• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: March 2020

 వేతన వాయిదా సరే, ఏపి మూడు రాజధానులు, తెలంగాణా కొత్త సచివాలయం సంగతేమిటి !

31 Tuesday Mar 2020

Posted by raomk in AP, AP NEWS, Current Affairs, employees, History, NATIONAL NEWS, Opinion, Pensioners, Telangana

≈ Leave a comment

Tags

Aandhra Pradesh three Capitals, AP CM YS Jagan, Government Employees wage deferment, KCR, Telangana CM

KCR, KTR extend wishes to YS Jagan for landslide victory in AP ...

ఎం కోటేశ్వరరావు
ఉద్యోగుల వేతనాల కోత పెట్టవద్దు, ఉద్యోగాలను రద్దు చేయవద్దు అని ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని అన్ని కంపెనీలను కోరారు. ఎంత మంది దయగల యజమానులు దాన్ని అమలు జరుపుతారో చూడాల్సి ఉంది. అనేక మంది ప్రధాని, ముఖ్య మంత్రుల సహాయ నిధులకు విరాళాలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారు తప్ప తమ సంస్ధలలో వేతనాలు, ఉద్యోగాల గురించి ఏమి చెబుతున్నారో మనకు తెలియదు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత అంటూ మంగళవారం నాడు తెలంగాణా గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. తీరా ప్రభుత్వ ఉత్తరువును చూసే ఎంతశాతం వేతనాల చెల్లింపువాయిదా వేస్తున్నారో దానిలో పేర్కొన్నారు. కోతకు వాయిదాకు తేడా ఉంది. కోత విధిస్తే తిరిగి రాదు, వాయిదా అయితే వస్తుంది. ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి చెల్లించే వేతనాలకు ఇది వర్తిస్తుందని, తదుపరి ఉత్తరువులు ఇచ్చేంతవరకు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. అంటే ఎన్నినెలలు అన్నది చెప్పకపోవటంతో పాటు వాయిదా వేసిన వేతన మొత్తాలను ఎప్పుడు, ఎలా తిరిగి చెల్లించేది కూడా సదరు ఉత్తరువులో లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు జరపకుండా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇది.
విపత్తు సమయాలలో అలాంటి నిర్ణయాలు తీసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ సిబ్బంది ప్రతినిధులతో చర్చించి విధి విధానాలకు సంబంధించి ఆదేశాలు జారీ చేస్తే అదొకతీరు. లేనపుడు ఏకపక్ష నిర్ణయంగానే పరిగణించాల్సి ఉంది. వేతనాలతో పాటు పెన్షన్లు కూడా వాయిదా వేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అసెంబ్లీ, శాసనమండలి, అన్ని స్ధానిక సంస్ధలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల మొత్తం వేతనాల్లో 75శాతం, అఖిలభారత సర్వీసు తరగతికి చెందిన వారికి 60శాతం, ఇతర ఉద్యోగులలో నాలుగవ తరగతికి చెందిన వారికి మినహా మిగిలిన వారందరికీ 50శాతం, నాలుగవ తరగతి వారికి పదిశాతం వేతన చెల్లింపు వాయిదా ఉంటుంది. పెన్షన్లలో కూడా ఇదే శాతాలలో వాయిదా ఉంటుంది. అత్యవసర సేవలు అందిస్తున్న ఉద్యోగులకు సైతం ఎలాంటి మినహాయింపు లేదు.
ఆర్ధిక పరిస్ధితి అంతా సజావుగా ఉంది అని ముఖ్య మంత్రి కె చంద్రశేఖరరావు బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంగా చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. మార్చినెల 31వ తేదీతో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో 1,42,492 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని, వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 1,82,914 కోట్లు ఖర్చు చేస్తామని ఆర్ధిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈలోగా ఉద్యోగుల వేతనాల్లో సగాన్ని వాయిదా వేయాల్సిన అగత్యం ఏమి వచ్చిందో ప్రభుత్వం చెప్పలేదు. ఇంతకంటే తీవ్ర పరిస్ధితిని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏప్రిల్‌ ఒక్క నెల సగం వేతనం ఇస్తామని, మిగిలిన సగం మొత్తాన్ని పరిస్ధితి మెరుగుపడిన తరువాత సర్దుబాటు చేస్తామని చెప్పినట్లు ప్రభుత్వ ఉద్యో గుల సంఘనేత ఒకరు చెప్పారు. తెలంగాణాలో నిరవధికంగా వేతన వాయిదాను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాకు వెల్లడించినదాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతం ఇస్తామని సీఎం జగన్‌ చెప్పారని, రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నందున తాము సీఎం సూచనకు అంగీకరించామని వెల్లడించారు. ఈ ఒక్క నెల మాత్రమే జీతం రెండు విడతలుగా ఇస్తామని సీఎం చెప్పినట్టు సూర్యనారాయణ వివరించారు. కరోనా పరిస్థితుల ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, ఈ నెలలో సగం జీతం ఇస్తామని చెప్పారని, మిగిలిన జీతం నిధులు సర్దుబాటు అనంతరం ఇస్తామని తెలిపారని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఇదే విధంగా తెలంగాణా ముఖ్యమంత్రి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘాలుగా భావించబడుతున్నవారితో అయినా ఎందుకు సంప్రదించలేదన్నది ప్రశ్న. ఆంధ్రప్రదేశ్‌ అయినా తెలంగాణా అయినా ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగులు, పెన్షనర్లను తాత్కాలికంగా అయినా ఇబ్బందులకు గురి చేశారని చెప్పక తప్పదు. ప్రతి నెలా చెల్లించాల్సిన వాయిదా మొత్తాలు, ఇతర అవసరాలకు వేసుకున్న కుటుంబ బడ్జెట్లు తీవ్రంగా ప్రభావితం అవుతాయని ఇద్దరు ముఖ్యమంత్రులు, వారి సలహాదారులు, ఉన్నత అధికారులకు తెలియదా ? వాయిదా వేసిన వేతన మొత్తాల మేరకు కూడా రిజర్వుబ్యాంకు నుంచి రుణం లేదా అడ్వాన్సు తెచ్చుకోలేని దుస్ధితిలో ప్రభుత్వాలు ఉన్నాయా లేక వడ్డీ భారాన్ని ఉద్యోగుల మీద మోపే ఎత్తుగడ అనుకోవాలా ?
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ కంటే ముందుగా అసోం ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలనుంచి కొంత మినహాయించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగ సంఘంతో ఆర్ధిక మంత్రి చర్చలు జరిపి వారిని ఒప్పించి నిర్ణయం తీసుకున్నారు. కరోనా నిరోధ చర్యల్లో నిమగమైన వారికి వేతన మినహాయింపు వర్తింప చేయరాదని కోరినట్లు ఉద్యోగ సంఘనేతలు ప్రకటించారు.వేతనాన్ని పది నుంచి ఇరవై శాతం వరకు మార్చినెలకు మినహాయిస్తారు. ఆ మొత్తానికి నాలుగున్నరశాతం వడ్డీతో తరువాత ఉద్యోగులకు చెల్లిస్తారు.
మరో రాష్ట్రం మహారాష్ట్రలో ప్రజాప్రతినిధుల వేతనాల్లో 60శాతం, ఒకటి, రెండవ తరగతి అధికారుల వేతనాల్లో 50, మూడవ తరగతి ఉద్యోగులకు 25శాతాన్ని మినహాయిస్తారు, ఇతరులకు ఎలాంటి మినహాయింపులేదు. వీటిని చూసినపుడు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్‌జివోలు, ఉపాధ్యాయులు తీవ్రంగా ప్రభావితం అవుతారన్నది స్పష్టం. పెన్షనర్ల సంగతి చెప్పనవసరం లేదు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాది చివరిలో నిధులకు కటకటను ఎదుర్కొంటాయి. అందుకు గాను ముందుగానే బిల్లుల చెల్లింపు, కొత్తగా పనుల మంజూరు, వాహనాల కొనుగోలు వంటి కొన్ని చర్యలను ప్రకటించటం సర్వసాధారణం. ఇప్పుడు ఆర్ధిక సంవత్సరం ఆరంభమే ఉద్యోగుల వేతనాల వాయిదాతో ప్రారంభమైంది. ఇది మంచి సూచిక కాదు. తెలంగాణాలో ప్రస్తుతం రెండు విడతల కరవు భత్యం బకాయి ఉంది, ఇప్పటికే ప్రకటించిన మేరకు పిఆర్‌సి డిసెంబరు వరకు వెలుగు చూసే అవకాశం లేదు. మధ్యంతర భృతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఇతర దేశాల్లో ఉద్యోగులు, కార్మికుల పరిస్ధితి ఎలా ఉందో చూద్దాం. లాటిన్‌ అమెరికాలోని పరాగ్వేలో ప్రభుత్వ రంగ సిబ్బందికి మూడునెలల పాటు వేతనాల కోతను ప్రకటించారు. దేశాధ్యక్షుడు పొందుతున్న వేతనానికి మించి ప్రభుత్వ రంగ సంస్ధలలో ఉన్నతాధికారులెవరికీ వేతనాలు చెల్లించకూడదన్నది వాటిలో ఒకటి.దేశంలో ప్రకటించిన కనీస వేతనాల కంటే ఐదు రెట్లు ఎక్కువ పొందే వారికి పదిశాతం, పది రెట్లు పొందేవారికి 20శాతం వేతన కోత విధిస్తారు.ప్రజారోగ్యవ్యవస్ధను మెరుగుపరచే పేరుతో ఈ కోత విధించారు.

Telangana government lifts ban on transfer of employees till June ...
సింగపూర్‌లో కూడా తీసుకోవాల్సిన చర్యల గురించి జాతీయ వేతన మండలి కొన్ని సూచనలు చేస్తూ ఆయా రంగాలలో ముందున్నవారు నమూనాగా నిలవాలని కోరింది. ఉద్యోగుల వేతనాల కోత చర్యలకు ముందు కంపెనీలు యాజమాన్య పొదుపు సంగతి చూడాలన్నది సూచనలలో ఒకటి. యూనియన్లతో వేతన సంప్రదింపులకు ముందు కంపెనీల పరిస్ధితి గురించి అన్ని విషయాలు వివరించాలి. అన్ని చర్యల తరువాతే ఉద్యోగుల తొలగింపు ఉండాలని ప్రభుత్వం కంపెనీలకు చెప్పాలి. ముందు కంపెనీలు వేతనేతర ఖర్చు తగ్గించాలి. మానవ వనరులు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తే ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి. ప్రభుత్వ సాయాన్ని పొందాలి. మూడవదిగా వేతన కోతలుండాలి. తక్కువ వేతనాలు పొందేవారి మీద నామమాత్ర ప్రభావం పడాలి. వేతనాలు పెరిగే కొద్దీ కోతలు పెరగాలి. తప్పనిసరి అయితే ఉద్యోగుల తొలగింపు బాధ్యతాయుత పద్దతిలో జరగాలి.
ఈ నేపధ్యంలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ పాలకులు అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకొని ఉండాల్సింది. ముందుగా ప్రభుత్వ శాఖలలో దుబారా తగ్గింపు చర్యలు ప్రకటించాలి. వాటి గురించి ఉద్యోగ సంఘాలు, సామాజిక, రాజకీయ, ప్రజాసంఘాలతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకొని ఉంటే కరోనాపై ఏకోన్ముఖ పోరాటం చేస్తున్న సందేశం జనంలోకి వెళ్లి ఉండేది. తెలంగాణాలో అవసరం లేకపోయినా వందల కోట్లు ఖర్చయ్యే కొత్త సచివాలయ నిర్మాణ ప్రతిపాదనను ప్రభుత్వం ఇంతవరకు విరమించుకోలేదు.ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అయినా ఆ పని చేసి ఉంటే గౌరవ ప్రదంగా ఉండేది. కొత్త అసెంబ్లీ, శాసనమండలి భవనాలు, కొత్త హైకోర్టుల నిర్మాణ ప్రతిపాదనలు కూడా అలాంటివే. ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే ఉద్యోగులకు వేతనాలకే డబ్బు లేని స్ధితిలో మూడు రాజధానుల ప్రతిపాదనలను రద్దు చేసుకొని ప్రతిష్టకు పోకుండా వివాదం నుంచి గౌరవ ప్రదంగా బయట పడేందుకు ఇప్పటికీ అవకాశం ఉంది.
ప్రభుత్వాలు తీసుకొనే వేతన చెల్లింపు వాయిదా చర్యవలన ఉద్యోగులు తాత్కాలికంగా ఇబ్బంది పడినా బకాయిలను తరువాతైనా పొందుతారు. కానీ ప్రయివేటు రంగంలోని వారి పరిస్ధితి ఏమిటి ? అంత పెద్ద ప్రభుత్వాలే వాయిదాలు వేస్తుంటే మేము వాయిదాలు పని చేయని రోజులకు అసలు చెల్లించలేము అంటే కార్మికులు, ఉద్యోగులకు దిక్కేమిటి ? సాధారణ రోజుల్లోనే కనీస వేతనాలు అమలు జరపని సంస్ధల మీద ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు పని చేయని కాలానికి వేతనం ఇప్పించే చిత్త శుద్ధి పాలకులకు ఉందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనాపై తప్పుడు ప్రచారాలు, సమాధానం లేని ప్రశ్నలు !

29 Sunday Mar 2020

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Amarican Virus, Donald Trump Virus, falsities, Falsities against China, Novel Coronavirus

Information warfare: Western media spreads false info on virus ...

ఎం కోటేశ్వరరావు
వైరస్‌లు ఒకే విధంగా ఉండవు, ఎప్పటికప్పుడు స్వభావాన్ని, స్వరూపాన్ని కూడా మార్చుకుంటూ ఉంటాయి. అందుకే వాటికి వాక్సిన్లు లేవు. నిజానికి తయారు చేయటం కష్టమేమీ కాదు. వాక్సిన్‌ తయారీ, పరీక్షలు జరిపి నిర్ధారించుకొనే లోగా సదరు వైరస్‌ కనుమరుగు కావటం లేదా కొత్త లక్షణాన్ని సంతరించుకుంటే అది వృధా. తయారు చేసిన వారికి సమయం, పెట్టుబడి దండగ. కొంత మంది చెబుతున్నట్లు కరోనా ఇప్పుడు అమెరికన్‌ వైరస్‌గా మారింది. ఇది నిన్నటి మాట, అమెరికన్లకు అవమానకరం. అది పక్కాగా డోనాల్డ్‌ ట్రంప్‌ వైరస్‌గా రూపాంతరం చెందినట్లు అది అక్కడ వ్యాప్తి చెందుతున్న తీరుతెన్నులు స్పష్టం చేస్తున్నాయి. అయితే దాని లక్షణాలు మాత్రం కరోనావే, ఎలాంటి మార్పులు లేవు.
హాలీవుడ్‌ సినిమాల్లో గొరిల్లాల మాదిరి కరోనా తమ ముంగిటికి వచ్చినప్పటికీ గుర్తించలేని మతి తప్పిన స్ధితిలో కొందరు ఉన్నారు.వారిలో ట్రంప్‌ ఒకడు. మన దేశంలో కొందరు మడి కట్టుకున్న మాదిరే ప్రపంచంలో తమను ఏ వైరస్‌లు అంటుకోవు అనే దురహంకారులు ప్రపంచమంతటా ఉన్నారు. చైనాలో దాన్ని అరికట్టినా అక్కడ వెలువడుతున్న కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారిలో తప్ప స్ధానికుల్లో కొత్త కేసులు లేవు. అనేక మంది ఈ వార్తలను నమ్మటం లేదు. నిజానికి వారికి కొత్త మానసిక వ్యాధి పట్టుకుంది. కరోనా సోకిన వారికి తగిన సమయంలో చికిత్స అందిస్తే కోలుకుంటారు. కానీ ఈ మానసిక వ్యాధికి ఒకసారి గురైతే జీవితాంతం వారిని అది వెంటాడుతూనే ఉంటుంది. స్వయం కృతం అని, తన గోతిలో తానే పడిందని, తయారు చేసి ప్రపంచం మీదకు వదలిందని ఇలా చైనా గురించి తప్పుడు ప్రచారాలన్నీ చేసిన వారు, బుర్రకు పని పెట్టకుండా వాటిని గుడ్డిగా నమ్మినవారు చైనాలో వైరస్‌ను అరికట్టటాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇది కరోనా కంటే ప్రమాదకరమైన జబ్బు. దానికన్నా వాక్సిన్‌ కనుగొనగలరేమో గానీ, దీనికి అసాధ్యం.

Arab Media: COVID-19 Is A US Plot To Ruin China's Economy | MEMRI
కరోనా పీడితుల్లో ఇప్పుడు అమెరికా అగ్రస్ధానానికి చేరింది.పెరుగుదల రేటు వారంలో రెట్టింపైంది. దీనికి ట్రంప్‌ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, దురహంకారం తప్ప మరొకటి కారణం కాదు. గూఢచార సంస్ధలు, అధికారులు నెత్తీనోరూ బాదుకొని చెప్పినా వినిపించుకోలేదు. చైనా వైరస్‌ను తయారు చేసి వదిలిందని, దాని గురించి ప్రపంచానికి వెల్లడించకుండా దాచి పెట్టి తన గోతిలో తానే పడిందని అనేక మంది నోరు పారవేసుకున్నారు. ఒక పిచ్చి రోగిని పిచ్చి ఉందంటే మరింతగా రెచ్చి పోయేలక్షణం ఉంటుంది కనుక. చైనా పిచ్చి పట్టిన వారు చెప్పేదాన్ని కాసేపు అంగీకరిద్దాం. తామొక రాక్షసితో పోరాడుతున్నామని చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ జనవరిలోనే ప్రకటించారు. వెంటనే వ్యాధి ఉన్న ప్రాంతంలో జనబందీ(లాక్‌డౌన్‌) పాటించిందని తెలుసు కదా ?చైనాలో ఎప్పుడేమి జరుగుతోందా తమకు పక్కాగా తెలుసునని విర్రవీగే పశ్చిమ దేశాల గూఢచారులు ఏ గుడ్డిగుర్రాలకు పళ్లు తోముతున్నట్లు ? తమ దేశాలను తగుజాగ్రత్తలు తీసుకోవాని ఎందుకు హెచ్చరించలేదు ? వీటికి సమాధానాలు మనకు ఎక్కడా కనపడవు.
తీరా ఇప్పుడు కేసుల్లో చైనాను మించిపోయిన అమెరికాలో దేశమంతటా జనబందీని ఎందుకు అమలు జరపటం లేదు. కొంత మంది చెప్పినట్లు చైనా తన జనాన్ని గోతి నుంచి సురక్షితంగా బయటకు తెచ్చింది. మిగతా దేశాల పాలకులందరూ ఇప్పుడు తమ జనం మొత్తాన్ని గోతుల్లో పడవేశారు. ప్రాణాలు తీస్తున్నారు. అంత్యక్రియలు కూడా సకాలంలో చేసే వారు లేక శవాలు గుట్టలుగా పడుతున్న దుస్ధితిని చూస్తున్నాము. ఈ దుర్మార్గానికి ఎందుకు పాల్పడ్డారని వారిని అడగాల్సిందిపోయి ఇంకా కొందరు చైనా మీద ప్రశ్నలను సంధిస్తున్నారు. వారిలో రెండు రకాలు, ఒకటి కావాలని చేయటం, రెండవది అమాయకంగా వారి ప్రచారాన్ని గుడ్డిగా నమ్మి వాట్సప్‌లో అందరికీ పంచేవారు. బుర్ర పక్కన పెట్టి చెవులప్పగించి వినేవారుంటే చెప్పేవారు ఏదైనా మనకు ఎక్కిస్తారు.కొన్ని ప్రశ్నలకు సమాధానాలు,ఆలోచనకోసం మరికొన్ని ప్రశ్నలను ఇక్కడ చూద్దాం
అమెరికన్ల దగ్గర అంతులేని సంఖ్యలో అణు, ఇతర ఆయుధాలున్నాయి. యుద్ద విమానాలకు, ఓడలకు కొదవలేదు. అలాంటి దేశంలో…..తుడుచుకొనే కాగితపు ఉండలకు కొరత ఎందుకు ఏర్పడింది? శత్రుదేశాల మీద క్షణాల్లో బాంబులు వేసి విధ్వంసం సృష్టించే ఎఫ్‌35 బాంబర్లను క్షణాల్లో తయారు ప్రపంచంలో ఏమూలకైనా సరఫరా చేయగల అమెరికా తన పౌరుల ప్రాణాలను రక్షించే వెంటిలేటర్లను వెంటనే ఎందుకు తయారు చేసుకోలేకపోతోంది? వైద్య సిబ్బందికి అవసరమైన కనీస మాస్కులు, గ్లౌజులు, గౌన్లు ఎందుకు సరఫరా చేయలేకపోతోంది? రోగులను పరీక్షించే కిట్లకు ఎందుకు కటకటలాడుతోంది ? ఇతర దేశాలను అమెరికా ఎందుకు ఆదుకోలేకపోతోంది ?

ఊహాన్‌ నగరం నుంచి జర్మనీలోని డూయిస్‌బర్గ్‌కు వైద్య సరఫరాలతో కూడిన రైలు ఈనెల 28న బయలుదేరింది. జనబందీ ఎత్తివేసిన తరువాత ప్రారంభమైన తొలి సరఫరా ఇది. చైనా నుంచి మరికొన్ని ఆసియా దేశాలకు ఇప్పటికే విమానాల్లో సరఫరా చేశారు ? అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు ఏమి చేస్తున్నట్లు ? ఇవా ఇప్పుడు అడగాల్సిన ప్రశ్నలు ? లేక చైనా గురించా ? ఇప్పటికీ చైనా గురించి అడుగుతున్నారంటే వారి కడుపులో దుష్ట బుద్ధి ఇంకా ఉన్నట్లే !
ఊహాన్‌, పరిసరాల్లో తప్ప చైనాలోని మిగతా ప్రాంతాల్లో ఎందుకు వ్యాప్తి చెందలేదు అని చైనాను ప్రశ్నిస్తున్నవారు దానికి సమాధానం తెలుసుకోవటంతో పాటు అమెరికా, ఐరోపా, మన దేశంతో సహా అనేక చోట్ల తొలి కేసులు బయట పడగానే వ్యాపించకుండా ఎందుకు కట్టడి చేయలేదు అని అడగాలా లేదా ? ఇక కరోనా గురించి చైనా చెప్పేదానిని నమ్మరు, అలాంటి వారు మిగతా ప్రాంతాలకు విస్తరించకుండా కట్టడి చేశారంటే నమ్ముతారనే హామీ ఏముంది? సంతృప్తి చెందుతారా ? వారు నమ్మాలంటే ఏ అమెరికా వాడో మరొకరో చెప్పాలి. చైనా చెప్పిందాన్ని నమ్మకుండా తమ జనం ప్రాణాల మీదకు తెచ్చిన వారు చైనా గురించి ఏమి చెబుతారు ? వారేమి చెప్పినా చెప్పకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. 2002-03లో కరోనా జాతికి చెందిన సారస్‌ బాధిత దేశం చైనా. ఆ అనుభవం ఉంది కనుకకే ఊహాన్‌లో బయటపడిన వెంటనే అక్కడి నుంచి మిగిలిన ప్రాంతాలకు రాకపోకలను బంద్‌చేసింది, తదుపరి చర్యగా హుబెయి, పరిసర రాష్ట్రాలలో దాదాపు పది కోట్ల మంది జనాన్ని జనవరి 23 నుంచి దాదాపు రెండు నెలలపాటు ఇండ్లకే పరిమితం చేసింది(లాక్‌డౌన్‌). చైనా ఇతర ప్రాంతాలలో కూడా కేసులు ఉన్నాయి తప్ప చెదురుమదురు, వాటిని కూడా సకాలంలో ఎదుర్కొన్నారు.

First train with medical supplies for Europe leaves Wuhan as China eases Covid-19 lockdown

చైనా వారు ప్రపంచానికి అంటించారన్నది ఒక తప్పుడు ప్రచారం. ఊహాన్‌ నుంచి షాంఘై 839కిలోమీటర్లు, ఊహాన్‌ నుంచి బీజింగ్‌ 1152 కిలోమీటర్లే ఉన్నా వాటికి సోకని కరోనా పదిహేను వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాకు ఎలా పాకిందని తెలివితేటలు ఎక్కువగా ఉన్న కొందరు ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో ఇది రాస్తున్న సమయానికి ఉన్న 1,23,750 కేసులలో ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలో 53,455 ఉన్నాయి, దాని పక్కనే పెద్ద సరిహద్దు ఉన్న పెన్సిల్వేనియాలో 2,751 మాత్రమే ఉండగా పక్కనే మరో చిన్న సరిహద్దు ఉన్న న్యూజెర్సీలో 11,124 కేసులు ఎందుకు నమోదయ్యాయో చైనా గురించి అడిగేవారు చెప్పగలరా ?
చైనాలో తొలిసారి వైరస్‌ గురించి చెప్పిన ఒక వైద్యుడు, దాన్ని బయట పెట్టిన ఒక జర్నలిస్టు నోరును అక్కడి ప్రభుత్వం మూయించిందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది నిజం కావచ్చు కాకపోవచ్చు. ఒక కొత్త జబ్బు నిర్ధారణ కాకుండా ఒక వైద్యుడు లేదా జర్నలిస్టు ఇలాంటి విషయాలను బహిర్గతం చేయటాన్ని ఏ ప్రభుత్వమైనా అంగీకరిస్తుందా ? నిర్ధారణ అయిన తరువాత చైనా తగుజాగ్రత్తలు తీసుకుంది. వైరస్‌ తీవ్రత గురించి అమెరికా అధినేత ట్రంప్‌కు వివరించి హెచ్చరించామని, అయినా పట్టించుకోలేదని గూఢచారి వర్గాలు చెప్పిన అంశాన్ని పత్రికలు బయటపెట్టాయి. మరి దీనికి జవాబు ఏమిటి ? ఇక సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకోలేదని, ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధికారిని లోబరుచుకున్నారని, ప్రపంచ ఆరోగ్య సంస్ధ అబద్దాలాడిందని ఆధారాలు లేని ప్రశ్నలకు సమాధానాలు చెప్పమంటున్నారు. అన్నీ అధికారికంగా ఆయా వెబ్‌సైట్లలో ఉన్నాయి. నమ్మకం లేని వారు తీరికగా మంచి కళ్లద్దాలు పెట్టుకొని చూడవచ్చు.
వైరస్‌ సోకిన సమయంలోనే చైనా నూతన సంవత్సరాది ఉత్సవాలు వచ్చాయి. ఆ సమయంలో ప్రతి ఏడాది కోట్ల మంది చైనీయులు సెలవుల మీద స్వదేశంలో వివిధ ప్రాంతాలకు, విదేశాలకు ప్రయాణిస్తారు. ఈ ఏడాది ప్రభుత్వం ఆ ఉత్సవాలను రద్దు చేసింది, ఊహాన్‌ నుంచి స్వదేశీ, విదేశీ విమానాలను రద్దు చేయటం బహిరంగ రహస్యం. ఊహాన్‌ నుంచి 50లక్షల మందిని ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఎందుకు పంపారన్నది మరొక ప్రశ్న. ఊహాన్‌ జనాభా కోటిచిల్లర. అందులో సగం మందిని ఆకస్మికంగా విదేశాలకు పంపుతూ ఉంటే ఆ దేశాలు ఎందుకు వీసాలు ఇచ్చినట్లు ? వైరస్‌ సోకిన తరువాత ఊహాన్‌ నుంచి ఏదేశం ఎంత మందికి వీసాలు ఇచ్చిందో, ఎన్ని విమానాల్లో వారు ప్రయాణించారో ఈ ప్రశ్న వేసిన వారే వివరాలు చెప్పాలి. ఇక సంక్షోభ సమయంలో భారత్‌ ప్రపంచ నేతగా ముందుకు వచ్చింది అని ఒక ముక్తాయింపు. ఇది కాషాయ దళాల ప్రచారం తప్ప వాస్తవం కాదు. వైరస్‌ నుంచి తాను తేరుకొని ఇతర దేశాలకు అవసరమైన సాయం చేస్తున్నది చైనా తప్ప మరొక దేశం కాదు.తమ జబ్బలను తామే చరుచుకొనే వారిని కానివ్వండి అనటం తప్ప ఆగమని చెప్పలేం కదా !
చైనా తన శత్రు దేశాలకు మాత్రమే వైరస్‌ను ఎగుమతి చేసింది, మిత్ర దేశాలను మినహాయించింది అన్నది మరొక ప్రచారం. జపాన్‌ అమెరికా మిత్రదేశం, చైనాకు శత్రుదేశం, దాన్ని ఆక్రమించుకొని నానా బాధలు పెట్టటమే కాదు, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు చైనా నగరాలపై ప్లేగు బాంబులను ప్రయోగించి లక్షల మంది జనాన్ని బలిగొన్న చరిత్ర జపాన్‌ది. ఊహాన్‌ జపాన్‌ మధ్య దూరం కేవలం 2,300కిలోమీటర్లే, మరి జపాన్‌లో వైరస్‌ను ఎందుకు వ్యాప్తి చేయలేదో ఎవరైనా చెబుతారా ? చైనా మిత్ర దేశం ఇరాన్‌, రెండుదేశాల మధ్య దూరం 5,600 కిలోమీటర్లు. ఇరాన్‌ ఇప్పుడు కరోనా బాధిత దేశాల్లో ఒకటి, మరి మిత్ర దేశం అయినపుడు ఇరాన్‌కు ఎందుకు పంపినట్లు ?
తప్పుడు సమాచారాన్ని అమ్ముకొని డబ్బు సంపాదించే అమెరికన్‌ అలెక్స్‌ జోన్స్‌ తయారు చేయించిన ”ఇన్ఫోవార్స్‌” అనే ఒక యాప్‌ను తాజాగా గూగుల్‌ నిషేధించింది. ఇంతకాలం దాని సమాచారాన్ని తలకెక్కించుకొని ఇతరుల మెదళ్లు తిన్నవారి గురించి జాలిపటం తప్ప మరేమీ చేయలేము. గూగుల్‌ కూడా తప్పుడు సమాచారాన్ని సొమ్ముచేసుకోవటంలో ఏమాత్రం తీసిపోలేదు. 2018లోనే యాపిల్‌ కంపెనీ శాశ్వతంగా నిషేధించినప్పటికీ ఇంతవరకు గూగుల్‌ కొనసాగించిందంటే డబ్బు తప్ప దానికి మరొక కారణం లేదు.

How the coronavirus is testing social media's efforts to stem the ...

అలెక్స్‌జోన్స్‌ ప్రతిదానిని కుట్రకోణంలో వండివారుస్తాడు కనుక కుట్ర సిద్ధాంతవేత్త అని పేరు వచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరం పాటించాలని, ఒక దగ్గర ఉండిపోవాలని, స్వీయదిగ్బంధనం పాటించాలనటం వెనుక కుట్ర ఉందని అతగాడు తన యాప్‌ ద్వారా ప్రచారంలో పెట్టాడు. బహుశా ట్రంప్‌ వంటి వారందరూ నిర్లక్ష్యం చేయటానికి ఇలాంటి వాటిని ప్రమాణంగా తీసుకోవటం కావచ్చు. కరోనా మీద తప్పుడు వార్తల ప్రచారాన్ని అడ్డుకోవాలన్న గూగుల్‌ నిర్ణయానికి ఈ యాప్‌ను కొనసాగించటం పొసగదు కనుక ఆ పని చేసింది. ఈ యాప్‌ద్వారా వైరస్‌ నివారణ ఔషధాలంటూ ఆ ప్రబుద్ధుడు ప్రచారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. అలాంటి ఉత్పత్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని గతవారంలో న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ లెటియా జేమ్స్‌ ఉత్తరువు జారీ చేశారు. అవి ప్రజారోగ్యానికి భంగకరమని పేర్కొన్నారు. కనుక ఇలాంటి ప్రబుద్దుడి నోరు ఒకదాన్ని మూయించినా లక్షల కొలదీ వాగుతూనే ఉన్నాయి. అందుకే వినేవాడుంటే చెప్పేవాడు చెత్తంతా నింపుతాడు ! కాస్త వివేచనతో ఆలోచించినపుడు వాస్తవాలేమిటో తెలుస్తాయి !!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నమో భజనలు, వాట్సప్‌ పుకార్లు, అమెరికా కుట్రలను ఆపలేకపోయిన కరోనా !

28 Saturday Mar 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Coronavirus, COVID- 19 pandemic

AAO Alert: Coronavirus Update for Ophthalmologists – Eyewire News

ఎం కోటేశ్వరరావు
కరోనా ! యావత్‌ ప్రపంచాన్ని భయపెడుతోంది అనుకుంటున్నారు అందరూ !! నిజమా !!! చూస్తే అలా లేదు మరి. కరోనాకు ముందు-కరోనా తరువాత అని వేరు చేసి చూస్తే కరోనా విలయతాండవం తప్ప మిగిలినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏదీ ఆగలేదు !
కాలరెగరేసిన చైనాలో కరోనా తోక ముడిచింది !! నిర్లక్ష్యం వహించిన ఇటలీలో విలయతాండవం చేస్తోంది !!! నాలుగు వందల వెంటిలేటర్లు పంపుతామని అన్నారు అవేమి చాలతాయి 30వేలైనా కావాలి అని న్యూయార్క్‌ రాష్ట్ర గవర్నర్‌ చేసిన వ్యాఖ్య మీద రాష్ట్రాలలో కరోనా పాజిటివ్‌ కేసుల గురించి ఎక్కువ చేసి చెబుతున్నారు అంటూ ట్రంప్‌ మహాశయుడు ఫాక్స్‌ న్యూస్‌తో నోరుపారవేసుకున్నాడంటే పౌరుల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది.
కరోనాను అదుపు చేసి ఊహాన్‌ నగరంలో సాధారణ జనజీవనానికి, మామూలు ప్రయాణాలకు చైనా తెరతీయగా తమకేమీ కాదులే, తమనేమీ చేయదులే అని నిర్లక్ష్యం చేసిన అనేక దేశాలలో తలుపులు మూస్తున్నారు. తలలోని మెదడు మోకాల్లోకి వచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో అమెరికన్లను కాటు వేసేందుకు కోరలు చాస్తోంది, ఇది రాస్తున్న సమయానికి అగ్రస్ధానానికి చేరిన అమెరికాలో కరోనా కేసులు 104,205, మరణాలు 1,701గా ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని జనం గంగవెర్రులెత్తుతున్నారు. దాంతో చివరకు …. తుడుచుకొనే టాయిలెట్‌ పేపర్లకోసం కూడా జనాలు ఎగబడుతున్నారు. దెబ్బలాటలకు సైతం దిగుతున్నట్లు వార్తలు. ఇంకేముంది ఒక చోట బకెట్‌ బీరు కొంటే ఒక టాయిలెట్‌ పేపర్‌ ఉండ(రోల్‌) ఉచితం అని ప్రకటించగానే బీరు మొత్తం అమ్ముడు పోయిందట.(వెనెజులా గురించి చెత్త రాసిన ”చూష్కోరా” రచయిత దీని గురించి ఏమంటారో తెలియదు). ఇదే సమయంలో అక్కడ ఎన్ని తుపాకులు కావాలంటే అన్ని పుష్కలంగా అమ్ముతూ లాభాలు పోగేసుకుంటున్నారు. దేశాలన్నీ జనబందీ లేదా గృహబందీలను పాటిస్తుంటే రేపో ఎప్పుడో మనం తిరిగి పనిలోకి పోవాల్సి ఉంటుందని చెబుతున్న ట్రంప్‌ ముది మది తప్పిన స్ధితిలో ఉన్నట్లే కదా !
కత్తులకు, తుపాకుల తూటాలకు, ఎంతో మహత్యం కలిగిందని ప్రచారం చేస్తున్న స్వదేశీ ఆవు మూత్రం, పేడకు, వేద మంత్రాలకు, పూజలు, పునస్కారాలకు, చర్చీలు, మసీదుల్లో ప్రార్ధనలకు లొంగేది కాదని జనానికి చెప్పటం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. కరోనా వ్యాప్తితో సహా ఏ దుర్మార్గమూ ఆగటం లేదు. కరోనాను అందరం ఐక్యంగా ఎదుర్కొందాం అని చెప్పేది బూటకం. అనేక దేశాల మీద అమెరికా విధించిన దుర్మార్గపూరితమైన ఆంక్షల్లో ఏ ఒక్కదాన్నీ ఎత్తివేయలేదు. జనాన్ని మరింతగా బలిపెట్టేందుకు సిద్దపడుతున్నారు.
కరోనా వ్యాప్తి పూర్వరంగంలో తమ దేశ ఆరోగ్య వ్యవస్ధ పటిష్టతకు అత్యవసర రుణం ఐదు బిలియన్‌ డాలర్లు కావాలంటూ వెనెజులా చేసిన వినతిని ఐఎంఎఫ్‌ తిరస్కరించింది. ఎవరు అధికారంలో ఉన్నారో గుర్తించే విషయంలో సభ్యదేశాలకు స్పష్టత లేనందున దేశ అధ్యక్షుడు మదురో వినతిని పరిగణనలోకి తీసుకోవటం లేదని పేర్కొన్నది. అమెరికా ఆడిస్తున్న ఆటలో పావుగా మారకపోతే తన సభ్యదేశాలలో మదురోను వెనెజులా నేతగా గుర్తించిన రాజ్యాలను ఐఎంఎఫ్‌ ఎందుకు విస్మరించినట్లు ? ప్రపంచమంతా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతుంటే వెనెజులా మీద ఆంక్షలకు అమెరికా పూనుకోవటం కనీస మానవత్వ స్ఫూర్తికి వ్యతిరేకమని చైనా వ్యాఖ్యానించింది.
మరోవైపు అదే మదురో మాదక ద్రవ్యాల అక్రమరవాణాదారులతో చేతులు కలిపాడంటూ అమెరికాలో ఒక తప్పుడు కేసును తాజాగా బనాయించారు. ఇప్పటికే ఉన్న ఆంక్షలను మరింతగా అమలు జరిపి మదురో సర్కార్‌ను కూల్చివేసేందుకే ఈ యత్నం. అమెరికాకు అవసరమైన వైద్య సరఫరాల కోసం రష్యాను తప్ప ఇతర దేశాలను సంప్రదించాలంటూ అమెరికా విదేశాంగశాఖ రాయబారులను ఆదేశించింది.
ఒక వైపు తమను కరోనా కబళిస్తున్నా నిద్రపోతున్న ట్రంప్‌ సర్కార్‌ నిర్వాకాన్ని కప్పిపుచ్చేందుకు చైనా మీద ఆరోపణలను కొనసాగిస్తూనే ఉంది. అనేక దేశాలలో అది పెట్టిన చిచ్చు ఇంకా రాజుకుంటూనే ఉంది, ఎక్కడా దాడులు ఆగలేదు. ఇది దుష్ట రాజకీయం తప్ప జనాన్ని ఆదుకొనే వారు చేయాల్సిన పనేనా ? బాధితులైన అమెరికా జనం మీద ఎవరికీ కోపం ఉండాల్సినపనిలేదు గానీ ట్రంప్‌ బాధ్యతా రాహిత్యం, దుర్మార్గాలను ముక్త కంఠంతో ఖండించాల్సిందే. నైతికంగా అతగాడికి అధికారంలో ఉండే అర్హత ఏమాత్రం లేదు.
దేశాన్ని ఆర్ధికంగా దిగజార్చటం, నిరుద్యోగం పెరగటం అచ్చే దిన్‌కు బదులు జనాలకు చచ్చే దిన్‌ తెచ్చిన పూర్వరంగంలో ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమంలో నరేంద్రమోడీ భజన తగ్గింది. అయితే జనతా కర్ఫ్యూ, జనం ఇండ్లకే పరిమితం(లాక్‌డౌన్‌) కావటం నరేంద్రమోడీ మెదడులోంచి వచ్చిన తెలివితేటలు, మహత్తర ఆలోచనలంటూ తిరిగి భజన ప్రారంభమైంది. ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకు నమో జ్యోతి పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలట. చైనాలో రెండు నెలల పాటు జనబందీ అమలు జరిగిన తరువాత ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా అనివార్యమే అయినా ఆకస్మికంగా దేశవ్యాపిత కర్ఫ్యూను ప్రకటించి ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారో చూశాము. చైనాలో ఎలా అమలు జరిపారో కనీసంగా అధ్యయనం చేసినా ఇలా జరిగి ఉండేది కాదు. వలస కార్మికులు స్వస్ధలాలకు వెళ్లే ఏర్పాట్లు లేక కంటెయినర్లలో బిక్కు బిక్కు మంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లినట్లు వచ్చిన వార్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు చూపు లేమికి, నిర్లక్ష్యానికి నిదర్శనం. విదేశాల్లో ఉన్నవారికోసం విమానాలు పంపిన వారికి స్వదేశంలో వలసపోయిన వారిని స్వస్ధలాలకు పంపే బాధ్యతను ఎందుకు తీసుకోరు ?
యావత్‌ సమాజం కష్టకాలంలో ఉన్నపుడు పాలకులు చేసిన సాయానికి వంకలు పెట్టటం ఏమిటి అని అనేక మందికి అనిపించవచ్చు. మన దేశంలో కష్టకాలానికి కరోనా తోడైంది. ఈ సమయంలోనే లీటరు డీజిల్‌, పెట్రోలుకు మూడేసి రూపాయల పన్ను పెంచారు. మరో ఎనిమిది లేదా పది రూపాయలను పెంచేందుకు పార్లమెంటులో ముందస్తు అనుమతి తీసుకున్నారు. ఇది కష్టకాలం అని జనం మీద కనికరం చూపాలని దయగల పాలకులకు అనిపించలేదు. అంతకు ముందు వేళ్ల మీద లెక్కించదగిన ధనికులకు 7.78లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేసిన చేతులతో 130కోట్ల మందికి లక్షా 75వేల కోట్ల రూపాయల పాకేజి ప్రకటించి తమ భుజాలను తామే చరుచుకుంటున్నారు. ఈ మొత్తంలో గత ఏడాదే ప్రకటించిన మూడు వాయిదాల ఆరువేల రూపాయల రైతు సాయంలో ఒకవిడత రెండువేల రూపాయలు కూడా ఇమిడి ఉన్నాయి. ఏటా 70వేల కోట్లు ఇందుకు అవసరమని గతంలో చెప్పినదాన్ని బట్టి మూడో వంతు ఇరవై వేలను మినహాయిస్తే కరోనా సాయం మరింత తగ్గినట్లే . అది వాస్తవం అయితే రెండు వేల రూపాయలను కరోనా సందర్భంగా రైతులకు చేస్తున్న సాయమని మభ్యపెడుతూనే ఉన్నారు.కంపెనీల యజమానులకు అందచేసే మొత్తాలను (పిఎఫ్‌ వాటా చెల్లింపు) కూడా జనం ఖాతాలో రాస్తున్నారు. బహుశా ఇది వేద గణితం అయి ఉండాలి. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా బదులు ప్రత్యేక పాకేజి అని చెప్పారు. తీరా చూస్తే కేంద్ర పధకాలన్నింటినీ కలిపి చెప్పారు తప్ప అదనపు సాయం ఏమీ లేదు. ఇప్పుడు కరోనా సాయంలో కూడా కేంద్ర పధకాలు ఏమైనా కలిసి ఉన్నాయా అన్నది చూడాల్సి ఉంది.
డెమోక్రాట్ల వత్తిడితో అల్పాదాయవర్గాల వారికి ఈ ఏడాది చివరి వరకు నెలనెలా పెద్ద వారికి ఒక్కొక్కరికి పన్నెండువందల డాలర్లు, పిల్లలకు ఐదువందల డాలర్లు చెల్లించేందుకు ట్రంప్‌ సర్కార్‌ అంగీకరించాల్సి వచ్చింది.(డాలరుకు 75 రూపాయలు) ఆయన జిగినీ దోస్తు నరేంద్రమోడీ మాత్రం జనధన్‌ ఖాతాలున్న మహిళకు మూడు నెలల పాటు నెలకు ఐదు వందల రూపాయలు జమచేస్తామని చెప్పి తమలో తామే ఉబ్బితబ్బిబ్బు అవుతూ టాంటాం వేసుకుంటున్నారు. అమెరికా, ఇతర దాని తొత్తు దేశాల ఆంక్షలు, అష్టదిగ్బంధం కారణంగా ఇబ్బందులు పడుతున్న వెనెజులా ఆరునెలల పాటు జనానికి ఉపశమన చర్యలను ప్రకటించింది. మన ఆర్ధిక వ్యవస్ధను ఐదో స్ధానానికి చేర్చామని ఊరూవాడా ప్రచారం చేసిన పెద్దలు తీరా జనానికి సాయం విషయంలో ఎక్కడ ఉన్నారు. ప్రపంచ రాజకీయాల్లో నరేంద్రమోడీ తమ సహభాగస్వామి అని ట్రంప్‌నుంచి పొగడ్తలు అందుకున్నారు. అలాంటి ట్రంప్‌ 150లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్రకటిస్తే ఆ పెద్దమనిషి భాగస్వామి 1.75లక్షల కోట్లు మాత్రమే ప్రకటించారు. వ్యాధిని వారాల తరబడి నిర్లక్ష్యం చేసిన, సముద్రంలో కాకిరెట్ట మాదిరి సాయం ప్రకటించిన నాయకత్వానికి నీరాజనాలా ? సిగ్గు చేటు ! కేంద్రంలో నరేంద్రమోడీ లేదా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తమ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. కేరళ ముందుగా మేలుకున్నట్లు అందరూ అంగీకరిస్తారు, కానీ అక్కడ అధికార సిపిఎం నేతలు మన తెలుగు రాష్ట్రాల్లో మాదిరి అక్కడి సిఎంను పొగడ్తలతో ముంచెత్తటం లేదు. పొగడ్తలు, భజనలతో అభిమానం సంపాదించుకొనేందుకు అలవాటు పడిన నేతలకు సమయం సందర్భం గురించి సృహ ఉండదని ఇప్పుడు రుజువు చేస్తున్నారు.
ఒక వైపు కరోనా మరణమృదంగాన్ని వాయిస్తుంటే ఇటలీలోని కార్పొరేట్‌ల యజమానులు చట్టాల్లోని లోపాలను వినియోగించుకొని లబ్ది పొందేందుకు ప్రయత్నించటం కంటే దుర్మార్గం మరొకటి లేదు. ఆరోగ్య సంబంధ సంస్ధలు మినహా మిగిలిన వాటన్నింటినీ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ అత్యవసర సేవల చట్టంలోని నిబంధనల లోపాలను వినియోగించుకొని ఆయుధ కంపెనీల యజమానులు ఫ్యాక్టరీలను మూసివేసేందుకు తిరస్కరిస్తున్నారు.దీనికి నిరసనగా కార్మికులు సమ్మెకు పిలుపు ఇవ్వాల్సి వచ్చింది.

Cartoons: Coronavirus outbreak classified as pandemic
గతంలో బ్రెజిల్‌ వామపక్ష ప్రభుత్వం క్యూబా వైద్యులను రప్పించి పెద్ద ఎత్తున వైద్య, ఆరోగ్యసేవలను అందించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న మితవాద బోల్‌సోనోరో సర్కార్‌ క్యూబా మీద వ్యతిరేకతతో ఆదేశ వైద్యులను వెనక్కు పంపింది. మరి కొంత మందిని దేశంలో ఉండేందుకు          అనుమతించినప్పటికీ వారి సేవలను వినియోగించుకోవటం నిలిపివేసింది. . ఇప్పుడు కరోనా వ్యాప్తి కారణంగా అదే క్యూబా వైద్యులు తమకు సేవలు అందించాలని, క్యూబా వెళ్లిన వారు తిరిగి రావాలని బోల్‌సోనోరో సర్కార్‌ వేడుకున్నది.ఐదువేల మంది క్యూబన్‌ వైద్యులను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వినియోగించనున్నట్లు ఆరోగ్య మంత్రి జావో గబ్బార్డో ప్రకటించాడు.ఎన్నికల ప్రచారంలో క్యూబా వైద్యులను వ్యతిరేకించటం ఒక ప్రచార అంశంగా బోలోసోనారో ముందుకు తెచ్చారు. క్యూబా నుంచి వచ్చిన పదివేల మంది వైద్యులు బ్రెజిల్‌లో గెరిల్లా దళాలను ఏర్పాటు చేసేందుకు వచ్చారని, వారు నిజంగా వైద్యులు కాదని తాను అధికారంలోకి రాగానే వారిని వెనక్కు పంపినట్లు ప్రకటించాడు. క్యూబన్‌ వైద్యుల మీద తప్పుడు ప్రచారం చేసినందుకు బోలోసోనారో క్షమాపణ చెప్పాలని లూలా నాయకత్వంలోని వర్కర్స్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.
వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో కాషాయ దళాల ప్రచారం ముమ్మరంగా సాగుతూనే ఉంది. ఇటలీకి వచ్చిన క్యూబా వైద్యుల బృందం ఫొటోను మార్ఫింగ్‌ చేసి ఆర్‌ఎస్‌ఎస్‌ సేవా దళం అని చిత్రించింది వాటిలో ఒకటి. మూఢనమ్మకాలను పుంఖాను పుంఖాలుగా ముందుకు తెస్తున్నారు. కాషాయ దళాలతో పాటు ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు వ్యతిరేకుల ప్రచారానికి కరోనా కలసి వచ్చింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వైద్య అవసరాలకోసం ఇతర దేశాలను అర్ధిస్తున్న అమెరికా !

25 Wednesday Mar 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Coronavirus outbreak in US, COVID-19 in US


ఎం కోటేశ్వరరావు
ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా ! ఏ క్షణంలో అయినా చైనా సంఖ్యను మించి పోయే పరిస్ధితిలో ఉంది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన పరికరాలు, చివరికి తగినన్ని ముసుగుల(మాస్క్‌లు)కు సైతం కొరత ఏర్పడవచ్చనే అంచనాతో చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు తన నుంచి సాయం పొందిన దేశాలనే సాయం అందించమని ఇప్పుడు అడుక్కుంటోంది. దీనిలో కూడా రాజకీయాన్ని చొప్పించి రష్యాను అర్ధించవద్దని రాయబారులను ఆదేశించింది. ” ఫారిన్‌ పాలసీ ” అనే పత్రిక ” యుఎస్‌ అప్పీల్స్‌ టు ఎయిడ్‌ రిసిపెంట్స్‌ ఫర్‌ హెల్ఫ్‌ ఇన్‌ ఫైటింగ్‌ కరోనా వైరస్‌ ” అనే శీర్షికతో మార్చినెల 23న రాసిన వ్యాసంలో ఈ అంశాన్ని పేర్కొన్నది. తూర్పు ఐరోపా, యూరేసియా ప్రాంతంలో అమెరికా సాయం పొందిన దేశాల నుంచి అమెరికాకు అవసరమైన వైద్యపరికరాలు, రక్షణ ఉత్పత్తుల కోసం రంగంలోకి దిగాలని విదేశాంగశాఖ అగ్రశ్రేణి దౌత్యవేత్తలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆ పత్రిక తెలిపింది. అమెరికాలో రోజు రోజుకూ వ్యాధి గ్రస్తులు, మృతుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో రాయబారులను అమెరికా రంగంలోకి దింపింది. అయితే అన్ని దేశాలూ కరోనాతో వణికిపోతున్న తరుణంలో అమెరికాకు అవి ఏమాత్రం సాయం చేయగలవో తెలియదు. ఇది రాస్తున్న సమయానికి అమెరికాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 55వేలు దాటిపోయింది. ఆరోగ్యబీమా అందరికీ లేని కారణంగా అనేక కేసులు నమోదు కావటం లేదని వార్తలు వచ్చాయి.
కొద్ది రోజుల క్రితమే తమకు అవసరమైన పరికరాలు, పరీక్షలకు కొదవ లేదని ట్రంప్‌ మాట్లాడిన వెంటనే విదేశాంగశాఖ రాయబారులను రంగంలోకి దించటాన్ని బట్టి వైరస్‌ తీవ్రతను ట్రంప్‌ యంత్రాంగం గమనించలేదన్నది స్పష్టమైంది. మార్చి22న ఐరోపా,యూరేసియా దేశాలకు విదేశాంగశాఖ సీనియర్‌ అధికారి డేవిడ్‌ హాలే పంపిన ఇమెయిల్‌ అంశాలు తమకు లభ్యమైనట్లు ఫారిన్‌ పాలసీ పత్రిక పేర్కొన్నది. ఏ ఏదేశాలు అమెరికాకు అవసరమైన పరికరాలు, ఇతర సరఫరాలను విక్రయించగలవో సంప్రదించాలని రాయబారులను దానిలో కోరారు. అయితే రష్యాను అడగొద్దని ప్రత్యేకంగా పేర్కొన్నట్లు కూడా వెల్లడించింది. వేలాది వెంటిలేటర్లు, ఇతర ఆధునిక పరికరాలు అవసరమని హాలే పేర్కొన్నారు. సంవత్సరాల తరబడి అనేక దేశాలకు సాయం అందించే చర్యలను సమన్వయం చేసే కార్యాలయం ద్వారానే ఇప్పుడు తమకే సాయం అవసరమని ఆయా దేశాలను అభ్యర్ధించింది.
కొద్ది రోజుల క్రితం అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడుతూ వైరస్‌ ప్రబలిన సమాచారం తెలియగానే తమ దగ్గర ఉన్న అత్యంత నిపుణులైన వారిని చైనా వారికి సాయం చేసేందుకు పంపుతామంటే చైనా అనుమతించకుండా వైరస్‌ తీవ్రతను పెంచిందని, ప్రపంచానికి ముప్పు తెచ్చిందని ఆరోపించాడు. ట్రంప్‌ కూడా అదే మాదిరి ఆరోపణలు చేశాడు. ఇప్పుడు అదే చైనా దేశీయంగా వైరస్‌ను అదుపు చేసి అనేక దేశాలకు అవసరమైన సాయం చేస్తోంది. ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో నిర్లక్ష్యం చేసిన అమెరికా తన పౌరుల ప్రాణాలకు పెను ముప్పు తెచ్చింది. ఒక్క చైనా మాత్రమే ఐరోపాకు అవసరమైన వైద్య పరికరాలను సరఫరా చేయగలదని చెక్‌ రిపబ్లిక్‌ హౌం మంత్రి జాన్‌ హామ్‌సెక్‌ చెప్పాడు. ఈ రోజు కాకున్నా రేపైనా అమెరికా సైతం సాయం కోసం చైనాను కోరక తప్పకపోవచ్చు.
అమెరికాలో జనానికి అత్యవసరమైన వైద్య పరికరాలు, ఇతర సరఫరాల కోసం ట్రంప్‌ సర్కార్‌ గట్టి చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు ప్రారంభమయ్యాయి. ఆయుధ ఉత్పత్తులు చేసే పరిశ్రమలు వాటి బదులు అత్యవసరమైన వైద్యపరికరాల తయారీ చేపట్టేందుకు వీలుగా డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ చట్టాన్ని ఎందుకు ప్రయోగించటం లేదని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. గతవారంలో అలాంటి చట్టాన్ని వినియోగించేందుకు వీలుకల్పిస్తూ ట్రంప్‌ ఒక ఉత్తరువు మీద సంతకం చేసినా అమలు చేయటం లేదు. పారిశ్రామికవేత్తలు స్వచ్చందంగా ఉత్పత్తులు ప్రారంభిస్తారని ట్రంప్‌ సుభాషితాలు పలకటం తప్ప ఎవరూ ఇంతవరకు ముందుకు రాలేదు. న్యూయార్క్‌ రాష్ట్ర గవర్నర్‌ ఆండ్రూ కుమో దీని గురించి చెబుతూ తాను వెయ్యి మాస్క్‌ల కోసం సంప్రదిస్తే ఇరవై నిమిషాల తరువాత ఒక కంపెనీ వారు ఫోన్‌ చేసి ధరలు పెరిగిపోయాయని, మీ కంటే మాకు ఇతరుల నుంచి మంచి ధర వచ్చే అవకాశం ఉందని సమాధానం వచ్చిందన్నారు. ధరలను పెంచే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ట్రంప్‌ ఆదేశించినా ఆ పరికరాల వివరాలు లేకపోవటంతో చర్యలు తీసుకొనే అవకాశ ం లేకపోయింది.
రక్షణ ఉత్పత్తుల చట్టాన్ని అమలు జరిపితే రక్షణ పరిశ్రమలను జాతీయం చేసినట్లుగా వాణిజ్యవేత్తలలో భయాందోళనలు తలెత్తుతాయని ట్రంప్‌ చెప్పటం విశేషం. జాతీయం చేసే దేశం తమది కాదు, అది మంచిది కూడా కాదు అన్నారు. ఇప్పుడు నేను ఒక కంపెనీని వెంటిలేటర్లు తయారు చేయాలని ఆదేశిస్తే వారికసలు వెంటిలేటర్లు అంటే ఏమిటో కూడా తెలియని స్ధితిలో ఉంటారని అయినా మన దగ్గర అవసరమైన మిలియన్ల కొలది మాస్క్‌లు, ఊపిరి తీసుకొనే పరికరాలు ఉన్నాయని వాటితో చికిత్స చేస్తే చాలునని ట్రంప్‌ చెప్పిన తరువాతే విదేశాంగ శాఖ వైద్య సరఫరాల కోసం రాయబారులను రంగంలోకి దించింది. స్వచ్చందంగా వైద్య ఉత్పత్తులు చేయాలని కోరిన తరువాత మద్యం తయారు చేసే ఒక ఫ్రెంచి కంపెనీ తన మూడు యూనిట్లను శానిటైజర్స్‌ తయారు చేయాలని కోరింది. హనీవెల్‌ సంస్ధ ఎన్‌95 మాస్క్‌ల ఉత్పత్తిని పెంచింది, మరో నెల రోజుల్లో కొత్త యూనిట్‌ను ప్రారంభిస్తామని చెప్పింది. ఈలోగా పరిస్ధితి దిగజారితే పరిస్ధితి ఏమిటి అన్నది ప్రశ్న. ట్రంప్‌ తప్పుదారి ప్రకటనలు కొల్లలుగా చేస్తున్నాడు. జనరల్‌ మోటార్స్‌ మరియు ఫోర్డ్‌ కంపెనీలు వెంటిలేటర్లను తయారు చేస్తున్నాయన్నది వాటిలో ఒకటి. అయితే అది వాస్తవం కాదని తేలిపోయింది. ఉత్పత్తి చేయాలంటే కొన్ని నెలలు పడుతుందని కంపెనీ ప్రతినిధులు ట్రంప్‌ యంత్రాంగానికి చెప్పారు.
అమెరికాలోని పలు ఆసుపత్రులలో వైద్య సిబ్బంది వాడిన మాస్కులనే మరోసారి వాడటమే కాదు, గత్యంతరం లేక నిర్మాణ కార్మికులు వినియోగించే మాస్కులను కూడా వినియోగించాల్సి వస్తోంది. కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తోందో అంతకంటే ఎక్కువగా ఇప్పుడు తుపాకులు, బుల్లెట్ల కొనుగోళ్లు జరుగుతున్నాయి. వాటికి మాత్రం ఎలాంటి కొరత లేదు. గత మూడు వారాలుగా బుల్లెట్ల కొనుగోళ్లు అసాధారణంగా పెరిగినట్లు వెల్లడైంది. ఒక వెబ్‌సైట్‌ను చూసిన వారి సంఖ్య ఫిబ్రవరి 23 మార్చి 15 మధ్య 77శాతం పెరిగితే, ఆయుధ లావాదేవీలు 222శాతం పెరగ్గా ఆదాయం 309శాతం ఉంది. ఎటు చూసినా ఏం జరుగుతోందో తెలియని స్ధితిలో తమ దగ్గర ఆయుధం ఉంటే సురక్షితమని జనం భావిస్తున్నకారణంగానే కొనుగోళ్లు అసాధారణంగా జరుగుతున్నట్లు వెబ్‌సైట్‌ ప్రతినిధి చెప్పారు. స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలినపుడు, అనిశ్చిత పరిస్ధితులు ఏర్పడిన ప్రతిసారీ తుపాకుల కొనుగోళ్లు పెరిగినట్లు గత విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలో అదే జరుగుతోంది. అయితే కరోనా వైరస్‌కు దీనికి సంబంధం గురించి చెప్పలేకపోతున్నారు. ఏదైనా జరిగితే రక్షణగా ఉంటుందనే ముందు జాగ్రత్తతోనే కొనుగోళ్లకు ఎగబడుతున్నట్లు చెబుతున్నారు.


ఎప్పుడైనా వేలాది వెంటిలేటర్లు అవసరమౌతాయని ఎవరైనా కలగంటారా అని ట్రంప్‌ వాటి కొరత గురించి అడిగిన వారి మీద ఎదురు దాడి చేశాడు. మహమ్మారులు తలెత్తినపుడు అమెరికా అవసరాలకు ఎన్ని వెంటిలేటర్లు అవసరమౌతాయో సూచిస్తూ పదిహేనేండ్ల క్రితం అమెరికా ఆరోగ్య, మానవ సేవల శాఖ ఒక నివేదిక ఇచ్చింది. 1957 మరియు 1968లో తలెత్తిన ఫ్లూ మహమ్మారి వంటివి మరోసారి తలెత్తితే తొమ్మిది లక్షల మంది ఆసుపత్రుల పాలౌతారని వారిలో నాలుగోవంతు మందికి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు, వెంటిలేటర్లపై చికిత్స అందించాల్సి ఉంటుందని పేర్కొన్నది. అప్పుడు 64,875 వెంటిలేటర్లు అవసరమని, అదే 1918-19నాటి స్పానిష్‌ ఫ్లూ పరిస్ధితులు వస్తే 7,42,500 అవసరమౌతాయని అంచనా వేశారు. తరువాత హెచ్‌1ఎన్‌1 ప్లూ వంటివి మహమ్మారులుగా మారితే పెద్ద సంఖ్యలో వెంటిలేటర్లు అవసరమని ఒక విశ్లేషణ వెల్లడించింది. 2006లో బడ్జెట్‌ కార్యాలయం నివేదిక ప్రకారం అమెరికాలో లక్ష వెంటిలేటర్లు ఉన్నాయని, వాటిలో 75వేలు ఏ క్షణంలో అయినా వినియోగానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే గత 14 సంవత్సరాలలో అంతకు మించి ఒక్కటి కూడా అదనంగా తోడు కాలేదు. దేశంలో లక్ష వెంటిలేటర్లు ఉన్నాయని గతవారంలో ఉపాధ్యక్షుడు మైక్‌ పెనెస్‌ చెప్పగా, లక్షా60వేలు ఉన్నాయని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వార్త పేర్కొన్నది. కరోనా వైరస్‌ బాధితులకు శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి గనుక అమెరికాలో వేగంగా పెరుగుతున్న రోగులకు అవసరమైన వెంటిలేటర్లు లభ్యం కావేమో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
అమెరికా వ్యవస్ధ స్ధితి గురించి ప్రముఖ సామాజికవేత్త నోమ్‌ చోమ్‌స్కీ మాట్లాడుతూ ”ఆర్ధిక వ్యవస్ధ మరియు సామర్ధ్యం గురించి ఒక భావన ఉంది.రేపటికి అవసరమైన పడకలు ఉంటే మనకు చాలు, భవిష్యత్‌ కోసం సిద్దం కానవసరం లేదు. ఇలా భావించబట్టే ఆసుపత్రుల వ్యవస్ధ కుప్పకూలుతోంది ” అన్నారు. వెంటిలేటర్ల సంగతి దేవుడెరుగు, మాస్క్‌లు,గౌన్లు కూడా అందించలేని స్ధితి ఉన్నట్లు వార్తలు వస్తున్నందున అమెరికా ఆరోగ్యవ్యవస్ధను ఎలా నిర్లక్ష్యం చేశారో అర్ధం అవుతోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జనం చచ్చినా సరే -ఆర్ధిక వ్యవస్ధ ముఖ్యం అంటున్న ట్రంప్‌ !

24 Tuesday Mar 2020

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Coronavirus outbreak in US, Donald trump, Trump on COVID 19, USA COVID 19

Image result for WE CANNOT LET THE CURE BE WORSE THAN THE PROBLEM ITSELF: Donald trump
ఎం కోటేశ్వరరావు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ! కరోనా వైరస్‌ తీవ్రతను పట్టించుకోని అగ్రరాజ్య అధిపతి !! చైనా, ఇటలీ తరువాత మూడో స్ధానంలోకి చేరిన అమెరికా !!! వారం రోజుల క్రితం అమెరికాలో కరోనా మరణాలు 85, మంగళవారం రాత్రికి 622కు చేరిక, కోలుకున్న వారు 361 మంది. ఇదే వ్యవధిలో పాజిటివ్‌ కేసులు 4,600 నుంచి 49,594కు పెరిగాయి. సగం కేసులు న్యూయార్క్‌ నగరంలోనే నమోదయ్యాయి. రెండు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ చరిత్రలో తొలిసారిగా సోమవారం నాడు వాణిజ్య కేంద్రం మూసివేత. ఉద్దీపన పధకానికి సెనెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది.దాంతో ఫెడరల్‌ రిజర్వు(రిజర్వుబ్యాంకు వంటిది) రంగంలోకి అప్పులు, ఇతర ఆస్ధులను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దాంతో ఆసియాలోని స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఇది ఎంతకాలం పతనాన్ని ఆపుతుందన్నది ప్రశ్న.
ఒకవైపు గంట గంటకూ అమెరికాలో వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. అయినా ” వ్యాధి తీవ్రత కంటే చికిత్స కఠినంగా ఉండకూడదు. పది హేను రోజుల తరువాత ఏ మార్గంలో మన పయనించాలనుకుంటున్నామో నిర్ణయిస్తాం ” అని ట్రంప్‌ ప్రకటించాడు. దీని అర్ధం ట్రంప్‌కు విలువైన మానవ ప్రాణాల కంటే కార్పొరేట్ల ప్రయోజనాలే ముఖ్యమని వేరే చెప్పనవసరం లేదు. సామాజికంగా జనం దూరం పాటించటం వలన కరోనా వైరస్‌ విస్తరణ తగ్గవచ్చు, కానీ ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతింటోందనే భావం కార్పొరేట్ల నుంచి వెలువడుతోంది. ఈ నేపధ్యంలోనే సామాజికంగా దూరం పాటించాలన్న మార్గదర్శక సూత్రాలను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్‌ సూచన ప్రాయంగా తెలిపారు.బాధ్యతా రహితంగా ఏం మాట్లాడుతున్నాడో తెలియని ట్రంప్‌ తీరుతెన్నుల గురించి అడిగిన ఒక ప్రశ్నకు అంటువ్యాధుల జాతీయ సంస్ధ డైరెక్టర్‌ ఆంథోనీ ఫాసీ జవాబిస్తూ ”ట్రంప్‌ మాట్లాడుతుంటే ముందుకు దూకి ఆయనను పక్కకు తోసి మైకు లాక్కోలేను కదా ! మాట్లాడేదేదో మాట్లాడనివ్వండి, రెండవ సారి సరి చేస్తాం ” అని సైన్సు పత్రిక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
కరోనా సాయం పేరుతో సామాన్యులకు బదులు ఎన్నికల సమయంలో తనకు అనుకూల కార్పొరేట్లకు జనం సొమ్మును కట్టబెట్టే యత్నాలను డెమోక్రాట్లు అడ్డుకున్న పూర్వరంగంలో ట్రంప్‌ ప్రేలాపనలివి. అమెరికా కంటే తీవ్రంగా ప్రభావితమైన చైనాలో వైరస్‌ వ్యాప్తి కారణంగా ఆర్ధిక వ్యవస్ధ తీవ్రంగా ప్రభావితం అవుతున్నా ఖర్చుకు వెనకాడకుండా అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలకూ, ట్రంప్‌ వైఖరికి ఎంత తేడా ఉందో చూడవచ్చు. అదే జనం పట్ల నిబద్దత ఉన్న కమ్యూనిస్టులకు, కార్పొరేట్ల సేవలో తరించే పెట్టుబడిదారీ ప్రతినిధులకు ఉన్న వ్యత్యాసం. అమెరికాలో వేగంగా వైరస్‌ విస్తరిస్తున్న పూర్వరంగంలో ఇప్పటికే పది కోట్ల మంది స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. మరోవైపు దానికి వ్యతిరేకంగా ట్రంప్‌ మాట్లాడుతున్నాడు. ఇటలీ అనుభవాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకున్నా ఇలా వ్యవహరిస్తాడా ?

Image result for coronavirus Donald trump cartoons
తక్కువ ఆదాయం ఉన్న అమెరికన్లకు ఒక్కొక్కరికి పన్నెండు వందల డాలర్ల నగదు అందచేతతో సహా రెండు లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన పధకానికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అయితే ఆసుపత్రులు, నగరాలు, రాష్ట్రాలు, వైద్య సిబ్బందికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చని, ట్రంప్‌, ఆర్ధిక మంత్రి విచక్షణ మేరకు కార్పొరేట్లకు నిధులు పందారం చేసే ప్రతిపాదనను సెనెట్‌లో డెమోక్రాట్లు అడ్డుకున్నారు. అక్కడి నిబంధనల ప్రకారం ఇలాంటి పధకాలకు సెనెట్‌లోని వంద మంది సభ్యులకు గాను 60 మంది ఆమోదం అవసరం. ప్రతి పక్షం మద్దతు ఇస్తే తప్ప అది కుదరదు. నిరుద్యోగ భృతి చెల్లించాలని అభ్యర్ధిస్తూ వచ్చిన వినతులు గతవారంలో 20లక్షలకు పైగా వచ్చాయని, ఆర్ధిక పరిస్ధితి బాగోలేదనేందుకు ఇదొక సూచిక అని గోల్డ్‌మన్‌ సాచెస్‌ విశ్లేషకుడు చెప్పారు. రానున్న రోజుల్లో 1930దశకం నాటి మహామాంద్యం కంటే ఎక్కువగా నిరుద్యోగం 30శాతం మించవచ్చని కొందరు చెబుతున్నారు.
అమెరికా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఉద్దీపన పధకాన్ని డెమోక్రాట్లు అడ్డుకున్నట్లు కార్పొరేట్‌ అనుకూల అమెరికా మీడియా వార్తలను ఇచ్చింది. అధికార రిపబ్లికన్లు సామాన్యులకు బదులు కార్పొరేట్లకు ప్రజాధనాన్ని అప్పగించే ప్రతిపాదనలు చేసిన కారణంగానే డెమోక్రాట్లు వ్యతిరేకించారన్న విషయాన్ని దాచి పెట్టేందుకు మీడియా ప్రయత్నించింది. లక్ష కోట్ల డాలర్ల మేరకు ఉద్దీపన చర్యల గురించి చెబుతూ ఆమొత్తంలో 50వేల కోట్ల డాలర్లను కార్పొరేట్లకే కట్టబెట్టేందుకు ట్రంప్‌ పూనుకున్నాడు. దీన్ని ఆమోదించాలా వ్యతిరేకించాలా ? అది కూడా ట్రంప్‌, ఆర్ధిక మంత్రి ఎవరికి సిఫార్సు చేస్తే వారికి చెల్లించే ప్రతిపాదనలతో నిండి ఉంది. ఎన్నికలకు ముందు ఇలాంటి విచక్షణ అధికారంతో ఎవరు లబ్ది పొందుతారో, అందుకు ఎలాంటి పధకం వేశారో తెలుస్తూనే ఉంది. సెనెట్‌లోని వందమంది సభ్యుల్లో 60 మంది ఆమోదం అవసరం కనుక డెమోక్రాట్లు దాన్ని అడ్డుకున్నారు.
అమెరికా వ్యవస్ధ స్ధితి గురించి ప్రముఖ సామాజికవేత్త నోమ్‌ చోమ్‌స్కీ మాట్లాడుతూ ”ఆర్ధిక వ్యవస్ధ మరియు సామర్ధ్యం గురించి ఒక భావన ఉంది.రేపటికి అవసరమైన పడకలు ఉంటే మనకు చాలు, భవిష్యత్‌ కోసం సిద్దం కానవసరం లేదు. ఇలా భావించబట్టే ఆసుపత్రుల వ్యవస్ధ కుప్పకూలుతోంది. దక్షిణ కొరియాలో సాధారణ పరీక్షలను సులభంగా చేయించుకోవచ్చు, ఇక్కడ పొందలేము. కాబట్టి కరోనా వైరస్‌ను పనిచేసే సమాజంలో మాత్రమే అదుపు చేయగలం, ఇక్కడ చేతులు దాటిపోతోంది. మనం దానికి సిద్ధంగా లేము. మనమూ, మన నేతలూ గత నాలుగుదశాబ్దాలుగా బాగా చేస్తున్నదేమంటే మిగతా అంతా కుప్పకూలి పోతుంటే ధనికులు, కార్పొరేట్ల జేబులు నింపుతున్నాం.” అన్నారు.
భయంకరమైన ఈ సంక్షోభాన్ని సొమ్ము చేసుకొనేందుకు కార్పొరేట్లను అనుమతించే సమయం కాదిది అని డెమోక్రటిక్‌ పార్టీ నేత బెర్నీశాండర్స్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా కార్పొరేట్ల ఏజంట్లు(లాబీయిస్టులు) ఆయా పరిశ్రమలకు రాయితీల కోసం పైరవీలు చేస్తున్నారు. ప్రయివేటు అంతరిక్ష పరిశ్రమ ఐదు, విమానయానం 50, హౌటల్స్‌ 150బిలియన్‌ డాలర్లు కోరితే పారిశ్రామికవేత్తలు లక్షా40వేలు, అంతర్జాతీయ షాపింగ్‌ మాల్స్‌ వారు లక్ష కోట్ల డాలర్ల మేర రాయితీలు కావాలని కోరినట్లు శాండర్స్‌ తెలిపారు. జిమ్‌లు, షాపింగ్‌ మాల్స్‌ను దేశవ్యాపితంగా మూసివేసినప్పటికీ సభ్యత్వాల చెల్లింపు, ఫిట్‌నెస్‌ పరికరాలకు ముందస్తు పన్ను చెల్లింపు సొమ్మును వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని ఆడిదాస్‌ కోరింది. ఒక వైపు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించి నిలిపివేస్తే అతిధి కార్మికులకు వీసాలు ఇచ్చేందుకు వెంటనే పార్లమెంట్‌ చర్యలు తీసుకోవాలని పందిమాంస కార్పొరేట్స్‌ కోరినట్లు వార్తలు వచ్చాయి. అత్యవసర ఆరోగ్య సేవలకోసం ఈ అసాధారణ సంక్షోభ సమయంలో పార్లమెంట్‌ అసాధారణ చర్యలకు ఉపక్రమించాలని శాండర్స్‌ కోరాడు.
మన దేశం విషయానికి వస్తే కరోనా వైరస్‌ వ్యాప్తి నేపధ్యంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ను ముందుగానే ఆమోదించింది. ఇదే సమయంలో వైద్యులు, ఇతర సిబ్బంది సేవలను అభినందిస్తూ ప్రధాని నరేంద్రమోడీ జనతా కర్ఫ్యూ సందర్భంగా చప్పట్లు చరచాలని ఇచ్చిన పిలుపును అన్ని పార్టీల వారూ ఆమోదించారు, ఆచరించారు. అనేక రాష్ట్రాలు కరోనా కట్టడిలో భాగంగా జనాన్ని ఇండ్లకే పరిమితం చేస్తూ నిర్ణయించటంతో పాటు పేదలను ఆదుకొనేందుకు తమ శక్తికొద్దీ సాయాన్ని ప్రకటించాయి. అయితే కేంద్ర ప్రభుత్వం పరిశుభ్రతకు నిధులు ఇస్తామని చెప్పటం తప్ప పేదలను ఆదుకొనే నిర్దిష్ట చర్యలేవీ(ఇది రాస్తున్న సమయానికి) ప్రకటించలేదు. జనానికి ఉపశమనం కల్పించాల్సింది పోయి ఈ సమయంలోనే లీటరు పెట్రోలు, డీజిల్‌కు మూడేసి రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం పన్ను పెంచింది. మరో ఎనిమిది, పది రూపాయల వరకు పెంచుకొనేందుకు పార్లమెంట్‌ అనుమతి తీసుకుంది. లీటరుకు ఒక రూపాయి పన్ను పెంపుదల ద్వారా కేంద్రానికి ఏటా పద్నాలుగువేల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా సమకూరుతుంది. గత ఆరు సంవత్సరాల కాలంలో మోడీ సర్కార్‌ పెట్రోలు మీద ఎక్సయిజ్‌ సుంకం రూ.9.48 నుంచి రూ. 22.98కి పెంచిన విషయం తెలిసిందే. అంటే జనం మీద ఏటా లక్షా 90 కోట్ల రూపాయల భారాన్ని అదనంగా మోపుతోంది. అయినా కరోనా సంక్షోభంలో కష్ట జీవులను ఆదుకొనేందుకు ముందుకు రావటం లేదు.
ఉద్దీపన చర్యల్లో భాగంగా రెండులక్షల కోట్ల రూపాయల పాకేజి ప్రకటించాలని పరిశ్రమలు, వాణిజ్య సంస్ధల వారు కేంద్రాన్ని కోరారు. జనధన్‌ బ్యాంకు ఖాతాలున్న వారికి ఐదు వేల రూపాయల నగదును బదిలీ చేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. ఉద్యోగులు, కార్మికులు పనులకు వెళ్లలేని స్ధితిలో ఉంటే కనీసం 80శాతం వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

Image result for coronavirus Donald trump cartoons
వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలు సామాన్య జనాన్ని ఆదుకొనేవిగా ఉండాలి తప్ప కార్పొరేట్లకు దోచిపెట్టేవిగా మారకూడదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.ఈ సందర్భంగా ప్రభుత్వాలు తీసుకొనే చర్యలు విమర్శలకు అతీతంగా ఉంటాయని, కొన్ని కంపెనీల ప్రయోజనాలకు తోడ్పడకూడదని ఎవరైనా ఆశిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ ఆ విధంగానే కనిపిస్తున్నది. రాఫెల్‌ విమానాల విషయంలో ప్రభుత్వ రంగ సంస్ధను విస్మరించి అంబానీలకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా పరీక్షలకు ప్రభుత్వ సంస్ధ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవి) ఆమోదించిన అన్ని కిట్లను ఉపయోగించకుండా కేవలం అమెరికా, ఐరోపా యూనియన్‌ ఆమోదించిన వాటికే పరిమితం చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయటాన్ని ఏమనాలి. పోనీ అవసరాలకు తగ్గట్లుగా అవి సరఫరా అవుతున్నాయా అంటే, లేదు. అలాంటి వాటిని ఉత్పత్తి చేసే సంస్ధ గుజరాత్‌లో ఒక్కటి మాత్రమే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఒకటి రెండు కంపెనీలు కిట్లతో లాభాలు పిండుకోవటాన్ని వెంటనే నివారించటం అవసరం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జగన్‌ మోహనరెడ్డి ఎరక్కపోయి మరింతగా ఊబిలో ఇరుక్కుంటున్నారా ?

22 Sunday Mar 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

AP local body election 2020, AP SEC letter to MHA, CM YS Jagan

Image result for is ys jagan mohan reddy foolishly entered in a mire

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి యావత్‌ సమాజం ఆందోళన పడుతోంది. దానితో నిమిత్తం లేకుండా రాజకీయాలు చేయటంలో కొన్ని రాజకీయ పార్టీలు, నేతలు మునిగిపోయారు. మధ్యప్రదేశ్‌లో కమలం వైరస్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కబళించింది. అధికార దాహం వైరస్‌ సోకిన 22 మంది కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయిన తరువాత కమల తీర్ధం పుచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్దానిక సంస్దల ఎన్నికల వైరస్‌ సోకిన వారి వింత లేదా విపరీత ప్రవర్తన చూశాము. అదింకా కొనసాగుతూనే ఉంది. తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలినా ఎదురుదాడులు చేయటం కొనసాగుతూనే ఉంది. మంత్రులు వివాదాస్పదవ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామాలను చూస్తే అసలైన అధికారం ఎవరిదో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నపుడు ఎన్నికల కమిషనరే సుప్రీం అని చెప్పింది. అంటే మిగతా సమయాల్లోనే ముఖ్యమంత్రి సర్వాధికారి అన్నది దాని అర్ధం. సర్వాధికారి ఎవరు అన్న ప్రశ్నను స్వయంగా లేవనెత్తిన జగన్‌మోహన్‌రెడ్డికి ఆ విషయం అర్ధమైందని అనుకోవాలి. ఈ విషయంలో తనను తానే కించపరచుకున్నారు. ముఖ్యమంత్రి అనుగ్రహం పొందాలనుకొనే పెద్దలు ఇంకా ఆ ప్రయత్నాలను మానుకోలేదు. ప్రయోజనం సంగతి పక్కన పెడితే ఈ ఉదంతం తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆరోగ్య వైద్యశాఖ మంత్రి ఎవరో కనీసం రాష్ట్ర ప్రజలకు, బయటి వారికీ తెలిసింది.
తాజాగా శనివారం నాడు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మీడియాతో మాట్లాడిన విషయాలను చూస్తే సుప్రీం కోర్టు తీర్పు స్పూర్తిని గ్రహించినట్లు లేదు.రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై ధ్వజమెత్తారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్య మంత్రి తన అధికారాలేమిటో, ఎన్నికల కమిషనర్‌ అధికారం ఏమిటో తెలియదని స్వయంగా వెల్లడించుకున్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ ఇలా వ్యవహరించలేదు. అంతటితో ఆగకుండా సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. బహుశా ఏ ముఖ్య మంత్రికీ లేనంత మంది సలహాదారులు ఉన్నప్పటికీ ఇది జరిగిందంటే సలహాదారుల సరకేమిటో బయటపడిందా లేదా ఎవరి మాటా వినరు అనే గత విమర్శలను జగన్మోహనరెడ్డి నిర్ధారించారా ? ఇది ఒక విపరీతమైతే తనకు, తన కుటుంబానికీ భద్రత లేదంటూ ఒక రాష్ట్ర ఎన్నికల అధికారి కేంద్రానికి ఫిర్యాదు చేయటం, తాను పొరుగు రాష్ట్రం నుంచి పని చేసేందుకు అవసరమైన రక్షణ కల్పించాలని కోరటం కూడా ఒక విపరీత పరిణామం, దేశ చరిత్రలో తొలిసారి.
బుగ్గన రాజేంద్రనాధ్‌ గారు ఎన్నికల కమిషనర్‌ను అనేక ప్రశ్నలు అడిగారు. కమిషనర్‌కు అధికారాలతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయని విస్మరించకూడదు అన్నారు, సమంజసమే. కోవిడ్‌ నియంత్రణ చర్యలు, గురించి సిఎస్‌ను ఎందుకు సంప్రదించలేదు అని బల్ల చరిచి మరీ ప్రశ్నించారు. తీసుకున్న చర్యలు గురించి సిఎస్‌ లేదా ఆరోగ్యశాఖ అధికారులు ఒక కాపీ రూపంలో అయినా అధికారికంగా ఎన్నికల కమిషనర్‌కు పంపారా లేదా ఒక వేళ పంపితే ఇక సంప్రదించాల్సిన అవసరం ఏముందో మంత్రిగారు చెప్పాలి. అసలు సమీక్షలే చేయలేదన్న విమర్శలు, ఆరోపణలను తగిన ఆధారాలతో ఆయన ఖండించి ఉండాల్సింది.

Image result for is ys jagan mohan reddy foolishly entered in a mire
కోవిడ్‌ను నివారించే సందర్భంలో ఎన్నికల నియమావళి (కోడ్‌) వల్ల ప్రభుత్వ పరిపాలన, నిర్ణయాలకు ఇబ్బంది ఏర్పడదా? అని అమాయకంగా ప్రశ్నించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి జగన్‌ ప్రభుత్వానికి మాత్రమే వర్తించేదిగా ప్రత్యేకంగా ఏమైనా రూపొందించారా ? కాదని మంత్రికి తెలియదా? ఒక వేళ ఇబ్బంది అనుకుంటే కమిషనర్‌ను సంప్రదించే అవకాశాన్ని ఎందుకు వినియోగించకోలేదో చెప్పాలి. ఎన్నికల వాయిదా నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుందని తెలిసి రమేష్‌కుమార్‌ కేవియట్‌ను ఎందుకు వేయించారు? ఇదేమైనా వ్యక్తిగత తగాదానా? అని ప్రశ్నించిన మంత్రిగారికి రమేష్‌ కుమార్‌ వ్యక్తిగా కాదు, ఎన్నికల కమిషనర్‌గా వెళ్లారని తెలియదా ? జగన్‌మోహనరెడ్డి గారు అధికారాల గురించి ఒక వ్యక్తిగా ప్రశ్నించారా లేక ముఖ్య మంత్రిగా ప్రశ్నించారా, అదే విధంగా ఏ హౌదాతో సుప్రీం కోర్టు తలుపు తట్టారు అన్నది మంత్రిగారు చెప్పాలి మరి !
‘జ్వరం వస్తే పారాసెటిమాల్‌ కాక ఇంకేం వాడతారు? ఎవరైనా డాక్టర్లను అడగండి ఏం చెబుతారో! మీడియా పవర్‌ ఉందని చెప్పి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేస్తారా?’ అని ఎల్లో మీడియాపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు అని ఒక పత్రిక రాసింది.
కోవిడ్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీఎం అరగంటకు పైగా వివరిస్తే అదంతా వదిలి ఎల్లో మీడియా సీఎం పారాసెటిమాల్‌పై మాట్లాడిన మాటలను ప్రసారం చేసిందని మంత్రి ఆరోపించారు. కోవిద్‌ నియంత్రణ లేదా నివారణ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ద లేదా తీవ్రంగా ప్రభావితమైన చైనా చర్యలను ప్రమాణంగా తీసుకోవాలి, ముఖ్యమంత్రి వాటినే చెప్పాలి లేదా వాటిని చెప్పి అవి పనికిమాలిన విషయాలని కొట్టివేసి పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ గురించి చెప్పి ఉండాల్సింది. వాటితో వైరస్‌ నివారణ అంత సులభమైతే మంత్రిగారే చెప్పినట్లు అరగంటకు పైగా వివరించాల్సిన పనేముంది?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేంద్ర హౌంశాఖకు రాసినట్టు చెబుతున్న లేఖను ఎవరు స ష్టించినా, పంపినా క్రిమినల్‌ కేసులు ఎదుర్కోక తప్పదని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కేంద్ర హౌంశాఖ కార్యదర్శికి రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న లేఖ వెనుక పెద్ద కుట్ర ఉందని, దీనిపై క్షుణ్ణంగా విచారించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. దానిలో అనేక అంశాలను ఆరోపించారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. ఆ లేఖ రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి కాకుండా టీడీపీ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా చంద్రబాబుకు సన్నిహితులైన ఐదుగురు పాత్రికేయుల ద్వారా మిగతా మీడియాకు చేరినట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందింది.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ప్రభుత్వ వ్యతిరేక మీడియాకు, ప్రతిపక్షాల ఊహాగానాలకు ఎందుకు అవకాశం ఇచ్చారు? బయటకు వచ్చిన లేఖపై ఔననో కాదనో వివరణ ఇవ్వకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయారు? అనే అనుమానాలను నిగ్గు తేల్చాలి. సుప్రీంకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తరఫున ఎందుకు కేవియట్‌ వేశారు? టీడీపీ, ఆ పార్టీ అనుకూల పత్రికలు, చానళ్లు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను ఎందుకు నెత్తికి ఎత్తుకుంటున్నాయి?
ఈ ప్రశ్నలు వేసినవారు తరువాత ఏమైందో జనానికి చెప్పాలి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. లేఖను రమేష్‌ కుమార్‌గారే రాశారన్నది తేలిపోయింది, విజయసాయి రెడ్డిగారన్నట్లు ఆయన మీద క్రిమినల్‌ కేసు పెడతారా ?
అధికారపార్టీ నేతలు పోలీసుల దర్యాప్తును కోరబోయే ముందు తమ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నదో ఎందుకు తెలుసుకోలేదు ? లేఖ గురించి అధికారికంగానే కేంద్ర హౌంశాఖను సంప్రదించి నిర్ధారణ చేసుకొనేందుకు ఎందుకు ప్రయత్నించలేదు ? ఆ పని చేయకుండా ఎందుకు కాలక్షేపం చేశారు? పోనీ తరువాత ఆ లేఖ ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుంచే వచ్చిందని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. దాని మీద వైసిపి, రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించటమెందుకు ? ఆ లేఖలోని అంశాలేమిటో బహిర్గతం అయినందున రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఖండిస్తూ లేదా వివరణ ఇస్తూ రాసిన లేదా రాయనున్న లేఖను కూడా బహిర్గతం చేస్తే జనాలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్నికల కమిషనర్‌ కొందరు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. దానిని రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపుతుందా లేదా అన్నది కూడా నోరువిప్పి చెప్పాలి. ఎన్నికల కమిషనర్‌ ఎందుకు నోరు విప్పలేదు అని ప్రశ్నిస్తున్నారు. వైసిపి నేతల అక్రమాలు, దౌర్జన్యాలపై కూడా స్పందించటం లేదని విమర్శలు తలెత్తినపుడు కూడా స్పందించలేదు. అప్పుడు వైసిపి నేతలు చిద్విలాసాన్ని ప్రదర్శించారు. ఎన్నికల కమిషనర్‌ను నియమించింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కదా అని కూడా గుర్తు చేసిన వారు లేకపోలేదు.
ఇక ఎన్నికల కమిషనర్‌ లేఖ గురించి బిజెపి నేత జివిఎల్‌ నరసింహారావు చేసిన వాదనలు చిత్రంగా ఉన్నాయి. కేంద్ర హౌంశాఖకు రోజూ అనేక లేఖలు వస్తుంటాయి. వాటి గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే ఆ శాఖ స్పందిస్తుంది అన్నారు. అది కొంత మేరకు వాస్తవమే కావచ్చు. ఇక్కడ ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మీద ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి తీవ్ర విమర్శలు చేసిన పూర్వరంగంలో ఎన్నికల కమిషనర్‌ పేరుతో ఒక లేఖ మీడియా, సామాజిక మాధ్యమంలో సంచలనం సృష్టించింది. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం గవర్నర్‌ను కలిసి విచారణ జరపాలని కోరింది. ఇంత జరుగుతున్నా రాజకీయంగాక పోతే కేంద్ర హౌంశాఖ మౌనంగా ఉండటంలో అర్ధం ఏమిటి ? సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు వెంటనే అసాధారణ రీతిలో స్పందించిన వారు అదే విషయాన్ని బహిరంగంగా చెప్పలేరా ? అందినట్లు కిషన్‌ రెడ్డి వెల్లడించిన తరువాత లేఖలోని అంశాల గురించి రాష్ట్రాన్ని వివరణ అడుగుతుందా, తదుపరి చర్యలు ఏమిటి ? ఇవన్నీ ప్రస్తుతానికి ఎదురు చూస్తున్న ప్రశ్నలు.
ఎన్నికల కమిషనర్‌ లేఖ ఎలా బయటకు వచ్చింది అన్న ప్రశ్నకు పెద్దగా బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. గతంలో అనేక అంశాలు బయటకు వచ్చినట్లుగానే ఇదీ వచ్చింది. వైసిపి పెద్దలు పేర్కొనే ఎల్లో మీడియాలో అంతా చూసినట్లుగా, ఆధారాలతో రాసినట్లుగానే జగన్‌గారి సాక్షి పత్రిక, ఛానల్‌లోనూ అలాంటి వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. అందువలన ఈ ఉదంతంలో జర్నలిస్టుల మీద చర్యలు తీసుకోవాలని కోరటం గర్హనీయం. ఎవరి మీడియాలో పని చేసినా వారు నిమిత్త మాత్రులు. ముఖ్య మంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిర్వహించిన తొలి, వివాదాస్పద పత్రికా సమావేశంలో కొందరు జర్నలిస్టుల పట్ల అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరు అభ్యంతరకరం. ఎంత మంది వస్తారో అంచనా వేయలేని, తగిన ఏర్పాట్లు చేయలేని దుస్ధితిలో ఉన్నట్లు వెల్లడి అయింది. ఒక వేళ తగినంత స్ధలం లేకపోతే ముందు వచ్చిన వారిని కూర్చోనిచ్చి మిగతావారికి ఖాళీ లేకపోతే ఏమి చేయాలో వారికే వదలి వేయాలి తప్ప కొందరికి ప్రవేశం లేదని ప్రకటించటం తగనిపని, గర్హనీయం. కొందరు రావటం ఇష్టం లేకపోతే ఆహ్వానించిన వారు మాత్రమే రావాలని ప్రత్యేకంగా ఎంపిక చేసిన వారికే ఆహ్వానాలు పంపటం ఒక పద్దతి, వచ్చిన వారిని అవమానించటం ఏమిటి ?
ఎన్నికల కమిషనర్‌ లేఖపై తెలుగుదేశం పార్టీ రాజకీయం సంగతి ఏమిటి అన్నది చూద్దాం. ఆ పార్టీ గవర్నర్‌ను కలిసి చర్య తీసుకోవాలని కోరింది. ఆ లేఖను తాను రాసిందీ లేనిదీ కమిషనర్‌ నిర్ధారించకుండానే అది వాస్తవమే అన్నట్లుగా అది వ్యవహరించింది. లేఖలోని అంశాల ఆధారంగా ఆర్టికల్‌ 356ను ప్రయోగించి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్య తీసుకోవాలని ఆ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఇది అప్రజాస్వామికం. కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తినంత మాత్రాన ఆ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా రద్దు చేస్తారు ?

Image result for is ys jagan mohan reddy foolishly entered in a mire

స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలో అనుకున్నది ఒకటి అయింది ఒకటి కావటంతో వైసిపి నాయకత్వం తట్టుకోలేకపోయింది. ఆ ఉద్రేకం లేదా ఉక్రోషంలో ముఖ్యమంత్రి జగన్‌మోపాన్‌రెడ్డి వ్యవహరించిన తీరు అభ్యంతర కరం. తరువాత స్పీకర్‌తో సహా పార్టీ భజన దళం మరింతగా రెచ్చిపోయింది. వెంట వెంటనే వరుసగా జరిగిన పరిణామాలను మొత్తంగా చూస్తే పార్టీ శ్రేణులను ముఖ్యమంత్రి ఇబ్బందుల్లోకి నెట్టారు. రాజకీయ పర్యవసానాలను ఎరక్కపోయి తానే ఇరుక్కున్నారు. కరోనా వైరస్‌ అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది, అదే వైరస్‌ తాత్కాలికంగా అయినా రాజకీయంగా మరింత నష్టపోకుండా చూస్తోంది. గత తొమ్మిది నెలలుగా జరిగిన పరిణామాలు ఒక ఎత్తయితే, ఎన్నికల కమిషనర్‌ ప్రమేయం ఉన్న ఉదంతం ఒక ఎత్తు. ఇది వీరాభిమానులను అభిమానుల స్ధాయికి తగ్గించింది. పైకి చెప్పకపోయినా ప్రయివేటు సంభాషణల్లో నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు. ఇతరులు చెప్పిందాన్ని వినకపోగా తానుగా తెలుసుకోలేని స్ధితిలో తమ నేత ఉన్నట్లు భావిస్తున్నారు. అది వైసినేతగా ఉన్నపుడు జనానికి దానితో పని లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక కుదరదని చెప్పాల్సి వస్తోంది. ఇదే స్ధితి మరికొంత కాలం సాగితే…..అభిమానం కూడా వేసవి కాలంలో మంచులా కరిగిపోతుంది !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కరోనాను ఖాతరు చేయక ముప్పు తెచ్చిన అమెరికా,ఐరోపా పాలకులు !

21 Saturday Mar 2020

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Health, History, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

combat the coronavirus, COVID 19 China, COVID- 19 pandemic, COVID-19, COVID-19 in US, COVID-19 Robots

The Chinese navy’s Daishandao is the country’s only hospital ship, but that could be about to change. Photo: Reuters
ఎం కోటేశ్వరరావు
జనవరిలోనే వైరస్‌ తీవ్రత గురించి గూఢచార సంస్ధలు హెచ్చరించినా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పట్టించుకోలేదని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఒక సంచలన విషయాన్ని తాజాగా వెల్లడించింది. చైనా కటువుగా వ్యవహరించి ఫలితాలు సాధిస్తే, స్వేచ్చా సమాజాల పేరుతో వ్యవహరించిన తీరు కారణంగా ఐరోపా, అమెరికాల్లో దానికి మూల్యం చెల్లించాల్సి వస్తోందంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పత్రికలు వాపోతున్నాయి. ఇల్లినాయిస్‌ రాష్ట్రం కూడా జనాలు బయటకు రావద్దని ప్రకటించటంతో అమెరికాలో ఏడున్నర కోట్ల మంది జనాన్ని ఇండ్లకే పరిమితం చేసినట్లయింది. మరోవైపు తొలుత ఎక్కడైతే వైరస్‌ ప్రబలిందో చైనాలోని ఆ ఊహాన్‌ నగరం, పరిసరాల్లో సాధారణ పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఎవరు మహమ్మారిని నిర్లక్ష్యం చేశారు, ఎవరు బాధ్యతాయుతంగా వ్యవహరించారో ప్రపంచానికి వెల్లడైంది.
అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదయ్యాయి. కేవలం ఆరు రోజుల్లోనే న్యూయార్క్‌ నగరం కరోనా కేంద్ర స్ధానంగా మారిపోయింది. న్యూయూర్క్‌ రాష్ట్రంలో 8,377 కేసులు నిర్దారణ కాగా ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే ఆరు రోజుల వ్యవధిలో 183 నుంచి 5,151కి పెరిగాయి. ఇవి మొత్తం అమెరికాలో మూడో వంతు అని నగర మేయర్‌ పరిస్ధితి తీవ్రతను వివరించారు.రెండు మూడు వారాలకు సరిపడా మాత్రమే వైద్య సరఫరాలు ఉంటాయని కూడా చెప్పారు.
చైనాలో కొత్తగా కేసులేమీ నమోదు కావటం లేదన్న వార్తలను యావత్‌ ప్రపంచం హర్షిస్తోంది. మహమ్మారిని అదుపు చేయటం సాధ్యమే అని రుజువైంది. తాము ఒక మహమ్మారితో పోరాడుతున్నామని చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ తొలుత ప్రకటించారు, అదే విధంగా తొలిసారిగా ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ప్రకటించి సిపిఎం నాయకత్వంలోని కేరళ ప్రభుత్వం తన ప్రత్యేకతను వెల్లడించింది. కేరళలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైనపుడు చైనా కమ్యూనిస్టు దేశంలో ప్రారంభమైన వైరస్‌ కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది కనుక అక్కడకు వచ్చిందని ప్రచారం చేసిన ప్రబుద్దులు లేకపోలేదు. వైరస్‌ గురించి చైనా సర్కార్‌ దాచి పెట్టిందని జీవ ఆయుధాన్ని తయారు చేస్తూ తన గోతిలో తానే పడిందని దుమ్మెత్తి పోయటంతో పాటు జనాన్ని నిర్బంధించిందని ప్రచారం చేసిన వారికీ కొదవ లేదు. ఇప్పుడు అవే నోళ్లు చైనా, కేరళ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. అవి నోళ్లా మరొకటా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

H/O: China Robots coronavirus CloudMinds robot in Wuhan with patients at field hospital
చైనా నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో కరోనా వైరస్‌ అదుపు కూడా చేరింది. దాని గురించి కొన్ని అంశాలను చూద్దాం. మహమ్మారి దండయాత్ర ప్రారంభమైన ఉహాన్‌ నగరంలోని హాంగ్‌షాన్‌ క్రీడా కేంద్రాన్ని రోబోట్లతో నడిచే ఆసుపత్రిగా మార్చివేశారు. స్మార్ట్‌ ఫీల్డ్‌ హాస్పటల్‌గా పిలిచిన ఆ కేంద్రంలో ఇరవై వేల మందికి వ్యాధిగ్రస్తులకు చికిత్స ఏర్పాట్లు చేశారు. వైరస్‌ విస్తరణ తగ్గుముఖం పడుతున్న సమయంలో తీసుకున్న ఈ చర్య ఆరోగ్యకార్యకర్తల మీద వత్తిడిని తగ్గించేందుకు అన్నది స్పష్టం. జనవరిలో కరోనా వైరస్‌ డైమండ్‌ ప్రిన్సెస్‌ అనే నౌకలో వ్యాపించి 712 మందికి సోకి ఏడుగురి ప్రాణాలు తీసింది. ఓడలోని ప్రయాణీకులకు ఆహారం సరఫరా చేసే పళ్లాల(ట్రే) ద్వారా వ్యాప్తి చెంది ఉండవచ్చని ఒక జపాన్‌ నిపుణుడు వ్యాఖ్యానించిన తరువాత రోబోల ప్రయోగం గురించి ఆలోచన వచ్చింది. చైనా, స్పెయిన్లలో డ్రోన్లను జనాన్ని కట్టడి చేసే ప్రచారానికి, ఔషధాల సరఫరాకు వినియోగించారు. దక్షిణ కొరియాలో వైరస్‌ ప్రబలిన ప్రాంతాలలో రోగ క్రిమి నిర్మూలన మందులు చల్లేందుకు వినియోగించారు. ఈ నేపధ్యంలోనే చైనాలోని క్రీడా కేంద్రాన్ని ఆసుపత్రిగా మార్చి అక్కడ పెద్ద ఎత్తున రోబోలను వినియోగించారు. రోగులు ఆసుపత్రిలోకి ప్రవేశిస్తుండగానే రోబోలు, ఇంటర్నెట్‌తో అనుసంధానించిన ఇతర పరికరాలతో రోగులను స్కాన్‌ చేశారు. వారి స్ధితిని తెరల మీద నుంచి వైద్యులు పర్యవేక్షించారు. సిబ్బందికి సైతం కొన్ని పరికరాలను అందచేశారు. అంతేనా రోగులకు అవసరమైన ఆహారం, మంచినీరు, ఔషధాలకే కాదు, ఆసుపత్రిని శుభ్రం చేయటం, రోగులకు ఉల్లాసం కలిగించటం కోసం చివరికి రోబోలతో డ్యాన్సులు కూడా చేయించారు. ఇప్పుడు తీవ్రత తగ్గిపోయినా తిరిగి ప్రబలితే పని చేయించేందుకు వాటిని సిద్దంగా ఉంచినట్లు క్లౌడ్‌ మైండ్స్‌ అనే సంస్ధ తెలిపింది.

GP: Coronavirus China robot disinfectant
రోబోలతో ఆహారాన్ని అందించటం ఇప్పటికే అనేక చోట్ల పరిమితంగా జరుగుతోంది కనుక ఇదేమీ కొత్త కాదు. ఆసుపత్రులలో వినియోగించటమే విశేషం. వందల కిలోమీటర్ల దూరం నుంచి వాటిని విమానాల్లో తెప్పించి ఊహాన్‌ నగరంలోకి ప్రవేశించే అనేక చోట్ల వాటిని వినియోగించారు.వైరస్‌ నిరోధ అవసరాలకు అనుగుణ్యంగా రోబోలలో కొన్ని మార్పులు చేశారు.ఇవి తమకు ఎంతో సహాయకారిగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనేక దేశాల నుంచి వీటిని తెప్పించారు. చైనా అనుభవం చూసిన తరువాత కరోనా బారిన పడిన ఇటలీ, ఇతర అనేక దేశాలలో రోబోల వినియోగం పెరిగింది. తాము తయారు చేసిన రోబో ఒక్కొక్కటి విద్యుత్‌ చార్జి చేసిన తరువాత రెండున్నర గంటల పాటు పని చేస్తుందని తొమ్మిది- పది గదులలలో క్రిమి నిర్మూలన మందులను చల్లి శుభ్రం చేస్తుందని, పది నిమిషాల్లో బాక్టీరియా, కొన్ని రకాల వైరస్‌లను నిర్మూలిస్తుందని డెన్మార్క్‌ కంపెనీ ప్రతినిధి చెప్పారు. రోబోలను తయారు చేసే అమెరికా గ్జెనెక్స్‌ కంపెనీ ఉత్పత్తి గత ఏడాది మొత్తంగా చేసిన వాటి కంటే ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 400శాతం పెరిగిందని వెల్లడించారు.

Image result for Covid 19 pandemic, trump cartoons
వైరస్‌ తీవ్రత గురించి చెప్పినప్పటికీ ట్రంప్‌ కొట్టిపారవేశారని, తీవ్రంగా పరిగణించలేదని, అమెరికాలో వ్యాపించే అవకాశం లేదని భావించినట్లు , చైనా అధ్యక్షుడు చెప్పినదానిని నమ్మాల్సిన పనిలేదని అన్నట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొన్నది. తొలి వారంలోనే నివేదించినప్పటికీ జనవరి 18వ తేదీ వరకు ఆరోగ్య, మానవ వనరుల శాఖల అధికారులు ట్రంప్‌కు నచ్చ చెప్పేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు తెలిపింది. తరువాత ఉన్నతాధికారులను కలసి వారిని ఒప్పించిన తరువాత సమీక్షలు ప్రారంభమైనట్లు కూడా పేర్కొన్నది. చివరకు అమెరికాలో వ్యాపించినట్లు వెల్లడైన తరువాత కూడా దాన్నొక ముప్పుగా ట్రంప్‌ పరిగణించలేదని, వ్యాధి నిరోధక కేంద్రం అధికారిణి నాన్సీ ఫిబ్రవరి చివరిలో హెచ్చరికలను కూడా పట్టించుకోకపోగా ఆమె మదుపుదార్లను భయపెడుతున్నారని ట్రంప్‌ ఫిర్యాదు చేసినట్లు కూడా వాషింగ్టన్‌ పోస్టు వ్యాఖ్యానించింది.
ఉహాన్‌లో యుద్ద ఓడలకు రూపకల్పన చేసే ప్రభుత్వ ఓడల నిర్మాణ సంస్ధ అత్యవసర వైద్య సహాయ ఓడలకు రూపకల్పన పూర్తి చేసినట్లుగా తాజాగా వార్తలు వెలువడ్డాయి. ఇది కరోనా వైరస్‌లకే కాదు, ఇతర వైరస్‌ చికిత్సలకు సైతం అనువుగా ఉంటుందని పత్రికలు రాశాయి. ప్రస్తుతం చైనా మిలిటరీ ఆధ్వర్యంలో 14వేల టన్నుల బరువు గల ఒక ఆసుపత్రి ఓడ ఉంది. దానిని విదేశాలకు మానవతా పూర్వక సాయం చేసేందుకు శాంతి ఓడ పేరుతో నిర్వహిస్తున్నారు. దీనిలో 20 ఇంటెన్సివ్‌ కేర్‌, పది క్వారంటైన్‌ పడకలతో సహా మూడు వందల మందికి ఒకేసారి చికిత్సలు చేయవచ్చు.చైనా కొత్తగా రూపకల్పన చేసిన ఓడ నిర్మాణం పూర్తయిన తరువాత మహమ్మారులు తలెత్తినపుడు బాధితులను తరలించేందుకు, చికిత్సలకు, సముద్రాల్లో రోగుల నుంచి వ్యా ధులు విస్తరించకుండా క్వారంటైన్‌ చేసేందుకు, ఇతర సందర్భాలలో ఇతర అవసరాలకు కూడా వినియోగించవచ్చు. ఈ ఓడ నమూనాతో ప్రయాణీకుల ఓడలను కూడా నిర్మిస్తే వాణిజ్య పరంగా కూడా ఎంతో లాభసాటిగా ఉంటాయని భావిస్తున్నారు.
చైనా కంటే కరోనా వైరస్‌ ఐరోపాను గట్టిగా తాకింది. ఇది స్వేచ్చా సమాజాలు చెల్లిస్తున్న మూల్యమా అని ప్రశ్నిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక వ్యాఖ్యానం, విశ్లేషణను ప్రచురించింది. ఇది వంకర బుద్ది నుంచి వెలువడిన ఉత్పత్తి అన్నది స్పష్టం. స్వేచ్చా సమాజమా, మరొకటా అన్న విచక్షణ వైరస్‌లు, బాక్టీరియాలకు ఉండన్నది వేల సంవత్సరాల చరిత్ర. అంతెందుకు వర్తమానానికి వస్తే ఫ్లూ(జలుబు)కారణంగా ఏటా అమెరికాలో 27 నుంచి 77వేల మంది వరకు మరణిస్తున్నారని ఇది ఫ్లూ(ఇన్‌ఫ్లూయంజా) కంటే పెద్ద ప్రమాదకరమైనదేమీ కాదన్నట్లుగా మార్చి నాలుగవ తేదీ డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా సిడిసి సమాచారం ప్రకారం 2010 నుంచి ఏటా అమెరికాలో 93లక్షల నుంచి 4.9 కోట్ల మంది వరకు ఫ్లూబారిన పడుతున్నారు, 37వేల నుంచి 2017-18వరకు 61వేల మధ్య మరణించారు. స్వేచ్చా సమాజానికి ప్రతీకగా ఉన్న అమెరికాలో ఉన్న పరిస్ధితి ఇది. దీనికి న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఏమి చెబుతుంది ?

Image result for Covid 19 pandemic, trump cartoons
ఫిబ్రవరి 28వ తేదీన కరోనా గురించి ట్రంప్‌ పత్రికా గోష్టిలో మాట్లాడినదేమిటో చూద్దాం. ఒక అద్భుతం లేదా మాయ మాదిరి ఒక్క రోజులో కరోనా మాయం అవుతుంది. వేడి వాతావరణం వైరస్‌ను హరిస్తుంది, వ్యాప్తిని అరికడుతుంది అని చెప్పాడు.(బహుశా ఆ ప్రభావంతోనే బ్లీచింగ్‌ పౌడర్‌, పారాసిటమాల్‌తో కరోనాను అరికట్ట వచ్చని తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు చెప్పారా ?) అలాంటి పెద్ద మనిషి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోని కారణంగా నేడు అమెరికాలో కూడా పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నది. స్వేచ్చా సమాజం కారణంగానా పాలకుల బాధ్యతా రాహిత్యం వలన ఇది జరిగిందా ? విశ్లేషకులకు ఈ మాత్రం కూడా తెలియదని అనుకోవాలా ? చైనా సకాలంలో స్పందించలేదని విమర్శిస్తున్న వారు అమెరికా, ఐరోపా పాలకుల, ప్రభుత్వాల నిర్లక్ష్య స్పందనను ఏ విధంగా వర్ణిస్తారు?
ఐరోపా సౌహాద్రత అనేది పుస్తకాలకే పరిమితమైన దేవతా కథల వంటివి. మీరు తప్ప మాకు సాయం చేసే వారు లేరు, డబ్బు మాకు సమస్య కాదు, ఐరోపా యూనియన్‌ నుంచి అవసరమైన పరికరాలు తెచ్చుకోవటం అసాధ్యమని దాని ప్రకటన వెల్లడించింది. ఈ స్ధితిలో మీరు తప్ప మాకు వేరే స్నేహితులు లేరు, మీరే ఆదుకోవాలి, మాకు డబ్బు అవసరం లేదు, మీరు ఏది పంపగలిగితే దాన్ని పంపండి, మేమేమీ దాచుకోవటం లేదు, మమ్మల్ని మేము రక్షించుకోలేని స్ధితిలో ఉన్నాం, చైనా సోదరుల సాయం కోసం ఎదురు చూస్తున్నాం అని ఐరోపా దేశమైన సెర్బియా అధ్య క్షుడు యుసినిక్‌ చైనా రాయబారికి చేసిన వినతిని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. కరోనా సమస్య తలెత్తక ముందు చైనా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలని, ఐరోపా నుంచి పెంచుకోవాలని ఐరోపా ధనిక దేశాలు సెర్బియా మీద వత్తిడి తెచ్చాయి. ఇప్పుడు అవే దేశాలు కరోనా కారణంగా తాము వస్తు సరఫరా చేయలేమని చేతులెత్తాశాయి. పరస్పరం సాయం చేసుకోవాల్సిన తరుణంలో తోటి దేశం పట్ల స్వేచ్చా సమాజాల నిజస్వరూపమిది !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రూపాయి విలువ పతనం- మోడీ నాడేమి చెప్పారు నేడేమి చేస్తున్నారు !

16 Monday Mar 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

fall in the value of the rupee, India inflation, Indian Rupee, Narendra modi on Rupee fall

Image result for what narendra modi said then and is doing now on rupee fall cartoons

ఎం కోటేశ్వరరావు
రూపాయికి కరోనా వైరస్‌ సోకిందా ?  పతనాన్ని అరికట్టటంలో నరేంద్రమోడీ సర్కార్‌ ఘోరంగా విఫలమైందా ? మోడినోమిక్స్‌ గురించి గతంలో పొగిడిన వారు ఇప్పుడు నోరు మెదపరేం ? గతంలో రూపాయి పతనాన్ని ఎద్దేవా చేసిన వారు ఇప్పుడు ఏమంటారు ? ఇలా ఎన్నో ప్రశ్నలు కేంద్ర పాలకులను చుట్టుముడుతున్నాయి. ఒక్కరూ నోరు విప్పరేం. పోనీ రూపాయి, దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్ధ గురించి నోరు విప్పరు. కానీ సిఎఎ,ఎన్‌పిఆర్‌, ఎన్‌సిఆర్‌ వంటి అనేక వివాదాస్పద విషయాల మీద మడమ తిప్పేది లేదు, మాట మార్చేది లేదు అంటూ నోరు వేసుకొని పడిపోతున్నారే !
రూపాయిని కాపాడుకొనేందుకు రిజర్వుబ్యాంకు రంగంలోకి దిగింది. రానున్న రోజుల్లో రెండు బిలియన్‌ డాలర్లను విక్రయించనున్నట్లు గురువారం నాడు ప్రకటించింది. దాంతో రూపాయి శుక్రవారం నాడు కాస్త కోలుకుంది. సోమవారం నాడు మార్కెట్‌లు ప్రారంభం కాగానే మరోసారి పతనమైంది. రోగం ఒకటైతే మోడీ సర్కార్‌ మందు మరొకటి వేస్తోందా ?
చైనాలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతుండగా అనేక దేశాల్లో విస్తరిస్తోంది. ఇదే సమయంలో అనేక దేశాల్లో స్టాక్‌ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. గురువారం నాడు రికార్డు స్దాయిలో పతనమైన స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం నాడు కోలుకుంది.ఒక్క రోజులో కరోనా వైరస్‌ తగ్గిందీ లేదు, కొత్తగా పెరిగిందీ లేదు. సోమవారం నాడు తిరిగి భారీ స్ధాయిలో పతనమైంది. అసలేమి జరుగుతోంది ? ఏమి జరగబోతోంది ? ప్రభుత్వం చెప్పదు, చెప్పిన మేథావులకు దేశ వ్యతిరేకులనో, కమ్యూనిస్టులనో మరొకటో ముద్ర వేస్తున్నారు. కమ్యూనిస్టులు, వామపక్ష వాదులు కాని మేథావులకు మన దేశం గొడ్డుపోయిందా ? లేదే, మరి వారెందుకు చెప్పటం లేదు, చెప్పినా మీడియా జనం ముందుకు తేవటం లేదా ?
ఈ పూర్వరంగంలో మన రూపాయి రక్షణ గురించి చూద్దాం. రూపాయి పతనమైతే ఎగుమతిదారులు సంతోషపడతారు, దిగుమతిదారులు ఆగ్రహిస్తారు. రూపాయి విలువ పెరిగితే దిగుమతిదారులు సంతోషిస్తారు, ఎగుమతిదారులు కన్నెర్ర చేస్తారు. మధ్యలో జనం సంగతేమిటి ? 1961లో వంద రూపాయలకు వచ్చే వస్తువులను నేడు కొనాలంటే రూ.7,557 కావాలి మరి ! లేదూ దీన్నే మరొక విధంగా చెప్పాలంటే 59 సంవత్సరాల క్రితం వంద రూపాయలుంటే దాని నిజ విలువ ఇప్పుడు రూ.1.40కి దిగజారింది. ఈ లెక్క ఎలా వచ్చిందంటారా ఎలిమెంటరీ స్కూలు పిల్లలకు చెప్పినా లెక్కవేసి పెడతారు. ప్రతి ఏటా ప్రభుత్వం వినిమయదారుల ధరల సూచీని ప్రకటిస్తుంది.             అందువలన ఒక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. వర్తమాన సంవత్సర వినిమయదారుల సూచీని సదరు ప్రామాణి సంవత్సర సూచీతో భాగహారం చేయగా వచ్చే మొత్తాన్ని వందతో హెచ్చ వేయండి. మీకు ఫలితం వస్తుంది.1961 వినిమయదారుల ధరల సూచి 2.57, 2020 సూచీ 194.25. వీటితో పైన చెప్పిన పద్దతిలో భాగహారం చేస్తే 75.58 వస్తుంది. దీన్ని ద్రవ్యోల్బణ రేటు అంటారు. దీన్ని వందతో హెచ్చవేయాలి. ఇది ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉండదు. ఉదాహరణకు 1961 తరువాత గరిష్ట ద్రవ్యోల్బణం 1974లో 28.6, అంతకు ముందు సంవత్సరం రెండవ రికార్డు 16.94. (ఈ కారణంగానే ఆ రెండు సంవత్సరాలలో దేశంలో అనేక చోట్ల ధరల పెరుగుదల వ్యతిరేక ఆందోళనలు తలెత్తాయి) నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు 2013లో ద్రవ్యోల్బణం 10.91. తరువాత క్రమంగా 6.35 నుంచి 2017లో 2.49గా ఉంది. దీన్ని మోడీ సర్కార్‌, బిజెపి పెద్ద ఎత్తున తమ విజయంగా,మోడీ ప్రతిభగా ప్రచారం చేసుకున్నాయి. మరుసటి ఏడాది నుంచి క్రమంగా పెరుగుతూ 2019లో 7.66కు చేరింది, ఈ ఏడాది ఇంకా ఖరారు కాలేదు. దీన్ని ఎలా చెప్పాలి ? 2019లో రూ.7,019కి వచ్చిన సరకుల ధర 2020లో రూ.7,557 అవుతుంది. ఇటీవలి కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే ద్రవ్యోల్బణం తిరోగమనంలో పయనించింది. 1976లో అది గరిష్టంగా మైనస్‌ 7.63, అందువలన 1975లో రూ.312 రూపాయలకు వచ్చిన సరకులు 1976లో రూ.288కే వచ్చాయి.

Image result for what narendra modi said then and is doing now on rupee fall cartoons
రూపాయి విలువ గురించి బిజెపి, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ పెద్ద రాజకీయం చేశారు. ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కేవలం యుపిఏ పాలకుల అవినీతి వల్లనే. అది పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి, దిగుమతులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోంది ‘ అని ముఖ్య మంత్రిగా నరేంద్రమోడీ ఈ మాటలు అన్నారు. అదేమి చిత్రమో, గానీ యుపిఏ నాటి కంటే నేడు మరింత దిగజారినా ప్రధానిగా మోడీ నోటి వెంట ఒక్క మాటా రాదు. ఆ పెద్దమనిషి భక్తులకూ నోట మాట పడిపోయింది. గోమాత శాపమా ?
ఎక్సేంజ్‌ రేట్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ రూపి అని గూగుల్‌ తల్లిని వేడుకుంటే కరుణించి అందచేసే సమచారంలో వికీపీడియాను చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. కళ్లుండీ చూడలేని నమో భక్తుల గురించి జాలిపడదాం. అడ్డంగా వాదిస్తే వాస్తవాలతో పని పడదాం. గత పది సంవత్సరాలలో డాలర్‌తో రూపాయి విలువ వార్షిక సగటు విలువ ఎలా ఉందో దిగువ చూడండి.
ఏడాది రూపాయి విలువ
2004-05    44.93
2005-06    44.27
2006-07    45.28
2007-08    40.24
2008-09    45.91
2009-10    47.41
2010-11    45.57
2011-12    47.92
2012-13    53.21
2013-14    60.50
2014-15    61.14
2015-16    65.46
2016-17    67.07
2017-18    64.45
2018-19    69.92
2019-20 సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు సగటున రూపాయి విలువ 70.40. ఈ ఏడాది గత కొద్ది రోజులుగా పడిపోతూ 2018 అక్టోబరు రెండు నాటి రికార్డు పతనం 74.48కి దగ్గరగా 74.44 వరకు దిగజారింది. ఈ పతనానికి కారణాలేమీ చెప్పలేదు గనుక దీనికి కూడా మోడీ సర్కార్‌ అవినీతే కారణం అనుకోవాలి మరి. ఈ రికార్డు పతనంతో నిమిత్తం లేకుండానే పారిశ్రామిక ప్రగతి, ఎగుమతులు దిగజారాయి. ఇంతగా దిగజారింది కనుకనే రిజర్వుబ్యాంకు డాలర్లను విక్రయించేందుకు పూనుకుంది.
రూపాయి పతనమైతే మన సరకుల ధరలు విదేశాల్లో తగ్గి ఎగుమతులు పెరుగుతాయి కదా ! అలాంటపుడు దాన్ని నివారించేందుకు రిజర్వు బ్యాంకు ఎందుకు పూనుకున్నట్లు ? అసలు విషయం ఏమంటే మన సరకులకు విదేశాల్లో డిమాండ్‌ లేదు. పోనీ నరేంద్రమోడీ విమానాల్లో తిరిగి వెళ్లిన ప్రతి చోటా, మన దేశానికి వచ్చిన ప్రతి విదేశీ నేతను కౌగలింతలతో ముంచెత్తినా వారి నుంచి తాను ప్రశంసలు, పొగడ్తలు పొందటం తప్ప ఎగుమతి మార్కెట్‌ అవకాశాలను కల్పించలేకపోయారు. మన కరెన్సీ పతనాన్ని ఇంకా కొనసాగనిస్తే మనం దిగుమతి చేసుకొనే చమురు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి. అది జనం మీద, ఆర్దిక వ్యవస్ధ మీద మరింత భారం మోపుతుంది. ఇప్పటికే రాష్ట్రాలను ఒక్కొక్కటిగా కోల్పోతున్న స్ధితిలో త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలను కాపాడుకొనేందుకు బిజెపి పాట్లు పడుతోంది.
మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీ మన దేశంలో సరకులను తయారు చేసి చౌకగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు రూపాయి విలువను కావాలనే పతనం గావిస్తున్నారా ? ఎగుమతి ఆధారిత విధానాలను అనుసరించే దేశాలన్నీ తమ కరెన్సీ విలువలను తగ్గించిన చరిత్ర వుంది. 1990 దశకంలో మన దేశం చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొన్న కారణంగా మన ఎగుమతులను పెంచాలనే ఒక దివాళాకోరు ఆలోచనతో నాటి సర్కార్‌ ప్రపంచ బ్యాంకులో పని చేసిన మన్మోహన్‌ సింగ్‌ను ఆర్ధిక మంత్రిగా తీసుకొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ఈ పెద్ద మనిషి ఒక్కసారిగా నాలుగు రోజుల్లో రూపాయి విలువను తొమ్మిదిశాతం వరకు తగ్గించారు. అంతకు ముందు దేశ చరిత్రలో అలాంటి వుదంతం జరగలేదు.
మన దేశాన్ని కేవలం ముడి సరకులు ఎగుమతి దేశంగా వుంచాలని, పారిశ్రామికంగా అభివృద్ది కాకుండా వుంచేందుకు నాటి బ్రిటీష్‌ పాలకులు రూపాయి విలువను ఎక్కువగా వుంచారన్న అభిప్రాయం వుంది. యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బిజెపి రూపాయి విలువ పతనాన్ని దేశానికి అవమానంగా చిత్రించింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అదే పార్టీ ఇప్పుడు రూపాయి పతనమౌతోంటే గుడ్లప్పగించి చూస్తోంది. నోట మాట రావటం లేదు.
నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించేందుకు మేకిన్‌ ఇండియా నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ కాలం గడుపుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వచ్చి ఇక్కడ మన కార్మికుల చేత వస్తువులను తయారు చేయించుకొని ఎగుమతి చేసుకోవాలన్నది ఈ నినాదం వెనుక వున్న లక్ష్యం. ఇన్నేళ్లుగా మనం ఎందుకు విఫలమయ్యాము. ధనిక దేశాలన్నీ ఆర్ధిక మాంద్యంతో వుండగా ఇప్పుడున్న పరిశ్రమల వుత్పత్తులకే దిక్కు లేకపోతే కొత్తగా ఎవరు ప్రారంభిస్తారు అన్నది ప్రశ్న. అందువలన మన ఆర్ధిక విధానాన్ని మన అవసరాలకు తగినట్లు సమూలంగా మార్చుకొని అంతర్గతంగా వస్తువినియోగానికి డిమాండ్‌ పెంచుకుంటేనే ఏ రంగమైనా అభివృద్ది చెందుతుంది. మన యువతకు వుపాధి దొరుకుతుంది.
విదేశాలకు తక్కువ ధరలకు ఎగుమతులు చేయటానికి మన వనరులన్నీంటినీ వుపయోగిస్తే మన వస్తువులు కొన్న వాడికి తప్ప మనకు లాభం ఏమిటి? ఏ కారణం చేత అయినా కొనే వారు ఎత్తుబడితే మన వస్తువులను ఎవరికి అమ్ముకోవాలి? ఇప్పుడు అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో వస్తువులు కొనే వారు లేకనే మన వస్తువులు ఎగుమతి కావటం లేదని అందరూ చెబుతున్నదే. అలాంటపుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టి మన నరేంద్రమోడీ గారికి మేకిన్‌ ఇండియా పేరు తెచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నదే సమస్య?
నరేంద్రమోడీ గారి మేకినిండియా పిలుపును జయప్రదం చేయటం కోసం రూపాయి విలువను మరింత పతనం గావిస్తే మనం దిగుమతి చేసుకొనే ఎరువులు, పురుగు మందులు, పెట్రోలియం వుత్పత్తుల వంటి వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. గుజరాత్‌ నమూనా అంటే ఇదేనా ?
వక్రీకరణలతో జనాన్ని మోసం చేయలేరు, భక్తులు మోడీని అసలు గట్టెక్కించలేరు. రూపాయి పతనాలు గతంలో జరగలేదని ఎవరూ చెప్పటం లేదు. దాన్నొక సమస్యగా చేసింది నరేంద్రమోడీ ‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ అన్న మోడీని మీ ఏలుబడిలో సంగతేమిటని అడిగే హక్కు అందరికీ వుంది. ఆయన భక్తులు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసే కిరాయి జనం వున్నారు. యుపిఏ పాలనలో 2013 ఆగస్టు 2న రూపాయి 68.85కు పడిపోయి అప్పటికి కొత్త రికార్డు సృష్టించింది. ఆ తరువాత మోడీ అధికారానికి వచ్చే నాటికి 2014 మే 26నాటికి రు.58.42కు పెరిగింది. అప్పటి నుంచి తాజాగా 74.34కు పతనం అయింది.

Image

అప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.’పూర్తిగా ఆర్ధిక వ్యవస్ధ దుర్నిర్వహణ’ కారణంగా రూపాయి పతనం అవుతున్నదన్నారు. ‘ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) మరియు విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ)తో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించే యుపిఏ విధాన కారణంగానే ఇలా జరుగుతున్నదని చెప్పారు.అమెరికా ఫెడరల్‌ రిజర్వు వుద్దీపన పధకాన్ని వుపసంహరించిన కారణంగా మన దేశం నుంచి డబ్బు తరలి పోయినందున రూపాయి విలువ పడిపోయిందని ” లాయర్‌గారు వాదించారు. ‘యుపిఏ ఏర్పడినపుడు డాలరకు రూపాయి విలువ రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా వుంది. ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గర అవుతున్నది.అది మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గర అవుతుందేమోనని భయంగా వుంది ‘ అని కూడా రవిశంకర ప్రసాద్‌ చమత్కరించారు. అదేమో గానీ నరేంద్రమోడీ వయస్సును మించి పోయింది. దాన్నయినా అదుపు చేయాలి, మోడీ గారిని అయినా అదుపులో పెట్టాలి, లేకపోతే మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గరగా రూపాయిని తీసుకుపోయే అవకాశం కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పేనుకు పెత్తనం – నరేంద్రమోడీకి అధికారం !

14 Saturday Mar 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Excise Duty & VAT on Oil, Narendra Modi 2.0, Price Build-up of Petrol

Image result for narendra modi authoritarian

ఎం కోటేశ్వరరావు
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రోజు వారీ ఎంత పెరిగితే అంత వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము, సబ్సిడీలేమీ ఉండవు, ఇదీ నరేంద్రమోడీ సర్కార్‌ జనానికి చెప్పింది. సౌదీ అరేబియా-రష్యా మధ్య ప్రారంభమైన చమురు యుద్ధం కారణంగా ఒక్కసారిగా చమురు ధరలు 30శాతం వరకు పతనమయ్యాయి. ఒక్క మంత్రి లేదా సామాజిక మాధ్యమంలో ఒక్క బిజెపి కార్యకర్తగానీ ఈ మేరకు వినియోగదారులకు ధరలు తగ్గుతాయి అని చెప్పటం లేదు. గతంలో చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్దం ప్రారంభం కాగానే దాన్ని మనకు అనుకూలంగా మలచుకుంటామని కబుర్లు చెప్పారు. అదేమిటో ఎక్కడా చెప్పరు. కానీ జరుగుతున్నదేమిటి ? ధరలను మరింతగా పెంచారు. దానిలోకి వెళ్లే ముందు అసలేం జరుగుతోందో చూద్దాం.
2013 సెప్టెంబరు 16న మనం దిగుమతి చేసుకొనే రకం చమురు ధరలు, పన్నుల వివరాలు ఇలా ఉన్నాయి
పీపా ధర రూ. 117.58 డాలర్లు.
డాలరుకు రూపాయి విలువ 66.02.
చమురు శుద్ధి కర్మాగారాలకు ఒక లీటరు పెట్రోలుకు చెల్లించిన ధర రూ.50.02
డీలర్లకు విక్రయించిన ధర              రూ.52.15
ఎక్సైజ్‌ డ్యూటీ, దాని మీద విద్య సెస్‌ రూ   .9.48
డీలర్‌ కమిషన్‌                             రూ. 1.79
ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌ 20శాతం            రూ.12.68
వినియోగదారుని వద్ద వసూలు చేసినది రూ. 76.10
2020 మార్చి 14న వివరాలు
డీలర్లకు విక్రయించిన ధర              రూ.28.50
ఎక్సైజ్‌ డ్యూటీ, దాని మీద విద్య సెస్‌ రూ.22.98
డీలర్‌ కమిషన్‌                              రూ. 3.54
ఢిల్లీ ప్రభుత్వ వ్యాట్‌ 20శాతం           రూ.14.85
వినియోగదారుని వద్ద వసూలు చేసినది రూ.69.87
నరేంద్రమోడీ సర్కార్‌ నిర్వాకం కారణంగా రూపాయి విలువ ఎలా పతనమైందో దిగువ వివరాలు ఉన్నాయి.ఇప్పుడు 74 రూపాయలకు పతనమైంది. అదే పతనం కానట్లయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా పడిపోయిన కారణంగా డీలర్లకు విక్రయించే ధర ఇంకా తగ్గి ఉండేది. వినియోగదారులకు ఇంకా చవకగా అంది వుండేది. గత ఆరు సంవత్సరాలలో మోడీ సర్కార్‌ పన్ను మొత్తాన్ని రూ.9.48 నుంచి రూ.22.98కి పెంచింది. అదే లేనట్లయితే డీలరు కమిషన్‌ పెంచినా పెట్రోలు రూ.56.37కు వచ్చి ఉండేది.
చమురు ధరలను గణనీయంగా తగ్గించాల్సిన పెద్ద మనిషి శనివారం నాడు పెట్రోలు మీద రూ.19.98గా ఉన్న ఎక్సయిజ్‌ పన్నును రూ.22.98కి పెంచారు. ఈ పెంపుదల దూరదృష్టితో చేసినదని, ప్రస్తుతం క్లిష్టంగా ఉన్న ద్రవ్య స్ధితిలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు వనరులు అవసరమని ఒక అధికారి సన్నాయి నొక్కులు నొక్కారు. గడచిన నాలుగు మాసాల్లో చమురు ధరలు తగ్గిన మేరకు లబ్దిని వినియోగదారులకే గణనీయంగా పోయిందని సమర్ధించుకున్నారు. అంటే తగ్గిన మొత్తాన్ని వినియోగదారులకు బదలాయించకూడదన్నది మోడీ సర్కార్‌ విధానం అన్నది స్పష్టమైంది.పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికేసిందన్నది సామెత. మంచి రోజులను తెస్తానని చెప్పిన నరేంద్రమోడీకి అధికారమిస్తే చేసినదాన్ని ఏమనాలి?
మనకు చమురు నిక్షేపాలు తగినన్ని లేని కారణంగా అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. అందువలన ఆ రంగంలో పర్యవసానాలు మన నిత్యజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించిన తరువాత 2014 మే 29 జూన్‌ 11వ తేదీతో ముగిసిన పక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా(బారెల్‌) ధర 106.72 డాలర్లు వుంది. ఆ రోజుల్లో డాలరు సగటు రూపాయి విలువ రు. 59.17 ఆ లెక్కన మనం రు 6314 లకు ఒక పీపాను కొనుగోలు చేశాము. 2016 డిసెంబరు 14-28 మధ్య ఒక పీపాను 53.05 డాలర్లకు , డాలరుకు రు.67.86 చొప్పున రు.3600కు, 2020 మార్చి 13వ తేదీన పీపా ముడి చమురు ధర రూ.2,342 గా ఉంది. ఇదే రోజు రూపాయి విలువ 73.74గా ఉంది.నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చినపుడు ఆయన సమర్ధత కారణంగా ప్రపంచ ఆర్ధికవేత్తలు వూహించినట్లు 45-40 రూపాయలకు మన కరెన్సీ విలువ పెరిగి వుంటే చాలా చవకగా పెట్రోలు, డీజిలు అందుబాటులోకి వచ్చి ఉండేది. ఒక పీపాలో ముడి చమురు 159 లీటర్లు ఉంటుంది. దాన్నుంచి 73 లీటర్ల పెట్రోలు, 36 లీటర్ల డీజిల్‌,20 లీటర్ల కిరోసిన్‌ లేదా విమాన ఇంథనం, ఆరు లీటర్ల ప్రొపేన్‌, 24 లీటర్ల ఇతర ఉత్పత్తులు వస్తాయి. ఇవి రావటానికి ముడి చమురుకు ఇతర ఉత్పత్తులను జత చేయాల్సి ఉంటుంది. ఒక పీపా నుంచి ఒక వంద లీటర్లు పెట్రోలు, డీజిల్‌ అనుకుంటే ఇతర ఉత్పత్తుల మీద వచ్చే ఆదాయం శుద్ధి చేసిన ఖర్చుకు పోతుంది అనుకుంటే మోడీ గారి పన్ను బాదుడు లేనట్లయితే చాలా తక్కువకు జనం పొంది ఉండేవారు. అది మిగతా వస్తువుల ధరలను కూడా తగ్గించేందుకు దోహదం చేసి ఉండేది.
మోడీ సర్కార్‌ ఇతర అన్ని రంగాలలో విఫలమైందని అనేక అంశాలు నిరూపించాయి. మన ఎగుమతులతో జనానికి కలిగిన లబ్ది ఏమిటో తెలియదు గానీ దిగుమతుల్లో సింహభాగమైన ముడిచమురును ఒక ఆదాయవనరుగా మార్చుకొని వినియోగదారులను ఎలా లూటీ చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ లూటీ అనే పెద్దమాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే మోపిన పన్ను భారాన్ని జన సంక్షేమానికి ఖర్చు చేయలేదన్న కారణంగానే.
పెట్రోలియం ఉత్పత్తుల మీద కేంద్ర ప్రభుత్వానికి పదకొండు రకాల ఖాతాల నుంచి గణనీయ మొత్తంలో ఆదాయం వస్తోంది.2014-15లో అంటే మోడీ సర్కార్‌ తొలి ఏడాదిలో వచ్చిన ఆదాయ మొత్తం రూ.1,72,065 కోట్లు, అది 2018-19 నాటికి రూ. 3,48,041 కోట్లకు పెరిగింది, రెట్టింపైంది. ఇదే కాలంలో ఈ మొత్తంలో ఎక్సైజ్‌ పన్ను రూ.99,068 కోట్ల నుంచి రూ 2,14, 369 కోట్లకు పెరిగింది( ఒక ఏడాది రూ 2,42,691 కోట్లు వచ్చింది), అంటే దీని పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది.Image result for narendra modi authoritarian
బిజెపి మరుగుజ్జులు ఈ లూటీని తక్కువ చేసి చూపేందుకు చమురు ధరల పెరుగుదలకు రాష్ట్రాలు విధించే వ్యాట్‌ (పన్ను) కారణమని తప్పుడు ప్రచారం చేస్తారు. రాష్ట్రాలు కూడా పన్ను వేస్తున్నాయి, పెట్రోలియం ఉత్పత్తులను కూడా జిఎస్‌టిలోకి తెచ్చి తమ ఆదాయాన్ని పూడ్చాలని రాష్ట్రాలు చేస్తున్న వినతిని కేంద్రం పట్టించుకోవటం లేదు. దీని వెనుక రెండు కారణాలు ఒకటి జిఎస్‌టి పద్దతిని అమలు జరిపితే రాష్ట్రాలకు పంచకుండా దొడ్డిదారిన పన్నులు వేసి తన బొక్కసానికి చేర్చుతున్న మొత్తాన్ని కేంద్రం కోల్పోవాల్సి ఉంటుంది. రెండవది రాష్ట్రాలకు తగ్గిన మేరకు ఆదాయాన్ని పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న సంవత్సరాలలో అన్ని రాష్ట్రాలు వ్యాట్‌తో సహా ఆరు రకాల ఖాతాల ద్వారా పొందిన ఆదాయం రూ.1,60,554 నుంచి రూ.2,27,591 కోట్లు ఉంది, దీనిలో వ్యాట్‌ పెరుగుదల రూ.1,37,157 నుంచి రూ.2,01,265 కోట్లు మాత్రమే. కేంద్రం మోపిన భారం ఎక్కువన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సౌదీ-రష్యా మధ్యలో అమెరికా, చమురు యుద్ద కారణాలు, పర్యవసానాలు !

12 Thursday Mar 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

OPEC, OPEC oil war, RUSSIA, Russia- Saudi oil war, Saudi oil war

Image result for behind the oil price war and its implications

ఎం కోటేశ్వరరావు
బస్తీమే సవాల్‌ అంటూ చమురు యుద్ధానికి సౌదీ అరేబియా తెరలేపింది. ఇప్పటికే మేము గోచీతో ఉన్నాం, దాన్ని కూడా లేకుండా చేస్తారా ? చేయండి చూస్తాం అన్నట్లుగా యుద్దానికి సిద్దమే అని రష్యా పేర్కొంది. పోరు శంఖారావం దెబ్బకు 30శాతం వరకు చమురు ధరలు పడిపోయాయి. ఇది ఆరంభమే, ఎవరికి వారు తమ వైఖరులకు కట్టుబడి ఉంటే రానున్న రోజుల్లో ఇంకా పతనమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తరువాత మూడు రోజుల్లో చూస్తే స్వల్ప మార్పులు తప్ప చమురు మార్కెట్‌లో పెను మార్పులు లేవు. యుద్ధం అంటే అంత తేలిక కాదు కనుక ప్రారంభం చేసిన అన్ని యుద్ధాలు కొనసాగలేదు, కనుక ఎప్పుడు ఏమి జరిగేదీ చెప్పలేము, ఏ యుద్దమైనా అది వాంఛనీయం కాదు, నష్టదాయకం కనుక రాకూడదనే కోరుకుందాం. అయితే దానికి దారి తీసిన పరిస్ధితులు పర్యవసానాలను తప్పక చర్చించాల్సిందే.
అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన మేరకు నరేంద్రమోడీ సర్కార్‌ జనానికి చమురు ధరలు తగ్గిస్తుందా? లేక వినియోగదారుల జేబులు కొల్లగొట్టి వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు రాయితీల రూపంలో దోచి పెడుతుందా ? అసలు సౌదీ-రష్యా ఇప్పుడు చమురు ధరల యుద్దానికి దిగాల్సిన అవసరం ఏమిటి? ఎంత కాలం సాగుతుంది? ఎంత మేరకు ధరలు పతనం అవుతాయి ? పర్యవసానాలు ఏమిటి ? ఇలా ఎన్నో అంశాలు జనం నోళ్లలో నానుతున్నాయి.
సోమవారం చమురు ధరలు, స్టాక్‌ మార్కెట్‌ పతనం, మంగళవారం నాడు మన దేశంలో స్టాక్‌ మార్కెట్లకు సెలవు, బుధవారం నాడు నష్టాల పాలు కాలేదు గానీ లాభాలు కూడా రాలేదు. గురువారం నాడు ఐదు రకాల చమురుల్లో పీపా ధర నాలుగు 25 సెంట్ల నుంచి 182 సెంట్ల వరకు పతనం కాగా మరో నాలుగు రకాల ధరలు 85 నుంచి 297 సెంట్ల వరకు పెరిగాయి, అయినప్పటికీ సోమవారం నాటి కంటే దారుణంగా స్టాక్‌మార్కెట్లు పతనమయ్యాయి. సోమవారపు పతనానికి కరోనా వైరస్‌ వ్యాప్తి, చమురు ధరల యుద్దం అని చెప్పారు. కరోనా వైరస్‌ చైనాలో తగ్గుముఖం పట్టింది, ఇతర దేశాల్లో కేసుల సంఖ్య పెరిగింది, కరోనాను ప్రపంచ మహమ్మారిగా గత కొద్ది రోజులుగా పరిగణిస్తున్నారు, బుధవారం నాడు ప్రపంచ ఆరోగ్య సంస్ధ దానిని అధికారికంగా ప్రకటించటం తప్ప గత మూడు రోజుల్లో పెను మార్పులేమీ లేవు, అయినా స్టాక్‌ మార్కెట్‌ పతనం చాలా తీవ్రంగా ఉండటం విశేషం. బుధవారం నాడు చైనాలోని వైరస్‌ పీడిత ప్రాంతం హుబెరులో పది మంది మరణిస్తే వారిలో ఏడుగురు ఒక్క ఉహాన్‌ నగరానికి చెందిన వారే ఉన్నారు. గత వారం రోజులుగా హుబెరు రాష్ట్రంలోని ఉహాన్‌ మినహా 16నగరాలలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Image result for russia, sowdy oil  war cartoons
చమురు ధరల యుద్దం గురించి చూద్దాం. దీనికి సవాలక్ష కారణాలలో కరోనా వైరస్‌ ఒకటి మాత్రమే. ఒక వేళ ఆ సమస్య లేకపోయినా మరి కొద్ది వారాలు లేదా నెలల్లో చమురు యుద్దం తలెత్తి ఉండేది, కరోనా కాస్త ముందుకు జరిపింది. మన దేశంలో తన బడ్జెట్‌ లోటును పూడ్చుకొనేందుకు రిజర్వుబ్యాంకు దగ్గర డబ్బును లాక్కున్న మోడీ సర్కార్‌ ఎల్‌ఐసితో అనేక ప్రభుత్వరంగ సంస్దలను తెగనమ్మి ఇంకా మిగిలిన లోటును పూడ్చుకొనేందుకు చూస్తున్నది. నరేంద్రమోడీ జిగినీ దోస్తు (కాకపోతే అన్ని సార్లు ఒకరినొకరు ఎలా కౌగిలించుకుంటారు !) డోనాల్డ్‌ ట్రంప్‌ తన స్నేహితుడిని అనుసరిస్తున్నాడు. తాగుబోతులు అన్ని వనరులు అయిపోయిన తరువాత పెళ్లాం పుస్తెలు గుంజుకున్నట్లుగా అత్యవసరాల కోసం నిల్వచేసిన చమురులో కోటీ ఇరవైలక్షల పీపాల చమురును తెగనమ్మి 45బిలియన్‌ డాలర్లు సమకూర్చుకోవాలని ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. అయితే చమురు ధరలు ఢమాల్‌ అనటంతో పరిస్ధితి మెరుగుపడేంత వరకు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. రష్యా కరన్సీ రూబుల్‌ విలువ మరింత పతనమైంది. మొదటి పర్యవసానం ట్రంప్‌, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మీద వత్తిడిని పెంచితే, రెండవ చర్య వలన ప్రపంచ మార్కెట్‌లో రష్యా నుంచి కొనుగోలు చేసే సరకులు తక్కువ మొత్తాలకు దొరుకుతాయి. తద్వారా రష్యాకు మేలు జరుగుతుంది. ఆంబోతుల కుమ్ములాట లేగదూడలకు ముప్పు తెస్తుంది అంటారు, కానీ ఇక్కడ చమురు ఆంబోతుల పోరు మనవంటి దేశాలకు మేలు చేస్తుంది. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు (తగ్గిన మేరకు లబ్దిని వినియోగదారులకు బదలాయించాలి) నరేంద్రమోడీ సర్కార్‌ వ్యవహరిస్తే జనానికి ఆయాసం తప్ప ఒరిగేదేమీ ఉండదు.
చమురు ఉత్పత్తి చేసే దేశాల సంస్ధతో సహకరించేందుకు తాము సిద్దమే, ఉత్పత్తిని తగ్గించటానికి, పెంచటానికి, ఒప్పందం కుదుర్చుకోవటానికి ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి అంటూనే ఏప్రిల్‌ ఒకటి తరువాత స్వల్ప కాలంలో రోజుకు రెండు, మూడులక్షలు అవసరమైతే ఐదులక్షల పీపాల వరకు చమురు ఉత్పత్తిని పెంచుతామని రష్యా ప్రకటించింది. అవసరమైతే వివాద పరిష్కారానికి తాము మధ్యవర్తిత్వం వహిస్తామని మెక్సికో ప్రకటించింది. గతంలో చమురు ధరలు పడిపోయిన సమయంలో పెంచేందుకు సహకరించుకోవాలని ఒపెక్‌-రష్యా 2016లో ఒక అవగాహనకు వచ్చాయి. ఇటీవలి కాలంలో చమురు ధరలు కొంత మేరకు తగ్గాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్వరంగంలో వినియోగం తగ్గుతుందనే అంచనాతో రోజుకు పదిహేను లక్షల పీపాల చమురు ఉత్పత్తిని తగ్గించుదామని సౌదీ అరేబియా ఒక ప్రతిపాదన చేసింది. దానికి రష్యా అంగీకరించలేదు. దాంతో సౌదీ ప్రభుత్వ రంగ చమురు సంస్ద ఆరామ్‌కో రష్యా చమురు మార్కెట్‌ను దెబ్బతీసే విధంగా ఏప్రిల్‌లో సరఫరా చేసే చమురు ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మే లేదా జూన్‌ నెలలో మరోసారి ఒపెక్‌-ఇతర దేశాల సమావేశాలు జరగాల్సి ఉంది. ఫిబ్రవరి నెలలో రష్యా రోజుకు 11.289 మిలియన్‌ పీపాల చమురును వెలికి తీసింది. తాజాగా ప్రకటించినట్లు మరో ఐదు లక్షల పీపాలు అదనంగా తీస్తే అది కొత్త రికార్డుగా నమోదు కానుంది. ధరల పెంపుదలకు అందరం చమురు ఉత్పత్తిని తగ్గించుదామని ప్రతిపాదించిన సౌదీ అరేబియా అందుకు రష్యా అంగీకరించకపోవటంతో ఆగ్రహంతో ఏప్రిల్‌ నెలలో ఉత్పత్తిని రోజుకు 12.3 మిలియన్‌ పీపాలకు పెంచి మార్కెట్లను ముంచెత్తాలని తద్వారా ధరలను మరింత పతనం కావించాలని నిర్ణయించింది.దీని పర్యవసానంగా తమ ఆదాయం పడిపోకుండా చూసుకొనేందుకు నైజీరియా ఉత్పత్తిని పెంచనున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలో రోజుకు 80 మిలియన్ల పీపాలు ఉత్పత్తి అవుతుండగా అమెరికా 15మిలియన్లతో అగ్రస్ధానంలో, తరువాత సౌదీ, రష్యా ఉన్నాయి.

Image result for russia, sowdy oil  war cartoons
ఒక పీపా ధర 25 నుంచి 30 డాలర్లకు పడిపోయినా ఆరు నుంచి పది సంవత్సరాల వరకు తాము తట్టుకొని నిలబడగలమని రష్యా చెబుతోంది. పీపా ధర 12-20 డాలర్లకు పడిపోయినా తట్టుకొనే విధంగా బడ్జెట్‌లను సవరించుకోవాలని అవసరమైతే పదిడాలర్ల కంటే తగ్గినా ఎలాంటి ఢోకాలేకుండా చూసుకోవాలని సౌదీ అరేబియా సిద్దం అవుతోంది. అమెరికాలోని షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి సంస్ధలు ఉత్పత్తిని తగ్గించేందుకు పూనుకున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలు కొనసాగితే కొన్ని కంపెనీలు బతుకుతాయి, అయితే అవి అవి ఆక్సిజన్‌ కోసం చూస్తాయని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఉన్న ఉత్పతిలో రోజుకు పది నుంచి ఇరవై లక్షల పీపాల వరకు తగ్గించవచ్చని వార్తలు వచ్చాయి. కేవలం ఐదు కంపెనీలు మాత్రమే ఖర్చుకు తగిన ఆదాయాన్ని పొందుతున్నట్లు చెబుతున్నారు.
2009 తరువాత తొలిసారిగా చమురు వినియోగం ఈ ఏడాది తగ్గనుందని అంతర్జాతీయ ఇంధన సంస్ధ పేర్కొన్నది. గత ద శాబ్ది కాలంలో వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో ఇంథన కంపెనీలు పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నాయి. చమురు ధరల పతనం కారణంగా ఈ కంపెనీల రుణాలను కొనుగోలు చేసిన సంస్ధలు సాధారణంగా పొందే ఒక డాలరుకు 67 సెంట్లకు బదులు 55 నుంచి 60సెంట్ల వరకు మాత్రమే రాబట్టుకోగలవని బర్కలీ పేర్కొన్నది.
చమురు యుద్ధాన్ని సౌదీ అరేబియా ప్రారంభించినప్పటికీ రష్యా లక్ష్యం అమెరికా షేల్‌ అయిల్‌ కంపెనీలే అని కొందరు విశ్లేషిస్తున్నారు.సౌదీ తక్షణ లక్ష్యం రష్యన్‌ మార్కెట్‌ను ఆక్రమించటం అయినప్పటికీ చమురు ఎగుమతి దేశాల సంస్ధ(ఒపెక్‌) తమ మార్కెట్‌ను రోజు రోజుకూ అమెరికాకు అప్పగించటం తనకు ముప్పుగా రష్యా పరిగణిస్తోంది. 2009 నుంచి అమెరికా షేల్‌ అయిల్‌ ఉత్పత్తి పెరుగుతోంది.2019 అమెరికా ఉత్పత్తిలో 63శాతం(రోజుకు 7.7మిలియన్‌ పీపాలు) ఉంది. వారిని దెబ్బతీయటం రష్యన్ల లక్ష్యం. అయితే తాజా పరిణామాల పర్యవసానం రష్యన్లకు సైతం నష్టం కలిగించేదే. ప్రస్తుతం సౌదీ అరేబియా బడ్జెట్‌ అవసరాలకు గాను ఒక పీపా బ్రెంట్‌ రకం ముడిచమురు ధర 80 డాలర్లు ఉండాలి, అదే రష్యాకు 45 డాలర్లు ఉన్నా తట్టుకోగలదని అంచనా. అమెరికన్‌ ఉత్పత్తిదారుల పరిస్ధితి ఇప్పుడు తాడు మీద నడక మాదిరి ఉంది. చమురు యుద్దం పీపా ధరను ఇరవై డాలర్లకు పతనం కావించవచ్చని గోల్డ్‌మన్‌ సాచస్‌ విశ్లేషకులు చెప్పారు. 2019 వివరాల ప్రకారం ప్రపంచ చమురు నిల్వల్లో 75శాతం ఒపెక్‌ దేశాల్లో ఉండగా ప్రపంచ ఉత్పత్తిలో 42శాతం కలిగి ఉన్నాయి. ఒక దేశంగా ఉత్పత్తిలో అమెరికా ప్రధమ స్ధానంలో ఉన్నప్పటికీ ప్రపంచమార్కెట్‌ను నియంత్రించగల శక్తి ఇంకా ఓపెక్‌దే అని చెబుతున్నారు.
చమురు చరిత్రలోకి వెళితే వాణిజ్యపరంగా తొలిసారి వెలికి తీసి వినియోగించింది అమెరికాయే.1860వ దశకంలో అమెరికాలో అంతర్యుద్ధం కారణంగా పెరిగిన డిమాండ్‌తో పీపా చమురుధర ఇప్పటి ధరలతో పోల్చుకుంటే గరిష్టంగా 120 డాలర్లు ఉండేది. తరువాత కాలంలో గణనీయంగా పడిపోయింది.1900దశకంలో స్పిండిల్‌టాప్‌ చమురు బావిని కనుగొన్న తరువాత అమెరికా ఆర్ధిక వ్యవస్ధలో చమురు ప్రధాన పాత్ర వహించటం ప్రారంభమైంది. ఒక్క ఏడాది కాలంలోనే 1500 కంపెనీలు పుట్టుకు వచ్చాయి. దాంతో ధరలు మరింతగా తగ్గాయి. 1908లో ఇరాన్‌లో, 1930లో సౌదీ అరేబియాలో చమురు నిల్వలను కనుగొన్న తరువాత చమురు సరఫరా విపరీతంగా పెరిగింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మరింతగా విస్తరించటం, వియత్నాం యుద్ధం వంటి కారణాలతో పెరిగిన అవసరాలకు చమురు దిగుమతి చేసుకోవటం ప్రారంభించింది. ఇదే సమయంలో 1960లో ఇరాన్‌, ఇరాక్‌, కువాయిట్‌, సౌదీ అరేబియా, వెనెజులా చమురు ఎగుమతి దేశాల సంస్ధ(ఒపెక్‌)ను ప్రారంభించాయి. తరువాత కొన్ని దేశాలు చేరటం, సంస్ధ నుంచి విడిపోవటం జరిగినా ప్రస్తుతం 15దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అమెరికా, రష్యా వాటిలో లేవు. కొత్తగా బ్రెజిల్‌ను గత ఏడాది ఆహ్వానించారు.

Image result for oil price war
1973లో పాలస్తీనా సమస్యలో అమెరికన్లు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వటం అది ఇరుగుపొరుగు అరబ్‌ దేశాలపై దాడులు, భూభాగాల ఆక్రమణల పూర్వరంగంలో ఒపెక్‌ దేశాలు అమెరికాకు చమురు ఎగుమతులను నిలిపివేశాయి. ధరలు కూడా పతనమయ్యాయి. అంతకు ముందు పశ్చిమ దేశాలకు చెందిన ఏడు చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‌ను అదుపు చేసేవి, 1973 తరువాత ఒపెక్‌ నిర్ణయాత్మక శక్తిగా మారింది. ధరలు, ఉత్పత్తిని నియంత్రించింది.1991వరకు ఇదే కొనసాగింది. ఆ ఏడాది సోవియట్‌ యూనియన్‌ పతనమైన తరువాత అనేక సంవత్సరాల పాటు రష్యా చమురు ఉత్పత్తిలో సమస్యలు తలెత్తాయి, ఇదే సమయంలో ఆసియన్‌ దేశాలలో ద్రవ్య సంక్షోభం ఏర్పడింది. చమురుకు డిమాండ్‌ విపరీతంగా పడిపోయింది. తరువాత అనేక పరిణామాలు సంభవించినా ఒపెక్‌ నియంత్రణ కొనసాగింది. రష్యా చమురు పరిశ్రమ స్ధిరపడింది. ప్రపంచ చమురు నియంత్రణ రష్యా సహకారం లేనిదే సాధ్యం కాని పరిస్ధితి ఏర్పడింది. అందుకే 2016లో ఒపెక్‌ దేశాలు దానితో సమన్వయం చేసుకున్నాయి. మరోవైపున 2003 నుంచి అమెరికాలో షేల్‌ ఆయిల్‌ వెలికితీత ప్రారంభం, 2014 నుంచి విపరీతంగా పెరగటం వంటి పరిణామాలు, పర్యవసానాలతో ఒపెక్‌, రష్యా ఆధిపత్యానికి గండిపడింది. అమెరికా చమురు ఎగుమతి దేశంగా తయారైంది. అమెరికా అనుభవాన్ని చూసిన తరువాత అనేక దేశాలు షేల్‌ ఆయిల్‌, గ్యాస్‌ నిల్వల వెలికితీతకు పెద్ద ఎత్తున పూనుకున్నాయి. ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగటమే కాదు, ఇరాన్‌, మరొక ఒపెక్‌ దేశమైన వెనెజులా చమురు అమ్మకాలపై రాజకీయ కారణాలతో అనేక ఆంక్షలు విధించింది. వీటిని ఎదుర్కోవటంలో ఒపెక్‌ విఫలమైంది. గతశతాబ్దిలో ప్రపంచ చమురు ధరలను అమెరికా నిర్ణయించేది, తరువాత ఆ స్ధానాన్ని ఒపెక్‌ ఆక్రమించింది, అయితే ఇటీవల తిరిగి అమెరికా నియంత్రణశక్తిగా ముందుకు వస్తోంది. చమురు ధరలు పెరిగినపుడు అమెరికా ఉత్పాదక సంస్దలు పెద్ద మొత్తాన్ని మార్కెట్‌కు విడుదల చేసి లబ్ది పొందుతున్నాయి. ఒపెక్‌ చమురు అవసరం అమెరికాకు తగ్గిపోవటంతో ఆ సంస్ధ నియంత్రణ పని చేయటం లేదు.

2017,18 సంవత్సరాలలో రోజుకు 12లక్షల పీపాల ఉత్పత్తి తగ్గించాలని ఒపెక్‌ నిర్ణయించి అమలు జరిపింది. అది అన్ని దేశాల కంటే అమెరికా కంపెనీలకే ఎక్కువ లబ్ది చేకూర్చింది. మరోవైపున తన రాజకీయ, ఆర్ధిక పలుకుబడిని ఉపయోగించి తన కంపెనీలకు చమురు ఎగుమతుల అవకాశాలను అందిస్తోంది. ఉదాహరణకు ఇరాన్‌ మనకు మిత్ర దేశం, మన రూపాయలకు చమురు విక్రయించింది. యాభై ఆరు అంగుళాల ఛాతి గలిగిన ధీశాలి అని ప్రశంసలు పొందిన నరేంద్రమోడీ పిరికితనాన్ని ప్రదర్శించి ట్రంప్‌ ఆదేశాలకు లొంగి ఇరాన్‌ బదులు అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నారు. 2017లో 19లక్షల టన్నుల చమురును అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటే మరుసటి ఏడాది అది 62లక్షల టన్నులకు పెరిగింది. 2019 తొలి ఆరునెలల్లోనే 54లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నాము.
ఒపెక్‌ దేశాల మార్కెట్‌ వాటా ఒక నాడు 44శాతం ఉంటే నేడు 30శాతానికి పడిపోయింది. గత రెండు సంవత్సరాలలో అది మరింత వేగంగా జరిగింది. చమురు వ్యాపారం డాలర్లలోనే జరుగుతుంది. ఇటీవలి కాలంలో డాలరు రేటు పతనం కావటంతో ఎగుమతి దేశాలకు నష్టదాయకంగా మారుతోంది. ఒపెక్‌ దేశాలు ధరలు పెంచాలను కోవటం వెనుక ఇది కూడా ఒక ప్రధాన కారణం. తాజా చమురు యుద్దానికి నేపధ్యమిది.

Image result for oil price war cartoons
చమురు యుద్దానికి రష్యా ఎందుకు సిద్ద పడుతోంది అన్నది అనేక మందిలో ఉన్న సందేహం లేదా ప్రశ్న. చమురు ధరలు పడిపోయినపుడు అమెరికా షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి తగ్గుతోంది. తమ మీద అమెరికా చీటికి మాటికి ఆంక్షలు విధిస్తూ ఆర్ధికంగా దెబ్బతీస్తోంది. అందువలన దాన్ని దెబ్బతీయాలంటే చమురు ధరలు పతనం కావాలని రష్యా కోరుకుంటోంది. గత ఐదు సంవత్సరాలలో అమెరికా ఆంక్షల కారణంగా వాటిని తట్టుకొని నిలబడే విధంగా రష్యా ఆర్ధిక వ్యవస్ధ ఒక సాధారణ స్దితికి వచ్చింది. దాని దిగుమతులు తగ్గుతున్నాయే తప్ప పెరగటం లేదు. రూబుల్‌ విలువ పతనమైతే ఎగుమతి దార్లకు మేలు, డాలర్ల ఆదాయం పెరుగుతుంది. అందువలన చమురు ధరలు పతనమైనా తమకు ఢోకా లేదని పుతిన్‌ భావిస్తున్నారు. రూబుల్‌ విలువ పతనమైతే తమ ఎగుమతులు పెరుగుతాయని తద్వారా చమురుతో వచ్చే నష్టాన్ని పూడ్చుకోవచ్చన్నది ఆలోచన. రష్యా దగ్గర ఇప్పుడు డాలర్ల నిల్వలు గణనీయంగా ఉన్నాయి, దాని అప్పులు కూడా తక్కువే. పీపా ధర వంద డాలర్లుంటే తప్ప గిట్టుబాటు కాని స్ధితిలో ఒక నాడు రష్యా ఉండేది. తరువాత తీసుకున్న పొదుపు, ఇతర చర్యల కారణంగా 51 డాలర్లు వచ్చినా బడ్జెట్‌ అవసరాలను తీర్చుకొనే స్ధితికి చేరింది. అది ఇప్పుడు మరింతగా తగ్గి 40డాలర్లకు చేరిందని చెబుతున్నారు. సౌదీ అరేబియా 80డాలర్ల ధర అవసరం ఉన్న స్ధితిలో ఉంది.
అమెరికా మీద ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే చమురు ధరల పతనం దాని చమురు ఉత్పత్తి కంపెనీలకు నష్టమైతే, మార్కెటింగ్‌ కంపెనీలకు లాభాలను తెచ్చిపెడుతుంది. ధరలు పతనమై షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి రోజు ఒక మిలియన్‌ పీపాలు తగ్గితే ఎగుమతి దేశ స్ధాయి కోల్పోయి దిగుమతి దేశాల జాబితాలో తిరిగి చేరుతుంది. చమురు స్వయం సమృద్ధికి కూడా అంతరాయం ఏర్పడవచ్చు. ధరలు తగ్గితే దిగుమతుల బిల్లు తగ్గుతుంది, మార్కెటింగ్‌ కంపెనీలకు లబ్ది కలుగుతుంది. ఈ నేపధ్యంలో సౌదీ ప్రారంభించిన చమురు యుద్దం ఎంతకాలం కొనసాగుతుంది? దాని వలన మన ఆర్ధిక వ్యవస్ధ, వినియోగదారులకు లబ్ది కలుగతుందా లేదా అని మరోసారి చూద్దాం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: