• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: October 2016

ప్రపంచబ్యాంకు ర్యాంకుల పోటీలో పాకిస్థాన్‌ కంటే వెనుకబడిన మోడీ !

30 Sunday Oct 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

anti globalization movement, Doing business rankings, globalization, India-Pakistan, Narendra Modi, WB Doing business ranking

ప్రపంచీకరణ – పర్యవసానాలు -1

ఎం కోటేశ్వరరావు

   ప్రపంచంలో నిత్యం అనేక అంశాల గురించి చర్చలు జరుగుతూనే వుంటాయి. చర్చ అంటేనే విరుద్ధ అంశాల మధనం. పురాణాలలో చెప్పిన దాని గురించి నమ్ముతున్నారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే నమ్మే వారు చెప్పిన క్షీర సాగర మధనం అమృతం కోసమే జరిపినప్పటికీ ఆ క్రమంలో అనేకం బయట పడ్డాయి. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ప్రధాన మధనం ప్రపంచీకరణ లేదా దాని మరోపేరు సరళీకరణ ఫలితాలు, పర్యవసానాల గురించే అన్నది తెలిసిందే. నేతి బీరకాయలో నెయ్యి మాదిరి దానికి పెట్టిన పేరు వుదారవాదం. పెట్టుబడిదారీ విధానం దుష్టమైందన్న పేరు బాగా ప్రాచుర్యంలోకి రావటంతో ఎంతో తెలివిగా దాని పేరు మార్చారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ, ప్రపంచవాణిజ్య సంస్ధ ఇలా అనేకం ఏ పేరుతో పని చేసినా కార్పొరేట్ల లాభాలను, ఆ వ్యవస్ధను కాపాడే రూపాలు, ఆయుధాలే. మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఎన్ని అవతారాలేత్తినా దుష్ట సంహారం కోసమే అని చెప్పినట్లుగా పెట్టుబడిదారులు కూడా కార్మికవర్గాన్ని దోచుకొనేందుకు వర్తమానంలో ఎత్తిన అవతారమే ప్రపంచీకరణ. దానిపై జరుగుతున్న మధనంలో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి.

   ప్రపంచబ్యాంకు 2017వ సంవత్సరానికి మనకు ప్రధానం లేదా దానం చేసిన వ్యాపార ర్యాంకు 131, అంతకు ముందు సంవత్సరం 130 వుంది.మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు బాధ పడి నట్లుగా మన ప్రధాని, కేంద్ర మంత్రుల పరిస్థితి తయారైందంటే అతిశయోక్తి కాదు. ఎలాగంటే మన దేశం ఒక ర్యాంకును మెరుగుపరచుకుంటే పొరుగుదేశం పాకిస్థాన్‌ 148 నుంచి 144కు పెరిగి నాలుగు స్ధానాల ఎగువకు వెళ్లింది. చైనా 80 నుంచి 78 కి పెంచుకొని తన స్ధానాన్ని మెరుగు పరుచుకుంది. దాంతో మన కంటే ఇతర దేశాలు మంచి సామర్ధ్యాన్ని ప్రదర్శించినట్లే అనే కొందరు చేసిన వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లయింది. తాను అనేక సంస్కరణలను చేపట్టినా ప్రపంచబ్యాంకు వాటిని ఎందుకు పట్టించుకోలేదు, గతేడాది కంటే మన ర్యాంకును గణనీయంగా ఎందుకు పెంచలేదు అని ప్రధాని నరేంద్రమోడీ ఒక రాత్రంతా తనలో తాను తెగ మధన పడిపోయారు. తన మంత్రులు, అధికారులతో కూడా మధించి నెలరోజుల్లో నివేదిక ఇమ్మని ఆదేశించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వచ్చిన ర్యాంకు వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ను మరింత కుంగదీసింది. రానున్న కొద్ది సంవత్సరాలలో మన ర్యాంకు 50కి చేర నుందని ఈ ఏడాది మే నెలలోనే ఆమె ఆనందంగా ఆశాభావం వెలిబుచ్చారు. తీరా దరిదాపుల్లో లేకపోవటంతో తీసుకున్న చర్యలన్నీ ప్రపంచబ్యాంకు విధించిన గడువులోగా అమలులోకి రానందున వాటిని పరిగణనలోకి తీసుకోలేదని, వచ్చే ఏడాది ర్యాంకులో ఫలితం కనిపిస్తుందని ట్వీట్‌ చేశారు.

మోడీ బృందం ఎందుకు భంగపాటుకు గురైంది ? నిజానికి ఈ ర్యాంకులు అంకెల గారడీ తప్ప మరొకటి కాదు. మన విద్యావిధానాల మాదిరి ఒకేడాది నిర్ణయించిన ప్రమాణాలు మరొక ఏడాది వుండవు. వాటికి ఇచ్చే మార్కులు కూడా అంతే. కొన్ని ర్యాంకుల తీరుతెన్నులను గమనించండి. నా చిన్న తనంలో గ్రామాలలో బుర్ర కథలు, హరికథల వంటి కళారూపాలను ప్రదర్శించే వారు తమకు మంచి భోజనాలు, భారీ ఎత్తున ధన ధాన్యాలతో సత్కారాలు పొందేందుకు ఏ వూరు వెళితే ఆ వూరి వారిని వుబ్చించేవారు. చుట్టుపక్కల 66 వూళ్లకు మీ వూరు పోతుగడ్డ అని చెప్పగానే నిజమే కావాలనుకొని ప్రతి వూరి వారూ నరేంద్రమోడీ చెప్పినట్లు రొమ్ములు చరుచుకొనే వారు. తమ వ్యాపారాలకు రాయితీలు పొందేందుకు, సులభంగా అనుమతులు సంపాదించుకొనేందుకు కాస్త రూపం మార్చి ‘పోతుగడ్డ’ టెక్నిక్‌ను వాడుతున్నారు.

ఆ క్రమంలో గత రెండున్నర సంవత్సరాలలో అనేక సంస్ధలు నరేంద్రమోడీ సర్కార్‌ను ఆకాశానికి ఎత్తుతున్నాయి. ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్‌ ఒక్కసారిగా 16 దేశాలను దాటి 39వ ర్యాంకుకు చేరినట్లు ప్రపంచ ఆర్ధిక వేదిక( డబ్ల్యుఇఎఫ్‌ ) ప్రకటించింది. చంద్రబాబు నాయుడు వంటి వారికి ఇదొక పవిత్ర స్ధలం. ప్రతి ఏటా వెళ్లి వచ్చి ఆర్భాటం చేస్తుంటారు. వెళ్లి రావటం ఒక ఘనతగా ప్రచారం చేసుకుంటారు. అవినీతి విషయంలో అవినీతి విషయంలో ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్ధ సూచికలో ఏకంగా భారత్‌ తొమ్మిది పాయింట్లను మెరుగుపరచుకుందని వార్తలు వచ్చాయి. http://timesofindia.indiatimes.com/india/Indias-ranking-on-global-corruption-index-improves/articleshow/45358144.cms  చిత్రం ఏమిటంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఆరునెలలు పూర్తి అవుతున్న సమయంలో ఈ ర్యాంకుల ప్రకటన జరిగింది. దాని ప్రకారం మన్మోహన్‌ సింగ్‌ అధికార చివరి సంవత్సరం 2013లో 94వ ర్యాంకులో వుండగా 2014లో 85వ స్ధానానికి మెరుగుపరచుకుంది. దీనికి మోడీ ప్రభుత్వం తీసుకున్న అవినీతి రహిత చర్యలే కారణమంటూ ఆయన భక్తులు బాపు సినిమా ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు ఏర్పాట్లను గుర్తు చేశారు. మరుసటి ఏడాదికి ఆ ర్యాంకు 76కు చేరింది. మరో తొమ్మిది ర్యాంకులను పెంచారు.http://www.transparency.org/cpi2015#results-table  ఇది ఆ సంస్ధ అధికారిక వెబ్‌సైట్‌ చిరునామా. దీని ప్రకారం 2012,13 మనకు వచ్చిన మార్కులు నూటికి 36, మోడీ హయాం 2014,15లో వచ్చినవి 38. ఇదే సమయంలో పాకిస్థాన్‌ 27 నుంచి 30కి పెంచుకుంది. మిగిలిన దేశాలలో అవినీతి పెరిగి మన ర్యాంకు మెరుగుపడింది తప్ప మన మార్కులు పెరిగి కాదన్నది స్పష్టం అవుతోంది.

ఇక కొత్త కల్పనల సూచిక వరుసగా ఐదు సంవత్సరాలు పడిపోతూ వున్నది కాస్తా 81నుంచి 2015లో 66కు పెరగటం కూడా నరేంద్రమోడీ ఘనతే అని చెప్పారు.http://www.dnaindia.com/money/report-india-s-rank-on-global-innovation-index-improves-to-66-2247413 కొత్త కల్పనలు రహస్యంగా వుండేవేమీ కాదు. దేశ ప్రజలకు తెలియకుండా అల్లా వుద్దీన్‌ అద్బుత దీపం ఏమైనా మోడీ సర్కార్‌కు దొరికిందా అన్న అనుమానం వచ్చింది. మంత్రులు చెప్పేది, మీడియాలో వచ్చే వార్తలు ఎలా వుంటాయో తెలుసు కనుక సంస్ధ అధికారిక వెబ్‌ సైట్‌ను ఆశ్రయిస్తే http://www.wipo.int/edocs/pubdocs/en/economics/gii/gii_2013.pdf ప్రకారం 2013లో మనకు వచ్చిన మార్కులు 36.17 శాతంగానూ ర్యాంకు 66గానూ దర్శన మిచ్చింది. దీంతో మరింత ఆసక్తి పెరిగి 2016 ర్యాంకింగ్‌ల కోసం చూస్తే దానిలో మన మార్కులు 33.61శాతానికి తగ్గినా ర్యాంకు మాత్రం 66గానే వుంది. ఇదే సమయంలో మన ఇరుగు పొరుగుదేశాల స్ధితి ఎలా వుంది అన్న సందేహం కలగటం సహజం కదా ! పాకిస్తాన్‌ 23.33 మార్కులు, 137 ర్యాంకు నుంచి 22.63 మార్కులు 119వ ర్యాంకుకు మెరుగు పడింది. ఇదే సమయంలో చైనా విషయానికి వస్తే తన మార్కులు 44.66, ర్యాంకు 35 నుంచి 50.57 ర్యాంకు 25 తెచ్చుకుంది.

వివిధ వసతుల కల్పనాంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచబ్యాంకు లాజిస్టిక్స్‌ సామర్ధ్య సూచికలను ప్రకటిస్తుంది.http://www.dnaindia.com/money/report-india-moves-up-to-35th-rank-on-world-bank-s-logistics-performance-index-2230168 దీని ప్రకారం 2014లో 54వ స్ధానంలో వున్నది కాస్తా 2016 నాటికి 35వ ర్యాంకుకు చేరిందని ప్రశంసలు కురిపించారు. ప్రపంచబ్యాంకు రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రకటించే వివరాల ప్రకారం 2007లో మన ర్యాంకు 39, మనకు వచ్చిన మార్కులు 3.07, 2012లో 46 -3.08, 2014లో 54 – 3.08, 2016లో 35 -3.42 వచ్చాయి. మార్కులలో పెద్ద తేడాలు లేకపోయినప్పటికి 2007-14 మధ్య ర్యాంకు 39 నుంచి 54కు పడిపోయింది. అందువలన ఈ ర్యాంకుల గురించి సంబరపడి, అది తమ సామర్ధ్యమే అని చెప్పుకుంటే అంతకు మించి జనాన్ని మోసం చేయటం మరొకటి వుండదు.

ఇక సులభతర వాణిజ్య ర్యాంకుల విషయానికి వస్తే 2007లో మనకు వచ్చిన ర్యాంకు 116 అక్షరాలా నూట పదహారు. అది 2014 నాటికి 142కు పడిపోయింది. ర్యాంకులు కేటాయించిన పద్దతిని ప్రపంచబ్యాంకు సవరించటంతో అది 134గా నిర్ధారణ అయింది. 2015 జూన్‌ నాటికి మన ర్యాంకు 130కి మెరుగు పడింది, తరువాత దానిని 131కి సవరించారు. ఇప్పుడు తాజాగా ప్రకటించిన ర్యాంకు 130 అంటే ఎదుగూ బొదుగూ లేకుండా వుండి పోయింది. ఇది జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యవేత్తలలో నరేంద్రమోడీ పలుకుబడిని తగ్గించేది లేదా అనుమానాలను రేకెత్తించేది కనుకనే నరేంద్రమోడీ, ఆయన మంత్రులు అంతగా కంగారు పడుతున్నారు.

    ప్రపంచీకరణ అంటే విదేశీ సంస్ధలు మన దేశంలో సులభంగా వ్యాపారం చేసుకొనే అవకాశాలను కల్పించటం, దానికి ప్రశంసగా ప్రపంచబ్యాంకు ఇచ్చే ర్యాంకుల పిచ్చి ముదిరి వాటి కోసం మన ప్రధాని, దానికి అనుకరణగా కేంద్రం ప్రవేశ పెట్టిన ర్యాంకు కోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పడుతున్న తపన అంతా ఇంతా కాదు. అదింతటితో ఆగదు, మరిన్ని పర్యవసానాలకు దారితీస్తుందని గుర్తించాలి. ప్రపంచ పెట్టుబడిదారులకు మన ఆర్ధిక వ్యవస్ధను మరింతగా తెరిచేందుకు రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోనున్నారు.

    ప్రస్తుతం ప్రపంచీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్నది ఎవరు అంటే కొంత మంది విశ్లేషణ ప్రకారం ధనిక దేశాలలోని కార్మికవర్గం, దానితో పాటు అక్కడి పెట్టుబడిదారీ వర్గం అంటే అతిశయోక్తి కాదు. గతంలో వర్ధమాన, తృతీయ ప్రపంచ దేశాలలో ప్రపంచీకరణకు వ్యతిరేక గళాలు బలంగా వినిపించాయి, ఇప్పటికీ అడపాతడపా వినిపిస్తూనే వున్నాయి. అయితే గతం మాదిరి పెద్ద ఎత్తున లేవన్నది వాస్తవం. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా గతంలో మాదిరి సామాజిక వేదికల (సోషల్‌ ఫోరాలు) సదస్సులు ఇప్పుడు జరగటం లేదు, వెనుక పట్టు పట్టాయి. అవి సాధించిన విజయాలేమిటి ? వాటికి వున్న పరిమితులు ఎంతవరకు అన్న విషయాలను ఇక్కడ విశ్లేషించటం లేదు. మొత్తం మీద ప్రపంచీకరణ కోరుకున్న పెట్టుబడిదారులు, వారి సమర్ధకులదే పైచేయిగా వుంది, దానితో లాభాలు పొందవచ్చని కార్పొరేట్లు భావిస్తున్న కారణంగానే మరింతగా సంస్కరణల పేరుతో చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అందుకు నరేంద్రమోడీ సమర్ధకుడు అని భావించిన కారణంగానే గద్దెనెక్కించటమే గాక, తమ చేతులలో వున్న ప్రచార మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున వూదరగొడుతున్నారు. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జరిగిన వుద్యమాలు సాధించిన ఫలితాలు, కార్మికులు కోల్పోయిన వాటి గురించి, పర్యవసానాల గురించి లోతుగా అధ్యయనం చేయాల్సి వుంది. కండ్లు లేనివారు ఏనుగును వర్ణించినట్లుగా ఎవరికి వారు తమ అనుభవంలోకి వచ్చిన అంశాల గురించి రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. వాటన్నింటినీ కొట్టి వేయలేము, అలాగని వాటినే అంతిమ నిర్ధారణలుగా అంగీకరించలేము. అందువలన ఆ పరిమితులకు లోబడి ఈ సందర్భంగా కొన్ని విషయాలను పాఠకుల దృష్టికి తెస్తున్నాను.

     కొద్ది నెలల క్రితం ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు వెళ్లిపోవాలా వద్దా అనే విషయమై బ్రిటన్‌ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. దానిలో ఎక్కువ మంది వైదొలగటానికే మొగ్గు చూపారు. సభ్య దేశాలపై పొదుపు చర్యల పేరుతో కార్పొరేట్ల లాభాలలో కోత పడకుండా చూసేందుకు ఐరోపా యూనియన్‌ రుద్దిన పొదుపు చర్యలకు జనంలో వ్యతిరేకత వ్యక్తం కావటంతో పాటు, ఒక యూనియన్‌లో వుండి దాని తరఫున ఒక సభ్య దేశంగా ప్రపంచ మార్కెట్‌ వాటాను పరిమితంగా పంచుకోవటం కంటే విడిగా వుండి ఎక్కువ వాటాను తెచ్చుకోవచ్చన్న బ్రిటన్‌ కార్పొరేట్ల వత్తిడికూడా ఈ నిర్ణయాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ముగిసిన ప్రచారంలో కూడా వాణిజ్యంపై చర్చకు పెద్ద పీట వేయటం, ప్రపంచ వాణిజ్య సంస్ధ నుంచి అమెరికా బయటకు రావాలని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించటం, కెనడా-ఐరోపా యూనియన్‌ మధ్య చర్చలలో వున్న సమగ్ర ఆర్ధిక, వాణిజ్య ఒప్పందం(సిఇటిఏ) పట్ల వెల్లడౌతున్న వ్యతిరేకత ధనిక దేశాలలో ప్రపంచీకరణకు కార్మికవర్గం కంటే పెట్టుబడిదారీ వర్గంలోనే పెరుగుతున్న వ్యతిరేకతను సూచిస్తోంది. ఇది ఆయా దేశాల పారిశ్రామిక, వాణిజ్య సంస్ధల రక్షణాత్మక చర్యలకు దారితీస్తోంది. ధనిక దేశాల నుంచి ప్రారంభమైన ఈ క్రమం అన్ని దేశాలకు తరతమ తేడాలతో విస్తరించటం అనివార్యం.

    ఒక తత్వం ప్రకారం ఎప్పుడూ ప్రపంచీకరణ అనుకూలత, ప్రపంచీకరణ వ్యతిరేకత వ్యక్తమౌతూనే వుంటాయి. రుతువుల మాదిరి పెట్టుబడిదారీ వ్యవస్ధలో మాంద్యాలు రావటం, దాని నుంచి ఏదో విధంగా బయట పడటం సైకిలు చక్రం మాదిరి ఒకదాని వెంట ఒకటి సంభవిస్తుంటాయి. దాని పర్యవసానాలు ప్రపంచీకరణ మీద పడతాయి. గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రపంచీకరణ పర్యవసానంగా ధనిక దేశాలలో నష్టపోయిన సాంప్రదాయ మధ్యతరగతి ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో వుంది.లబ్ది పొందిన వారిలో ప్రస్తుతం ప్రపంచీకరణ విధానానికి వున్న పరిమితులు తమ శక్తి సామర్ధ్యాలను పూర్తిగా ప్రదర్శించటానికి వీలు కల్పించటం లేదనే తరగతి కూడా అదే ధనిక దేశాలలో ప్రపంచీకరణను మరొక వైపు నుంచి విమర్శిస్తుంది. ప్రపంచీకరణ విధానాన్ని కనిపెట్టిన వారు దాని పర్యవసానాలను వూహించలేకపోయారు. ప్రపంచీకరణ ఆర్ధిక అసమానతలను జెట్‌ వేగంతో పెంచింది. ఫలితంగా వలసలు పెరిగిపోయాయి. వలసలకు ఇతర అనేక కారణాలు వున్నప్పటికీ ప్రధాన కారణం మాత్రం ప్రపంచీకరణే. ఇది కొన్ని దేశాల నుంచి వలసలను పెంచితే మరికొన్నింటి నుంచి తగ్గించిందని కూడా వెల్లడైంది. శ్రమను కారుచౌకగా ఆమ్ముకొనే వలస కూలీలను ప్రోత్సహించటం కూడా ప్రపంచీకరణలో భాగమే అన్నది ఇక్కడ మరిచి పోరాదు. ధనిక దేశాలలో ప్రపపంచీకరణ తెచ్చిన అసంతృప్తికి, పేద దేశాల నుంచి సామూహికంగా వస్తున్న వలస కార్మికుల సమస్య అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.2008లో ప్రారంభమైన ధనిక దేశాల ఆర్ధిక మాంద్యం సమస్యను మరింత సంక్లిష్టం గావించింది. అనేక చోట్ల నిరుద్యోగం, దారిద్య్రం, వేతనాలలో కోతలు పెరిగిపోయాయి. పర్మనెంటు వుద్యోగాలు తగ్గి తక్కువ వేతనాలు లభించే తాత్కాలిక వుపాధిలో చేరే పరిస్థితికి కార్మికవర్గం చేరింది. ఇవన్నీ ప్రపంచీకరణ ఫలితమే అని భావించటంతో ధనిక దేశాలలో వ్యతిరేక గళం వినిపించటం ప్రారంభమైంది. ఇది ఒక కోణం. మరోవైపు నుంచి పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కూడా పర్యవసానాలు ప్రతికూలంగా తయారయ్యాయి. అదెలా వుందో తాజాగా వెల్లడైంది.

    ఇటీవల రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకానమీ, ట్రేడ్‌, ఇండస్ట్రీ అనే సంస్ధ ఒక పరిశోధనా పత్రాన్ని విడుదల చేసింది.http://www.rieti.go.jp/en/publications/summary/16080003.html దానిలో వున్న వివరాల ప్రకారం ప్రపంచీకరణ వివిధ దేశాల మధ్య అసమాన లబ్దికి దారితీసింది. అలా లబ్ది పొందిన వాటిలో భారత్‌ ఒకటి, అయితే చైనాతో పోల్చితే చాలా తక్కువ ప్రయోజనం కలిగింది. ఈ లబ్ది పారిశ్రామికవేత్తలతో పాటు కార్మికవర్గానికి కూడా దక్కింది. ఎవరు ఎక్కువ అంటే ఈ కాలంలో దేశంలో పెరిగిన ఆదాయ, ఆర్ధిక అసమానతలు, పెరిగిన బిలియనీర్లను చూస్తే కార్మికుల కంటే పారిశ్రామిక, వాణిజ్యవర్గాలే ఎక్కువ లబ్ది పొందాయని వేరే చెప్పనవసరం లేదు. అందుకే నరేంద్రమోడీ మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని వారంతా ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ సంస్కరణలు కొత్త సమస్యలను తీసుకువస్తాయని తెలిసినప్పటికీ తక్షణం లాభదాయకంగా వుంది కనుక రాబోయే పర్యవసానాల గురించి వారు అంతగా ఆలోచించటం లేదు.అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా తిరుగులేని శక్తిగా అవతరించింది. జపాన్‌ను వెనక్కు నెట్టి రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించింది. తనకున్న ఆర్ధిక శక్తి కారణంగా స్వేచ్చా వాణిజ్య నిబంధనలు, విధానాన్ని మరింత గట్టిగా అమలు జరపాలని అది కోరుతోంది. దాని దెబ్బకు గిలగిలలాడుతున్న ధనిక దేశాలు తాము ముందుకు తెచ్చిన స్వేచ్ఛా వాణిజ్యవిధానాన్ని పక్కన పెట్టాలని కోరుతున్నాయనటానికి ముందే చెప్పినట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్‌ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ వాణిజ్య సంస్ధ నుంచి వైదొలుగుతానని బెదిరించటం పక్కా నిదర్శనం. పైన పేర్కొన్న పరిశోధనా పత్రంలో ప్రపంచీకరణ పర్యవసానాల గురించి ఏం చెప్పారు ? వచ్చే భాగంలో చూడండి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

‘ఎన్‌కౌంటర్లు – జన స్పందన ‘

27 Thursday Oct 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

AOB encounter, malkangir encounter, maoists, maoists encounter

ఎంకెఆర్‌

   ఆంధ్ర-ఒడిషా సరిహద్దులోని ఒడిషా మల్కన్‌గిరి జిల్లాలోని బలిమెల ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్న ఎన్‌కౌంటర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టు నక్సల్స్‌ దుర్మరణం చెందారు. ఆ పార్టీకి ఇదొక పెద్ద దెబ్బ, విషాద, విచారకర వుదంతం. ఎప్పటి మాదిరే విరసం నాయకులు బంధుమిత్రులతో కలసి ఆ ప్రాంతానికి వెళ్లి గుర్తించిన మృతదేహాలను తీసుకువచ్చారు. అది ఎన్‌కౌంటర్‌ కాదు నిదురపోతున్నవారిని కాల్చి చంపారని చెబుతున్నారు. లేదు ఎన్‌కౌంటర్లన్నీ తెల్లవారు ఝామునే జరుగుతాయి కనుక అది వాస్తవ ఘటనే అని ఆంధ్రప్రదేశ్‌ డిజిపి ప్రకటించారు. ఎవరే డిమాండ్లు చేసినా, ఎన్‌కౌంటర్‌గా చెబుతున్న వుదంతంపై విచారణ జరపని కోరినా ఈవాళపోతే రేపటికి రెండు అన్నట్లుగా గతంలో జరిగినట్లు చెప్పిన ఎన్‌కౌంటర్ల తరువాత ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతోందని జనం భావిస్తున్నారు. ఏం జరిగినా పట్టించుకోకపోవటం జనానికి అలవాటయి పోయిందా, అంగీకరిస్తున్నారా అన్న సందేహం కొంతమందికి కలుగుతోంది. ఇంత పెద్ద సంఘటన జరిగినపుడు మావోయిస్టు సానుభూతి పరులకే ఈ అనుమానం రానక్కర లేదు, వారి రాజకీయాలు, ఆచరణతో విబేధించేవారిలో కూడా ఏం జరుగుతున్నా జనం పట్టించుకోవటం లేదేమిటన్న ఆలోచన రావటం సహజం. అవినీతి, అక్రమాలకు, దౌర్జన్యాలకు, మత కొట్లాటలకు పాల్పడుతున్నదెవరో, నేరగాళ్లెవరో, మంచివారెవరో అరటి పండు వలచి చేతిలో పెట్టినట్లుగా తెలిసినా ఎన్నికలలో జనం ఏం చేస్తున్నారో చూస్తున్నదే. తమ పొట్టకొడుతున్నా, కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నా మనకెందుకులే అని వెళ్లిపోవటం అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు దుర్బేధ్యమైన అడవులలో జరిగిందని చెబుతున్న ఘటనల గురించి, నిర్ధారణ కాకుండా అందునా పోలీసులకు వ్యతిరేకంగా జనం స్పందిస్తారని ఆశించగలమా ? వూహించగలమా ?రెండు వైపులా విశ్వసనీయత సమస్య లేదా ?

    తమపై లేదా గిరిజనులపై జరుపుతున్నదాడులకు ప్రతీకారంగా లాండ్‌మైన్‌లు పేల్చి, దాడులు చేసి, బలిమెల జలాశయంలో లాంచీపై దాడిచేసి పోలీసులను, ప్రత్యేక దళాలను, తమ గురించి సమాచారం ఇచ్చిన పోలీసు ఇన్ఫార్మర్లను ప్రజాకోర్టులో విచారించి ప్రజలే హతమార్చినట్లు నక్సల్స్‌ చేసిన ప్రకటనలను కూడా పోలీసులు చెప్పే ఎన్‌కౌంటర్ల మాదిరే జనం ఒకే విధంగా స్వీకరించటానికి అలవాటు పడిపోయారన్నది తెలిసిందే. ఇటీవలి కాలంలో అలాంటి ఘటనలు జరగటం లేదు గానీ గతంలో పలు ప్రాంతాలలో సిపిఎం, సిపిఐ, ఇతర పార్టీల నాయకులను కూడా ప్రజలే చంపివేసినట్లు ప్రకటించినపుడు, ఒక దశలో తమతో విభేదించిన వారందరికీ రివిజనిస్టులనే ముద్రవేసి నక్సలైట్లు ఏ గ్రూపు వారు ఎవరిని ఎందుకు చంపుతున్నారో తెలియని గందరగోళ సమయంలో, అమాయకులైన కాకతీయ రైలు ప్రయాణీకులను సజీవ దహనం చేసినపుడు కూడా జనం మామూలుగానే తీసుకున్నారు. తరువాత ప్రయాణీకులను చంపటం తప్పిదమేనని ప్రకటించటాన్ని కూడా అలాగే తీసుకున్నారు. కోవర్టులు పోలీసులలో వున్నట్లే నక్సల్స్‌లో కూడా వుండటం కూడా మామూలేనని జనం భావించటం సాధారణమైపోయింది. గతాన్ని విస్మరించి జన స్పందన గురించి ఆలోచిస్తే ప్రయోజనం వుంటుందా ? బెంగాల్లో సిపిఎంకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ వంటి వారికి మద్దతు ఇచ్చి జనాన్ని సానుకూలంగా స్పందింప చేసిన విషయం తెలిసిందే. ఆమె ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీని(మల్లోజుల కోటేశ్వరరావు) మట్టుబెట్టించినపుడు కూడా అదే జనం అదే విధంగా స్పందించటాన్ని చూశాము.

   తాము విశ్వసించని వ్యవస్ధను, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని హతమార్చటానికి తమకు హక్కుందని తిరుగుబాటుదారులు చెప్పినపుడు, రాజ్యానికి వ్యతిరేకంగా వున్న తిరుగుబాటుదారులను అదుపులోకి తెచ్చేందుకే తామున్నట్లు రాజ్యవ్యవస్ధ, దాని అంతర్భాగాలు చెప్పినపుడు ఎవరి వాదన వారికి సరైనదిగానే జనం భావిస్తున్నారు. తమ కులం వాడైతే గూండా అయినా, రౌడీ అయినా, అవినీతి, పార్టీ ఫిరాయింపు రాజకీయ నాయకుడు, వుద్యోగి ఎవరైనా సమర్ధించే దుస్థితిలో వున్నాం. చరిత్రలో అనేక మంది తిరుగుబాటుదార్లను రాజ్యవ్యవస్ధ అణచివేసినపుడు జనం పెద్ద ఎత్తున స్పందించి వీధులలోకి వచ్చిన వుదంతాలు ఎన్నో వున్నాయి. ఇప్పుడయినా మరొకపుడైనా అలాంటి స్పందన రావటం లేదంటే జనానికి ఏమైందని వారి గురించి ఆలోచించ వద్దని కాదు గానీ దానితో పాటు రెండోవైపు నుంచి ఏదైనా లోపమున్నదా అని అవలోకించాల్సిన అవసరం లేదా ? సాధారణ జనం కంటే తిరుగుబాట్లను, తిరుగుబాటుదార్లను సమర్ధించేవారు, వారి చర్యల ద్వారా ఏదో సాధించామని నమ్ముతున్నవారు మరింత ఎక్కువగా అంతర్మధనం చేసుకోవాలి.

    మల్కన్‌గిరి వుదంతానికి ప్రతీకారంగా మావోయిస్టులు రాసినట్లు చెబుతున్న లేఖ గురించి కూడా చర్చ జరుగుతున్నది. దానిలో వాడిన భాష, పేర్కొన్న ప్రతీకార చర్యలను చూస్తే అది రాసింది నక్సల్స్‌ కాదని మీడియాలో వార్తలు వచ్చాయి. కాదు మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల వారే దానిని రాశారని విశాఖ ఎస్పీ వెంటనే ప్రకటించారు. వివిధ సందర్బాలలో పోలీసులు అనుసరించే పద్దతుల ప్రకారం నకిలీ లేఖలు తయారు చేసి మీడియాకు పంపి జనాన్ని తప్పుదారి పట్టించటం, గందరగోళ పరచటం, తమ చర్యలను సమర్ధించుకోవటం బహిరంగ రహస్యం. బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగినపుడు మావోయిస్టు లేదా ఇతర నక్సల్స్‌ నుంచి ఇలాంటి లేఖలు రావటం కూడా సాధారణమే. అందువలన దాన్ని నిర్ధారించటం కష్టం. ఒక వేళ పోలీసులే రాసి వుంటే దానిలోని ఆత్మాహుతి దాడి, కుటుంబ సభ్యుల ప్రస్తావన ఇంతవరకు లేని కొత్త ఆలోచనలను కలిగించటం, ముందుకు తేవటం తప్ప వేరు కాదు. ఒక వేళ నిజంగా నక్సల్సే రాసి వుంటే తీవ్రమైన ఎదురు దెబ్బతగిలిందన్న కసితో కొత్త పద్దతుల్లో దాడులకు పూనుకుంటారని అనుకోవాల్సి వుంటుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రపంచబ్యాంకు అక్కర తీర్చే తహ తహ ! ఔరా ఏమిటీ వైపరీత్యము !!

26 Wednesday Oct 2016

Posted by raomk in AP, Current Affairs, Economics, Gujarat, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Doing business, Doing business India rank, Doing business rankings, WB Doing business ranking

ఎం కోటేశ్వరరావు

   వ్యాపార సరళతరం సూచికలో భారత్‌ తన స్ధానాన్ని 131 నుంచి 130కి పెంచుకొని గత ఏడాది కంటే ఒక పాయింట్‌ అదనంగా సాధించిందని ప్రపంచబ్యాంక్‌ 2017 నివేదికలో ప్రకటించింది. నరేంద్రమోడీ నాయకత్వంలో ప్రకటించిన సంస్కరణలన్నీ వూకదంపుడు వుపన్యాసాలే తప్ప ఆచరణ రూపం దాల్చనందున ప్రపంచ బ్యాంకు వాటిని పరిగణనలోకి తీసుకోలేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. భారత్‌లో వ్యాపార విషయాలను చూసే కేంద్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి రమేష్‌ అభిషేక్‌ తాజా సూచికపై స్పందిస్తూ ప్రభుత్వం అమలు జరుపుతున్న 12 సంస్కరణలను ప్రపంచబ్యాంకు పరిగణనలోకి తీసుకోలేదని, వచ్చే ఏడాది నివేదికలో ఈ అంశాలను చేర్చేందుకు వీలుగా ప్రపంచబ్యాంకు అక్కర లేదా ఆవేదనలను తీర్చుతామని కూడా వెల్లడించారు. దివాలా, ఐపి నిబంధనలను ఈ ఏడాది చివరికి ఖరారు చేస్తామని, జిఎస్‌టిని వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి అమలు జరిపితే మన సూచిక గణనీయంగా మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు.http://www.livemint.com/Industry/uOrtVTE4CgFpPnwV3wATmK/India-ranked-130-in-World-Banks-Doing-Business-survey.html

    భారత్‌లో సులభంగా వ్యాపారం చేసుకోవటానికి చర్యలు తీసుకోవటం అంటే ఏమిటో ఈ పాటికే కొంత అర్ధమయ్యే వుంటుంది. సూటిగా చెప్పాలంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇలా వచ్చి వ్యాపారాన్ని పెట్టి అలా లాభాలు తీసుకుపోయేందుకు అనువైన పరిస్ధితులు కల్పించటమే. ఒక వేళ అలా వచ్చిన వారు ఎవరైనా ఇలా దివాలా తీస్తే వారికి నష్టం కలగకుండా చూసేందుకు దివాలా, ఐపి నిబంధనలను కూడా సరళతరం చేస్తామన్నదే మన పరిశ్రమల శాఖ కార్యదర్శి వివరణ ఆంతర్యం. వీటికి సంస్కరణలని ముద్దు పేరు. మన దేశానికి ఈస్టిండియా కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటీష్‌, పోర్చుగీసు, డచ్‌, ఫ్రెంచి వారందరూ సులభంగా వ్యాపారం చేసుకొనేందుకే కదా వచ్చారు. వారికి నాటి మన రాజులు, రంగప్పలు సులభంగా అనుమతులు ఇవ్వబట్టే కదా ఏకులా వచ్చి మేకులా మారి మన తలపై కూర్చున్నారు. మరి దానికీ దీనికీ పెద్ద తేడా ఏమిటి అన్నది మౌలిక ప్రశ్న. నాడు వంశపారంపర్య రాజులు అనుమతిస్తే నేడు వారి స్ధానంలో ప్రజలెన్నుకున్న ప్రభువులు ఇవ్వటం తప్ప మరొకటి ఏమైనా వుందా ? విదేశీ కంపెనీలను అనుమతిస్తే అవి మన మూలుగులను పీల్చి పిప్పి చేయటమే కాదు, మన మీద పెత్తనం చెలాయిస్తాయని నాటి మేథావి వర్గానికి తెలిసినా లేదా వేదాల్లో అవి కూడా రాసి వున్నాయని నాటి సంస్కృత పండితులు ఎవరికైనా అనుమానం వచ్చినా కచ్చితంగా వ్యతిరేకించి వుండేవారు. కానీ ఇప్పుడు అన్నీ వేదాల్లో వునాయష అని చెబుతున్నవారు, చరిత్రను తిరగేసి మరగేసి చూసిన మేథావులనబడేవారు కూడా విదేశీ కంపెనీలకు స్వదేశీ ఎర్రతివాచీ పరిచి, దేశ భక్తి భాజా భజంత్రీలతో స్వాగతం పలుకుతున్నారు. నాడు తెలియక చేస్తే నేడు తెలిసి చేస్తున్నారు. దీనికి భిన్నమైనదేమైనా వుంటే చరిత్రకారులు, మేథావులు చెప్పాలి.

    ప్రపంచబ్యాంకును సంతృప్తి పరచటం అంటే అది ప్రాతినిధ్యం వహించే అంతర్జాతీయ కార్పొరేేట్ల అక్కర తీర్చటమే. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌తో నరేంద్రమోడీ పోటీ పడుతున్నారు. తానే పెద్ద సంస్కరణ వాదిని అని నిరూపించుకొనేందుకు తహతహలాడుతున్నారు. సింగ్‌ గారి హయాంలో అంటే 2012లో సరళతర వ్యాపారంలో మన దేశ ర్యాంకు 131 అన్న విషయం గుర్తు చేయటం అవసరం.http://www.thehindu.com/business/Economy/india-slips-in-ease-of-doing-business-list-world-bank/article5286594.ece తరువాత అది 134కు పడిపోయింది.అందువలన ఈ ర్యాంకులను చూసి లేదా చూపి పాలకులు తాము సాధించిన ఘనత అని చెప్పుకుంటే జనాన్ని మోసం చేయటం తప్ప మరొకటి కాదు. ప్రతి ఏటా ప్రపంచబ్యాంకు ఈ ర్యాంకులు కేటాయించే పద్దతులలో మార్పులు చేస్తూ వుంటుంది. దేశాల సంఖ్య కూడా మారిపోతూ వుంటుంది. నిజానికి ఇదొక అంకెల గారడీ. మన దేశ ర్యాంకు పెరగటంలో ప్రధాన పాత్ర వహిస్తున్న అంశాలలో విద్యుత్‌ సరఫరా, కనెక్షన్ల ప్రక్రియను సులభతరం చేయటం ప్రధానంగా పని చేస్తున్నది.

  మన దేశంలో వ్యవసాయానికి విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వటానికి రైతాంగాన్ని ఎంత సతాయిస్తారో తెలిసిందే. కానీ అదే పారిశ్రామికవేత్తల విషయానికి వస్తే పరిశ్రమ పెట్టకుండానే కనెక్షన్‌ సిద్ధం అన్నట్లుగా వుంటుంది. వుపాధి కల్పిస్తున్నదనే పేరుతో దానికి రాయితీలు అదనం. మన పాలకులు ప్రతి ఏటా అన్ని లక్షల కోట్లు ,ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులుగా తెచ్చామని ఎంత వూదర గొడుతున్నప్పటికీ మన దేశంలో విద్యుత్‌ వినియోగంలో పరిశ్రమల వాటా తగ్గిపోతున్నది.2012లో 32శాతం వుండగా 2014నాటికి 29శాతానికి పడిపోయింది. దానిలో స్వల్ప మార్పు లేదా స్ధిరంగా వుంటున్నది తప్ప పెరగటం లేదు. దానికి కారణాలలో పరిశ్రమల మూత, ఖాయిలా ఒక ప్రధాన కారణం,అయితే వాటి స్ధానంలో కొత్తవి రాకపోవటం మరొకటి. విద్యుత్‌ సరఫరా మెరుగు పడటానికి గతంలో శంకుస్థాపన చేసిన అనేక విద్యుత్‌ కేంద్రాలు ఈ రెండు సంవత్సరాల కాలంలో వుత్పాదన ప్రారంభించటం కూడా ఒకటి. అందువలన సరేంద్రమోడీ సంస్కరణలకు దీనికి సంబంధం వుందని చెప్పలేము.

   గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ దేశమంతటా చేసిన ప్రచారంలో గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి ఒకటి. ఎన్నికలు ముగిసిన తరువాత ఒక్కసారి కూడా దాని గురించి మాట్లాడినట్లు ఎక్కడా నేను వినలేదు. తిరిగి వచ్చే ఎన్నికలలో చెబుతారేమో తెలియదు. ప్రస్తుతం వుత్తర ప్రదేశ్‌ సంక్షేమాన్ని తాము తప్ప మరొకరు పట్టించుకోరు అని అక్కడ ఎన్నికల సభల్లో చెబుతున్నారు.http://indianexpress.com/article/business/economy/gujarat-clocks-over-48000-sick-msme-units-in-2014/ నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా వుండి గుజరాత్‌ను ఎలా అభివృద్ధి చేశారో పై వార్తను చూస్తే ఆ ప్రచార బండారం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. 2014లో రిజర్వుబ్యాంకు రూపొందించిన సమాచారంతో చిన్న, సన్నకారు, మధ్యతరగతి పరిశ్రమల శాఖ లోక్‌సభలో మోడీ సర్కారే ఒక ప్రశ్నకు సమాధానంగా విడుదల చేసిన సమాచార సంక్షిప్త వివరాలు ఇలా వున్నాయి. 2014 మార్చి ఆఖరు నాటికి వుత్తర ప్రదేశ్‌లో 63,268, గుజరాత్‌లో నమోదైన చిన్న, సన్నకారు పరిశ్రమలలో ఐదో వంతు అంటే 48,000 ఖాయిలా పడ్డాయి. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ పాలన చివరి సంవత్సరంలో మూత పడిన వాటి సంఖ్య 20,452 నుంచి 48వేలకు పెరిగాయి. అంతకు ముందు 2011లో ఖాయిలా యూనిట్లు 4321 మాత్రమే. 2013 సచేతన గుజరాత్‌( వైబ్రంట్‌ గుజరాత్‌) పేరుతో నిర్వహించిన హంగామాకు ముందు స్వయంగా గుజరాత్‌ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం కేవలం ఐదుశాతం మాత్రమే చిన్న పరిశ్రమలు ఖాయిలా పడ్డాయి. కానీ సచేతన గుజరాత్‌ వుత్సవాల సందర్భంగా తీసిన లఘుచిత్రాలలో చిన్న పరిశ్రమలు ఎంతో గొప్పగా వున్నట్లు చిత్రించారు. ఏ ఏటికాయేడు ఎన్నో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అవగాహనా ఒప్పందాలు జరిగినట్లు అంకెలను ప్రకటించారు.

   నరేంద్రమోడీయే సచేతన గుజరాత్‌ పేరుతో అంత హడావుడి చేసి చిన్న పరిశ్రమల మూతకు పుణ్యం కట్టుకుంటే అంతకంటే పెద్ద జాదూతనంతో అలరిస్తున్న చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌ వారి వారసులు తెస్తున్నట్లు చెబుతున్న పెట్టుబడుల గురించి చెప్పాల్సిందేముంది. రాష్ట్రాలలో వాణిజ్య సంస్కరణల విషయమై ర్యాంకుల గురించి ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు.అసలు పరీక్ష రాయకుండానే మొదటి ర్యాంకులు ఎలా తెచ్చుకుంటారో ఇటీవల మనం చూశాం. అందువలన రాష్ట్రాల ర్యాంకులు కూడా అదే విధంగా వున్నాయా ?ఏమో తెలియదు. ప్రస్తుతం 99.09శాతంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రెండు రాష్ట్రాలు మొదటి ర్యాంకులో వున్నాయట. ప్రశ్నా పత్రం ముందే లీకైతే తప్ప ఒకే మార్కులు ఎలా సాధ్యం అన్న అనుమానం ఎవరికైనా రావచ్చు.ఈ ఏడాది ర్యాంకులను త్వరలో ప్రకటించనున్నట్లు వార్తలు. ర్యాంకులు అనేవి సాధించిన విజయాలుగా ప్రచారం చేసుకోవటానికి తప్ప సామాన్య జనానికి కల్పిస్తున్న వుపాధి, మరొక ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. ఒక పాత సినిమాలో మీలో పెద్ద వెధవను నేను ప్రేమిస్తాను అంటే ఎవరు ఎలాంటి ‘ఘనకార్యం’ చేశారో చెప్పుకొనేందుకు పోటీ పడతారు. ఇక్కడ మెరుగైన వాణిజ్య వాతావరణం అంటే గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన నీకది, నాకిది పద్దతిలో వాటాల లెక్కలను మరింత పకడ్బందీగా అమలు జరపటం, ప్రజల సొమ్మును పంచుకోవటం తప్ప మరొకటి కాదని ఇప్పటికే తెలుగు జనాలందరికీ అర్ధం అయింది. రాబోయే రోజుల్లో ఈ పోటీ మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అక్టోబరు విప్లవ ప్రాధాన్యత-ప్రపంచ పర్యవసానాలు

25 Tuesday Oct 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

communist, Joseph Stalin, Lenin, october revolution, october revolution it's implications, october revolution today's relevance

ఎం కోటేశ్వరరావు

     ప్రపంచ గతినే ఒక పెద్ద మలుపు తిప్పిన వుదంతం 1917 రష్యన్‌ అక్టోబరు విప్లవం.ఆ మహత్తర ఘటన జరిగి నూరు సంవత్సరాలు కావస్తోంది. ఆ సందర్భంగా ప్రపంచంలోని పలు కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలు నిర్వహించి ఆ విప్లవ ప్రాధాన్యతను నేటి తరాలకు పరిచయం చేసేందుకు పూనుకున్నాయి. ఒకవైపు ప్రపంచంలో కమ్యూనిజాన్ని ఏడు నిలువుల లోతున పాతివేసి విజయం సాధించామని చంకలు కొట్టుకుంటూనే అనేక చోట్ల పాలకవర్గాలు చివరికి చే గువేరా బొమ్మ, ఎర్ర రంగు టీషర్టులు, కమ్యూనిజానికి చెందిన పుస్తకాలు అమ్మటం కనిపించినా వులిక్కి పడటాన్ని ఇండోనేషియా వంటి అనేక చోట్ల చూస్తున్నాం. వూరంతా కావమ్మ మొగుడు అంటే కామోసనుకున్నాను, ఇప్పుడు కాదంటున్నారు కనుక నా కర్రా బుర్రా ఇస్తే నాదారిన నే పోతా అన్న మాదిరి 1991లో సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చి వేసిన తరువాత అనేక మంది కమ్యూనిస్టు జండాలు తిప్పేశారు.

   పాతిక సంవత్సరాలు గడిచిన తరువాత అనేక చోట్ల పూర్వపు సోషలిస్టు దేశాలలో అంతర్మధనం జరుగుతోంది. వున్న సంక్షేమ వ్యవస్ధ పోయింది, పెట్టుబడిదారీ విధానం అదనంగా అన్న వస్త్రాలు ఇవ్వకపోగా వున్న వస్త్రాలను లాగివేసుకుందని, కడుపు మాడుస్తోందని జనం గ్రహించారు. పెట్టుబడిదారీ వ్యవస్ధకు తలమానికమైన అమెరికాలో నిన్న మొన్నటి వరకు సోషలిస్టు, కమ్యూనిస్టు అని చెప్పుకోవాలంటేనే జనం వణికిపోయే పరిస్థితి. ఇప్పుడు అవును మేము సోషలిస్టులమే అయితే ఏమిటి అని మిలియన్ల మంది యువత ప్రశ్నిస్తున్నారంటే పరిస్థితిలో ఎంత మార్పు ! అమెరికాలో 2008లో ప్రారంభమైన ఆర్ధిక మాంద్యం అక్కడి కార్మిక, మధ్యతరగతి పౌరుల జీవితాలను అతలాకుతలం చేయటమే దీనికి కారణం, పెట్టుబడిదారీ వ్యవస్ధ విఫలమైందని అనేక మంది అంగీకరిస్తున్నారు. ప్రత్యామ్నాయం ఏమిటని శోధిస్తున్నారు. ఆ క్రమంలో అనేక మంది అటకెక్కించిన కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ గ్రంధాలను దించి దుమ్మదులిపి అసలు వాటిలో ఏం రాశారు ? మనకేమైనా పరిష్కారం చూపుతాయా అని అధ్యయనం చేస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది ?

   ప్రపంచ చరిత్రలో ఎన్నో రకాల విప్లవాలు సంభవించాయి. అనేక పరిణామాలు నాటకీయంగానే ప్రారంభమయ్యాయి. పైకి అలా కనిపించినప్పటికీ వాటికి తగిన భూమిక తయారై వున్నందునే అలా జరిగాయి. అయితే ఎక్కడ, ఏ రూపంలో, ఎలా జరుగుతుందన్నదే అనూహ్యం. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన బ్రిటన్‌, జర్మనీ వంటి చోట్ల సోషలిస్టు విప్లవం వస్తుందని కారల్‌మార్క్సు-ఎంగెల్స్‌ అంచనా వేశారు. అందుకు భిన్నంగా రష్యాలో వచ్చింది. లెనిన్‌తో సహా బోల్షివిక్‌ పార్టీ నాయకత్వం ఎక్కువ భాగం ప్రవాసంలో వుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో జారు చక్రవర్తుల పాత్రపై జనం ఆగ్రహంతో వున్నారు. ఈ స్ధితిలో బోల్షివిక్‌లకు అవకాశం ఇవ్వకుండా రష్యా పాలకవర్గం 1917ఫిబ్రవరిలో కెరెన్సీని రంగంలోకి దించి తిరుగుబాటు పేరుతో జారును తొలగించి బూర్జువా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. అయితే అక్టోబరు నాటికి బోల్షివిక్‌ నేత లెనిన్‌ ప్రవాసం నుంచి తిరిగి వచ్చి కెరెన్సీ ప్రభుత్వాన్ని తొలగించి సోషలిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచాన్ని కుదిపివేసిన పదిరోజులు అనే పేరుతో జాన్‌ రీడ్‌ అనే అమెరికన్‌ రచయిత ఈ మహత్తర విప్లవం పరిణామాలను గ్రంధస్ధం చేశారు.

   మొదటి ప్రపంచ యుద్ధం అనివార్యంగా కనిపిస్తున్న పరిస్ధితులలో 1914లో అంతర్జాతీయ సోషలిస్టు వుద్యమం ఒక విధంగా కుప్పకూలిపోయింది. నాటి కార్మివర్గ పార్టీలలో ముఖ్యమైన జర్మన్‌ మ్యూనిస్టుపార్టీ యుద్ధానికి అనుకూలంగా ఓటు చేసింది. కొద్ది మంది మైనారిటీలు మాత్రమే ఇది ప్రజల యుద్ధం కాదు, ప్రజలపై యుద్ధం అని వాదించారు. అలాంటివారిలో లెనిన్‌ నాయకత్వంలోని బోల్షివిక్‌ పార్టీ ఒకటి. ఆ కారణంగానే అది సరైన ఎత్తుగడలు అవలంభించి పాలకవర్గ బలహీనతను వుపయోగించుకొని మహత్తర సోషలిస్టు విప్లవాన్ని జయప్రదం చేయగలిగింది.

    అక్టోబరు విప్లవం గురించి 1918లో లెనిన్‌ ఒక సందర్బంగా రాసిన దానిలో ‘ సోవియట్‌ తరహా నూతన రాజ్యాన్ని సృష్టించి కష్టతరమైన సమస్యలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే పరిష్కరించగలిగాము. ప్రధాన ఇబ్బంది ఆర్ధిక రంగంలో వుంది’ అని చెప్పారు. విప్లవ సమయంలో మిగతా ఐరోపాతో పోల్చితే రష్యా అనేక విధాలుగా వెనుకబడే వుంది. అంతర్గతంగా భూస్వామిక శక్తులు, పెట్టుబడిదారులు సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించారు. బయట మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతలు, పరాజిత దేశాలూ రెండు కూటములూ సోవియట్‌ చుట్టూ దానిని నమిలి మింగేసేందుకు అవకాశం కోసం చూస్తున్న సామ్రాజ్యవాదులు, కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు చుట్టుముట్టి వున్నాయి. 1917లో సంభవించిన విప్లవం 1989 నాటికి సామ్రాజ్యవాదుల కుట్రలకు బలై ఎలా కూలిపోయిందీ తెలుసుకోకుండా దాని ప్రాధాన్యతను , నేటికీ దానికి వున్న విలువ ఏమిటో అర్ధం చేసుకోలేము.

    అక్టోబరు విప్లవానికి ముందు విదేశాంగ విధానమంటే సామ్రాజ్యవాదులు ఏ ప్రాంతాన్ని ఎలా ఆ క్రమించుకోవాలి, ఎవరైనా పోటీకి వస్తే వారిని ఎలా దెబ్బతీయాలనేదే తప్ప మరొకటి మనకు కనపడదు. ఆధునిక చరిత్రలో సామ్రాజ్యవాదాన్ని ఎదిరించే విదేశాంగ విధానానికి రూపకల్పన జరిపింది సోవియట్‌ యూనియన్‌ వునికిలోకి వచ్చిన తరువాతే. కమ్యూనిస్టు పార్టీలు, సామ్రాజ్యవాద వ్యతిరేక, జాతీయ వుద్యమాలు, వివిధ ప్రజా సంఘాలకు రూపకల్పన చేసింది కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ అన్నది తెలిసిందే. దాన్ని ఒక విధానంగా ఆచరణలోకి తెచ్చింది, అభివృద్ది చేసిందీ సోవియట్‌ యూనియన్‌. అక్టోబరు విప్లవం ఫలితంగా ఏర్పడిన సోవియట్‌ యూనియన్‌ అనేక దేశాలలో కమ్యూనిస్టు విప్లవ సంస్ధల ఏర్పాటుకు, జాతీయ విముక్తి, విప్లవాలకు తోడ్పాటునందించింది. చైనా విముక్తికి ప్రత్యక్షంగా తోడ్పడింది, సోవియట్‌ లేకుంటే చరిత్ర మరోవిధంగా వుండి వుండేది. సోవియట్‌లో కష్టజీవుల రాజ్యం ఏర్పడిందని, ఎలా వుంటుందో చూద్దామని అష్టకష్టాలు పడి వెళ్లిన వారు అనేక మంది కమ్యూనిస్టులుగా మారి తమ దేశాలలో కూడా అలాంటి వ్యవస్ధలను ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు, 1920 తాష్కెంట్‌ నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు ఆ విధంగా జరిగిందే . సంపూర్ణ స్వాతంత్య్రం కావాలనే డిమాండ్‌ను మన స్వాతంత్య్రం వుద్యమంలో ముందుకు తెచ్చింది కమ్యూనిస్టులే. ఈ కారణంగానే తమ దోపిడీకి రాగల ముప్పును గమనించి సామ్రాజ్యవాదులు సోవియట్‌ను మొగ్గలోనే తుంచేందుకు ప్రయత్నించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతలు, పరాజితులూ ఇరు పక్షాలూ సోవియట్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. దాన్ని గమనించే లెనిన్‌ ప్రారంభంలోనే జర్మన్‌ సామ్రాజ్యవాదులతో బ్రెస్ట్‌లిటోవస్కీ సంధి చేసుకొని విప్లవ ఫలితాన్ని రక్షించారు. అక్టోబరు విప్లవం జాతీయ స్వాతంత్య్ర, విముక్తి వుద్యమాలకు వూపునివ్వటంతో మన దేశంతో సహా అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీల పుట్టుకకు పురుడు పోసింది. పర్యవసానంగా రెండవ ప్రపంచ యుద్దం నాటికి సామ్రాజ్యవాదులు తమ వలసలను ఇంకేమాత్రం నిలుపుకోలేని పరిస్ధితులు ఏర్పడ్డాయి. దీంతో సోవియట్‌ను దెబ్బతీసేందుకు అమెరికాతో సహా అన్ని సామ్రాజ్యవాద దేశాలూ జర్మన్‌ నాజీ హిట్లర్‌ను అన్ని విధాలుగా ప్రోత్సహించాయి.ఈ కుట్రను ముందుగా పసిగట్టిన స్టాలిన్‌ హిట్లర్‌ వ్యతిరేక కూటమితో ఒప్పందాలు చేసుకొనేందుకు ప్రయత్నించారు. ముందుగా హిట్లర్‌ను సోవియట్‌పైకి పంపి దానిని పతనం చేసిన తరువాత తాము తేల్చుకోవచ్చని ఇతర సామ్రాజ్యవాదులు దురాలోచన చేశారు.

    అందుకే తగిన సన్నాహాలు చేసుకొనేందుకు మరోసారి 1939తో జర్మనీతో రష్యన్లు పరస్పర దాడుల నిరోధ ఒప్పందం చేసుకున్నారు. సోవియట్‌ను ఏక్షణంలో అయినా లేపివేయవచ్చు, ముందు గతంలో తమను ఓడించిన ఇతర సామ్రాజ్యవాదుల పని బట్టాలని నిర్ణయించుకున్న హిట్లర్‌ తన వ్యూహం అమలు జరిపాడు. వరుసగా విజయాలు సాధించిన వూపులో సోవియట్‌ను కూడా ఆక్రమించుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించిన హిట్లర్‌ 1941లో అంతకు ముందు చేసుకున్న ఒప్పందాన్ని వుల్లంఘించి సోవియట్‌పై దాడులకు దిగాడు. ఇది ప్రపంచగతిని మరోమలుపు తిప్పుతుందని ఎవరూ వూహించలేదు. ఐక్యరాజ్యసమితి ఏర్పడటానికి ముందు నానాజాతి సమితి వుండేది. దాని వైఫల్యాల తీరుతెన్నులను గమనించి రెండవ ప్రపంచ యుద్దానికి ముందు దురాక్రమణదారులకు వ్యతిరేకంగా ఒక భద్రతా వ్యవస్ధను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది నాటి సోవియట్‌ యూనియన్‌ మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి. ఆ తరువాత అంతకంటే పటిష్టమైన ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. అయితే ఇది కూడా నానాజాతి సమితి వైఫల్యాల బాటలోనే పయనిస్తున్నది, అందుకు బాధ్యత ఎవరిది, నిబంధనలను వుల్లంఘిస్తున్నది ఎవరంటే అమెరికా, దాని మిత్రరాజ్యాలే మనకు కనిపిస్తాయి.

    ఐరోపాను గడగడలాడించిన హిట్లర్‌ సేనలను మట్టుబెట్టటమే గాక, హిట్లర్‌ ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చావాల్సిన పరిస్ధితిని కల్పించిన మొనగాడుగా సోవియట్‌ ప్రపంచం ముందు నిలిచింది. అంతే కాదు తూర్పుఐరోపాను, ఆసియాలో వుత్తర కొరియాను విముక్తి చేసి సోషలిస్టు శిబరాన్ని విస్తరింపచేసింది. చైనాలో సోషలిస్టు విప్లవం జయప్రదమయ్యేందుకు ఎంతో తోడ్పడింది.రష్యాలో అక్టోబరు విప్లవం జరగపోయి వుంటే, అది బలపడి రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ మూకలను ఓడించకుండా వున్నట్లయితే ప్రపంచంలో ఏమి జరిగి వుండేది ? నాజీలు, ఫాసిస్టులు, ఇతర సామ్రాజ్యవాదులు మరో రూపంలో ప్రపంచాన్ని తిరిగి పంచుకొని వుండేవారు కాదా ? ఆ ముప్పును తప్పించింది, వలస రాజ్యాలన్నింటికీ స్వాతంత్య్రం వచ్చింది కమ్యూనిస్టుల వలనే కాదా ?

Image result for 2nd world war ,stalin

   అక్టోబరు విప్లవంతో ఏర్పడిన సోవియట్‌ యూనియన్‌ ఒక కుట్ర ఫలితమని సామ్రాజ్యవాదులు వర్ణిస్తారు. ఒక ప్రయోగంగా కొందరు వర్ణిస్తే , మరికొందరు దానిని అంగీకరించరు. 1871 మార్చి 18 నుంచి మే 28వరకు వునికిలో వున్న పారిస్‌ కమ్యూన్‌ను దిగ్బంధం చేసి అణచివేసిన మాదిరి ప్రపంచంలో ఆరోవంతు వున్న సోవియట్‌ యూనియన్‌ను భౌతికంగా దిగ్బంధం చేయటం సాధ్యం కాదని పెట్టుబడిదారీ వర్గం ప్రారంభంలోనే గుర్తించింది.అందుకే తొలుత అంతర్గత తిరుగుబాట్లు, అంతర్యుద్ధ కుట్రల ద్వారా దానిని దెబ్బతీయాలని చూసింది. ఆ తొలి ఎత్తుగడ విఫలమైంది. అటువంటి వ్యవస్ధ రెండు దశాబ్దాలపాటు కొనసాగి స్ధిరపడటమేగాక అనేక విజయాలు సాధించి ప్రపంచ కార్మివర్గాన్ని ఆకర్షించింది. దీనికి తోడు రెండవ ప్రపంచ యుద్ధంలో అనూహ్యంగా హిట్లర్‌ను ఓడించి ప్రపంచ హీరోగా నిలబడింది. దీంతో భౌతికంగా అంతం చేయలేమని , కార్మిక వర్గం మొత్తంగా తమ దోపిడీకి చరమ గీతం పాడుతుందని పెట్టుబడిదారులు నిర్ధారణకు వచ్చి పన్నిన సుదీర్ఘకుట్ర ఫలితమే ప్రచ్చన్న యుద్దం.

   సోవియట్‌, తదితర దేశాల వ్యవస్ధలను కూల్చివేయటానికి, కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు సామ్రాజ్యవాదులు దాదాపు పది లక్షల కోట్ల డాలర్లను ఖర్చు చేశారని అంచనా. కమ్యూనిజం పనికిరాదు, అసంగతం అని చెప్పిన వారు దాన్ని దెబ్బతీసేందుకు ఇంత భారీ మొత్తం ఖర్చు చేయటాన్ని బట్టే దానికున్న ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. శ్రామికవర్గంతో ప్రత్యక్ష పోరు సల్పితే ప్రయోజనం లేదన్నది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత దోపిడీ వర్గం నేర్చుకున్న పెద్ద పాఠం. కొత్త పద్దతులను ఎంచుకుంది. ఎదుటి పక్షంలోని లోపాలు, బలహీనతలను ఎంచుకొని వాటిమీద కేంద్రీకరించటం ద్వారా సైద్ధాంతిక దాడి, కుట్రలు, అనుమానాలు, గందరగోళంలో పడవేయటం వంటి సకల చాణక్య ఎత్తుగడులను అమలు జరిపి తమ చేతికి మట్టి అంటకుండా దెబ్బతీయటం ప్రచ్చన్న యుద్ద లక్షణం. దాన్ని ఒక్క సోవియట్‌, తూర్పు ఐరోపాకే పరిమితం చేయలేదు. క్యూబాను భౌతికంగా అష్టదిగ్బంధనం గావించారు. కమ్యూనిస్టు చైనాను రెండు దశాబ్దాలకు పైగా అసలు గుర్తించేందుకు, ఐక్యరాజ్యసమితిలో ప్రాతినిధ్యం వహించేందుకే లేకుండా అడ్డుకున్నారు. వియత్నాం, కంపూచియా, లావోస్‌లపై దశాబ్దాల తరబడి యుద్ధాలు చేసి కమ్యూనిజాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.

    పుట్టిన దగ్గర నుంచి కూలిపోయే వరకు ఏడు దశాబ్దాల పాటు సోవియట్‌ వనరులలో ఎక్కువ భాగం దానిని కాపాడు కొనేందుకు ఖర్చు చేసిన ఫలితంగానే అది ఎలాంటి భౌతికదాడులకు గురికాలేదన్నది ఒక వాస్తవం. అయితే అదే సమయంలో పెట్టుబడిదారీ దేశాలు విసిరిన సవాలును స్వీకరించిన కమ్యూనిస్టులు సోవియట్‌ అభివృద్దికి అనుసరించిన కొన్ని పద్దతులు, ప్రయోగాలు ఎన్నో విజయాలతో పాటు కొన్ని వ్యతిరేక ఫలితాలనిచ్చాయన్న అభిప్రాయాన్ని కాదనలేము.వాటిలో కమ్యూనిస్టులు బ్యూరాక్రాట్లుగా మారటం ఒకటి. అనేక ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ సోవియట్‌ సాధించిన విజయాలను తక్కువ చేసి చూడలేము. స్టాలిన్‌ హయాంలో కొన్ని పొరపాట్లు జరిగినప్పటికీ సాధించిన అభివృద్ధి కారణంగానే ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఫాసిస్టు హిట్లర్‌ను మట్టుబెట్టటం సాధ్యమైంది. అణురంగంలో అమెరికాతో ధీటుగా వుండబట్టే మరో నాగసాకి, హిరోషిమాలు పునరావృతం కాలేదు. ప్రణాళికా బద్ధమైన ఆర్ధిక వ్యవస్ధను అమలు జరిపి అనేక విజయాలు సాధించి ఈనాడు అనేక దేశాలకు మార్గదర్శకంగా వున్నది కూడా సోవియట్‌ యూనియనే. సోవియట్‌ ప్రయోగాలు ప్రపంచానికి అనేక గుణపాఠాలు కూడా నేర్పాయి.

    లాభం లేనిదే వ్యాపారి వరదన పోడన్న సామెత తెలిసిందే.సోవియట్‌ యూనియన్‌ ఏర్పాటు, పురోగమనం, ఫాసిజంపై యుద్ధ విజయం కారణంగా జనం కమ్యూనిస్టులవైపు మొగ్గకుండా చూసేందుకే పాలకవర్గాలు జనానికి వెసులుబాటునిచ్చే కొన్ని సంక్షేమ చర్యలను చేపట్టకతప్పని పరిస్ధితులు ఏర్పడ్డాయని గ్రహించటం అవసరం. ఇదే క్రమంలో లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండంలో నియంతలకు మద్దతు ఇచ్చే విధానాలను అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాదులు విరమించుకోవాల్సి వచ్చింది. తమ లాభాల రేటు తగ్గకుండా చూసుకొనేందుకు మరోవైపు పెట్టుబడిదారీ వర్గం వుత్పత్తిని మరింతగా పెంచే, కార్మికుల సంఖ్యను తగ్గించే పరిజ్ఞానంవైపు కూడా దృష్టి సారించింది. అది సోషలిస్టు దేశాలకు విస్తరించకుండా ఇనుప తెరలను ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే సోవియట్‌తో సంబంధాలున్న మనవంటి దేశాలకు కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానం అందకుండా చూసింది. అయినా అంతరిక్ష రంగంలో సోవియట్‌ అమెరికా కంటే ఎంతో ముందుకు పురోగమించింది. గతంలో సోవియట్‌,తరువాత దాని వారసురాలిగా రష్యా మనకు అందించిన అంతరిక్ష ప్రయోగ పరిజ్ఞాన ఫలితమే ఈ రోజు మనం జయప్రదంగా అంతరిక్ష , క్షిపణి ప్రయోగాలు చేస్తూ ప్రపంచ అగ్రరాజ్యాల సరసన నిలబడగలుగుతున్నామన్నది మరిచి పోరాదు. ప్రచ్చన్న యుద్ధం పేరుతో సామ్రాజ్యవాదులు సాగించిన కుట్రల తీవ్రతను అర్ధం చేసుకోవటంలో, ఎదుర్కోవటంలో వైఫల్యం, వైరిపక్ష బలాన్ని తక్కువగా అంచనా వేయటం, సంస్కరణల అమలులో వైఫల్యం వంటి అంశాలు , రాజకీయంగా మితవాదానికి గురికావటం చివరకు బోరిస్‌ ఎల్సిన్‌ వంటి శక్తులు పార్టీ నాయకత్వ స్ధానాలలోకి ఎదగటంతో సామ్రాజ్యవాదులు తమ కుట్రలను సులభంగా అమలు చేసి సోవియట్‌ను కూల్చివేయగలిగారు.

    సోవియట్‌, తూర్పు ఐరోపా పతనం వలన ఆయా దేశాల పౌరులతో పాటు ప్రపంచం కూడా ఎంతో నష్టపోయింది. అమెరికా చెప్పిందే వేదం. సోవియట్‌ అంతరిస్తే తమ ఖండం నుంచి అమెరికా సేనలు తిరుగుముఖం పడతాయని ఆశించిన ఐరోపా ధనిక దేశాల ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్‌ పాలకవర్గ అంచనాలు తప్పాయి. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలకు వ్యతిరేకంగా నాటో కూటమిని ఏర్పాటు చేసిన అమెరికా అక్కడి సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన తరువాత దానిని రద్దు చేయకపోగా గత పాతిక సంవత్సరాలలో మరింతగా పటిష్ట పరుస్తున్నారంటే వారి ఎజండా ఇంకా మిగిలే వుందన్నది సుస్పష్టం. అంటే మిగతా సోషలిస్టు దేశాలు, కమ్యూనిస్టు భావజాలానికి వ్యతిరేకంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తూనే వున్నారు. ఐరోపా ధనిక దేశాలపై తన పట్టు కొనసాగాలంటే నాటో కూటమిని కొనసాగించటం అవసరం. సోవియట్‌ లేకపోయినా దాని స్ధానంలో వచ్చిన రష్యా నుంచి ఐరోపాకు ముప్పు తొలగలేదనే కొత్త పల్లవిని అమెరికన్లు అందుకున్నారు.

     సోవియట్‌ అంతరించిన తరువాత దాని బూచిని చూపితే నడవదు. అందుకు గాను వుగ్రవాదంపై పోరు పేరుతో సరికొత్త అజెండాకు తెరలేపింది. ఆ పేరుతో పశ్చిమాసియా ఆక్రమణకు పూనుకుంది. ఇజ్రాయెల్‌కు ఇంకా ముప్పు తొలగలేదనే పేరుతో ఆ ప్రాంతంలో కొనసాగేందుకు కొత్త సమస్యలను సృష్టిస్తున్నది. సోవియట్‌ను కూల్చివేసిన తరువాత పాతిక సంవత్సరాల పాటు ఒక చిన్న కమ్యూనిస్టు దేశం క్యూబాను దెబ్బతీసేందుకు ప్రయత్నించి సాధ్యంగాక దానితో అమెరికన్లు తాత్కాలికంగా అయినా రాజీపడి సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలలో ఎన్నికైన వామపక్ష ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఆసియాలో తమకు లాభదాయకంగా వున్న కారణంగా చైనాతో భారీ ఎత్తున వాణిజ్య లావాదేవీలు నడుపుతూనే మరోవైపున దానిని దెబ్బతీసేందుకు నిరంతరం కుట్రలు పన్నుతూనే వున్నాయి. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని చైనా ఆధీనంలో వున్న దీవులపై తమకు హక్కు వుందంటూ జపాన్‌, ఫిలిప్పైన్స్‌ తదితర దేశాలతో వివాదాలను రెచ్చగొడుతూ ఆ ప్రాంతంలో సైనిక విన్యాసాలు చేస్తున్నారు.

    ప్రపంచ మానవాళి సోవియట్‌కు, స్టాలిన్‌కు తీర్చలేని విధంగా రుణపడిందంటే అతిశయోక్తికాదు. స్టాలినే లేకుంటే తరువాత కాలంలో ఆయనను నియంత అని నిందించిన వారు, హిట్లర్‌తో మతిలేని పోలికలు తెచ్చిన వారు బతికి వుండేవారు కాదు, వారి వారసులు అసలు పుట్టివుండేవారు కాదు. ప్రపంచాన్ని హిట్లర్‌ అనే నియంత ఆక్రమించ కుండా కాపాడింది, తమ ప్రాణాలు అర్పించిన రెండు కోట్ల మంది సోవియట్‌ పౌరులు, వారిని అంతటి మహత్తర త్యాగాలకు సిద్దపరిచిన స్టాలిన్‌ నాయకత్వమే. ఒక దుర్మార్గుడు ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు పూనుకుంటే లొంగిపోయి సలాం కొట్టినవారిని, బానిసలుగా మారిన వారిని, గుడ్లప్పగించి చూసిన వారిని ప్రపంచ చరిత్ర చూసింది గానీ, ఆత్మగౌరంతో బతికేందుకు ఇలాంటి త్యాగాలు చేయటం మరొక వుదంతంలో ఎక్కడా కానరావు.

    ఐరోపాలో లేదా మన వంటి వర్ధమాన దేశాలలో ప్రభుత్వాలు సంక్షేమ చర్యలను చేపట్టటం రష్యాలో అక్టోబరు విప్లవం, సోవియట్ల ఏర్పాటు తరువాతనే ప్రారంభమైంది అని గుర్తించాలి. ఆ సోవియట్‌ కూలిపోయిన తరువాత గత పాతిక సంవత్సరాలలో ఆ సంక్షేమ చర్యలను ఒక్కొక్కటిగా పెట్టుబడిదారీ దేశాలన్నింటా వుపసంహరించటాన్ని గమనిస్తున్నాము. గతం మాదిరి జనం పోల్చుకోవటానికి ప్రత్యామ్నాయ వ్యవస్ధ లేదని, తమ లాభాల్లో జనానికి వాటా పెట్టాల్సిన అవసరం లేదని పెట్టుబడిదారులు భావిస్తుండటమే సంక్షేమ చర్యలకు కోత, వుపసంహరణ.

   ఇతరులకు జోస్యం చెప్పిన బల్లి కుడితిలో పడి గిలగిలా కొట్టుకున్నట్లు సోషలిస్టు వ్యవస్ధలు ఫలితాలు సాధించలేవని, ఆచరణ సాధ్యం కాదని ప్రచారం చేసిన పెట్టుబడిదారీ వ్యవస్ధలు తామే తీవ్ర సంక్షోభంలో పడి బయటకు రాలేక దిక్కుతోచకుండా వున్నాయి. మరోవైపున సంక్షుభిత పెట్టుబడిదారీ దేశాల మార్కెట్లపై ఆధారపడిన చైనా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాల ఎగుమతుల ఆర్ధిక లావాదేవీలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షోభంలో పడలేదు. విజయవంతంగా నడుస్తున్నాయి. దివాళాకోరు ఆర్ధిక విధానాలు అమలు జరుపుతున్న మనవంటి దేశాలు రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లుగా వాటి దుష్పలితాలను అనుభవిస్తున్నాయి. సోవియట్‌ కూలిపోయిన తరువాత ప్రపంచంలోని వామపక్షాలు కూడా నూతన సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

      కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతుల వుద్యమాలు వెనుకపట్టు పట్టాయి. యజమానులు తమ షరతులను ముందుకు తెస్తూ ఎదురుదాడులు చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు తమ వస్తువులను అమ్ముకొనేందుకు తెచ్చిన నూతన సాంకేతిక పద్దతులతో గొలుసుకట్టు ప్రపంచ మార్కెట్‌ను తమ అదుపులోకి తెచ్చుకుంటున్నాయి. దీంతో సరిహద్దులతో నిమిత్తం లేకుండా వస్తువులు ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుతున్నాయి. దీని అర్ధం ఏమంటే తమ ఆర్ధిక వ్యవస్థల మీద ఆయాదేశాలకు అదుపు వుండదు. కార్మికులు యూనియన్లు పెట్టుకోవటానికి, తమ న్యాయమైన హక్కులను సాధించుకొనేందుకు కష్టమౌతుంది. ఎక్కడ కార్మిక శక్తిని దోచుకొనేందుకు అవకాశం వుంటే అక్కడికి పరిశ్రమలను తరలించి లేదా కొత్తగా ఏర్పాటు చేసి వస్తువులను తయారు చేసి ఎగుమతులు చేస్తున్నాయి. ఈ కారణంగా మన ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా నినాదం ఇచ్చి, తమ దగ్గర ఎటువంటి అవకాశాలు వున్నాయో ప్రపంచదేశాలన్నింటా చెబుతున్నారు. అవసరమైతే కార్మిక చట్టాల రద్దు, నామమాత్రంగా చేసి యజమానుల ఇష్టారాజ్యానికి అవకాశం కల్పిస్తామని ప్రాధేయపడుతున్నారు. కార్మిక సంఘాల ఏర్పాటును కఠిన తరం చేసే నిబంధనలు చేరుస్తున్నారు.తక్కువ సంఖ్యలో కార్మికులున్న పరిశ్రమలలో వారిని తొలగించేందుకు, మూసివేసేందుకు యజమానులకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తున్నారు. అప్రెంటిస్‌ల పేరుతో ఏండ్ల తరబడి నామమాత్ర వేతనాలకు పనిచేయించుకొనే వెసులుబాటును కల్పిస్తున్నారు. చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖరరావు వంటి ముఖ్యమంత్రులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇవన్నీ పరోక్షంగా సోషలిస్టు వ్యవస్ధలు కూలిపోయిన పర్యవసానాలే అన్నది గమనించాలి.

    అక్టోబరు విప్లవం ప్రపంచంలో తెచ్చిన మార్పులు, దానికి తగిలిన ఎదురు దెబ్బల కారణంగా ప్రపంచంలో సామ్రాజ్యవాదుల ఆధిక్యం పెరిగిపోవటం, వారిని ఎదిరించేవారు లేకపోవటంతో వర్ధమాన దేశాలకు తిరిగి ముప్పు ఏర్పడటం, కార్మిక,కర్షక వుద్యమాలు వెనుకపట్టుపట్టం, యజమానుల దోపిడీ పెరగటం,సంక్షేమ చర్యలకు కోత ద్వారా ప్రజలపై భారాలు మోపటం వంటి పర్యవసానాల గురించి చెప్పుకున్నాము. సోవియట్‌ పతనం నుంచి గుణపాఠాలు తీసుకోవటమంటే పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం నుంచి వైదొలగి ఆ దుర్మార్గ విధానానికి సలాం కొట్టటం కాదు. అక్టోబరు విప్లవం గురించి మరింతగా మధనం చేయాలి. లోపాలను పునరావృతం కాకుండా చూసుకోవాలి. దానిని వర్తమాన పరిస్ధితులకు అన్వయించుకోవాలి. ప్రతి వైఫల్యం విజయానికి ఒక మెట్టు అని అంగీకరిస్తే అక్టోబరు విప్లవం, సోవియట్‌ ప్రయోగం కూడా అలాంటిదే. ప్రస్తుతం సాంప్రదాయ పెట్టుబడిదారుల స్ధానంలో ద్రవ్య పెట్టుబడిదారులు ప్రపంచంపై ఆధిపత్యం వహిస్తున్నారు. వారి నూతన ఎత్తుగడలను కార్మికవర్గం నూతన పద్దతులలో చిత్తుచేయటం తప్ప మరొక మార్గం లేదు. ఈ క్రమంలో పెట్టుబడిదారీ సిద్దాంత వేత్తలు ముందుకు తెచ్చే గందరగోళ సిద్ధాంతాలు లేదా వాదనలను వారి తీరుతెన్నుల నుంచే ఎండగట్టాలి. రెండు రెళ్లు నాలుగు అన్నది ఏ కాలంలో అయినా ఒకటే. అలాగే కార్మికులు, కర్షకులు దోపిడీకి గురవుతున్నంత వరకు దానిని ఎలా అంతం చేయాలన్నదానిలోనూ ఎలాంటి గందరగోళం, మార్పూ వుండకూడదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Swachh Bharat Mission(Urban) toilets construction

24 Monday Oct 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Swachh Bharat, Swachh Bharat Mission, toilet construction

35% of Mission target for construction of individual household toilets met in 40% of mission period

Gujarat, Andhra Pradesh meet Mission target much ahead of time

 Kerala meets 68% of Mission target;  Chattisgarh-61%, MP-46%, Tamil Nadu-43%

UP, Maharashtra, Karnataka, Jharkhand construct over 30% of targeted toilets

 During the two years of Swachh Bharat Mission, 22,97,389 individual household toilets have so far been constructed in urban areas of the country as against the  five year mission target of 66,42,221 such toilets to be built by 2019. With 35% of mission target being met in two years i.e 40% of the mission duration, construction of toilets meant for ending Open Defecation in urban areas is broadly on course.

Gujarat and Andhra Pradesh have met the mission targets three years ahead  in September this year with Gujarat fulfilling the target of 4,06,388 toilets and Andhra Pradesh building 1,93,426 toilets in urban areas and have declared them Open Defecation Free in urban areas.

Minister of Urban Development Shri M.Venkaiah Naidu reviewed the progress of the mission in urban areas today.

Other leading performers are kerala having built 62,450 which comes to 68% of the mission target of 90,986, Chattisgarh-1,83,726 (61% of 3,00,000), Madhya Pradesh -2,34,377 (46% of 5,12,389) and Tamil Nadu -2,57,781 (43% of mission target of 6,02,029 toilets).

The States that have met over 30% of mission targets are: Maharashtra -33% having built 2,07,888 toilets out of the mission target of 6,29,819, Uttar Pradesh-31% (2,53,979/8,28,237), Karnataka-31% (1,09,704/3,50,000) and Jharkhand -30% (47,968/ 1,61,713).

Telangana has met  28%  of the mission target having built 59,967 of the 2,16,075 toilets, followed by West Bengal-23% (1,20,628/5,15,419), Puducherry -22% (2,135/9,626), Punjab-19% (26,188/1,38,010).

States and Union Territories who have built less than 10% of mission targets are : Manipur (9%), Bihar (7.40%), Uttarakhand (7%), Odisha (4.40%), Mizoram (3.34%) and Arunachal Pradesh (1.60%).

Swachh Bharat Mission was launched on October 2,2014 targeting construction of 1.04 cr individual household  toilets in urban areas based on 2011 Census. Subsequently, taking in to consideration the construction of toilets during 2011-14, mission target in this regard has been revised to 66,42,221 toilets based on the assessment of States/UTs.

As per the  revised targets 14 States and the UT of Delhi account for 80% of the target. These 15 States/UT have till September this year built 21,64,860 toilets accounting for 94% of the total toilets so far built and 32% of the total mission target. States and UTs lagging behind proportionate targets are expected to catch up as mission progresses.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నల్లధనంపై దాడులకు ఎవరు అడ్డు పడ్డారు మోడీ గారూ !

24 Monday Oct 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Black Economy in India, black money, black money unearth, Modi, surgical strikes

సత్య

     కొంత మంది రాజకీయ నాయకుల మాటలు చూస్తే నేను లేస్తే మనిషిని కాదు అన్న దివ్యాంగుడైన మా మల్లయ్య మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఒక ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన మల్లయ్య కాలక్షేపానికి అరుగుమీద కూర్చుంటే కొంటె పిల్లలు ఆట పట్టించేవారు. తన చేతిలోని కర్రను చూపుతూ రేయ్‌ నేను లేస్తే మనిషిని కాను జాగ్రత్త అని హూంకరించే వాడు. పిల్లలు భయపడినట్లుగా నటించే వారు. మరుసటి రోజు కథ మళ్లా మామూలే. నల్లధనంపై ప్రధాని నరేంద్రమోడీ మాటలు కూడా మల్లయ్య కథ మాదిరే వున్నాయంటే ఆయన భక్తులకు కోపం రావచ్చు. మంత్రసాని తనం ఒప్పుకున్నాక బిడ్డొచ్చినా, మరొకటొచ్చినా పట్టక తప్పనట్లే రాజకీయాలలో వున్నతరువాత పొగడ్డలు వచ్చినపుడు జబ్బలు చరుచుకోవటం లేదా రొమ్ము విరుచుకోవటమే కాదు విమర్శలు వచ్చినపుడు ‘సహించాలి ‘ మరి.

      నరేంద్రమోడీ రెండున్నర సంవత్సరాల క్రితం చేసిన అనేక బాసలు, వూసులతో పాటు నల్లధనం వెలికితీత వాగ్దానాన్ని కూడా జనం మరచిపోయిన సమయంలో దాని గురించి మౌనం దాల్చకుండా మాట్లాడటం ఎందుకు చెప్పండి ? అది కూడా సర్జికల్‌ దాడులతో ముడిపెట్టి ‘మేం కనుక ఈ విషయంలో కూడా సర్జికల్‌ దాడులు చేస్తే ఎంత బయటికి వస్తుందో మీరు వూహించుకోవచ్చు ‘ అని నల్లధనం గురించి గుజరాత్‌లోని వడోదరాలో ప్రధానే ఆశ్చర్యం వ్యక్తం చేశారట.http://indianexpress.com/article/india/india-news-india/pm-narendra-modi-warns-of-surgical-strikes-against-blackmoney-corruption-3097294/ ప్రధాని అంతటి వ్యక్తి ఏదైనా అనూహ్యమైన విషయాన్ని ప్రకటిస్తే జనం, ప్రతిపక్షం, పాకిస్థాన్‌ ఆశ్చర్యపోవాలి గానీ ఆయన చెప్పినదానికి ఆయనే ఆశ్చర్యపోవటం వింతైన విషయమే. తనే జోక్‌ వేసి తానే అందరికంటే ముందుగా పెద్దగా నవ్వే వారిని గుర్తుకు తెచ్చారు కదూ ! నల్లధనం సంగతేమోగానీ సర్జికల్‌ దాడుల ఘనత తమదే అని స్వయంగా ప్రధాని చెప్పుకోవటం దీనిలో స్పష్టమైంది. కాంగ్రెస్‌, ఇతర అధికార యావ రాజకీయ పార్టీల వారి మాదిరే విజయాలన్నీ తన ఖాతాలో వేసుకొనే తహ తహ, తపనలో మోడీ కూడా పోటీ పడుతున్నారనుకుందాం.

     నల్ల ధనాన్ని వెలికి తీసిన ఖ్యాతిని కూడా మూట కట్టుకోమనే కదా దేశం యావత్తూ ఎదురు చూస్తోంది. అందుకోసం సర్జికల్‌ దాడులు చేయకుండా మీ ప్రభుత్వానికి ఎవరు అడ్డుపడ్డారన్నదే ప్రశ్న. నల్లధనాన్ని స్వచ్చందంగా వెల్లడించండి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పధకం ఘోరంగా విఫలమైందని మీడియాలో విశ్లేషణలు వచ్చిన తరువాత బహుశా వాటిని జనం మరిచిపోయి వుంటారనే గట్టి నమ్మకంతో నరేంద్రమోడీ దానినొక పెద్ద విజయంగా చెప్పి తన భుజాన్ని తానే చరుచుకున్నారు. మన ప్రభుత్వాలు నిజాయితీగా వేతనం నుంచే పన్ను మొత్తాన్ని చెల్లించే వుద్యోగులకు రాయితీలు ఇవ్వటానికి ముందుకు రావన్నది అందరికీ తెలిసిన నిజం. కానీ ఎలాంటి పన్నులు చెల్లించకుండా గాదె కింది పందికొక్కుల్లా బలిసి పోతున్న వారికి మాత్రం క్షమాభిక్ష లేదా స్వచ్చందంగా ఆదాయ వెల్లడికి పధకాలను ప్రకటించి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు అవకాశమిస్తాయి. అందువల్లనే ప్రతి ఏటా పన్ను చెల్లించటం ఎందుకు? ప్రభుత్వం ఎర్ర తివాచీ పరచి పన్ను ఎగవేతదార్లకు అవకాశం ఇచ్చినపుడు ఎంతో కొంత చెల్లిద్దాము లెమ్మనే దేశ భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

   మెరిల్‌ లించ్‌ కంపెనీ వెల్లడించిన నివేదికల ప్రకారం 2007 నాటికి మన దేశంలో అధిక నిఖర సంపద వున్నవారి సంఖ్య లక్ష దాటింది. గతేడాది నాటికి ఆ సంఖ్య 4.2లక్షలకు చేరింది. 1997లో నల్లధనం దాచుకున్నవారికి క్షమా భిక్ష పేరుతో నాటి కాంగ్రెస్‌ పాలకులు ఒక పధకాన్ని ప్రకటించారు. దానిలో 33వేల కోట్ల రూపాయలను ప్రకటించి పది వేల కోట్ల రూపాయల పన్ను చెల్లించి గౌరవం పొందారు.అప్పటితో పోల్చితే ఇప్పుడు కనీసం పది రెట్లు దేశ ఆర్ధిక వ్యవస్ధ పెరిగింది. ఆ లెక్కన కనీసం మూడులక్షల కోట్ల రూపాయలకు పైగా నల్లధనాన్ని వెల్లడించి వుండాలి. కానీ 65వేల కోట్లే అదీ ఒక్కొక్కరు సగటున ఒక కోటి వంతున మాత్రమే వెల్లడించారంటే మోడీ గారి పధకం ఎంత ప్రహసన ప్రాయంగా మారిందో చెప్పనవసరం లేదు. నిబంధనల ప్రకారం 40శాతం పన్ను రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పాతికవేల కోట్ల రూపాయలకు పైబడే, దాన్నే పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు.

     బిజెపి, ఎన్‌డిఏ పక్షాలు కాంగ్రెస్‌ అవినీతిని గురించి నిత్య పారాయణం చేస్తుంటాయి. తప్పులేదు, ఆ పార్టీ అందుకు తగినదే. కానీ బిజెపి పాలనలో నరేంద్రమోడీ ఏలుబడి కుంభకోణం మాటేమిటి ? ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ము రాకుండా వ్యక్తుల జేబుల్లోకి పంపేందుకు తోడ్పటమే కదా అవినీతి అంటే.తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగవేసి దర్జాగా విదేశాలకు పారిపోతుంటే ఎటు పోతున్నాడో చూడండి తప్ప అరెస్టు చేయటం వంటి అమర్యాద పనులు చేయవద్దని ఆదేశించిన ఘనత నరేంద్రమోడీ సర్కార్‌ హయాంలోనే జరిగింది. ఆ మాల్యనే ఇంతవరకు పట్టుకోలేకపోయారు. అలాంటి మల్లయ్యలు బ్యాంకుల నుంచి తీసుకొని దాదాపు ఎగవేసిన సొమ్ము పదకొండులక్షల కోట్ల రూపాయలు. వారిలో ఏ ఒక్కడూ కూడా వ్యాపారంలో, పరిశ్రమలో నష్టం వచ్చిందని మన రైతుల మాదిరి ఆత్మహత్య చేసుకున్నవారు లేరు. వారి ఆస్థుల నుంచి కనీసం పదో వంతు వసూలు చేసినా లక్ష కోట్ల రూపాయల ఆదాయం వచ్చి వుండేది. ఆ పనేమీ చేయకపోగా గత రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ అనుమతితో బ్యాంకులు రద్దు చేసిన అలాంటి బాకీల మొత్తం 1.12లక్షల కోట్ల రూపాయలున్నదన్న సంగతి ఎంత మందికి తెలుసు. ఎందుకంటే ఈ విజయాన్ని ఎక్కడా మోడీ భక్తులు కీర్తించరు ! రైతుల రుణాలు రద్దు చేయమంటే డబ్బు లేదంటారు . మరి వీరికి ఎక్కడి నుంచి వచ్చింది ? గత సంవత్సరం ప్రభుత్వం అందచేసిన లెక్కల ప్రకారమే వివిధ పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు, ఎగుమతి దిగుమతులకు ఇచ్చిన రాయితీల వలన ప్రభుత్వానికి రావాల్సి రాకుండా పోయిన ఆదాయం ఆరులక్షల పదకొండువేల కోట్లు. ఈ మొత్తంలో లక్షా పదహారు వేల కోట్లరూపాయలు బంగారం, వజ్రాల దిగుమతులు చేసుకున్న మన దేశంలోని ‘ అత్యంత నిరుపేదలకు ‘ నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చిన రాయితీ అంటే ఎవరైనా నమ్ముతారా ? ఇలాంటి రాయితీలు కాంగ్రెస్‌ హయాంలో మొదలై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నరేంద్రమోడీ హయాంలో కూడా పెరిగాయి తప్ప తరగలేదు ! కానీ ఈ విషయంలో మాత్రం నరేంద్రమోడీకి ఆశ్చర్యం కలగలేదు, సర్జికల్‌ దాడులు గుర్తుకు రాలేదు !! చంద్రబాబు నాయుడి వూతపదం ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా ఈ పాలన ఇలా ముందుకు పోవాల్సిందేనా ? జనానికి కబుర్లు, కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వాల్సిందేనా ? అన్నింటి కంటే ప్రహసనం ఏమంటే నల్లధనాన్ని అరికట్టేందుకు గతంలో వంద రూపాయల నోట్లను రద్దు చేస్తే సగం అంతరిస్తుందనుకున్నారు. ఇప్పుడు ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయాలని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైన చంద్రబాబు నాయుడు బహిరంగంగానే సలహా ఇచ్చారు. కానీ కేంద్ర త్వరలో రెండువేల రూపాయల నోట్లను చలామణిలోకి తేనున్నదని వార్తలు అంటే నల్లధన కుబేరులకు మరింత సౌకర్యం కల్పించటమేనా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వీధుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా వ్యతిరేక చిందులు !-సరిహద్దుల్లో భారత్‌, చైనా మిలిటరీ విన్యాసాలు !

23 Sunday Oct 2016

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ 1 Comment

Tags

anti china, military exercise in Ladakh, RSS Outfits anti china, RSS Outfits anti china feets, Sino-Indian joint military exercise in Ladakh

సత్య

    అర  నుంచి ఇటీవలనే పొడుగు లాగూలకు మారిన ఖాకీ వాలాలు వీధులు, ఇంటర్నెట్‌ సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేక చిందులు వేస్తున్నారు. వాటి బదులు మన ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన ‘ మేకిన్‌ ఇండియా ‘ పిలుపు మేరకు ఒక చిన్న వస్తువునైనా తయారు చేసి కసితో చైనాతో సహా ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తే వారి ‘దేశ భక్తి ‘ మరింత ఇనుమడించి వుండేది. ఏం చేయాలనేది ఎవరిష్టం వారిది కనుక వీరంగం వేసే వారిని వదిలేద్దాం. గత వారంలో మన సైనికులు సరిహద్దులలో చైనా సైన్యంతో కలిసి మన భూభాగంపై సంయ్తు విన్యాసాలు చేశారు. అదీ యురీ సైనిక శిబిరంపై పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులు దాడి జరిపి మన సైనికుల ప్రాణాలు బలిగొనటం, ఆ విషయంలో మనకు గాక పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇస్తున్నదని పెద్ద ఎత్తున ‘ ప్రచారం’ జరిపి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన పూర్వరంగంలో చైనా మిలిటరీతో కలసి విన్యాసాలు జరిపినట్లు మన సైన్యమే అధికారికంగా ప్రకటించింది. తేడా ఏమిటంటే సర్జికల్‌ దాడులకు మాదిరి సైన్యంగానీ లేదా అంతకు మించి యుద్ధం చేస్తున్న మన మీడియా గానీ ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రాధాన్యత, ప్రచారం ఇవ్వలేదు. కారణం ఏమిటో అందరికీ తెలుసు గనుక సైన్యానికి ఎలాంటి వుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు. కానీ మీడియా విషయానికి వస్తే దాని రేటింగ్‌ పెరగదని మార్కెటింగ్‌ విభాగం చెబితే ఎంత పెద్ద వార్తనైనా పక్కన పడేస్తుంది సంపాదక విభాగం, ఎందుకంటే మీడియాను నడిపేది సంపాదకులు కాదు, బిజినెస్‌ మేనేజర్‌, డబ్బు సంపాదించే విభాగాలే.

  అసలు కంటే కొసరు హడావుడి ఎక్కువ చేస్తుందన్న విధంగా మన ఆర్‌ఎస్‌ఎస్‌ ఖాకీ సైని కమాండర్లు మాత్రం బాణా సంచాలకు మినహా మిగిలిన పెద్ద వస్తువుల దిగుమతికి మినహాయింపులు ప్రకటిస్తుంటే దిగువ సైన్యం మాత్రం వీరంగం వేయటం ఇంకా కొనసాగిస్తూనే వుంది. నిజానికి బాణ సంచా దిగుమతులపై కేంద్ర ప్రభుత్వ నిషేధం వుంది. దాన్ని సక్రమంగా అమలు జరపకపోవటమే దేశ ద్రోహం. చైనా మిలిటరీతో కలసి మనం జమ్మూలో విన్యాసాలు జరపటం దేశ భక్తా, ద్రోహమా లేక చైనా అనుకూలమా ? పిల్లలను స్టెరాయిడ్లతో వుద్రేక పరిచిన ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు చెప్పాలి మరి ?

    అణు సరఫరా గ్రూపులో మన సభ్యత్వానికి చైనా మోకాలు అడ్డిందని, పాకిస్తాన్‌తో సంబంధాలను పెంచుకుంటున్నది అనే విషయాలపై అనేక మంది తమ రచనలలో ఖండన మండనలు జరుపుతున్న సమయంలో వాటిని పట్టించుకోకుండా మిలిటరీ విన్యాసాలు కొనసాగించటం విశేషమే. సర్జికల్‌ దాడులకు రాజకీయ నాయకత్వం అనుమతి ఇచ్చిందని, దానికి తాము ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో పెరగటమే కారణమని రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఇప్పటికే ప్రకటించారు కనుక ఈ విన్యాసాల గురించి ఏం చెబుతారు ? అనుమతించినట్లా లేదా ?

    సాధారణంగా రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు అనగానే మూడో దేశాన్ని భయపెట్టటానికో, బెదిరించటానికో అన్నది సాధారణంగా అందరూ అనుకుంటారు. అమెరికా వంటి సామ్రాజ్యవాదుల మిలిటరీ ప్రమేయం వున్నపుడు అందులో వాస్తవం కూడా లేకపోలేదు. కానీ చైనాతో మన వారు జరిపింది మరొక దేశాన్ని బెదిరించటానికో మరొకందుకో కాదు. ప్రకృతి ప్రళయాలు సంభవించినపుడు సరిహద్దులలోని జనాన్ని ఎలా ఆదుకోవాలో నేర్పేందుకు, నేర్చుకునే లక్ష్యంతో చేసినవి ఇవి. సరిహద్దులలో భూ కంపం వచ్చినపుడు ఒక గ్రామంలోని వారిని ఎలా ఆదుకోవాలన్న విషయమై విన్యాసాలు రోజంతా సాగాయి. వైద్య సహాయంతో సహా జనాన్ని రక్షించేచర్యలు తీసుకోవటంలో పెద్ద విజయం సాధించామని, వుభయ సైనికుల మధ్య విశ్వాసం,సహకారం మరింతగా పెరిగాయని మన మిలిటరీ ప్రకటించింది. సరిహద్దులలో శాంతి సామరస్యాలను పెంపొందించేందుకు కూడా వీటిని తలపెట్టినట్లు పేర్కొన్నది. లడక్‌ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ ప్రాంతంలో చైనా ప్రాంతంలో ఫిబ్రవరి ఆరున జరిపిన విన్యాసాల కొనసాగింపుగా ఇది కొనసాగింది. ‘చేతిలో చేయి ‘ అన్న కార్యక్రమాలలో భాగంగా ఇవి జరుగుతున్నాయి. దాని కొనసాగింపుగానే నవంబరు 15-27 మధ్య మన మిలిటరీ దక్షిణాది ప్రధాన కార్యాలయం వున్న పూనేలో మన సైన్యంతో కలిసి చైనా సైన్యం వుగ్రవాద వ్యతిరేక చర్యలపై విన్యాసాలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతేడాది చైనాలోని ఏనాన్‌ రాష్ట్రంలోని చెంగ్‌డూ మిలిటరీ ఏరియాలో మన దేశం నుంచి వెళ్లిన నాగా రెజిమెంట్‌ సైనికులు చైనీయులతో కలసి ఇలాంటి విన్యాసాలే జరిపి వచ్చారు.

    ఒకవైపు చైనాకు వ్యతిరేకంగా దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలతో పాటు భారత్‌ను కూడా తనవైపు లాక్కునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో ఇవి కానసాగటాన్ని గమనించాలి. ప్రస్తుతం చైనా ఆధీనంలో వున్న కొంత లడఖ్‌ ప్రాంతం మనదే అని మన దేశం, మన ఆధీనంలో వున్న అరుణాచల్‌ మాదని చైనా వాదిస్తున్న విషయం తెలిసినదే. 1962లో వుభయ దేశాల మిలిటరీ యుద్ధానికి తలపడిన ప్రాంతంలోనే ఇప్పుడు చేయి చేయి కలిపి రెండు మిలిటరీలు విన్యాసాలు చేశాయి. సరిహద్దు వ్యవహారాలపై తగు పద్దతుల్లో వ్యవహరించేందుకు వుభయ సరిహద్దు సేనల మధ్య జరిగే సాధారణ విన్యాసాలు తప్ప మూడో దేశానికి వ్యతిరేకంగా కాదని చైనా విదేశాంగ శాఖ కూడా అక్టోబరు 19న జరిపిన విన్యాసాల గురించి ప్రకటించింది. కాశ్మీర్‌ సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనే తమ వైఖరిలో కూడా ఎలాంటి మార్పు లేదని రాతపూర్వక వివరణలో చైనా స్పష్టం చేసింది. సరిహద్దు దేశాలు కనుక మంచో చెడో మన రెండు దేశాలు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరపటం ద్వారా వుభయుల మధ్య అనుమానాలు తొలగిపోవటానికి దారి తీస్తుంది. కానీ గతేడాది అమెరికా, జపాన్‌ సైన్యంతో కలసి మలబార్‌ విన్యాసాలు జరపటం, ఈ ఏడాది మన దేశంలోని వుత్తరాఖండ్‌లో అమెరికా మిలిటరీతో కలసి మన సైన్యం విన్యాసాలు జరపనుండటం గురించి కొంత మందిలో అనుమానాలు లేకపోలేదు. ఎవరి అనుమానాలు, ఎవరి అభిప్రాయాలు వారికి వున్నా ఇటీవలి కాలంలో మిలిటరీ విన్యాసాలు అనేవి ఒక బల ప్రదర్శన, దౌత్య ఎత్తుగడలలో భాగంగా జరుగుతున్నాయి. అన్నీ శాంతియుత ప్రయోజనాలకే అని చెప్పలేము, అదే విధంగా యుద్ధ చర్యలలో భాగమని అనలేము. ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిందేమంటే మనం ఇతరులతో కలసి విన్యాసాలు జరుపుతున్నట్లే ఇతరులు కూడా జరుపుతారు. వ్యతిరేకించాల్సి వస్తే అన్నింటి పట్ల ఒకే వైఖరిని తీసుకోవాలి. మనం చేసేదే సరైనది, ఇతరులు చేసేది మనకు వ్యతిరేకం అనుకుంటేనే తేడాలు వస్తాయి. ఇదే సమయంలో మన భద్రతా చర్యలు మనం తీసుకోకతప్పదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా వస్తు బహిష్కరణ అంతా మోసం గురూ !

21 Friday Oct 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

China goods, China goods boycott, DIWALI, RSS, RSS China goods, SJM

సత్య

  జాతీయ వాదం, జాతీయ వాదుల నిర్వచనాలు మారిపోతున్నాయి. వచ్చే దీపావళికి చైనాలో తయారైన బాణా సంచా కాల్చేవారు జాతి ద్రోహులు అన్న విధంగా కొందరు వుద్రేక పడుతున్నారు. చైనా సరకు సంగతి పక్కన పెట్టండి. మన దేశంలో తయారయ్యేదైనా కాల్చటం అవసరమా అని ఆలోచిస్తే మంచిది. దీపావళి సందర్భంగా కొన్నివేల కోట్ల రూపాయల బాణ సంచా కాల్చి డబ్బును వృధా చేయటంతో పాటు పర్యావరణానికి హాని కలిగించటం ఎందుకు?

   జనం ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించటంలో మన దేశంలోని కొందరు మేథావులకు వున్న తెలివితేటలను సమస్యలను పరిష్కరించటానికి వుపయోగిస్తే ఎంత బాగుండునో అన్నది ఎప్పటి నుంచో వున్న పగటి కల. చైనా నుంచి అక్రమంగా వస్తున్న దిగుమతుల కారణంగా మన దేశంలోని పరిశ్రమలు దెబ్బతింటున్నాయనటం ఒక తిరుగులేని వాస్తవం. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ సృష్టి అయిన స్వదేశీ జాగరణ మంచ్‌ పుట్టక ముందే మనకు తెలుసు. గ్లాస్గో, మాంచెస్టర్‌ నుంచి దిగుమతి అయిన జౌళి వుత్పత్తులు మన దేశంలోని చేనేత పరిశ్రమ నడుం విరగొట్టాయి. అందుకే స్వాతంత్య్ర వుద్యమంలో విదేశీ వస్త్ర, వస్తు బహిష్కరణ నినాదం ఒక పెద్ద వుద్యమ రూపాన్నే తీసుకుంది. ఇటీవలి కాలంలో సంస్కరణల పేరుతో మన దేశ మార్కెట్‌ను తెరిచిన తరువాత గత పాతిక సంవత్సరాలలో విదేశీ వస్తువు లేకుండా మనకు తెల్లవారటం లేదన్నది పచ్చి నిజం. మారుతీ కార్లను అనుమతించటంతో మన అంబాసిడర్‌ కారు మాయం లేదా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. శాంసంగ్‌, సోనీ తదితర కొరియా, జపాన్‌ టీవీల సునామీతో మన ఇసి, భారత్‌, డయనోరా వంటి స్వదేశీ టీవీలు కనపడకుండా పోయాయి. మనం కంప్యూటర్ల మీద పనిచేసే ఇంజనీర్ల తయారీకి ప్రాధాన్యత ఇచ్చాము గాని కంప్యూటర్ల తయారీ గురించి పట్టించుకోని కారణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇలా కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. ఆ పరంపరలోనే చైనా బాణ సంచా మన దేశంలోని శివకాశి కార్మికుల పొట్టలు కొట్టిందన్నది వాస్తవం. దీనికి కారకులెవరు ? కాంగ్రెస్‌,బిజెపి, తెలుగుదేశం, దాని నుంచి పుట్టిన టిఆర్‌ఎస్‌ వంటివాటికి ఇలాంటి పరిస్థితి తలెత్తటంలో బాధ్యత లేదా ? ఎవరి బాధ్యతేమీ లేకుండానే విదేశీ వస్తువులు ఆకాశం నుంచి వూడిపడుతున్నాయా ?

   చైనా నుంచి వస్తున్న బాణ సంచాకారణంగా తమిళనాడులోని శివకాశిలో ఐదులక్షల కుటుంబాలకు వుపాధి పోయిందని, ఆరువేల కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగిందని నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి దీపావళి సందర్భంగానే మీడియాలో వార్తలు వచ్చాయి.http://www.ibtimes.co.in/chinese-exports-hit-sivakasi-firecracker-makers-5-lakh-families-suffer-losses-610963 రెండు సంవత్సరాల క్రితం చైనా నుంచి బాణ సంచా అడపాతడపా దిగుమతి అయింది. ఈ ఏడాది విపరీతంగా పెరిగిపోయి, తాము తయారు చేసిన సరకులో 35శాతం మిగిలిపోయిందని 2014 అక్టోబరులోనే బాణ సంచాతయారీదార్ల ప్రతినిధి వాపోయారా లేదా ? అక్రమంగా దిగుమతి అయిన వాటిని నాశనం చేయకుండా అపరాధ రుసుం విధించి దిగుమతి చేసుకున్నవారికి అప్పగిస్తున్నారా లేదా ? ఆ తరువాత ఆ దిగుమతులు ఇంకా విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి బాధ్యత ఎవరిది ? అక్రమ దిగుమతులను సక్రమంగా మార్చిన ప్రభుత్వానిదా, చౌకగా వున్నందున కొనుగోలు చేస్తున్న జనానిదా ? నిబంధనలను అమలు జరపాల్సింది ప్రభుత్వమా, మరొకరా ? మన దేశం నుంచి బాణ సంచా ఎగుమతి చేసేందుకు గాను నిల్వ వుంచటానికి తగినంత అవకాశం లేదంటూ మన రేవుల ఆధికారులు అనుమతించటం లేదని, స్వదేశీ ఎగుమతులకు గేట్లు మూసి విదేశీ దిగుమతులకు గేట్లు బార్లా తెరిచారని శివకాశీ తయారీదార్లు వెలిబుచ్చిన ఆవేదనను ఎవరైనా పట్టించుకున్నారా ?

   నరేంద్రమోడీ ఏలుబడిలో గతేడాది రెండో దీపావళి జరుపుకున్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిషేధాలు, నిరోధాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదని గత నవంబరులో వార్తలు వచ్చాయి.http://timesofindia.indiatimes.com/city/ahmedabad/Ban-on-Chinese-crackers-fails-to-cheer-fireworks-industrythis-Diwali-Survey/articleshow/49714653.cms గుజరాత్‌ రాజధాని అహమ్మదాబాద్‌, రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌, మహారాష్ట్ర రాజధాని ముంబై, ఢిల్లీ, లక్నో నగరాలు అక్రమంగా దిగుమతి చేసుకున్న బాణ సంచా పెద్ద ఎత్తున నిల్వకేంద్రాలుగా వున్నాయని అసోచెమ్‌ చేసిన సర్వేలో గతేడాది వెల్లడైంది. వీటిలో మొదటి మూడు కేంద్రాలు బిజెపి ఏలుబడిలో వున్న రాష్ట్రాల రాజధానులు. వుత్తర భారత్‌ నుంచి డిమాండ్‌ తగ్గిపోయిందని శివకాశీ తయారీదార్లు చెప్పారు. చైనా నుంచి అక్రమంగా దిగుమతి కావటంతో పాటు రూపాయి విలువ పతనమైన కారణంగా అల్యూమినియం పౌడర్‌, బేరియం నైట్రేట్‌ వంటి ఇతర ముడి సరకుల దిగుమతి ఖర్చు కూడా పెరిగి బాణ సంచా వుత్పత్తి ఖర్చు పెరిగిందని కూడా వారు చెప్పారు.

  శివకాశీ నుంచైనా, చైనా నుంచైనా బాణా సంచా కొనుగోళ్లు దీపావళికి కొన్ని నెలల ముందుగానే జరుగుతాయి. ఇప్పుడు చైనా వస్తువులను బహిష్కరించాలని చెప్పటమంటే బడా వ్యాపారుల నుంచి కొనుగోలు చేసిన చిన్న వ్యాపారులను ముంచటం తప్ప వేరు కాదు. బాణా సంచా విక్రయించటానికి చిరు వ్యాపారులకు లైసన్సు అవసరం తమిళనాడులో అధికారులు జారీ చేసిన లైసన్సులలో విదేశీ బాణ సంచా అమ్మరాదనే నిబంధన లేదట. విదేశీ బాణ సంచా అమ్మబడదు అని పెద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని మౌఖికంగా చెబుతున్నారని వార్త.http://www.thehindu.com/news/national/tamil-nadu/chinese-crackers-may-sneak-in-this-deepavali/article9231948.ece చైనా వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చి సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించిన ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ ఆకస్మికంగా ప్లేటు ఫిరాయించింది. చైనా నుంచి దిగుమతి చేసుకొనే భారీ యంత్రాల వంటి వాటిని బహిష్కరణ నుంచి మినహాయించినట్లు ప్రకటించింది.http://timesofindia.indiatimes.com/city/nagpur/Swadeshi-Jagran-Manch-excludes-capital-goods-from-anti-China-drive/articleshow/54965515.cms  ఎంత అవకాశవాదం? సామాన్య, మధ్యతరగతి కొనుగోలు చేసే బాణ సంచాపై పెద్ద రగడ సృష్టించింది. కానీ కార్పొరేట్లు దిగుమతి చేసుకొనే యంత్రాలను మాత్రం బహిష్కరణ నుంచి మినహాయించింది. అంటే ప్రచారం జనాల కోసం ! పని చేసేది కార్పొరేట్ల కోసమా !! చైనా వస్తుబహిష్కరణ తమ ప్రయోజనాలకు నష్టదాయకమని కార్పొరేట్లు చేసిన వత్తిడికి లొంగటం తప్ప దీనిలో ‘దేశభక్తి ‘ కనిపించటం లేదు. మన ఔషధ కంపెనీలు వుపయోగించే రసాయనాలలో 65 శాతం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, బొగ్గుతో నడిచే విద్యుత్‌ కేంద్రాలన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలతో పనిచేస్తున్నాయని అసలు విషయాన్ని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌కు నాయకత్వం వహిస్తున్న కాశ్మీరీ లాల్‌ వెల్లడించారు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా వస్తు బహిష్కరణ పాతాళ భైరవిలో మాంత్రికుడి శిష్యుడు చెప్పినట్లు అంతా మోసం గురూ !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దున్న ఈనిందంటే దూడను కట్టేయమన్న ‘ఆంధ్రజ్యోతి’

20 Thursday Oct 2016

Posted by raomk in AP NEWS, CHINA, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

anti china, China, mudslinging on China

సత్య

     గురువారం నాటి ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో ‘భారత్‌కు మొరగడమే తెలుసు ! ‘ అనే శీర్షికతో ఒక వార్తను ప్రచురించారు. చైనా పత్రిక భారత ప్రభుత్వంపైనే కాదు, భారతీయ కార్మికులపైనా నోరు పారవేసుకుంది అని రెచ్చగొట్టే విధంగా ఆ కధనం సాగింది. చైనా నుంచి వెలువడే గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక బుధవారం నాటి సంపాదకీయంలో భారత్‌పై రకరకాలుగా రెచ్చిపోయింది అంటూ కొన్ని విషయాలు రాశారు. గోవాలో బ్రిక్స్‌ సమావేశం జరిగింది. వచ్చిన వారు ఒక ప్రకటన చేసి వెళ్లిపోయారు. వెంటనే ఒక చైనా పత్రిక ఇలా రాయటం ఏమిటి ? ఆ పత్రిక కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక కాదు. చైనా డైలీ అధికార పత్రిక. అయినప్పటికీ చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్నదే అన్నది స్పష్టం.దానిలో అనేక విషయాలు రాస్తుంటారు, అవన్నీ చైనా కమ్యూనిస్టు పార్టీ, లేదా ప్రభుత్వ విధానాలతో ఏకీభవించనవసరం లేదు. అలాగని అదేమీ చైనా ప్రభుత్వ, కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక కాదు. ఇటీవలి కాలంలో చైనా-భారత్‌ సంబంధాలను గమనిస్తున్నపుడు ఇటు నరేంద్రమోడీ అటు చైనా ప్రభుత్వం రెండూ కూడా లోపల ఎటువంటి అభిప్రాయాలున్నప్పటికీ ఎంతో సంయమనం పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. వుభయులూ  అధికారికంగా ఎక్కడానోరు జారటం లేదు.ఈ పూర్వరంగంలో చైనా ప్రభుత్వ మద్దతుతో నడిచే ఒక పత్రిక సంపాదకీయంలో భారత్‌కు వ్యతిరేకంగా అలాంటి వ్యాఖ్యలు చేయటమంటే అది తీవ్ర విషయమే. తానుగా విబేధాలను కొని తెచ్చుకోవటం చైనా దౌత్యనీతికే విరుద్ధం. అందువలన ఆ వార్తలో నిజమేమిటో చూడాలనిపించింది.

   ఆంధ్య్రజోతి తరహా వార్తనే ఇండియా టీవీ బుధవారం మధ్యాహ్నం ప్రసారం చేసినట్లు దాని వెబ్‌సైట్‌ను బట్టి అర్ధమైంది.http://www.indiatvnews.com/business/india-india-can-only-bark-its-calls-for-boycotting-chinese-products-rabble-rousing-chinese-media-352958 ఆంధ్రజ్యోతి పత్రిక దానిని స్వీకరించి వార్తగా )ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆ వార్త తీరుతెన్నులను చూస్తే ‘గ్లోబల్‌ టైమ్స్‌’ పత్రిక ఏం ప్రచురించిందో కూడా నిర్ధారణ చేసుకోకుండానే ‘కాళిదాసు కవిత్వానికి తన పైత్యం జోడించినట్లు ‘గా స్పష్టమైంది. గ్లోబల్‌ టైమ్స్‌ పత్రికలో ప్రచురించినదానితో ఈ వ్యాఖ్యాత ఏకీభవిస్తున్నాడా లేదా అన్నది ఇక్కడ సందర్భం కాదు. జర్నలిజం తీరుతెన్నులను తెలియచెప్పటమే లక్ష్యం. కార్మికుల మీద, కార్మిక సంఘాల మీద అనుచిత వ్యాఖ్యలు వున్నాయి. అలాంటి వ్యాఖ్యలు మన దేశంలోని కమ్యూనిస్టులు తప్ప ఇతర పార్టీల నేతలందరూ బహిరంగంగా చేస్తున్నవే అని గమనించాలి. కార్మికులను నిందించారని బొటబొటా కన్నీరు కార్చుతూ రాసిన ఆంధ్రజ్యోతి కార్మికుల ఆందోళనల సమయంలో వార్తలు ఎలా ఇస్తుందో అందరికీ తెలిసిందే.

    మొదటి విషయం: అది గ్లోబల్‌ టైమ్స్‌ బుధవారం నాడు రాసిన సంపాదకీయం కాదు. చైనా-ఫిలిప్పైన్స్‌ దగ్గర కావటాన్ని అమెరికా ఎందుకు నిరసిస్తోంది అనే శీర్షికతో ఆ రోజు సంపాదకీయం వుంది.http://www.globaltimes.cn//content/1012531.shtml కనుక గ్లోబల్‌ టైమ్స్‌ సంపాదకీయంలో భారత్‌, కార్మికులపైనా నోరు పారవేసుకుంది అన్నది అబద్దం.

    రెండవది : అది సంపాదకీయం కాదని తేలిపోయింది, మరి వార్త రాసిన పెద్ద మనిషి సంపాదకీయం అని ఎందుకు చెప్పినట్లు ? ఇండియా టీవీ వార్తలో కూడా సంపాదకీయం అని లేదు, సంపాదకీయం ప్రచురించే పేజీలో అని మాత్రమే వుంది. జ్యోతి అనువాదకులు సంపాదకీయం అని తగిలించారు. మూలంలోకి వెళ్లి వుంటే ఆ పని చేసి వుండేవారు కాదు.

    మూడవది: ఆ రచన గ్లోబల్‌ టైమ్స్‌ వాణిజ్య వార్తల పేజీలో ప్రచురించింది. http://www.globaltimes.cn/content/1012145.shtml

    నాల్గవది, అత్యంత ముఖ్యమైనది, ఇండియా టీవీ కావాలని దాచిపెడితే, దాన్ని నమ్మి ఆంధ్రజ్యోతి పప్పులో కాలు వేసింది. ఆ వ్యాఖ్యానం రాసింది గౌరవ త్యాగి అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు. అతనెవరో ఇప్పటికే అర్ధమై వుంటుంది. చైనాలోని గాన్సు రాష్ట్రంలోని బైయిన్‌లో నివశిస్తున్న భారతీయ సంతతి వ్యక్తి. ‘అంతర్గత నేత్రం’ (ఇన్‌సైడర్‌ ఐ) శీర్షిక కింద దానిని ఒక అభిప్రాయంగా ప్రచురించారు.

    ప్రస్తుతం దేశంలో వాణిజ్య, వ్యాపార కార్పొరేట్‌ మీడియాకు సంచలనాలు, బాగా అమ్ముడు పోయే వార్తలు కావాలి. అందుకోసం కొందరు జర్నలిస్టులు ఏ గడ్డి కరిచైనా తమ యజమానుల మెప్పు పొందేందుకు గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారు. తప్పుడు ప్రచారాన్ని తలకు ఎక్కించుకున్న కొందరు జర్నలిస్టులు కూడా ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు చైనా వ్యతిరేకత మంచి వాటంగా వుంది. ప్రస్తుతం సామాజిక మీడియాలో ఆ గాలి వీస్తున్నది. దున్న ఈనిందంటే వెంటనే దూడను గాటను కట్టేయమన్నట్లుగా దానికి అనేక మంది ప్రభావితులౌతున్నారు. అంతా చదివిన తరువాత సంపాదకీయం గాక పోతే మరొకటి, చైనా వాడు గాకపోతే మరొకడు చైనా పత్రికలో రాశాడా లేదా అని అడ్డంగా ఎవరైనా మాట్లాడితే చేసేదేమీ లేదు. తెగించిన వారికి తెడ్డే లింగం సామెత వూరికే పుట్టలేదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

గోబెల్స్‌ చెప్పులలో నరేంద్రమోడీ కాళ్లు ?

19 Wednesday Oct 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

Goebbels, Joseph Goebbels, Narendra Modi, Nazi Joseph Goebbels, surgical strike

ఎంకెఆర్‌

   ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే నిజమౌతుందన్నది జర్మన్‌ నాజీ గోబెల్స్‌ ప్రచార సూత్రం. సర్జికల్‌ దాడుల గురించి ఏకంగా ప్రధాని, రక్షణ మంత్రే ఆ సూత్రాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నారని గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రచార తీరు వెల్లడిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవైపు మంగళవారం నాడు న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మన విదేశాంగశాఖ కార్యదర్శి ఎస్‌ జయశంకర్‌ మాట్లాడుతూ సర్జికల్‌ దాడులు కొత్తగా జరిపినవి కాదని, గతంలో జరిగిన వాటి గురించి సైన్యానికి మాత్రమే తెలుసునని, ఇటీవలి దాడుల గురించి తొలిసారిగా బహిరంగంగా వెల్లడించారని స్పష్టంగా చెప్పారు. అదే సమయంలో హిమచల్‌ ప్రదేశ్‌లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి దాడులను ఇజ్రాయిల్‌ మాత్రమే చేయగలదని విన్నామని ఇప్పుడు భారతీయ సైన్యం కూడా ఎవరికీ తీసిపోదని వెల్లడైందని అన్నారు. ఇలాంటి దాడులు తొలిసారిగా జరిగాయని రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ చెప్పిన మాటలనే ప్రధాని మరొక రూపంలో చెప్పారు తప్ప అర్ధం ఒకటే.

     ఇక్కడ రెండు విషయాలు. సర్జికల్‌ దాడులు గతంలో కూడా జరిపామని విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్పిన విషయం ప్రధాని నరేంద్రమోడీకి తెలియదు అనుకోవటం అమాయకత్వం. తెలిసి కూడా ఇలాంటి దాడులు చేయగల సత్తా ఇజ్రాయెల్‌కు మాత్రమే వుందని విన్నామని చెప్పటం మన మిలిటరీని అవమానించటం తప్ప మరొకటి కాదు. నిజంగా తెలియకపోతే ప్రధానిగా రెండున్నర సంవత్సరాలలో తెలుసుకొని వుండి వుండాలి. తరతమ తేడాలతో ప్రపంచంలో ప్రతి మిలిటరీకి వుంటుందన్నది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే ఇటీవల మన మిలిటరీ జరిపిన దాడుల సందర్భంగా మీడియాలో ఈ విషయాలన్నీ చర్చించారు. అలాంటిది ఇజ్రాయెల్‌కు మాత్రమే వుందని విన్నామని ప్రధాని స్వయంగా చెప్పటం అంటే మీడియా వార్తలు కూడా ప్రధానికి తెలియవా ? రెండవది ఇజ్రాయెల్‌ పేరు ప్రస్తావించటం అంటే దాని గొప్పతనాన్ని పొగడటం, దాని మిలిటరీతో మన మిలిటరీని పోల్చటం. ఇదింకా అవమానకరం .

    ప్రపంచంలో అత్యంత దుర్మార్గమైన వాటిలో ఇజ్రాయెల్‌ మిలిటరీ ఒకటి. పై నుంచి కింది వరకు దానిలో యూదు దురహంకారం, దురాక్రమణవాదాన్ని నింపారు. మన మిలిటరీ అందుకు పూర్తిగా విరుద్ధం. అరబ్బుల ప్రాంతాలను ఆక్రమించుకోవటంతోనే ఇజ్రాయెల్‌ పుట్టింది. ఆ తరువాత దాని పరిసరాలలో వున్న జోర్డాన్‌,లెబనాన్‌, సిరియా, ఈజిప్టు ప్రాంతాలను ఆక్రమించుకొని ఇప్పటికీ తిష్ట వేసింది.అంతర్గతంగా అరబ్బుల ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించుకొనేందుకు పూనుకున్న ఇజ్రాయెలీలకు రక్షణగా మిలిటరీ వ్యవహరించటం అందిరికీ తెలిసిందే. ఇజ్రాయెల్‌ దురాక్రమణను ఎదుర్కొనే క్రమంలో దాని సరిహద్దులలో అనేక దేశాల మిలిటరీ వుంటుంది. వాటిని నిరంతరం రెచ్చగొట్టటం, యుద్ధానికి కాలుదువ్వటం, అరబ్బు ప్రాంతాలలోని సాధారణ పౌరుల ప్రాంతాలపై రహస్య దాడులు జరపటం దాని నిరంతర కార్యక్రమాలలో భాగం. అందువలన అది చేసే సర్జికల్‌ దాడులు, మన మీద దాడులకు సిద్ధంగా వున్న ఆక్రమిత కాశ్మీర్‌లోని పాక్‌ ప్రేరేపిత వుగ్రవాద శిబిరాలపై మన సైన్యం దాడులు చేయటం ఒకటి కాదు. ఇజ్రాయెల్‌ చర్యలు యుద్ధోన్మాద కవ్వింపు అయితే మన సైన్యం చర్యలు ఆత్మరక్షణ, వుగ్రవాద నిరోధ చర్యలలో భాగం. ఇజ్రాయెల్‌ వంటి దుష్ట మిలిటరీ తప్ప మన సైన్యాన్ని పొగడటానికి, పోల్చటానికి మరొక మిలిటరీ దొరకలేదా ? పాలస్తీనా పౌరుల న్యాయమైన పోరాటానికి మద్దతు, ఇజ్రాయెల్‌ దాడులు, దురాక్రమణను వ్యతిరేకించే మన పశ్చిమాసియా విదేశాంగ విధాన కీలకాంశానికి విరుద్ధంగా ఇజ్రాయెల్‌ను పొగడటం తగని పని. ఒకవైపు పాలస్తీనా వైఖరిలో ఎలాంటి మార్పు లేదంటూనే ఇజ్రాయెల్‌ను పొగడటం శకుని, శల్యసారధ్యాలను గుర్తుకు తెస్తోంది.

     గతంలో ఇలాంటి సర్జికల్‌ దాడులు జరగలేదని, జరిగినవి ఏవైనా వుంటే స్ధానికంగా చేసినవి తప్ప ప్రభుత్వ ప్రభుత్వ ప్రమేయంతో జరగలేదని ప్రకటించిన రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ తరువాత మరొక అడుగు ముందుకు వేసి ప్రధాని, తాను ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం కలిగిన వారం కనుకనే ఈ దాడులు జరిగాయని చెప్పి దాడుల ఖ్యాతిని ఆ సంస్థకు ఆపాదించేందుకు ప్రయత్నించారు. ఇదొక ప్రమాదకర పోకడ. పేరుకు సేవా, సాంస్కృతిక సంస్ధ అని చెప్పుకుంటూ అనేక వివాదాలు, మత ఘర్ణణలను రెచ్చగొట్టే సంస్ధగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌, దాని భావజాలంతో పని చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రధాని, రక్షణ మంత్రి గాలిని విదేశాంగ కార్యదర్శి తీసినట్లయింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: