• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: July 2016

‘ప్రత్యేక హోదా ‘అనే తెలుగుదేశం తోలు బొమ్మలాట

31 Sunday Jul 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ap special status, BJP, narendra modi promises, tdp puppetry

ఎం కోటేశ్వరరావు

    ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంపై బిజెపి-తెలుగు దేశం మధ్య ఇంతకాల నడిచిన డ్రామా గురించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి తేట తెల్లమైంది. ఈ అంశంపై తలెత్తిన పరిస్థితి పర్యవసానాలతో రెండు పార్టీల సంబంధాలు ఎలా వుంటాయి అన్నది ఇప్పుడు సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. ఆదివారం నాడు తెలుగుదేశ నాయకులతో సమీక్ష జరిపిన చంద్రబాబు నాయుడు మరికొంత కాలం గడపటానికి వ్యూహ రచన చేసినట్లు కనిపిస్తోంది. ఎంతకాలం అన్నది అప్పుడే చెప్పలేము. అభివృద్ధి పేరుతో అధికారాన్ని అంటి పెట్టుకొని వుండేందుకు అలవాటు పడిన శక్తులు ఎన్నికలు ఇంకా చాలా దూరం వుండి, అధికార పక్షానికి సంపూర్ణ మద్దతు వున్న స్థితిలో అంత తేలికగా కేంద్ర అధికారాన్ని వదులు కుంటాయని చెప్పలేము. రాజ్యసభలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ వ్యవహరించిన తీరు ప్రధాని నరేంద్రమోడీకి తెలియదన్నట్లుగా ఒకసారి ఆయనను కూడా కలిసేందుకు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇదంతా రాజకీయం తప్ప మరొకటి కాదు. జనం కోసం తప్ప ఆమాయకులు, అవివేకులు ఎవరూ లేరు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రయివేటు బిల్లు గురించి ఎంతో చర్చ జరిగిన విషయాన్ని పట్టించుకోనంతగా నరేంద్రమోడీ ఏం రాచ కార్యాలు వెలగబెడుతున్నారు? అసలు మోడీతో మాట మాత్రం కూడా చర్చించకుండా ఇంతటి ముఖ్యఅంశంపై బిజెపి నేతలు ఆషామాషీగా పార్లమెంట్‌కు వచ్చారనుకుంటే జనం చెవుల్లో పువ్వు పెట్టటమే. అననుకూల పరిస్ధితులను కూడా తమ లబ్దికి వుపయోగించుకోవాలనే తెలుగుదేశం ఎత్తుగడ మాత్రమే దీనిలో కనిపిస్తోంది. ఇంత జరిగాక ప్రధాని మోడీని, ఇతర మంత్రులను కలసి కూడా కొత్తగా ఏ వాదనలు వినిపిస్తారో, ఏం సాధించుకువస్తారో ముందు ముందు జనం చూస్తారు.

   ప్రత్యేక హోదా అంశాన్ని వుపయోగించుకొని లబ్ది పొందిన ప్రధమ పార్టీలుగా తెలుగుదేశం-బిజెపి వున్నాయి. అదే ఇప్పుడు భూతంగా మారి భయపెడుతోంది. జరగబోయే రాజకీయ నష్టాన్ని తగ్గించుకొనేందుకు తెలుగుదేశం, బిజెపిలు ప్రయత్నించినట్లే, ఇతర పార్టీలు రాబోయే రాజకీయ లాభాన్ని పెంచుకొనేందుకు పూనుకుంటాయి. జరిగిన మోసం గురించి ఆంధ్రులు ఎలా స్పందిస్తారు అనేది కూడా రానున్న రోజులలో ఆసక్తి కలిగించే అంశమే. మోసాన్ని తట్టుకోలేక నిరాశలో కూరుకుపోయి నిర్వేదంతో మౌనంగా వుంటారా ? లేదా గతంలో అనేక సందర్బాలలో మాదిరి తీవ్ర ఆందోళనకు పూనుకుంటారా అన్నది చూడాలి.

    టాటా-బిర్లా మధ్యలో లైలా అన్న సినిమా మాదిరి తెలుగుదేశం-బిజెపి మధ్య వచ్చిన పవన్‌ కల్యాణ్‌ నుంచి ఎలాంటి పవనాలూ ఇంతవరకు వెలువడలేదు. ఇప్పటి వరకు అనేక మంది పవర్‌ స్టార్‌ను లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య మాదిరి భావిస్తున్నారు. వారి అభిప్రాయం తప్పని నిరూపిస్తారా లేదా అన్నది కూడా తేలిపోవటం అనివార్యం. ప్రత్యేక హోదా అంశం గురించి గతంలోనేను ఈ బ్లాగ్‌లో చేసిన వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి మెచ్చుకున్నవారూ వున్నారు, అవన్నీ వూహాజనితం, అవాస్తవాలని త్వరలో తేలిపోతాయని వివిధ రూపాలలో వ్యతిరేకంగా స్పందించిన వారూ వున్నారు. గుడ్డి అభిమానుల బుర్రలలో లోడ్‌ చేసిన సాఫ్ట్‌వేర్‌ అలాగే వుంటే వారిని స్పందింప చేయటం సాధ్యంగాని పని. ప్రత్యేక హోదా రాదని నిర్ధారణ అయినందుకు నాకేమీ సంతోషం లేదు. ఏ ఒక్క పార్టీకి దీని గురించి చిత్తశుద్ధి లేదని తొలి నుంచి భావించిన వారిలో నేనూ ఒకడిని.

    కేంద్ర ప్రభుత్వం తాను రూపొందించిన నిబంధనలను మార్చకుండా ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక పాకేజీ ఇవ్వటం సాధ్యం కాదు. రాజ్యసభలో చర్చకు సమాధానమిచ్చిన కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ఇచ్చిన సమాధానంలో అది తేటతెల్లమైంది. కేంద్ర ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు అంటే కొన్ని రాష్ట్ర రహదారులకు జాతీయ హోదా కల్పించి వాటి నిర్మాణానికి నిధులు ఇవ్వటం లేదా పరిశ్రమలు, సంస్ధల ఏర్పాటు సందర్బాలలో మాత్రమే కేంద్రంలో వున్న పెద్దలను ప్రభావితం చేసేందుకు అవకాశం వుంటుంది. అలాంటి వాటిని కేంద్ర పాలిత పాంతం లేదా ఏదో ఒక రాష్ట్రంలో పెట్టాలి. ఒక రాష్ట్రంలో పెట్టదలచుకున్నదానిని మార్చి మరొక చోట పెట్టే విచక్షణ అధికారం వుంటుంది.అంతకు మించి నిబంధనలకు విరుద్ధంగా ఒక్క రూపాయిని కూడా కోరుకున్న లేదా బతిమిలాడిన, బెదిరించిన రాష్ట్రాలకు ఇవ్వటానికి లేదు. గత పాతిక సంవత్సరాలుగా రక్షణ రంగంలో తప్ప కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టటం నిలిపివేసింది. ప్రభుత్వ రంగ సంస్ధలలో ఒక్క విద్యుత్‌ రంగంలో తప్ప మిగతా పరిశ్రమలు కొత్తగా పెట్టినవేమీ లేవు, భవిష్యత్‌లో పెట్టాలనే వైఖరి లేదు. విద్యుత్‌ కేంద్రాలను ఎక్కడ పెట్టినా తయారయ్యే విద్యుత్‌లో రాష్ట్రాలకు ఎలాగూ వాటా వుంటుంది. అవి కేంద్ర సంస్ధలు కనుక వుద్యోగాలు కూడా పెట్టిన రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకంగా కేటాయించే అవకాశాలూ వుండవు. అందువలన కేంద్రంతో సఖ్యతగా వుండాలి, ఆ పేరుతో రాష్ట్రాన్ని వుద్దరిస్తాం అని ఏ పార్టీ చెప్పినా అది తన రాజకీయ విధానానికి వేసుకొనే ముసుగుతప్ప మరొకటి కాదు. గత రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం దీనినే రుజువు చేసింది.

   విభజన చట్టంలో పేర్కొన్న పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి కేంద్రం నిధులు ఇస్తే ఆ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడి విజన్‌ 2050 నాటికికూడా ప.ూర్తి కాదు. ప్రపంచ స్ధాయి రాజధానిగా అమరావతి నిర్మాణానికి కేంద్రం ఐదులక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అడుక్కోవటంలో పిసినారి తనం ఎందుకన్న విషయం ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అనేందుకు ఇదొక చక్కటి వుదాహరణ.అదేదో సినిమాలో ఒక జేబులో ఒక ప్రకటన మరో జేబులో మరో ప్రకటన పెట్టుకుతిరిగే పాత్ర మాదిరి బిజెపి వస్తే వంద అడిగితే పది అన్నా ఇవ్వకపోతారా అని గానీ, కాంగ్రెస్‌ వస్తే కోరినంత ఇవ్వలేదన్న దాడి చేయవచ్చన్న ముందుచూపుతో గానీ చంద్రబాబు ఐదులక్షల కోట్లు అడిగారు తప్ప ఇస్తారని నమ్మేంత అమాయకుడు కాదు. తీరా చూస్తే పదిశాతం కాదు కదా కనీసం ఒక శాతం మొత్తం కూడా ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. చివరికి పరిస్థితి చులకనగా, ఎంత దయనీయంగా తయారైందంటే బిజెపి గ్రామ స్ధాయి కార్యకర్త కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్కలు చెబుతారా లేదా అని డిమాండ్‌ చేసే పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది నెలలుగా అలా డిమాండ్‌ చేస్తున్నా చంద్రబాబు అండ్‌ కో రాష్ట్ర ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని దాని గురించిన వాస్తవాలను, వివరాలు చెప్పలేకపోయింది. కింది స్ధాయిలో తామెంత అడ్డగోలు వ్యవహారాలు నడుపుతున్నామో బాగా తెలిసిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు సహజంగానే ఏదో జరగకూడనిది జరిగి వుంటుంది అనే అనుమాన బీజం పడింది.

    ఇంత జరిగినప్పటికీ అసలు వాస్తవాలను ఆంధ్ర జనం ముందు వుంచుతున్నారా అంటే లేదనే చెప్పాలి.ఎందుకంటే ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో. ఎవరు సమాధానం చెప్పాలి? సిపిఎం తప్ప మిగతా పార్టీలన్నీ విభజనకు అనుకూలమే కనుక అవే చెప్పాలి. పార్లమెంట్‌లో మా వాణి వినిపించకుండా చేసి తలుపులు మూసి, చీకటిలో బిల్లును ఆమోదించారని,సక్రమంగా విభజించలేదని తెలుగుదేశం పదే పదే చెబుతోంది. లోపల అంచనాలు, ఆలోచనలు ఏమున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతం ముసుగులో విభజనకు అంగీకరించింది. తీరా విభజన అనివార్యం అని తేలిన తరువాత ఆంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఆందోళన గమనించి తమ రాజకీయ పునాది ఎక్కడ కదులుతుందో అనే భయంతో అక్కడ వ్యతిరేక ఆందోళనలో ఆ పార్టీ భాగస్వామి అయింది, పరోక్షంగానా, ప్రత్యక్షంగానా అన్నది వేరే విషయం.ఆ కారణంగానే సక్రమంగా విభజించటం లేదనే పేరుతో పార్లమెంట్‌లో ఒక పెద్ద డ్రామాకు తెలుగుదేశం తెరతీసింది. అప్పుడు సక్రమంగానే తమ వారు వ్యవహరించారని ప్రశంసించిన చంద్రబాబు ఇప్పుడు బిజెపి నమ్మక ద్రోహం సందర్భంగా సరిగా వ్యవహరించలేదని తమ కేంద్ర మంత్రులు,ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, దానికి కారణం తగిన సమాచారం అందకపోవటమే అని వారు సంజాయిషీ ఇచ్చి, అవసరమయితే రాజీనామాలకు సిద్ధం అని చెప్పినట్లు లీకుల కధనాలు బయటకు వచ్చాయి. అంటే తెలుగుదేశం పార్టీ ఒక తోలుబొమ్మలాట కంపెనీ అనుకుంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తోలు బొమ్మలు, వాటిని ఆడించే కధకుడు చంద్రబాబు. ప్రదర్శన రక్తి కట్టలేదంటే దానికి కారణం ఆడించేవారిది తప్ప బొమ్మలది కాదు అన్నది వేరే చెప్పనవసరం లేదు.నాడు పార్లమెంట్‌లో విభజన బిల్లు సందర్భంగా తెలుగుదేశం సభ్యులు చేసిన రచ్చను మెచ్చిన జనం నేడు ఇదేమిటంటూ తెగడుతున్నారు. అందుకే నష్ట నివారణ చర్యలలో భాగంగా తెలుగుదేశం లీకుల విభాగం చురుకుగా కదలి నాయకుడు సమర్ధుడే మిగిలినవారే తమ పాత్రలను సరిగా పోషించలేదనే ట్టుకధలు వినిపిస్తున్నది. దీన్ని అర్ధం చేసుకోలేనంత అమాయకంగా మేథావులు వుండవచ్చేమోగాని సామాన్య జనం లేరు. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో మేథావుల తరగతిలోని అత్యధిక వర్గం ఏం చేస్తున్నదో, ఏం ఆలోచిస్తున్నదో తెలియని స్ధితి.

  అంతర్జాతీయంగా తగిలిన ఎదురు దెబ్బలు, బూర్జువా వ్యవస్ధ పార్లమెంటరీ రంగంలో పని చేయాలని నిర్ణయించుకున్న తరువాత ఎదురయ్యే సమస్యలపై వామపక్ష పార్టీలు తీసుకొన్న వైఖరి, దానికి వున్న పరిమితులు, కొత్త పరిస్థితులలో ఎదురయ్యే సవాళ్లను పూర్తిగా కింది స్ధాయి కార్యకర్తలకు వివరించటంలో కూడా వామపక్షాలు జయప్రదం కాలేకపోయాయి. వామపక్షాలు అధికారంలో వున్న చోట్ల ఒక్క అవినీతి, అక్రమ ఆరోపణలు లేకపోయినా, ఎలాంటి కుంభకోణాలలో ఇరుక్కోకపోయినా, నాయకత్వంలో ఒకరో అరో తప్ప పార్టీలు మారటం వంటి అవకాశ వాద వైఖరి లేకపోయినా సామాన్య జనం ఆ పార్టీలు మంచివే అని భావించినప్పటికీ రాజకీయంగా ప్రభావం చూపించలేవనే భావనతో ఓటింగ్‌ , ఇతర సందర్బాలలో దూరంగా వుంటున్నారు. జనానికి విశ్వాసం కలిగించటం వామపక్షాల ముందున్న పెద్ద సవాలు.

     ఇంతకాలం కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సిపి మీద ఒంటి కాలితో లేచే పరిస్థితి ఇక ముందు తెలుగు దేశానికి వుండదు. ఎందుంటే కాంగ్రెస్‌ ద్రోహం బహిరంగం. బిజెపితో కుమ్మక్కయి ఆ పార్టీ వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చీల్చింది. ఇప్పుడు బిజెపి నాయకత్వం తెలుగుదేశంతో కుమ్మక్కయి నమ్మక ద్రోహం చేసింది. జగన్‌ మోహన్‌ రెడ్డి తనపై వున్న కేసుల కారణంగా బిజెపి ప్రభుత్వం పట్ల మెతకగా వుంటున్నారనే దాడి ఇక ముందు కుదరదు.ఎందుకంటే ప్రతిపక్షంలో వున్న ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రం పట్ల ఎలా వున్నప్పటికీ అది రాష్ట్ర అభివృద్దిని ప్రభావితం చేసే పరిస్థితి వుండదు. అధికారంలో వున్న మరొక ప్రాంతీయ పార్టీ కేంద్రంతో సఖ్యతగా వున్నా, రాజకీయంగా భుజం మార్చుకోకుండా కేంద్రంలో వున్న పార్టీని మోసినా ప్రయోజనం లేదని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా నిరూపించింది. అందువలన రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలలో విమర్శలు, ఆరోపణలు కొత్త రూపం సంతరించుకోవటం తధ్యం. కేంద్రంతో సఖ్యతతో వుండే రాష్ట్ర ప్రభుత్వమే సాధించేందేమీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల అభీష్టం మేరకు అధికారపక్షంలో చేరా అని చెప్పుకొనే జంప్‌ జిలానీల నోరు పడిపోవటం ఖాయం. వారంతా గత ఎన్నికలలో పెట్టిన ఖర్చును రాబట్టుకొని వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ పరిస్థితి వాటంగా వుంటే ఆ పార్టీ టిక్కెట్‌, జనం ఓట్లు కొనేందుకు అవసరమైన డబ్బు దండుకొనేందుకు తప్ప నియోజకవర్గం, ప్రజల అభివృద్ధి అనేది ఒట్టి మాట. గతంలో ప్రతిపక్షంలో వుండి పార్టీ మారిన పెద్దలు నియోజకవర్గాలను చేసిన అభివృద్ది ఏమిటో అందరికీ తెలిసిందే. ఆ పార్టీలు అధికారంలో లేనపుడు ప్రజల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చి, అధికారం రాగానే తమ జేబులు నింపుకోవటం, కార్పొరేట్‌ కంపెనీల కొమ్ము కాయటం తప్ప జన క్షేమం పట్టదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

‘ప్రత్యేక హోదా ‘అనే తెలుగుదేశం తోలు బొమ్మలాట

31 Sunday Jul 2016

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ 1 Comment

Tags

ap special status, BJP, narendra modi promises, tdp puppetry

ఎం కోటేశ్వరరావు

    ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంపై బిజెపి-తెలుగు దేశం మధ్య ఇంతకాల నడిచిన డ్రామా గురించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి తేట తెల్లమైంది. ఈ అంశంపై తలెత్తిన పరిస్థితి పర్యవసానాలతో రెండు పార్టీల సంబంధాలు ఎలా వుంటాయి అన్నది ఇప్పుడు సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. ఆదివారం నాడు తెలుగుదేశ నాయకులతో సమీక్ష జరిపిన చంద్రబాబు నాయుడు మరికొంత కాలం గడపటానికి వ్యూహ రచన చేసినట్లు కనిపిస్తోంది. ఎంతకాలం అన్నది అప్పుడే చెప్పలేము. అభివృద్ధి పేరుతో అధికారాన్ని అంటి పెట్టుకొని వుండేందుకు అలవాటు పడిన శక్తులు ఎన్నికలు ఇంకా చాలా దూరం వుండి, అధికార పక్షానికి సంపూర్ణ మద్దతు వున్న స్థితిలో అంత తేలికగా కేంద్ర అధికారాన్ని వదులు కుంటాయని చెప్పలేము. రాజ్యసభలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ వ్యవహరించిన తీరు ప్రధాని నరేంద్రమోడీకి తెలియదన్నట్లుగా ఒకసారి ఆయనను కూడా కలిసేందుకు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇదంతా రాజకీయం తప్ప మరొకటి కాదు. జనం కోసం తప్ప ఆమాయకులు, అవివేకులు ఎవరూ లేరు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రయివేటు బిల్లు గురించి ఎంతో చర్చ జరిగిన విషయాన్ని పట్టించుకోనంతగా నరేంద్రమోడీ ఏం రాచ కార్యాలు వెలగబెడుతున్నారు? అసలు మోడీతో మాట మాత్రం కూడా చర్చించకుండా ఇంతటి ముఖ్యఅంశంపై బిజెపి నేతలు ఆషామాషీగా పార్లమెంట్‌కు వచ్చారనుకుంటే జనం చెవుల్లో పువ్వు పెట్టటమే. అననుకూల పరిస్ధితులను కూడా తమ లబ్దికి వుపయోగించుకోవాలనే తెలుగుదేశం ఎత్తుగడ మాత్రమే దీనిలో కనిపిస్తోంది. ఇంత జరిగాక ప్రధాని మోడీని, ఇతర మంత్రులను కలసి కూడా కొత్తగా ఏ వాదనలు వినిపిస్తారో, ఏం సాధించుకువస్తారో ముందు ముందు జనం చూస్తారు.

   ప్రత్యేక హోదా అంశాన్ని వుపయోగించుకొని లబ్ది పొందిన ప్రధమ పార్టీలుగా తెలుగుదేశం-బిజెపి వున్నాయి. అదే ఇప్పుడు భూతంగా మారి భయపెడుతోంది. జరగబోయే రాజకీయ నష్టాన్ని తగ్గించుకొనేందుకు తెలుగుదేశం, బిజెపిలు ప్రయత్నించినట్లే, ఇతర పార్టీలు రాబోయే రాజకీయ లాభాన్ని పెంచుకొనేందుకు పూనుకుంటాయి. జరిగిన మోసం గురించి ఆంధ్రులు ఎలా స్పందిస్తారు అనేది కూడా రానున్న రోజులలో ఆసక్తి కలిగించే అంశమే. మోసాన్ని తట్టుకోలేక నిరాశలో కూరుకుపోయి నిర్వేదంతో మౌనంగా వుంటారా ? లేదా గతంలో అనేక సందర్బాలలో మాదిరి తీవ్ర ఆందోళనకు పూనుకుంటారా అన్నది చూడాలి.

    టాటా-బిర్లా మధ్యలో లైలా అన్న సినిమా మాదిరి తెలుగుదేశం-బిజెపి మధ్య వచ్చిన పవన్‌ కల్యాణ్‌ నుంచి ఎలాంటి పవనాలూ ఇంతవరకు వెలువడలేదు. ఇప్పటి వరకు అనేక మంది పవర్‌ స్టార్‌ను లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య మాదిరి భావిస్తున్నారు. వారి అభిప్రాయం తప్పని నిరూపిస్తారా లేదా అన్నది కూడా తేలిపోవటం అనివార్యం. ప్రత్యేక హోదా అంశం గురించి గతంలోనేను ఈ బ్లాగ్‌లో చేసిన వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి మెచ్చుకున్నవారూ వున్నారు, అవన్నీ వూహాజనితం, అవాస్తవాలని త్వరలో తేలిపోతాయని వివిధ రూపాలలో వ్యతిరేకంగా స్పందించిన వారూ వున్నారు. గుడ్డి అభిమానుల బుర్రలలో లోడ్‌ చేసిన సాఫ్ట్‌వేర్‌ అలాగే వుంటే వారిని స్పందింప చేయటం సాధ్యంగాని పని. ప్రత్యేక హోదా రాదని నిర్ధారణ అయినందుకు నాకేమీ సంతోషం లేదు. ఏ ఒక్క పార్టీకి దీని గురించి చిత్తశుద్ధి లేదని తొలి నుంచి భావించిన వారిలో నేనూ ఒకడిని.

    కేంద్ర ప్రభుత్వం తాను రూపొందించిన నిబంధనలను మార్చకుండా ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక పాకేజీ ఇవ్వటం సాధ్యం కాదు. రాజ్యసభలో చర్చకు సమాధానమిచ్చిన కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ఇచ్చిన సమాధానంలో అది తేటతెల్లమైంది. కేంద్ర ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు అంటే కొన్ని రాష్ట్ర రహదారులకు జాతీయ హోదా కల్పించి వాటి నిర్మాణానికి నిధులు ఇవ్వటం లేదా పరిశ్రమలు, సంస్ధల ఏర్పాటు సందర్బాలలో మాత్రమే కేంద్రంలో వున్న పెద్దలను ప్రభావితం చేసేందుకు అవకాశం వుంటుంది. అలాంటి వాటిని కేంద్ర పాలిత పాంతం లేదా ఏదో ఒక రాష్ట్రంలో పెట్టాలి. ఒక రాష్ట్రంలో పెట్టదలచుకున్నదానిని మార్చి మరొక చోట పెట్టే విచక్షణ అధికారం వుంటుంది.అంతకు మించి నిబంధనలకు విరుద్ధంగా ఒక్క రూపాయిని కూడా కోరుకున్న లేదా బతిమిలాడిన, బెదిరించిన రాష్ట్రాలకు ఇవ్వటానికి లేదు. గత పాతిక సంవత్సరాలుగా రక్షణ రంగంలో తప్ప కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టటం నిలిపివేసింది. ప్రభుత్వ రంగ సంస్ధలలో ఒక్క విద్యుత్‌ రంగంలో తప్ప మిగతా పరిశ్రమలు కొత్తగా పెట్టినవేమీ లేవు, భవిష్యత్‌లో పెట్టాలనే వైఖరి లేదు. విద్యుత్‌ కేంద్రాలను ఎక్కడ పెట్టినా తయారయ్యే విద్యుత్‌లో రాష్ట్రాలకు ఎలాగూ వాటా వుంటుంది. అవి కేంద్ర సంస్ధలు కనుక వుద్యోగాలు కూడా పెట్టిన రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకంగా కేటాయించే అవకాశాలూ వుండవు. అందువలన కేంద్రంతో సఖ్యతగా వుండాలి, ఆ పేరుతో రాష్ట్రాన్ని వుద్దరిస్తాం అని ఏ పార్టీ చెప్పినా అది తన రాజకీయ విధానానికి వేసుకొనే ముసుగుతప్ప మరొకటి కాదు. గత రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం దీనినే రుజువు చేసింది.

   విభజన చట్టంలో పేర్కొన్న పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి కేంద్రం నిధులు ఇస్తే ఆ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడి విజన్‌ 2050 నాటికికూడా ప.ూర్తి కాదు. ప్రపంచ స్ధాయి రాజధానిగా అమరావతి నిర్మాణానికి కేంద్రం ఐదులక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అడుక్కోవటంలో పిసినారి తనం ఎందుకన్న విషయం ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అనేందుకు ఇదొక చక్కటి వుదాహరణ.అదేదో సినిమాలో ఒక జేబులో ఒక ప్రకటన మరో జేబులో మరో ప్రకటన పెట్టుకుతిరిగే పాత్ర మాదిరి బిజెపి వస్తే వంద అడిగితే పది అన్నా ఇవ్వకపోతారా అని గానీ, కాంగ్రెస్‌ వస్తే కోరినంత ఇవ్వలేదన్న దాడి చేయవచ్చన్న ముందుచూపుతో గానీ చంద్రబాబు ఐదులక్షల కోట్లు అడిగారు తప్ప ఇస్తారని నమ్మేంత అమాయకుడు కాదు. తీరా చూస్తే పదిశాతం కాదు కదా కనీసం ఒక శాతం మొత్తం కూడా ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. చివరికి పరిస్థితి చులకనగా, ఎంత దయనీయంగా తయారైందంటే బిజెపి గ్రామ స్ధాయి కార్యకర్త కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్కలు చెబుతారా లేదా అని డిమాండ్‌ చేసే పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది నెలలుగా అలా డిమాండ్‌ చేస్తున్నా చంద్రబాబు అండ్‌ కో రాష్ట్ర ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని దాని గురించిన వాస్తవాలను, వివరాలు చెప్పలేకపోయింది. కింది స్ధాయిలో తామెంత అడ్డగోలు వ్యవహారాలు నడుపుతున్నామో బాగా తెలిసిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు సహజంగానే ఏదో జరగకూడనిది జరిగి వుంటుంది అనే అనుమాన బీజం పడింది.

    ఇంత జరిగినప్పటికీ అసలు వాస్తవాలను ఆంధ్ర జనం ముందు వుంచుతున్నారా అంటే లేదనే చెప్పాలి.ఎందుకంటే ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో. ఎవరు సమాధానం చెప్పాలి? సిపిఎం తప్ప మిగతా పార్టీలన్నీ విభజనకు అనుకూలమే కనుక అవే చెప్పాలి. పార్లమెంట్‌లో మా వాణి వినిపించకుండా చేసి తలుపులు మూసి, చీకటిలో బిల్లును ఆమోదించారని,సక్రమంగా విభజించలేదని తెలుగుదేశం పదే పదే చెబుతోంది. లోపల అంచనాలు, ఆలోచనలు ఏమున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతం ముసుగులో విభజనకు అంగీకరించింది. తీరా విభజన అనివార్యం అని తేలిన తరువాత ఆంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఆందోళన గమనించి తమ రాజకీయ పునాది ఎక్కడ కదులుతుందో అనే భయంతో అక్కడ వ్యతిరేక ఆందోళనలో ఆ పార్టీ భాగస్వామి అయింది, పరోక్షంగానా, ప్రత్యక్షంగానా అన్నది వేరే విషయం.ఆ కారణంగానే సక్రమంగా విభజించటం లేదనే పేరుతో పార్లమెంట్‌లో ఒక పెద్ద డ్రామాకు తెలుగుదేశం తెరతీసింది. అప్పుడు సక్రమంగానే తమ వారు వ్యవహరించారని ప్రశంసించిన చంద్రబాబు ఇప్పుడు బిజెపి నమ్మక ద్రోహం సందర్భంగా సరిగా వ్యవహరించలేదని తమ కేంద్ర మంత్రులు,ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, దానికి కారణం తగిన సమాచారం అందకపోవటమే అని వారు సంజాయిషీ ఇచ్చి, అవసరమయితే రాజీనామాలకు సిద్ధం అని చెప్పినట్లు లీకుల కధనాలు బయటకు వచ్చాయి. అంటే తెలుగుదేశం పార్టీ ఒక తోలుబొమ్మలాట కంపెనీ అనుకుంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తోలు బొమ్మలు, వాటిని ఆడించే కధకుడు చంద్రబాబు. ప్రదర్శన రక్తి కట్టలేదంటే దానికి కారణం ఆడించేవారిది తప్ప బొమ్మలది కాదు అన్నది వేరే చెప్పనవసరం లేదు.నాడు పార్లమెంట్‌లో విభజన బిల్లు సందర్భంగా తెలుగుదేశం సభ్యులు చేసిన రచ్చను మెచ్చిన జనం నేడు ఇదేమిటంటూ తెగడుతున్నారు. అందుకే నష్ట నివారణ చర్యలలో భాగంగా తెలుగుదేశం లీకుల విభాగం చురుకుగా కదలి నాయకుడు సమర్ధుడే మిగిలినవారే తమ పాత్రలను సరిగా పోషించలేదనే ట్టుకధలు వినిపిస్తున్నది. దీన్ని అర్ధం చేసుకోలేనంత అమాయకంగా మేథావులు వుండవచ్చేమోగాని సామాన్య జనం లేరు. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో మేథావుల తరగతిలోని అత్యధిక వర్గం ఏం చేస్తున్నదో, ఏం ఆలోచిస్తున్నదో తెలియని స్ధితి.

  అంతర్జాతీయంగా తగిలిన ఎదురు దెబ్బలు, బూర్జువా వ్యవస్ధ పార్లమెంటరీ రంగంలో పని చేయాలని నిర్ణయించుకున్న తరువాత ఎదురయ్యే సమస్యలపై వామపక్ష పార్టీలు తీసుకొన్న వైఖరి, దానికి వున్న పరిమితులు, కొత్త పరిస్థితులలో ఎదురయ్యే సవాళ్లను పూర్తిగా కింది స్ధాయి కార్యకర్తలకు వివరించటంలో కూడా వామపక్షాలు జయప్రదం కాలేకపోయాయి. వామపక్షాలు అధికారంలో వున్న చోట్ల ఒక్క అవినీతి, అక్రమ ఆరోపణలు లేకపోయినా, ఎలాంటి కుంభకోణాలలో ఇరుక్కోకపోయినా, నాయకత్వంలో ఒకరో అరో తప్ప పార్టీలు మారటం వంటి అవకాశ వాద వైఖరి లేకపోయినా సామాన్య జనం ఆ పార్టీలు మంచివే అని భావించినప్పటికీ రాజకీయంగా ప్రభావం చూపించలేవనే భావనతో ఓటింగ్‌ , ఇతర సందర్బాలలో దూరంగా వుంటున్నారు. జనానికి విశ్వాసం కలిగించటం వామపక్షాల ముందున్న పెద్ద సవాలు.

     ఇంతకాలం కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సిపి మీద ఒంటి కాలితో లేచే పరిస్థితి ఇక ముందు తెలుగు దేశానికి వుండదు. ఎందుంటే కాంగ్రెస్‌ ద్రోహం బహిరంగం. బిజెపితో కుమ్మక్కయి ఆ పార్టీ వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చీల్చింది. ఇప్పుడు బిజెపి నాయకత్వం తెలుగుదేశంతో కుమ్మక్కయి నమ్మక ద్రోహం చేసింది. జగన్‌ మోహన్‌ రెడ్డి తనపై వున్న కేసుల కారణంగా బిజెపి ప్రభుత్వం పట్ల మెతకగా వుంటున్నారనే దాడి ఇక ముందు కుదరదు.ఎందుకంటే ప్రతిపక్షంలో వున్న ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రం పట్ల ఎలా వున్నప్పటికీ అది రాష్ట్ర అభివృద్దిని ప్రభావితం చేసే పరిస్థితి వుండదు. అధికారంలో వున్న మరొక ప్రాంతీయ పార్టీ కేంద్రంతో సఖ్యతగా వున్నా, రాజకీయంగా భుజం మార్చుకోకుండా కేంద్రంలో వున్న పార్టీని మోసినా ప్రయోజనం లేదని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా నిరూపించింది. అందువలన రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలలో విమర్శలు, ఆరోపణలు కొత్త రూపం సంతరించుకోవటం తధ్యం. కేంద్రంతో సఖ్యతతో వుండే రాష్ట్ర ప్రభుత్వమే సాధించేందేమీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల అభీష్టం మేరకు అధికారపక్షంలో చేరా అని చెప్పుకొనే జంప్‌ జిలానీల నోరు పడిపోవటం ఖాయం. వారంతా గత ఎన్నికలలో పెట్టిన ఖర్చును రాబట్టుకొని వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ పరిస్థితి వాటంగా వుంటే ఆ పార్టీ టిక్కెట్‌, జనం ఓట్లు కొనేందుకు అవసరమైన డబ్బు దండుకొనేందుకు తప్ప నియోజకవర్గం, ప్రజల అభివృద్ధి అనేది ఒట్టి మాట. గతంలో ప్రతిపక్షంలో వుండి పార్టీ మారిన పెద్దలు నియోజకవర్గాలను చేసిన అభివృద్ది ఏమిటో అందరికీ తెలిసిందే. ఆ పార్టీలు అధికారంలో లేనపుడు ప్రజల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చి, అధికారం రాగానే తమ జేబులు నింపుకోవటం, కార్పొరేట్‌ కంపెనీల కొమ్ము కాయటం తప్ప జన క్షేమం పట్టదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రపంచీకరణకు వ్యతిరేకతపై కార్పొరేట్లలో ఆందోళన

27 Wednesday Jul 2016

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

anti globalization movement, corporates, corporates worry, G 20, globalization, IMF, WB

నేను ప్రపంచీకరణకు అనుకూలమే అయినప్పటికీ ప్రపంచీకరణ వ్యతిరేకులు ముందుకు తెస్తున్న ముఖ్యమైన సమస్యల కారణంగా దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పాలి: అమర్త్యసేన్‌

ఎం కోటేశ్వరరావు

   రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తమ లాభాలను కాపాడుకొనేందుకు ముందుకు తెచ్చిన ప్రపంచీకరణకు నూరేళ్లు నిండనున్నాయని కార్పొరేట్లలో ఆందోళన మొదలైందా? గత కొద్ది రోజులుగా పశ్చిమ దేశాల పత్రికలలో వెలువడుతున్న వ్యాఖ్యలు వారి మనోభావాలకు అద్ధం పడుతున్నాయి.జూలై మూడవ వారంలో చైనాలోని చెంగుడులో జరిగిన జి 20 దేశాల ఆర్ధిక మంత్రుల, రిజర్వుబ్యాంకుల గవర్నర్ల సమావేశంలో అనేక మంది ప్రపంచీకరణకు పెరుగుతున్న ప్రతిఘటన గురించి ఆందోళన వెలిబుచ్చారు. ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని ఓటింగ్‌ నిర్వహించిన నెల రోజుల తరువాత జరిగిన ఈ సమావేశంలో సహజంగానే దాని పర్యవసానాల గురించి చర్చ జరిగింది. అభివృద్ధి, ఆర్ధిక సరళతతో కలిగిన లబ్దిని సభ్య దేశాలు, అన్నిదేశాల మధ్య పంపకానికి ఇంకా ఎంతో చేయాలనటంపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టినా లాగార్డే వ్యాఖ్యానించగా పశ్చిమ దేశాలలో ప్రపంచీకరణకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌ హెచ్చరించాడు.అయితే ఈ సమావేశంలో ఆ దిశగా ఎలాంటి నిర్ధిష్ట ప్రతిపాదనలు రాలేదు.అమెరికా విత్త మంత్రి జాకబ్‌ జె లీ విలేకర్లతో మాట్లాడుతూ పొదుపు చర్యలపైగాక అభివృద్ధి గురించి ఏకాభిప్రాయం వ్యక్తమైందని అన్నారు. ఈ సమావేశం ఏదైనా ఒక సందేశం అందించిందంటే జరుగుతున్న పరిణామాల పట్ల ప్రపంచవ్యాపితంగా ఓటర్లు సంతోషంగా లేరన్నదే అది అని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న ఎఎంపి కాపిటల్‌ ఇన్వెస్టర్స్‌ అధికారి షేన్‌ ఆలివర్‌ వ్యాఖ్యానించాడు.

   చెంగ్‌డు సమావేశం ముగిసిన కొద్ది సేపటి తరువాత నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిగా ఎంపికైన డోనాల్డ్‌ ట్రంప్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కార్యకలాపాలను వెలుపలి దేశాలకు తరలించిన అమెరికన్‌ కంపెనీల వస్తువులపై పన్నులు వేయాలన్న తన ప్రతిపాదనను అడ్డుకొనేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటిఓ) ప్రయత్నించిందని,ఈ కారణంగా తిరిగి సంప్రదింపులు జరిపేందుకు లేదా దాని నుంచి బయటకు పోవటం గురించి ఆలోచిస్తామని బెదిరించాడు. ఆర్ధిక వ్యవస్ధలో ఎదురవుతున్న ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు ఒక్క జూన్‌ నెలలో చైనా మార్కెట్‌లోకి 244 బిలియన్‌ డాలర్ల విలువగల కొత్త రుణాలను విడుదల చేసింది. దీంతో వినిమయం, సేవల వినియోగాన్ని పెంచటం ద్వారా తగ్గుతున్న ఆదాయాన్ని నిలుపుకొనేందుకు చర్యలు తీసుకుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా, చైనా, జపాన్‌ తరువాత అతి పెద్ద ఆర్ధిక శక్తిగా వున్న దక్షిణ కొరియా వుపాధికి వూతమిచ్చేందుకు 987 కోట్ల డాలర్ల అనుబంధ బడ్జెట్‌ను ప్రతిపాదించగా కెనడా 838 కోట్ల డాలర్ల మేరకు అదనంగా ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇవన్నీ కూడా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని అదుపు చేసే చర్యలలో భాగమే.

   ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ కోలుకుంటున్నప్పటికీ అవసరమైనదాని కంటే బలహీనంగా వుందని,అనేక సవాళ్లున్నాయని జి 20 ప్రకటన పేర్కొన్నది. వుక్కు వంటి పరిశ్రమలలో అవసరానికి మించిన సామర్ధ్యం వలన కేవలం వాణిజ్యం మాత్రమే గాక కార్మికులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారని కూడా ప్రకటన వ్యాఖ్యానించింది.

    స్వేచ్ఛా వాణిజ్యానికి దాడి ముప్పు వుంది, అయితే అది ఎప్పటి కంటే ఎంతో ప్రాధాన్యత కలిగిందని ఫార్చ్యూన్‌ పత్రిక వ్యాఖ్యాత అలన్‌ మురే పేర్కొన్నారు. దాని సారాంశం ఇలా వుంది. గత అర్ధశతాబ్ది కాలంలో కీలకమైన వాణిజ్య ధోరణిగా వున్న ప్రపంచీకరణ తిరోగమనంలో వుంది. తమ వుద్యోగాలు హరించుకుపోవటానికి ఇదే కారణమని అమెరికా, బ్రిటన్‌లో మిలియన్ల మంది ఓటర్లు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పౌరుల్లో కలిగిన పెద్ద కుదుపు బ్రెక్సిట్‌ రూపంలో వెల్లడైంది. ప్రపంచీకరణను సమర్ధించాలని ఇప్పుడెవరూ కోరుకోవటం లేదని వెల్లడిస్తున్నది. ప్రపంచీకరణ విజయం హరించుకుపోతున్నదని ఫార్చ్యూన్‌ పత్రిక రూపొందించిన ఐదువందల ప్రపంచ కంపెనీల జాబితా వివరాలు నిర్ధారిస్తున్నాయి. 2015లో వాటి అమ్మకాలు 11.5శాతం తగ్గి 27.6లక్షల కోట్ల డాలర్లకు పడిపోయాయి.ఆదే రీతిగా లాభాలు కూడా పడిపోతున్నాయి. ప్రపంచీకరణ విమర్శకులు చెబుతున్నదానికంటే పరిస్థితి మరింత సంక్లిష్టంగా వుందన్నది వాస్తవం.

   మెక్సికో మాజీ మంత్రి, ప్రొఫెసర్‌ జార్జ్‌ జి కాస్టేండా ప్రపంచీకరణ గురించి మరో రూపంలో విమర్శించారు.’అసమర్ధ నాయకత్వం రూపొందించిన పనికిమాలిన ప్రపంచీకరణ’ అనే శీర్షికతో విశ్లేషించారు. దాని సారాంశం ఇలా వుంది. 1950 దశకం నుంచీ ఐరోపా దేశాలు ప్రాంతీయ సమగ్రత వలన కలిగే లాభ నష్టాల గురించి చర్చిస్తున్నాయి. అయితే ప్రపంచకీరణ, స్వేచ్ఛా వాణిజ్యం, వలస వాటి ఆర్ధిక పర్యవసానాల కేంద్ర అంశంగా ఆ చర్చ సాగిందని బ్రెక్సిట్‌తో స్పష్టమైంది.ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని తీర్పు నిచ్చి బ్రిటన్‌ పౌరులు తప్పు చేశారు. విడిపోవాలనే ప్రచారం వెనుక వున్న కారణాన్ని కలసి వుండాలని కోరుకొనే వారు కూడా విస్మరించి తప్పు చేశారు. ఆ ప్రభావశీల కారణాలు ఒక్క బ్రిటన్‌ లేదా ఐరోపా యూనియన్‌ సభ్య దేశాలు, ప్రపంచమంతటా వున్న ప్రజాస్వామిక దేశాలన్నింటా వున్నాయని వారు గుర్తించలేదు. అసమర్ధ రాజకీయ నాయకత్వం ప్రపంచవ్యాపితంగా కొత్త ప్రమాదాలను ప్రేరేపిస్తున్నది. ఐరోపా వాసులను ఒక్కటిగా చేయాలని సాగుతున్న ప్రయత్నం సాకారం కావటం అంత సులభం కాదు. దానితో పాటు అనేక సమస్యలను పరిష్కరించాల్సి వుంది. ప్రపంచీకరణ, స్వేచ్ఛా వాణిజ్యం, వలస, అసమానత సమస్యలను దీర్ఘకాలంగా అ న్ని చోట్లా ధనిక దేశాలు విస్మరించాయి. 1990దశంలో అమెరికా అధ్యక్షులు జార్జిడబ్లు బుష్‌, బిల్‌క్లింటన్‌ మెక్సికో పాలకుల స్వేచ్ఛా వాణిజ్య మానసిక స్ధితి దాని వలన ప్రతికూలంగా ప్రభావితమయ్యేవారికి పరిహారం అందించటాన్ని రాజకీయంగా వాస్తవంలో అసాధ్యం చేశారు. ఈ విధానం విఫలం చెందిన 20 సంవత్సరాల తరువాత మనస్సు విరిగిన ఓటర్లు రిపబ్లికన్‌ పార్టీ డోనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ పార్టీ బెర్నీ శాండర్స్‌ వైపు చేరటం ఆశ్చర్యం కాదు. ఆకర్షించే నినాదాలతో ఇద్దరూ వారిని బుట్టలో వేసుకున్నారు. ఇద్దరూ భిన్నమైన నినాదాలు ఇచ్చినప్పటికీ ఓటర్లు ఆకర్షితులు కావటానికి కారణం మాత్రం గత రెండు దశాబ్దాల విఫల విధానాలే. వాటిని సరిచేసేందుకు జరిగే ఏ ప్రయత్నమైనా వాస్తవాల ప్రాతిపదికనే జరగాలి.

   2008-2009 సంవత్సరాల తీవ్ర మాంద్యం తరువాత అమెరికా వుత్పాదక రంగంలో అనేక కొత్త వుద్యోగాల కల్పన జరిగిందని తెలుసుకుంటే వుభయుల మద్దతుదార్లు ఆశ్చర్యపోతారు. మిలియన్ల కొద్దీ వుత్పాదక వుద్యోగాలను చైనా, మెక్సికో వంటి దేశాలకు బదిలీ చేసిన తరువాత ఈ కల్పన కొంత మేరకు ఆ గండిని పూడ్చిందని, అయితే పోయిన వాటికంటే కొత్తగా ఎక్కువ సృష్టించవచ్చని ఎవరైనా వాదించవచ్చు. వుద్యోగాల బదిలీ తరువాత అమెరికా మరింత పోటీదారుగా తయారైంది, అందుకు చైనాకు కృతజ్ఞతలు చెప్పాలి. వేరే దేశాలకు వుద్యోగాలు తరలి పోయిన తరువాత అమెరికాలో కల్పించిన వుద్యోగాలు ఎలాంటివన్నది ప్రధాన సమస్య. ఆర్ధిక పర్యవసానాలను విధాన నిర్ణేతలు విస్మరించారు. యాభై, అరవయ్యవ పడిలో వున్న కార్మికులు గంటకు 30 డాలర్ల వుద్యోగాలు, ఆరోగ్యసంరక్షణ, పెన్షన్‌ లబ్దులను కోల్పోయి అంతకు ముందు పొందిన వేతనాల కంటే సగానికి, ఇతర లబ్దులేమైనా మిగిలి వుంటే ఆ కొన్నింటిని మాత్రమే పొందటానికి సిద్ద పడ్డారన్నది మరిచిపోకూడదు. విధాన నిర్ణేతలు ప్రపంచీకరణ బాధితుల గురించి పట్టించుకోలేదు, ఎందుకంటే వారిని పట్టించుకోవాలన్న అవసరం వుందని వారు అనుకోలేదు. మార్కెట్టే అన్నింటినీ తనంతట తానే పరిష్కరిస్తుందని భావించారు కానీ జరగలేదు, విధాన నిర్ణేతలకు అది పాఠం నేర్పలేదు. గతేడాది పసిఫిక్‌ దేశాల భాగస్వామ్య ఒప్పందం సానుకూలంగా కుదరింది కానీ అమెరికన్‌ కార్మికుల రక్షణకు చేసిందేమీ లేదు.

   మెక్సికోలో కూడా ఇదేమాదిరి ప్రపంచీకరణ వ్యతిరేకత పెల్లుబికింది. నాఫ్టా గురించి ఎక్కువగా చెప్పారు, ఎక్కువగా విమర్శలకు గురైంది. ఆ ఒప్పందం ఎగుమతులు పెంచుతుందని భావించారు, అలాగే జరిగింది గానీ అమెరికా దిశగా వలసలను తగ్గించలేకపోయింది. అనేక మెక్సికో పరిశ్రమలు, వాణిజ్య, వ్యవసాయ సంస్ధలు మరింతగా పోటీ పడేవిధంగా తయారయ్యాయి, జిడిపి దామాషాలో చూస్తే చాలా తక్కువగా , తాత్కాలికంగా విదేశీ పెట్టుబడులు పెరిగాయి. నాఫ్టా వలన మెక్సికో అనేక సంస్కరణల మధ్య చిక్కుకుపోయింది తప్ప వాగ్దానం చేసినట్లుగా అభివృద్ధి జరగలేదు.1994 నుంచీ వృద్ధి చెందుతున్న మార్కెట్‌ ప్రమాణాల ప్రకారం చూస్తే తక్కువగా వార్షిక పెరుగుదల రేటు 2.5శాతం మాత్రమే వుంది. వుత్పాదకత, వుపాధి, వేతనాలు కూడా ఆశాభంగం కలిగించాయి. ఈ ఒప్పందం తరువాత ప్రపంచీకరణ ప్రతికూల ప్రభావాలను అధిగమించేందుకు అవసరమైన వుత్పాదక రంగ కార్మికులకు వేతన పెంపుదలను ఎన్నడూ అమలు జరపలేదు. యావత్‌ దేశం నేడు మూల్యం చెల్లిస్తున్నది, మెక్సికన్లు అసంతృప్తితో వున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను పెంచటానికి ఆ ఒప్పందం దోహదం చేసింది, 2018లో జరిగే సాధారణ ఎన్నికల ఫలితాన్ని అది ప్రభావితం చేయగలదు. ఈ నాటి కొత్త విషయం ఏమిటంటే ఐరోపా, వుత్తర అమెరికా ఖండంలో ప్రజావ్యతిరేకతను గతం కంటే మెరుగ్గా అదుపు చేయగలమని విధాన నిర్ణేతలు విశ్వసించారు.బ్రిటన్‌లో ఓటర్ల తీర్పును చూసిన తరువాత అమెరికా, మెక్సికో ఏ దేశమూ కూడా వాటి నాయకత్వాల తప్పిదాలకు అతీతంగా వుంటుందని చెప్పలేము.

   బ్రెక్సిట్‌ సందర్బంగా బ్రిటన్‌ కార్పొరేట్‌లు స్ధూలంగా రెండుగా చీలిపోయారన్నది స్పష్టం. ఒకటి యూనియన్‌లోనే వుండి లబ్ది పొందాలని చూడగా విడిపోయి ఎవరికి వారం తేల్చుకుందామనే వైఖరిని మరొకటి తీసుకుంది. దున్న, ఎద్దు కాడి మాదిరి. ఎండ ముదరగా ఎద్దు నీడ వైపు లాగితే దున్న ఎండవైపుకు మొగ్గుతుందన్నట్లుగా పెట్టుబడిదారీ వ్యవస్ధలో, అందునా అవసరాలకు మించి వుత్పత్తులు జరుగుతున్నపుడు వుత్పాదక రంగంలో ఎగుమతులపై ఆధారపడిన వారి వైఖరి ఒక విధంగానూ దిగుమతులపై ఆధారపడిన వారి వైఖరి మరొక విధంగానూ వుండటం అని వార్యం.

    వుదాహరణకు ఈ విరుద్ధ ప్రయోజనాల మధ్య కరెన్సీ విలువ పైకీ కిందికీ లాగబడుతోంది.బలమైన డాలరు కారణంగా తమ ఆదాయం, లాభాలపై సంవత్సరాల తరబడి ప్రతికూల ప్రభావం పడటంపై విచారించిన అమెరికన్‌ కార్పొరేట్లు ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు. దాని ప్రభావం ఈఏడాది తొలి త్రైమాసికంలో డాలరు విలువ ఐదునెలల కనిష్టానికి పడిపోయింది. బలహీనపడిన డాలరు అమెరికా ఎగుమతులు పెరగటానికి దోహదపడింది.ఈ ఏడాది తమ లాభాలు పెరగటానికి ఇదొక కారణమని ఔషధ రంగంలోని ఫైజర్‌,ఎలీలిలీ, డ్యూపాంట్‌ కంపెనీలు పేర్కొన్నాయి. హోటల్‌ రూములలో చేరేవారి సంఖ్య పెరిగింది, టూరిజం లాభపడింది, న్యూయార్క్‌ నగరానికి ఐరోపా యాత్రికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇదే విధంగా మరికొంత కాలం డాలరు విలువ తక్కువగా వుంటే పెట్టుబడులు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. డాలరు విలువ ఎక్కువగా వున్న కారణంగా గతేడాది కార్పొరేట్‌ కంపెనీలు 112 బిలియన్‌ డాలర్ల ఆదాయం కోల్పోయాయి.డాలర్లు ఆవిరైంది.

   ప్రపంచీకరణ కార్మికులకు ఎంత నష్టదాయకమో కొన్ని కార్పొరేట్‌ సంస్ధలకు కూడా అదే పరిస్ధితిని సృష్టిస్తోంది. అందువలన కార్పొరేట్‌ సంస్ధల మధ్య కూడా మిత్ర వైరుధ్యం పెరగటం అనివార్యం. అది శతృవైరుధ్యంగా మారినపుడు పరిణామాలు ఎలా వుంటాయనేది ఇపుడే వూహించలేము. అనేక దేశాలలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు ప్రపంచీకరణ స్ధూలంగా కార్పొరేట్లకు లాభదాయకం-కార్మికవర్గానికి నష్టదాయకం అన్నది ఇటీవలి కాలంలో మరింత స్పష్టమైంది. ఇప్పటి వరకు ప్రపంచీకరణ అమలుకు ఒక సాధనంగా వుపయోగపడిన ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల అధిపతులే వారు రానున్న రోజులలో ప్రపంచీకరణకు మరింత వ్యతిరేకత వ్యక్తం కానుందని ముందస్తు హెచ్చరికలు చేయటమే కొత్త విషయం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పత్తి ధరపై చైనాకు తగ్గుతున్న ఎగుమతుల ప్రభావం వుంటుందా ?

26 Tuesday Jul 2016

Posted by raomk in AP NEWS, CHINA, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Telangana

≈ Leave a comment

Tags

cotton, cotton farmers, cotton imports, indian farmers, yarn

ఎం కోటేశ్వరరావు

    ఎగువన వున్న తుంగభద్ర జలాశయమే పూర్తిగా నిండలేదు, అనూహ్యమైన వాతావరణ మార్పులు సంభవిస్తే తప్ప ఈ ఏడాది కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలు నిండటం అనుమానమే. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం పడిన కొద్ది పాటి వర్షాలకే మరో మార్గం కానరాక ఎన్నో ఆశలతో ఈ ఏడాది కూడా పత్తి సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే సీజన్‌కు క్వింటాలుకు పొడవు పింజ పత్తిరకాల మద్దతు ధర మరో అరవై రూపాయలు పెంచి రు.4,160గా ప్రకటించి ఎంతో మేలు చేసినట్లుగా చెప్పుకుంటోంది. ఏవి మోడీ 2022 నాటికి వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చేస్తామని మొన్న చేసిన చేసిన వాగ్దానాల అమలు ఎక్కడ అని ఎవరైనా అడిగితే దేశ భక్తులు కాదని ముద్ర వేసే ప్రమాదం లేకపోలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులను అడిగితే ఒకరు వైఎస్‌ఆర్‌సిపి మీద మరొకరు తెలుగుదేశం, కాంగ్రెస్‌ మీద విరుచుకుపడి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తారు. చంద్రబాబు నాయుడికి నరేంద్రమోడీతో రోజురోజుకూ మరింతగా బిగుస్తున్న స్నేహ ధర్మం అడ్డు వచ్చి, పత్తి వేసుకోవద్దని ముందే సలహా ఇచ్చాం కదా అని చంద్రశేఖరరావు కూడా దీని గురించి పట్టించుకోరు. ఆంధ్రప్రదేశ్‌లో అనధికారికంగా అన్నీ తానే అయినట్లు వ్యహరిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న(ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వం వాటిని ఖండించలేదు) లోకేష్‌, తెలంగాణాలో తానే ముఖ్యమంత్రిని అన్నట్లుగా హడావుడి చేస్తున్న మంత్రి కెటిఆర్‌కు గానీ తమ రాష్ట్రాలలో పత్తి ఒక ప్రధాన పంట అనిగానీ రైతాంగంపై దాని ధరలు, మార్కెటింగ్‌ తీవ్ర ప్రభావం చూపుతాయని గానీ అనుకుంటున్నారో లేదో తెలియదు.

   చైనా ప్రస్తావన తేవటం కొంత మందికి ఆగ్రహం తెప్పించవచ్చు. ఏం చేస్తాం, వాస్తవాల మీద ఆధారపడినపుడు ప్రపంచమే చైనాను విస్మరించజాలదు, మన మార్కెట్‌ను కూడా చైనా వస్తువులు ముంచేస్తున్నపుడు మనం దూరంగా ఎలా వుంటాం.నిత్యం చైనాను కట్టడి చేయాలని, దాని వస్తువులను నిషేధించాలని వీరంగం వేస్తున్నవారితో సహా మన పత్తి, నూలును చైనా కొనటం నిలిపివేస్తే ఎవరూ చేసేదేమీ లేదు,పరిస్ధితి మరింత దిగజారుతుంది. అందుకే నరేంద్రమోడీ సర్కార్‌ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఏప్రిల్‌ చివరి వారంలో జెంగ్‌జౌ వస్తు మార్కెట్‌లో ఒక్క రోజులోనే 4.1కోట్ల బేళ్ల పత్తి లావాదేవీలు జరిగాయి. ఒక బేలు పత్తితో 215 జతల జీన్స్‌ తయారు చేయవచ్చు. మరో విధంగా చెప్పాలంటే ఆ ఒక్క రోజు అమ్మిన పత్తితో భూమ్మీద ప్రతి ఒక్కరికీ కనీసం ఒక జీన్స్‌ పాంట్స్‌ తయారు చేయటానికి సరిపోతుందని అంచనా.

  వ్యవసాయం గురించి అనుచితంగా మాట్లాడిన చంద్రబాబు పర్యవసానాలతో పది సంవత్సరాలపాటు అధికారానికి దూరంగా వుండి, కంగుతిని తరువాత ఓట్ల కోసం సవరించుకున్నారు. ఆచరణలో ఏం చేస్తున్నారు? ప్రధాని నరేంద్రమోడీ, ఇద్దరు తెలుగు చంద్రులు, వారి వారసులు పోటీ పడి విదేశీ పర్యటనలు చేస్తున్నారు. లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు తెస్తున్నట్లు పుంఖాను పుంఖాలుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. వాటిలో పదిశాతం లేదా ప్రయాణ, ప్రచార ఖర్చులు ఏది ఎక్కువైతే ఆ మొత్తం వాస్తవ రూపం దాల్చినా మంచిదే. ఆ పెట్టుబడులు వందల కొలదీ చేసుకున్నామని చెబుతున్న ఒప్పందాలలో రైతాంగానికి పనికి వచ్చేవి ఎన్ని? పొగాకు అమ్ముడు పోక రైతాంగం దిక్కుతోచకుండా వుంటే కొనటానికి కేంద్రాన్ని ఒప్పించలేని పెద్దలు తల్లికి తిండి పెట్టని కొడుకులు పిన్నికి బంగారు తొడుగులు వేయిస్తామన్నట్లుగా వ్యవసాయం గురించి చెపితే రైతులు చెవులో పూలు పెట్టుకొని నమ్మాలా ? అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గిన కారణంగా దిగుమతి చేసుకున్న ఎరువుల ధరలు తగ్గితే వ్యాపారులు ఆమేరకు తగ్గించకుండా వసూలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి, వాటిపై నియంత్రణ వుందా ?

    మన పత్తికి ఇప్పుడున్నదాని కంటే మంచి ధర రావాలంటే చైనాకు మరిన్ని ఎగుమతులు జరిగితే తప్ప రాదన్నది స్పష్టం. 2015లో మన దేశం నుంచి చైనాకు ఎగుమతి చేసిన నూలు, దానికి వచ్చిన రేటు 12,17శాతం చొప్పున తక్కువగా వున్నాయని తాజా సమాచారం. ముందే చెప్పుకున్నట్లు తన దగ్గర వున్న అపార పత్తి నిల్వలను చైనా మార్కెట్‌కు విడుదల చేస్తోంది. ఈ స్ధితిలో మన పత్తి రైతులకు ధర గతం కంటే ఎలా మెరుగుపడుతుందో తెలియని స్ధితి. మిలియన్ల మంది పత్తి రైతులు, వారి పొలాల్లో పని చేసే వ్యవసాయ కార్మికుల సంక్షేమం పట్టించుకోకుండా పారిశ్రామిక, వ్యాపారాలలో పెట్టుబడుల ఎండమావులు వెంట తిరిగితే ప్రయోజనం వుంటుందా ?

    గతేడాది చైనాకు ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. అయితే వియత్నాం, బంగ్లాదేశ్‌ కొంత మేరకు దిగుమతులు పెంచటంతో పత్తి ధర సీజన్లో మద్దతు ధరకు అటూఇటూగా అయినా వుంది.ఈ ఏడాది వారు కూడా తమకు ఎక్కడ చౌకగా దొరికితే అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే మన రైతాంగ పరిస్ధితి ఏమిటి ? రైతులు పచ్చగా లేకుండా లోకేష్‌ బాబుతో కలసి చంద్రబాబు అంతర్జాతీయ స్ధాయిలో రాజధాని అమరావతిని నిర్మించినా, చంద్రశేఖరరావు అండ్‌ ఫ్యామిలీ భాగ్యనగరాన్ని మరింతగా అభివృద్ధి చేసినా ప్రయోజనం ఏమిటి ?

    తమకు నష్టాలు వస్తున్నాయనే పేరుతో నూలు మిల్లులు వారానికి కొన్ని గంటల పాటు వుత్పత్తిని తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఈ ఏడాది జూన్‌లో మన దేశం నుంచి పత్తి నూలు 8.2 కోట్ల కిలోలు 74 దేశాలకు ఎగుమతి అయింది. మేనెలతో పోల్చితే కిలోకు ఏడు సెంట్ల ధర పెరిగినా ఏడాది క్రితంతో పోల్చితే 24 సెంట్లు తక్కువ.ఈ స్ధితిలో ఈ ఏడాది నూలు ఎగమతిదారులు ఏ ధైర్యంతో పత్తిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారు? గతం కంటే దిగుమతులు తగ్గినప్పటికీ మన పత్తి, నూలు ఎగుమతులు చైనాకే ఎక్కువగా జరుగుతున్నాయి.

     ఆంధ్రప్రదేశ్‌ సమాచార శాఖకు కొత్తగా వచ్చిన కమిషనర్‌ తన ప్రత్యేకతను ముఖ్యమంత్రి ముందు ప్రదర్శించుకొనేందుకు లేదా తాము ఎన్ని విజయాలు సాధించినా వాటి సమాచారం జనంలోకి వెళ్లటం లేదన్న ముఖ్యమంత్రి ఆగ్రహం వల్లగానీ సమాచార శాఖ కొత్తగా పరిశోధన అవలోకన( రిసర్చ్‌ రిఫరెన్సు) విభాగాన్ని ఏర్పాటు చేసి పుంఖాను పుంఖాలుగా పొత సమాచారాన్ని కొత్తగా మీడియాకు అందచేస్తున్నది. వాటిలో కొన్ని ఇలా వున్నాయి. 2050 నాటికి అంటే మరో 34 సంవత్సరాల నాటికి అమరావతి నగరంలో 12లక్షల వుద్యోగాలు సేవల రంగంలో మూడు లక్షల వుద్యోగాలు పరిశ్రమల రంగంలోనూ కల్పించేందుకు చంద్రబాబు కృషి. ఇందుకు గాను మౌలిక వసతుల కల్పనలా భాగంగా 3,746 కిలోమీటర్ల జాతీయ రహదారులకు(ఇవి ఇతర ప్రాంతాలలో కూడా వుంటాయనుకోండి) గాను రు.34,732 కోట్లు, అమరావతి రింగురోడ్డు, ఇతర 720 కిలోమీటర్ల రోడ్డకు రు.30వేల కోట్లు,రేవులను కలిపే 419 కిలోమీటర్ల ప్రధాన రహదారులకు రు.4,306 కోట్లు ఇంకా మరికొన్ని రోడ్ల గురించి సమాచార శాఖ తెలిపింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అశోక్‌గజపతి రాజు అర్ధికశాఖ మంత్రిగా వుండగా కూడా ఇలాగే రోడ్ల నిర్మాణం, వాటికి విదేశీ అప్పుల గురించి వాటి ద్వారా జరిగే అభివృద్ధి గురించి వూదరగొట్టిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తిరిగి ఇప్పుడు అదే జరుగుతోంది. రోడ్లు వేస్తే కాంట్రాక్టర్లు వస్తారు, కాంట్రాక్టర్లు వస్తే కొంత మందికి జేబులు నిండుతాయి, జనానికి టోలు ఫీజు రూపంలో జేబులు ఖాళీ అవుతాయి. రోడ్లు వేయటానికి ముందు, తరువాత తమ వుత్పత్తులకు వస్తున్న రేట్లలో తేడా ఏముందో మదనపల్లి టమాటో రైతులు చెప్పాలి. వుల్లి ధరలు పెరిగి వినియోగదారులకు, తగ్గి రైతులకు కన్నీరు తెప్పించిన విషయం కర్నూలులో ఏ రైతును అడిగినా చెబుతారు.పత్తి, పొగాకు ధరల గురించి వేరే చెప్పనవసరం లేదు.

   కొన్ని రోడ్ల నిర్మాణానికే దాదాపు 70వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న చంద్రబాబు సర్కార్‌ రైతులకు ఏం చేస్తోంది? పదిహేడు లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాల వుత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం చేయనున్న ఖర్చు 120 కోట్లు అని సమాచార శాఖ పేర్కొన్నది. పాతిక కిలోమీటర్ల రోడ్డు వేయటానికి అయ్యేఖర్చును కూడా వ్యవసాయంపై పెట్టటానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Gazette Notification relating to 7th Pay Commission Recommendations

26 Tuesday Jul 2016

Posted by raomk in Current Affairs, employees, INDIA, NATIONAL NEWS, Pensioners

≈ Leave a comment

Tags

7th Pay Commission Recommendations, Gazette Notification, Ministry of Finance

          The Ministry of Finance has issued Gazette Notification with regard to 7th Pay Commission Recommendations.

For more details, please see.

Resolution on Cabinet Decision

Revised Pay Rules 2016

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Increase in income limit for OBC non Creamy Layer

25 Monday Jul 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Creamy Layer, income limit, OBC

Government of India
Ministry of Social Justice and Empowerment
Rajya Sabha

Unstarred Question No-516
Answered on – 21.07.2016

516 . Dr. R. Lakshmanan

(a) whether any proposal is pending with Government to increase the income limit for OBC non-Creamy Layer (OBCNCL) from existing 6 lakhs per annum to 8 lakhs per annum; and
(b) if so, the details thereof and if not, the reasons therefor?

ANSWER

(a): A proposal to enhance the income ceiling for Other Backward Classes non-Creamy Layer, is presently under consideration of the Government.

(b): The income criterion among creamy layer for Other Backward Classes was first notified at Rs. 1.00 lakh per annum in September, 1993. This was enhanced to Rs. 2.5 lakh in March, 2004 and thereafter to Rs. 4.5 lakh in October, 2008 and Rs. 6.00 lakh in May, 2013. The National Commission for Backward Classes has recommended in 2015 modifications in the various factors for determining of Creamy Layer among OBCs, including enhancement of present limit. The matter has been examined in the Ministry of Social Justice & Empowerment in consultation with other Ministries/Departments concerned, for taking a view on the enhancement of income ceiling. The level of enhancement and the revised income ceiling will be notified by the Government in due course, after approval of the Cabinet.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనాలో తగ్గుతున్న ఆరోగ్య భారం-భారత్‌లో పెరుగుతున్న రోగ రుణ భారం

23 Saturday Jul 2016

Posted by raomk in CHINA, Economics, Health, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

China, healthcare costs, healthy china, INDIA, world bank on china health

Image result for china healthcare

ఎం కోటేశ్వరరావు

   మన ప్రభుత్వాలు అమలు జరుపుతున్న దారిద్ర నిర్మూలన పధకాలు కాగితాల మీద దరిద్రుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఎంత ఆదాయం వస్తే, ఎంత ఖర్చు చేస్తే దారిద్య్రంతో వున్నట్లు అనే కొలబద్ద నిర్ణయంలోనే తిరకాసు వున్న విషయం తెలిసిందే. లెక్కలు చూపేందుకు పడుతున్న తాపత్రయం దారిద్య్ర నిర్మూలనలో లేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే పాలకులు విధానాల కారణంగా అనారోగ్యం పాలైన పేద, మధ్యతరగతి కుటుంబాలన్నీ తట్టుకోలేని ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పుల పాలు కావలసి వస్తోందని ప్రతి కుటుంబ సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రతి ఏటా 6.3 కోట్ల మంది ఈ అప్పుల వూబిలో దిగుతున్నారు. తాజాగా జూలై 22వ తేదీన ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్ధ, చైనా ప్రభుత్వం హెల్తీ చైనా (ఆరోగ్యవంతమైన చైనా) పేరుతో ఒక పెద్ద విశ్లేషణాత్మక నివేదికను వెల్లడించాయి. దానిలో చైనాలో జరిగిన అభివృద్ధి కారణంగా తలెత్తిన సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలా అనే అంశాలను చర్చించారు. దానిలోని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

  ప్రస్తుతం మొత్తం చైనా ఆరోగ్యఖర్చులో అక్కడి ఆసుపత్రుల వాటా 54శాతం వుండగా, ఓయిసిడి(ఐరోపా ఆర్ధిక, అభివృద్ధి సంస్ధ ) దేశాలలో అది 38 శాతంగా వుంది.

   1980-2000 సంవత్సరాల మధ్య చైనాలో ఆసుపత్రి పడకల సంఖ్య 1.19 నుంచి 2.17 మిలియన్లకు , తరువాత 13 సంవత్సరాలలో 2013 నాటికి 4.58 మిలియన్లకు పెరిగాయి. ఇదే సమయంలో అత్యధిక ఓయిసిడి దేశాలలో పడకలను కుదించారు, కొన్ని దేశాలలో అది 30శాతం వరకు వుంది.

   2002-2013 మధ్య టెరిటరీ, సెకండరీ ఆసుపత్రుల సంఖ్య 82,29శాతం చొప్పున పెరగ్గా, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య ఆరుశాతం తగ్గింది.ఆసుపత్రులలో చేరటం 2003లో 4.7శాతం వుండగా 2013లో 14.1శాతానికి చేరింది.

    ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని రకాల నిపుణుల సంఖ్య 36శాతం తక్కువగా వుంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలపై విశ్వాసం లేక అన్ని అర్హతలు కలిగిన ఆరోగ్య కార్యకర్తలు లేని కారణంగా గ్రామీణ ప్రాంత రోగులు వాటికి వెళ్లకుండా నేరుగా పై తరగతి ఆసుపత్రులకు వెళ్లటం ఎక్కువైంది.

  వైద్య రంగంలో వేతనాలు ఆకర్షణీయంగా లేని కారణంగా దాదాపు 40శాతం మంది మెడికల్‌ గ్రాడ్యుఏట్లు ఆసుపత్రులలో చేరకుండా ఔషధాలు, వైద్య పరికరాల పరిశ్రమలలో చేరుతున్నారు.

  మెడికల్‌ గ్రాడ్యుయేట్ల సంఖ్య 2003-13 మధ్య రెట్టింపైంది. వారిలో నర్సింగ్‌ సిబ్బంది 108శాతం, ఫిజిషియన్స్‌లో 41 శాతం పెరుగుదల కనిపించింది.అయినప్పటికీ నర్సింగ్‌ సిబ్బంది, ఇతరుల కొరత ఇంకా ఎక్కువగానే వుంది.

    అవసరానికి మించి మందులు రాయటం ఒక ప్రధాన సమస్యగా వుంది.సగటున మూడు మందులు రాస్తున్నారు. ఇంజెన్ల రేటు 53శాతం వుంది, ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన సిఫార్సు కంటే ఇవి రెండు ఎక్కువే. రాస్తున్న మందులలో యాంటీబయటిక్స్‌ సగం వుంటున్నాయి.

  గ్రామీణ వైద్యులు కేవలం 26శాతం కేసులలో వ్యాధిని సరిగా నిర్ధారిస్తున్నారని ఒక సర్వేలో తేలింది.అవసరంలేని, హానికరమైన మందుల సిఫార్సు చేయటం 64శాతం కేసులలో కనిపించింది.

    వైద్య సేవలకు ఫీజు చెల్లించే ఏజన్సీ ఇస్తున్న ప్రోత్సాహకాలు, ఔషధాలపై ఇస్తున్న లాభాల కారణంగా ఆసుపత్రుల రంగంలో, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. స్థూలజాతీయాదాయం (జిడిపి) పెరుగుదల రేటు కంటే ఆరోగ్య ఖర్చుల పెరుగుదల రేటు ఎక్కువగా వుంది. ఏటా 8.4శాతంగా వుంది.జిడిపిలో ఆరోగ్య సంరక్షణ ఖర్చు 2015లో 5.6శాతం వుండగా 2035 నాటికి 9.1శాతం పెరగవచ్చని అంచనా.ఇది డాలర్లలో 467.2 మిలియన్ల నుంచి 2.4 బిలియన్లకు పెరుగుతుంది.

   ప్రపంచబ్యాంకు అంచనా ప్రకారం మెరుగైన వ్యాధుల యాజమాన్య పద్దతులను పాటిస్తే ఆరోగ్య ఖర్చు తగ్గి జిడిపిలో మూడు శాతం పొదుపు అవుతుంది. మరింత మెరుగైన ఆరోగ్య వ్యవస్ధ, సంరక్షణ,ఆరోగ్యం సమకూరే విధంగా సంస్కరణలు చైనాలో అమలు జరిగితే ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించినట్లు అవుతుంది.

    జీవితకాలం పెరిగిన కారణంగా ప్రస్తుతం 65 సంవత్సరాల వయసు దాటిన వారు చైనాలో 14 కోట్ల మంది వున్నారు.వీరి సంఖ్య 2030 నాటికి 23 కోట్లకు పెరుగుతుందని అంచనా.

  రెండు దశాబ్దాల క్రితం అప్పుడే అంటు వ్యాధులు, పుట్టిన పిల్లలకు వచ్చే వ్యాధులు, పౌష్టికాహారం,తల్లుల ఆరోగ్య సమస్యల కారణంగా తలెత్తిన వ్యాధులు 41శాతం వుండేవి. ఇప్పుడు ఓయిసిడి దేశాలలో మాదిరి చైనాలో దీర్ఘకాల, అంటు లక్షణం లేని వ్యాధుల కారణంగా 85 శాతం మంది మరణిస్తున్నారు. మొత్తం మరణాలలో మూడింట రెండువంతులకు హృదయ, క్యాన్సర్‌ వ్యాధులు కారణం అవుతున్నాయి. పెద్ద వారిలో అధిక బరువు సమస్య 1991-2009 మధ్య మూడు రెట్లు 11.8 నుంచి 29.2శాతానికి పెరిగింది. ఇది పురుషులలో ఎక్కువగా వుంది. నలభై తొమ్మిదిశాతం చైనా పురుషులు రోజూ పొగతాగుతున్నారు. ఇది ఓయిసిడి దేశాలతో పోల్చితే రెండు రెట్ల కంటే ఎక్కువ. మద్యం వినియోగం 2000-2010 మధ్య రెట్టింపైంది. సగటున తలకు 5.8లీటర్లు వుంది.

   2009లో చైనా పెద్ద ఎత్తున ఆరోగ్య సంస్కరణలు ప్రారంభించింది.నూట ముప్ఫై కోట్ల మందికి మూడు లక్షల కోట్ల యువాన్లను ఖర్చు చేయాలని తలపెట్టింది. ఫలితంగా దాదాపు నూటికి నూరుశాతం మందికి ఆరోగ్యబీమా సమకూరింది. దశాబ్దకాలంలో ఆరోగ్య సంరక్షణకు జేబులోంచి ఖర్చు చేయాల్సిన మొత్తం 60 నుంచి 30శాతానికి తగ్గింది. అయితే గ్రామీణ జనాభా మాత్రం మొత్తం ఖర్చులో సగం తమ జేబుల నుంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. మెరుగుదల అంతటా సమంగా లేదని ఇది వెల్లడిస్తోంది.

    వందల సంవత్సరాలుగా అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిలో ఎంతో ముందున్న ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అర్ధికంగా,రాజకీయ, సైనిక రంగాలలో ఎంతో ముందున్నా మొత్తం జనానికి ఆరోగ్యబీమా కల్పించటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికీ మూడు కోట్ల మందికిపైగా (2014) 10.4 శాతం జనానికి ఆరోగ్యబీమా లేదు. వారికి జబ్బు చేస్తే మన దేశంలో సామాన్య, మధ్యతరగతి మాదిరి అప్పులపాలు కావాల్సిందే. బీమా లేని వారి సంఖ్య ఏటా ఏడుశాతం పెరుగుతున్నదని ఒకవైపు సర్వేలు తెలుపుతున్నాయి.2018 నాటికి బీమా సౌకర్యం లేనివారి సంఖ్యను 2.4కోట్లు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఆ సమస్య మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. వలస వచ్చిన వారిలో నమోదు కాని వారికి బీమా సౌకర్యం వర్తించదు, వారి సంఖ్య దీనికి అదనం. ఎంతన్నది అమెరికా ఎన్నడూ చెప్పదు. మన దేశంలో బీమా సౌకర్యం గురించి చెప్పుకోనవసరం లేదు. ప్రభుత్వ వుద్యోగులు, కొందరు ప్రయివేటు వుద్యోగులకు మినహా మిగతా సామాన్య జనంలో చాలా పరిమితంగానే బీమా పధకాలలో వున్నారు. వైద్యానికి జేబులోంచి ఖర్చు చేసే మొత్తం 85శాతం వరకు వుంటోంది.

   ఇక్కడ ఒక సమస్య గురించి ప్రస్తావించక తప్పదు. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకుంటాం. పీల్చటానికి కావాల్సినంత కాలుష్య గాలి, తాగటానికి తగినన్ని కాలుష్య జలాలు వుచితం తప్ప వాటి కారణంగా వచ్చే రోగాల బారిన పడితే అంతే సంగతులు. గాలి, నీటి కాలుష్యానికి పాల్పడేవారిని కాపాడటం తప్ప వారి బారిన పడేవారిని ఆదుకొనేందుకు ముందుకు రాని ప్రజాస్వామ్యం ! డబ్బు లేక కాదు సుమా, డబ్బు లేకపోతే ఏటా ఆరులక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్‌ సంస్ధలు, ధనికుల వజ్రవైఢూర్యాల దిగుమతులకు పన్ను రాయితీలివ్వటం ఎలా సాధ్యం? అడిగితే జవాబు చెప్పరు. మరి అత్యంత సంపద్వంతమైన భూతల స్వర్గం అమెరికాలో కూడా అందరికీ వైద్యం అందుబాటులో ఎందుకు లేకపోయింది ?

  మొత్తం 130 కోట్ల మందికి నాణ్యమైన వైద్య సౌకర్యం అందించే స్ధితికి ఇంకా చైనా చేరుకోకపోయినప్పటికీ రోగాల కారణంగా జనం అప్పుల పాలు కావటం అక్కడ లేదు. చిన్నదో పెద్దదో ఏదో ఒక బీమా ప్రతి ఒక్కరికీ వుంది.రెండువందల యాభై సంవత్సరాల స్వాతంత్య్రం, అభివృద్దిలో అమెరికా సాధించలేని విజయాన్ని చైనా అందులో నాలుగో వంతు కాలంలోనే సాధించటం ఎలా సాధ్యమైంది ? మనం ఆ బాటలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి వుంది. చైనా నిరంకుశ కమ్యూనిస్టు దేశం, మనది ప్రజాస్వామ్యం అన్న జవాబు వెంటనే సిద్దంగా వుంటుంది.చైనాలో సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ సియావో పింగ్‌ పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది ఎలుకలను పడుతుందా లేదా అన్నది చూడటం ముఖ్యం అన్నారు. అలాగే మంచి గాలి కోసం కిటికీ తెరిస్తే గాలితో పాటు ఈగలూ,దోమలూ కూడా వస్తాయి, వాటిని అరికట్టగలం అన్నారు. సంస్కరణలు అంటే విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానానికి చైనా మార్కెట్‌ను తెరవటం. అది జరిగింది. అభివృద్ధితో పాటు అవినీతి, అక్రమాల వంటి అవలక్షణాలూ పుష్కలంగానే ప్రవేశించినట్లు అక్కడ జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దానిని చైనీయులేమీ దాచుకోవటం లేదు.

    కౌలుగడువు తీరి వాటిని తనలో విలీనం చేసుకొనే సందర్భంగా హాంకాంగ్‌, మకావో దీవులలో 2050 వరకు పెట్టుబడిదారీ విధానాన్ని అనుమతిస్తామని  చైనా ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. అంటే దాని ప్రకారం బిలియనీర్లను అనుమతించటంతో పాటు వారు పెరగటానికి కూడా కమ్యూనిస్టుపార్టీ అంగీకరించినట్లే. ఈ కారణంగానే 2050 వరకు తమ పెట్టుబడులకు ఎలాంటి ఢోకాలేదనే ధీమాతో చైనాలో పెట్టుబడులు, ఫ్యాక్టరీలు, వ్యాపారాలు పెట్టటానికి ధైర్యంగా ముందుకు వచ్చి డబ్బు కుమ్మరించారు. దీనిని చూసి కొంత మంది చైనాలో వున్నది సోషలిస్టు వ్యవస్ధ కాదు, అది కమ్యూనిజం బాటలో పయనించటం లేదు అని విమర్శిస్తున్నారు. చైనా ప్రభుత్వ కంపెనీలు విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నాయి, బిలియనీర్లు తయారయ్యేందుకు వీలు కల్పిస్తోంది కనుక అధికారిక పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్న దేశం అని వర్ణిస్తున్నవారూ లేకపోలేదు. పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్న దేశాల కంటే భిన్నంగా చైనాలో జీవన ప్రమాణాలు, ఆదాయాలూ పెరుగుతున్నాయా లేదా అంటే పెరుగుతున్నాయి. పెట్టుబడిదారీ దేశం అయితే అది ఎలా సాధ్యం ? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఐరోపాలోని ధనిక దేశాలు కూడా కొన్ని సంక్షేమ చర్యలు అమలు జరిపినంత మాత్రాన వాటిని సోషలిస్టు దేశాలు అనటం లేదు అలాగే అమలు జరుపుతున్న చైనాను మాత్రం సోషలిస్టు దేశంగా ఎలా అంగీకరిస్తాం అనే వారు లేకపోలేదు. సోషలిజం, కమ్యూనిజం భావనల వ్యాప్తిని అడ్డుకొనేందుకు రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఐరోపాలోని ధనిక దేశాలు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపాయి. కానీ గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా 2008 సంక్షోభం ప్రారంభమైన తరువాత వాటన్నింటినీ ఒక్కటొక్కటిగా రద్దు లేదా కోత పెడుతున్నాయి. ఇదే సమయంలో చైనాలో సంక్షేమ చర్యలు మరింతగా పెరుగుతున్నాయి తప్ప తగ్గుతున్నట్లు సమాచారం లేదు. పెట్టుబడిదారీ విధానాన్ని అమలు జరుపుతున్న ధనిక దేశాల ఆర్ధిక వ్యవస్ధలన్నీ సంక్షోభం లేదా ఒకటి రెండు శాతం అభివృద్ధి రేటుతో మాత్రమే ముందుకు పోతుండగా చైనాలో గతంతో పోలిస్తే కొంత మేరకు తగ్గినా ఎనిమిదిశాతం వరకు అభివృద్ధి వుంది, ఇలా ఎందుకు జరుగుతోంది ?

    చివరిగా ఒక్క విషయం. మన కంటే సాగు భూమి తక్కువ, జనాభా ఎక్కువ వున్న దేశం చైనా. మనదేశంలో 65 ఏండ్లు దాటిన వృద్ధులు జనాభాలో 5.8 శాతం వుంటే అక్కడ 9.6 శాతం వున్నారు. అ ంటే వృద్దాప్య పెన్షన్లు, వారి సంక్షేమ ఖర్చూ ఎక్కువే. మన సగటు జీవన కాలం 67.8 అయితే అక్కడ 75.15 వుంది. మన పట్టణ జనాభా 31శాతం అయితే అక్కడ 50శాతం దాటింది.మన దేశంలో ప్రతి వెయ్యి జనాభాకు ఒక ఆసుపత్రి పడక వుంటే చైనాలో 3.8 వున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చైనాతో పోల్చితే మనకు అనుకూలమైనవీ, ప్రతికూలమైన పరిస్ధితులూ వున్నాయి. చైనాలో అమలు జరుపుతున్న సంస్కరణలు అక్కడ సామాన్య జనజీవితాలను మెరుగు పరచటంతో పాటు ధనికులనూ పెంచుతున్నాయి.మన దేశంలో కేవలం ధనికులను మాత్రమే పెంచుతున్నాయి.

   చైనా తనదైన ప్రత్యేక శైలిలో సోషలిజాన్ని నిర్మిస్తున్నట్లు మొదటి నుంచి చెబుతోంది. సోషలిజాన్ని ఫలానా మార్గంలో సాధించాలని లేదా ఫలానా విధంగానే నిర్మించాలని మార్క్సిస్టు మహోపాధ్యులెవరూ నిర్ధేశించలేదు. కొన్ని అంచనాలు, జోశ్యాలు, ఊహలు మాత్రమే చేశారు. అత్యంత వెనుకబడిన ఆఫ్రికా దేశాలలో, ఎంతో పురోగతి సాధించిన అమెరికా ఖండ దేశాలలో భౌతిక పరిస్ధితులు భిన్నంగా వున్నపుడు రెండు చోట్లా ఒకే విధంగా సోషలిస్టు వ్యవస్ధను సాధించటం ఎలా సాధ్యం. దేని మార్గం దానిదే. అందువలన చైనాలో జరుగుతున్నదానిని చూసి కొన్ని నిర్ధారణలకు రావాల్సిన అవసరం లేదు, చైనా అయినా మరొక కమ్యూనిస్టుపార్టీ గురించి అయినా విమర్శనాత్మక దృష్టితో చూడటం, సద్విమర్శలు చేయటంలో తప్పులేదు. ప్రపంచ వ్యాపితంగా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన స్ధితిలో కమ్యూనిజాన్ని తెగనాడితే లబ్దిపొందేది కమ్యూనిస్టు వ్యతిరేకులు మాత్రమే.

 

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సత్యహరిశ్చంద్రుల వారసులకు తగని ముసుగులో రాజకీయం ఎందుకు !!

22 Friday Jul 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

Andhrapradesh, BJP, Narendra Modi, special status to Andhra pradesh, tdp

 నిజానికి ఆ బిల్లు గురించి తెలుగుదేశం, బిజెపిలకు శ్రద్ద లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ఆసక్తి వుంటే ఆమోదం పొందటం కష్టం కాదు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందటం ముఖ్యం, ఆ ఖ్యాతి ఏ ప్రభుత్వానిది అన్నది ముఖ్యం కాదు అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పాటి విశాల దృక్పధం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, తెలుగుదేశానికి శ్రద్ధ వుంటే, శుక్రవారం నాడు ప్రయివేటు బిల్లులపై చర్చకు అవకాశం ఇవ్వాలనుకుంటే దానిని తొలి అంశంగా తీసుకోవచ్చు

ఎం కోటేశ్వరరావు

    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన అనధికార బిల్లు అందరూ వూహించినట్లుగానే రెండవ సారి కూడా చర్చకు రాకుండా పోయింది. అలాంటి బిల్లులను చర్చకు రానివ్వరని ఎలాంటి ఆవేశ కావేషాలకు లోనుకాకుండా ఎంతో శాంతంగా వున్న ఆంధ్రప్రదేశ్‌ పౌరులు గ్రహించటం మంచిది. రజనీకాంత్‌ ఒక సినిమాలో సినిమాలో చెప్పినట్లు అతిగా ఆశపడవద్దు. నరేంద్రమోడీ, చంద్రబాబు మంత్రదండాలు, అల్లావుద్దీన్‌ అద్బుతదీపాలు, లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య వంటి పవన్‌ కల్యాణ్‌ ప్రకటనల కోసం ఎదురు చూసే ఆనందం ఎంతైనా ప్రత్యేక హోదాతో రాదు కదా !

    ఆ బిల్లు చర్చకు వస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలుగు దేశం పార్టీ నేతలు చెప్పిన తీరును చూసినపుడే రాదన్న గట్టి ధీమా వారిలో వుందని తేలిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే కాంగ్రెస్‌ రెండు సంవత్సరాల తరువాత ఒక ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అని అంగీకరిద్దాం. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు, అలాగే చంద్రబాబుకు తెలిసిన రాజకీయం కూడా అలాంటిదే. రాష్ట్ర విభజన బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చకుండా అన్యాయం చేశారనే శాశ్వత విమర్శను కొనసాగించాలన్నా , ఆ పేరుతో మరికొంత కాలం ఓట్లు దండుకోవాలన్నా దానిని ఇవ్వకుండా, అలాంటి బిల్లులను చర్చకు రాకుండా చేయటం బిజెపి, తెలుగుదేశం పార్టీలకు అవసరం అని శుక్రవారం నాటి పరిణామాలు నిరూపించాయని కూడా అనుకోకతప్పదు మరి. రాష్ట్రాన్ని విభజించి అసెంబ్లీ చరిత్రలో ప్రాతినిధ్యం లేకుండా పోయిన కాంగ్రెస్‌కు జ్ఞానోదయం కలిగి కావచ్చు లేదా చేసిన తప్పును దిద్దుకోవాలంటే పోయిన చోటే వెతుక్కోవాలన్న లోకోక్తి ప్రకారం గానీ ఏదైనేం రెండు సంవత్సరాలకు ఒక బిల్లును ప్రవేశపెట్టింది.

   నిజానికి ఆ బిల్లు గురించి తెలుగుదేశం, బిజెపిలకు శ్రద్ద లేదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ఆసక్తి వుంటే ఆమోదం పొందటం కష్టం కాదు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందటం ముఖ్యం, ఆ ఖ్యాతి ఏ ప్రభుత్వానిది అన్నది ముఖ్యం కాదు అని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పాటి విశాల దృక్పధం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, తెలుగుదేశానికి శ్రద్ధ వుంటే, శుక్రవారం నాడు ప్రయివేటు బిల్లులపై చర్చకు అవకాశం ఇవ్వాలనుకుంటే దానిని తొలి అంశంగా తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు బిజెపి నేత అవునో కాదో తెలియని మా గుంటూరు గొరిజవోలు చిన్న సినీ హీరో శివాజీ దానిని 14వ అంశంగా పెట్టారని శరభ శరభ దశ్శరభ శరభ అంటున్నాడు. బిల్లు చర్చకు రావాలని, ఆమోదం పొందాలని తెలుగుదేశం పార్టీ నిజంగా కోరుకుంటే , హోదా రాకపోతే ఆంధ్రప్రజలు ఆగ్రహిస్తారని అనుకొని వుంటే చర్చకు రాకుండా పోయిన తరువాత దాని మీద ఆ పార్టీ నేతలు, చివరికి నిన్నటి వరకు కాంగ్రెస్‌లో వుండి తెలుగుదేశంలో రాజ్యసభ సీటుకొనుక్కున్నారని విమర్శలు ఎదుర్కొన్న టిజి వెంకటేష్‌తో సహా అలాంటి వ్యాఖ్యలు చేసి వుండేవారు కాదు.

   ఆమ్‌ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎంపీ పార్లమెంట్‌ ప్రాంగణాన్ని వీడియో తీసి దానిని సామాజిక మీడియాలో పెట్టారని అది నిబంధనలకు వ్యతిరేకం కనుక అతగాడిపై చర్య తీసుకోవాలని బిజెపి అభ్యంతరం తెలిపింది. ఓకే, అదే వాస్తవమైతే నిబంధనల ప్రకారం స్పీకరుకు ఫిర్యాదు చేయవచ్చు, రుజువైతే చర్య తీసుకోవచ్చు, ఎవరు అడ్డుపడ్డారు. వుభయ సభలలో కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల సభ్యులు కూడా చర్య తీసుకోవాలనే కోరారు తప్ప వ్యతిరేకించలేదు. అన్నింటికీ మించి సదరు సభ్యుడు క్షమాపణ చెప్పాడు. అయినా సరే అతని ప్రవర్తన అభ్యంతరకరం అనుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా మాదిరి బిజెపి వ్యూహకర్తల మేకిట్‌ ఎన్‌ ఇష్యూ (దాన్నొక సమస్యగా చేయండి ) కాకపోతే ఆ పేరుతో లోక్‌సభ, రాజ్యసభలను ఒక రోజంతా పనిచేయకుండా వాయిదా పడేట్లు అధికారపక్షమే అడ్డుకోవాల్సినంత తీవ్ర విషయమా అది.

   రాజ్యసభలో ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి పార్లమెంట్‌ భద్రతా విషయాన్ని చర్చించాలన్న అధికార పక్ష సభ్యురాలి డిమాండ్‌ను కాంగ్రెస్‌ సభ్యులు ఆమోదించలేదు. ప్రశ్నోత్తరాల తరువాత దాని గురించి చర్చించవచ్చని చెప్పారు.అయినా సరే బిజెపి దాని మిత్రపక్షాల సభ్యులు తమ పట్టువీడకుండా గొడవ చేయటంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో సహా అనధికార బిల్లులు చర్చకు రాకుండా పోయాయి. కాంగ్రెస్‌ సభ్యులు ముందే చర్చకు అంగీకరించి వుంటే బిల్లు చర్చకు వచ్చేదని నెపాన్ని కాంగ్రెస్‌ మీద నెట్టేందుకు తెలుగుదేశం మంత్రులు, ఎంపీలు ప్రయత్నించటాన్ని చూస్తే జరిగిందేమిటో అర్ధం చేసుకోలేనంత అమాయకంగా ఆంధ్రప్రజానీకం వుందని భావిస్తున్నారా ? లేక తామేం చెప్పినా నిజమే నిజమే అని తలలూపుతారనుకుంటున్నారా ? అన్నీ వదులుకున్న వాళ్లం హైకోర్టు కోసం పట్టుబట్టి హైదరాబాదులోనే కూర్చుంటామా అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాగే అన్ని పార్టీలనీ గుడ్డిగా నమ్మి (సిపిఎం తప్ప) అన్నీ వదులుకున్న ఆంధ్రులు రాని ప్రత్యేక హోదాకోసం పట్టుబట్టి కూర్చుంటారా ?

      తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారికి ఏమైందో తెలియదు. శుక్రవారం రాత్రి తన సిబ్బంది ద్వారా ఒక అధికారిక ప్రకటన పంపారు. దాని పూర్తి పాఠం ఇలా వుంది.’రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము అని భావించాము కాబట్టే రాష్ట్రానికి ద్రోహము చేసిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్  అని చూడకుండా మద్దతు ఇచ్చాము . సభలోకి వెళ్లకముందే AP ప్రయోజనాలు ముఖ్యము అని స్పష్టము గా చెప్పాను. టీడీపీ కృషి , ఒత్తిడి వలనే కేంద్రము క్రమము గా అన్ని పథకాలకు నిధులు కేటాయించటం జరిగింది . ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహ ధర్మాన్నే పాటిస్తాము కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయము లో రాజీ పడే పరిస్థితి లేదు . రాజకీయ ఎదుగుదల కోసము కొందరు చేస్తున్న చిల్లర రాజకీయాలని తెలివైన ఆంధ్రులు తేలికగా అర్థము చేసుకుంటారు . ‘.

ఇక్కడ సామాన్యులకు అర్ధం కాని విషయం ఏమంటే కాంగ్రెస్‌ మీద అంత సానుభూతి ఎందుకు? తెలుగు దేశం పార్టీ కృషి, వత్తిడి వల్లనే కేంద్రం అన్ని పధకాలకు నిధులు ఇచ్చిందన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఇలా చెప్పటం నిజంగా ఆశ్చర్యంలోనే ఆశ్చర్యం. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడుస్తుందా లేక వత్తిడి ద్వారా పని చేస్తుందా ? మీరు చెప్పినట్లు స్నేహంగా వున్నంత కాలం నిధులు విడుదల చేయని కారణంగానే వత్తిడి తెచ్చారని అనుకోవాలా ? వత్తిడి కారణంగా అదనంగా వచ్చిన నిధులేమిటో జనానికి తెలియ చేస్తే సంతోషిస్తారు. బిజెపి-తెలుగు దేశం మధ్య వున్నది అనుభూతికి అందని అపూర్వ స్నేహంగా కనిపిస్తోంది. మీరు తెచ్చే వత్తిడికి నిజంగా అంత సత్తా వుంటే ప్రత్యేక హోదా సంగతి ఇంతకాలం ఎందుకు తేల్చలేకపోయారు అని జనం అడుగుతున్నారు. పార్లమెంట్‌లో మీరే ఎందుకు వత్తిడి తేలేదు. ఎక్కడైనా ప్రతిపక్ష సభ్యులు సభలో గందర గోళం, వెల్‌లోకి దూసుకుపోవటం వంటివి చేస్తారు. కానీ మీ మిత్రపక్షం అధికారంలో వుండి ఆ పని చేస్తోంది. అంటే ప్రజాస్వామ్యాన్ని తలకిందులుగా అర్ధం చేసుకోవాలా ?

    కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదు, బుద్ది రాదు అనుకుందాం . బిజెపి, తెలుగుదేశం పార్టీల వద్ద శుద్ది,బుద్ది టన్నుల కొద్దీ వున్నాయి కదా ! ఇప్పటికైనా ఎలాంటి రాజకీయాలు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది కోసం ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక పాకేజీ ఏదో ఒకటి చేసి చూపండి, ఏమీ చేయకుండానే మూడో ఏడాదిలో ప్రవేశించారు. లేదా ఏదీ అవేమీ వుండవు అనైనా చెప్పండి ! సత్యహరిశ్చంద్రుల వారసులకు తగని ముసుగులో రాజకీయం ఎందుకు !!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఇండోనేషియా కమ్యూనిస్టుల వూచకోతలో అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా

20 Wednesday Jul 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, UK, USA

≈ Leave a comment

Tags

1965 anti-communist purge, Australia, civil tribunal, Indonesia, Indonesian Communist Party (PKI)., PKI, UK, US

A Chinese student (centre) is pummelled by Indonesian youths who stormed the dormitory of a communist Chinese University ...

ఎంకెఆర్‌

     ఇండోనేషియాలో 1965-66 సంవత్సరాలలో ఐదు లక్షల మంది కమ్యూనిస్టుల వూచకోతలో అమెరికాతో పాటు బ్రిటన్‌, ఆస్ట్రేలియా హస్తం కూడా వున్నట్లు నాటి ఘటనలపై విచారణ జరిపిన ప్రజాకోర్టు బుధవారం నాడు (జూలై 20న) విడుదల చేసిన తుది నివేదికలో పేర్కొన్నది.ఇరవయ్యవ శతాబ్దిలో పేరు మోసిన నియంతగా చరిత్ర కెక్కినఇందోనేషియా సుహార్తో 2008 మరణించిన తరువాత నాటి మారణ కాండ నుంచి తప్పించుకొని సజీవులుగా వున్నవారు, మానవహక్కుల కార్యకర్తలు, కవులు, కళాకారులు తమ గళం ఎత్తి నాటి వుదంతాలపై వాస్తవాలను వెల్లడించాలని, మారణకాండకు పాల్పడిన వారిని శిక్షించాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చిన విఫయం తెలిసిందే.నెదర్లాండ్స్‌లోని హేగ్‌ నగరంలో 2015 నవంబరులో ప్రజాకోర్టు విచారణ జరిగింది. దాని ముందు హాజరైన వారు, వుదంతానికి సంబంధించి 40 మందికిపైగా పరిశోధకులు అందించిన సమాచారాన్ని విశ్లేషించి అంతిమ నివేదికను విడుదల చేశారు. దీనిలో ఆస్ట్రేలియ, బ్రిటన్‌, అమెరికాకు చెందిన ఏడుగురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

    ఇండోనేషియా కమ్యూనిస్టుపార్టీ నేతలు, సభ్యుల జాబితాలను అమెరికా అందించినట్లు, వాటి ఆధారంగా హత్య, జైళ్లపాలు చేసినట్లు ప్రజాకోర్టు ముందుకు వచ్చిన సమాచారం వెల్లడించింది.అమెరికా, ఇండోనేషియా మిలిటరీ సృష్టించిన కట్టుకధలను బ్రిటన్‌,ఆస్ట్రేలియా ప్రభుత్వాలు నిరంతరం ప్రచారంలో పెట్టాయి. విచక్షణారహితంగా మారణకాండ జరిగినట్లు స్పష్టంగా తెలిసిన తరువాత కూడా ఈ ప్రచారాన్ని కొనసాగించినట్లు తేలింది.తమ విచారణకు హాజరై వాదనలను వినిపించాలని చేసిన విజ్ఞప్తిని ఇండోనేషియా, అస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికా ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం విచారకరమని ప్రజాకోర్టు వ్యాఖ్యానించింది. జనరల్‌ సుహార్తో కమ్యూనిస్టుల వూచకోతలో నాయకత్వ పాత్ర వహించినట్లు తెలుపుతూ మరణించినవారు, బతికి బయట పడ్డవారికి, వారి కుటుంబాలకు ఇండోనేషియా సర్కార్‌ క్షమాపణ చెప్పాలని, మానవత్వంపైనే జరిపిన నేరాలకు పాల్పడిన వారిపై విచారణ జరపాలని కోర్టు పేర్కొన్నది. ఇరవయ్యవ శతాబ్దంలో జరిగిన అత్యంత దుర్మార్గ వూచకోతలలో ఒకదానిగా దీనిని పరిగణించాలని చెప్పింది.

    న్యాయమూర్తులలో ఒకరైన ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్‌ హెలెన్‌ జార్విస్‌ మాట్లాడుతూ తమ నివేదిక ఇప్పటికే ఇండోనేషియాలో న్యాయం చేయాలని నినదిస్తున్నవారికి అదనపు గళం అవుతుందని, ఇప్పటికే తమ స్వంత మానవహక్కుల సంస్ధలు చేసిన సిఫార్సులు కూడా వున్నందున ఇండోనేషియా ప్రభుత్వం వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని బతికి వున్న బాధితులకు పునరావాసం కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు.ఈ నివేదిక గురించి ఇండోనేసియా న్యాయ, రాజకీయ, భద్రతా వ్యవహారాల సమస్వయ శాఖ మంత్రి లుహుత్‌ పాంజైటన్‌ మాట్లాడుతూ ఇండోనేసియాకు ఒక న్యాయ వ్యవస్ధ వుంది, ఏం చేయాలో ఈ దేశానికి మరొకరు నిర్దేశించాల్సిన అవసరం లేదు, విశ్వవ్యాప్త విలువలతో ఈ సమస్యను మేము పరిష్కరిస్తాం, దీని గురించి మేము చాలా ధృఢంగా వున్నాం’ అని వ్యాఖ్యానించారు.అయితే నివేదిక తయారీలో ప్రముఖ పాత్ర వహించిన మానవహక్కుల న్యాయవాది టోడంగ్‌ మౌల్య లుబిస్‌ మాట్లాడుతూ తమ అంతిమ నివేదిక క్షమాపణలు, పునరావాసం, నష్టపూర్తి చర్యలకు తలుపులను తెరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంకా అనేక మంది ప్రముఖులు ఇదే భావాన్ని వ్యక్తం చేశారు. ‘ కమ్యూనిస్టుల నుంచి ముప్పు వచ్చిందని, వారిని చంపటం లేదా వారి చేతిలో చావటమో తేల్చుకోవాలని చెప్పారని’ ముస్లిం సంస్ధ నహదల్‌తుల్‌ వులమా చరిత్రకారుడు ఇమాన్‌ అజీజ్‌ ఇటీవల అన్నారు.అయితే అణచివేయాల్సినంత భయానక పరిస్ధితులు లేవని ప్రజాకోర్టు నివేదిక వెల్లడించిందని మోనాష్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ పుర్దే చెప్పారు. ఇది పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం ఆధారంగా జరిగిందని స్పష్టమైందని ఆమె అన్నారు. కౌసెన్‌దార్‌ అనే 83 ఏండ్ల వృద్ధుడు మాట్లాడుతూ ఎలాంటి విచారణ లేకుండా తనను 14 సంవత్సరాల పాటు బారు దీవిలోని జైలులో పెట్టారు. ఆయన నేరమల్లా ఒక కార్మిక సంఘంలో వున్న స్నేహితులను కలిగి వుండటమే.తన వంటి వారికి జరిగిన అన్యాయానికి క్షమాపణ చెప్పాలా లేదా అనేది ప్రభుత్వమే తేల్చుకోవాలన్నారు. స్వాధీనం చేసుకున్న మా ఆస్ధులు తిరిగి ఇవ్వాలి, రద్దు చేసిన మా పెన్షన్‌ హక్కులను పునరుద్దరించాలి, దేశం విడిచి పోయేట్లు చేసిన వారిని తిరిగి రప్పించాలి, మా డిమాండ్లేమే సంక్లిష్టమైనవి కాదు’ అన్నారు.

    ప్రజాకోర్టు నేపధ్యం విషయానికి వస్తే నెదర్లాండ్స్‌లోని హేగ్‌ నగరంలో నవంబరు 10-13 తేదీల మధ్య విచారణ జరిపింది. పలు వివరాలతో కూడిన ఆరువందల పేజీల నివేదికను తయారు చేసింది. బాధితులుగా వున్నవారు 20 మంది సాక్ష్యాలు చెప్పారు. హత్యలు,జైలు పాలు చేయటం, బానిసలుగా మార్చివేయటం, చిత్ర హింసలు, అత్యా చారాలు, మాయం చేయటం, విద్వేష ప్రచారం, ఇతర దేశాల జోక్యం వంటి అంశాలపై ఈ కోర్టు విచారించింది. నియంత సుహార్తో చచ్చేంత వరకు ఇండోనేషియాలో జరిగిన ఈ దురాగతం గురించి ప్రపంచానికి మిలిటరీ, దానికి మద్దతుగా వున్న అమెరికా తదితర దేశాలు ప్రచారంలో పెట్టిన కమ్యూనిస్టు వ్యతిరేక, ఏకపక్ష కధనాలు తప్ప వాస్తవాలను బయటకు రాకుండా తొక్కి పెట్టారు. ఎవరినీ నోరెత్తనివ్వలేదు, అయితే సుహార్తో చచ్చిన నాలుగు సంవత్సరాల తరువాత ‘హత్యాకాండ’ పేరుతో 2012లో జాషువా ఓపెన్‌హెయిమర్‌ తీసిన డాక్యుమెంటరీ చిత్రం ఆ నిశ్శబ్దాన్ని తొలుత భగ్నం చేసింది. 2013లో హేగ్‌లో దానిని ప్రదర్శించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చలో 35 మంది ప్రవాస ఇండోనేషియన్లు పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు, కొంత మంది సామాజిక కార్యకర్తలు, పరిశోధకులు కూడా హాజరయ్యారు.2012లోనే ఇండోనేషియా మానవహక్కుల సంఘం ఇచ్చిన నివేదికను కూడా అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు.దీంతో ఒక అంతర్జాతీయ ప్రజాకోర్టును ఏర్పాటు చేసి వాస్తవాలను వెలికి తీయాలని, వాటిపై ఒక నివేదికను రూపొందించాలన్న సూచన కార్యరూపం దాల్చింది. నూర్సియా బానీ కాట్‌జసంగ్‌కానా కన్వీనర్‌గా 2013 మార్చినెలలో తొలుత కొద్ది మందితో సమావేశం జరిపి విచారణ తీరుతెన్నులను చర్చించారు. జకర్తా, నెదర్లాండ్స్‌ (ఇండోనేషియా నెదర్లాండ్స్‌ వలస రాజ్యం అన్న విషయం తెలిసిందే) అంతర్జాతీయ ప్రజాకోర్టు( ఐపిటి) 1965 పేరుతో 2014 మార్చి 18న ఒక న్యాయ సంస్ధను రిజిస్టర్‌ చేసి 2015లో విచారణ జరిపేందుకు ముందుకు వచ్చే న్యాయమూర్తులను సంప్రదించారు.ఈ ప్రక్రియకు వందమందికి పైగా సహకరించారు. అనేక మంది ప్రవాస ఇండోనేషియా విద్యార్ధులు ముందుకు వచ్చారు. వారిని బెదిరింపులకు గురిచేసినప్పటికీ లొంగలేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Don’t carry people on ‘dream path’ of consumerism: ESL Narasimhan

19 Tuesday Jul 2016

Posted by raomk in AP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Telangana

≈ Leave a comment

Tags

AP crisis, consumerism, dream path, MFIs, microfinance

 

The microfinance institutions (MFIs) should find out adequacy of skills, competence, capability and the need of the borrower before lending money thereby learning lessons from the crisis that originated in erstwhile Andhra Pradesh in 2010, Telangana and Andhra Pradesh Governor, Mr E.S.L. Narasimhan said at an ASSOCHAM event held in Hyderabad today.

“Today when you are talking of skill development and Make in India as one of the priority areas, I think there is a great responsibility on MFIs, please do not carry people on the dream path of consumerism once again to start with,” said Mr Narasimhan while inaugurating an ASSOCHAM National Summit on Microfinance.

Talking about financial inclusion, he said that there is an urgent need to bridge the growing gap between haves and have-nots together with the divide between rural-urban, rich-poor, privileged-under privileged.

“Unless we are able to bridge this concept of financial inclusion, (programs like) Skill India, Make in India are not going to take us anywhere, we need to make a very conscious effort to bridge this gap,” said the Governor.

“While looking at financial inclusion, we particularly need to go into the rural areas as there are lot of skills available there which die unheard of because they are not able to support their ideas,” he added.

“I think it is for all of us to learn lessons from the past and ensure that we do not repeat the whole crisis of 2010 and force us to do something more again,” said the Governor on the crisis that broke out in erstwhile Andhra Pradesh when the government had to pass an ordinance to control the MFIs.

“The purpose of the MFIs was to help the self-help groups (SHGs) to grow but unfortunately what happened was that lending system went beyond a certain level, the very purpose of the SHGs was itself was to promote entrepreneurship, skills, employment, earning capabilities and basically to improve the economy but a temptation was put forth by the MFIs in lending at so-called hidden rates of interest which made people borrow large sums of money and get into consumerism,” he further said.

He urged the MFIs to spread their institutions’ operations into rural India with the advantage of technological advancement.

Earlier while addressing the ASSOCHAM summit, Mr Navin Mittal, finance secretary, Government of Telangana said that the state government is focussing on start-ups and is looking at phase-after-phase development of start-incubator, T-Hub.

“The T-Hub which has come up very recently in Hyderabad has been really able to attract imagination of a lot of people, we are now planning phase-after-phase for the T-Hub because it has really triggered the latent energies of start-up ecosystem,” said Mr Mittal.

He also said that for the self-employment sector, Telangana is focussing a lot on the marginalised communities.

“We have been able to step up our investment in terms of investment subsidy support to people from OBC, SC/ST, minorities in a huge way and I must say that in times to come the state will emerge as an ideal place to invest and to do business,” said Mr Mittal.

“We have a legislation-backed industrial promotion scheme in terms of TS-iPASS that is where we have taken the concept of single window clearance to a new level altogether that it is not just a clearance but is working on the mode of self-certification,” he added.

Highlighting that Telangana has developed a very investor and business friendly environment, the state’s finance secretary said that its ranking will go very high in the latest rankings in the country in terms of ease of doing business when they come out as there is a huge focus on easing things to make them more transparent and workable.

While addressing the ASSOCHAM summit, the chamber’s president, Mr Sunil Kanoria said, “The success of the MFI sector will largely depend on how well the players can blend technology and human interface in providing financial solutions to the clients and leveraging technology to bring down operational costs and enhancing penetration and training employees to offer customised solutions to the clients will shape the future of the MFI sector.”

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: