యకర్యం గంధర్వులు తీరుస్తారన్నట్లుగా ఇలా వ్యవహరించటం పరివార్‌ సంస్ధలకు సాధారణమే అన్నది విమర్శ.

    తమకేమీ సంబంధం లేదని బిజెపి నేతలు చెప్పటాన్ని తాము అంగీకరించటం లేదని సామాజిక కార్యకర్త ఎంఎన్‌ పియర్సన్‌ వంటి వారు స్పష్టం చేస్తున్నారు.’ ఇది ఒక గెరిల్లా దాడి వంటిది. సమాజంలో ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకున్నవారిని వెనక్కు కొట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో వారి రాజీకీయ అజెండాలో భాగమిది ‘ అన్నారు. అన్ని రకాల ఆలోచనా కోణాలను అంగీకరించే సంప్రదాయమున్న రాష్ట్రంలో అనేక మంది రచయితలు ఎంఎం కలబుర్గి, గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌ వంటి వారిని బలిగొన్న విద్వేష ప్రచారాన్ని కొనసాగించే దానిలో మంజు, కమల్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఒక భాగమని సిపిఎం పార్లమెంట్‌ సభ్యుడు ఎంబి రాజేష్‌ విమర్శించారు.

   సినిమా స్క్రిప్టులో మార్పులు చేసిన కారణంగా తాను చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు విద్యాబాలన్‌ చెప్పినప్పటికీ ఇంతవరకు అలాంటి మార్పులేమీ లేవని దర్శకుడు కమల్‌ స్పష్టం చేశారు. నవంబరులో షూటింగ్‌ ప్రారంభం కావాల్సి వుండగా విద్యాబాలన్‌ వెనక్కు తగ్గిన కారణంగా వాయిదా పడింది. జీవిత చరమాంకంలో ఇస్లాం మతం పుచ్చుకున్న కమలాదాస్‌ వివాదాస్పద జీవితం వున్న పాత్రను పోషించటం గురించి విద్యాబాలన్‌ భయపడి వుండవచ్చు. బాలీవుడ్‌లో ఆమె ఇటీవల కొన్ని ఎదురుదెబ్బలు తిన్నది. దక్షిణ భారత్‌లో ఈ సమయంలో ఇలాంటి చిత్రంలో చేస్తే తన భవిష్యత్‌ అవకాశాలను ప్రభావితం చేస్తాయోమో అన్నది కారణం కావచ్చని కమల్‌ వ్యాఖ్యానించారు. బయటి బెదిరింపులకు భయపడి మంజు వారియర్‌ వెనక్కు తగ్గుతుందని తాను భావించటం లేదని అన్నారు. కేరళ, ముంబై, కొల్‌కతాలలో షూటింగ్‌ జరుపుకొని మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రావాలన్నది నిర్మాతల లక్ష్యం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తమిళనాడులో తదుపరి ఏం జరగనుంది ?

18 Saturday Feb 2017

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

AIADMK, BJP, Congress, DMK, Tamil Nadu

Image result for tamil nadu assembly

సత్య

    తమిళనాడు ముఖ్యమంత్రి ఇకె పళనిస్వామి శనివారం నాడు అసెంబ్లీలో తన ‘బల’ నిరూపణ చేసుకున్నారు. తమిళ మురికి గుంటలో చేపలను పట్టాలని చూసిన బిజెపి, డిఎంకె దాని వెన్నంటి వున్న కాంగ్రెస్‌లకు శృంగభంగమైంది. పళని స్వామి నాయకత్వం రేపేమి చేస్తుంది, పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయి అని ఈ రోజు వూహించటం కష్టం. కొంతమంది వూహలు, వాంఛలకు భిన్నంగా అన్నాడిఎంకెలో మెజారిటీ సభ్యులు శశికళ నాయకత్వంలోని పళనిస్వామికి మద్దతుగా నిలిచారు. కాంపులో వున్న ఎంఎల్‌ఏలు బయటికి వస్తే మరొక కాంపులోకి దూరతారన్న అంచనాలు తారు మారు కావటంతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వున్న డిఎంకె, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌ ఆశలు ఆవిరై సాధారణంగా జరగాల్సిన బలనిరూపణ ప్రక్రియను అపహాస్యం పాలు చేసినట్లుగా కనిపిస్తోంది.

    అసెంబ్లీలో అవాంఛనీయ వుదంతాలు జరగటం తమిళనాడుకు కొత్త కాదు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిని తిరిగి ఎన్నుకోవటం కూడా సామాన్యంగా జరుగుతోంది. దాని కొనసాగింపుగానే శనివారం నాడు కూడా కుర్చీలు లేచాయి, చొక్కాలు చిరిగాయి. ఎంజిరామచంద్రన్‌ ముఖ్యమంత్రిగా మరణించినపుడు ఆయన భార్య జానకిని సిఎంను చేశారు. ఆమె బలనిరూపణ సమయంలో జరిగినదానితో పోలిస్తే శనివారం నాటి సంఘటనలు ఒక లెక్కలోవి కాదు. ఆ రోజు కొందరు గూండాలు అసెంబ్లీలోకి ప్రవేశించి ఎంఎల్‌ఏలను చితకబాదారని, తరువాత పోలీసులు లాఠీ ఛార్జీ చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆరోజు కాంగ్రెస్‌ శాసనసభ్యులు నాటి స్పీకర్‌ చర్యను వ్యతిరేకించారు, దెబ్బలు తిన్నారు. ఇపుడు కూడా అదే జరిగింది. నాటి స్పీకర్‌ పిహెచ్‌ పాండియన్‌ ఇప్పుడు పన్నీరు సెల్వం శిబిరంలో, కాంగ్రెస్‌ వారు ఈసారి వారు డిఎంకె పక్షాన వున్నారు. మీడియాకు ప్రవేశం లేకుండా తలుపులు మూసి నిర్వహించిన బలనిరూపణ ప్రక్రియలో ఏం జరిగిందనేది ఎంఎల్‌ఏలు చెప్పిందే సమాచారం. శాసనసభ్యులు రౌడీల మాదిరి ప్రవర్తించినప్పటికీ వారిని గౌరవించాల్సిందేనని కమల్‌ హసన్‌ వ్యంగ్యంగా అన్నారు. కుష్బూ, సిద్ధార్ధ శశికళ వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు.

   అధికారం తప్ప మరొక పరమార్ధం ఎరుగని పాలక రాజకీయాలు నెరిపే అందునా రాష్ట్రాలలోని కుటుంబపార్టీల ( వాటినింకేమాత్రం ప్రాంతీయ పార్టీలని పిలవాల్సిన అవసరం లేదు) పరిణామాలు ఎటుతిరుగుతాయో తెలియని స్ధితి. స్వాతంత్య్ర వుద్యమానికి సారధ్యం వహించిన పార్టీగా 1947 తరువాత ప్రారంభమైన కాంగ్రెస్‌ను గల్లీ నుంచి ఢిల్లీ వరకు కుటుంబపార్టీగా మార్చివేసేందుకు ప్రయత్నించారు. ఐదుగురికి ఐదూళ్లు కాదు గదా సూది మోపినంత కూడా ఇచ్చేది లేదన్న కౌరవుల మాదిరి వ్యవహరించటంతో దానికి వెలుపల వున్న వారు అధికారం కోసం పడిన తపన అనేక చోట్ల ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి నాంది పలికింది. రాష్ట్రాలు, వాటి సమస్యలపట్ల అవలంభించిన నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రాల అధికారాల కోసమంటూ ప్రారంభమైన పార్టీలు గత నాలుగు దశాబ్దాల కాలంలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీతో అంటకాగటం, తమ అధికారాన్ని నిలుపుకొనేందుకు ఏ పార్టీ వారు వస్తే ఆ పార్టీ వారిని రాష్ట్ర అభివృద్ధి కోసం అనే పేరుతో చేర్చుకోవటం ( ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ది పేరుతో జరుగుతోందనుకోండి) సాధారణంగా మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రాలు-జనం- హక్కులు ఏమీ లేవు. అధికారం-సంపాదన-అధికారం అనే వలయంలో కుటుంబపార్టీలు తిరుగుతున్నాయి.

   ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల హక్కుల పేరుతో రంగంలోకి వస్తే బిజెపి అనేక పార్టీల రంగులు మార్చి(జన సంఘం-జనతా పార్టీ-భారతీయ జనతా పార్టీ) తమ రూటే సపరేటు, కాంగ్రెస్‌కూ మాకూ పోలికే లేదంటూ ముందుకు వచ్చింది. దీనిలో కాంగ్రెస్‌లో, ఇతర ప్రాంతీయ పార్టీలలో వున్న అన్ని అవలక్షణాలతో పాటు అధికారం కోసం అవసరమైతే మతోన్మాదాన్ని, ఘర్షణలను కూడా రెచ్చకొట్టేందుకు వెనుకాడదన్న విమర్శ, వాస్తవం గురించి తెలిసిందే. తమకు లొంగని రాష్ట్ర ప్రభుత్వాల, పార్టీల విషయంలో ఎలా జోక్యం చేసుకుంటున్నది గత మూడు సంవత్సరాలుగా చూస్తున్నదే. గవర్నర్లను ఎలా వుపయోగిస్తున్నదీ తెలిసిందే. కాంగ్రెస్‌ రంగు బయటపడటానికి యాభై సంవత్సరాలు పడితే ఈ పార్టీ అసలు రంగు బహిర్గతం కావటానికి ఐదు సంవత్సరాలు కూడా అవసరం లేదని నిరూపించుకుంది. అంత స్పీడుగా వుంది.

    అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక కావటాన్ని కొంత మంది ప్రశ్నించారు. నిజమే ఆమె జయలలిత స్నేహితురాలిగా తప్ప ఇతరత్రా పార్టీలో ఏమీ కాని మాట నిజమే. అది తప్పయినపుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడి కుమారుడిగా తప్ప లోకేశ్‌ ఏం చేశారని ఏకంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. తెలంగాణాలో తెరాస పరిణామాలను చూసినా అదే వైఖరి కనిపిస్తుంది. జయలలితకు కూడా కుటుంబం వున్నట్లయితే కూతురో కొడుకో నాయకత్వ స్ధానాన్ని ఆక్రమించేవారు. పార్టీకోసం, ప్రజల కోసం ఏ నాడూ ఏమీ చేయని వారు అధికారపీఠం కోసం అర్రులు చాస్తున్నపుడు, ఎవరినైనా ఆమోదించే స్ధితిలో జనం వున్నపుడు జయలలిత మేనకోడలిగా తాను కూడా ఎందుకు ప్రయత్నించకూడదని దీపా జయకుమార్‌ ప్రయత్నించటంలో ఆశ్చర్యం ఏముంది.

    ప్రజాస్వామ్యం పదికాలాలపాటు బతికి బట్టకట్టాలంటే ఇలాంటి పరిణామాలను జనం సహించాలా ? అనేక కారణాలతో వ్యతిరేకించటం లేదన్నది వాస్తవం. కాంగ్రెస్‌ అనుసరిస్తున్న విధానాలనే బిజెపి, ఇతర ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్నా ప్రశ్నించే ధోరణి వ్యక్తం కావటం లేదు. అందుకే వాటి మధ్య విధానాల మీద రాజీ- అధికారం కోసం కుమ్ములాటలు తప్ప ఎలాంటి పేచీ వుండటం లేదు. మన చేత్తో మన కంటినే పొడుచుకుంటున్నామని గుర్తించే రోజు వచ్చినపుడే వుప్పు-కప్పురాలకు తేడా తెలుసుకోగలుగుతాము. కమ్యూనిస్టు పార్టీలు చిన్నవిగా వున్నా, కొన్ని చోట్ల అధికారానికి వచ్చినా ఎక్కడా ఇలాంటి అవలక్షణాలు ఆ పార్టీలలో కనిపించటం లేదు. అవినీతి, అక్రమాల గురించి వేలెత్తి చూపటానికి లేదు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా సైద్ధాంతిక , విధానాల ప్రాతిపదికగా అవినీతి రహిత పార్టీలు, శక్తులను ఎంచుకొనే క్రమాన్ని ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు వేగవంతం చేయటం అనివార్యం.

    ప్రతి రాష్ట్రంలో జరిగే ప్రతి రాజకీయ పరిణామం ఒక గుణపాఠం నేర్పుతూనే వుంది. జయలలిత మరణంతో అన్నాడిఎంకె నాయకత్వ సమస్యను ఎదుర్కొన్న తరుణంలో ఆమెకు కేవలం స్నేహితురాలిగా, అక్రమ సంపాదనలో తోడుగా వున్న శశికళ పగ్గాలు చేపట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమై అనూహ్య పరిణామాల మధ్య ఆమెకు శిక్ష పడి జైలు పాలయ్యారు. సమీప భవిష్యత్‌లో ఆమె చట్ట సభలకు పోటీ చేసే అవకాశం లేకపోవటంతో ఇతరులతో కథ నడిపించాల్సి వుంది. మరో నాలుగు సంవత్సరాల పాటు కొనసాగాల్సిన అసెంబ్లీ పూర్తికాలం నడుస్తుందా, అధికారం కోసం ఆతృపడుతున్న డిఎంకె, కాంగ్రెస్‌ కూటమి దానిలో చీలిక తెచ్చి ఆ వర్గం మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అన్నది సమస్య. కేంద్రంలో బిజెపి అధికారంలో వుంది. తన స్ధానాన్ని పటిష్టపరచుకోవాలంటే ఏ గడ్డి కరవటానికైనా వెనుకాడటం లేదని అనేక రాష్ట్రాలలో దాని చర్యలను చూస్తే అర్ధం అవుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వాటిని బట్టి ఏరాష్ట్రాన్ని ఎలా మింగాలో ఆ పార్టీ నిర్ణయించుకుంటుంది. అసాధారణ సంక్షోభం తలెత్తితే తప్ప ఆరునెలల వరకు పళనిస్వామి మరోసారి బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక వేళ అటువంటి పరిస్థితిని ప్రత్యర్ధులు తెచ్చిపెడితే అసెంబ్లీ రద్దుకు ఆదేశించి రాజకీయాలను మరోమలుపు తిప్పినా ఆశ్చర్యం లేదు.

   అన్నాడిఎంకెలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పని చేసిన పన్నీరు సెల్వం సామర్ధ్యంగల నేత అని గతంలో ఎవరూ చెప్పలేదు, భవిష్యత్‌లో చెప్పే అవకాశమూ వుండదు. అతని అధ్యాయం ముగిసిందని చెప్పవచ్చు. పన్నీరు సెల్వాన్ని అడ్డం పెట్టుకొని కథనడింపించాలని చూసిందనే విమర్శలు ఎదుర్కొన్న బిజెపి ఇప్పుడు మరోదారి చూసుకుంటుంది. డిఎంకెతో అంటకాగి అన్నాడిఎంకెను దెబ్బతీసినా ఆశ్చర్యం లేదు. లేదా ఎన్నికలకు సమయం వుంది కనుక రజనీకాంత్‌ వంటి మరొక సినిమా నటుడిని రంగంలోకి తెచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోనూ వచ్చు. అన్నా డిఎంకెలో శశికళ స్ధానంలో మరో నూతన అధికార కేంద్రం ప్రారంభం కావచ్చు, ఆ పార్టీలో మరో సంక్షోభం అంటూ తలెత్తాలంటే పళని స్వామికి మరో విభీషణుడు తయారు కావాలి. లేదా మరో రెండు సంవత్సరాలు కచ్చితంగా అధికారంలో వుండే బిజెపి ముందు పొలోమంటూ లొంగిపోయి, ప్రతిపక్ష డిఎంకె నుంచి రక్షణ అయినా పొందవచ్చు. డొల్లుపుచ్చకాయల వంటి ప్రాంతీయ, కుటుంబపార్టీలు ఎప్పుడేం చేస్తాయో ఎవరు చెప్పగలరు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నిస్సహాయత + అసహనం = చంద్రబాబు

11 Saturday Feb 2017

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

chandababu, chandrababu fire on media, Intolerent chandrababu naidu, Media

Image result for Incapable,Intolerance chandrababu naidu

ఎం కోటేశ్వరరావు

    అసహనం ! అసహనం !! అసహనం !!! సహనానికి మారుపేరైన మన దేశం, అక్షర క్రమంతో పాటు సహనంలో కూడా అగ్రస్ధానంలో వున్న ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు అసహనం అనే మందుపాతర మీద వున్నదా అనిపిస్తోంది. ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు అన్నట్లు సామాజిక, రాజకీయ, ఆర్ధిక ఒకటేమిటి అన్ని రంగాలు, స్త్రీ, పురుష బేధం లేకుండా ఎక్కడబడితే అక్కడ అన్ని చోట్లా పెరుగుతున్న అసహనం ఎలాంటి పర్యవసానాలకు దారితీయనుందో !

    అసహన రాజకీయాలు ప్రపంచానికి ముప్పు తెస్తున్నాయని 90దేశాల పరిణామాలను పరిశీలించిన మానవ హక్కుల నిఘా సంస్ధ జనవరిలో విడుదల చేసిన తన వార్షిక నివేదికలో ప్రకటించింది. అమెరికా, ఐరోపాలో ప్రజాకర్షక ధోరణి పెరుగుదల ప్రపంచంలో నియంతృత్వ నేతలను ప్రోత్సహించటం, బలిష్టం కావిస్తోందని కూడా హెచ్చరించింది.వేళ్లమీద లెక్కించగలిగిన ప్రపంచ బడా కార్పొరేట్లు, వాటి లాభాల కోసం కొన్ని ధనిక దేశాలు అనుసరిస్తున్న దివాళాకోరు విధానాల పర్యవసానంగా ప్రపంచం మొత్తం అభివృద్ధికి ఎదురుగాలి వీస్తున్నది. సంక్షోభం అంటు వ్యాధిలా వ్యాపిస్తున్నది.

   అధికారమే పరమావధిగా ఏ అడ్డదారి తొక్కేందుకైనా సిద్ధం సుమతీ అన్నట్లు వుండే రాజకీయ పార్టీల, నేతల ప్రజాకర్షక నినాదాలు, చర్యలు ప్రకటించటాన్ని ఒలింపిక్స్‌లో చేరిస్తే మనకు అన్ని పతకాలు రావటం ఖాయం. తీరా అధికారానికి వచ్చాక వారి అసలు రంగు బయటపడుతోంది.తాబేలు నడక, ప్లేటు ఫిరాయించటం, చెప్పినవాటిని అమలు జరపమని ఎవరైనా అడిగితే వారిపై తాసుపాములా కస్సుమంటూ లేస్తున్నారు. ప్రశ్నించే తత్వాన్ని ఏ మాత్రం సహించలేక దురుద్ధేశ్యాలను ఆపాదించి అధికార దర్పంతో నోరు మూయించాలని చూస్తున్నారు. రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల పరిధి దాటి జర్నలిస్టులకు సైతం రాజకీయ అనుబంధాలు, వుద్ధేశ్యాలను ఆపాదించి అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇది ప్రమాదకర పోకడ, గర్హనీయం కాదా ?

   విద్యా గంధం ఇచ్చే అత్యున్నత ఫలితం సహనం అని ప్రముఖ మానవతావాది హెలెన్‌ కెల్లర్‌ చెప్పారు. అది ఎంత మందిలో ప్రతిబింబిస్తున్నది అన్నది ప్రశ్న. ఒక కేసులో మన సుప్రీం కోర్టు మరో విధంగా చెప్పింది. అసహనం ప్రజాస్వామ్యానికేగాక వ్యక్తులుగా వారికి కూడా ఎంతో ప్రమాదకరం అని వ్యాఖ్యానించింది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలని సలహా ఇచ్చింది.

    అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్‌ వరకు ఎన్నికలు జరిగిన ప్రతి చోటా ప్రజాకర్షక వాగ్దానాల వరదలు వెల్లువెత్తుతున్నాయి. మచ్చుకు, ఫిలిప్పీనియన్ల జీవితాలను దుర్భరంగా మార్చివేసిన వారందరినీ అంతం చేయండి అంటూ ఎన్నికల ప్రచారంలో జనాన్ని రెచ్చగొట్టిన రోడ్రిగో డార్టే ఆదేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తాను అధికారంలోకి వస్తే అమెరికాలో వుద్యోగాలు అమెరికన్లకే, అమెరికాలో వుత్పత్తి చేయకుండా బయటి నుంచి దిగుమతులు చేసుకొంటే వాటిపై పెద్ద మొత్తంలో పన్ను విధిస్తా, బయటి దేశాలలో పని చేయించే కంపెనీలపై జరిమానాలు వేస్తా అంటూ వాగ్దానాలు చేసిన డోనాల్ట్‌ ట్రంప్‌ కూడా అధ్యక్షుడయ్యాడు. రాష్ట్రాన్ని ఒక పద్దతి ప్రకారం చీల్చకుండా అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్‌ మీద కారాలు మిరియాలు నూరుతూ వూరూ వాడా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఆయన మిత్రపక్షం బిజెపి, వారిద్దరి మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ గురించి తెలిసిందే.

   బాబొస్తే జాబొస్తుందన్న నినాదం గురించి చెప్పనవసరం లేదు. ప్రత్యేక హోదా గురించి స్వయంగా నరేంద్రమోడీ ఇక వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు చేసిన హడావుడి, వేస్తున్న పిల్లి మొగ్గలూ అన్నీ ఇన్నీ కాదు. ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అక్కడ నరేంద్రమోడీ ప్రధాని, వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి అయ్యారు. వీరందరూ రాజకీయాల్లో, పాలనా వ్యవహారాలలో ముదుర్లు తప్ప లేగ దూడలు కాదు. అందుకే తరువాత చూసుకోవచ్చు లెమ్మని ప్రత్యేక హోదావంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించి జనంపై ఎదురుడాడికి దిగారు.

    చంద్ర ‘బాబా ‘ తత్వశాస్త్రం ప్రకారం కేంద్రంపై పోరాటం చేస్తే పోలవరం వంటి ప్రయోజనాలు దెబ్బతింటాయి. ప్రత్యేక హోదా బదులు పాకేజి తీసుకోవటం మెరుగు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అని పెద్దలు చెప్పారు గానీ అది చివరికి ఎదురు తన్నుతుంది. అధికారానికి వచ్చిన తరువాత అమెరికాలో ట్రంప్‌ కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అవి అసంగతమైనవని, ఆ చర్యలతో అమెరికాను అస్తవ్యస్ధతలోకి నెట్టారని, ఒక వ్యక్తి దేశాన్ని ఎలా నాశనం చేస్తాడో ఒక వుదాహరణగా మారాడని, పిచ్చివాడి చేతిలో రాయి మాదిరి జనం అధికారాన్నిచ్చారని, ఒక జోకర్‌గా ట్రంప్‌ తయారయ్యాడని చంద్రబాబు వివిధ సందర్బాలలో వ్యాఖ్యానించారు. జనం సొమ్మును అప్పనంగా ఖర్చు చేసి నేతల కీర్తి కండూతి కోసం మహిళా సాధికారత పేరుతో ఏర్పాటు చేసిన సదస్సును దలైలామాతో ప్రారంభోత్సవం చేయించారు.

    ఈ రెండు చర్యలు ‘బాబా ‘ గారి లాజిక్కుకు విరుద్దమే కాదు, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు హాని కలిగించేవి. ట్రంప్‌ మరో నాలుగు సంవత్సరాలు అధికారంలో వుంటారు. అలాంటి వ్యక్తిని పిచ్చివాడని, అమెరికాను నాశనం చేస్తున్నాడు, జోకర్‌ అని విమర్శించిన తరువాత అమెరికా నుంచి లేదా అమెరికా కంపెనీలున్న మలేషియా తదితర దేశాల నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయి. తనను అంత తీవ్రంగా విమర్శించిన నేత పాలకుడుగా వున్న రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే అమెరికాలో స్ధిరపడిన ప్రవాస ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భక్తులు పెట్టే పెట్టుబడుల గురించి ట్రంప్‌ ప్రభుత్వం సహిస్తుందా ? దలైలామా చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి మన దేశంలో ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యక్తి. అలాంటి పెద్దమనిషిని పిలిచి పెద్ద పీట వేస్తే గతంలో చంద్రబాబు చేసిన చైనా పర్యటనలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు చేసిన యత్నాలు ‘పవిత్ర సంగమం’ (కృష్ణా నది)లో పోసినట్లే కదా ! ఎందుకిలా ప్రవర్తిస్తున్నట్లు ? దలైలామాను పిలిచినందువలన మీడియాలో వార్తలు తప్ప పైసా ప్రయోజనం వుంటుందా ? చైనా కంపెనీలు ఒకటికి రెండుసార్లు వెనుకా ముందూ ఆలోచించవా?

   రాష్ట్రానికి ప్రత్యేక హోదా వర్తింప చేయటానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నాన్చి, నాన్చి రెండు సంవత్సరాల తరువాత ఇచ్చేది లేదని కరాకండిగా చెప్పేసింది. దానికోసం పోరాడతానని చెప్పిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానాలు చేయించారు. తీరా హోదా లేదు పాకేజి ఇస్తామని చెప్పగానే అందని ద్రాక్ష పుల్లన అన్న నక్క సామెత చందాన హోదా వలన ప్రయోజనం లేదు, అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు తెచ్చే పాకేజి ఎంతో ముద్దు అని కొత్త పల్లవి అందుకున్నారు.పనికిరాదని ముందే తెలిసినపుడు ఎన్నికలలో వాగ్దానమెందుకు? అసెంబ్లీ తీర్మానాలెందుకు? హోదా బదులు పాకేజీకి ఆమోద ముద్ర కోసం పోరాడాలని ఎంపీల సమావేశాలలో వుద్బోధలెందుకు ? ప్రతి నెలా జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశాలలో తెలుగు దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నట్లు ?

    పవిత్ర సంగమం ప్రాంతంలో ఏర్పాటు చేసిన జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ప్రధాని నరేంద్రమోడీ వస్తారని అయన కోసం ఎయిర్‌ కండిషన్ల మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయించారు చంద్రబాబు. ప్రధాని రావటం లేదని, కేవలం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడతారని ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం. చివరికి అదేమీ లేకపోగా ఏ కార్యక్రమాలూ లేకపోతే ఆకాశవాణిలో ప్రసారం చేసే ‘నిలయవిద్వాంసుల’ సంగీత కార్యక్రమాల మాదిరి వెంకయ్య నాయుడిని పంపారు. ప్రత్యేక హోదాను నిరాకరించిన తరువాత రాష్ట్రానికి రావటానికి నరేంద్రమోడీ జంకుతున్నారా ? వీడియో కాన్ఫరెస్సులో మాట్లాడకపోతే పోనీ రికార్డు చేసిన సందేశం పంపటానికి కూడా మోడీ తిరస్కరించారంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడి పలుకుబడి ఏపాటిదో అర్ధం కావటం లేదా ?

    హోదా లేదన్నా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు దానికి కూడా సహనంతో సర్దుకు పోతున్నారు. పోనీ పాకేజీని అయినా కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందా అంటే నెలలు గడుస్తున్నా ఇంతవరకు దాని ప్రస్తావనే లేదు. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా తయారైన స్ధితిలో వాటి గురించి అడగటమే పాపమన్నట్లుగా అటు వెంకయ్య నాయుడు, ఇటు చంద్రబాబు నాయుడు చిందులు వేస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా హోదా గురించి అడిగింది మేము మాత్రమే, మిగతావారెవరూ మాట్లాడలేదు, ఇప్పుడు మేమే అవసరం లేదంటున్నాము, అప్పటి మాదిరి ఇపుడు కూడా మిగతావారంతా నోర్మూసుకోవాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్యంలోనా లేక నందంటే నంది పందంటే పంది అనక తప్పని నిరంకుశపాలనలో చెవుల్లో పూలు పెట్టుకొని వున్నామా ?

   గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా ఆయన ప్రభుత్వం పట్ల మీడియా వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. తన విధానాలను విమర్శించే లేదా పదే ప్రశ్నించే రెండు పత్రికలను, ఛానళ్లను లక్ష్యంగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ముద్రవేసి శత్రుపూరితంగా ఆయన వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తనకు నచ్చని ఛానళ్లు పత్రికలకు, ఇబ్బంది కలిగించే ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులకు పార్టీల ముద్రవేసి అదేపని చేస్తున్నారు. తటస్ధ వైఖరి తీసుకొనే మీడియా సంస్ధల జర్నలిస్టులే ప్రశ్నలు అడగాలని నిర్ధేశిస్తున్నారు. మీడియా తటస్ధత అంటే ఒక సంఘటన, ఒక అభిప్రాయం, అంశంపై ఒకే వైఖరిని పాఠకుల ముందుంచటంగాక అన్ని రకాల అభిప్రాయాలకు తగు స్ధానం కల్పించి అందచేయటం తప్ప విమర్శనాత్మక ప్రశ్నలు అడగకూడదని అర్ధం కాదు.

     చంద్రబాబు తత్వశాస్త్రం ప్రకారం తటస్థం అంటే ఏం జరిగినా నోరు మూసుకోవాలని చెప్పటమే. తటస్ధ మీడియా సంస్ధల జర్నలిస్టులను కూడా చంద్రబాబుతో సహా ఏ ముఖ్యమంత్రీ సహించటం లేదు. మీడియా సమావేశంలో ఏదైనా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగితే సదరు విలేకరి వార్త ఇచ్చేందుకు కార్యాలయానికి వెళ్లక ముందే సంపాదకుడు లేదా యాజమాన్య ప్రతినిధికి సచివాలయం నుంచి ఫోన్లు వెళ్లటం, ప్రకటనలను మరిచి పోవాల్సి వస్తుందని హెచ్చరించటం – వారు విలేకరికి తలంటించటం, వుద్యోగం నుంచి వుద్వాసనకు హెచ్చరికలు బహిరంగ రహస్యం. లాభాల కోసం రంగంలోకి వచ్చిన మీడియా సంస్ధలు చచ్చిన చేపల మాదిరి వాలునబడి పోతాయి తప్ప తటస్థంగా ఎ్కడుంటాయి ? వుద్యోగ భద్రత లేని కారణంగా అనేక మంది బలవంతంగా మౌనంగా సహిస్తున్నారు తప్ప జర్నలిస్టులందరూ ఆ స్థితికి చేరలేదు. ప్రజలకు వుపయోగపడతాయనుకున్న అంశాలను వెలికితీయటం, పాలకులుగా వున్న వారిని ప్రశ్నించే యావ, చేవ ఇంకా సజీవంగానే వుంది. అది లేని వారు యజమానులతో ప్రత్యక్ష సంబంధాలున్న రాజకీయనేతలో, యజమానో అధికారో చెప్పింది రాసుకొనే షార్ట్‌ హాండ్‌ గుమస్తాలు తప్ప జర్నలిస్టులు కారు. అటువంటి స్ధితి ప్రజాస్వామ్యానికి, జనస్వామ్యానికి ముప్పు.

     తటస్థం అని చెప్పుకొనే మీడియా సంస్ధల యాజమాన్యాలకు రాజకీయపార్టీలతో వున్న సంబంధాలు బహిరంగ రహస్యం. అనేక మంది పెట్టుబడులు వాటిలో వున్నాయి, అందువలన తెలుగు నేలపై అలాంటి తటస్థ మీడియా ఎక్కడ వుందనేది పెద్ద ప్రశ్న. ప్రశ్నించిన విలేకరులు, మీడియా సంస్ధలపై వైఎస్‌, చంద్రబాబు, వెంకయ్య నాయుడు వంటి వారు విరుచుకుపడినపుడు సీనియర్‌ జర్నలిస్టులు కూడా మౌనం దాల్చటానికి పూర్వరంగమిదే. పోనీ ఈ మౌనం వలన జర్నలిస్టులు బావుకుంటున్నదేమైనా వుందా అంటే అదీ లేదు. తమకు చట్టపరంగా రావాల్సిన వేతన భత్యాలను పొందుతున్న జర్నలిస్టులు ఎంత మంది వున్నారు. అసలు చట్టాలే అమలు జరగటం లేదు, వాటిని అమలు జరపాల్సిన ప్రభుత్వాలు యజమానుల కొమ్ము కాస్తున్నాయి. కాంగ్రెస్‌ పాలనలోగానీ తెలుగుదేశం పాలనలో గానీ ముఖ్య మంత్రులుగా వున్న వారు కొన్ని సంస్ధలపై విరుచుకుపడి వాటి ఆర్ధిక మూలాలను దెబ్బతీయటానికి ప్రయత్నించారే తప్ప జర్నలిస్టులకు అమలు చేయాల్సిన చట్టాల అమలుకు ఒక్కటంటే ఒక్క చర్యకూడా తీసుకున్న పాపాన పోలేదు. కార్మిక శాఖ అధికారులు ఎన్ని మీడియా కార్యాలయాలను సందర్శించారు, చట్టాల అమలును పర్యవేక్షించారో చెప్పమనండి. జర్నలిస్టుల వేతన చట్ట అమలు గురించి సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్నది.

     చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చి మూడో సంవత్సరం త్వరలో పూర్తికానుంది. ఇంతవరకు జర్నలిస్టుల సమస్యలపై అధికారికంగా యూనియన్‌ ప్రతినిధులతో ఒక్కటంటే ఒక్క సమావేశం కూడా జరిపి సాధకబాధకాలను చర్చించలేదు. అక్రమాలను వెలుగులోకి తెస్తున్న అనేక మంది విలేకర్లపై అధికారపక్ష శాసనసభ్యులు, వారి దగ్గరి బంధువులు దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారిని నియంత్రించటం లేదు, జర్నలిస్టులపై దాడుల నివారణకు ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేయటానికి సర్కార్‌కు రెండున్నర సంవత్సరాలకుపైగా పట్టింది, ఇంతవరకు ఒక్క సమావేశం కూడా జరపలేదు. ప్రెస్‌ అకాడమీ కూడా అంతే. చైర్మన్‌ నియామకం జరిపారు, పాలకవర్గాన్ని వేయలేదు, ఎలాంటి కార్యకలాపాలను ప్రారంభించలేదు. జర్నలిస్టుల సంక్షేమం గురించి ఇంత వరకు అసలు కమిటీ నియామకమే జరపలేదు. ఎందుకని ?

    అసహనాన్ని వ్యక్త పరిచేందుకు తెలుగులో ఒక సామెత వుంది. అదే మంటే నిస్సహాయతతో ‘ అత్తమీది కోపం దుత్తమీద చూపినట్లు ‘. రాజకీయ చాణుక్యుడిగా పిలిపించుకున్న చంద్రబాబు నాయుడి పరిస్థితి అలాగే వుందా అనిపిస్తోంది.అంతర్జాతీయ విషయాలపై స్పందన అడిగినపుడు మాదీ ప్రాంతీయ పార్టీ అంతర్జాతీయ విషయాలెందుకు బ్రదర్‌ అనే వారు. అలాంటిది ట్రంప్‌పై అసాధారణ వ్యాఖ్యలు చేయటాన్ని చూస్తే చంద్రబాబు బుర్ర ఎంతగా కలవర పడుతోందో అర్ధం చేసుకోవచ్చు. ఎపుడైనా ఇబ్బందికర ప్రశ్నలు ఎదురైనపుడు గతంలో నో కామెంట్‌ (వ్యాఖ్యానించదలచలేదు) అని తనదైన శైలిలో కన్నుగీటుతూ తప్పించుకొనే వారు. దాంతో విలేకరులు కూడా అంతకు మించి అడిగేవారు కాదు. కానీ ఇప్పుడు అలాంటి ప్రశ్న వస్తే వెంటనే ముందు నువ్వు ఏ పత్రిక, ఏ ఛానల్‌ అని అడుగుతున్నారు. దానిని బట్టి స్పందిస్తున్నారు. విశాఖలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ‘ప్రజాశక్తి’ విలేకరిపై విరుచుకుపడుతూ చేసింది అదే. ఆల్‌ఇండియా, ప్రపంచ స్ధాయిలో ఎందరో జర్నలిస్టులను చూశానని చెప్పిన చంద్రబాబు ఆ స్ధాయిలో వ్యవహరించి వుంటే ఆయనకు హుందాగా వుండేది. అలా చేయకపోవటం విచారకరం. ఏ జాతీయ, అంతర్జాతీయనాయకుడు ప్రశ్న అడిగిన వారిని నువ్వు ఏ సంస్ధ ప్రతినిధివి అని అడిగి రాజకీయ అనుబంధాన్ని అంటగట్టిన వుదంతం మనకు కనపడదు.

    అంతెందుకు ఆ రెండు పత్రికలు, ఛానల్స్‌ అంటూ కయ్యం పెంచుకున్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన కుటుంబ సభ్యులతో స్వయంగా ప్రారంభింప చేయించిన పత్రిక, టీవీ ఛానల్‌లో తాను వ్యతిరేకించిన మీడియా సంస్ధల నుంచి వచ్చిన వారినే జర్నలిస్టులుగా నియమించారు. జర్నలిజాన్ని ఒక వృత్తిగా ఎంచుకున్నవారికి విధి నిర్వహణ ముఖ్యం. వారు కూడా పౌరులే కనుక ఏ రాజకీయ అభిప్రాయాలనైనా కలిగి వుండవచ్చు.యాజమాన్యాల ఆదేశాల మేరకు పని చేసి వుండవచ్చు. అంతమాత్రాన పని చేసే సంస్ధను బట్టి రాజకీయాలు, వుద్దేశ్యాలను అపాదించటం తగని పని. ఆ మాటకు వస్తే ఇతర పార్టీల నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన వారి రాజకీయాల సంగతేమిటి ?

అనేక దేశాలు రక్షణాత్మక చర్యలలో భాగంగా తమ దేశాల నుంచి పెట్టుబడులు బయటకుపోకుండా చర్యలు తీసుకోవటంతో పాటు తామే ఆకర్షించుకొనేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. మీ ఇంటి కొస్తే మాకేం పెడతావ్‌ మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మన దేశంలో రాష్ట్రాలు అంతకంటే ఎక్కువగా రాయితీలతో పోటీ పడుతున్నాయి. అందువలన విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి వస్తాయని చెబుతున్న లక్షల కోట్ల పెట్టుబడుల పరిస్థితి అగమ్యంగా వుంది. విభజన సమయంలో ఇస్తామన్న ప్రత్యేక హోదా లేదు, దాని బదులు అంతకంటే మెరుగ్గా ఇస్తామన్న ప్రత్యేక పాకేజి బ్రహ్మపదార్ధంగా మారింది. నిజానికి అలాంటి ప్యాకేజీలు ప్రకటించటానికి కేంద్రానికి అసలు అధికారాలేమిటో ఎవరైనా చెప్పగలరా ?

   కన్నుగీటితే చాలు కాసుల వర్షం అన్నట్లుగా రాష్ట్రానికి పెట్టుబడుల వరదలు వస్తున్నాయని, వాణిజ్యం చేసేందుకు అగ్రపీఠీన అత్యంత అనుకూల స్ధానంలో వున్నామని నిత్యం ఏదోఒక చోట సంతోషంతో విజయగాధలు వినిపిస్తున్న స్ధితిలో తమ అజెండాలోని వాటి గురించే ఒక చిన్న ప్రశ్న అడిగినా భరించలేని అసహనం ఎందుకు ? దేశ, విదేశాలు తిరిగి ఎంతో అనుభవం గడించిన చంద్రబాబుకు ఈ విషయాలేవీ తెలియవా ? రాష్ట్రంలో జనంలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లబరచటానికి ఏదో ఒక రాజకీయం చేయాలి, లోపల ఏమున్నా పైకి నటించాలి. కేంద్రం నుంచి ప్రచారం చేసిన మాదిరి సాయం రాదని తేలిపోయింది. మాటలతో ఎక్కువ కాలం గడపటం కష్టం. అనేక రంగాలలో పురోగతి లేమి దాంతో ఒకవైపు నిస్సహాయత, దాన్నుంచి మరోవైపు తలెత్తుతున్న అసహనం అన్నీ కలిస్తే చంద్రబాబు అని చెప్పవచ్చు.

     అందుకే ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి, కాంగ్రెస్‌, వామపక్షాలు, చివరికి ప్రశ్నించే జర్నలిస్టులు ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేకపోవటానికి కారణమిదే ! ఇప్పుడున్న స్ధితిలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని ప్రతిపక్షాన్ని చూసి భయపడాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు, ఏ రోజు ఏ ఎంఎల్‌ఏను తమ నుంచి తీసుకుపోతారో అని ప్రతిపక్షమే భయపడే స్ధితి. జనానికి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలను, వివిధ తరగతులపై జరుగుతున్న దాడులను ఎవరు ప్రతిఘటించాలి? ఎవరికి వారు ఏదో ఒక కారణం వెతుక్కొని నా వరకు వచ్చినపుడు కదా చూసుకోవచ్చు అనుకొనే వారికి జర్మన్‌ రచయిత మార్టిన్‌ నిమోలియర్‌ నాజీల గురించి రాసిన ప్రఖ్యాత కవితను గుర్తు చేయటం అవసరం.

వారు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు- నేను కమ్యూనిస్టును కాదు కనుక మాట్లాడలేదు

తరువాత కార్మికనేతల కోసం వచ్చారు -నేను కార్మికనేతను కాదు కనుక మిన్నకున్నాను

తరువాత యూదుల కోసం వచ్చారు -నేను యూదును కాదు కనుక నోరు విప్పలేదు

తరువాత నాకోసం వచ్చారు – నోరు విప్పేందుకు అప్పటికి నా వెనుక ఎవరూ లేరు

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భారాల పెంపు తప్ప జనానికి వుపశమనం లేని బడ్జెట్‌

04 Saturday Feb 2017

Posted by raomk in Current Affairs, Economics, employees, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Budget 2017-18, Central budget 2017, Demonetisation, Economic Survey, GST

Image result for Budget 2017-18 Imposes Further Burdens, no relief on the People

ఎం కోటేశ్వరరావు

     ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అన్నట్లుగా ఇప్పుడు ప్రతి రోజూ బడ్జెట్‌ రోజుగా మారిపోయింది. మనకు బడ్జెట్‌ అంటే బ్రిటీష్‌ వారి సాంప్రదాయ ప్రకారం ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రారంభం అవుతుంది. ఏం మే ఒకటవ తేదీ నుంచి ఎందుకు ప్రారంభం కాకూడదు అని ఎవరైనా వాదనకు దిగితే విబేధించేందుకేమీ వుండదు. సాంప్రదాయానికి భిన్నంగా రుతువుకు ముందే కూసిన కోయిల మాదిరి కేంద్ర బడ్జట్‌ ఒక నెల ముందుగానే వచ్చింది. ఏడాదికి ఒకసారి దేశ సంపద పంపిణీకి చేసే కసరత్తే బడ్జెట్‌. ఇది సామాన్యులకు ఒక పట్టాన అంతుపట్టదు. మేథావుల తరగతిలో ఎంత మందికి అర్ధం అవుతుందన్నది పెద్ద ప్రశ్న. లెక్కించే పద్దతులలో తేడాలు, లోపాలు వున్నాయనే విమర్శలు, ఆరోపణలు ఎలా వున్నప్పటికీ మన దేశంతో సహా ప్రపంచమంతటా అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయన్నది పచ్చి నిజం.దవోస్‌లో ప్రపంచ కార్పొరేట్ల సమావేశాల సందర్భంగా ఆక్స్‌ఫామ్‌ అనే సంస్ధ విడుదల చేసిన వివరాల ప్రకారం ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకెర్‌బర్గ్‌ సంపద ఎంత అంటే మన దేశంలో 40శాతం మంది పేదల సంపదకు సమానం. మన దేశంలోని రిలయన్స్‌ కంపెనీ అన్నదమ్ములలో పెద్ద వాడైన ముఖేష్‌ అంబానీ దగ్గర 30శాతం మంది సంపదకు సరిపడా వుంది. గత 70 సంవత్సరాలుగా మంచి, పురోగామి బడ్జెట్‌నే ప్రవేశపెట్టామని అధికారంలో కాంగ్రెస్‌, జనతా, బిజెపి ఇలా ఎవరున్నా ప్రకటించిన విషయం తెలిసిందే. మరి అదే వాస్తవమైతే దేశంలో అసమానతలు ఇంతగా ఎందుకు పెరిగాయి? ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని అబద్దాలు చెబుతున్నా మేథావులు అర్ధం చేసుకోలేకపోతున్నారా లేక అర్ధమై తాము కూడా ఏనాటికైనా అంబానీలం కావాల్సిన వారిమే కనుక ఈ విధానాన్ని ప్రశ్నించటం, తప్పుపట్టకూడదనుకొని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా ?

   ఎన్‌డిఏ ప్రభుత్వం 2017-18 సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. దాని మీద చర్చలు జరుగుతాయో, అసలు పార్లమెంట్‌ సమావేశాలే పద్దతిగా నడుస్తాయో లేదో తెలియదు. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో వడ్డిస్తున్న విధానం నుంచి మరలి గత రెండున్నర సంవత్సరాలుగా పారదర్శకమైన పద్దతిని పాటిస్తున్నట్లు మోడీ సర్కార్‌ బడ్జెట్‌లో పేర్కొన్నది. ఇప్పటికీ నరేంద్రమోడీని అభిమానిస్తున్నవారు మాకు కనిపిస్తోంది, మాకు కనిపిస్తోందని చెబుతున్నారు కనుక పుణ్యాత్ములకు మాత్రమే కనిపించే దేవతా వస్త్రాల వంటిదే ఇది అనుకోవాలి మరి. దూడగడ్డి కోసం తాడి చెట్టు ఎక్కామని చెప్పినట్లుగా ఒక నెల ముందుగానే బడ్జెట్‌ ప్రవేశ పెట్టటం గురించి అధికారపార్టీ సమర్ధన వుంది. బడ్జెట్‌ను ముందుగానే ప్రవేశ పెట్టనున్నట్లు గతేడాది సెప్టెంబరులోనే చెప్పామని, దీని వలన ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి పెట్టుబడుల చక్రం తిరగటం ప్రారంభమౌతుందని సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అదే అయితే ప్రతి ఏడాది ఫిబ్రవరేం ఖర్మ జనవరిలోనే ప్రవేశపెట్టి ఫిబ్రవరి నాటికి ఆమోదం పొందితే ఇంకా స్పష్టత వచ్చి ‘పెట్టుబడుల చక్రం ‘ పూర్తి స్ధాయిలో వేగంగా తిరుగుతుంది, రాష్ట్రాలకు వచ్చే నిధులేమిటో రానివేమిటో మరింత స్పష్టమై వాటి బడ్జెట్లను మరింత స్పష్టంగా రూపొందించుకోవటం కుదురుతుంది కదా ! అలా చేస్తే ఎవరు వద్దన్నారు ? కడుపులో దుష్ట ఆలోచన పెట్టుకొని పిల్లా గడ్డికొస్తావా అన్నట్లుగా ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల ప్రచారం కోసమే ఇది అన్నది అందరికీ తెలిసిన అసలు విషయం. కేంద్ర సర్కార్‌ పారదర్శకత బండారమిది.

    ఇక బడ్జెట్‌ తీరు తెన్నులు చూస్తే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్నట్లుగా వుంది. కోర్టుకు చెప్పినట్లు ఏప్రిల్‌ ఒకటి నుంచి పెట్టుబడుల చక్రం తిరగటానికి దోహదం చేసే ఎలాంటి విప్లవాత్మక విధాన ప్రకటనలేమీ లేవు. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా బడ్జెట్‌ను ఒక ప్రహసనంగా మార్చివేశారు. నరేంద్రమోడీ సర్కార్‌ గురించి చెప్పాల్సిన పనేలేదు. ప్రత్యామ్నాయ పద్దతి లేకుండా ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసింది. ఈ ప్రభుత్వానికి ప్రతి దినమూ బడ్జెట్‌ రోజే. అందుకే ఈ మధ్య ఏ ఒక్క వాణిజ్య సంస్ధ కూడా బడ్జెట్‌ వస్తోంది ముందుగానే వస్తువులు కొనుక్కోండి అని ప్రకటనలు గుప్పించటం లేదు. బడ్జెట్‌, పార్లమెంటు ఆమోదంతో పనేమీ లేకుండానే ముందే విధాన ప్రకటనలు, పన్నులు, భారాలను వడ్డించి చూశారా భారాలు లేని బడ్జెట్‌ ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారు. తాజా బడ్జెట్‌ కూడా అంతే. ఆర్ధిక మంత్రి ప్రసంగంలో డిజిటల్‌ ఎకానమీ అనే అంశం తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదంటే అతిశయోక్తి కాదు. గతేడాది బడ్జెట్‌కు ముందు అంటే 2015 నవంబరులో కేంద్ర ప్రభుత్వం పది హేను రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ పెద్ద విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. తరువాత జనవరిలో స్టార్టప్‌, స్టాండప్‌ ఇండియాల పేరుతో ప్రధాని మరొక ప్రకటన చేశారు.సరే నవంబరు నెలలో చేసిన పెద్ద నోట్ల రద్దు అనే చారిత్రాత్మక నిర్ణయం గురించి చెప్పనవసరం లేదు. అది కూడా ఐదురాష్ట్రాల ఎన్నికల ప్రచార వస్తువుగా వుపయోగించుకొనేందుకే అన్నది స్పష్టం.అన్నింటికీ మించి ఇలాంటి ప్రధాన నిర్ణయాలేవీ హల్వా వంటకంతో ప్రారంభిస్తున్నవీ, పార్లమెంట్‌లో చర్చించి చేస్తున్నవీ కాదు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ లేక బహుళజాతి కార్పొరేట్‌ సంస్ధల అజెండాలను తయారు చేసే సంస్ధల సలహాలు మొరటుగా చెప్పాలంటే ఆదేశాల ప్రకారం చేస్తున్నవి తప్ప మరొకటి కాదు. ఇది నరేంద్రమోడీ నూతన దారి కాదు, గతంలో మన్మోహస్‌ సింగ్‌ కూడా నడిచిన బాట అదే. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి వచ్చినపుడు గానీ అసలు విషయాలు బయట పడవు. మోడీ సర్కార్‌ను గట్టిగా బలపరిచే ఒక వ్యాఖ్యాత ఈ ఏడాది రెండో బడ్జెట్‌ లేదా చిన్న బడ్జెట్‌ వుండదని చెప్పలేము అని పేర్కొన్నారు. ఆర్ధిక సంవత్సరం అక్టోబరుకు మారిపోనుందని చెప్పారు. అందువలన ఈ బడ్జెట్‌ అంకెలను చూసి భారాలు, రాయితీల గురించి చర్చించటం అసవసర ఆయాసం తప్ప మరొకటి కాదు.

Image result for Budget 2017-18 meme

    ఇది సమగ్రబడ్జెట్‌ కాదు అనేందుకు కారణాలు అందరికీ తెలిసినవే. ఇదే కాదు, అన్ని రాష్ట్రాల బడ్జెట్లు ఒక విధంగా మూడు లేదా ఆరునెలలకు అవసరమయ్యే ఖర్చులకు అనుమతి పొందే ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ వంటివే. ఎందుకంటే వస్తు,సేవల పన్ను జూలై లేదా సెప్టెంబరు నుంచి అమలులోకి వస్తుంది. మన ఆదాయంలో సింహభాగం దాని నుంచే రావాల్సి వుంది. దాదాపు 1400 వస్తువులపై ఎంత పన్ను విధిస్తారో, దాని పరిధిలోకి రానివేవో ఇంకా తెలియదు. ఇదొక ప్రధాన కారణమైతే అమెరికా పద్దతుల్లో జనవరి నుంచి డిసెంబరు వరకు ఆర్ధిక సంవత్సరాన్ని కూడా మార్చాలని ఇప్పటికే ఒక కమిటీ చేసిన సిఫార్సు గురించి కూడా ఈలోగా నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌, అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్ధలన్నీ కూడా అదే కోరుతున్నాయి. అదే జరిగితే 2018 బడ్జెట్‌ ఏ సెప్టెంబరో, అక్టోబరులోనే ప్రవేశ పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్‌, తరువాత మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, చత్తీస్‌ఘర్‌ ఎన్నికలు జరగాల్సి వుంది. ఇవన్నీ బిజెపి పాలిత రాష్ట్రాలు. వాటి ఫలితాలు 2019లో జరిగే సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. ఎన్నికల ఏడాది ఎలాగూ ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ మాత్రమే ప్రవేశపెడతారు. అంటే మోడీ సర్కార్‌కు 2018 బడ్జెట్‌ కీలకం, బహుశా ఆ కారణంగానే కావచ్చు, తాజా బడ్జెట్‌లో ఎలాంటి ప్రజాకర్షక ప్రతిపాదనలు చేయలేదు. ఇంత ముందుగా చేస్తే జనం మరిచిపోయే అవకాశం వుంది కనుక ఎన్నికల సంవత్సరాలలో అయితే తాము సొమ్ము చేసుకోవచ్చన్నది బిజెపి ఆలోచన.

   ప్రతి బడ్జెట్‌ సమావేశానికి ముందు ప్రభుత్వం తమ విధానాలు, విజయాల గురించి చెప్పుకొనేందుకు పార్లమెంట్‌ వుభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్వారా ఒక ప్రసంగం చేయిస్తుంది. మోడీ ప్రభుత్వ ‘ఘనత ‘ ఖాతాలో వేస్తారో మరొకదానిలో వేస్తారో తెలియదు గానీ అసాధారణ రీతిలో వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతి ప్రసంగానికి 651 సవరణలు ప్రతిపాదించారు. ఇదొక రికార్డు అని చెప్పవచ్చు. వీటిలో మోడీ సర్కార్‌పై విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా పోరాడుతున్నట్లు చెబుతున్న కాంగ్రెస్‌ నుంచి ఒక్కటంటే ఒక్క సవరణ కూడా లేకపోవటం ఒక కిక్కు. గతంలో వేసిన కుర్చీలు చాలక అనేక మంది ఎంపీలు నిలబడి ప్రసంగాలను వినేవారని, తాజా ప్రసంగానికి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయని మీడియాలో వ్యాఖ్యలు వెలువడ్డాయి. జన గణమణ పాడుతుండగానే కొందరు ఎంపీలు వెళ్లిపోవటం ప్రారంభించారని కూడా రాశారు. రాజ్యసభ సభ్యులు ప్రతిపాదించిన సవరణల్లో పెద్ద నోట్ల రద్దు గురించి రాష్ట్రపతి సరిగా చెప్పలేదన్నది ఒక ప్రధాన అంశం.ఈ సవరణల మీద ఓటింగ్‌ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం కూడా వుంది.

    ఇక బడ్జెట్‌ విషయానికి వస్తే తినబోతే ఆవుల్లో దున్నబోతే దూడల్లో అన్నట్లుగా వుంది. ఎగుమతులు ఎందుకు తగ్గాయంటే అంతర్జాతీయ పరిస్థితులు అంటారు, అదే నోటితో తమ ఘనత కారణంగా అభివృద్ధి బహుబాగుంది అని చెబుతారు. అంకెల గారడీ తప్ప ఇదెలా సాధ్యం ! మన ఆర్ధిక వ్యవస్ధ అధిక వృద్ది రేటుతో పురోగమిస్తున్నదని, కావాలంటే ఐఎంఎఫ్‌ కూడా చెప్పింది చూడమంటున్నారు. అన్నింటికీ శకునం చెప్పే బల్లి తానే కుడితిలో పడినట్లు అన్ని దేశాల గురించి జోశ్యం చెప్పే ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్ధలేవీ 2008 నుంచి ధనిక దేశాలను, తరువాత వాటి అడుగుజాడల్లో నడిచే మన వంటి దేశాలను పట్టి పీడిస్తున్న ఆర్ధిక సంక్షోభాన్ని పసిగట్టటంలో ఘోరంగా విఫలమయ్యాయి. అందువలన అవి చెప్పే జోశ్యాలను సమర్ధనకు తీసుకోవటం జనాన్ని తప్పుదారి పట్టించటమే.

     గతేడాది ప్రపంచంలో సంభవించిన ప్రధాన ఆర్ధిక, రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో పెద్ద అనిశ్చితిని ఎదుర్కోనున్నదని, 2017లో అమెరికాలో వడ్డీ రేట్లు పెంచే ఆలోచన వున్నందున వర్ధమాన దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు వచ్చే పెట్టుబడులు తగ్గవచ్చని, బయటకు వెళ్లే మొత్తాలు ఎక్కువ కావచ్చని, వస్తువుల ధరలలో అనిశ్చితి ముఖ్యంగా ముడి చమురు ధరల కారణంగా వర్ధమాన దేశాల ఆర్ధిక వ్యవస్ధలపై పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని, రక్షణాత్మక చర్యలు పెరుగుతున్న కారణంగా వస్తువులు, సేవలు, జనం విషయంలో ప్రపంచీకరణ వెనుక పట్టు పట్టే సూచనలు మన ముందున్న సవాళ్లని చెబుతూనే రాబోయే రోజుల్లో ఆర్ధిక వ్యవస్ధ బాగా పురోగమించనున్నదని చెప్పారు.

    అసలు ప్రణాళికా సంఘమే రద్దయింది కనుక 2017-18 బడ్జెట్‌లో ప్రణాళిక-ప్రణాళికేతర అనే విభజనే లేకుండా పోయింది. అందువలన వివిధ రంగాలకు కేటాయింపులు, గతంతో పోల్చుకోవటానికి వీలు లేకుండా పోయింది. రైల్వే బడ్జెట్‌ను రద్దు చేసి సాధారణ బడ్జెట్‌లో దాన్నొక శాఖగా కలిపివేశారు.లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని వెలికి తీస్తామంటూ పెద్ద నోట్లను రద్దు చేశారు. ఇది పంచపాండవులు-మంచం కోళ్ల కథను పునరావృతం చేసేట్లున్నది. తొలుత నల్లధనం ఆరులక్షల కోట్లని, తరువాత దానిని మూడు లక్షల కోట్లని అనధికారిక అంచనాలు చెప్పిన వారు ఇప్పుడు అసలు మాట్లాడటం లేదు. ఎందుకయ్యా అంటే బ్యాంకులకు తిరిగి వచ్చిన నోట్లను ఇంకా లెక్క పెడుతూనే వున్నారట. కొన్ని వార్తల ప్రకారం ఆగస్టులో రిజర్వు బ్యాంకు వార్షిక నివేదికలో మాత్రమే ఆ వివరాలు వెల్లడి అయ్యే అవకాశం వుంది. అయితే ప్రతిపక్షాలు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలలో అంత తేలికగా వదలవు గనుక ఈ సందర్భంగా అయినా వెల్లడి అవుతాయా అన్నది చూడాల్సిందే.

   పెద్ద నోట్ల రద్దు నల్ల ధనం వెలికితీతకే అని చెప్పినప్పటికీ చివరకు అది డిజిటల్‌ ఆర్ధిక లావాదేవీలను జనంపై బలవంతంగా రుద్ధేందుకు అన్నది స్పష్టమైంది. అదనపు భారం పడకుండా వుంటే నగదు రహిత లావాదేవీలను జరపటానికి జనానికి ఎలాంటి ఇబ్బంది లేదు. పేటిఎం, రిలయన్స్‌, తదితర కార్పొరేట్ల ఆదాయాలు పెంచటానికే అన్నది తేలిపోయింది. ప్రభుత్వమే ప్రతిదానికి వినియోగ చార్జీలు, సేవా పన్ను పేరుతో జనాన్ని బాదుతుంటే ప్రయివేటు సంస్ధలు అదీ కేవలం వడ్డీ వ్యాపారం చేసే బ్యాంకులు, బ్యాంకేతర ఆర్ధిక సంస్ధలు వుచితంగా సేవలు అందిస్తాయని నమ్మటానికి జనం చెవుల్లో పూలుపెట్టుకొని లేరు. నగదు రహిత లావాదేవీలు జరిగితే అవినీతి వుండదన్నది ఒక ఎండమావి. అవినీతికి-నగదు రహితానికి సంబంధం లేదు. అమెరికాలో 45శాతం నగదు రహితమే, అయినా అది ప్రపంచ నల్లధనానికి అగ్రస్ధానంలో వుంది, కెనడాలో 57, బ్రిటన్‌లో 52శాతం నగదు రహితమే, ఆ రెండూ ప్రపంచంలో నల్లధనంలో అగ్రస్ధానంలో వున్న పది దేశాలలో వున్నాయి. ఇక ప్రపంచంలో నల్లధన కుబేరులు, పన్నుల ఎగవేతదార్లందరికీ ఆశ్రయం కల్పిస్తూ, అవినీతిని ప్రోత్సహించే స్విడ్జర్లాండ్‌ వంటి దేశాల గురించి చెప్పాల్సిందేముంది. నరేంద్రమోడీ నోట్ల రద్దు నిర్ణయం తరువాత హైదరాబాదు వంటి అనేక పట్టణాలలో కొన్ని చిన్న దుకాణదారులు పోయిన వ్యాపారాన్ని రాబట్టుకొనేందుకు నగదు రహిత లావాదేవీలకోసం మిషన్లు పెట్టారు. ప్రస్తుతం నగదు సాధారణ స్థాయికి రావటంతో అనేక చోట్ల వాటిని ఎత్తివేశారు. జనాన్ని నగదు రహితం వైపు మళ్లించటానికి ఈ బడ్జెట్‌లో సహజంగానే పెద్ద పీట వేశారు. బ్యాంకుల్లో పది లక్షలు, ఆధార్‌తో లింక్‌ చేసే మరో 25లక్షల మిషన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. మూడులక్షల రూపాయల కంటే నగదు లావాదేవీలు జరపరాదనే నిర్ణయం రాబోయే రోజుల్లో చేయనున్నారు. అంతా బాగుందని ఒకవైపు చెబుతారు, మరోవైపు అభివృద్ధి వుద్దీపన పేరుతో పారిశ్రామిక సంస్ధలపై పన్ను రేటు తగ్గిస్తున్నారు.ఏటా యాభై కోట్లకు లోబడి లావాదేవీలు జరిపే వాటిపై ఆదాయపన్ను 25శాతానికి తగ్గించటం అదే. ఎన్నో ఆశలు పెట్టుకున్న వుద్యోగుల విషయానికి వస్తే ఇది వట్టిస్తరి మంచి నీళ్ల వంటిదే. ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయంపై పన్ను రేటు పది నుంచి ఐదు శాతానికి తగ్గించి పండుగ చేస్కోండి అన్నట్లుగా ఫోజు పెట్టారు. దీని వలన అంతకు మించి ఆదాయం వున్నవారికి 12,500 రూపాయలు తగ్గుతాయి. ఇంతకు మించి మరొకటి లేదు.

    బడ్జెట్‌ను మొత్తంగా చూస్తే వాస్తవాలను ప్రతిబింబించలేదనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు వలన అనేక మంది నష్టపోయారు. ఆ నష్టం గురించి ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. బడ్జెట్‌కు ముందురోజు ప్రవేశ పెట్టిన ఆర్ధిక సర్వేలో ఆర్ధిక ప్రగతి మందగించిందని, వస్తువులు, సేవల డిమాండ్‌ పెద్ద ఎత్తున పడిపోయిందని, వుపాధిపోయిందని, వ్యవసాయ ఆదాయాలు పడిపోయాయని పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా అంతా బాగుందని బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి చెప్పారు. లోటు తగ్గింపు లక్ష్యాన్ని చేరుకోవటం గురించి గొప్పగా చెప్పారు. అసలు విషయం ఏమంటే ఖర్చు తగ్గించారు. వర్తమాన సంవత్సరం జిడిపిలో 13.4 శాతం మొత్తం బడ్జెట్‌గా వుంటే వచ్చేఏడాది దానిని 12.7శాతానికి తగ్గించారు.మొత్తం ఆదాయం 9.4శాతం వస్తుందనుకుంటే సవరించిన బడ్జెట్‌లో తొమ్మిదిశాతానికి తగ్గించారు. అయితే కార్పొరేట్‌లకు ఇచ్చిన రాయితీలు మాత్రం అంచనాల కంటే 30వేల కోట్ల రూపాయలు పెరిగాయి. తక్కువ మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించేవారికి 20వేల కోట్లరూపాయల వరకు భారం తగ్గించినప్పటికీ పరోక్ష పన్నుల ద్వారా జనంపై 75వేల కోట్ల మేరకు అదనపు భారాన్ని ప్రతిపాదించారు. ఈ ఏడాది కూడా చమురు వుత్పత్తులపై అధిక ఎక్సయిజ్‌ డ్యూటీ ప్రాతిపదికన ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రతిపాదించారు. అంటే గత మూడు సంవత్సరాలలో పెంచిన పన్ను తగ్గేది లేదన్నది స్పష్టం. ఇండ్ల నిర్మాణానికి రాయితీల ప్రకటన ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో తెలియదుగానీ రియలెస్టేట్‌ రంగంలో కాపిటల్‌ గెయిన్‌ పన్ను ప్రాతిపదిక సంవత్సరాన్ని 1981 నుంచి 2001కు మార్చటం ద్వారా ఆ రంగంలోని బడా పెద్దలకు విపరీత లాభాలు సమకూర్చేందుకు వీలుకల్పించారు. షెడ్యూలు తెగల సంక్షేమానికి 1.48శాతం, షెడ్యూలు కులాల వారికి 2.44 శాతాల మొత్తమే మొత్తం బడ్జెట్‌లో కేటాయించారు. వారి జనాభాతో పోల్చితే ఇది చాలా తక్కువ. జనాభాలో సగానికి పైగా మహిళలు వున్నప్పటికీ లింగ ప్రాతిపదికన బడ్జెట్‌లో కేటాయింపు కేవలం 5.3శాతమే వుంది.

   వుపాధి హామీ పధకానికి కేటాయింపు 48వేల కోట్లకు పెంచినట్లు చెప్పినా వాస్తవానికి గతేడాది చేసిన ఖర్చు 47.5వేల కోట్లకు దగ్గరగానే వుంది తప్ప తగినంత పెంపుదల లేదు.విద్య, వైద్యం వంటి సామాజిక రంగాలకు ద్రవ్యోల్బణం పెరుగుదలకు అనుగుణ్యంగా పెంపుదల లేదు. 2016-17లో 2.2శాతం అని నిర్ణయించినా సవరించిన అంచనా 2.16కు తగ్గింది. రైతుల ఆదాయాలను ఐదు సంవత్సరాలలో రెట్టింపు అని జపం చేయటం తప్ప అందుకు నిర్ధిష్ట చర్యలు లేవు. గతబడ్జెట్‌లో రైతుల సంక్షేమానికి కేటాయించిన 1.98శాతంలో సవరించిన అంచనా పకారం 1.95శాతం కంటే ఖర్చయ్యే అవకాశం లేదు. మౌలిక సదుపాయాల పరిస్ధితి కూడా ఇంతే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: