• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: February 2019

సర్జికల్‌ దాడులు, పెద్ద నోట్ల రద్దుతో వుగ్రవాద చర్యలు తగ్గాయా !

26 Tuesday Feb 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

IAF jets, Indian Air Force, surgical strikes, Surgical Strikes 2.0, terror-related deaths in J-K

Image result for surgical strikes by india

ఎం కోటేశ్వరరావు

కాశ్మీరులోని పుల్వామాలో వుగ్రదాడిలో 40మంది సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన పన్నెండవ రోజు మన వాయుసేన ఆక్రమిత్‌ కాశ్మీర్‌లో 19నిమిషాలలో మూడు చోట్ల 12 మిరేజ్‌ జట్‌ ఫైటర్లతో నిర్ణీత లక్ష్యాలపై ఆకస్మిక (సర్జికల్‌) దాడి చేసింది. తెల్లవారు ఝామున మూడు నాలుగు గంటల మధ్య జరిపిన ఈ దాడిలో 200 నుంచి 300 వరకు మరణించినట్లు, అనేక వుగ్రవాద స్ధావరాలను ధ్వంసం చేసినట్లు మన అధికారులు ప్రకటించారు. దాడి జరిగిన మాట నిజమే కాని తమకు ఎలాంటి ఆస్ధి,ప్రాణ నష్టం జరగలేదని పాక్‌ ప్రకటించింది. ఒక పౌరుడు గాయపడినట్లు రాయిటర్‌ వార్తా సంస్ధ పేర్కొన్నది. ఇది తొలి వార్తల సారాంశం.

శత్రుదేశాల మధ్య దాడులు, యుద్ధాలు జరిగినపుడు ముందుగా బలయ్యేది నిజం. దేశంలో ఇప్పుడున్న పరిస్ధితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు అంత పెద్ద సంఖ్యలో వుగ్రవాదులు మరణించారా, వారిలో పౌరులు లేరా అని ఎవరైనా సందేహిస్తే దేశద్రోహుల కింద జమకట్టేస్తారు. పుల్వామా దాడికి పాల్పడిన వారి మీద, ప్రేరేపించిన వారి మీద చర్య తీసుకోవాలనటంలో ఎవరికీ ఎలాంటి శషభిషలు లేవు. ఎవరూ మరొకరి దేశభక్తిని ప్రశ్నించాల్సిన పని లేదు. ఒక వుదంతం మీద సందేహాలు వ్యక్తం చేయటాన్ని సహించకుండా అసలు ప్రశ్నించటమే తప్పన్నట్లు ప్రవర్తించేవారితోనే పేచీ. మంగళవారం తెల్లవారు ఝామున జరిగిన దాడి గురించి కాసేపు పక్కన పెడదాం.

2016సెప్టెంబరు 18న యురి సైనిక కేంద్రంపై జైషే మహమ్మద్‌ వుగ్రవాదులు జరిపిన దాడిలో 19మంది సైనికులు మరణించారు. దానికి ప్రతిగా పదకొండు రోజుల తరువాత మన బలగాలు సర్జికల్‌ దాడి జరిపాయి. దానిలో 35 నుంచి 70 మంది వుగ్రవాదులు మరణించినట్లు సైనికవర్గాల సమాచారం మేర మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే సర్జికల్‌ దాడి అసలు జరగలేదని పాకిస్ధాన్‌ ప్రకటించింది. అయితే సరిహద్దులో జరిగిన స్వల్పపోరులో తమ సైనికులు ఇద్దరు మరణించారని, తొమ్మిది మంది గాయపడ్డారని, ఇదే సమయంలో ఎనిమిది మంది భారత సైనికులు మరణించారని, ఒకరిని బందీగా పట్టుకున్నట్లు పాక్‌ చెప్పుకుంది. ఈ వుదంతం జరిగి రెండున్నర సంవత్సరాలు గడిచినా వాస్తవం ఏమిటో ఇప్పటికీ తెలియదు. దాడి వివరాలను బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసినదే.

ఈ వుదంతం తరువాత 2016నవంబరు 8న ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటించి మొత్తం దేశం మీద సర్జికల్‌ స్ట్రైక్‌ చేసిన విషయం తెలిసిందే. ఇతర అంశాలతో పాటు నాడు చెప్పిందేమిటంటే వుగ్రవాదులకు నగదు అందకుండా అరికట్టటం అని కూడా ప్రధాని చెప్పిందాన్ని దేశమంతా నిజమే అని నమ్మిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు వలన కలిగిన ప్రయోజనం ఏమిటో ఇంతవరకు రద్దు చేసిన మోడీ అధికారికంగా ప్రకటించలేదు కనుక దాన్ని కూడా సర్జికల్‌ స్ట్రైక్‌ అనాల్సి వచ్చింది. వుగ్రవాదుల పీచమణచేందుకు తీసుకున్న ఈ చర్యతో ఫలితాలు వచ్చాయంటూ అధికార పార్టీ పెద్దలు పెద్దఎత్తున ప్రచారం చేసిన విషయం గుర్తు చేయటం దేశ ద్రోహం కాదేమో !

దారుణమైన వుదంతాలు జరిగినపుడు దేశ పౌరుల్లో ఆవేశకావేషాలు తలెత్తటం, దెబ్బకు దెబ్బతీయాలన్న వుద్రేకం కలగటాన్ని అర్ధం చేసుకోవచ్చు. వుగ్రవాదం మనకు కొత్త కాదు, ఈశాన్య రాష్ట్రాలలో మొదలై తరువాత కాశ్మీర్‌, పంజాబ్‌కు వ్యాపించింది. నక్సల్స్‌ తీవ్రవాదం గురించి తెలిసిందే.దాదాపు ఆరుదశాబ్దాల చరిత్ర, అనుభవం వుంది. అలాగే సర్జికల్‌ దాడులూ కొత్త కాదని మనవి. మయన్మార్‌లో శిబిరాలను ఏర్పాటు చేసుకున్న ఈశాన్య రాష్ట్రాల వుగ్రవాదులు మన భూభాగాలపై దాడులు చేసి మయన్మార్‌ పారిపోయే వారు. పెద్ద వుదంతాలు జరిగినపుడు గుట్టుచప్పుడు కాకుండా మన సైనికులు సర్జికల్‌ దాడులు జరిపి తిరిగి వచ్చేవారు. బయటకు ప్రకటించేవారే కాదు. ఇప్పుడు ప్రతిదాన్నీ ఓటుగా మార్చుకోవాలన్న ప్రచారకండూతి వైరస్‌ సోకిన కారణంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ కారణంగానే గతంలో జరిగిన సర్జికల్‌ దాడికి ఆధారాలు ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. తాజాగా జరిగిన దాడిని గురించి తెలిసిన ప్రధాని నరేంద్రమోడీ వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయటానికి బదులు రాజస్దాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గనిదాడి గురించి మాట్లాడటాన్ని ఏమనుకోవాలి.

మంగళవారం నాటి దాడి నిర్దిష్ట సమాచారంతో నిర్ధిష్ట వుగ్ర స్దావరాలపై జరిగిందని చెబుతున్నారు. మన వేగుల వ్యవస్ధ సమర్ధతను అనుమానించాల్సిన అవసరం లేదు. అదే వ్యవస్ధ వైఫల్యాన్ని కూడా గమనంలో వుంచుకోవాలి. దాని గురించి అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం లేదు. సర్జికల్‌ దాడులను సమర్ధవంతంగా నిర్వహించినపుడు వుగ్రవాద కదలికలను, సైనిక స్ధావరాల మీద, ప్రయాణిస్తున్న పారామిలిటరీ బలగాల మీద జరిగిన దాడులను ఎలా పసిగట్టలేకపోయారు. ఇదే ప్రశ్నను వుత్తర ప్రదేశ్‌ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాధ్‌ను ఒక విద్యార్ది అడిగితే ఇదే దేశసామాన్యులందరి మదిలో వుందంటూ బటబటా ఏడ్చినట్లు వార్తలు వచ్చాయి.

Image result for surgical strike  2019

పొలాన్ని దున్నకుండా, నేలను ఆరోగ్యంగా వుంచకపోతే పిచ్చి మొక్కలు మొలుస్తాయి. వుగ్రవాదం, వుగ్రవాదులు కూడా అలాంటి వారే. ఆ పిచ్చిమొక్కలను మొలవకుండా చూడాలి. ఒకసారి పీకివేస్తే తిరిగి మొలకెత్తే పిచ్చి, కలుపు మొక్కల వంటివే అవి. జమ్మూ కాశ్మీర్‌లో వుగ్రవాద చర్యలకు సంబంధించి 2014 నుంచి 2019 ఫిబ్రవరి 15వరకు దక్షిణాసియా వుగ్రవాద పోర్టల్‌ క్రోడీకరించిన సమాచార వివరాలు ఇలా వున్నాయి.2019 ఫిబ్రవరి 15వరకు.

సంవత్సరం హత్యోదంతాలు పౌరులు భద్రతాసిబ్బంది  వుగ్రవాదులు మొత్తం మరణాలు

2014            91        28         47            114          189

2015            86        19         41            115          175

2016           112        14         88            165          267

2017           163         54        83             220          357

2018           204         86        95              270         451

2019             16          2         43               29           74

మొత్తం           672        203      397             913         1513

ఈ పట్టికను చూసినపుడు మోడీ పాలనా కాలంలో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. అంతకు ముందు సంవత్సరాలలో ఈ సంఖ్యలు ఇంకా చాలా ఎక్కువగా వుండి యుపిఏ పాలన చివరి సంవత్సరాలలో గణనీయంగా తగ్గాయి. పెద్ద నోట్ల రద్దు, సర్జికల్‌స్రైక్‌లు, సామాజిక మీడియాలో కొన్ని తరగతుల మీద వ్యాపింప చేస్తున్న విద్వేష ప్రచారం, శాంతి భద్రతల సమస్యగా చూసి భద్రతా దళాలకు విచక్షణారహిత అధికారాలు ఇస్తే వుగ్రవాదం తగ్గుతుందన్నది ఒక తప్పుడు అభిప్రాయంగా రుజువు అవుతున్నది. ముందే చెప్పినట్లు వుగ్రవాదులనే పిచ్చి మ్కొలు పెరగకుండా, అదుపు తప్పి పోకుండా వుండాలంటే అందుకు అనువైన పరిస్ధితులను మార్చాలి తప్ప ఎంత పెద్ద కలుపు నివారణ మందులు వాడినా ఇతర కొత్త సమస్యలు తలెత్తుతాయి తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. ఇది ఒక్క కాశ్మీరు అంశం కాదు, మన దేశ, ప్రపంచ అనుభవం. ఇప్పటికైనా ఆయా ప్రాంతాల పౌరులను విశ్వాసంలోకి తీసుకొని వారిలో చైతన్యం కలిగించి వుగ్రవాద వ్యతిరేకపోరులో వారిని కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం లేదా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ కౌగిలింతల దౌత్యం-వ్రతం చెడ్డా ఫలం దక్కేనా !

25 Monday Feb 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Hug diplomacy, Mohammed bin Salman (MBS), Narendra Modi, Narendra Modi Hug diplomacy, pakistan, Pulwama, Saudi Arabia

Image result for Narendra Modi’s  Hug diplomacy, saudi prince

ఎం కోటేశ్వరరావు

కాశ్మీరులోని పుల్వామాలో వుగ్రదాడిలో 40మంది సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయి పది రోజులు దాటింది. ఫిబ్రవరి 14వ తేదీ సాయంత్రం 3-4గంటల మధ్య పేలుడు సంభవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలోని సామాజిక, సాంప్రదాయ మీడియా, రాజకీయ రంగంలో చూస్తే వుగ్రవాదుల దాడులను ఎలా అరికట్టాలనేదాని కంటే యుద్దోన్మాదాన్ని, కొన్ని సామాజిక తరగతుల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టటం, పుల్వామా వుదంతం నుంచి రాజకీయ లబ్ది పొందే అంశాలకు ప్రాధాన్యత ఏర్పడటం నిజంగా విచారకరం. వామపక్షాలు మినహా బిజెపి కూటమి, కాంగ్రెస్‌ కూటమి పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో లబ్దిపొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మీడియాలోని కొంత మంది వుద్రేకాలను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. దాడికి సంబంధించి భద్రతాలోపం ఎక్కడ జరిగిందో ఇంతవరకు వెల్లడి కాలేదు. ఇదేమీ చిన్న విషయం కాదు. గతంలో సైనిక కేంద్రాలపై జరిగితే ఇప్పుడు కదులుతున్న వాహన శ్రేణి లక్ష్యంగా జరిగింది.

దాడి జరిగిన సమయంలో నరేంద్రమోడీ ఒక వీడియో షూటింగ్‌లో మునిగిపోయి మూడుగంటల వరకు దాడిని పట్టించుకోలేదని, సమోసాలు, ఇతర తినుబండారాలు తిన్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తే ప్రభుత్వం, బిజెపినేతలు దాన్ని తిరస్కరిస్తూ నాలుగు గంటలకే ప్రధాని దాడి వుదంతం మీద సమీక్షలు ప్రారంభించారని ఆ రోజు రాత్రి అసలు భోజనమే చేయలేదని ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. తాము ఎవరు చెప్పింది వాస్తవమో కాదో తేల్చలేకపోయామని అందువలన రెండు పక్షాలు చెప్పిన అంశాలను వార్తలుగా ఇస్తున్నట్లు, ముందు చెప్పిన తీర్పును వెనక్కు తీసుకుంటున్నామని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక పేర్కొన్నది. ఇక్కడొక భట్టిప్రోలు తీర్పు అనే గుంటూరు జిల్లా పిట్టకధ చెప్పాల్సి వుంది. కొండమీద గొడవ జరుగుతుంటే చూద్దామని వెళ్లామని రెండువైపుల వారు వారు కత్తులు ఝళిపిస్తుండగా పెద్దగా వురుములు, మెరుపులు వచ్చాయని ఆ సమయంలో ఎవరు ఎవరిని ముందు కొట్టారో తాము చూడలేకపోయామని పెద్దలు చెప్పారన్నది సారాంశం. ఎన్నికల రోజులు, మోడీ తిరిగి పదవిలోకి వస్తారో రారో ఎందుకు పంచాయతీ అనుకుందేమో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా. దాన్ని కాసేపు పక్కన పెడదాం.

వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ పుల్వామా దాడి జరిగిన ఎనిమిదవ రోజు అంటే 22వ తేదీన లక్నో నగరంలో భారతీయ మనోగతం అనే అంశంపై నిర్వహించిన సభలో పాల్గన్నారు.ఒక విద్యార్ధి లేచి పుల్వామా దాడికి ముందు తరువాత కూడా అసలు మన భద్రతా సంస్ధలు ఏమి చేస్తున్నాయని సూటిగా ప్రశ్నించాడు. దానికి సమాధానంగా నువ్వనుకుంటున్నదే దేశంలోని ప్రతి సామాన్యుడి బుర్రలో మెదులుతోందంటూ వెంటనే బటబటా కన్నీళ్లు కారుస్తూ ఏడ్చేశారని వార్తలు వచ్చాయి. ఆయన సామాన్యుడేమీ కాదు, నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయంగా ప్రధాని కావాలని అనుకుంటున్నవారిలో వున్నట్లు ప్రచారం జరుగుతున్న నేత. ఎనిమిది రోజుల తరువాత బహిరంగంగా ఏడవటం ఏమిటి?

పుల్వామా దాడి జరిగి 24 గంటలు కూడా గడవ లేదు, దేశం దిగ్భ్రాంతి నుంచి ఇంకా తేరుకోలేదు. ప్రధాని నరేంద్రమోడీ దేశంలో వేగంగా ప్రయాణించే తొలి రైలు వందే భారత్‌ను ప్రారంభించే అవకాశాన్ని వదులు కోలేదు. ఆ తరువాత నాలుగు రోజులకు 19వ తేదీ సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌ నాయకత్వంలో పెద్ద ప్రతినిధి వర్గం మన దేశ పర్యటనకు వచ్చింది.ప్రాణాలు కోల్పోయిన 40మంది సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది కుటుంబాల కన్నీటి చారికలు ఇంకా కనిపిస్తూనే వున్నాయి. ఆ దాడికి జైషే మహమ్మద్‌ అనే పాక్‌ ప్రేరేపిత వుగ్రవాద సంస్ధ బాధ్యురాలు. ప్రపంచంలో మత ప్రాతిపదికన పని చేస్తున్న ప్రతి వుగ్రవాద సంస్ధకూ సౌదీ పెట్రో డాలర్లు నిత్యం అందుతుంటాయని తెలుసు.అమెరికా పధకం, సౌదీ ప్రోత్సాహం, సాయం లేకుండా పాకిస్దాన్‌లో వుగ్రవాద ముఠాలు మనుగడ సాగించటం సాధ్యం కాదు. మోడీకి అది తెలియంది కాదు. సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌(ఎంబిఎస్‌) రాజరిక వారసుడిగా ఎంపికయ్యాడు తప్ప ఇంకా రాజు కాలేదు. రాజ ప్రముఖుడిగా అధికార మర్యాదలు పొందుతున్నాడు. యువరాజు బృందాన్ని మన ప్రధాని నరేంద్రమోడీ రాజభవన్‌లో కలవాల్సి వుండగా ప్రోటోకాల్‌( గౌరవ స్ధాన భేద సూచనం) పక్కన పెట్టి తనకంటే తక్కువ స్థాయి కలిగిన యువరాజును ఆహ్వానించేందుకు ఏకంగా విమానాశ్రయానికి వెళ్లి కౌగిలింతలతో స్వాగతం పలకటం విపరీతపోకడగా దేశ ప్రజలకు కనిపించింది.

నరేంద్రమోడీ అంతకు ముందు కూడా పలువురు విదేశీనేతల పర్యటనల్లో కౌగిలింతలతో సరికొత్త దౌత్యానికి తెరతీశారు. సౌదీ యువరాజు పుల్వామా దాడి జరిగిన తరువాత ముందుగా పాక్‌ పర్యటనకు వెళ్లాడు. మన దేశ పర్యటన, తరువాత చైనా పర్యటన కూడా అంతకు ముందే ఖరారైంది. నిజంగా సౌదీ మనకు అత్యంత ముఖ్యదేశమే అయితే మన దేశంలో ఇంత పెద్ద విషాదం జరిగి, దానికి బాధ్యత పాకిస్ధాన్‌దే అని మన దేశ ప్రకటించిన తరుణంలో రాకుమారుడి పర్యటన వాయిదా వేసుకొని వుండాల్సింది. అయితే నరేంద్రమోడీయే 24గంటలు కూడా గడవక ముందే వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవానికి హాజరు కావటం, అభిలపక్ష సభను బహిష్కరించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గంటున్నపుడు సౌదీ యువరాజు ఎందుకు పర్యటన వాయిదా వేసుకోవాలంటే సమాధానం వుండదు. కారణం చెప్పకపోయినా పుల్వామా వుదంతం కారణంగానే పాక్‌ పర్యటనను రెండు రోజులు వాయిదా వేసుకొని మన దేశానికి ముందనుకున్నట్లుగానే వచ్చాడు. అతగాడికి స్వాగతం పలకటానికి పాకిస్ధాన్‌, మన దేశం రెండూ పోటీ పడ్డాయి. రావల్పిండిలో 21తుపాకులు, జెట్‌ ఫైటర్‌తో ఘనస్వాగతం పలికారు, బంగారంతో చేసిన తుపాకిని బహుమతిగా ఇచ్చారు. మన దేశంలో ప్రధాని నరేంద్రమోడీ విమానాశ్రయానికి వెళ్లి మరీ కౌగిలింతలతో స్వాగతం పలికాడు. చైనాలో అధ్యక్షుడు జింపింగ్‌తో కలసి ఫొటో దిగాడు.

జింపింగ్‌ సౌదీ యువరాజుతో ఎందుకు ఫొటో దిగాడు అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. చైనా తన వాణిజ్య ప్రయోజనాలను రక్షించుకొనేందుకు రోడ్‌ మరియు బెల్ట్‌ పేరుతో ఒక పెద్ధ కార్యాచరణ తలపెట్టింది. దాన్నే కొందరు చైనా సిల్క్‌ మార్గం అని పిలుస్తున్నారు. చైనా పురాతన కాలంలో తన సిల్కును వివిధ దేశాలకు తీసుకుపోయి విక్రయించిన మార్గాన్ని అలా పిలిచారు. అయితే అది ఇప్పుడు అంతగా అతకదు. నిజానికి చైనా ఒక మార్గాన్నే తలపెట్టలేదు. చిన్నా పెద్దవి ఆరు మార్గాలు లేదా కారిడార్లను అభివృద్ధి చేసేందుకు పూనుకుంది. దానిలో అనేక దేశాలు చేరి ప్రయోజనం పొందేందుకు ముందుకు వస్తున్నాయి. వాటిలో సౌదీ అరేబియా ఒకటి. ప్రస్తుతం సౌదీ చేసుకుంటున్న దిగుమతులలో చైనా వాటా 19శాతం వుంది. తరువాత అమెరికా 8, జర్మనీ 7.5 శాతాలతో వుండగా 5.2శాతంతో మనది ఆరవ స్ధానం. పాకిస్ధాన్‌ది 0.34శాతం. అందువలన చైనా అధ్యక్షుడు సౌదీ యువరాజుతో ఎందుకు ఫొటో దిగాడో వేరే చెప్పనవసం లేదు. పాకిస్ధాన్‌కు సౌదీ అవసరం ఎంత వుందో సౌదీకి పాక్‌ అవసరం కూడా అంతే వుంది. మూడు బిలియన్‌ డాలర్ల నగదు అంద చేసేందుకు, మూడు సంవత్సరాల పాటు చమురు కొనుగోలు చెల్లింపులను వాయిదా వేసేందుకు జనవరిలోనే సౌదీ అంగీకరించింది. అందువలన ఇమ్రాన్‌ ఖాన్‌ ఘనస్వాగతాలు పలకటాన్ని అర్ధం చేసుకోవచ్చు. మన ప్రధానికి ఏమైంది. ఏమి సాధించాలని గౌరవ మర్యాదలను పక్కన పెట్టినట్లు ?నరేంద్రమోడీ అంటే రాజకీయంగా, ఇతరంగా అందరికీ ఆమోదయోగ్యుడు కాదన్నది తెలిసిందే. అయినా ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికలలో విజయం సాధించి మన దేశ ప్రధాని అయ్యారు. అలాంటి పదవిలో వున్నవారు నియమ లేదా వ్రతభంగం కావించటం అంటే అది దేశం మొత్తానికి వర్తిస్తుంది. దాడిని అనేక దేశాల మాదిరి ఖండించింది తప్ప పాక్‌ గురించి సౌదీ ఒక్క మాట మాట్లాడని పూర్వరంగంలో పాకిస్దాన్‌కు మనకంటే దగ్గరి స్నేహితుడైన సౌదీ రాజ ప్రతినిధికి నిబంధనలను పక్కన పెట్టి స్వాగతం పలకటం మింగుడుపడని అంశమే. వ్రతం చెడ్డా ఫలం దక్కుతుందా ?

Image result for Narendra Modi’s  Hug diplomacy, saudi prince

వుగ్రవాది అంటే అందరికీ తెలిసింది బిన్‌ లాడెన్‌. అతగాడిని వుపయోగించుకుంది అమెరికా, పెంచి పోషించింది సౌదీ సర్కార్‌. చివరకు ఏకు మేకైనట్లు, గురువుకు పంగనామాలు పెట్టినట్లు తనను పెంచి పోషించిన అమెరికాలోనే న్యూయార్క్‌ పపంచ వాణిజ్య కేంద్రంపై దాడికి సూత్రధారి అయ్యాడు. సౌదీ వుగ్రవాదులతోనే ఆపని చేయించాడు. అమెరికాకు సౌదీ అనుంగు దేశం అని తెలిసిందే. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా కుట్రలో సౌదీ పెద్ద భాగస్వామి. అలాంటి సౌదీ గురించి డోనాల్డ్‌ ట్రంప్‌ 2015లో రాసిన ‘టైమ్‌ టు గెట్‌ టఫ్‌ ‘( కఠినంగా వుండాల్సిన సమయం) పుస్తకంలో ప్రపంచంలో వుగ్రవాదానికి అత్యధిక నిధులు అందచేసే దేశం సౌదీ అని పేర్కొన్నాడు. బరాక్‌ ఒబామా సర్కార్‌లో విదేశాంగ మంత్రిగా పని చేసిన హిల్లరీ క్లింటన్‌ 2009లో రాసిన ఒక మెమోలో ప్రపంచవ్యాపితంగా వున్న సున్నీ వుగ్రవాద ముఠాలకు ఇప్పటికీ సౌదీ కీలకమైన ఆర్ధిక మద్దతుదారుగా వుంది. ఆల్‌ఖ్వైదా, తాలిబాన్‌, లష్కరే తోయబా ఇతర సంస్దలు ప్రతి ఏటా కోట్లాది డాలర్లను సౌదీ ద్వారా పొందుతున్నాయి అని పేర్కొన్నారు. వుగ్రవాదులకు నిధులు అందచేసే దేశాలలో సౌదీ అరేబియాను తీవ్ర ముప్పు వున్న దేశాల జాబితాలో చేర్చాలని జనవరిలోనే ఐరోపా యూనియన్‌ నిర్ణయించింది.

మన ప్రధాని నరేంద్రమోడీకి ఏ సమయంలో పెద్ద నోట్ల రద్దు ఆలోచన వచ్చిందోగానీ జిందాతిలిస్మాత్‌ సర్వరోగ నివారిణి అన్నట్లుగా వుగ్రవాదంతో సహా అన్ని సమస్యలను పెద్ద నోట్ల రద్దుతో పరిష్కరించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, దాన్ని మన మెజారిటీ జనం గుడ్డిగా నమ్మిన విషయం తెలిసిందే.నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు, మన ఆర్ధిక వ్యవస్ధకు నష్టం జరిగింది తప్ప వుగ్రవాదులకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. మన దేశానికిి పాకిస్దాన్‌తో 3,323 కిలోమీటర్ల సరిహద్దు వుంటే, దానిలో వాస్తవాధీన రేఖతో సహా కాశ్మీర్‌లో 1,225కిమీ, పంజాబ్‌తో 553కిమీ వుంది.( పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌తో సరిహద్దు 744కిలోమీటర్లు వుంది.) ఒక్క కాశ్మీరులోనే అన్ని విభాగాలకు సంబంధించి దాదాపు ఏడులక్షల భద్రతా సిబ్బంది వున్నారు. పెద్ద నోట్ల రద్దుతో వుగ్రవాదుల నడుములు విరిచేసి వుంటే నిజానికి అక్కడ అంత మంది అవసరం వుండదు. అయినా యధావిధిగా కొనసాగుతున్నారంటే నరేంద్రమోడీ నోట్ల రద్దుకు జనాన్ని తప్పుదారి పట్టించినట్లే కదా !

Image result for Narendra Modi’s  Hug diplomacy, saudi prince

మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పాకిస్ధాన్‌ను మరింత బలహీనపరచాలని మనం ప్రయత్నిస్తుంటే సౌదీ ఆర్ధికంగా ఆదుకుంటున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో పూర్వపు సోవియట్‌ పలుకుబడి పెరగకుండా చూసేందుకు, ఇరాన్‌, సిరియా తదితర పశ్చిమాసియా దేశాలలో తన రాజకీయ వ్యతిరేకులను దెబ్బతీసేందుకు తాలిబాన్లు, ఇతర అనేక పేర్లతో మత తీవ్రవాదుల తయారీని అమెరికా ఎంచుకున్నది. దానికి కార్యస్ధలం పాకిస్దాన్‌ అయితే, గణనీయ మొత్తంలో నిధులు సమకూర్చింది సౌదీ అరేబియా, ఆయుధాలు, మందుగుండువంటివి అందించింది అమెరికా, ఐరోపాధనిక దేశాలు. ఈ త్రయం ఇస్లాంలో మెజారిటీగా వున్న సున్నీ తెగవారిని ఎంచుకుంటే వీరి ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు ఇరాన్‌ షియా, ఇతర తెగలను ఎంచుకొని శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్దాన్లలో తాలిబాన్లు పెద్ద శక్తిగా వున్నారు. మారిన రాజకీయపరిణామాలలో ఆఫ్ఘన్‌ తాలిబాన్లు అమెరికాకు ఏకు మేకయ్యారు. వారిని అదుపు చేయనందుకు అమెరికన్లు పాకిస్దాన్‌పై ఆగ్రహంతో వున్నారు. రెండవది మన దేశ మార్కెట్‌ను ఆక్రమించటం అసలు లక్ష్యం గనుక మనలను సంతుష్టీకరించేందుకు పాకిస్దాన్‌కు తాత్కాలికంగా మిలిటరీ సాయాన్ని ఆపినట్లు ప్రకటించారు. అది బెదిరింపు తప్ప వేరు కాదు. తాలిబాన్లను అణచివేయటంలో విఫలమైన అమెరికా తన తట్టాబుట్ట సర్దుకుపోతామని చెబుతున్నది. ఈ ప్రక్రియలో భాగంగానే కతార్‌లో జరిపే చర్చలకు తాలిబాన్లను రప్పించే బాధ్యతను పాకిస్ధాన్‌కు అప్పగించారు. భవిష్యత్‌లో ఒక వేళనిజంగానే అమెరికన్లు నిష్క్రమిస్తే ఆఫ్ఘనిస్తాన్‌లోని ఇరాన్‌ అనుకూల తాలిబాన్ల ప్రభావాన్ని తగ్గించాలంటే అక్కడి, పాకిస్దాన్‌లోని కిరాయిమూకల అవసరం వుంటుంది. ఇదే సమయంలో ఇరాన్‌-పాక్‌ వైరుధ్యాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. పాక్‌ మద్దతు వున్న తాలిబాన్లు ఇరాన్‌కు వ్యతిరేకం. అందుకు ఇరాన్‌లోని సిస్టాన్‌-బలూచిస్తాన్‌ ప్రాంతంలో పాక్‌, ఆఫ్ఘన్‌వైపు నుంచి ప్రవేశించే వుగ్రవాదులు తరచూ దాడులు జరుపుతుంటారు. పుల్వామా దాడికి కొద్ది రోజుల ముందు పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులు జరిపిన దాడిలో 27 మంది ఇరాన్‌ రివల్యూషనరీ గార్డులు మరణించారు. అందువలన అనివార్యంగా పాక్‌తో సౌదీ అరేబియా సంబంధాలను కొనసాగించకతప్పదు. అమెరికా పధకంలో భాగంగా ఎమెన్‌పై ఇప్పటికే సౌదీ అరేబియా దాడులు జరుపుతోంది. పాకిస్ధాన్‌ను అదుపులోకి తెచ్చుకోవటం అమెరికన్లకు చిటికెలో పని.

ప్రోటోకోల్‌ను పక్కన పెట్టి కౌగిలించుకున్నంత మాత్రాన పాకిస్దాన్‌ను వదలి సౌదీ మనకు మిత్రదేశంగా మారే అవకాశాలు ఏమాత్రం లేవు. అంతదానికి అలాంటి మర్యాదలెందుకన్నది ప్రశ్న. ప్రపంచ రాజకీయాలు, మిలిటరీ వ్యూహాలలో పశ్చిమాసియా, మధ్య ఆసియా ప్రాంతానికి మొదటి ప్రపంచ యుద్దం నుంచీ ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఆ ప్రాంతంలో అపార చమురు, ఇతర ఖనిజ సంపదలతో పాటు మిలిటరీ రీత్యాకీలక ప్రాంతంగా వుండటమే కారణం. ఈ ప్రాంతాన్ని అదుపులో పెట్టుకొనేందుకు అమెరికన్లు చేయని దుర్మార్గం లేదు. సౌదీ ప్రభుత్వం లేదా అక్కడి ప్రయివేటు కార్పొరేట్‌ సంస్ధలు భారత్‌, పాక్‌, చైనాల్లో ఎక్కడ పెట్టుబడులు పెట్టినా వాటి ప్రయోజనాలకే పెద్ద పీట. ఈ మూడు దేశాలకు పెద్ద మొత్తంలో చమురు సరఫరా చేస్తోంది. తన వ్యూహాత్మక భాగస్వామ్యం, పెట్టుబడులకు అది ఎనిమిది దేశాలను ఎంచుకుంటే వాటిలో మనది ఒకటి. అన్ని దేశాలతో ఒకే విధంగా లేదు. దానిలో భాగమే పాక్‌తో ప్రత్యేక అనుబంధం. అందుకే కాశ్మీర్‌ సమస్యలో దాని మద్దతు పాకిస్దాన్‌కే వుంది. ముప్పైమూడు సంవత్సరాల సౌదీ రాకుమారుడిని ఇమ్రాన్‌ ఖాన్‌ కంటే నరేంద్రమోడీ గట్టిగా కౌగిలించుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సియోల్‌ శాంతి బహుమతి- నరేంద్రమోడీకి వున్న అర్హత ఏమిటి ?

22 Friday Feb 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

India HDI, India inequality, Modidoctrine, modinomics, Naredra Modi, seoul peace prize 2018

Image result for seoul peace prize

ఎం కోటేశ్వరరావు

2009 ప్రపంచ శాంతి నోబెల్‌ బహుమతికి తాను అర్హుడిని కాదని నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సిగ్గుపడుతూ గానీ అస్సలు బాగోదని గానీ బహిరంగంగానే చెప్పాడు. పాలస్తీనా అరబ్బులను అణచివేసి వారి మాతృదేశాన్ని ఆక్రమించుకున్న యూదు దురహంకారులు షిమన్‌ పెరెజ్‌, యత్జిక్‌ రబిన్‌, వారి దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడిన యాసర్‌ అరాఫత్‌, ముగ్గురికి కలిపీ 1994 నోబెల్‌ శాంతి బహుమతి ఇచ్చారు. చరిత్రలో ఇంకా ఇలాంటి విపరీత పోకడలతో శాంతిని హరించిన వారిని ఎంపిక చేయటంతో శాంతి బహుమతి అంటే పరిహాసానికి మారుపేరుగా మారింది. అరాఫత్‌ తమకు లంగనంత కాలం అమెరికన్ల దృష్టిలో వుగ్రవాది, కొన్ని పరిస్ధితుల కారణంగా రాజీకి రావటంతో శాంతిదూత అయ్యాడు. అంతెందుకు గుజరాత్‌ మారణకాండ కారణంగా ముఖ్యమంత్రిగా అమెరికా పర్యటనకు తిరస్కరించిన అమెరికన్లు మోడీ ప్రధాని కాగానే వైఖరి మార్చుకున్న విషయం తెలిసిందే. ఇంతకూ ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తేవాల్సి వచ్చిందంటే మన ప్రధాని నరేంద్రమోడీ ఫిబ్రవరి 21న దక్షిణ కొరియాలో ‘ సియోల్‌ శాంతి బహుమతి ‘ అందుకున్నారు.

సియోల్‌ శాంతి బహుమతి లక్ష్యం, దానికి నరేంద్రమోడీని ఎంపిక చేసిన తీరు చూస్తే ఒకింత పరిహాస ప్రాయంగా, ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత మాదిరి అనిపిస్తే ఎవరినీ తప్పు పట్టాల్సిన పని లేదేమో ! కొరియా ద్వీపకల్పంలో, అదే విధంగా ప్రపంచంలో శాంతి ప్రయత్నాలు, కొరియన్ల ఆకాంక్షలకు అనుగుణంగా 1990లో సియోల్‌ శాంతి బహుమతి ఏర్పాటు చేశారు. 1988లో సియోల్‌లో 24వ ఒలింపిక్స్‌ను జయప్రదంగా నిర్వహించటాన్ని పురస్కరించుకొని రెండు సంవత్సరాల తరువాత దీన్ని ఏర్పాటు చేశారు. ఈ పోటీలకు కమ్యూనిస్టు వుత్తర కొరియా కూడా హాజరై తన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించింది. ఈ పూర్వరంగంలో దానికి కొరియా అన కుండా సియోల్‌ అని నామకరణం చేయటం సంకుచితం. రెండు సంవత్సరాలకు ఒకసారి దీనిని అందచేస్తున్నారు. బహుమతి గ్రహీతకు పత్రంతో పాటు రెండులక్షల డాలర్ల నగదు ఇస్తారు. మానవాళి మధ్య శాంతి సామరస్యాల సాధన, దేశాల మధ్య ఐకమత్యం, ప్రపంచ శాంతికి కృషి చేసిన వారిని ఎంపిక చేస్తారు. 2018వ సంవత్సరానికి గాను ప్రపంచమంతటి నుంచి 1300 మంది నుంచి వందకు పైగా పేర్లు ప్రతిపాదనలుగా వచ్చాయి. వారిలో నరేంద్రమోడీ తగిన వ్యక్తిగా ప్రకటించారు.

‘వూహించండి 2018 సియోల్‌ శాంతి బహుమతిని నరేంద్రమోడీ ఎందుకు పొందారు ? సూచన: పాకిస్ధాన్‌ సంబంధితమైంది కాదు ‘ అని ఒక వ్యాఖ్యకు, మోడినోమిక్స్‌, యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ గాను నరేంద్రమోడీకి సియోల్‌ శాంతి బహుమతి ప్రదానం ‘ అంటూ బహుమతి వార్తకు పెట్టిన శీర్షికలలో వున్నాయి. ఇప్పటి వరకు 14 మంది ఈ బహుమతిని పొందగా మోడీ తొలి భారతీయుడు. మోడినోమిక్స్‌(మోడీ తరహా ఆర్ధిక విధానం) ద్వారా భారత్‌లో మరియు ప్రపంచంలో వున్నతమైన ఆర్ధిక అభివృద్ధికి అందించిన తోడ్పాటుకుగాను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు మన విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ అంతర్జాతీయ సహకారాన్ని మెరుగుపరచేందుకు ఆయన అంకిత భావం, ప్రపంచ ఆర్ధిక వృద్ధి పెంపుదల, ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ది పెంపుదలతో భారత పౌరుల మానవాభివృద్ధికి కృషి, అవినీతి వ్యతిరేక మరియు సామాజిక ఏకీకరణం ద్వారా ప్రజాస్వామ్యం మరింతగా అభివృద్ధి చెందించే ప్రయత్నాలకు గుర్తింపు ఇది, క్రియాశీలకమైన విదేశాంగ విధానంతో ప్రపంచవ్యాపితంగా వున్న దేశాలతో వ్యవహరించి మోడీ సిద్దాంతాలు, ఆసియా పసిఫిక్‌ దేశాలతో సానుకూల విధానంతో ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతికి ప్రధాని చేసిన కృషిని కూడా ఎంపిక కమిటీ గుర్తించింది అని కూడా ప్రకటన పేర్కొన్నది.

మోడి ఆర్ధిక విధానాలలో భాగంగా (మోడినోమిక్స్‌) పెద్ద నోట్ల రద్దు దేశానికి ఎంతటి నష్టం కలిగించిందో పదే పదే చెప్పనవసరం లేదు. నోట్ల రద్దు సమయంలో తప్ప తరువాత ఇంత వరకు ప్రతిపక్షాలు, ఆర్ధిక నిపుణులు ఎంత గగ్గోలు పెట్టినా దానివలన కలిగిన ప్రయోజనం ఏమిటో మోడీ నోరు విప్పలేదు. ఏటా రెండు కోట్ల మందికి వుద్యోగాల కల్పన అంటే దేశంలో లెక్కలు సరిగా వేయటం లేదు, అందువలన ఎన్నో కల్పించినా ఎన్ని కల్పించామో చెప్పలేకపోతున్నామంటూ తప్పించుకోవటం తెలిసిందే. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందన్న గోబెల్స్‌ను అనుసరించటం ఇప్పటి వరకు కొన్ని పార్టీలకే పరిమితం అయితే ఇప్పుడు ఆ జబ్బు విదేశాంగశాఖ అధికార గణానికి కూడా అంటుకుందనుకోవాలి.మోడీ విధానాలు మానవాళికి తోడ్పడ్డాయనటం కూడా దానిలో భాగమే. అయినా విపరీతం గాకపోతే నరేంద్రమోడీ ఆర్ధికవేత్త ఎలా అవుతారు?

ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి నివేదికల ప్రకారం గత ఐదు సంవత్సరాలలో (2014-18) 187 దేశాలలో మన దేశం 135 నుంచి 130వ స్ధానానికి చేరుకుంది. ఐదు సంవత్సరాల నరేంద్రమోడీ పాలనలో ప్రపంచబ్యాంకు ప్రకటించే సులభతరవాణిజ్య సూచికలో 142 నుంచి 77కు ఎగబాకింది. మన దేశంలో సులభంగా వాణిజ్యం చేసి దండిగా లాభాలను తరలించేందుకు ఈస్డిండియా కంపెనీ ఏకంగా దేశాన్నే ఆక్రమించి మన మీద బ్రిటీష్‌ రాణీగారి పాలన రుద్ధింది. ఇప్పుడు మనం విదేశాలన్నీ మన మార్కెట్లో సులభంగా వాణిజ్యం చేసుకొని దండిగా లాభాలు తరలించుకపోయేందుకు విదేశీ కంపెనీలను మనమే తలమీద ఎక్కించుకుంటున్నాం. దీన్ని జనం అడ్డుకోకపోతే 77ఏం ఖర్మ ఒకటో నంబరులోకి తీసుకుపోతారు. మోడీ ప్రజాపక్షమే అయితే మానవాభివృద్ది సూచిక అలా ఎగబాకటం లేదేం? పైకి పోయే కొద్దీ పోటీ తీవ్రంగా వుంటుంది. ఇదే కాలంలో చైనా మానవాభివృద్ధి సూచిక 91నుంచి 86కు పెరిగింది. ఒకవైపున ఈ కాలంలోనే మన అభివృద్ధిరేటు చైనా కంటే ఎక్కువ అని వూరూవాడా వూదరగొట్టారే. అతిపేద దేశం బంగ్లా కూడా ఈ కాలంలో తన ర్యాంకును 142 నుంచి 136కు పెంచుకుంది. తీవ్రవాదం, వేర్పాటు వాదంతో చితికిపోయిన పొరుగు దేశం శ్రీలంక మానవాభివృద్ధి సూచికలో 76దిగా వుంది. మనది గొప్ప అని చెప్పుకోవటానికి సంకోచించనవసరం లేదా ? అసమానతలను తగ్గించకుండా మిలీనియం అభివృద్ది లక్ష్యాలను సాధించలేమని, అందుకు కృషి చేస్తామని చెప్పిన దేశాలలో మనది ఒకటి. మోడీగారు తన మహత్తర ఆర్ధిక విధానాలతో దాన్ని ఎక్కడ నిలిపారు? అసమానతల సూచికలో నలభై నాలుగు దిగువ మధ్యతరగతి ఆదాయ దేశాలలో మనది 39, మన తరువాత బంగ్లాదేశ్‌ వుంది. మన కంటే ఎగువన 36 స్ధానంతో పాకిస్తాన్‌ నిలిచింది. ఎగువ మధ్యతరగతి ఆదాయం వున్న 38 దేశాలలో చైనా 27వ స్ధానంలో వుంది.

ప్రాంతీయంగా చూస్తే దక్షిణాసియా ఎనిమిది దేశాలలో వరుసగా మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్దాన్‌, పాక్‌,నేపాల్‌, భారత్‌, బంగ్లా, భూటాన్‌ వున్నాయి. అసమానతల తగ్గింపుకు కొలబద్దలుగా ఒకటి విద్య, వైద్యం, సామాజిక రక్షణ పధకాలకు చేసే ఖర్చు, రెండు, ఆదాయాన్ని బట్టి పన్ను విధింపు, మూడు, కార్మిక విధానాలు, వేతనాల వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని మూడు తరగతులుగా పరిగణించి ఇచ్చిన పాయింట్లు, రాంకులు ఎలా వున్నాయో చూద్దాం.

దేశం         ఒకటి పాయింట్లు, ర్యాంకు రెండు పాయింట్లు, ర్యాంకు మూడు పాయింట్లు, ర్యాంకు సాధారణ ర్యాంకు

మాల్దీవులు         0.222, 1          0.336, 7              0.636, 1                      1

శ్రీలంక              0.106, 3          0.604, 2              0.416 ,2                      2

ఆఫ్ఘన్‌               0.061, 7          0.455, 5             0.383, 3                      3

పాకిస్తాన్‌            0.057, 8          0.578, 3             0.241, 4                      4

నేపాల్‌              0.080, 5          0.394, 6             0.221, 5                      5

భారత్‌              0.061, 6         0.607, 1              0.107, 6                      6

బంగ్లాదేశ్‌           0.098, 4         0.464, 4               0.67, 8                       7

భూటాన్‌            0.229, 1         0.131, 8               0.80, 7                      8

మానవాభివృద్ధికి చేయాల్సిన ఖర్చులో దక్షిణాసియాలోనే మన పరిస్ధితి ఇంత అధ్వాన్నంగా వుంటే సియోల్‌ శాంతి బహుమతి కమిటీ ఎంపిక వెనుక ఏమతలబు దాగి వున్నదో కదా ! దక్షిణ కొరియా నిన్న మొన్నటి వరకు వుక్కుబూట్ల పాలనలోనే వుంది. ప్రస్తుతం పేరుకు పౌరపాలనే అయినా మిలిటరీ కనుసన్నలలోనే పని చేస్తుంది. నిత్యం వుత్తర కొరియాను రెచ్చగొడుతూ కొరియా ద్వీపకల్పంలో అశాంతిని రెచ్చగొడుతూ వుభయ కొరియాల విలీనానానికి అడ్డుపడుతున్న విషయం జగద్విదితం. అలాంటి దేశాన్ని మన నరేంద్రమోడీ తోటి ప్రజాస్వామిక వ్యవస్ధ అనీ ప్రాంతీయ, ప్రపంచ శాంతికి కృషి చేస్తున్నదని కీర్తించటం ఏమిటి? గుజరాత్‌లో 2002లో జరిగిన మారణకాండను ప్రస్తావిస్తూ నాడు అక్కడ ముఖ్యమంత్రిగా వున్న నరేంద్రమోడీకి ఈ బహుమతి ఇవ్వటం గతంలో ఈ బహుమతి పొందిన పెద్దలను అవమానించటమే అని దక్షిణ కొరియాలోని 26 స్వచ్చంద సంస్ధలు, మానవ హక్కుల బృందాలు మోడీ దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా నిరసన వ్యక్తం చేశాయి. 2002లో మోడీ వుద్ధేశ్యపూర్వకంగానే గుజరాత్‌లో ముస్లింలపై దాడులు జరగటాన్ని అనుమతించారని వెయ్యిమందికి పైగా మరణించినట్లు అవి పేర్కొన్నాయి. 2005లో పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు 2002 గుజరాత్‌ దాడుల్లో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు మరణించారని, 223 మంది అదృశ్యమయ్యారని, మరో రెండున్నరవేల మంది గాయపడ్డారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మోడీ, మరికొంత మంది పాత్రపై శిక్షార్హమైన సాక్ష్యాలేవీ లేవని 2017లో గుజరాత్‌ హైకోర్టు పేర్కొన్నది. అయితే ఆ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయగా అది ఈ ఏడాది పార్లమెంట్‌ ఎన్నికల తరువాత విచారణకు రానున్నది.

దేశంలో ఆర్ధిక అసమానతలు వేగంగా పెరుగుతున్నాయన్నది కాదనలేని సత్యం. ప్రపంచంలో ఆరవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా చెప్పుకుంటున్నాము. ఇదే సమయంలో ప్రపంచంలో ఎదుగుదల గిడసబారిపోయిన పిల్లల్లో 30.8శాతం మన దగ్గరే వున్నారని, మన పిల్లలు ప్రతి ఐదుగురిలో ఒకరు వుండాల్సినదాని కంటే బరువు తక్కువగా వున్నట్లు చెప్పుకోవటానికి సిగ్గుపడాలా వద్దా ? విద్య, వైద్యం,సామాజిక భద్రతకు మనం చాలా తక్కువ ఖర్చు చేస్తున్నామని తెలిసిందే, 2018-19 బడ్జెట్లో వీటికి చేసిన కేటాయింపు 21.6 బిలియన్‌ డాలర్లు. పోషకాహారలేమి వలన మన దేశం ఏటా నష్టపోతున్న మొత్తం 46బిలియన్‌ డాలర్లు అంటే అర్ధం ఏమిటి? నష్టాన్నయినా సహిస్తాంగానీ ఖర్చుమాత్రం పెంచం, ఏమి ఆర్ధికవిధానమిది? తిండి కలిగితే కండ కలదోయ్‌ కండకలవాడేను మనిషోయ్‌ అన్న మహాకవి గురజాడ ఈ సందర్భంగా గుర్తుకు మానరు. మంచి వయస్సులో వున్నపుడు మనదేశంలో ఒక వ్యక్తి సగటున 6.5సంవత్సరాలు పని చేస్తుండగా అదే చైనాలో 20, బ్రెజిల్‌ 16, శ్రీలంకలో 13సంవత్సరాలని, భారత్‌ 195దేశాలలో 158వ స్ధానంలో వుందని లాన్సెట్‌ పత్రిక తాజాగా ప్రకటించింది.

ఆర్ధిక అసమానతల విషయానికి వస్తే పరిస్ధితి ఆందోళనకరంగా మారుతోంది.1980లో ఎగువన వున్న పదిశాతం మంది చేతిలో 31శాతం దేశ సంపదల మీద ఆధిపత్యం వహిస్తుంటే అది 2018నాటికి 55శాతానికి పెరిగింది.దేశ జనాభాలో షెడ్యూల్డు తరగతుల జనాభా 8శాతం కాగా అతి తక్కువ సంపద కలిగిన వారిలో వారి శాతం 45.9గా వుంది. సంపద తక్కువ అంటే జీవిత కాలమూ, ఆరోగ్యమూ, విద్య అన్నీ తక్కువగానే వుంటాయి.ఈ కారణంగానే ఆరోగ్య సమస్యలతో అప్పులపాలై 2011-12 మధ్య ఐదున్నర కోట్ల మంది దారిద్య్రంలోకి వెళ్లారు. మన వంటి దేశాలలో ప్రజారోగ్యానికి జిడిపిలో ఐదుశాతం ఖర్చు చేయాల్సి వుంటుందని నిపుణులు తేల్చారు.2025నాటికి ఆ స్ధాయికి తమ ఖర్చును పెంచుతామని మన ప్రభుత్వం జాతీయ ఆరోగ్యవిధానంలో ప్రకటించింది. కానీ ఆచరణ ఎక్కడ ? ఇతర అల్పాదాయ దేశాల సగటు 1.4శాతం కాగా 2015లో మన ఖర్చు 1.02శాతం మాత్రమే. ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్‌ అన్న గురజాడ గోడు వినేదెవరు? ఐదేండ్ల నరేంద్రమోడీ పాలనా తీరు తెన్నులను గుడ్డిగా సమర్ధించేవారికి సియోల్‌ శాంతి బహుమతి మరొక భజనాంశం. విమర్శనాత్మక దృష్టితో పరిశీలించేవారికి ఒకవైపు నవ్వు మరొకవైపు చిరాకు పుట్టిస్తుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వెనెజులా సాకుతో సోషలిజంపై ట్రంప్‌ దాడి – అమెరికాలో పెద్ద చర్చ !

21 Thursday Feb 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

46th President of Venezuela, Donald Trump attack on socialism, Donald Trump on Socialism, Juan Guaidó, Nicolás Maduro, Nicolás Maduro Moros, Socialists United of Venezuela (PSUV), Venezuela

Image result for donald trump attack on socialism

ఎం కోటేశ్వరరావు

వెనెజులాలో నికొలస్‌ మదురోను అంగీకరించం, ఈ విషయంలో వెనక్కు పోయేది లేదు, ప్రజాస్వామ్యం మినహా సోషలిజాన్ని మనం అంగీకరించేదిలేదు, మిలిటరీ జోక్యంతో సహా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం, మదురో క్యూబా తొత్తు అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిప్పులు చెరుగుతూ పిడుగులు కురిపించాడని ఒక పత్రిక సోమవారం నాటి ప్రసంగాన్ని వర్ణించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో స్ధిరపడిన వెనెజులా సంతతి, వలస పౌరుల నుద్దేశించి ట్రంప్‌ మాట్లాడారు. మదురోను వదలి వేసి పార్లమెంట్‌ నేత జువాన్‌ గువైడోకు మద్దతివ్వాలని పౌరులు, మిలిటరీని కోరాడు. అక్కడ సోషలిస్టు ప్రభుత్వం వున్న కారణంగానే పదిలక్షల శాతం ద్రవ్యోల్బణం, ఆకలితాండవిస్తున్నదని, ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలున్న దేశం దారిద్య్రంలో చిక్కుకున్నదని, కొలంబియాద్వారా పంపదలచిన ఆహార సాయాన్ని మిలిటరీ అడ్డుకుంటున్నదని ఆరోపించాడు. ఫ్లోరిడాలోని మియామీ అంతర్జాతీయ విశ్వవిద్యాలయలో భార్య, కుమార్తెతో సహా పాల్గన్న సభలో మదురో ప్రభుత్వంపై బెదిరింపులు, సోషలిస్టు వ్యతిరేక చిందులు వేస్తూ వూగిపోయాడు. వెనెజులా స్వయంప్రకటిత అధ్యక్షుడు గువైడో రాజకీయ భవిష్యత్‌, సోషలిజానికి వ్యతిరేకతను ట్రంప్‌ ఫ్లోరిడా పర్యటనలో వక్కాణించాడు. సోషలిజం, కమ్యూనిజాల భయానక చర్యలను ప్రత్యక్షంగా భరించిన వారు వాటికి వ్యతిరేకంగా ధైర్యంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి మరియు ప్రతి ఒక్క రాజకీయ ఖైదీకి, వ్యతిరేకత ప్రకటించిన ప్రతి ఒక్కరికి తాము ఘన స్వాగతం పలుకుతామన్నాడు. అమెరికా యువతలో పెరుగుతున్న సోషలిస్టు భావాల వ్యాప్తిని అరికట్టేందుకు వెనెజులాను బలిచేయాలన్న కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేము.

జనవరి 23న గువైడో వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నప్పటి నుంచి చట్టబద్దంగా ఎన్నికైన అధ్యక్షుడు నికోలస్‌ మదురోను అధ్యక్షుడిగా గుర్తించేందుకు నిరాకరించటమేగాక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా చేయని ప్రయత్నం లేదు.సాయం ముసుగులో మదురో వ్యతిరేకులకు ఆయుధాలను చేరవేస్తున్న వాహనాలను కొలంబియా సరిహద్దులో వెనెజులా మిలిటరీ పట్టుకున్న విషయం తెలిసినదే. రోనాల్డ్‌ రీగన్‌ 37 సంవత్సరాల క్రితం మార్క్సిజం, లెనినిజం చరిత్ర బూడిద కుప్పలో కలసినట్లు నోరుపారవేసుకున్నాడు. ఫిబ్రవరి ఐదున అనూహ్యంగా అమెరికన్‌ పార్లమెంట్‌ వుభయసభలనుద్ధేశించి చేసిన ప్రసంగంలో వెనెజులా పరిణామాలను ప్రస్తావించి సోషలిజంపై దండెత్తి అమెరికాలో అనుమతించేది లేదన్నాడు. పదమూడు రోజుల తరువాత మరోసారి మియామీలో అదేపని చేశాడు. గత నెల రోజుల్లో అమెరికా-వెనెజులా పరిణామాలను చూసినట్లయితే ట్రంప్‌ స్వయంగా చెప్పినట్లు మిలిటరీ జోక్యానికి ఆఖరి అస్త్రంగా తగిన అవకాశం, సాకుకోసం అమెరికా చూస్తున్నది.

ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిని వినియోగించుకొని అమెరికన్లు గనుక వెనెజులాపై సైనిక చర్యకు వుపక్రమిస్తే శాశ్వత సభ్యరాజ్యాలైన చైనా, రష్యా వీటో ఆయుధాన్ని ప్రయోగిస్తాయి. మదురో ప్రభుత్వాన్ని అమెరికాతో అంటగాకే కొన్ని మినహా ఆ రెండు దేశాలతో పాటు మన దేశంతో సహా అన్నీ గుర్తించాయి. ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక పరిణామాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. రష్యన్‌ క్షిపణులు, ఎయిర్‌ క్రాఫ్ట్‌ , ఇతర ఆయుధాలను కొనుగోలు చేసి దానికి బదులుగా చౌకధరకు వెనెజులా చమురు సరఫరా చేస్తోంది. అమెరికా బెదిరింపులను సహించేది లేదంటూ రష్యాతో కలసి సైనిక విన్యాసాలు చేస్తోంది. అవసరమైతే తమ జెట్‌ బాంబర్లు, యుద్ధనావలు బాసటగా నిలుస్తాయంటూ ఇటీవలి కాలంలో తరచుగా వెనెజులా తీరాలు, విమానాశ్రయాలకు రష్యా నౌకలు, జెట్‌లు వచ్చి ఆగివెళుతున్నాయి. గత పది సంవత్సరాలలో చైనా 70బిలియన్‌ డాలర్ల మేరకు వివిధ వెనెజులా పధకాలలో పెట్టుబడులు పెట్టింది. లాటిన్‌ అమెరికాలో ప్రధాన రాజకీయ మద్దతుదారుగా క్యూబా వుంది. అమెరికా కుట్రలను ఎదుర్కోవటంలో, చిత్తు చేయటంలో ఎంతో అనుభవం గడించిన క్యూబన్లు భద్రతా, మిలిటరీ సలహాదారులను సరఫరా చేయటమే గాక తమకు అందిన సమాచారాన్ని మదురో సర్కార్‌కు అందిస్తోంది. తన వద్ద వున్న వైద్యులు, నర్సులు, ఇంజనీర్లవంటి నిపుణులను పదిహేను వేల మందిని పంపింది. దీనికి ప్రతిగా చౌకధరలకు వెనెజులా చమురు సరఫరా చేస్తోంది.

చమురు విక్రయాలను అడ్డుకొంటూ అనేక సమస్యలను సృష్టిస్తున్న అమెరికా చర్యల కారణంగా వెనెజులాలో అనేక వస్తువులకు కొరత ఏర్పడింది. దీన్ని సాకుగా చూపి సోషలిస్టు మదురో పాలన కారణంగానే ఇలాంటి పరిస్ధితి అంటూ సోషలిజానికి లంకెపెట్టి డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక పధకం ప్రకారం పెద్ద ఎత్తున సోషలిస్టు వ్యతిరేక ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. దానిలో భాగమే అమెరికా ఎన్నడూ సోషలిస్టు దేశంగా వుండబోదన్న ప్రకటనకు పార్లమెంట్‌ వుభయసభల ప్రసంగాన్ని ఎంచుకున్నాడు. అప్పటి నుంచి అమెరికా మీడియాలో సోషలిజం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సహజంగానే వక్రీకరణలు చోటు చేసుకుంటాయని వేరే చెప్పనవసరం లేదు. అమెరికా జనానికి ఇప్పటి వరకు అక్కడి మీడియా ద్వారా సోషలిజం గురించి వక్రీకరణలు, వైఫల్యం చెందినదిగానే సమాచారాన్ని మెదళ్లకు ఎక్కించారు. ఇప్పుడు సోషలిజం గురించి వివరించటానికి, పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి చెప్పేవారికి మీడియాలో కాస్తయినా చోటివ్వకతప్పటం లేదు. అందువలన యువతరంలో సోషలిజం మీద ఆసక్తిని పెంచటానికి ఇది దోహదం చేసే అవకాశం వున్నందున ఒక విధంగా సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. మారిన పరిస్ధితుల్లో అమెరికాలో పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి చర్చ మొదలు కావటం విశేషం. నిజానికి నాలుగైదు వందల సంవత్సరాల పెట్టుబడిదారీ వ్యవస్ధ చరిత్రలో ఆ వర్గానికి చెందిన వారి నోటే దాని వైఫల్యం గురించి పదే పదే వినిపిస్తోంది. ఈ పూర్వరంగంలో సోషలిజంపై ట్రంప్‌ దాడి గురించి రాసిన విశ్లేషణలకు పెట్టిన కొన్ని శీర్షికలు ఇలా వున్నాయి.’ సోషలిజంపై ట్రంప్‌ దాడి పెట్టుబడిదారీ విధానానికి సాయపడదు : చికాగో ట్రిబ్యూన్‌ ‘ ‘ భయ పడాలనా? భయపడవద్దనా-డెమోక్రాట్‌ గజెట్‌’ ‘

చికాగో ట్రిబ్యూన్‌ విశ్లేషణలో కొన్ని అంశాల సారాంశం ఇలా వుంది. అమెరికాలో సోషలిజానికి ఎన్నడూ ఆదరణ లేదు, ఇరవయ్యవ శతాబ్దంలో పశ్చిమ దేశాలలో సోషలిస్టు పార్టీలు గణనీయమైన ఆదరణ పొందాయి, ఇక్కడ కొద్ది మందికే పరిమితమైంది.1932లో మహా మాంద్యం సమయంలో సోషలిస్టు పార్టీ అధ్యక్ష అభ్యర్ధి ఇక్కడ కేవలం రెండుశాతం ఓట్లు మాత్రమే పొందారు. అయితే ఆలశ్యంగా అవకాశాలు మెరుగయ్యాయి.2016లో డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి ఎన్నికలలో బెర్నీశాండర్స్‌ 13 రాష్ట్రాలు, బృందాలలో మద్దతు సంపాదించారు.గతేడాది అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఇద్దరూ సోషలిస్టులమనే ముద్రను గర్వంగా తగిలించుకున్నారు.ఇప్పుడు అధ్య క్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనే ప్రముఖ రాజకీయవేత్తను ంచి సోషలిస్టులు ఒక శక్తిని పొందారు. ‘ మన దేశం సోషలిజాన్ని అనుసరించాలనే కొత్త పిలుపులు మనల్ని మేలుకొల్పాయి. అమెరికా ఎన్నడూ సోషలిస్టు దేశంగా వుండదని ఈ రాత్రి మన సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నా ‘ అని ట్రంప్‌ చెప్పారు. ఇంతకంటే మెరుగ్గా పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు అవసరం. సోషలిజంపై దాడి చేయటం ద్వారా ఓటర్లలో ప్రత్యేకించి యువ ఓటర్లలో ట్రంప్‌ చిన్నబోయారు. వామపక్షానికి పెద్ద బహుమతి ఇది, పెట్టుబడిదారీ విధాన అభిమానులకు సంకట స్ధితి కలిగించుతుంది. డెమోక్రాట్లు వుదారవాదులుగా మారటానికి వారేమీ కారల్‌ మార్క్స్‌తోవలో నడవటం లేదు. వారిలో కొందరికి ఆర్ధికాంశాల గ్రహణ శక్తి పట్టుతప్పింది, దాని ఇబ్బంది కలిగించే వాస్తవాలు జుగుప్స కలిగించటం ఒక పాక్షిక కారణం. స్వేచ్చామార్కెట్‌ను సమర్ధించే ఆ పార్టీ నేతలు కొన్ని సామాజిసమస్యలను పరిష్కరించలేకపోవటం కూడా ఒక కారణం. ఆచరణాత్మక పరిష్కారాలకు సిద్ధపడకుండా మితవాదులు మరింత కఠినమైన భావజాలానికి కట్టుబడి వుండటం కూడా పాక్షికంగా అందుకు తోడ్పడింది. బరాక్‌ ఒబామా ప్రతిపాదించిన ఆరోగ్య సంరక్షణ పధకానికి ఒక రిపబ్లికన్‌ కూడా ఓటువేయలేదు, అదొక సోషలిస్టు చర్యగా చూశారు.

భయపడాలనా ? భయపడకూడదనా అనే శీర్షికతో డెమోక్రాట్‌ గజెట్‌ వ్యాఖ్యను మంచి మనుషులు లేదా మంచి భావజాలం మీద బురద చల్లటానికి ప్రత్యేకించి ముద్రలు వేస్తారు, వాటిని తాను ద్వేషిస్తానంటూ రచయిత దానిని ప్రారంభించాడు. ఈ రోజు అమెరికా రాజకీయాల్లో కొంత మంది డెమోక్రాట్లు అవలంభించిన దాని ముద్ర సోషలిజం. వుదారవాదులను చూసి మితవాదులు భయపడేందుకు అదే పదాన్ని రిపబ్లికన్‌ పార్టీ వుపయోగిస్తోందని చెబుతూ మధ్యలో సోషలిజం, కమ్యూనిజం గురించి తన అభిప్రాయాలను వెల్లడించిన తరువాత ముగింపులో చెప్పిన అంశాలు అమెరికా సమాజంలో జరుగుతున్న సోషలిజం-పెట్టుబడిదారీ విధానాల మంచి చెడ్డల మధన పూర్వరంగంలో ఎంతో ముఖ్యమైనవి.వివిధ సర్వేలు తేల్చిన సారం ఏమంటే ఈ భూమ్మీద సంతోషంగా వున్న జనం నివశిస్తున్న దేశాలు ఏవంటే సోషలిస్టు ప్రజాస్వామిక వ్యవస్ధలు కలిగినవే. కొన్ని ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమాలు నాణ్యమైన జీవితానికి అవసరమైన లబ్దికి హామీ ఇచ్చేవి, అంటే అందుబాటులో ఆరోగ్య రక్షణ, వ్యక్తిగతంగా తగినంత సెలవు దొరకటం, అందుబాటులో గృహవసతి, స్వచ్చమైన పర్యావరణం వంటివి. అయితే ప్రజాప్రాతినిధ్య ప్రజాస్వామిక వ్యవస్ధలలో కోరుకున్నంత వ్యక్తిగత ఆస్ధి లేదా సంపదలను ఎంచుకోవటానికి స్వేచ్చ వుంటుంది. ఈ దేశాలు మౌలికంగా పెట్టుబడిదారీ విధానం మరియు సోషలిజంతో మిళితమై ఎంతో ప్రభావంతంగా మరియు ఆకర్షణీయంగా వుంటాయి. మనం సోషలిజం గురించి భయపడనవసరం లేదు. దాని కొన్ని సంకల్పాలతో మానవాళి లబ్ది పొందిందని మనసారా మనం గుర్తించాలి. ఆ తరువాత ఆ భావజాలాన్ని మన స్వంత దేశంలో వృద్ధి పొందించటానికి మనం పూనుకోవాలి.

Image result for a big debate on socialism in US

న్యూయార్క్‌టైమ్స్‌, లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్టు వంటి బడా కార్పొరేట్ల పత్రికలు ఈ చర్చను విస్మరించలేకపోయాయి. స్ధలాభావం రీత్యా అన్నింటి సారం అందించటం సాధ్యం కాదు. గత కొద్ది సంవత్సరాలుగా అమెరికాలో జరుగుతున్న సోషలిస్టు మధనం గురించి శత్రువులు ముందే గ్రహించారు. ప్రపంచమంతటా కారల్‌మార్క్సు 200వ జయంతిని జరుపుకుంటున్న సమయంలో ఆయన భావజాలాన్ని అరికట్టే బాధ్యతను తలకెత్తుకున్నామని చెప్పుకొనే అమెరికా సర్కార్‌ 2018 అక్టోబరు 23న సోషలిజం ఎంత ఖర్చుతో కూడుకున్నదో వివరిస్తూ ఒక పెద్ద పత్రాన్ని విడుదల చేసింది. అమెరికా గనుక సోషలిస్టు విధానాలను అమలు జరిపితే భవిష్యత్‌లో సంభవించబోయే నష్టాలను దానిలో ప్రస్తావించారంటే సోషలిజాన్ని కోరుకుంటున్న యువతను సూటిగా వ్యతిరేకించకుండా మరోమార్గంలో వారి మెదళ్లను చెడగొట్టే ప్రయత్నం తప్ప వేరు కాదు. వెనెజులాలో ప్రస్తుతం అధికారంలో వున్న వామపక్ష శక్తులు తప్ప అక్కడ అమలు జరుపుతున్నది కొన్ని సంక్షేమ పధకాలతో కూడిన ప్రజాపాలన తప్ప శాస్త్రీయ సోషలిస్టు సమాజ నిర్మాణం కాదు. అలాగే ఐరోపాలో నోర్డిక్‌ దేశాలుగా వున్న డెన్మార్క్‌, స్వీడన్‌, ఫిన్లండ్‌, ఐస్‌లాండ్‌, నార్వేలలో వున్న మెరుగైన సంక్షేమ పధకాలను చూపి నిజమైన సోషలిస్టు దేశాలుగా చిత్రిస్తూ ఆ పత్రంలో చర్చించారు. వెనెజులా సోషలిస్టు పధకాలను అమెరికాలో అమలు జరిపితే దీర్ఘకాలంలో కనీసం 40శాతం జిడిపి తగ్గిపోతుందని ఆ పత్రంలో పేర్కొన్నారు.నోర్డిక్‌ దేశాల విధానాలను అనుసరిస్తే అమెరికాలో జిడిపి కనీసం 19శాతం తగ్గిపోతుందని ఏడాదికి రెండు నుంచి ఐదువేల డాలర్లు అదనంగా పన్ను విధించాల్సి వుంటుందని, అమెరికాతో పోల్చితే ఈ దేశాల్లో జీవన ప్రమాణాలు పదిహేనుశాతం తక్కువగా వున్నాయని పేర్కొన్నారు. అమెరికాలోని సోషలిస్టులు కోరుతున్న విధంగా ఆరోగ్యఖర్చునున నోర్డిక్‌ దేశాలలో మాదిరి పూర్తిగా ప్రభుత్వమే భరిస్తే 2022నాటికి జిడిపి తొమ్మిదిశాతం తగ్గిపోతుందని పేర్కొన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపటం ఎలా సాధ్యం కాదో వక్రీకరణలతో సోషలిజం గురించి తెలుసుకోకుండా జనాన్ని నివారించటం కూడా అంతే !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తెలంగాణా రైతు బంధు లబ్దిదార్లపై 144 సెక్షన్‌ ఎందుకు ?

14 Thursday Feb 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

farmers fate, Fertilizers subsidies, KCR, kisan samman, KTR, rythu bandhu beneficiaries, TRS government

Image result for why trs government imposed 144 section on rythu bandhu beneficiaries

ఎం కోటేశ్వరరావు

తెలంగాణా ‘రైతు బంధు ‘ సర్కార్‌ నిజామాబాద్‌ జిల్లాలో 13 మండలాల్లో రైతులు గుమి కూడకుండా 144వ సెక్షన్‌ విధించింది. పడిపోతున్న పసుపు, ఎర్రజొన్నల ధరలతో ఆందోళన చెందిన రైతన్నలు గత వారం రోజులుగా ఆందోళన హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోలేదు. ఏడవతేదీ ఒక రోజు ఆందోళన చేసి 11వ తేదీలోగా పంటలకు గిట్టుబాటు ధరలకు చర్యలు తీసుకోకపోతే పన్నెండున ఆందోళన చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం కదిలింది, ఎలా? ధరలకు హామీ ఇచ్చికాదు, పోలీసు శాఖ ద్వారా 144వ సెక్షన్‌, ముఖ్యనాయకులు అనుకున్నవారిని అరెస్టులు చేయించింది. అయినా రైతులు పెద్ద సంఖ్యలో ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి చౌరాస్తాలో ధర్నా చేశారు. వారంతా రైతు బంధు పధకం కింద ఎకరానికి నాలుగు వేలు తీసుకున్నవారే, అందుకు కృతజ్ఞతగా టిఆర్‌ఎస్‌కు ఓటు వేసిన వారే. ముఖ్య మంత్రి సచివాలయానికి రాకపోతే ఏమైతది అని కెసిఆర్‌ ప్రశ్నిస్తే అవును నిజమే ఏమైతది,ఏం కాలేదు రానవసరం లేదంటూ ఆయనకు మద్దతుగా గుండుగుత్తగా ఓట్లు వేసిన వారే. అసెంబ్లీ ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటింది, అయినా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోతే ఏమైతది అని ఇంకా అదే కెసిఆర్‌ అనలేదు గానీ ఒక వేళ అన్నా నిజమే ఏమైతది అని మద్దతు ఇవ్వటానికి సిద్దంగా వున్నవారే వారంతా. నిజామాబాద్‌ ఎంపీ కవితక్క వారి దగ్గరకు రాలే, ప్రతి వారి దగ్గరకు వెళ్లి నే వున్నా, మీ వాడినే అని చెబుతున్న తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఆ వైపు చూడలే. ఎంఎల్‌ఏలంతా తమకు అత్యవసరమైన, దరొక్కపోతే ప్రాణాలు పోయే మంత్రిపదవులు ఇతర అవసరాల కోసం తిరగటానికే ఖాళీ లేకపోవటంతో రైతుల గురించి పట్టించుకోలా. అయితే ఎవరూ పట్టించుకోనపుడు మనం చూస్తూ వూరుకోకూడదు కదా అని పోలీసులు 144వ సెక్షన్‌ ప్రయోగించి, కొందరిని అదుపు లేదా అరెస్టు చేసి తమకు చేతనైన సాయం చేశారు. దిక్కులేక, దరితోచక రైతులు ఆంక్షలను ధిక్కరించి రోడ్డెక్కారు.పదహారవ తేదీలోగా ధరల సంగతి చూడకపోతే తిరిగి ఆందోళన చేస్తామని ప్రకటించారు. రైతు బంధువు ఎలా స్పందిస్తారో !

రైతు బంధుపేరుతో కెసిఆర్‌ ఎకరానికి నాలుగు లేక ఐదు వేలు ఇస్తేనో, కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఐదెకరాలలోపు రైతులకు నరేంద్రమోడీ ఆరువేలు ఇస్తేనో దేశంలో రైతాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షోభం పరిష్కారం కాదని నిజామాబాద్‌ రైతాంగ ఆందోళన వెల్లడిస్తోంది. ఇవాళ నిజామాబాద్‌ పసుపు రైతులైతే రేపు గుంటూరు జిల్లా దుగ్గిరాల, కడప పసుపు రైతులు కావచ్చు. రైతు బంధు లేదా కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఇచ్చే సాయాన్ని తప్పు పట్టనవసరం లేదు. నిర్దాక్షిణ్యంగా బలి ఇవ్వబోయే ముందు పశువులకు పూజలు చేసి అలంకరణలు చేయటం తెలిసిందే. ఈ బంధులు, సమ్మాన్‌లు కూడా అలాంటివే అని నమ్మేవారి నమ్మకాన్ని, అనుభవాన్ని కూడా కొట్టిపారవేయలేము. మార్కెటింగ్‌తో సహా వ్యవసాయరంగాన్ని తమకు పూర్తిగా అప్పగించి, ప్రత్యక్ష సాయం పేరుతో నాలుగు రూకలు వెదజల్లి రంగం నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలని ప్రయివేటు వాణిజ్య బకాసురులు ఎప్పటి నుంచో మనదేశం మీద వత్తిడి తెస్తున్నారు. నయా వుదారవాద విధానాలు లేదా సంస్కరణలు, నూతన ఆర్ధిక విధానాల వంటి ముద్దు పేర్లతో పిలుస్తున్న విధానాల సారం ఏమంటే సరిహద్దులు, మిలిటరీ, కరెన్సీ, పోలీసు, న్యాయవ్యవస్ధ వంటివి మినహా మిగిలిన అన్ని అంశాలను మార్కెట్‌ శక్తులకు అంటే పెట్టుబడిదారులు, పెట్టుబడిదారీ పద్దతుల్లో వ్యవసాయం చేసే వారికి అప్పగిస్తే అభివృద్ధి ఫలాలు కిందికి వూటమాదిరి దిగుతాయి. అన్నింటినీ తెల్లవారేసరికి అమలు జరపటం సాధ్యం కాదు గనుక ముందు వున్న వ్యవస్ధల లోపాలను చూపి కించపరచటం, పనికిరానివిగా చిత్రించటం, తరువాత వాటిని క్రమంగా కూల్చివేయటం.

స్వయం సమృద్ధి అన్నది స్వాతంత్య్ర వుద్యమ లక్ష్యం. అందుకే తొలి రోజుల్లో జై జవాన్‌ జైకిసాన్‌ పేరుతో హరిత విప్లవానికి శ్రీ కారం చుట్టి ఒక మేరకు జయప్రదం అయ్యాం. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులను అందుబాటులోకి తెచ్చేందుకు విస్తరణ సేవలు, దిగుబడులను పెంచేందుకు సంకర విత్తనాలు, రసాయనికి ఎరువులు, పురుగుమందుల వినియోగం వంటిని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. రైతుల వద్ద తగిన పెట్టుబడులు లేని కారణంగా సబ్సిడీలను అందచేశారు. నయా వుదారవాద విధానాల బాట పట్టగానే సబ్సిడీలు ఇవ్వటం అంటే సోమరితనాన్ని ప్రోత్సహించటమే అని, లక్షిత ప్రయోజనాలకు బదులు ఇతర వాటికి వినియోగిస్తున్నారంటూ తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించి ఇప్పటికీ పెద్దఎత్తున కొనసాగిస్తున్నారు. దుర్వినియోగం, సద్వినియోగం అన్నది ఎప్పుడూ వుంటాయి. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకొనే చర్యలను ఎవరూ తప్పు పట్టటం లేదు. ఇంట్లో ఎలుకలున్నాయని ఎవరైనా ఇంటికే నిప్పుపెట్టుకుంటారా?

వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీలు రైతాంగ జేబులు నింపేవి మాత్రమే అని ఎవరైనా అనుకుంటే అది తెలియని తనమే. అవి మొత్తం సమాజానికి ఇచ్చే రాయితీలు. వుదాహరణకు కాలువల ద్వారా , విద్యుత్‌ మోటార్ల ద్వారా వరిసాగు ఖర్చును పోల్చుకుంటే రెండవది రైతులకు గిట్టుబాటు కాదు. తాము పెట్టిన ఖర్చుకు అనుగుణంగా ఎక్కువ ధరకు అమ్ముతామంటే కొనే వారు వుండరు. అందువలన ప్రభుత్వాలు విద్యుత్‌ రాయితీ ఇస్తున్నాయి. అది రైతులకు మాత్రమే ఇస్తున్నట్లా లేక ఆ పొలాల్లో పని చేసే కార్మికులకు, బియ్యాన్ని ఆహారంగా వాడే అందరికీ ఇస్తున్నట్లా ? మొత్తం నీటి వనరులను పూర్తిగా వినియోగంలోకి తెచ్చి జనాభా అవసరాలకు సరిపడా పంటలను పండించే విధానాలను అనుసరిస్తే విద్యుత్‌తో వరిసాగు చేసే అవసరం వుండదు, రాయితీలతో పని లేదు. నీరు లేని చోట మరొక పంటను ప్రోత్సహించి రైతులకు గిట్టుబాటు కలిగిస్తే వారిలో అసంతృప్తి వుండదు.

Image result for nizamabad farmers agitation

నయా విధానాలు రైతాంగానికి గిట్టుబాటుగా లేవు, అందుకే వారు పదే పదే రుణగ్రస్తులౌతున్నారు. ఒకవైపు వారికి రుణమాఫీలు చేస్తాం, సాగు చేసినా చేయకపోయినా భూయజమానులకు నేరుగా వ్యవసాయ ఖర్చుల సాయం పేరుతో నేరుగా నగదు అందిస్తాం అని పార్టీలు వాగ్దానాలు చేస్తున్నాయి, పరిమితంగా అయినా కొన్ని రాష్ట్రాలలో అమలు జరుపుతున్నాయి. సబ్సిడీలు దుర్వినియోగం అవుతున్నాయని ప్రచారం చేసే వారు వీటిని వ్యతిరేకించకపోగా మద్దతు ఇస్తున్నారు. ఇవి దుర్వినియోగం అయ్యే అవకాశం లేదా ? తెలంగాణాలో వాస్తవంగా సాగు చేస్తున్న కౌలుదార్లకు మొండిచేయి చూపి, వ్యవసాయం చేయని భూ యజమానులకు నగదు ఇవ్వటం ఏమిటన్న విమర్శలు వచ్చాయి కదా ! ఆ లోపాన్ని సవరించాలి తప్ప ఆ పేరుతో సాయాన్ని వ్యతిరేకించనవసరం లేదు. రాబోయే రోజుల్లో ఈసాయాన్ని సాకుగా చూపి పంటలకు గిట్టుబాటు ధరల ప్రకటన, మార్కెట్‌ మాయాజాలం నుంచి రక్షణ చర్యలకు ప్రభుత్వాలు మంగళం పలుకుతాయని కొందరు చెబుతున్నదానిని కొట్టి పారవేయగలమా, నిప్పులేనిదే పొగ వస్తుందా ?

Image result for nizamabad farmers agitation

రైతాంగానికి వ్యవసాయం ఎందుకు గిట్టుబాటు కావటం లేదు అంటే సాగు పెట్టుబడులు పెరగటం, తగిన ఆదాయం లేకపోవటం తప్ప మరొకటి కాదు. ఒకవైపు అమెరికా వంటి ధనిక దేశాలు ప్రపంచ వాణిజ్య నిబంధనల పరిమితులకు మించి మన రైతాంగానికి సబ్సిడీలు ఇస్తున్నారంటూ దాడి చేస్తున్నాయి. మరోవైపు మన దేశంలోనే కొంత మంది పెద్దలు ఇప్పటికే మనం ఆహార ధాన్యాలు, పత్తి వంటి పంటల విషయంలో మిగులు సాధించి ఎగుమతులు చేసే దశకు చేరుకున్నాం గనుక వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వనవసరం లేదు, ఎఫ్‌సిఐ, సిసిఐ, మార్క్‌ఫెడ్‌ వంటి ప్రభుత్వ సంస్ధల అవసరం ఇంకేమాత్రం లేదని చెబుతున్నారు. అమెరికా వంటిదేశాలు తమ కార్పొరేట్‌ బకాసురుల కోసం మన వ్యవసాయ మార్కెట్‌ను చేజిక్కించుకొనేందుకు వత్తిడి తెస్తుంటే, మన మేథావులు కొందరు వారి ఏజంట్లుగా రంగంలోకి దిగితే మరికొందరిలో సమగ్రదృష్టి లోపించి వారికి తెలియకుండానే అవే వాదనలను బుర్రలకు ఎక్కించుకుంటున్నారు. మన దేశంలో ఆహార ధాన్యాల వుత్పత్తి గణనీయంగా పెరిగిన మాట నిజం, అయితే అది దేశ అవసరాలకు అనుగుణంగా పెరిగిందా అంటే లేదు. ఒక వైపు మన దేశం 2018 ఆకలి సూచికలో 119 దేశాల జాబితాలో 103వ స్ధానంలో, ఆక్స్‌ఫామ్‌ ఆహార లభ్యత 125 దేశాల సూచికలో 97వ స్ధానంలో వున్నాం అని చెబుతుండగా మనం ఆహారాన్ని ఎగుమతి చేస్తున్నామంటే మన దగ్గర కొనుగోలు చేయలేక కడుపు మాడ్చుకుంటున్నవారు గణనీయంగా వున్నారన్నది చేదు నిజం. అందుకే పోషకాహార లేమి, రక్తహీనతతో బాధపడుతున్నవారు, వాటితో వచ్చే జబ్బులతో జేబు గుల్ల చేసుకుంటున్నవారు గణనీయంగా వుంటున్నారు. భరించలేని వైద్య ఖర్చు కూడా రైతాంగాన్ని రుణవూబిలోకి దించే అంశాలలో ఒకటిగా వుందని తెలిసిందే.

మన సినిమా హీరోలు కంటి చూపుతో కాల్చి చంపుతుంటే, నరేంద్రమోడీ సర్కార్‌ అంకెలతో జనాన్ని పిచ్చివాళ్లను చేస్తోంది. దేన్ని గురించి ప్రశ్నించినా మన దగ్గర అంకెలు సరైనవి కాదు అంటోంది. దాన్ని పక్కన పెడదాం వున్న అంకెల సమాచారం ప్రకారం 1903-08 సంవత్సరాల మధ్య బ్రిటీష్‌వారి పాలనలో మన తలసరి ఆహార ధాన్యాల లభ్యత 177.3కిలోలు. నూతన అర్దిక విధానాలు లేదా సంస్కరణలు ప్రారంభమైన 1991లో 186.2కిలోలు వుండగా పాతిక సంవత్సరాల తరువాత 2016లో 177.7కిలోలుగా వుంది. మనది ప్రజాస్వామ్యం కనుక కమ్యూనిస్టు చైనాతో పోల్చవద్దని కొందరు చెబుతుంటారు. అక్కడ 2015లో తలసరి లభ్యత 450, మన కంటే దరిద్రం తాండవించే బంగ్లాదేశ్‌లో 200, అమెరికాలో 1,100కిలోలు వుంది. ప్రజాస్వామ్యం అంటే జనాన్ని కడుపు మాడ్చటమా ? ఈ పరిస్దితుల్లో మన వుత్పత్తిని ఇంకా పెంచాలంటే ప్రభుత్వ ప్రోత్సహకాలు లేకుండా సాధ్యమా ?

మన ఆహార వుత్పత్తి పెరగటానికి దోహదం చేసిన వాటిలో రసాయన ఎరువుల వినియోగం ఒక ముఖ్యపాత్రపోషించింది. రైతులకు తగినంత ఆదాయం లేదు కనుక ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి. సంస్కరణల పేరుతో అమలు జరుపుతున్న నయా వుదారవాద విధానాలు వాటికి మంగళం పాడమని వత్తిడి చేసి విజయం సాధించాయి. పోషకాల ప్రాతిపదికన(ఎన్‌బిఎస్‌) సబ్సిడీ విధానం మరొక పేరు ఏదైనా పెట్టనివ్వండి, ఒక్క యూరియా మినహా మిగిలిన అన్ని మిశ్రమ, ఇతర రకాల ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేశారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సమాచారం ప్రకారం 2017 నవంబరు నుంచి 2018నవంబరు మధ్యకాలంలో మనం దిగుమతి చేసుకొనే యూరియా, డిఏపి, ఎంఓపి, ఫాస్పారిక్‌ యాసిడ్‌, రాక్‌ ఫాస్ఫేట్‌, అమోనియా, సల్పర్‌లలో మొదటి ఐదు రకాల ధరలు సగటున 21.47శాతం పెరిగాయి. చివరి రెండింటి ధర 8.51శాతం తగ్గింది. అంటే ఒక కిలో ధర వంద రూపాయలు అనుకుంటే ఏడు కిలోల ఎరువులు కొంటే ఏడాది కాలంలో ఐదింటికి అదనంగా చెల్లించింది రు.107 .35, రెండింటికి తగ్గిన ధర రు 17.02 నికరంగా రైతుమీద పడిన భారం 90రూపాయలకు పైమాటే. 2010-11లో డిఏపి క్వింటాలు ధర రు.1075, ఎంఓపి రు.505రులు వుండగా, మరుసటి ఏడాదికి అవి రు.1775, రు.1036కు పెరిగాయి.2018 నవంబరులో గరిష్ట ధరలు రు.2,862, రు.1799గా వున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే 2011-12 నుంచి 2016-17 మధ్యకాలంలో ఎరువుల సబ్సిడీ రు.74570 కోట్లనుంచి 70100 కోట్లకు తగ్గాయి. ఆరు సంవత్సరాల సగటు రు.73,024 కోట్లు అంటే ధరల పెరుగుదలతో నిమిత్తం లేకుండా సబ్సిడీ మొత్తం స్ధిరంగా వుందంటే పెరుగుతున్న ధరల భారాన్ని రైతాంగమే మోస్తోంది. ఈ కాలంలో రూపాయి విలువ పతనమై అదనపు భారాన్ని మోపింది. ఇది యుపిఏ మన్మోహన్‌ సింగ్‌-బిజెపి మోడీ పాలనా కాలం.పాలకులు మారినా సబ్సిడీ మొత్తం మారలేదు.

2002ా03 నుంచి 2008ా09 నాటికి ఎరువుల మీద ఇచ్చిన సబ్సిడీల మొత్తం జిడిపిలో 0.48 నుంచి 1.51శాతానికి పెరిగాయి. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ 2018ా19నాటికి 0.43శాతానికి తగ్గింది. రైతులకు ఎంతో మేలు చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ హయాంలో 2014ా15లో 0.62శాతం వుండగా అది 0.43శాతానికి పడిపోయింది.నరేంద్రమోడీ సర్కార్‌ ఐదేండ్ల లోపు రైతాంగానికి ఏడాదికి ఆరువేల రూపాయలు, చంద్రబాబు నాయుడు దానికి మరో నాలుగువేలు కలిపి పదివేలు చెల్లించేందుకు నిర్ణయించటం తాజా వార్త. ఈ విధంగా సబ్సిడీలను తగ్గిస్తూ రైతుల మీద భారాలు మోపుతుంటే సాగు సాగేదెట్లా ? గత్యంతరం లేని రైతాంగం రోడ్డెక్కకుండా ఎలా వుంటుంది?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తాత్కాలిక బడ్జెట్‌ -ఓట్లకోసం నరేంద్రమోడీ వేసిన వల !

13 Wednesday Feb 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Pensioners, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Direct Benefit Transfer (DBT), India Interim budget 2019-20, India's first budget, kisan samman, Narendra Modi, subsidies

Image result for india Interim budget 2019-20 cartoons

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర భారత చరిత్రలో ఎవరు అంగీకరించినా లేకున్నా నరేంద్రమోడీ తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నారని చెప్పక తప్పదు. ప్రపంచంలో ప్రజలెన్నుకున్న ఏ ప్రధానీ లేదా అధ్యక్షుడు ఒక్కసారంటే ఒక్కసారి కూడా విలేకర్లకు ప్రశ్నించే అవకాశం వుండే మీడియా గోష్టిలో మాట్లాడకుండా పదవీ కాలాన్ని ముగించినట్లు ఇంతవరకు వినలేదు. అలాంటి అసాధారణ రికార్డును మోడీ నెలకొల్పబోతున్నారు. మంచోడు మంచోడు అనుకుంటే మంచమంతా ఖరాబు చేశాడన్న సామెత మాదిరి తొలి రోజుల్లో ఎందరో అభిమానించిన మోడీ వున్న వ్యవస్ధలను మెరుగుపరచకపోగా అన్ని వ్యవస్ధలను దెబ్బతీశారనే విమర్శలకు గురయ్యారు. వాటిలో తాజాది కేంద్ర బడ్జెట్‌. సాంప్రదాయాలు, ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్దంగా తాత్కాలిక బడ్జెట్‌ ప్రసంగంలో వెనుకటి తేదీ నుంచి అమలులోకి వచ్చే పధకాల ప్రకటన. రాజకీయాలతో నిమిత్తం లేని వారికి ఇది కాస్త ఇబ్బందిగా వుంది. మోడీ రాజకీయ వ్యతిరేకులకు ఇది విమర్శనాస్త్రమైతే అనుకూల రాజకీయులకు ఇది ప్రతిపక్షాలపై బ్రహ్మాస్త్రంలా కనిపించటం సహజం. మొత్తంగా మీడియాలో వచ్చిన శీర్షిలు, వ్యాఖ్యల సారాంశం ఏమంటే అది ఎన్నికలను దృష్టిలో వుంచుకొని రూపొందించింది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టి చర్చలేమీ లేకుండానే పదకొండవ తేదీన బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

ప్రపంచ బడ్జెట్‌ చరిత్రలో ముఖ్యంగా ప్రజలెన్నుకున్న పాలకుల ఏలుబడిలో పదవీకాలం ముగిసే సమయానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వస్తే తాత్కాలిక ఏర్పాట్లను వుపయోగించుకుంటారు.ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చే వరకు రెండు నెలల కాలానికి అవసరమైన ఖర్చుల కోసం ఖజానా నుంచి డబ్బుతీసుకొనేందుకు అనుమతి తీసుకోవటాన్నే ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ అంటారు. ఎన్నికల్లో అంతకు ముందు పార్టీయే గెలిచినా లేదా కొత్త పార్టీ వచ్చినా తన విధానాలకు అనుగుణుంగా బడ్జెట్‌ రూపకల్పన చేసేందుకు వీలు కల్పించటం ఒక మంచి సాంప్రదాయం. మాకు అలాంటి సత్సాంప్రదాయలేమీ పట్టవు, బడ్జెట్‌ను ఫలానా విధంగా పెట్టాలనే నిబంధనలేమైనా వున్నాయా అని అడ్డగోలు వాదనకు దిగితే సమాధానం లేదు.

ఈ సాంప్రదాయానికి తిలోదకాలిచ్చి నరేంద్రమోడీ సర్కార్‌ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి చెడు సాంప్రదాయానికి తెరలేపింది. మూజువాణి ఓటుతో ఆమోదించి ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలను రాబోయే ప్రభుత్వం తిరగదోడవచ్చు లేదా పూర్తిబడ్జెట్‌గా ఆమోదించాల్సి వుంటుంది. దీని మంచి చెడ్డల గురించి చెప్పుకోబోయే ముందు అసలు బడ్జెట్‌ గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. బడ్జెట్‌ అనే మాట పాత ఫ్రెంచి వాడుక బౌగెట్టి నుంచి వచ్చింది. దాని అర్ధం చిన్న సంచి లేదా పర్సు. అయితే ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో పదహారవశతాబ్దిలో వాడుకనుబట్టి పండితులు చెప్పినదాని ప్రకారం ఒకరి దగ్గర వున్న సంచి లేదా పర్సును తెరవటం అంటే ఒక రహస్యం లేదా సందేహపూరితమైనది కూడా కావచ్చు. బడ్జెట్‌ అంటే మన వ్యాపార, వాణిజ్యవేత్తలు మనజనంలో బడ్జెట్‌ రాక ముందే కొనండి అంటూ ప్రచారం చేసినదాని ప్రకారం వివిధ వస్తువుల మీద పన్నుల పెంపు లేదా తగ్గింపు వ్యవహారం.నిజానికి బడ్జెట్‌ అంటే ప్రభుత్వ వార్షిక రాబడి, ఖర్చుల ప్రకటన. బ్రిటన్‌లో 1734 జరగాల్సిన ఎన్నికలలో లబ్ది పొందేందుకు భూమిశిస్తుగా వసూలు చేస్తున్న మొత్తంలో ఒక పౌండుకు ఒక షిల్లింగ్‌ (అంటే పౌండులో 20వ వంతు) తగ్గించి భూస్వాముల మద్దతు పొందాలని ప్రతిపాదించాడు. అందుకు గాను ముందుగానే వుప్పు మీద పన్ను విధించాడు. భూస్వాములకు ఇచ్చే రాయితీల మొత్తానికి వుప్పు పన్ను చాలదని తేలటంతో 1733లో ప్రధాన మంత్రిగా వున్న రాబర్ట్‌ వాల్‌పోల్‌ మద్యం, పొగాకు మీద కొత్తగా పన్నులు వేయాలని ప్రతిపాదించాడు. ఆ వివరాలను ఒక కరపత్రంగా ప్రచురించి సమర్ధించుకున్నాడు. అయితే ఆ ప్రకటనకు ముందుగానే వాల్‌పోల్‌ కొత్త పన్నులు వేయనున్నారనే వూహాగానాలు వచ్చి వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అధికారికంగా ప్రకటించిన తరువాత వాటిని వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యుడొకరు బడ్జెట్‌ బహిర్గతమైంది లేదా ఒక కరపత్రానికి సమాధానం పేరుతో మరొక కరపత్రాన్ని రాసి వాల్‌పోల్‌ ప్రతిపాదనలను ఖండించాడు. జనంలో ఎప్పటి నుంచో నానుతున్న ఒక పెద్ద రహస్యం బహిర్గతమైంది, పాత పన్నులనే కొత్త రూపంలో వసూలు చేయటం తప్ప మరేమీ కాదన్నది దాని సారం. దేశంలో తీవ్ర వ్యతిరేకత రావటంతో కొత్త పన్నుల ప్రతిపాదనను వాల్‌పోల్‌ వుపసంహరించుకున్నాడు. తరువాత 1764లో నాటి మంత్రి బడ్జెట్‌ పదాన్ని వుపయోగిస్తూ రెండు గంటలనలభై అయిదు నిమిషాల సేపు ప్రసంగించి దేశ ఆర్ధిక పరిస్దితిని వివరించి వలస దేశాలపై పన్నులతో సహా అనేక ప్రతిపాదనలు చేశాడు. దాన్ని తొలి బడ్జెట్‌గా కొందరు పరిగణిస్తున్నారు.

మనం బ్రిటీష్‌ వారి వలస దేశంగా వున్నాం కనుక మన దేశ తొలి బడ్జెట్‌ను 1860 ఏప్రిల్‌ ఏడున ఈస్టిండియా కంపెనీ తొలిసారిగా బడ్జెట్‌ను జేమ్స్‌ విల్సన్‌ ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌లోనే ఎందుకు ప్రవేశపెట్టారు అంటే బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం వూపందుకోక ముందు భూమి మీద వచ్చేదే ప్రధాన మైన ఆదాయం. అది ఏప్రిల్‌ నాటికి ఒక స్పష్టమౌతుంది కనుక, ఏప్రిల్‌లో బడ్జెట్‌ను రూపొందించారని రాశారు. సదరు విల్సన్‌ ఎకానమిస్ట్‌ పత్రికను, స్టాండర్డ్‌ అండ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌ను స్దాపించిన ఒక ఆర్దికవేత్త. మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారిగా ఏడున్నర నెలలకు గాను మధ్యంతర బడ్జెట్‌ను 1947 నవంబరు 26న ఆర్‌కె షణ్ముగం చెట్టి ప్రవేశపెట్టారు. తరువాత మన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 112 ప్రకారం ప్రతి ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి మరుసటి ఏడాది మార్చి 31వరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దేశ తొలి సంపూర్ణ బడ్జెట్‌ మరుసటి ఏడాది నుంచి అమల్లోకి వచ్చింది. అయితే దేశమంతటికీ వర్తింపచేసిన సమగ్ర బడ్జెట్‌ 1949-50 నుంచి అమల్లోకి వచ్చింది.

బడ్జెట్‌ వివరాలను ఎంతో రహస్యంగా పరిగణించేవారు. వివరాలు ఏమాత్రం వెల్లడైనా తీవ్రపర్యవసానాలుంటాయని భావించారు. వివరాలను రూపొందించే బృందానికి నాయకత్వం వహించే అధికారి తప్ప చివరకు ఆర్దిక మంత్రి కూడా వాటిని కలిగి వుండేందుకు వీలు లేదు. తొలి రోజుల్లో 1950వరకు బడ్జెట్‌ పత్రాలను రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో ముద్రించేవారు. తరువాత ఆర్దిక మంత్రిత్వశాఖ కార్యాలయ ప్రాంగణంలో 1980వరకు, అప్పటి నుంచి వెలుపల ప్రభుత్వ ప్రచురణాలయంలో ముద్రిస్తున్నారు. బడ్జెట్‌ ప్రవేశానికి ముందు హల్వా తయారీని ఆర్ధిక మంత్రి ప్రారంభిస్తారు. అంటే బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రారంభసూచిక. ఆప్రక్రియలో నిమగ్నమైన వారెవరినీ ముగిసే వరకు బయటకు వెళ్లకుండా చేస్తారు. ఆ ప్రాంగణంలో ఆర్ధిక మంత్రి కూడా సెల్‌ఫోన్‌ కలిగి వుండటానికి వీలు లేదు. మన దేశంలో తొలి బడ్జెట్‌ కాగితాలను ఒక బ్రీఫ్‌ కేసులో తెచ్చారు. అప్పటి నుంచి అదే సాంప్రదాయం కొనసాగుతోంది.

గతంలో బడ్జెట్‌లోకొన్ని ముఖ్యాంశాలు పుకార్ల రూపంలో వెల్లడయ్యేవి. వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు ముందుగానే వుప్పందేది.కొన్ని సంవత్సరాల తరువాత మోపదలచిన భారాలన్నింటినీ ముందుగానే మోపి బడ్జెట్లలో మాత్రం భారం మోపలేదని ప్రచారం చేసుకొనే విధంగా పాలకపార్టీలు తయారయ్యాయి. రాను రాను బడ్జెట్లు ఒక తంతుగా మారాయి. ఇప్పుడు జిఎస్‌టి వచ్చిన తరువాత దేని మీద పన్ను ఎంతో ముందుగానే నిర్ధారణ చేస్తున్నందున పన్నుల ప్రసక్తి వుండదు. జిఎస్‌టి కౌన్సిల్‌ సమీక్షలు జరిపి కొన్నింటి మీద పన్ను తగ్గించటం తెలిసిందే. ఇప్పుడు బడ్టెట్‌లు ఆదాయ, కార్పొరేట్‌, ఇతర కొన్ని పన్నుల సవరణ, పధకాల ప్రకటనకే పరిమితం అయ్యాయి. గతంలో రైల్వే బడ్జెట్‌ విడిగా వుండేది. కొన్ని సంస్ధానాలలో భారత ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా రైలు మార్గాలుండేవి గనుక రైల్వే బోర్టు ద్వారా ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. రెండు సంవత్సరాల క్రితం దాన్ని కూడా సాధారణ బడ్జెట్లోనే విలీనం చేశారు. సాధారణంగా బడ్జెట్లను ఆర్దిక మంత్రులే ప్రవేశపెడతారు. గతంలో ప్రధానిగా వున్న ఇందిరా గాంధీ వద్దే ఆర్ధికశాఖ కూడా వుండటంతో ఒకసారి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. గతంలో ఫిబ్రవరి చివరి పని దినం రోజు ప్రవేశపెట్టేవారు ఇప్పుడు మొదటి రోజుకు మార్చారు.రాత్రంతా పని చేసిన సిబ్బందికి విశ్రాంతి నిచ్చేందుకు వీలుగా 1924 నుంచి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశ పెట్టారు. దీనిని 2001 నుంచి వుదయం పదకొండు గంటలకు మార్చారు. స్వాతంత్య్రం తరువాత 25 మంది ఆర్దిక మంత్రులుగా పని చేశారు. గరిష్టంగా మొరార్జీదేశాయ్‌ పదిసార్లు, రెండవ స్ధానంలో పి చిదంబరం ఎనిమిదిసార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టారు.1991లో మన్మోహన్‌ సింగ్‌ సుదీర్ఘంగా 18,650 పదాలతో ప్రసంగించగా 1977లో కేవలం 800 పదాలతో హెచ్‌ఎం పటేల్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. తాజాగా పియూష్‌ గోయల్‌ వంద నిమిషాల సేపు ప్రసంగించి ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ ఎలాంటిదో పాఠకులే నిర్ణయించుకోవచ్చు. సాంప్రదయాన్ని వుల్లంఘించి చేసిన ఈ పనిని ఎలాంటి జంకు గొంకు లేకుండా సమర్ధించుకోవటం మోడీ సర్కార్‌కే చెల్లింది.

ఫిబ్రవరి పదకొండవ తేదీన రాఫెల్‌ ఒప్పందంపై ప్రతిపక్షాల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించిన బడ్జెట్‌ను పియుష్‌ గోయల్‌ సమర్దించుకున్నారు. తాత్కాలిక బడ్జెట్‌ కనుక తాము కొత్త పధకాలేవీ ప్రకటించలేదని, పూర్తి స్దాయి బడ్జెట్‌ను తరువాత ప్రవేశపెడతాం, దానిలో మరిన్ని ప్రకటనలుంటాయి, అవి వచ్చే సంవత్సరానికి చెందినవని అన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో గోయల్‌ కొత్తదనమేమీ లేనట్లయితే గంటసేపు ప్రసంగంలో ఏమి చెప్పినట్లు ? ప్రధాని కిసాన్‌ పధకం కింద రెండేసి వేల రూపాయల చొప్పున చిన్న రైతాంగానికి డిసెంబరు నుంచి ఏడాదికి మూడుసార్లుగా మొత్తం ఆరువేలు చెల్లించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసినదే. ఇదిగాక అసంఘటిత రంగంలోని కార్మికులకు ఫిబ్రవరి 15 నుంచి పెన్షన్‌ పధకాన్ని కూడా ప్రకటించారు. ఇవి ఈ ఆర్దిక సంవత్సరం నుంచే అమలులోకి వస్తాయి కనుక సాంకేతికంగా వచ్చే ఏడాది నుంచి అమలు అయ్యే పధకాలుగా పరిగణించకూడదని గోయల్‌ వాదించారు. తమ నాయకుడు ఎంతో తెలివిగా మాట్లాడారని బిజెపి అభిమానులు పొంగిపోయేందుకు తప్ప బుర్రవున్నవారికి చిరాకు తెప్పిస్తాయి. ఆ పధకాలను ఎవరూ వ్యతిరేకించరు. బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా ముందే ప్రకటించినా ఎవరూ తప్పు పట్టరు. డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చే పధకాన్ని ఫిబ్రవరి ఒకటిన ప్రకటించటం అంటే ఎన్నికల ఆపదమొక్కులని వేరే చెప్పనవసరం లేదు. కొత్త పధకాలని చెప్పుకుంటే ప్రవేశపెట్టింది తాత్కాలిక బడ్జెట్‌కిందికి రాదు, వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలుకు ఎన్నికల నిబంధనావళి అడ్డువస్తుంది కనుక బిజెపి సర్కార్‌ ఈ చర్యకు పాల్పడింది. అయినా గట్టెక్కుతారా అంటే పోగాలము దాపురించినపుడు ఇలాంటివేవీ గతంలో ఏ పాలకపార్టీని రక్షించిన దాఖలా లేదు.

Image result for india Interim budget 2019-20 cartoons

మోడీ సర్కార్‌ చివరి బడ్జెట్‌ను ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌గా పరిగణించటానికి లేదు. పూర్తి బడ్జెట్‌ కాదని సర్కారే చెప్పింది కనుక దీన్ని త్రిశంకు స్వర్గ స్దితి బడ్జెట్‌ అనుకోవాలి. విమర్శించటానికి, సమర్ధించటానికి ఏమీ లేదు. అయితే కొన్ని అంశాలను విశ్లేషించాల్సి వుంది. ఐదు ఎకరాలు, అంతకంటే తక్కువ భూమిగల కుటుంబానికి రూ.6000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు.దీనికయ్యే వ్యయంలో రాష్ట్రాలు 40శాతం భరించాలని కేంద్రం కోరనున్నదని అసలు ఆర్థిక మంత్రిగావున్న అరుణ్‌ జైట్లీ చెప్పారు. వాస్తవంలో ఈ పథకానికి నిధుల కేటాయింపు చేసి వున్నట్టయితే జైట్లీ అలా ప్రకటించి ఉండేవారు కాదు. అంటే బడ్జెట్‌లో చూపిన అంకెలు మోసపూరితమైనవన్నమాట.ఈ పథకం కేవలం భూమిని కలిగివున్నవారికే వర్తిస్తుంది. భూమిలేని వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు కూడా ఈ పథకంలో చోటులేదు. 2018-19 సంవత్సరానికి చెందిన సవరించిన బడ్జెట్‌లో సీజీఎస్‌టీ 5.04లక్షల కోట్లు(ఇది అసలు బడ్జెట్‌లో చూపిన దానికి 1లక్ష కోట్లు తక్కువ) వస్తుందని అంచనా వేయగా వాస్తవంలో ఈ పన్ను ఈ మాత్రం కూడా వసూలు కాదని స్వతంత్ర పరిశోధకులు తేల్చారు. ఏప్రిల్‌-జనవరి మధ్యకాలంలో ఈ పన్ను ద్వారా వచ్చిన ఆదాయం సగటున నెలకు 37,635కోట్లు. వార్షికంగా చూసినప్పుడు ఈ మొత్తం 3.77లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అంటే సంవత్సర కాలంలో వచ్చే ఆదాయం మొత్తం 4.52లక్షల కోట్లకు మించదు. ఇది సవరించిన అంచనా కంటే కూడా 52,000కోట్లు తక్కువ.

తాను చేస్తున్న అప్పులను ప్రభుత్వరంగ సంస్థలపైన రుద్దటం, రిజర్వ్‌బ్యాంకు, ఇతర జాతీయ బ్యాంకుల నగదు నిల్వలను డివిడెండ్‌ ఆదాయం పేరుతో వాడటం వంటి అడ్డగోలు చర్యలు ఆర్ధిక క్రమశిక్షణ వుల్లంఘనకు ప్రతిబింబాలు. ఇప్పటికే జిడిపి వృద్ధి రేటు లెక్కలను గందరగోళపరచి ఎక్కువ అభివృద్ది జరిగినట్లు చూపటం, వుపాధి అవకాశాలు తగ్గిన విషయాన్ని అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో నష్టం అని గ్రహించి లెక్కలను ఇంకా ఖరారు చేయలేదని ఒక మాట, సరిగా లెక్కలు తయారు కాలేదని ఇంకో మాట చెబుతున్నారు. పకోడీ బండి పెట్టుకున్నా వుపాధి కల్పించటమే అని ప్రధాని స్వయంగా చెప్పినందున గత నాలుగు సంవత్సరాలలో ఎందరు పకోడీ బండ్లవంటివి ఎన్ని పెట్టుకున్నారో లెక్కలు వేసిన తరువాత వాటిని కూడా వుపాధికల్పన అంకెల్లో చూపి చెబుతారనుకోవాల్సి వస్తోంది.

పన్నుల ద్వారా 2018-19 సంవత్సరానికి చెందిన సవరించిన అంచనాల ప్రకారం చూపిన 6.71లక్షల కోట్ల ఆదాయం వాస్తవరూపం ధరించే అవకాశంలేదు. దీనినే తిరిగి 2019-20 సంవత్సర బడ్జెట్‌ అంచనాలో పెద్ద ఎత్తున 7.6లక్షల కోట్లుగా చూపారు. ఇంతకుముందు చూపినవిధంగా సీజీఎస్‌టీ ద్వారా వచ్చే ఆదాయం 2018-19 సంవత్సరానికి 4.52లక్షల కోట్లకు మాత్రమే చేరే అవకాశం ఉంది. దీనినే 2019-20 సంవత్సర బడ్జెట్‌ అంచనాలో 6.10లక్షల కోట్లకు పెరుగుతుందని చూపారు. ఆదాయంవైపు చూపుతున్న అంచనాలలో వున్న బూటకమే సహజంగా వ్యయంవైపు కూడా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. 2019-20 సంవత్సర బడ్జెట్‌లో పేదల సమస్యలపట్ల ఏమాత్రం ఆసక్తి చూపలేదు. జాతీయ ఉపాధిహామీ పథకానికి చేసిన కేటాయింపులు 2018-19 సంవత్సరంలో కంటే వర్తమాన బడ్జెట్‌లో 1000కోట్లు తక్కువ. ఈ పథకంపట్ల కేంద్రానికున్న చిన్నచూపుకు ఇది సూచిక.

Image result for Interim budget-a narendra modi's trap to catch votes

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు 40శాతం భరించాలని జైట్లీ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత వుంది. వ్యవసాయం రాష్ట్రాల అధికార పరిధిలోనిది. దీనికి కేంద్రం నిధులు ఇవ్వకూడదనేమీ లేదు. ఇంతవరకు ఇలా ఏకపక్షంగా ఇతర అంశాలు వేటికీ రాష్ట్రాల వాటాను తేల్చకుండా పధకాలను రూపొందించలేదు. దీని మీద రాష్ట్రాల అభిప్రాయం తీసుకోలేదు. అందువలన దీన్ని కొనసాగిస్తారా అని కూడా సందేహించక తప్పదు. ఎన్నికల ముందు ప్రచారానికి ఉపయోగపడటానికి దీనిని రూపొందించినట్టుగాఉంది. ఒకవేళ ఎన్నికల తరువాత ఎన్‌డీఏ తిరిగి అధికారంలోకివస్తే రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించటంలేదనే నిందమోపి ఈ పథకాన్ని ఎత్తేయవచ్చు. లేదూ ప్రతిపక్షంలో కూర్చుంటే అది కొనసాగకపోతే చూశారా రైతులకు అన్యాయం చేస్తున్నారని దాడి చేయవచ్చు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో నగదు బదిలీ కోసం 20000కోట్లు ఖర్చు పెట్టాలి. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందున ఎలాగోలా ఈ మొత్తాన్ని సమకూర్చటం కష్టమేమీ కాదు. తరువాత ఏమిటనేది అసలు ప్రశ్న. దేశంలో భూమి యాజమాన్యాలకు సంబంధించిన రికార్డుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. సరైన గణాంకాలు లేనందున లబ్దిదారుల ఎంపిక అంత తేలిక కాదు.

మధ్యతరగతి వారికి ఆదాయ పన్నులో వార్షికంగా 5లక్షలవరకు రాయితీలు ప్రకటించటం ఓట్ల కోసమే. స్లాబులు మార్పు గురించి ప్రకటించకుండా రాయితీ ఇవ్వటం ఒకసారి వ్యవహారం కూడా కావచ్చు. దీనివలన వారికి ఎంత లబ్ది ఎంత అన్నది ప్రశ్న. బడ్జెట్‌లో అసంఘటిత కార్మికుల కోసం పించను పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకం ఇప్పటికేవున్న వ అద్ధులకు ఉపపయోగపడదు. ఈ పధకంలో 29ఏండ్లు నిండిన వ్యక్తి తనకు 60ఏండ్లు వచ్చేదాకా నెలకు రూ.100 జమ చేస్తే ఆ తరువాత అతనికి నెలకు రూ.3000 పింఛను వస్తుంది. 60వ ఏటవరకూ ఒక కార్మికుడు కట్టే మొత్తాన్ని 8శాతం కాంపౌండ్‌ వడ్డీతో లెక్కగట్టినప్పుడు రూ.1,50,000 అవుతుంది. పురుషుల జీవిత పరిమాణం 65ఏండ్లుగా ఉన్నప్పుడు 60ఏండ్ల తరువాత అతను అందుకోబోయే పింఛను అతని చేసిన పొదుపు నుంచే వస్తుంది. కాబట్టి ఈ కాంట్రిబ్యూటరీ పథకంలో ప్రభుత్వ పాత్ర నామమాత్రమే.గత ఐదు సంవత్సరాలలో ఎంత మందికి వుపాధి కల్పించారో లెక్కలే తేల్చలేని పాలకులు 50-60కోట్ల మంది అసంఘటిత కార్మికులున్నారని అంచనా కాగా వారందరికీ ఖాతాలు తెరవటం వూహకు అందని అంశం. తాత్కాలిక బడ్జెట్‌ను మొత్తంగా చూసినపుడు ఓటర్లకు వేసిన పెద్ద వల. దీనికి జనం చిక్కుతారా అన్నది ప్రశ్న !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా వ్యవసాయ పరిశోధనలు, రైతాంగానికి లబ్ది !

12 Tuesday Feb 2019

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Farmers, History, Opinion

≈ Leave a comment

Tags

Agricultural, China's agricultural sector, chinese agricultural, chinese agricultural R&D, chinese agricultural revolution, chinese electro culture

Image result for Chinese agricultural

ఎం కోటేశ్వరరావు

చైనా ! నూట నలభై కోట్ల జనాభా !! వారికి అవసరమైన తిండి, బట్ట, విద్య, వైద్యం, గూడు కల్పన సామాన్యమైన విషయం కాదు.తిండి కలిగితే కండ కలదోయ్‌, కండగలవాడేను మనిషోయ్‌ అన్న మహాకవి గురజాడ వాక్కులు సార్వజనీనమైనవి. చైనాలో ప్రపంచ జనాభాలో 22శాతం, సాగుకు లాయకీ అయిన భూమిలో ఏడుశాతమే వుంది. మొత్తం భూమిలో వ్యవసాయానికి పనికి వచ్చేది 10-15శాతం మధ్య వుంది. అదే భారత్‌లో 50, ఫ్రాన్స్‌లో 32, అమెరికాలో 22, సౌదీ అరేబియాలో ఒకశాతం చొప్పున వుంది. ఈ పూర్వరంగంలో అక్కడి జనాభా అవసరాలను తీర్చటానికి ఎంతటి మహాయజ్ఞం చేయాల్సి వుందో వూహించుకోవాల్సిందే.అది ఒకరోజుతో ఆపేది కాదు. నిరంతర ప్రక్రియ. అలాంటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన చైనా కమ్యూనిస్టు పార్టీ గత ఏడుదశాబ్దాల విప్లవ కాలంలో అనేక విజయాలను సాధించింది. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చటం ఒక ఎత్తయితే, దాన్ని సమకూర్చే రైతాంగ మంచి చెడ్డలను చూసుకోవటం కూడా అంతే ప్రాధాన్యత కలిగిన అంశం. రైతుకు గిట్టుబాటు కాకుండా, ఇతర రంగాలతో పోల్చితే ఆదాయం తగ్గినా, ప్రభుత్వం సమన్వయం చేయకపోతే వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుంది. భౌగోళికంగా తలెత్తే సహజ సమస్యల నుంచి ఎలా అధిగమించాలనేది ఒక సవాలు.చైనా గురించి మీడియాలో అనేక వక్రీకరణలు వస్తుంటాయి గానీ అక్కడి రైతాంగానికి లేదా మొత్తం వ్యవసాయ రంగానికి మన మాదిరి సంక్షోభ సమస్యలు, రుణ భారం, బలవన్మరణాల వంటివి కానరావు. మార్కెట్లలో ఆకస్మికంగా ధరలు పెరగటం, అదే విధంగా పతనం కావటం వంటి సమస్యలు అసలే లేవు. చైనా దిగుమతులు తగ్గించినా, నిలిపివేసినా ఇతర దేశాల మార్కెట్లు, రైతులు ప్రభావితం కావటం తప్ప చైనా రైతాంగానికి వాటి నుంచి అన్ని రకాల రక్షణలు వున్నాయి. సబ్సిడీలు, ఇతర రక్షణ పధకాలు ఎప్పటికప్పుడు మారుతున్నప్పటికీ అవి మరింత మెరుగుదలకే తోడ్పడతాయి.

రెండు కోట్ల పదిలక్షల మంది రైతుల చిన్న కమతాల సాగు తీరుతెన్నుల గురించి పది సంవత్సరాల అధ్యయనంతో శాస్త్రవేత్తలు సూచించిన మెరుగైన యాజమాన్య పద్దతులను ఆచరించిన రైతులు తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయంతో 12.2 బిలియన్‌ డాలర్ల మేరకు లబ్ది (ఎరువుల ఖర్చులో తగ్గుదల ద్వారా) పొందారని నేచర్‌ అనే పత్రిక తాజాగా ఒక విశ్లేషణలో పేర్కొన్నది. 2005-2050 మధ్య ప్రపంచ ఆహార అవసరాలు రెట్టింపు అవుతాయనే అంచనా పూర్వరంగంలో చైనా అధ్యయనం అంతర్జాతీయ శాస్త్రవేత్తలను అబ్బురపరచింది. అధ్యయన అంశాలను ఇతర దేశాలకు వర్తింప చేయవచ్చని ఆశిస్తున్నారు. బ్రిటన్‌ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జనాభా బయాలజిస్ట్‌ చార్లెస్‌ గాడ్‌ఫ్రే మాట్లాడుతూ ‘ 140కోట్ల జనాభాకు అవసరమైన ఆహారాన్ని వుత్పత్తి చేయటం ద్వారా వ్యవసాయ అద్బుతాన్ని సాధించింది. అయితే పర్యావణాన్ని ఫణంగా పెట్టారు, భూమి ఆమ్లీకృతమైంది, నీరు కలుషితమై ప్రపంచ తాపం పెరగటానికి దోహదం చేసింది. తాజా అధ్యయనం పెద్ద మొత్తంలో ఆర్ధిక ఫలితాలను రాబట్టటంతో పాటు ఎరువుల వాడకాన్ని తగ్గించటం సాధ్యమే అని సూచించింది.’ అన్నారు. ఏటా ఒక హెక్టారుకు చైనా రైతులు 305కిలోల నత్రజని వాడుతున్నారు. ఇది ప్రపంచ సగటుకు నాలుగు రెట్లు ఎక్కువ. పంటల దిగుబడులు తగ్గకుండా నత్రజని వినియోగాన్ని తగ్గించటం ఎలా అనే దిశగా బీజింగ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన పధకం 2005 నుంచి 2015వరకు సాగింది.ఈ వ్యవధిలో 13,123 క్షేత్రాలలో మొక్కజన్న, వరి, గోధుమల గురించి దిగుబడులు, పంటల రకాలు, నాటు పద్దతులు, ఎరువులు, నీరు, ఎండతీవ్రత ప్రభావం వంటి అనేక అంశాలను వారు పరిశీలించారు. ఈశాన్య చైనా రైతులు గరిష్టంగా 20శాతం నత్రజని వాడకాన్ని తగ్గించారు. అధ్యయనం, పరిశోధనా కాలంలో సగటున ధాన్య వుత్పత్తి 11శాతం పెరిగింది, 15శాతం నుంచి 18శాతం ఎరువుల వాడకం తగ్గింది. తద్వారా 12లక్షల టన్నుల నత్రజని పొదుపైంది. ఈ పధకంలో పది సంవత్సరాలలో 14వేల కార్యశాలలను నిర్వహించారు. చైనా అంతటి నుంచి 1200పరిశోధకులు, 65వేల మంది ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులు, లక్షా 40వేల మంది వ్యవసాయ వాణిజ్య సంస్ధల ప్రతినిధులు, 37.7 మిలియన్‌ హెక్టార్లలో రెండు కోట్ల పదిలక్షల మంది రైతులు వివిధ స్ధాయిలలో భాగస్వాములయ్యారు. ఐదుకోట్ల నలభైలక్షల డాలర్లు ఖర్చయింది.ఈ ప్రయోగం నుంచి మన దేశం కూడా నేర్చుకోవాల్సింది వుంది.ఈ ప్రయోగానికి ముందు గ్రీన్‌ హౌస్‌ గ్యాస్‌ గోధుమల్లో 549 నుంచి 434కు, వరిలో 941 నుంచి 812, మొక్కజన్నలో 422 నుంచి 328కి తగ్గాయని తేలింది.

పరిశోధనా అంశాలను అన్ని ప్రాంతాలకు వర్తింప చేయటంలో సమస్యలు తలెత్తవచ్చు, ఎంచుకున్న విధానాలను అమలు జరిపేందుకు చైనాలో కేంద్రీకృత ప్రభుత్వం వుంది కనుక సాధ్యం అవుతుంది, ఇతర దేశాలలో అలావుండదు అనే అభిప్రాయాలు కూడా వెల్లడయ్యాయి. ఇతర దేశాలు ఇలాంటి ప్రయోగాలు చేయటానికి సవాళ్లు ఆటంకం కారాదని, తమ జనాభా కడుపు నింపటానికి కలుషిత, సరస్సులు, నదులు, సముద్రాలను తయారు చేయాల్సిన అవసరం లేదని చైనా అధ్యయనం నిరూపించిందనే అభిప్రాయం కూడా వెల్లడైంది. వేల యకరాల కమతాలతో భారీ యంత్రాలతో అమెరికాలో వ్యవసాయం జరుగుతోంది. అత్యంత చిన్న కమతాలుతో చైనా తన సాగు పద్దతులను మెరుగుపరచుకుంటోంది. అమెరికాతో పోలిస్తే దిగుబడులలో వెనుకబడిన చైనా మన దేశంతో సహా అనేక దేశాలతో పోల్చితే ఎంతో ముందుందని మరచిపోరాదు. అగ్గిపుల్లా, సబ్బుబిళ్ల, తలుపు గొళ్లెం, హారతి పళ్లెం కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా కొండలు, గుట్టలు, ఫ్యాక్టరీ, రోడ్లపక్క ఖాళీ స్దలాలు, ఇండ్లపై కప్పులు వేటినీ వదల కుండా తమకు అవసరమైన పంటలను అక్కడి జనం సాగు చేస్తున్నారు.1980దశకంలో పెద్ద ఎత్తున రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని ప్రోత్సహించారు. తలెత్తిన దుష్పరిణామాలను గ్రహించి వాటిని అరికట్టేందుకు, దెబ్బతిన్న పర్యావరణాన్ని సరి చేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. చైనాలో భూమి ప్రభుత్వానిదే. రైతులు సాగు చేసుకొనేందుకు 30 సంవత్సరాల వరకు కౌలుకు తీసుకోవచ్చు. తాకట్టు పెట్టటానికి, కొనుగోలు, అమ్మకం చేయటానికి లేదు. భూమి హక్కులను బదలాయించే అవకాశం వుంది. పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోవచ్చు. సగటున ఒక్కో కుటుంబం 1.2 ఎకరాలు కౌలుకు తీసుకుంది. దేశ జనాభాలో ఇప్పటికీ 35శాతం మంది వ్యవసాయ మీద ఆధారపడుతున్నారు. పది సంవత్సరాల క్రితం 60శాతం వరకు వున్నారు.

Image result for chinese agricultural revolution

చైనా వ్యవసాయ విజయ గాధ కమ్యూనిస్టు పార్టీ లేదా ప్రభుత్వ నివేదికలలో చెప్పినదానిని కొంత మంది నమ్మకపోవచ్చు. మనీలా టైమ్స్‌ (ఫిలిప్పీన్స్‌) ప్రతినిధి జిల్‌ హెచ్‌ ఏ శాంటోస్‌ 2018 మార్చి 18,19 తేదీలలో చైనా వ్యవసాయ విజయం వెనుక నిజాలు అనే శీర్షికతో రాశారు. దానిలో ప్రపంచ వ్యవసాయ సంస్ధ(ఎఫ్‌ఏఓ) విస్తరణ మరియు విద్య అధికారి డాక్టర్‌ టిటో కాంటాడో మార్చినెల మొదటి వారంలో ఫిలిప్పీన్స్‌ అధికారి బెన్‌కు పంపిన ఒక మెయిల్‌లో పేర్కొన్న అంశాలను వుటంకించారు. వాటి సారాంశం ఇలా వుంది.

1982 నుంచి 1995 వరకు చైనాలో ఎఫ్‌ఏఓ కార్యక్రమాలు, చైనీయుల నుంచి అనేకం నేర్చుకోవచ్చు.1983లో నాటి చైనా వ్యవసాయ మంత్రి హె కాంగ్‌ రోమ్‌లోని ఎఫ్‌ఏఓ కార్యాలయానికి వచ్చారు. తమ ఎనభై కోట్ల రైతాంగానికి విస్తరణ సేవలు అందించేందుకు సాయం చేయాలని కోరారు. నాటి ప్రధాని డెంగ్‌ గ్జియో పింగ్‌ చైనా ముందుకు పోవటానికి చెప్పిన నాలుగు అంశాల విషయమై కాంగ్‌ వచ్చారు. అదేమంటే 1. పిల్లి రంగు ఏమిటన్నది కాదు అది ఎలుకలను పడుతుందా లేదా అన్నదే ముఖ్యం.2. బహిరంగ మార్కెట్‌, చైనీయుల అన్ని జీవన రంగాల నవీకరణ, జవాబుదారీ వ్యవస్ధ. బహిరంగ మార్కెట్‌ వ్యవస్ధను అభివృద్ధి చేయాలంటే వ్యవసాయం, ఇతర ఆర్ధిక రంగాన్ని నవీకరించాలి. అందువలన వ్యవసాయానికి రైతులు జవాబుదారీగా వుండాలి. మంత్రి కాంగ్‌ చెప్పినదాని ప్రకారం 80కోట్ల మంది రైతులు సగటున ఒకటిన్నర హెక్టార్ల వ్యక్తిగత కమతాలను పొందుతారు. ఏమి పండించాలో వారే నిర్ణయించుకుంటారు. వ్యవసాయ వుత్పత్తి పెంచటానికి, నిర్దేశిత లక్ష్యాలను చేరుకొనేందుకు, ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు వారికి మంచి విస్తరణ సేవలు అవసరం. మంత్రి కోరిన వెంటనే నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఎఫ్‌ఎఓ పంపింది. అది చేసిన సిఫార్సులు ఇలా వున్నాయి. కౌంటీ(మన జిల్లాల వంటివి) ప్రాతిపదికన విస్తరణ ప్రాజెక్టులను రూపొందించాలి.(చైనాలో 19 పెద్ద రాష్ట్రాలు వుంటే 2,300 కౌంటీలు వున్నాయి. ఒక్కొక్కదానిలో ఐదు నుంచి పదిలక్షలకు పైబడి జనాభా వున్నారు) కౌంటీ ఆగ్రో టెక్నలాజికల్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ను(కాటెక్‌) ప్రతి కౌంటీకి ఏర్పాటు చేయాలి. ఆ కేంద్రం ప్రయోగాలు, శిక్షణ మరియు సమాచార చేరవేత, విస్తరణ, సలహా సేవలను అందించాలి. ప్రయోగాలకు అవసరమైన ప్రయోగశాలలు, సంబంధిత ప్రత్యేక నిపుణులు, వారికి అవసరమైన ప్రయోగ క్షేత్రం, వాటికి వున్నత స్ధాయిలో వున్న వ్యవసాయ పరిశోధనా సంస్ధలతో సంబంధాలుండాలి. కాటెక్‌లో ఐదుగురు అధికారులుండాలి. జిల్లా ప్రభుత్వ ప్రతినిధి, జిల్లా వ్యవసాయ అధికారి, స్ధానిక ప్రభుత్వ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ ప్రతినిధి, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ ప్రతినిధులుండాలి. అయ్యే ఖర్చులో సగం కౌంటీ, 30శాతం రాష్ట్రం, 20శాతం కేంద్రం భరించాలి. ఎఫ్‌ఏఓ మరియు చైనా ప్రభుత్వ నిధులతో 6.8కోట్ల జనాభా వున్న జయింగ్‌షో, 11కోట్ల జనాభా వున్న సిచువాన్‌ రాష్ట్రాలలో పైలట్‌ ప్రాజెక్టులను అమలు జరపాలని ఎఫ్‌ఏఓ బృందం సిఫార్సు చేసింది. ఒకేడాది ఈ పధకాలు అమలు జరిగిన తరువాత పది సంవత్సరాల వ్యవధిలో దేశమంతటా అన్ని రాష్ట్రాలలో ఈ నమూనాను విస్తరించాలని మంత్రి ఆదేశించారు.1995 నాటికి 85శాతం కౌంటీలలో కాటెక్‌ కేంద్రాలు ఏర్పడ్డాయి. ఇందుకు గాను ప్రపంచబ్యాంకు నుంచి 12కోట్ల డాలర్ల రుణం తీసుకున్నారు. వ్యవసాయ వుత్పత్తి పెరిగింది, వ్యవసాయరంగంలో పనిచేసే వారి శాతం 73 నుంచి 37కు తగ్గింది. 2000 సంవత్సరంలో పదిశాతం వ్యవసాయ కార్మికుల లేదా రైతుల శాతం తగ్గిందని ప్రకటించారు. దీని అర్ధం పదిశాతం మంది రైతులకు పెద్ద కమతాలు అందుబాటులోకి వచ్చాయి, అది యాంత్రీకరణకు, అధిక ఆదాయానికి దోహదం చేసింది. వనరులు తక్కువగా వుండి, ఆసక్తి చూపని జనం వున్న రాష్ట్రాలు, కౌంటీలలో తప్ప వ్యవసాయంపై ఆధారపడిన వారిలో దారిద్య్రం మాయమైంది.

ఒక విషయాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. చైనా పురోగమనానికి ప్రధాని డెంగ్‌ పేర్కొన్న నాలుగు అంశాలలో అంతర్లీనంగా వున్న పారిశ్రామికీకరణ, నిర్మాణం, వాణిజ్యం, సేవలు, రవాణా తదితర ఆర్ధిక రంగాలు దేశవ్యాపితంగా అభివృద్ధి చెందాయి. వ్యవసాయంలో అదనంగా వున్న 63శాతం కార్మిక శక్తిని వేగంగా జరిగిన అభివృద్ది ఇముడ్చుకుంది. కాబట్టి చైనా విషయంలో వ్యవసాయ ఆధునీకరణ, రైతులకు అదనపు ఆదాయం మరియు వ్యవసాయ రంగంలో వున్న దారిద్య్రంలో అత్యధిక భాగాన్ని లేకుండా చేయటం దేశవ్యాపిత ఆర్ధిక అభివృద్ధిలో భాగంగా చూడాలి. చైనా నుంచి ఇతర పాఠాలను కూడా నేర్చుకోవాల్సి వుంది.1. వారు ఎంపిక చేసిన జాతీయ, రాష్ట్ర, కౌంటీ స్ధాయి ప్రతినిధులు జవాబుదారీ, గౌరవం కలిగిన వారు మరియు వారి సహచరులు, భాగస్వాములు వారిని అనుసరించారు. చైనా ముందుకు పోవటానికి నాలుగు సూత్రాలను జాతీయ నాయకత్వం ఒకసారి ప్రకటించిన తరువాత అవి చైనా అభివృద్దికి నూతన భావజాలమైంది, దానిని సమాజంలోని అన్ని తరగతులు అనుసరించి మరింత విస్తృత పరిచాయి. నాతో పాటు పని చేసిన అధికారులు, ఇతర జనాలు నిష్కపటంగా వున్నారు. ఇతర దేశాల నుంచి కొత్త అంశాలను, ఆలోచనలను నేర్చుకొనేందుకు ఆతృత పడేవారు, నిజాయితీ, అవసరమైన మేరకు పరిమితం కావటం, పురోభివృద్ధి, బాధ్యతలకు అంకితమైన వారు. వ్యవసాయేతర రంగాలలో ప్రత్యేకించి పారిశ్రామికీకరణలో(వ్యవసాయ యంత్రాల తయారీ సహా) పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టటం అంటే అది వ్యవసాయాభివృద్ధికి పెట్టుబడే. చైనాలో వ్యవసాయ విస్తరణ సేవల ఏర్పాటు సంక్లిష్టమైనది కాదు. ఖర్చు తక్కువ, అమలు జరిపేందుకు, పర్యవేక్షించేందుకు సులభమైనదే. జాతీయ ఆహార భద్రత సాధించేందుకుగాను ప్రభుత్వం నుంచి భూమిని కౌలుకు తీసుకున్న ప్రతి రైతు నిర్ణీత కోటా గోధుమలు,బియ్యాన్ని ప్రభుత్వ సంస్ధ డబ్బు చెల్లించి సేకరిస్తుంది. నిర్ణీత కోటాను అందచేయటంలో ఎవరైనా రైతులు పదే పదే విఫలమైతే సదరు భూమి నుంచి రైతులను మార్చ వచ్చు. అయితే అధికంగా పండించిన మొత్తాన్ని రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవచ్చు. రైతులకు అప్పగించిన భూమిలో సగం గోధుమలు, వరి సాగు చేసి కోటా చెల్లించి మిగిలిన సగంలో కూరగాయలు, వాణిజ్య పంటలు సాగు చేసిన రైతాంగాన్ని 1980దశకంలో పురోగామి రైతులుగా గుర్తించారు.’ అని డాక్టర్‌ టిటో కాంటాడో పేర్కొన్నారు.

కొన్ని దేశాలలో అమెరికా వ్యవసాయశాఖ రూపొందించిన కొన్ని పంటల తాజా దిగుబడుల వివరాలు ఇలా వున్నాయి.( హెక్టారుకు టన్నులలో, పత్తి కిలోలు, 2019 ఫిబ్రవరి అంచనా )

దేశాలు                  వరి     గోధుమ     పత్తి      చమురు గింజలు    మొక్కజన్న

ప్రపంచ సగటు        4.55    3.39     779          2.31            5.81

అమెరికా              8.66    3.20     939          3.21          11.07

ఐరోపా యూనియన్‌   6.89    5.39      –             2.64            7.54

చైనా                   7.03    5.42     1787        2.49             6.11

భారత్‌                  3.8      3.32     480         0.97             2.83

గతంలో బ్రిటన్‌ సామ్రాజ్యవాదులు వలస దేశాలను తమ పరిశ్రమలకు అవసరమైన ముడిసరకు సరఫరా దేశాలుగా పరిమితం చేసేందుకు ప్రయత్నించాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా సామ్రాజ్యవాదం లాటిన్‌ అమెరికాలో అదేపని చేసింది. ఒక్కొక్క దేశంలో ఒక వుత్పత్తి మీద కేంద్రీకరించి ఇతర అవసరాల కోసం తన మీద ఆధారపడే విధంగా చేసుకుంది. వుదాహరణకు క్యూబాలో ఇతర పంటలు పండేందుకు అవకాశం వున్నా కేవలం పంచదారనే ఎక్కువగా ప్రోత్సహించటం, వెనెజులాలో చమురునిల్వల వెలికి తీత తప్ప వ్యవసాయాన్ని, పారిశ్రామిక రంగాన్ని నిర్లక్ష్యం చేయటం, ఇదే విధంగా ఇతర దక్షిణ అమెరికా దేశాలన్నింటా ఏదో ఒక వాణిజ్య పంటల వుత్పత్తికి లేదా గనులకే పరిమితం చేయటంతో అవి అని వార్యంగా ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆ బలహీనత ఆధారంగా క్యూబా పంచదార ఎగుమతుల మీద ఆంక్షలు పెట్టి అక్కడి సోషలిస్టు వ్యవస్ధను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు వెనెజులా చమురు ఆదాయాన్ని మదురో సర్కార్‌కు అందనివ్వకుండా ఆర్దికంగా ఇబ్బందుల పాల్జేసేందుకు పూనుకున్నారు. చైనా జనాభా అవసరాలను కూడా అందుకు వినియోగించుకొనే అవకాశం లేకుండా చైనా తీసుకున్న జాగ్రత్తలలో ఆహార స్వయం సమృద్ధి సాధన ఒకటి. జనాభా అవసరాలన్నింటినీ తీర్చే సోషలిస్టు కార్యక్రమం అమలు జరుపుతున్నందున చైనాలో సంభవించే పరిణామాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ ప్రకృతి వైపరీత్యాల రీత్యా పంటల దిగుబడి, వుత్పత్తి తగ్గితే దిగుమతులు కారణంగా ప్రపంచ మార్కెట్లో వ్యవసాయ వుత్పత్తుల ధరలు పెరుగుతాయి, అదే బాగా పండి దిగుమతి అవసరాలు తగ్గితే ధరలు పడిపోతాయి. పత్తి విషయంలో మన దేశంలో ధరలపై ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అందువలన పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణ్యంగా చైనాలో వ్యవసాయం గురించి నిరంతరం అక్కడి ప్రభుత్వం జాగరూకత ప్రదర్శిస్తోంది.2030 నాటికి జనాభా 150కోట్లకు చేరితే ప్రతి ఏటా పదికోట్ల టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా వుత్పత్తి చేయాల్సి వుందని అంచనా. చైనాలో బియ్యం ప్రధాన ఆహారం. వరిసాగుకు నీరు అవసరం. ప్రపంచ తలసరి సగటు అందుబాటులో కేవలం నాలుగోవంతు మాత్రమే చైనా నీటి లభ్యత వున్నందున దాన్ని అధిగమించటం నిజంగా పెద్ద సవాలే. చైనాలో మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా పందిమాంసం, చేపలు, కోడి మాంస వినియోగం వేగంగా పెరుగుతోంది. వాటి వుత్పత్తిని కూడా పెంచాల్సి వుంది. అందుకు అవసరమైన దాణా కూడా ధాన్య అవసరాలు పెరుగుతున్నాయి. ఒక కిలోమాంసం కావాలంటే రెండు, పందిమాంసానికి నాలుగు నాలుగు, గొడ్డు మాంసానికి ఏడు కిలోల ధాన్యం కావాల్సి వుంది. అందువలన అమెరికా ఇతర దేశాల నుంచి సోయా, మొక్కజన్న, జన్నల వంటి వాటి దిగుమతులలో ఎక్కువ భాగం దాణాకే వినియోగిస్తున్నారు.

ఫిబ్రవరి ఆరున ఈ ఏడాది చైనా నూతన సంవత్సరాది వేడుకలు ప్రారంభమయ్యాయి. సూకర(పంది)నామ సంవత్సరంగా పాటిస్తున్నారు.చైనాలో మాంస వినియోగం ఏటేటా పెరుగుతోంది. 2011లో సగటున తలకు 43.8కిలోలుండగా ఈ ఏడాది 53.3కిలోలుగా వుంటుందని అంచనా వేశారు. దీనిలో సగం పంది మాంసం. ప్రపంచ తలసరి ప్రొటీన్ల వినియోగం రోజుకు 46 గ్రాములుండాలని ఆరోగ్య సంస్ధలు సిఫార్సు చేశాయి. ప్రస్తుతం ప్రపంచ సగటు 80గ్రాములుండగా మన దేశంలో 60 వుంది. 1990-2011 మధ్య వినియోగంలో పెద్ద మార్పు లేదు. అదే చైనాలో 75 నుంచి 95కు పెరిగింది. అమెరికా సగటు వినియోగదారుడికి అవసరమైన వాటిని సమకూర్చాలంటే అక్కడ ఒక ఎకరం అందుబాటులో వుంటే అదే చైనాలో 20సెంట్లు మాత్రమే వుంది. అందువలన వ్యవసాయ అభివృద్ధి చైనాకు ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు. అందుకే పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్నారు. వాటిలో ఎలక్ట్రో కల్చర్‌ పరిశోధనలు ఒక భాగం గోబీ ఎడారి నుంచి పసిఫిక్‌ సముద్ర తీరం వరకు కూరగాయల సాగును పరిశోధించారు. మొక్కల పెరుగుదలకు విద్యుత్‌ ఎలా తోడ్పడుతుందనేది ముఖ్యాంశం. కొద్ది వారాల క్రితం విద్యుత్‌ వినియోగం ద్వారా 20 నుంచి 30శాతం వుత్పాదకత పెరిగితే, 70 నుంచి 100శాతం వరకు పురుగుమందులు, 20శాతం ఎరువుల వినియోగం తగ్గినట్లు తేలిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కూరగాయ మొక్కల మీద పది అడుగుల ఎత్తులో గ్రీన్‌ హౌస్‌లో రాగితీగల ద్వారా గరిష్టంగా 50వేల ఓల్టుల వరకు విద్యుత్‌ను ప్రసారం చేసి ఫలితాలను పరిశీలించారు. దీని వలన మొక్కలకు, సమీపంలోని మనుషులకు ఎలాంటి హాని జరగలేదు. ఎలక్ట్రోకల్చర్‌ సాగును క్రమంగా పెంచుతున్నారు. ఈ రంగంలో తాము ఇతర దేశాల కంటే ఒకడుగు ముందున్నామని, తమ సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను అమెరికాతో సహా మరికొన్ని దేశాలకు అందచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మొక్కలపై విద్యుత్‌ ప్రభావం గురించి ఆలోచన, ప్రయోగాలు కొత్తవి కాదు. చైనా రెండు వందల సంవత్సరాల తరువాత ఈ పరిశోధనల్లోకి దిగిందని చరిత్ర వెల్లడిస్తోంది.1990లో సేంద్రీయ వ్యవసాయ పరి శోధనల్లో భాగంగా చైనా సర్కార్‌ పరిశోధనలను ప్రోత్సహించింది.2014 నుంచి ఈ పరిశోధనల్లో భాగస్వామి అయిన ఒక ప్రయివేటు కంపెనీ ఎలక్ట్రో కల్చర్‌ ద్వారా రెండు సంవత్సరాలో పన్నెండు లక్షల యువాన్లను అదనంగా ఆదాయాన్ని పొందినట్లు పేర్కొన్నది. ఒక హెక్టారు గ్రీన్‌ హౌస్‌కు రోజుకు 15కిలోవాట్‌ గంటల విద్యుత్‌ అవసరం. అయితే అవసరమైన యంత్రాల ఏర్పాటుకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని, ప్రభుత్వ తోడ్పాటు లేకుండా సాధ్యం కాదని ఆ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నాడు. ప్రతి కుటుంబం ఇంట్లో ఒక గదిలో ఎలక్ట్రో కల్చర్‌ సాగుచేసే విధంగా ఖర్చు తగ్గించే దిశగా పరిశోధనలు చేస్తున్నట్లు ప్రొఫెసర్‌ ఒకరు చెప్పారు. నిజంగా అదే జయప్రదమైతే మరో వ్యవసాయ విప్లవం వచ్చినట్లే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికాను వెన్నాడుతున్న సోషలిస్టు భూతం !

07 Thursday Feb 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

A specter is haunting US, American youth prefer socialism to capitalism, Donald Trump on Socialism, Failure of Capitalism, focus on Socialism, Socialism, the specter of socialism

ఎం కోటేశ్వరరావు

‘ఐరోపాను ఒక భూతం వెన్నాడుతోంది ! ఆ భూతం కమ్యూనిజం !! పాత ఐరోపాలోని అధికార కేంద్రాలైన పోప్‌, జార్‌, మెట్టర్‌నిచ్‌ (నాటి ఆస్ట్రియా విదేశాంగ మంత్రి), గుయిజోట్‌(ఫ్రెంచి 17వ ప్రధాని) , ఫ్రెంచి తీవ్రవాదులు, జర్మన్‌ పోలీసు గూఢచారులు ఆ దయ్యాన్ని వదిలించుకొనేందుకు ఒక పవిత్ర కూటమిగా తయారయ్యారు.’ 1848లో ప్రచురితమైన కమ్యూనిస్టు మానిఫెస్టోను కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌లు పై మాటలతో ప్రారంభించారు. ఈనెల ఐదవ తేదీ రాత్రి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తమ పార్లమెంట్‌ వుభయ సభల నుద్ధేశించి చేసిన రెండవ ప్రసంగాన్ని చూస్తే సోషలిజం అనే భూతం ట్రంప్‌ను అంటే అమెరికా పాలకవర్గాన్ని వెన్నాడుతోందని స్పష్టమైంది. అనేక మంది అమెరికా అధ్యక్షులు, సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా నానా చెత్త మాట్లాడారు. కొంత మంది విశ్లేషకుల సమాచారం ప్రకారం తొలిసారిగా ఒక అమెరికా అధ్యక్షుడు పార్లమెంట్‌లో సోషలిజం గురించి ప్రకటన చేయటం ఇదే ప్రధమం. బహుశా ఈ కారణంగానే కావచ్చు ఒక మీడియా సంస్ధ ‘సోషలిజం విజేత ‘ అని వుపశీర్షిక పెట్టింది. ట్రంప్‌ అనూహ్యంగా చేసిన ప్రస్తావనతో అనేక మంది మీడియా పండితులు దానికి భాష్యాలు చెప్పటం ప్రారంభించారు. ఇంతకీ ట్రంప మహాశయుడు చెప్పిందేమిటి?

Image result for A specter is haunting US , the specter of socialism

‘ ఇక్కడ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, మన దేశం సోషలిజాన్ని స్వీకరించాలన్న కొత్త పిలుపులు మనలను జాగరూకులను చేశాయి. అమెరికా స్వేచ్చ, స్వాతంత్య్రాలతో స్ధాపించబడింది తప్ప ప్రభుత్వ బలవంతం, ఆధిపత్యం, అదుపులతో కాదు. మనం స్వేచ్చతో జన్మించాం, స్వేచ్చగానే వుంటాం. అమెరికా ఎన్నడూ సోషలిస్టు రాజ్యంగా వుండేదిలేనే సంకల్పాన్ని ఈ రాత్రి పునరుద్ఘాటిస్తున్నా.’ ఎవరు అవునన్నా కాదన్నా ఎలా గింజుకున్నా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనూహ్యరీతిలో సోషలిజాన్ని అజెండాగా చేశాయి. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా తనకు మద్దతు ఇవ్వాలంటూ పోటీలోకి వచ్చిన సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ సోషలిస్టునని స్వయంగా ప్రకటించుకొని మరీ గోదాలోకి దిగాడు. గతేడాది జరిగిన మధ్యంతర ఎన్నికలలో డెమొక్రటిక్‌ సోషలిస్టు పార్టీ అభ్యర్ధులిరువురు సోషలిస్టులమని చెప్పుకొని మరీ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులుగా అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు.

చరిత్ర పునరావృతం అవుతుంది అంటే అర్ధం కొత్త రూపంలో అని తప్ప గతంలో జరిగిన మాదిరే అని కాదు. గతంలోప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రంగా ఐరోపా వుంది గనుక అక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు దాని కేంద్రం అమెరికాకు మారినందున అక్కడ నాంది పలికిందని చెప్పవచ్చు. నాడు ఐరోపాలో కమ్యూనిస్టు భావజాలం ప్రాచుర్యం పొందిన సమయంలో పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి దానిని వ్యతిరేకిస్తున్న వారే చెప్పారు. ఇప్పుడు పెట్టుబడిదారీ విధానాన్ని సమర్దిస్తున్న వారే అది వైఫల్యం చెందిందని, పని చేయటం లేదని బాహాటంగా చెప్పటం విశేషం. అమెరికాలో మీరు పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధిస్తున్నారా, సోషలిజాన్ని సమర్ధిస్తున్నారా అంటూ ఇప్పుడు జరుగుతున్న సర్వేలవంటివి కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన సమయంలో లేవు. గత కొద్ది సంవత్సరాలుగా పెట్టుబడిదారీ వ్యవస్ధకు కట్టుబడి వున్న సంస్ధల సర్వేలు చెబుతున్నదేమిటి? అమెరికాలో పెట్టుబడిదారీ విధానం వైఫల్యం చెందుతున్నదని, సోషలిజం కావాలని చెబుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అందువలన అటు డెమోక్రటిక్‌ పార్టీ ఇటు రిపబ్లికన్‌ పార్టీలో కూడా కింది నుంచి వస్తున్న వత్తిడితో ట్రంప్‌ సోషలిజం గురించి భయపడటంలో ఆశ్చర్యం లేదు. అమెరికా ఎన్నడూ సోషలిస్టు దేశంగా వుండబోదని ప్రకటించిన సమయంలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన మితవాది అయిన పార్లమెంట్‌ దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ సహజంగానే చప్పట్లతో తబ్బిబ్బు అయ్యారు. పురోగామి సెనెటర్‌గా ముద్ర పడిన ఎలిజబెత్‌ వారెన్‌ తన స్దానం నుంచి లేచి మరీ సోషలిజం మీద ప్రకటించిన ట్రంప్‌ ప్రకటించిన యుద్ధానికి చప్పట్లు చరిచారు.

Image result for A specter is haunting US , the specter of socialism

మరుసటి రోజు వుదయం అమెరికా విత్త మంత్రి స్టీవ్‌ నుచిన్‌ విలేకర్లతో మాట్లాడుతూ కేంద్రీకృత ప్రణాళికాబద్ద ఆర్ధిక వ్యవస్ధ మీద రిపబ్లికన్లకు నమ్మకం లేదని సోషలిజానికి మరలేది లేదని చెప్పాడు. నిజానికి ట్రంప్‌ సోషలిజం గురించి మాట్లాడటం వెనుక అమెరికన్లను తప్పుదారి పట్టించే ఎత్తుగడ వుంది. వెనెజులాలో సైనిక జోక్యానికి ఐదువేల మంది సైనికులను పక్కనే వున్న కొలంబియాలో మోహరించిన ట్రంప్‌ ఒక సాకుకోసం చూస్తున్నాడు. సోషలిజం కారణంగానే వెనెజులాలో పరిస్ధితులు దిగజారాయని అరోపించిన వెంటనే అమెరికా సోషలిజం గురించి ట్రంప్‌ ప్రస్తావించాడు. నిజానికి అక్కడ ఆర్ధిక పరిస్దితి దిగజారటానికి అమెరికా, ఐరోపా ధనిక దేశాల ఆంక్షలు, దిగ్బంధనమే ప్రధాన కారణం. ముందే చెప్పుకున్నట్లు రోజు రోజుకూ పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యాల గురించి జనం ప్రస్తావిస్తున్నారు. నిజానికి 80శాతం మంది అమెరికన్లు పని చేస్తే తప్ప గడవని స్ధితిలో వున్నారు. నిజవేతనాలు నాలుగు దశాబ్దాల నాటి కంటే తక్కువగా వున్నాయి. మెడికల్‌ బిల్లులు అనేక మందిని దివాలా తీయిస్తున్నాయి. విద్యార్దుల అప్పుల సంగతి సరేసరి. కోట్లాది మంది వుద్యోగ విరమణ తరువాత తమ పరిస్ధితి ఏమిటనే ఆందోళనలో వున్నారు. వెనెజులాను సాకుగా చూపి సోషలిజం మీద సైద్ధాంతిక దాడి చేస్తే అమెరికాలో పెరుగుతున్న ప్రాచుర్యాన్ని అరికట్టవచ్చని ట్రంప్‌ భావిస్తే అంతకంటే అమాయకత్వం మరొకటి వుండదు. ఇప్పుడు మరింతగా అమెరికాలో సోషలిజం గురించి చర్చ జరగటం అనివార్యం. మీడియాలో గత రెండు రోజులుగా వెలువడుతున్న విశ్లేషణలే అందుకు నిదర్శనం. ‘ అమెరికాలో సోషలిజం ఒకనాడు సమాజ ప్రధాన స్రవంతికి దూరమైన సిద్దాంతం. ట్రంప్‌ ప్రసంగానికి ముందే అది స్పష్టంగా మారుతోంది. అమెరికా సోషలిస్టు యువత ప్రమాదం గురించి భయపడుతున్న తగరగతులతో ఫాక్స్‌ న్యూస్‌ నడుస్తోంది. అయితే పార్లమెంట్‌ వుభయ సభల్లో జరిగిన దాడి తరువాత సోషలిజం సమయం వచ్చినట్లు అనుకోవచ్చు. అదిప్పుడు ప్రధాన స్రవంతి భావజాలం అధ్యక్షుడి ఆగ్రహానికి గురికావలసినదే. ఒక శత్రువు కలకు అంతగా తోడ్పడేందుకు ఎవరు సాహసిస్తారు ?’ అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు.

సోషలిజంపై పార్లమెంట్‌లో ట్రంప్‌ దాడికి వారం రోజుల ముందు వెలువడిన ఒక సర్వే వివరాలు ట్రంప్‌ను భయపెట్టి వుంటాయి. సహస్రాబ్ది తరంతో(1981-1996 మధ్య పుట్టిన వారు) పాటు అనంతర జడ్‌ లేదా యూట్యూబ్‌ తరం(1996 తరువాత పుట్టినవారు) కూడా సోషలిజంవైపు ఎక్కువగా మొగ్గుతున్నారని దానిలో తేలాయి.పదింట ముగ్గురే ట్రంప్‌ సరిగా పని చేస్తున్నారని కూడా వెల్లడైంది. 2010లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరింతగా ప్రయత్నించాలని సహస్రాబ్దితరంలో 53శాతం పేర్కొనగా ఇప్పుడు రెండుతరాల్లో అలా అభిప్రాయపడుతున్నవారు 64,70శాతం మంది వున్నారు. ముప్పై అయిదు సంవత్సరాల లోపు యువత సోషలిజం పట్ల ఎక్కువ మంది సానుకూలంగా వున్నారు. సర్వేల పేరుతో పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యాలను కప్పి పుచ్చే ప్రయత్నం ఒకవైపు జరుగుతోందని కూడా చెప్పువచ్చు. తాజా సర్వే ప్రకారం 18-24 మధ్య వయస్సు వారిలో 76శాతం, 25-44 వయస్సు వారిలో 60శాతం ప్రస్తుత ఆర్ధిక వ్యవస్ధ న్యాయంగా లేదని, ధనికులకే అనుకూలంగా వుందని అభిప్రాయపడుతున్నారని తేలింది.

అమెరికాలో సోషలిజం ఇంతగా ప్రాచుర్యం పొందటానికి కారణం ఏమిటంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే 2008లో తలెత్తిన ప్రపంచ సంక్షోభం అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు.ఆ సంక్షోభం ఆర్దిక బాధను కలిగించటమే కాదు సామాజిక వ్యవస్ధను కూడా దెబ్బతీసింది.2016లో బ్రూకింగ్స్‌ ఇనిస్టిట్యూట్‌ పేర్కొన్నదాని ప్రకారం 70లక్షల మంది అంటే 12శాతం పురుషులు పని చేయటం లేదని పేర్కొన్నది.1970దశ కంలో స్వేచ్చా వాణిజ్యం ఒక విధానంగా అమెరికాలో, ప్రపంచంలో ముందుకు వచ్చింది.2000 సంవత్సరంలో చైనా ప్రపంచ వాణిజ్య సంస్ధలో ప్రవేశించిన తరువాత అమెరికాలో 34లక్షల వుద్యోగాలు నష్టపోయినట్లు ఎకనమిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ అంచనా వేసింది. తరువాత నాలుగేండ్లకు వుత్తర అమెరికా స్వేచ్చావాణిజ్య ఒప్పందం (నాఫ్టా) వలన మరొక పదిలక్షల వుద్యోగాలు పోయినట్లు పేర్కొన్నది. వీటికి తోడు ఈ కాలంలో మరింత యాంత్రీకరణ జరగటంతో ఒకప్పుడు పాఠశాల విద్య చదువుకున్న వారికి కూడా మంచి వుద్యోగాలు దొరికిన అమెరికాలో నైపుణ్యం లేని, తక్కువ వేతనాలు లభించే వుద్యోగాలన్నింటినీ రోబోట్లు, ఇతర కృత్రిమ మేధ యంత్రాలు భర్తీ చేశాయి. దాంతో మరిన్ని లక్షల వుద్యోగాలు హరీమన్నాయి. మధ్యతరగతి అంతరించేదిశగా పరిణామాలున్నాయి. పర్మనెంటు స్ధానంలో తాత్కాలిక లేదా కాంట్రాక్టు వుద్యోగాలు గణనీయంగా పెరిగాయి. మానవ శ్రమ స్ధానంలో యంత్రాలను ఎంత ఎక్కువగా ప్రవేశపెడితే పెట్టుబడి పోగుపడటంతో పాటు లాభాలు పెరుగుతాయి. మరోవైపున కాంట్రాక్టు లేదా తాత్కాలిక కార్మికుల వేతనాలు పడిపోతాయి. ఇది ఆరోగ్య సంరక్షణ, పెన్షన్లు, కార్మిక భద్రత వంటి కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ పరిణామాలన్నింటినీ పెట్టుబడిదారీ విధాన వైఫల్యంగానూ, అది పనిచేయకపోవటంగానూ నూతన తరం చూస్తున్నది.

Image result for A specter is haunting USA , socialism

అమెరికా అంతా సజావుగా వుందని ఒకవైపు చెబుతూనే అసంతృప్తిని చల్లార్చేందుకు గత రెండు సంవత్సరాల కాలంలో ట్రంప్‌ చేయని యత్నం లేదు. అమెరికా వస్తువులను దిగుమతి చేసుకొనే విధంగా చైనాపై వత్తిడి తెస్తూ వాణిజ్య యుద్ధానికి దిగాడు. విదేశాల నుంచి వలసలు వచ్చేవారితో స్వదేశీ కార్మికులకు వుపాధి సమస్యతో పాటు వేతనాలు పడిపోతున్నాయంటూ వలసను ఆపేందుకు మెక్సికో సరిహద్దులో గోడ కట్టాలని ప్రచారం చేస్తున్నాడు. నాఫ్టా ఒప్పందం బదులు మరొక కొత్త ఒప్పందంతో అమెరికాలో వుపాధి అవకాశాలను పెంచుతానని నమ్మబలుకుతున్నాడు. 2008 నుంచి అంతకు ముందున్న పాలకులు కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసినా విఫలమయ్యారు. అమెరికాలో పెట్టుబడిదారీ విధానం పని చేయటానికి ప్రపంచంలో ఎక్కడా లేని అవకాశాలున్నాయి. అయితే ఆ వ్యవస్ధ సరిగా పనిచేయటం లేదని అసంతృప్తి చెందుతున్న యువతరమే కాదు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులే చెప్పటం గతంలో ఎన్నడూ వినలేదు. అమెరికాలో బ్రిడ్జివాటర్‌ అనే పెట్టుబడుల కంపెనీ అధిపతి రే డాలియో ‘ పెట్టుబడిదారీ వ్యవస్ధ మెజారిటీ పౌరులకోసం పని చేయటం లేదు. అది ఒక వాస్తవం’ అని గతేడాది నవంబరు నెలలో లాస్‌ ఏంజల్స్‌ నగరంలో జరిగిన సభకు పంపిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ‘నేడు జనాభాలోని ఒకశాతం ఎగువ వారిలో వున్న సంపద విలువ జనాభాలో 90శాతంగా వున్నవారితో సమంగా వుంది. 1930దశకంలో జరిగిన మాదిరే పరిస్ధితి వుంది. అత్యవసరం అయితే 40శాతం మంది పెద్దల చేతుల్లో నాలుగు వందల డాలర్లు వుండటం లేదు. ఈ పరిస్దితి మీకు ధ్రవణత గురించి ఒక అవగాహన కలిగిస్తుంది, అదే నిజమైన ప్రపంచం, అదొక సమస్య కూడా.’ అన్నారు. అయితే వాస్తవ సమస్య పెట్టుబడిదారీ విధానంతో కాదని సహజసిద్దమైన ముక్తాయింపు ఇచ్చారనుకోండి. జనంలో పెరుగుతున్న అసంతృప్తిని జోకొట్టేందుకు ధనవంతులు చేసే ఎదురుదాడి ఇది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మరో ఆయుధ పోటీకి చిచ్చు రాజేస్తున్న అమెరికా !

06 Wednesday Feb 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Arms race, INF, INF Treaty, Intermediate-Range Nuclear Forces, The 1987 INF Treaty

Image result for arms race

ఎం కోటేశ్వరరావు

మూడు దశాబ్దాల క్రితం నాటి సోవియట్‌తో కుదుర్చుకున్న ఆయుధ నియంత్రణ ఒప్పందం నుంచి వైదొలగనున్నట్లు గతేడాది మధ్యంతర ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినపుడు ఓట్ల కోసం అని అందరూ అనుకున్నారు. కానీ మరొక అడుగు ముందుకు వేస్తూ దాన్ని నిర్ధారిస్తూ ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్లు గత శుక్రవారం నాడు అమెరికా అన్నంత పనీ చేసింది. వెంటనే మేము మాత్రం తక్కువ తిన్నామా అంటూ తామూ వైదొలుగుతున్నట్లు రష్యా చెప్పేసింది. అంతేకాదు మరొక అడుగు ముందుకు వేసి నిషేధిత భూ వుపరితలం నుంచి ప్రయోగించే క్షిపణుల తయారీకి పూనుకుంటున్నట్లు ప్రకటించింది. రెండు దేశాల మాటలు వాస్తవ రూపందాలిస్తే ఆరునెలల్లో పార్లమెంట్ల అనుమతితో ఆప్రక్రియ పూర్తి అవుతుంది. దీని మీద ఐరోపా వైఖరి బహిర్గతం కావాల్సి వుంది. ఈ ఒప్పందం మీద వుభయ దేశాలు ఆరోపణల, ప్రత్యారోపణల పూర్వరంగంలో 2014 నుంచి అనేక దఫాలుగా జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. అయితే రెండు దేశాలకూ, ఐరోపాను, మొత్తంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఈ పరిణామం గురించి రెండు దేశాలకు వున్న సమస్యల కారణంగా పునరాలోచించే అవకాశాలు కూడా లేకపోలేదు.ఒప్పందాన్ని రష్యా వుల్లంఘించిందని అమెరికా ఆరోపిస్తూ ఒప్పందం నుంచి తాము వైదొలనున్నట్లు చెబుతోంది. ఫిబ్రవరి రెండవ తేదీ వరకు తాము గడువు ఇస్తున్నామని ఆలోగా సానుకూలంగా స్పందించకపోతే తాము వైదొలుగుతామని డిసెంబరులోనే పాంపియో సూచన ప్రాయంగా చెప్పారు.నిషేధిత పరిధిలోని క్షిపణులను తాము పరీక్షించలేదని, తాము వుల్లంఘించినట్లు ఆరోపణలు గాక రుజువులు చూపాలని రష్యా ప్రతిస్పందించింది. అమెరికాయే ఒప్పందానికి విరుద్ధంగా ఐరోపాలో క్షిపణులను మోహరించిందని పేర్కొన్నది.

ఎందుకీ ఒప్పందం అవసరమైంది?

ప్రచ్చన్న యుద్దంలో భాగంగా సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా ఐరోపా ధనిక దేశాలు అమెరికాతో చేతులు కలిపాయి. దాంతో తన వ్యూహంలో భాగంగా పశ్చిమ ఐరోపా దేశాల మీద దాడి చేయగల ఎస్‌ఎస్‌20 మధ్యంతర శ్రేణి క్షిపణులను సోవియట్‌ తన గడ్డమీద మోహరించింది. దానికి ప్రతిగా అమెరికన్లు ఇటలీ, బ్రిటన్‌, జర్మనీలో తమ ఆయుధాలను ఎక్కుపెట్టారు. ఈ మోహరింపును అక్కడి జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పూర్వరంగంలో మధ్య, స్వల్ప శ్రేణి అణు బలాల ఒప్పందం(ఐఎన్‌ఎఫ్‌) పేరుతో తమ వద్ద వున్న మధ్య,లఘు శ్రేణి క్షిపణులను తొలగించుకొనేందుకు 1987 డిసెంబరు ఎనిమిదిన గోర్బచెవ్‌-రోనాల్డ్‌ రీగన్‌ మధ్య కాలపరిమితి లేని ఒప్పందం కుదిరింది.మరుసటి ఏడాది జూన్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. తరువాత సోవియట్‌ రద్దు కావటంతో దాని వారసురాలిగా రష్యా ఒప్పందంలోకి వచ్చింది.ఆ మేరకు 500 నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు వున్న లఘు, వెయ్యి నుంచి 5,500 కిలోమీటర్లకు వుండే మధ్య శ్రేణి అణు, సాంప్రదాయ క్షిపణులను రెండు దేశాలు తొలగించాల్సి వుంటుంది. సముద్రం నుంచి ప్రయోగించే క్షిపణులు ఈ ఒప్పంద పరిధిలో లేవు. ఒప్పందం ప్రకారం 1991నాటికి అమెరికా 846 సోవియట్‌ లేదా రష్యా 1,846 క్షిపణులను నాశనం చేశాయి.

ఒప్పంద రద్దుకు అమెరికాను ప్రేరేపిస్తున్న అంశాలేమిటి?

గత ఐదు సంవత్సరాల పరిణామాలను చూసినపుడు ఒప్పందం రద్దు గురించి అమెరికన్ల గళమే ఎక్కువగా వినిపిస్తున్నది. రష్యా నుంచి అటువంటి ప్రకటనలు లేవు. తాజాగా ట్రంప్‌, విదేశాంగ మంత్రి పాంపియో ప్రకటనల వెనుక ఆంతర్యం గురించి కూడా పరిపరి విధాల ఆలోచనలు సాగుతున్నాయి. 1987 ఒప్పందం తరువాత అమెరికా తయారు చేస్తున్న లేదా ఇప్పటికే తయారు చేసిన అధునాతన అణ్వాయుధాలను ప్రపంచం ముందుంచాలంటే రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం ఆటంకంగా వుంది. రష్యా, చైనా వంటి సుదూర లక్ష్యాలను చేరగల క్షిపణిని తయారు చేస్తున్నట్లు అమెరికా ఇంధన శాఖ సూచన ప్రాయంగా ఇటీవలనే వెల్లడించింది.1987 ఒప్పందంలో చైనా లేని కారణంగా అది స్వంత అణ్వాయుధ మరియు అన్ని శ్రేణుల సాంప్రదాయ క్షిపణులను తయారు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చిందని, ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం ఐరోపా కేంద్రంగా చేసుకున్నదని అమెరికా-చైనా మిలిటరీ బలాబలాలను పరిగణనలోకి తీసుకోవలేదని, ఆ అంశం ఇటీవలి కాలంలో అమెరికా వ్యూహాత్మక లెక్కల్లో కేంద్ర స్ధానాన్ని ఆక్రమించిందని అమెరికాలో కొత్త వాదనలు లేవనెత్తారు. గత మూడు దశాబ్దాలలో అనేక దేశాలు అధునాతన అణ్వాయుధాలను తయారు చేశాయి. ఇది రెండు దేశాలకే పరిమితమైనందున వాటిని నియంత్రించే అవకాశం లేదు. అందువలన దానికి ఎందుకు కట్టుబడి వుండాలని, గతంలో కుదిరిన ఒప్పందాలన్నీ అమెరికాను అదుపు చేసే లక్ష్యంతోనే జరిగాయని, అందువలన వాటికెందుకు కట్టుబడి వుండాలని యుద్ధోన్మాదులు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. దీనికి అనుగుణ్యంగానే అధికారానికి వచ్చినప్పటి నుంచి ట్రంప్‌ వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరోవైపు ఒబామా, ట్రంప్‌ ఎవరు అధికారంలో వున్నా ఏటేటా రక్షణ బడ్జెట్‌ పెంపుదల వెనుక నూతన ఆయుధాల తయారీ వుందన్నది స్పష్టం.ఒప్పందం నుంచి వైదొలుగుతామని ప్రకటించటంలో ముందుండటమే కాదు, దాని ప్రారంభంలోనే తూట్లు పొడిచింది. ఒప్పందం కుదిరిన నాలుగు సంవత్సరాల తరువాత 1991లో అమెరికా తన తొలి దీర్ఘశ్రేణి అణ్వాయుధాల తయారీకి పూనుకుంది. దాన్ని చూపి మిగతా దేశాలు కూడా తమ ప్రయత్నాల్లో తాము నిమగ్నమయ్యాయి.

ఒప్పంద రద్దు పర్యవసానాలేమిటి ?

ఒప్పందం రద్దు పర్యవసానాల గురించి కూడా చర్చ జరుగుతోంది.అమెరికా, రష్యా చర్యలు ప్రపంచంలో నూతన ఆయుధ పోటీకి తెరలేపుతాయని భయపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ పోటీ రెండు దేశాలకే పరిమితం కాగా నూతన పరిస్ధితుల్లో చైనా కూడా అనివార్యంగా రంగంలోకి దిగాల్సి వుంటుంది. నిజంగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే అమెరికా, రష్యా, చైనా మధ్య నూతన తరహా ప్రచ్చన్న యుద్ధం వంటి పరిస్ధితి తలెత్తుతుందని, గతం కంటే ఇప్పుడు రష్యా, చైనాలు మరింత సన్నిహితంగా వున్న విషయాన్ని మరచిపోరాదని అమెరికా గూఢచార సంస్ధలు హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.నిజంగానే రద్దు చేసుకుంటే రష్యాతో ఎలా వ్యవహరించాలన్నది తక్షణం అమెరికా ముందున్న సమస్య. 2021లో నూతన వ్యూహాత్మక అణ్వాయుధ ఒప్పందం(న్యూ స్టార్ట్‌) కుదిరే అవకాశాలు లేవు. అది లేకుండా అణ్వస్త్రవ్యాప్తి నిరోధ అమలు సాధ్యం కాదు. అన్నింటికీ మించి అణ్వాయుధాలు అనేక దేశాల దగ్గర వున్నందున వాటన్నింటినీ కట్టడి చేయటానికి అవసరమైన పెద్ద సంఖ్యలో ఆయుధాలు తయారు చేయటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, వుత్పాదక శక్తి, ఆర్ధిక సామర్ధ్యం లేదన్నది ఒక అంచనా. వాటన్నింటినీ అధిగమించి అన్ని దేశాలకు వ్యతిరేకంగా అణ్వాయుధాలను మోహరిస్తే అమెరికా మరింతగా ఒంటరిపాటు కావటం ముఖ్య రాజకీయ పర్యవసానం అవుతుంది. ఆయుధాలను మోహరించటం తప్ప ప్రయోగించే పరిస్ధితి లేనపుడు ఇలాంటి పరిస్ధితిని కొని తెచ్చుకోవటం ఎందుకన్నది మౌలిక సమస్య. ఇప్పటికే అమెరికా తమ మీద పెత్తనం చేస్తున్నదని, తమ భద్రత తాము చూసుకోగలమని ఐరోపా ధనిక దేశాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు నాటో ఖర్చును ఐరోపా దేశాలే ఎక్కువగా భరించాలని అమెరికా వత్తిడి తెస్తోంది. ఇప్పుడు నూతన ఆయుధాలను మోహరించాలంటే అది రష్యాతో వైరాన్ని పెంచటమే గాక తమ జనాన్ని ఒప్పించటం ఐరోపా దేశాలకు అంత తేలిక కాదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నపుడు గత అనుభవాల రీత్యా అవసరమైన నూతన ఆయుధాలను తయారు చేసుకొనే వరకు వున్న ఒప్పందాలను కొనసాగించక తప్పని స్ధితిలో అమెరికా వుంటుందన్నది ఒక అభిప్రాయం. ఒప్పందం నుంచి వైదొలిగితే ట్రంప్‌ ఎప్పటి నుంచో చెబుతున్నట్లు ఐరోపాలో అమెరికా మరిన్ని కొత్త ఆయుధాలను మోహరించటం, దానికి ప్రతిగా రష్యా చర్యలు వుంటాయి. నిజంగా ఒప్పందం రద్దయితే జర్మనీ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఐరోపా భద్రతకు, వ్యూహాత్మక సమతుల్యానికి ఒప్పందం కొనసాగటం అవసరమని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ వ్యాఖ్యానించగా, అమెరికా ఆయుధాల మోహరింపు బహుముఖ ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయని చైనా పేర్కొన్నది.మధ్యంతర ఎన్నికల సమయంలో ట్రంప్‌ చేసిన ప్రకటనతో నాటో కూటమి దేశాలలో ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా వ్యక్తమైంది. తాజా పరిస్ధితికి రష్యాదే పూర్తి బాధ్యత అని అమెరికా నాయకత్వంలోని నాటో తాజాగా వ్యాఖ్యానించటంలో ఆశ్చర్యం లేదు. డెమోక్రటిక్‌ పార్టీ సెనేటర్‌ ఎడ్వర్డ్‌ జె మార్కే మాట్లాడుతూ ప్రమాదకరమైన ఆయుధపోటీకి దారి కల్పిస్తూ ట్రంప్‌, అతని యుద్ధ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నదని విమర్శి ంచారు. నాటో విస్తరణ ముసుగులో పోలాండ్‌, ఇతర బాల్టిక్‌ దేశాలలో ఆయుధాలను మోహరించేందుకు అమెరికా పూనుకుంది. ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందం నుంచి వైదొలిగి ఆయుధాలను మోహరిస్తే అవి కొన్ని నిమిషాల్లోనే రష్యాలో విధ్వంసాన్ని సృష్టిస్తాయి. అందువలన వాటికి ప్రతిగా తాము వంద మెగాటన్నుల విధ్వంసక బాంబులను తీసుకుపోయే క్షిపణులను తయారు చేయక తప్పదని రష్యన్లు హెచ్చరించారు.

ఇటీవలి కాలంలో అమెరికా అంతర్జాతీయ వ్యవస్ధ నుంచి ఏకపక్షంగా వైదొలుగుతున్నది. వాతావరణ మార్పులు, భూతాపం తదితర అంశాలున్న పారిస్‌ ఒప్పందం నుంచి, ఇరాన్‌తో అణు ఒప్పందం, అంతర్జాతీయ పోస్టల్‌ యూనియన్‌ నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అవన్నీ ఒక ఎత్తయితే తాజా ప్రకటన అత్యంత ప్రమాదకర చర్యల, అంతర్జాతీయ భద్రత మీద ఎంతో పభావం చూపనుంది. తమ వద్ద వున్న పాత తరం అణ్వాయుధాలను వదలించుకొనేందుకు ఒప్పందంలో అమెరికా భాగస్వామి అయిందనే ఒక అభిప్రాయం వుంది. ఇప్పుడు అంతకంటే అధునాతన ఆయుధాలున్నందున మరోసారి ప్రపంచాన్ని భయపెట్టేందుకు పూనుకుందని చెప్పాలి. రెండవ ప్రపంచ యుద్ధం దాదాపుగా ముగిసిన తరువాత ప్రపంచాన్ని భయపెట్టేందుకు అమెరికన్లు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై ప్రయోగించిన ‘లిటిల్‌ బోయ్‌, ఫాట్‌ మాన్‌ ‘ అణుబాంబులు ఇప్పటి వాటితో పోల్చితే చాలా చిన్నవి. అయినా అవెంత మారణకాండకు కారణమయ్యాయో ఇప్పటికీ ఆ ప్రాంతంలో అణుధార్మికత ఎలా వుందో చూస్తున్నాము.మరోసారి ప్రపంచ యుద్దమంటూ వస్తే మిగిలే దేశం ఒక్కటీ వుండదు.ప్రచ్చన్న యుద్దం 35వేల అణ్వాయుధాల తయారీకి దారితీసింది. వాటితో ప్రపంచాన్ని ఎన్నిసార్లు నాశనం చేయవచ్చో వూహించుకోవాల్సిందే. అలాంటి పోటీని మరింతగా పెంచేందుకు అమెరికా పూనుకుంది. ఇది అత్యంత దుర్మార్గం.నిజంగానే ఒప్పందం రద్దయితే ఆ చారిత్రాత్మక ఎదురుదెబ్బకు బాధ్యురాలు అమెరికానే అవుతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మోడీయే స్వయంగా అస్త్రాలు అందిస్తుంటే విభీషణులతో పనేమిటి ?

03 Sunday Feb 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

India budget, India Unemployment, Jobs in India, Narendra Modi sarkar

Image result for narendra modi sarkar itself giving astras to opposition cartoons

ఎం కోటేశ్వరరావు

కేంద్రంలోని నరేంద్రమోడీ నాయకత్వం రానున్న లోక్‌సభ ఎన్నికలలో లబ్ది పొందేందుకు సరిగ్గా నోటిఫికేషన్‌కు ముందు ప్రతిపక్షాల వూహకు అందని అస్త్రాలను బయటకు తీస్తోందని ఆ పార్టీతో పాటు దానికి కొమ్ముకాసే మీడియా ప్రచారం చేసింది. బడ్జెట్‌ తాయిలాలతో ఆ పర్వం ముగిసి అస్త్రాలు అయిపోయాయని అనుకోవాలి. ఇన్ని చేసినా తమకు అధికారం దక్కదేమో అనే అనుమానం తలెత్తితే ఇంకా వేటిని బయటకు తీస్తారో తెలియదు. తమది వ్యత్యాసంతో కూడిన పార్టీ అని బిజెపి స్వయం కితాబు ఇచ్చుకుంది. మన కష్టజీవులకు కానప్పటికీీ నరేంద్రమోడీకి అత్యంత మిత్రదేశమైన అమెరికా జాతీయ గూఢచార డైరెక్టర్‌ కార్యాలయం(ఓడిఎన్‌ఐ) తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. బిజెపి పాలిత ప్రాంతాలలో ఎన్నికలకు ముందు మతఘర్షణలు జరగవచ్చని దానిలో చెప్పినందున చివరకు ఆ మారణాస్త్త్రాలను ప్రయోగిస్తే చెప్పలేము. రామాయణంలో రావణుడిని ఎలా చంపాలో విభీషణుడు చెబితేనే రాముడికి సాధ్యమైంది. ఆ తరువాత రావణకాష్టం గురించి తెలిసిందే. ఇప్పటికే అనేక రామాయణాలు ప్రచారంలో వున్నాయి. బిజెపి రామాయణం కొత్తది. మోడీని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలకు ఆ పార్టీలోని విభీషణుల అవసరం లేదు. మీడియా వర్ణించినట్లు మోడీ అస్త్రాలను బయటకు తీశారా లేక మోడీయే ప్రతిపక్షాలకు అస్త్రాలను అందించారా ?

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అన్న సామెత తెలిసిందే. అలాగే తాను భిన్నమైన పార్టీ అని బిజెపి స్వంతడబ్బా ఏమికొట్టుకున్నప్పటికీ కాంగ్రెస్‌కూ దానికీ పెద్ద తేడా లేదని,దేశంలోని వ్యవస్ధలను దెబ్బతీయటం, దుర్వినియోగం చేయటం, జనానికి విశ్వాసం లేకుండా చేయటంలో కాంగ్రెస్‌ కంటే రెండాకులు ఎక్కువే చదివిందని ఇటీవలి కాలంలో స్పష్టంగా నిరూపించుకుంది. కాంగ్రెస్‌ పాలనా కాలంలో జనం మీద మోపే భారాలను ముందుగానే ప్రకటించి బడ్జెట్లను భారాలు లేనివిగా ప్రకటించుకొని ఆ ప్రక్రియను ఒక ప్రహసనంగా మార్చారు. దాన్ని గతంలో బిజెపి కూడా కొనసాగించింది. తాజాగా జిఎస్‌టి విధానం అమలులోకి వచ్చిన తరువాత ఆ రేట్ల తగ్గింపు హెచ్చింపు అన్నది ఇష్టమొచ్చినపుడు చేసే అవకాశం వుండటంతో పధకాల ప్రకటన మినహా బడ్జెట్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది. వడ్డించేవారు మనవారైతే కడబంతిలో వున్నా మనకు అన్నీ అందుతాయన్న లోకోక్తి తెలిసిందే. బడ్జెట్‌ కూడా అంతే. తమకేమి ఒరగబెడతారా అని సామాన్యులు, మధ్యతరగతి ప్రదర్శించే ఆతృత ధనికులు, కార్పొరేట్లలో కనిపించదు. ఎందుకంటే ప్రభుత్వం తమది కనుక గుట్టుచప్పుడు కాకుండా తమ సింహభాగాన్ని తాము చక్కపెట్టుకొనేందుకు వారేమీ హడావుడి చెయ్యరు.

బడ్జెట్‌ సమర్పణ గురించి సంప్రదాయాలు, స్వయం నిబంధనలు తప్ప ఒక నమూనా లేదు. బ్రిటీష్‌ వారి పాలనలో మన దేశంలో ఆప్రక్రియ మొదలైంది గనుక వారి పద్దతిని, ప్రవేశ సమయాన్ని మనదేశంలో కూడా అమలు జరిపారు. సమగ్ర చర్చకు అవకాశం లేని పరిస్ధితుల్లో మూడునెలలకు సరిపడా అవసరాలకు ఖజానా నుంచి నిధులు తీసుకొనేందుకు అనుమతించే ప్రక్రియను ఓట్‌ఆన్‌ అకౌంట్‌ అంటారు. ఎన్నికలు జరగబోయే తరుణంలో అధికారంలోకి వచ్చే సర్కార్‌ ఎవరిదో, బడ్జెట్‌ ప్రాధాన్యతలు ఏమిటో తెలియవు గనుక ఈ పద్దతిని అనుసరించటం ఆనవాయితీగా వచ్చింది. తొలిసారిగా నరేంద్రమోడీ సర్కార్‌ దాన్ని తుంగలో తొక్కింది. మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. నిధుల విడుదలకు ఆమోదం తెలపటం తప్ప దీని మీద జరిగే చర్చ ఏమీ వుండదు. తమ ఐదేండ్ల పాలనతో ప్రజల విశ్వాసం పొంది తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకం బిజెపిలో లేదని ఈ బడ్జెట్‌ స్పష్టం చేసింది. ఏదైన ఒక చట్టం లేదా చట్ట సవరణ అవసరాలను బట్టి వెనుకటి తేదీ నుంచి అమలులోకి తీసుకురావటం కొత్తేమీ కాదు. కానీ ఓట్ల కోసం రైతుల నిధి ఏర్పాటు, దాన్నుంచి చిన్న రైతులకు మూడు విడతలుగా రెండేసి వేల చొప్పున ఆరువేల రూపాయల అందచేత పధకాన్ని వచ్చే ఏడాది బడ్జెట్‌లో ప్రవేశపెట్టి దాన్ని గత ఏడాది నుంచి అమలయ్యే విధంగా చూశారంటే ఎన్నికల ఆపదమొక్కులు తప్ప మరొకటి ఎలా అవుతుంది.బడ్జెట్‌ ప్రహసనం ప్రతిపక్షాలకు మోడీ అందించిన అస్త్రం కాదా ?

తాము అధికారానికి వస్తే రామాలయ నిర్మాణం చేస్తామన్నది బిజెపి వాగ్దానం. అది సమర్ధనీయమా కాదా అన్నది ఒక అంశమైతే ఎందుకు అమలు జరపలేదో, ఎవరు అడ్డమొచ్చారో బిజెపి చెప్పాలా లేదా ? ఎప్పుడో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అయోధ్య భూమిలో వివాదాస్పదం గాని స్ధలాన్ని యజమానులకు అప్పగించేందుకు అనుమతించాలని సుప్రీం కోర్టు అనుమతి కోరుతూ సరిగ్గా ఎన్నికలకు ముందుకు కేంద్రం పిటీషన్‌ దాఖలు చేయటం ఎన్నికల ఎత్తుగడ కాదా ? దీన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించవా? దాని వెనుక వున్న వాస్తవాన్ని జనం ముందుంచవా ? బాబరీ మసీదు వున్న స్దలంపై హక్కు వివాదంలో దాఖలైన అన్ని పిటీషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు నిర్ణయం ఆకస్మికంగా జరగలేదు. దానిపై తీర్పు ఎన్నికలకు ముందే వస్తుందన్న నమ్మమూ లేదు. ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రయాగలో విశ్వహిందూపరిషత్‌ నిర్వహించిన ధర్మసంసద్‌లో ప్రసంగించిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌భగవత్‌ చెప్పిందేమిటి? ‘వారు(బిజెపి) రామాలయం గురించి మాట్లాడేది కేవలం ఓట్లు పొందేందుకే.అయితే విశ్వాసాన్ని దృష్టిలో వుంచుకొని ఆలయ నిర్మాణం జరుగుతుంది. మూడు నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకుంటే మంచిదే, లేనట్లయితే నాలుగు నెలల తరువాత ఆలయ నిర్మాణం ప్రారంభం అవుతుంది.’ దీనికి రెండు రోజుల ముందు శంకరాచార్యల్లో ఒకరైన స్వరూపానాంద సరస్వతి అక్కడే మాట్లాడుతూ ఫిబ్రవరి 21న అయోధ్యయాత్ర చేసి అదే రోజు ఆలయ నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తామని, ఇంకేమాత్రం ఆలస్యం కాకూడదని చెప్పారు. వివాదం లేని చోట రామాలయం కట్టేందుకు ఎవరూ అడ్డపడలేదే? లేదూ బాబరీ మసీదు స్ధలంలోనే కట్టాలనుకుంటే దాని యాజమాన్యంపై దాఖలైన పిటీషన్లపై కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలి, కోర్టు తీర్పునకు కట్టుబడి వుండాలి.ఓట్ల కోసం నాటకాలు గాకపోతే ఏమిటిది?

ప్రపంచంలో మన రిజర్వుబ్యాంకు, మన ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ వ్యవస్ధలకు ఒక ప్రత్యేకత వుంది. 2007లో ప్రపంచ ధనిక దేశాలలో బ్యాంకులు కుప్పకూలటంతో ప్రారంభమైన ఆర్దిక సంక్షోభానికి మన బ్యాంకులు, ఆర్ధిక వ్యవస్ధ అంతగా ప్రభావితం గాకపోవటానికి, నిలబడటానికి రిజర్వుబ్యాంకు విధానాలే కారణం. దాని అధిపతితో నిమిత్తం లేకుండా ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతీసుకున్నారు. దాని వలన జరిగిన నష్టం ఏమిటో తెలిసిందే. రద్దు నిర్ణయ సమయంలో మాట్లాడటం తప్ప ఇంతవరకు మోడీ నోరు విప్పలేదు. నల్లధనమేమీ బయటకు రాకపోగా దాన్ని కలిగిన వారంతా తెల్లధనంగా మార్చుకున్నారు.దేశ ఆర్ధిక వ్యవస్ధకు, ప్రత్యేకించి సామాన్యులకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. ప్రభుత్వం దాని మీద చర్చ జరిపేందుకు భయపడింది, అసలేమీ జరిగిందో చెప్పేందుకు కూడా ముందుకు రాలేదు. రిజర్వుబ్యాంకు సైతం తేలుకుట్టిన దొంగలా ఏడాదిన్నర తరువాత వార్షిక నివేదికలో వివరాలు వెల్లడించటం తప్ప ఇతరంగా ప్రశ్నించటానికి అవకాశం ఇవ్వలేదు. పెద్ద నోట్ల రద్దుకు ముందు తమతో సంప్రదించగా ఆ చర్యను వ్యతిరేకించామని, తమతో సంబంధం లేకుండానే రద్దు నిర్ణయాన్ని ప్రకటించారని రాజీనామా చేసిన తరువాత రిజర్వుమాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వెల్లడించారు. ఇతరుల మాదిరి రెండోసారి పదవీకాలాన్ని పొడిగించేందుకు మోడీ సర్కార్‌ తిరస్కరించింది. రాజన్‌ స్ధానంలో వచ్చిన గవర్నర్‌ వుర్జిత్‌ పటేల్‌ను అర్ధంతరంగా పదవి నుంచి తప్పుకొనేట్లు చేసింది మోడీ సర్కార్‌. తాము కోరిన విధంగా పెద్ద మొత్తంలో డివిడెండ్‌ రూపంలో ఆర్‌బిఐ నిల్వనిధులను ప్రభుత్వానికి బదిలీ చేయాలని వత్తిడి చేయగా తిరస్కరించిన పటేల్‌ రాజీనామా చేసి తప్పుకున్నారు. గత ఎన్నికలకు ముందు దేశ, విదేశాల్లో వున్న నల్లధనాన్ని వెలికి తీస్తే ప్రతి ఒక్కరికి 15లక్షల రూపాయల వంతున పంచవచ్చునంటూ కబుర్లు చెప్పిన పెద్దమనిషి గత ఐదేండ్లలో ఏ గుడ్డి గుర్రానికి పండ్లుతోమారో తెలియదు. తాజా మధ్యంతర బడ్జెట్లో తన ప్రభుత్వం నల్లధనం వెలికితీతకు కట్టుబడి వుందంటూ పెద్ద జోక్‌ పేల్చారు.

విదేశాలలో మన దేశ ప్రతిష్టను పెంచేందుకు, పెట్టుబడుల కోసమే తాను విదేశీ పర్యటనలు చేశానని, ఏటా రెండు కోట్ల వుద్యోగాలు, నైపుణ్యశిక్షణ కలిగించి మెరుగైన వుపాధి కల్పించామంటూ వూదరగొట్టిన అతి పెద్ద బెలూన్‌ గాలిని గత నాలుగున్నర దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా దేశంలో నిరుద్యోగం పెరిగిందన్న ప్రభుత్వ సంస్ధ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తాజా నివేదిక తుస్సుమనిపించింది. నాలుగేండ్లమోడీ పాలన తరువాత ఆరున్నర కోట్ల మంది యువతీయువకులు నిరుద్యోగులుగా వున్నారని వెల్లడించింది. అత్యవసర పరిస్ధితికి ఐదు సంవత్సరాల ముందు గరీబీ హఠావో నినాదంతో ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన తరువాత దేశంలో పరిస్ధితి మరింత దిగజారింది. దానికి తోడు రాజకీయంగా తగిలిన ఎదురు దెబ్బల నుంచి తప్పించుకొనేందుకు అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు. దానికి రెండు మూడు సంవత్సరాల ముందున్న స్ధాయికి తిరిగి ఇప్పుడు నిరుద్యోగం పెరిగిందన్నది తాజా నివేదిక సారాంశం. 2017జులై నుంచి 2018జూన్‌ మధ్యకాలంలో సేకరించిన సమాచారం మేరకు 6.1శాతం నిరుద్యోగులున్నారు. వారం వారం సేకరించే సమాచార విశ్లేషణ ప్రకారం తాజా వారంలో నిరుద్యోగశాతం 8.9గా నమోదైందంటే ఎంత వేగంగా పరిస్ధితి దిగజారుతోందో అర్ధం చేసుకోవచ్చు.

మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు కిసుక్కున నవ్వినందుకు ఎక్కువ బాధ అన్నది కొత్త నుడికారం. తన ఏలుబడిలో వుపాధి అంత అధ్వాన్నంగా వుందన్న నివేదికాంశాల కంటే అది బయటకు వచ్చిన తీరు నరేంద్రమోడీని తగలరాని చోట దెబ్బతీసింది. నష్ట నివారణకు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కాదు. తిట్టబోతే అక్క కూతురు-కొట్టబోతే కడుపుతో వుంది అన్నట్లు పరిస్ధితి తయారైంది. వుపాధి గురించి నివేదిక రూపొందించింది ప్రభుత్వ సంస్ధ. అది బయటకు వస్తే ఎన్నికలలో ప్రభావం చూపుతుందని మోడీకి అర్ధమైంది.జాతీయ గణాంక కమిషన్‌ ఆ నివేదికను ఆమోదించింది. దాన్ని బహిర్గతం చేసేందుకు మోడీ కార్యాలయం అడ్డుపడటంతో నిరసన తెలుపుతూ ఇద్దరు కమిషన్‌ సభ్యులు ఈ మధ్యనే రాజీనామా చేశారు. సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడినట్లుగా దాచి పెట్టేందుకు ప్రయత్నించిన నివేదిక బయటకు వచ్చినదాని కంటే దానిలోని అంశాలను ఇంకా ప్రభుత్వం ఆమోదించలేదు, అది తాత్కాలికమైనది అని అటూఇటూ తిప్పి నష్టనివారణకు నీతి ఆయోగ్‌ వున్నతాధికారి చెప్పటం తగలరాని చోట మోడీ సర్కార్‌మీద దెబ్బ వేసినట్లయింది. నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకున్న వుపాధి కల్పన పధకాలు గణనీయంగా వుద్యోగాలను కల్పిస్తాయంటూ ప్రధాన మంత్రి ఆర్ధిక సలహాదారుల మండలి సభ్యుడు వివేక్‌ దేవరాయ్‌ చెప్పిన వీడియోను రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తన ఫేస్‌బుక్‌లో ఈ సందర్భంగా పోస్టు చేయటం గమనించాల్సిన అంశం. తన శాఖకు సంబంధం లేని అంశాన్ని ఆమె ఎందుకు పోస్టు చేశారో తెలియదు. బహుశా ప్రధాని ‘రక్షణ’ కోసం అనుకుందాం.

ఎన్నికల ముందు ఇలాంటి జిమ్మిక్కులు పనిచేస్తాయా అన్నది అపూర్వ చింతామణి ప్రశ్న. గత ఏడు దశాబ్దాలుగా అధికార పార్టీలు పట్టువదలని విక్రమార్కుడిలా జిమ్మిక్కులకు పాల్పడినా మొత్తం మీద పని చేయలేదు. మట్టి కరచిన వుదంతాలే ఎక్కువ.తాజాగా బిజెపి నాయకత్వ తీరు తెన్నులను, జరుగుతున్న పరిణామాలను చూస్తే కారల్‌ మార్క్స్‌ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. దోపిడీ స్వభావం కలిగిన పెట్టుబడిదారీ వ్యవస్ధ లాభాల కోసం వస్తువులతో పాటు తన గోరీ కట్టే కార్మికులను కూడా తయారు చేసుకుంటుందన్నారు. దాన్ని కొద్దిగా మార్పు చేస్తే మార్క్స్‌ చెప్పినట్లు నరేంద్రమోడీ తన పదవిని పదిల పరుచుకొనేందుకు కొన్ని అస్త్రాలను బయటకు తీయటంతో పాటు తన మీద సంధించే బలమైన అస్త్రాలను కూడా ప్రత్యర్ధులకు అందిస్తున్నారు అని చెప్పక తప్పదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: