Tags
అంబేద్కర్ తన అభివృద్ధికి తోడ్పడిన ఒక బ్రాహ్మణుడిని శాశ ్వతంగా గుర్తుంచుకొనేందుకు తన ఇంటి పేరుగా మార్చుకున్న గొప్పతనం అనితర సాధ్యం. ఈ విషయంగానీ, ఆయన బ్రాహ్మణ యువతిని వివాహం చేసుకున్నారన్న విషయంగానీ కొత్తవి కావు, వాటిని కనుగొనాల్సినంత రహస్యమూ కాదు. గోవును చంపిన వారిని హతమార్చాలని వేదాలు చెబుతున్నాయని పరివార్ పత్రిక పాంచజన్యరాసింది. తాను లేత గోమాంసం ఇష్టంగా తింటానని చెప్పిన యాజ్ఞవల్క్యుడి కంటే పాంచజన్య వ్యాసకర్తకు వేదాల గురించి ఎక్కువగా తెలుసని అనుకోలేము. నిజంగా వేదాలు అలా చెబితే యాజ్ఞవల్క్యుడిని ఆనాడే చంపివేసి వుండాలి. మనకు ఆయన స్మృతి వుండేది కాదు. అంబేద్కర్ తన జీవితాంతం మనువాదం, దానిని కాపాడుతూ వస్తున్న బ్రాహ్మణిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు, రూపు మాపాలని కోరుకున్నారు తప్ప బ్రాహ్మణులను కాదు. అలాంటి సంస్కారం పరివార్ నేతలకు వుందా ? అంబేద్కర్ కాలంలోనే ఎందరో బ్రాహ్మణులు మనువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దేవాలయాల ప్రవేశ వుద్యమాలకు నాయకత్వం వహించారు. అందరూ మనువాదులే అయి వుంటే అంబేద్కర్ను ఒక బ్రాహ్మణుడు దగ్గరకు తీసి వుండకూడదు. సమాజాన్ని ఎదిరించటానికి కూడా సిద్దపడే ఆ మహానుభావుడు ఆ పని చేసి వుంటాడు.
అంబేద్కర్ తండ్రి శాఖాహారి అయితే ఏమిటట? ఆయన ఒక సైనికుడు అయినందున ఇది అనుమానమే. ఆ మాటకు వస్తే 70 శాతం మంది మన దేశ ప్రజలు మాంసాహారులుగా వున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. తూర్పు, వుత్తర భారతంలో మాంసాహారం తినే వున్న బ్రాహ్మణుల గురించి ఎందుకు చెప్పరు, బ్రాహ్మణేతరులులో గణనీయ సంఖ్యలో శాఖాహారులు వున్నారు. ఎవరిష్టం వారిది, ఎవరికి ఇష్టం వచ్చిన మాంసం వారు తినటాన్ని, తినకపోవటాన్ని ఎందుకు అంగీకరించరు.
సంస్కృతం ప్రస్తుతం ప్రపంచ మృత భాషలో ఒకటి. అలాంటి ఏ భాషనైనా బ్రతికించమని కోరటాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ దానిని పని గట్టుకొని అధికార భాషగా చేయాలన్న ప్రచారం వెనుక అది మనువాదానికి ప్రతీక. అందువ్లలనే సంస్కృతాన్ని బలవంతంగా రుద్దటానికి అంగీకరించరు. గతంలో హిందీని రుద్ది వ్యతిరేకత కొని తెచ్చుకున్న పాఠాలను వారు నేర్చుకోలేదన్నది స్పష్టం. అందువలన సంస్కృతాన్ని అధికార భాషగా చేయాలనుకుంటే చేయండి. చరిత్రలో పిచ్చితుగ్లక్ మాదిరి మిగిలి పోవాలన్న సరదా వుంటే తీర్చుకోండి, మీ అజెండాలో ఒక్కొక్కదానిని అడ్డగోలుగా అమలు జరుపుతున్నపుడు అది ఒక లెక్కా ?దానికి అంబేద్కర్ ముద్ర ఎందుకు? మతం మారిన దళితులను శుద్ది చేయాలని అంబేద్కర్ చెప్పాడటనటం మరో బుద్ది తక్కువ ప్రచారం. అలాంటి పెద్ద మనిషి బౌద్దంలోకి ఎందుకు మారారంటే అది భారతీయ మతమట. పిల్లి న్లల్లదా త్లెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం. అది భారతీయ మతమా విదేశీయా అన్నది కాదు భారత సమాజం మొత్తానికి మాయని మచ్చగా వున్న కుల వ్యవస్ధను సమర్ధిస్తుందా, రూపుమాపాలని కోరుతుందా లేదా అన్నది గీటు రాయి. ఆ విధంగా చూసినపుడు బౌద్ద మతం అలా కోరుకుంది. అందుకే అంబేద్కర్ మారారు.
సంఘ పరివార్ లేదా హిందూ మత పరిరక్షకులమని బోర్డులు కట్టుకొని తిరేగే వారు చాతుర్వర్ణ వ్యవస్ధను సమర్ధించే మను స్మృతి, వేదాలు, ఇతర గ్రంధాలను బహిరంగంగా తగుల పెట్ట నక్కర లేదు(ఎందుకంటే తిరిగి ముద్రించుకోవచ్చు), తిరస్కరించమనండి, దేవాలయాల ప్రవే శాలపై వున్న ఆంక్షలను ఎత్తివేయమనండి.