• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: November 2018

వక్రీకరణలను తిప్పికొట్టండి-సోషలిజం గొప్పతనాన్ని చెప్పండి !

29 Thursday Nov 2018

Posted by raomk in CPI(M), Current Affairs, Greek, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

100 years of the KKE, 20 IMCWP, 20th International Meeting of Communist and Workers’ Parties, Communist Party of Greece

Image result for 20th IMCWP

ఎం కోటేశ్వరరావు

కమ్యూనిస్టు , కార్మికోద్యమాలను బలపరిచే, సంరక్షించుకొనే కృషిలో భాగంగా 2019లో వచ్చే ముఖ్యమైన స్మారకోత్సవాల సందర్భంగా బహుముఖ కార్యక్రమాలను నిర్వహించాలని, వక్రీకరణలను తిప్పి కొట్టి సోషలిజం గొప్పతనాన్ని జనానికి చెప్పాలని గ్రీసు రాజధాని ఏథెన్స్‌లో జరిగిన 20వ అంతర్జాతీయ కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీల సమావేశం పిలుపు నిచ్చింది. గ్రీసు కమ్యూనిస్టు పార్టీ తన వందవ వార్షికోత్సవం సందర్భంగా నవంబరు 23-25 తేదీలలో ఆతిధ్యమిచ్చిన ఈ సమావేశానికి 73 దేశాల నుంచి 90 పార్టీల ప్రతినిధులు హాజరై తమ అనుభవాలను కలబోసుకున్నారు. ‘ వర్తమాన కార్మికవర్గం మరియు దాని మైత్రి(సమాశ్రయం). దోపిడీ మరియు సామ్రాజ్యవాదుల యుద్ధాల వ్యతిరేక పోరాటం, శాంతి, సోషలిజం కోసం, కార్మికులు మరియు పౌరుల హక్కుల పరిరక్షణ వుద్యమాల్లో ముందుండే కమ్యూనిస్టు మరియు కార్మిక పార్టీల రాజకీయ లక్ష్యాలు.’ అనే ఇతి వృత్తంతో జరిగిన ఈ సమావేశంలో పాల్గన్న ప్రతి పార్టీ అంతర్జాతీయ, ప్రాంతీయ, దేశీయ పరిస్ధితులపై తన అనుభవాలు, పాఠాలను సోదర పార్టీలతో పంచుకుంది. మన దేశం నుంచి సిపిఐ(ఎం), సిపిఐ పార్టీల ప్రతినిధి వర్గాలు పాల్గన్నాయి.

పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి లేదా సంక్షోభంలో బహుముఖాలుగా పెట్టుబడిదారీ దేశాలు వాటి కూటముల మధ్య పోటీ మరియు వైరుధ్యాలు తీవ్రమౌతున్నాయని, ఆ క్రమంలో బలాబలాల పునరేకీకరణ అంతర్జాతీయంగా ముందుకు వస్తున్నదని సమావేశం గుర్తించింది. సామ్రాజ్యవాదుల జోక్యం, దిగ్బంధాలు మరియు మధ్యవర్తిత్వాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ సిరియా, ఎమెన్‌, లిబియా అదే విధంగా అజర్‌బైజాన్‌లో యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రజావ్యతిరేక కీవ్‌ పాలకుల కారణంగా వుక్రెయిన్‌లో భాతృహత్యా సంబంధమైన యుద్ధం జరుగుతోంది. మిలిటరీ ఆయుధీకరణ మరియు యుద్ధ సన్నాహాలు పెరుగుతున్నాయి. అమెరికా, నాటో, ఐరోపా యూనియన్‌ మరియు వాటి మిత్ర సామ్రాజ్యవాదుల పధకాలు మరియు రాజకీయ వైఖరులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల నుంచి అనేక అనుభవాలు లభించాయి.

వైరుధ్యాలు తీవ్రతరం కావటంతో సంపదను వుత్పత్తి చేసే వనరులపై అదుపు, మార్కెట్లు, చమురుపైప్‌లైన్లపై ఆధిపత్యం కోసం సామ్రాజ్యవాదుల నూతన యుద్ధాల ముప్పు ఇమిడి వుంది. శాంతి, నిరాయుధీకరణ కోసం ఇది విశాలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని పటిష్టపరిచేందుకు వుపేక్షించరాని లక్ష్యాలను కమ్యూనిస్టులు మరియు శ్రామికోద్యమాల ముందుంచింది. బడా పెట్టుబడిదారుల లాభదాయకత కోసం పని చేసే బూర్జువా ప్రభుత్వాల వైఖరి మరియు సామాజ్రవాదుల దురాక్రమణ,యుద్ధాలకు వ్యతిరేకంగా పోరాటాలను వుధృతం చేయాల్సి వుంది.

అక్టోబరు విప్లవ వందసంవత్సరాల వార్షికోత్సవం, కారల్‌మార్క్స్‌ 200వ జన్మదినోత్సవాల సందర్భంగా 2017,18 సంవత్సరాలలో తీసుకున్న చొరవను సమావేశం సానుకూలంగా విశ్లేషించింది. సిరియా, పాలస్తీనా, సైప్రస్‌, లెబనాన్‌, సూడాన్‌, క్యూబా, వెనెజులా, బ్రెజిల్‌, ఇరాన్‌ ఎదుర్కొంటున్న సామ్రాజ్యవాదుల దాడులు, బెదిరింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నవారికి అంతర్జాతీయ సౌహార్ద్రతను పునురుద్ఘాటించింది. పోలాండ్‌, వుక్రెయిన్‌, సూడాన్‌, కజకస్తాన్‌, పాకిస్ధాన్లలో కమ్యూనిస్టు వ్యతిరేక మరియు ప్రజాస్వామిక హక్కులపై జరుగుతున్న దాడులను, రష్యా తదితర చోట్ల కమ్యూనిస్టులు ఎదుర్కొంటున్న చట్టపరమైన, రాజకీయ ఆటంకాలను సమావేశం ఖండించింది.

Image result for 20th IMCWP

2019లో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ స్ధాపనవందేండ్ల వుత్సవం, చైనా విప్లవ 70, క్యూబా విప్లవ 60వ వార్షికోత్సవాల వంటి ముఖ్యమైన స్మారకోత్సవాలు వున్నాయి. ప్రజా విజయాలకు కమ్యూనిస్టు వుద్యమం ఇచ్చిన తోడ్పాటు, అంతర్జాతీయ కార్మికోద్యమాన్ని పటిష్టపరచాల్సిన అవసరం, చారిత్రక వాస్తవాలను వక్రీకరించి ఫాసిస్టుల అత్యాచారాలతో సమంగా కమ్యూనిజాన్ని చూపే యత్నాలు, తప్పుడు ప్రచారాలను ఎండగట్టటం, కార్మికుల, ఇతర తరగతుల సామాజిక విజయం కోసం జరిపే పోరాటాల పురోగతికి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సమావేశం పిలుపునిచ్చింది.

నాటో 70వ వార్షికోత్సవం సందర్భంగా దానికి వ్యతిరేకంగా అనేక రూపాలలో మరింత మిలిటరీ కేంద్రీకరణ జరుపుతున్న ఐరోపాయూనియన్‌ చర్యలకు వ్యతిరేకంగా 2019 ఏప్రిల్‌ నాలుగవ తేదీన, అణ్వాయుధాలు, విదేశీ సైనిక స్ధావరాలకు, హిరోషిమా-నాగసాకీ అణుమారణకాండకు వ్యతిరేకంగా ఆగస్టు ఆరు మరియు తొమ్మిదిన, రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమై 80సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా సెప్టెంబరు ఒకటిన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం కోరింది. కమ్యూనిస్టు వుద్యమ చరిత్రను, అంతర్జాతీయ కార్మిక సౌహార్ద్రత విలువలను పరిరక్షిస్తూ, కమ్యూనిస్టు వ్యతిరేకత, కమ్యూనిస్టు, కార్మికోద్యమాల అణచివేతకు వ్యతిరేకంగా మార్చినెల రెండవ తేదీన వందేండ్ల కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ వుత్సవం సందర్భంగా, అక్టోబరు విప్లవ 102వ వార్షికోత్సవం సందర్భంగా సోషలిజం సాధించిన విజయాల గురించి ప్రచారం, పెట్టుబడిదారీ విధానం, దోపిడీ, అణచివేత వంటి అమానుష ధోరణులకు వ్యతిరేకంగా లోతైన సైద్ధాంతిక చర్చ, ఆచరణాత్మక కార్యక్రమాల గురించి బహుముఖ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.

సోషలిస్టు క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా అమలు జరుపుతున్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, వెనెజులా బలివేరియన్‌ విప్లవాన్ని వమ్ము చేసేందుకు చేస్తున్న బెదిరింపులు, జోక్యాలకు వ్యతిరేకంగా పాలస్తీనా పౌరుల పోరాటం, కొరియాల ఐక్యతకు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరింది. మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సం, మే డే, ఫాసిజం, నాజీజాల మీద ప్రజా విజయం రోజున తిరిగి తలెత్తుతున్న ఆ శక్తులకు వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణకు పలు కార్యక్రమాలు చేపట్టాలని ఏథెన్స్‌ సమావేశం పిలుపునిచ్చింది.

Related image

వంద సంవత్సరాల గ్రీసు కమ్యూనిస్టు పార్టీ 1918 నవంబరు 17న గ్రీసు సోషలిస్టు లేబర్‌ పార్టీగా ఏర్పడింది.పైరాస్‌ పట్టణంలో తొలి మహాసభ జరిగింది. 1924లో గ్రీసు కమ్యూనిస్టు పార్టీగా మారింది. నాజీల దురాక్రమణకు ప్రతిఘటన వుద్యమంలో గణనీయమైన పాత్ర పోషించింది.1967 ఏప్రిల్‌ 21న గ్రీసుకు కమ్యూనిస్టు ముప్పు తలెత్తిందనే పేరుతో మిలిటరీ తిరుగుబాటు చేసి అన్ని రాజకీయ పార్టీలను నిషేధించింది. మరుసటి ఏడాది గ్రీసు కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చి ఒక వర్గం యూరోకమ్యూనిజం పేరుతో మితవాదబాట పట్టింది. మరొక వర్గం మిలిటరీ పాలకులపై సాయుధపోరుకు దిగింది.1974లో మిలిటరీ పాలన అంతమైన తరువాత తిరిగి కమ్యూనిస్టు పార్టీ బహిరంగ కార్యకార్యకలాపాల్లోకి వచ్చింది. వందవ వార్షికోత్సవ సభ మొదటి మహాసభ జరిగిన పైరాస్‌ పట్టణంలోనే శాంతి, స్నేహ స్టేడియంలో పెద్ద ఎత్తున రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలతో జరిగింది.తొంభై కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధుల సమక్షంలో వేలాది మంది గ్రీసు పార్టీకార్యకర్తలు, పౌరులు పాల్గన్నారు. గతంలో మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టిన యోధులు, ఎర్రజెండాను సమున్నతంగా నిలబెడుతున్న యువ కమ్యూనిస్టులు వేలాది మందిని ఈ సందర్భంగా గ్రీసు పార్టీ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్‌ కౌటుసోంబస్‌ సన్మానించారు.

Image result for KKE, Dimitris Koutsoumbas

ఈ సందర్భంగా దిమిత్రిస్‌ మాట్లాడుతూ ‘మేం ఏటికి ఎదురీదాం, బిగ్గరగా చేసిన విమర్శలను తట్టుకోలేక చెవులు మూసుకున్నాం, మృదువుగా మృదువుగా వుందాం అని చెప్పిన కొందరు స్నేహితులు, కామ్రేడ్లను మేము కలవర పెట్టాము. వారు మమ్మల్ని రాజీపడమని కోరారు. మేమా పని చేయకపోవటమే సరైందని రుజువైంది. అలా చేసి వుంటే చివరకు రాజీ మాత్రమే మిగిలి వుండేది. మేమా పని చేయలేదు. ఎందుకంటే వంద సంవత్సరాల పార్టీ అనుభవం మమ్మల్ని తప్పులు చేయనివ్వలేదు. ఏటికి ఎదురీదిన కారణంగానే మేము ముందుకు పోవటానికి, ప్రతిదాడి చేసేందుకు, నూతన మిలిటెంట్ల సచేతనత్వం పొందటానికి తోడ్పడింది. యజమాని లేకుండా నడపవచ్చుగానీ కార్యకర్తలనే గొలుసు లేకుండా బండిని నడపలేము.’ అంటూ కార్యకర్తలను వుత్సాహపరిచారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రామాలయం – రావణ కాష్టం !

26 Monday Nov 2018

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

Ram Statue, Ravana kashtam, Siva Sena, VHP

Image result for ram statue in ayodhya

ఎం కోటేశ్వరరావు

రావణుడి భార్య మండోదరి శాపానికి భయపడిన దేవతలు ఆమె నిత్య సుమంగళిగా వుండేందుకు గాను రావణుడి చితిని శాశ్వతంగా మండుతూనే వుండేట్లు ఏర్పాటు చేశారట. ఒక సమస్య ఎడతెగకుండా సాగుతూ వుంటే దాన్ని రావణకాష్టంతో మన పెద్దలు పోల్చారు. రావణుడిని తప్పుడు పద్దతుల్లో హతమార్చిన రాముడికి ఆలయాన్ని కడతా మంటున్న సంఘపరివార్‌, దానితో పోటీబడుతున్న ఇతర మతోన్మాద శక్తులు ఇప్పుడు రామాలయాన్ని కూడా అలాగే మార్చినట్లు ఈ పాటికే చాలా మందికి అర్ధం అయింది. ఆదివారం నాడు అయోధ్యలో రామాలయాగ్నికి విశ్వహిందూపరిషత్‌, శివసేన, ఇతరులు రానున్న రోజుల్లో మరింత ఆజ్యాన్ని పోస్తామని ప్రకటించారు.బాబరీ మసీదు స్ధల వివాదంపై సత్వరమే కోర్టు తీర్పు రాకుండా న్యాయమూర్తులను కాంగ్రెస్‌ బెదిరించిందంటూ ప్రధాని నరేంద్రమోడీ ఇదే సమయంలో ఎన్నికల సభల్లో ఆరోపించారు. వారికి అంత సీను వుంటే మూడు ముక్కలు చేసి ఒక ముక్కను ముస్లింలకు రెండు ముక్కలను హిందువులకు ఇవ్వాలని 2010లో తీర్పు చెప్పిన అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తులనే ప్రభావితం చేసి వుండేవారు ఏదీ దొరక్క ఆధారం లేని ఈ సాకును ప్రధాని ఎంచుకున్నారన్నది స్పష్టం. మరో విధంగా చెప్పాలంటే హిందూత్వశక్తులు ప్రకటించిన ఆందోళనకు మద్దతు తెలపటమే.

హిందూత్వ సంస్ధలు ప్రకటించినట్లుగా మరోసారి రామాలయ నిర్మాణాన్ని వుత్తరాదిన ముందుకు తెస్తున్నారు. దక్షిణాదిన శబరిమల అయ్యప్ప పేరుతో ఒక ఒక అరాచకాన్ని కొనసాగిస్తున్నారు. బిజెపి మతోన్మాదంతో కాంగ్రెస్‌ కూడా పోటీపడుతూ ఓట్ల కోసం రెండు సమస్యల్లోను మతాన్ని ముందుకు తెస్తోంది. మతోన్మాద బిజెపిని ఎదిరించాలంటే కాంగ్రెస్‌ను కలుపుకోవాలని సలహాలు ఇస్తున్న వారు ఒకసారి అవలోకనం చేసుకోవటం మంచిది. అయోధ్య, అయ్యప్ప రెండు ఆందోళనల నిర్వాహకులూ ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా సంఘపరివార్‌ శక్తులే. గతంలోనూ తాజాగా శివసేన కూడా వారితో పోటీ పడుతోంది.ఆదివారం నాడు అయోధ్యలో నిర్వహించిన ధర్మ సభ సందర్భంగా రాష్ట్ర బిజెపి సర్కార్‌ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఆంక్షలను అమలు చేసింది. శివసేననేత వుద్దావ్‌ థాకరే నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదని వార్తలు వచ్చాయి.

దేశంలో మత లేదా మతోన్మాద శక్తులు అనుకున్నదొకటి, అవుతున్నదొకటి. వారు కోరుకున్నది ఒకటి వస్తున్న ఫలితం మరొకటి. శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలందరికీ ప్రవేశం కల్పించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఒక వైపు వ్యతిరేకిస్తూ ఆలయ సంప్రదాయాల పరిరక్షణ ముసుగులో కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారు. తమ ఆందోళన అసలు లక్ష్యం సిపిఎం నాయకత్వంలోని ప్రభుత్వాన్ని వ్యతిరేకించటమే అని బిజెపి నేత బాహాటంగా చెప్పాడు. అయోధ్య, శబరిమల రెండు చోట్లా జరుగుతున్న ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారి గురించి జనం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం వుంది.

శబరిమల వుదంతంలో కోర్టు తీర్పు వచ్చేంతవరకు వేచి చూసి తాము అనుకున్నదానికి వ్యతిరేకంగా వచ్చే సరికి అయ్యప్పను వీధుల్లోకి లాగుతున్నారు. వయస్సులో వున్న ఆడవారు తనను చూడకూడదని అయ్యప్ప చెప్పటాన్ని తాము స్వయంగా విన్నామన్నట్లుగా మాట్లాడుతున్న వారు మరోవైపు అదే వయస్సులో వున్న మహిళలను ముందుకు తెచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు. బాబరీమసీదు వివాదంలో సుప్రీం కోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండానే తాము కోరుకున్న విధంగా కేంద్రం ఒక చట్టాన్ని చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని రామమందిరం నిర్మించాలంటున్నారు. తాము కోరుకున్నది తప్ప కోర్టులు ఇచ్చిన తీర్పులను, ఇవ్వబోయే తీర్పులను కూడా తాము అంగీకరించేది లేదని రాజ్యాంగమూ, కోర్టులు, చట్టాలను తాము పట్టించుకొనేది లేదని ప్రకటించే వుగ్రవాద సంస్ధలకూ వీటికి తేడా ఏమిటో జనం ఆలోచించాలి.

పరిష్కారమైన శబరిమల కేసును తిరిగి వివాదంగా మార్చ చూస్తున్నది మతశక్తులు. తీర్పు రాక ముందే బాబరీ మసీదు స్ధల తీర్పు ఎలా వుండాలో నిర్దేశిస్తున్నారు. బాబరీమసీదు వివాదంలో సదరు స్ధలం ముస్లింలదే అని తీర్పు వచ్చే అవకాశం వుందని ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్ధలు భావిస్తున్నాయా? అందుకే ప్రత్యేక చట్టం చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాయా? కేంద్రంలో పూర్తి మెజారిటీ వున్న బిజెపి ప్రభుత్వం వుండగా నాలుగున్నర సంవత్సరాల పాటు వేచి వుండి ఆ డిమాండ్‌ను ఇప్పుడెందుకు ముందుకు తెచ్చినట్లు ? బాబరీ మసీదు స్థల వివాద కేసు తమకు అనుకూలంగా వస్తుందని భావించారా? స్ధల వివాద కేసులో వున్న అప్పీళ్లు జనవరిలో విచారణకు వస్తాయని, ఆ లోగా విచారించి తేల్చాల్సిన అత్యవసరమేమీ లేదని, వుత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం, అఖిల భారత హిందూమహాసభ తదితరులు చేసిన వినతిని నవంబరు రెండవ వారంలో సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల లోపు ఆ కేసు తేలదని స్పష్టమై పోయింది. అసలింతకీ ఆ కేసు ఏమిటి? దాని మీద వచ్చే తీర్పు పర్యవసానాలేమిటి? అసలు విచారణ ఇంకా ప్రారంభం కాలేదు, ఆ స్ధలం పూర్తిగా తమదే అని త్వరలో రామాలయ నిర్మాణ తేదీని ప్రకటిస్తామని విశ్వహిందూ పరిషత్‌ నేతలు ప్రకటించారు. అంటే కరసేవ ముసుగులో బాబరీ మసీదును కూల్చివేసినట్లుగా యోగి సర్కార్‌ మద్దతుతో వివాదాస్పద స్ధలంలో రామాలయ నిర్మాణం చేపడతారా ?

సుప్రీం కోర్టులో నడుస్తున్న వివాదం ఆస్ధి పరమైనది. అయోధ్యలో వివాదాస్పద బాబరీ మసీదు స్దలాన్ని సేకరించేందుకు కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేసిన కేసులో ఇస్లాం మతావలంబనలో మసీదులు తప్పనిసరేమీ కాదని సుప్రీం కోర్టు 1994లో చెప్పింది.ఈ తీర్పును కూగా గమనంలోకి తీసుకొని 2010లో అలహాబాద్‌ హైకోర్టు 2.77 ఎకరాల బాబరీ మసీదు స్ధలాన్ని మూడు భాగాలుగా చేసి ఒక ముక్కను ముస్లింలకు, ఒక ముక్కను నిర్మోహీ అఖారాకు, మూడో ముక్కను రామాలయానికి ఇవ్వాలని చెప్పింది. ఆ తీర్పును ముస్లిం సంస్ధలు సవాలు చేశాయి. 1994 సుప్రీం కోర్టు తీర్పును పున:పరిశీలించాలన్న వినతిని ఇటీవల సుప్రీం కోర్టు 2-1 మెజారిటీతో తిరస్కరించింది. తీర్పు రాసిన ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తి అశోక్‌ భూషణ్‌ ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ ఆ తీర్పును పున:పరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొనగా మరో న్యాయమూర్తి అబ్దుల్‌ నజీర్‌ విబేధించి పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. 1994నాటి తీర్పు మతానికి సంబంధించింది కాదని భూసేకరణ సంబంధమైనదని ఇద్దరు న్యాయమూర్తులు చెప్పగా సమగ్ర పరిశీలన లేకుండానే నాటి తీర్పు ఇచ్చారని అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. ఆ కేసులో చేసిన వ్యాఖ్యలు అలహాబాద్‌ హైకోర్టును ప్రభావితం చేశాయని అన్నారు. అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన 14 అప్పీళ్లను సుప్రీం కోర్టు విచారిస్తున్నది. సుప్రీం కోర్టు తీర్పును పున:పరిశీలించకుండా న్యాయమైన నిర్ణయానికి రాలేరని ముస్లిం సంస్ధల ప్రతినిధులు వాదిస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఈ ఏడాది సెప్టెంబరు 27న 1994నాటి తీర్పును పునర్విచారణకు తిరస్కరించిన సుప్రీం కోర్టు తమ విచారణ వాస్తవాలపైనే ఆధారపడి వుంటుందని, గత తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ విచారణను వేగంగా నిర్వహించాలని హిందూ సంస్ధలు చేసిన వినతిని నవంబరు 12న సుప్రీం కోర్టు తిరస్కరించింది. జనవరిలో చేపడతామని పేర్కొన్నది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందే సుప్రీం కోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తుందని అనేక మంది ముఖ్యంగా హిందూ సంస్ధలు భావించాయి. ఈ కేసు విచారణ వచ్చే ఏడాది ఎన్నికల తరువాత జరపాలని గతేడాది డిసెంబరులో న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టును కోరారు.

ఈ పూర్వరంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ తదితర సంఘపరివార్‌ సంస్ధలు, శివసేన రంగంలోకి దిగాయి. ఆదివారం నాటి ధర్మ సభ ఆఖరిదని తరువాత ఇంకెలాంటి సభలు వుండవని తదుపరి కార్యాచరణ రామాలయ నిర్మాణమే అని విశ్వహిందూపరిషత్‌ ప్రకటించింది. ప్రతి సారీ ఎన్నికల ముందు రామాలయ నిర్మా ణాన్ని లేవనెత్తి అక్కడే నిర్మిస్తామని చెబుతున్నారని ఎంతకాలమిలా జనాన్ని వెర్రి వెంగళప్పలను చేస్తారని శివసేన నేత వుద్దావ్‌ రెచ్చగొడుతున్నారు. ఇదంతా రానున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకొని చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందువలన ధర్మ సభ తరువాత ఈ శక్తులు ఎన్ని అధర్మాలకు, అరాచకాలకు పాల్పడతాయో చెప్పలేము. 1992 డిసెంబరు ఆరు నాటి బాబరీ మసీదు విధ్వంసం కేసులో అద్వానీ, మురళీమనోహర జోషి వంటి బిజెపి సీనియర్‌ నేతలు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు.

ఓట్ల రాజకీయం గాకపోతే ఇంతకూ విశ్వహిందూపరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ తదితర సంస్ధలు ఎవరికి వ్యతిరేకంగా ఎవరి మీద ఆందోళనలకు దిగుతున్నట్లు? అటు కేంద్రంలోనూ ఇటు అత్యధిక రాష్ట్రాలలోనూ బిజెపి అధికారంలో వుంది. రామ మందిర నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుతోంది. ఎవరు అడ్డుకున్నారు ?నెపాన్ని కోర్టులు, న్యాయమూర్తుల మీద, కాంగ్రెస్‌ మీద మోపే యత్నం తప్ప బాబరీ మసీదు వివాదంలో కోర్టు తీర్పులు చెల్లవు, ప్రభుత్వం చేసేదే అంతిమ నిర్ణయం అని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసినా అడ్డుకొనే శక్తి ప్రతిపక్ష పార్టీలకు లేదు. హిందూత్వ సంస్ధలు చేసే ఆందోళన దేశమంతటినీ మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ స్పందించకపోవటంలో ఆశ్చర్యం లేదు. నిద్రపోయే వారిని లేపగలం తప్ప నటించే వారిని లేపలేము. తన ప్రభుత్వ అన్ని రకాల వైఫల్యాల నుంచి జనం దృష్టిని మరల్చాలంటే ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చని అనేక మంది పరిశీలకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు.నేతల మాటల తూటాలను చూస్తే అవి ఎన్నికల్లో ఓట్లగాలం అన్నది స్పష్టం.

మతోన్మాద రాజకీయాల్లో బిజెపితో పోటీ పడుతున్న శివసేన నేత వుద్దావ్‌ ధాక్రే భార్య, కుమారుడితో సహా వచ్చి అయోధ్యలోని బాబరీమసీదు స్ధలంలోని వివాదాస్పద రాముడి విగ్రహాన్ని సందర్శించారు. మసీదు స్ధలంలో రామాలయ నిర్మాణానికి ఆర్డినెన్స్‌ తేవాలని కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రామాలయ నిర్మాణ అవకాశాలను చూస్తామంటున్నారు మీరు, గత నాలుగు సంవత్సరాలలో ఎన్నింటిని చూశారు, ఈ ప్రభుత్వం నిర్మాణం చేయకపోతే తరువాత ఎవరు చేస్తారు, ప్రభుత్వ ఏర్పాటు కాదు మందిరాన్ని త్వరగా నిర్మించాలి అని వుద్ధావ్‌ థాక్రే వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ఆఖరి పార్లమెంటు సమావేశాలివే, అందువలన ఆర్డినెన్స్‌ తీసుకురండి, ఏమైనా చేయండి సాధ్యమైనంత త్వరలో ఆలయ నిర్మాణం చేయండి. నేను రామ్‌లాలా విగ్రహదర్శనానికి వెళితే ఒక జైల్లో ప్రార్ధనలకు వెళ్లినట్లుగా వుంది తప్ప మరొక విధంగా నాకు అనిపించలేదు. నాకు ఎలాంటి చాటు మాటు అజెండా లేదు, రామాలయాన్ని ఎపుడు కడతారని ఈదేశ హిందువులు అడుగుతున్నారు, ఎంతకాలం వేచి వుండాలి, కనుచూపు మేరలో మందిరం కనిపించటం లేదు,ఎప్పుడు దాన్ని చూస్తాము అని ధాకరే ప్రశ్నించారు. హిందువులింకేమాత్రం మౌనంగా వుండరు, కచ్చితంగా ఏ తేదీన నిర్మాణాన్ని ప్రారంభిస్తారో చెప్పండి, దాన్ని మీ నుంచి తెలుసుకొనేందుకే నేను ఇక్కడకు వచ్చాను అన్నారు. శివసేన అటు కేంద్రంలోనూ ఇటు మహారాష్ట్రలోనూ బిజెపితో కలసి అధికారాన్ని పంచుకుంటోన్న విషయం తెలిసిందే.

రామాలయ ఆందోళనలో శివసేన పాత్ర లేదు, రామలాల విగ్రహాలను క్షణకాల సందర్శనకు వుద్ధావ్‌ ధాక్రేకు ఎలాంటి సమస్య లేదు, కానీ బాలాసాహెబ్‌ థాక్రే బతికి వుంటే వుద్ధావ్‌ చేస్తున్న వాటిని నిరోధించి వుండేవాడు, ధర్మసభ ఏర్పాటులోనూ శివసేనకు ఎలాంటి పాత్ర లేదు బాలాసాహెబ్‌ బతికి వుంటే విశ్వహిందూపరిషత్‌కే మద్దతు ఇచ్చి వుండేవాడు అని యుపి వుపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్య వ్యాఖ్యానించారు. రామాలయ సమస్యను శివసేన ఎలా హైజాక్‌ చేస్తుంది, వుత్తరాది వారి మీద దాడి చేసి వారిని వెళ్లగొట్టిన జనాలు వారు, మానవాళికి సేవచేయాలనే మానసిక స్ధితి కూడా లేని వారు రాముడిని ఎలా సేవించగలరు అని బిజెపి ఎంఎల్‌ఏ సురేంద్ర సింగ్‌ శివసేన నేత మీద విరుచుకుపడ్డారు. ఎన్నికలున్నందున ప్రతివారూ అయోధ్య వెళుతున్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా వుద్దావ్‌ థాక్రేను వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారు. ఒక వైపు వారు బిజెపి స్నేహితులు మరొకవైపు తాము రామాలయ నిర్మాణం పట్ల ఆసక్తితో వున్నామని, ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తున్నట్లు చెబుతూ జనాన్ని వెర్రి వెంగళప్పలను చేయలేరు అని కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.

కేసు సుప్రీం కోర్టులో వుంది. దాని తీర్పు కోసం వేచి చూడాలి లేదా ఏకాభిప్రాయాన్ని సాధించాలి, ప్రభుత్వానికి చాలా స్ధలం వుంది. సరయూ నదీ తీరంలో రామాలయాన్ని నిర్మించవచ్చు. వివాదాస్పద స్ధలం గురించి ఎలాంటి చర్చలు వద్దు అని ప్రగతిశీల సమాజవాది పార్టీ (లోహియా) నేత శివపాల్‌ యాదవ్‌ అన్నారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎవరిదంటే నరేంద్రమోడీది అని చెబుతారు.182 మీటర్ల వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ రాజకీయాల్లో మోడీతో పోటీ పడుతున్న యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ అంతకంటే పెద్దదైన 221 మీటర్ల రాముడి విగ్రహాన్ని నెలకొల్పి రికార్డును తన పేరుతో నెలకొల్పాలని చూస్తున్నారు. ఆదివారం ధర్మ సభకంటే ముందు ఒక రోజు హడావుడిగా విగ్రహ ప్రకటన చేయటం గమనించాల్సిన అంశం. విగ్రహాన్ని 50 మీటర్ల ఎత్తు దిమ్మె మీద ఏర్పాటు చేస్తారు. విగ్రహం 151 మీటర్లు కాగా మరో 20 మీటర్ల గొడుగు దాని మీద ఏర్పాటు చేస్తారు. దీన్ని ఎక్కడ, ఎంత ఖర్చుతో ఏర్పాటు చేస్తారో వివరాలు వెల్లడించలేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఓట్లకోసమే అయోధ్య, అయ్యప్ప ఆందోళనల్లో సంఘపరివార్‌ !

24 Saturday Nov 2018

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence

≈ Leave a comment

Tags

AYODHYA, ayyappa stirs, Babri Masjid case, sabarimala, Sabarimala Ban On Women

Image result for vote politics behind ayodhya,ayyappa stirs

ఎం కోటేశ్వరరావు

దేశంలో వుత్తరాదిన ప్రారంభం కానున్న ఒక ఆందోళన. దక్షిణాదిన జరుగుతున్న ఒక అరాచకం. రెండింటి నిర్వాహకులూ ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా సంఘపరివార్‌ శక్తులే. నవంబరు 25న ధర్మ సభ పేరుతో ఆయోధ్యలో నిర్వహించే కార్యక్రమానికి విశ్వహిందూపరిషత్‌ ఒక లక్ష మందిని, ఆర్‌ఎస్‌ఎస్‌ మరో లక్షమందిని సమీకరించనున్నట్లు ప్రకటించాయి. వారి నుంచి అయోధ్య-ఫైజాబాద్‌ జంటనగరాలలోని మైనారిటీలపై దాడులు జరిగే అవకాశం వుందనే సమాచారంతో రాష్ట్ర బిజెపి సర్కార్‌ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఆంక్షలను అమలు చేస్తోంది. శివసేననేత వుద్దావ్‌ థాకరే నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదని వార్తలు వచ్చాయి. తాను రామభక్తుడిగా ఆ రోజు అయోధ్యకు వస్తానని తనను ఎవరు ఆపుతారో చూస్తానన్నట్లుగా థాకరే ప్రకటించాడు. డిసెంబరు తొమ్మిదిన ఢిల్లీలో సభ తరువాత దేశ వ్యాపితంగా ఆందోళన చేయనున్నట్లు ప్రకటించారు.

మరొకటి శబరిమల. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఆలయ సందర్శనకు వస్తున్న హిందూ మతానికి చెందిన మహిళలను కూడా తాము రానిచ్చేది లేదంటూ ఆ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకుంటున్న సంస్ధల నుంచి తలెత్తిన ముప్పును నివారించేందుకు, భక్తుల ముసుగులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని అడ్డుకొనేందుకు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం 144వ సెక్షన్‌ ప్రకటించింది. అయోధ్యలో ఆంక్షల గురించి పల్లెత్తు మాట్లాడని వారు శబరిమల విషయంలో ప్రభుత్వం భక్తులను అడ్డుకుంటున్నట్లు నానా యాగీ చేస్తున్నారు.దొంగే దొంగని అరవటం అంటే ఇదేనేమో !

దేశంలో మత లేదా మతోన్మాద శక్తులు అనుకున్నదొకటి, అవుతున్నదొకటి. వారు కోరుకున్నది ఒకటి వస్తున్న ఫలితం మరొకటి. శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలందరికీ ప్రవేశం కల్పించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఒక వైపు వ్యతిరేకిస్తూ ఆలయ సంప్రదాయాల పరిరక్షణ ముసుగులో కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారు. తమ ఆందోళన అసలు లక్ష్యం సిపిఎం నాయకత్వంలోని ప్రభుత్వాన్ని వ్యతిరేకించటమే అని బిజెపి నేత బాహాటంగా చెప్పాడు. అయోధ్య, శబరిమల రెండు చోట్లా జరుగుతున్న ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారి గురించి జనం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం వుంది.

శబరిమల వుదంతంలో కోర్టు తీర్పు వచ్చేంతవరకు వేచి చూసి తాము అనుకున్నదానికి వ్యతిరేకంగా వచ్చే సరికి అయ్యప్పను వీధుల్లోకి లాగుతున్నారు. వయస్సులో వున్న ఆడవారు తనను చూడకూడదని అయ్యప్ప చెప్పటాన్ని తాము స్వయంగా విన్నామన్నట్లుగా మాట్లాడుతున్న వారు మరోవైపు అదే వయస్సులో వున్న మహిళలను ముందుకు తెచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు. బాబరీమసీదు వివాదంలో సుప్రీం కోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండానే తాము కోరుకున్న విధంగా కేంద్రం ఒక చట్టాన్ని చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని రామమందిరం నిర్మించాలంటున్నారు. తాము కోరుకున్నది తప్ప కోర్టులు ఇచ్చిన తీర్పులను, ఇవ్వబోయే తీర్పులను కూడా తాము అంగీకరించేది లేదని రాజ్యాంగమూ, కోర్టులు, చట్టాలను తాము పట్టించుకొనేది లేదని ప్రకటించే వుగ్రవాద సంస్ధలకూ వీటికి తేడా ఏమిటో జనం ఆలోచించాలి.

పరిష్కారమైన శబరిమల కేసును తిరిగి వివాదంగా మార్చ చూస్తున్నది మతశక్తులు. దశాబ్దకాలం పాటు సాగిన కోర్టు విచారణలో తమ వాదనలకు అనుకూలంగా వున్న నిషేధ ఆధారాలను సమర్పించటంలో విఫలమయ్యారు. రెండు వందల సంవత్సరాల నాడే బ్రిటీష్‌ పాలకుల హయాంలో పిల్లలను కనే వయసులో వున్న మహిళలకు ఆలయ ప్రవేశ నిషేధం వున్నట్లు ఆధారాలు దొరికాయని ఇటీవల ఒక పెద్దమనిషి ప్రకటించాడు. నిజానికి అదేమీ కొత్త అంశం కాదు. అన్ని వయసుల వారినీ ఆలయ ప్రవేశానికి అనుమతించాలన్న మెజారిటీ తీర్పును వ్యతిరేకించిన ఐదవ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా ఆ అంశాన్ని తన వ్యతిరేక నోట్‌లో పేర్కొన్నారు. వాటన్నింటినీ పరిశీలించిన తరువాతే ఆ తీర్పు వెలువడింది. అయినా ఇదేదో కొత్తగా కనుగొన్న అంశం మాదిరి మీడియాలో పెద్ద ఎత్తున ఆ వార్తలకు ప్రాచుర్యం కల్పించటం గమనించాల్సిన అంశం. నిజంగా అలాంటి పక్కా ఆధారాలు వున్నపుడు వాటి మీద విశ్వాసం వున్నవారు వెంటనే సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలను విరమించాలి. కోర్టులో అనేక పునర్విచారణ పిటీషన్లు దాఖలయ్యాయి, వాటిని పరిశీలించేందుకు కోర్టు కూడా అంగీకరించినందున ఆ సమయంలో తమకు దొరికిన బలమైన సాక్ష్యాన్ని కోర్టుకు సమర్పించి తీర్పును తిరగరాయమని కోరవచ్చు. కానీ ఆపని చేయటం లేదు, అందుకోసమే ఓట్ల కోసం రాజకీయం చేయాలన్న నిర్ణయం ప్రకారం నడుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Image result for vote politics behind ayyappa stirs

బాబరీమసీదు వివాదంలో సదరు స్ధలం ముస్లింలదే అని తీర్పు వచ్చే అవకాశం వుందని ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్ధలు భావిస్తున్నాయా? అందుకే ప్రత్యేక చట్టం చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాయా? కేంద్రంలో పూర్తి మెజారిటీ వున్న బిజెపి ప్రభుత్వం వుండగా నాలుగున్నర సంవత్సరాల పాటు వేచి వుండి ఆ డిమాండ్‌ను ఇప్పుడెందుకు ముందుకు తెచ్చినట్లు ? ఈనెల 25నుంచి దేశవ్యాపితంగా తలపెట్టినట్లు చెబుతున్న ఆందోళనల అసలు లక్ష్యం ఏమిటి? ఇలా పరిపరి విధాలుగా తలెత్తుతున్న అంశాలను కూడా జనం ఆలోచించాలి. బాబరీ మసీదు స్థల వివాద కేసు తమకు అనుకూలంగా వస్తుందని భావించారా? స్ధల వివాద కేసులో వున్న అప్పీళ్లు జనవరిలో విచారణకు వస్తాయని, ఆ లోగా విచారించి తేల్చాల్సిన అత్యవసరమేమీ లేదని, వుత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం, అఖిల భారత హిందూమహాసభ తదితరులు చేసిన వినతిని నవంబరు రెండవ వారంలో సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల లోపు ఆ కేసు తేలదని స్పష్టమై పోయింది. అసలింతకీ ఆ కేసు ఏమిటి? దాని మీద వచ్చే తీర్పు పర్యవసానాలేమిటి?

సుప్రీం కోర్టులో నడుస్తున్న వివాదం ఆస్ధి పరమైనది. అయోధ్యలో వివాదాస్పద బాబరీ మసీదు స్దలాన్ని సేకరించేందుకు కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేసిన కేసులో ఇస్లాం మతావలంబనలో మసీదులు తప్పనిసరేమీ కాదని సుప్రీం కోర్టు 1994లో చెప్పింది.ఈ తీర్పును ప్రాతిపదికగా చేసుకొని 2010లో అలహాబాద్‌ హైకోర్టు 2.77 ఎకరాల బాబరీ మసీదు స్ధలాన్ని మూడు భాగాలుగా చేసి ఒక ముక్కను ముస్లింలకు, ఒక ముక్కను నిర్మోహీ అఖారాకు, మూడో ముక్కను రామాలయానికి ఇవ్వాలని చెప్పింది. ఆ తీర్పును ముస్లిం సంస్ధలు సవాలు చేశాయి. 1994 సుప్రీం కోర్టు తీర్పును పున:పరిశీలించాలన్న వినతిని ఇటీవల సుప్రీం కోర్టు 2-1 మెజారిటీతో తిరస్కరించింది. తీర్పు రాసిన ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తి అశోక్‌ భూషణ్‌ ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ ఆ తీర్పును పున:పరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొనగా మరో న్యాయమూర్తి అబ్దుల్‌ నజీర్‌ విబేధించి పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. 1994నాటి తీర్పు మతానికి సంబంధించింది కాదని భూసేకరణ సంబంధమైనదని ఇద్దరు న్యాయమూర్తులు చెప్పగా సమగ్ర పరిశీలన లేకుండానే నాటి తీర్పు ఇచ్చారని అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. ఆ కేసులో చేసిన వ్యాఖ్యలు అలహాబాద్‌ హైకోర్టును ప్రభావితం చేశాయని అన్నారు. అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన 14 అప్పీళ్లను సుప్రీం కోర్టు విచారిస్తున్నది. సుప్రీం కోర్టు తీర్పును పున:పరిశీలించకుండా న్యాయమైన నిర్ణయానికి రాలేరని ముస్లిం సంస్ధల ప్రతినిధులు వాదిస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఈ ఏడాది సెప్టెంబరు 27న 1994నాటి తీర్పును పునర్విచారణకు తిరస్కరించిన సుప్రీం కోర్టు తమ విచారణ వాస్తవాలపైనే ఆధారపడి వుంటుందని, గత తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ విచారణను వేగంగా నిర్వహించాలని హిందూ సంస్ధలు చేసిన వినతిని నవంబరు 12న సుప్రీం కోర్టు తిరస్కరించింది. జనవరిలో చేపడతామని పేర్కొన్నది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందే సుప్రీం కోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తుందని అనేక మంది ముఖ్యంగా హిందూ సంస్ధలు భావించాయి. ఈ కేసు విచారణ వచ్చే ఏడాది ఎన్నికల తరువాత జరపాలని గతేడాది డిసెంబరులో న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టును కోరారు.

ఈ పూర్వరంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ తదితర సంఘపరివార్‌ సంస్ధలు, శివసేన రంగంలోకి దిగాయి. ఆదివారం నాడు జరిగే ధర్మ సభ ఆఖరిదని తరువాత ఇంకెలాంటి సభలు వుండవని తదుపరి కార్యాచరణ రామాలయ నిర్మాణమే అని విశ్వహిందూపరిషత్‌ ప్రకటించింది. ప్రతి సారీ ఎన్నికల ముందు రామాలయ నిర్మా ణాన్ని లేవనెత్తి అక్కడే నిర్మిస్తామని చెబుతున్నారని ఎంతకాలమిలా జనాన్ని వెర్రి వెంగళప్పలను చేస్తారని శివసేన నేత వుద్దావ్‌ రెచ్చగొడుతున్నారు. ఇదంతా రానున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకొని చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందువలన ధర్మ సభ తరువాత ఈ శక్తులు ఎన్ని అధర్మాలకు, అరాచకాలకు పాల్పడతాయో చెప్పలేము. 1992 డిసెంబరు ఆరు నాటి బాబరీ మసీదు విధ్వంసం కేసులో అద్వానీ, మురళీమనోహర జోషి వంటి బిజెపి సీనియర్‌ నేతలు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు.

ఓట్ల రాజకీయం గాకపోతే ఇంతకూ విశ్వహిందూపరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ తదితర సంస్ధలు ఎవరికి వ్యతిరేకంగా ఎవరి మీద ఆందోళనలకు దిగుతున్నట్లు? అటు కేంద్రంలోనూ ఇటు అత్యధిక రాష్ట్రాలలోనూ బిజెపి అధికారంలో వుంది. రామ మందిర నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుతోంది. ఎవరు అడ్డుకున్నారు ? లేదా బాబరీ మసీదు వివాదంలో కోర్టు తీర్పులు చెల్లవు, ప్రభుత్వం చేసేదే అంతిమ నిర్ణయం అని ఒక చట్టం చేసినా అడ్డుకొనే శక్తి ప్రతిపక్ష పార్టీలకు లేదు. హిందూత్వ సంస్ధలు చేసే ఆందోళన దేశమంతటినీ మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ స్పందించకపోవటంలో ఆశ్చర్యం లేదు. నిద్రపోయే వారిని లేపగలం తప్ప నటించే వారిని లేపలేము. తన ప్రభుత్వ అన్ని రకాల వైఫల్యాల నుంచి జనం దృష్టిని మరల్చాలంటే ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చని అనేక మంది పరిశీలకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ విడిపోతుందా !

21 Wednesday Nov 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, UK

≈ Leave a comment

Tags

brexit, brexit deal or no deal, European Union, Theresa May

Image result for brexit deal or no deal

ఎం కోటేశ్వరరావు

తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్న లుబ్దావన్ల ప్రకటనతో కన్యాశుల్కం నాటకం ఏ మలుపులు తిరిగిందీ మనకు తెలిసిందే. ఇప్పుడు ఐరోపా యూనియన్‌(ఇయు)నుంచి విడిపోయిన(బ్రెక్సిట్‌) అనంతర సంబంధాల గురించి తాను కుదుర్చుకున్న ముసాయిదా ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం పొందాలని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆమె ప్రత్యర్దులు ఒప్పందాన్ని తిరస్కరించటం ద్వారా ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇయుతో తెగతెంపులు చేసుకోవాలనే కొత్త వాదనను తాజాగా ముందుకు తెస్తున్నారు. దాంతో ఒప్పందం వుంటే ఏమిటి లేకుంటే ఏమి జరుగుతుంది అన్న చర్చ ఇప్పుడు బ్రిటన్‌లో జరుగుతోంది. మరోవైపు బడాకార్పొరేట్‌ లాబీ ఇయు నుంచి బయటకు పోయినా తమ లాభాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొనే విధంగా ప్రయత్నిస్తున్నది. బ్రిటన్‌లోని వివిధ కమ్యూనిస్టు పార్టీలు బ్రెక్సిట్‌కు అనుకూలంగా రెండు సంవత్సరాల క్రితం ఓటు వేశాయి. ప్రధాన టోరీ, లేబర్‌ పార్టీలలో పునరాలోచన తలెత్తినప్పటికీ విడిపోయే విషయంలో కమ్యూనిస్టుపార్టీలు ఎలాంటి పునరాలోచన చేయటం లేదు. అయితే అక్కడి రాజకీయాలలో వీటి పాత్ర పరిమితం అన్న విషయం తెలిసిందే. పార్టీలోని పచ్చి మితవాదులు ప్రధాని థెరెసా మే మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూస్తుండగా మరికొందరు అంతవరకు రాకుండా పార్టీలోనే సభా నాయకురాలిగా విశ్వాసతీర్మానం ఎదుర్కోవాలనే ప్రయత్నాల్లో వున్నారు. మరోవైపు ఒక వేళ ఎలాంటి ఒప్పందం లేకుండా ఇయు నుంచి విడిపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సాంకేతికపరమైన నోటీసుల పేరుతో ప్రభుత్వం అన్ని తరగతులకు సమాచారాన్ని తెలియ చేస్తున్నది. దీంతో ఒప్పందం లేకుండానే బ్రిటన్‌ వేరు పడుతుందా అన్న వూహాగానాలకు తెరలేచింది. ఈ సమస్య చివరకు థెరెసా మే వుద్యోగం వూడగొతుందా? ఆమె ప్రత్యర్ధులు చిత్తవుతారా అనేది వెండితెరపై చూడాల్సిందే. అసలు సమస్య ఏమిటి?

రెండు సంవత్సరాల క్రితం ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలా లేదా అనే అంశంపై ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. దాన్నే క్లుప్తంగా బ్రెక్సిట్‌ అని పిలుస్తున్నారు. వెళ్లిపోవాలనే అభిప్రాయానికి మెజారిటీ ప్రజలు అంగీకరించారు. ఇప్పుడు ఎలా వుపసంహరించుకోవాలనే అంశం మీద కూడా మరో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న ప్రతిపాదనలు కూడా వున్నాయి.ఐరోపా యూనియన్‌లో బ్రిటన్‌ చేరటం నుంచి విడిపోవటం, అంతిమంగా ఎలా విడిపోవాలన్నది కూడా వివాదాస్పదం కావటం అంటే ప్రపంచ పెట్టుబడిదారీ వర్గం ఎదుర్కొంటున్న సంక్షోభ తీవ్రతను వెల్లడించటమే. ఎలా విడిపోవాలి అనే అంశంపై కుదుర్చుకున్న ఒప్పందానికి పార్లమెంట్‌లో మెజారిటీ వుందా లేదా అన్నది కూడా సందేహంగా మారింది.మెరుగైన తన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రధాని ప్రకటించిన 24 గంటలు కూడా గడవ ముందే బ్రెక్సిట్‌ మంత్రి, మరొకరు రాజీనామా ప్రకటించి వత్తిడి పెంచారు. స్వపక్షంతో పాటు ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కూడా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది.

2016 జూన్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 52శాతం మంది ఇయు నుంచి బ్రిటన్‌ బయటకు రావాలని ఓటు వేయగా 48శాతం వుండాలని ఓటు వేశారు. బయటకు వస్తేనే సార్వభౌమత్వాన్ని తిరిగి పొందటం, వలసల విషయంలో భూభాగంపై మరింత అదుపు సాధ్యమని బ్రెక్సిట్‌ మద్దతుదార్లు పేర్కొన్నారు. బయటకు వస్తే ఆరోగ్య పరిరక్షణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు అవకాశం వుంటుందని ఓటర్లను తప్పుదారి పట్టించారు. దశాబ్దాల పాటు యూనియన్‌లో కొనసాగి ఇప్పుడు వుపసంహరించుకుంటే అనూహ్య సమస్యలు తలెత్తుతాయని సమర్ధకులు పేర్కొన్నారు.నిజానికి ఐరోపా యూనియన్‌లో వున్నప్పటికీ బ్రిటన్‌ కోల్పోయిందేమీ లేదు. మిగతా దేశాలన్నీ తమ కరెన్సీలను రద్దు చేసుకొని యూరోకు మారితే బ్రిటన్‌ తన పౌండ్‌ను అలాగే కొనసాగిస్తోంది. తన స్వంత వడ్డీ రేట్లు,ద్రవ్య విధానాలు, సరిహద్దులలో సందర్శకుల తనిఖీ స్వంత నిబంధనలు అమలు జరుపుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ చట్టబద్దమైనది కాదు. పార్లమెంట్‌ అనుమతి లేనిదే వుపసంహరణ ప్రక్రియ ప్రారంభం కారాదని బ్రిటన్‌ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో పార్లమెంట్‌ ఒక చట్టం చేయాల్సి వచ్చింది. ఐరోపా యూనియన్‌ నిబంధన ప్రకారం ఏ సభ్యదేశమైనా బయటకు వెళ్ల దలచుకుంటే ఆర్టికల్‌ 50 అమలు జరపాలని కోరాల్సి వుంది. ఆ మేరకు పరివర్తనా కాల వ్యవధి ముగిసే 2019, మే 29నాటికి ఒప్పందం కుదుర్చుకోవాల్సి వుంది. ఈలోగా గతంలో కుదిరిన ఒప్పందాలు,భవిష్యత్‌ సంబంధాలపై బ్రిటన్‌ -ఇయు మధ్య ఒక ఒప్పందం జరగాల్సి వుంది. ఇప్పుడు ప్రధాని థెరేసా మే దాన్నే ప్రతిపాదించారు.

Image result for brexit deal or no deal cartoons

ఒప్పందానికి కట్టుబడతారో లేదో తేల్చుకోవాల్సింది బ్రిటన్‌ తప్ప బ్రెక్సిట్‌ విషయంలో ఎలాంటి పున:సంప్రదింపులు లేవని ఐరోపాయూనియన్‌ కరాఖండిగా చెప్పింది. పరివర్తన కాల వ్యవధి పొడిగింపు, అస్పష్టంగా వున్న కొన్ని అంశాల గురించి సంప్రదింపులు తప్ప ప్రధాన మార్పులకు అవకాశం లేదని ఐరోపా యూనియన్‌ స్పష్టం చేసింది.యూనియన్‌ చర్చల ప్రధాన ప్రతినిధి మైఖేల్‌ బార్నియర్‌ విలేకర్లతో మాట్లాడుతూ బ్రిటన్‌లో రాజకీయ పరిస్ధితి ఎలా వున్నప్పటికీ ఇయు రాయబారులెవరూ వారితో విడిగా మాట్లాడవద్దని కోరారు. అనేక మంది ఐరోపా నేతలు బ్రిటన్‌ ప్రధాని వైఖరికి మద్దతుగా మాట్లాడటం విశేషం. వారిలో ఆస్ట్రియన్‌ ఛాన్సలర్‌ సెబాస్టియన్‌ కర్జ్‌ ఒకరు. ఒప్పందంలో ఎలాంటి మార్పులు చేయవద్దని డచ్‌ ప్రధాని మార్క్‌ రూటే వ్యాఖ్యానించారు. యూనియన్‌ నుంచి బయటకు వస్తే బ్రిటీష్‌ పౌరులకు బంగారు భవిష్యత్‌ వుంటుందని అక్కడి బాధ్యతారహితమైన అనేక మంది రాజకీయ నాయకులు జనానికి చెప్పారు, నిజం ఏమిటంటే ఆ నిర్ణయం వారికి కాళరాత్రి అవుతుంది అని ఫ్రెంచి మంత్రి వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది మార్చి 29లోగా ఒప్పందం కుదరకపోతే వెంటనే సంబంధాలు రద్దవుతాయి. ఎలాంటి పరివర్తన వ్యవధి వుండదు.

బ్రిటన్‌లో టోరీ లేదా లేబర్‌ పార్టీగానీ రెండూ మౌలికంగా పెట్టుబడిదారీ వర్గప్రతినిధులే.అయినా వాటి మధ్య అధికారం విషయంలో తగాదాలున్నాయి.వివరాలు వెల్లడైన మేరకు ఒక అభిప్రాయం ప్రకారం ఆ ఒప్పంద సారాంశాన్ని చెప్పాలంటే కార్పొరేట్‌, ఇతర ధనికుల ప్రయోజనాలను రక్షించేదిగా, వలస వచ్చే వారి మీద దాడి చేసేదిగా వుంది. గతంలో బ్రిటన్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం వచ్చే ఏడాది మార్చినెలాఖరుకు ఐరోపా యూనియన్‌(ఇయు) నుంచి బయటకు వస్తుంది. ఆ తరువాత 21నెలల పాటు పరివర్తన కాలం వుంటుంది. ఆ సమయంలో అనేక ఐరోపా స్వేచ్చా మార్కెట్‌ నిబంధనలు వర్తించే కస్టమ్స్‌ పన్నుల పరిధిలో బ్రిటన్‌ వుంటుంది. తరువాత ఏమిటన్నది సమస్య. తరువాత కూడా కార్పొరేట్‌, ధనికులకు వుపయోగపడే విధంగా బ్రెక్సిట్‌ ఒప్పంద అంశాలను రూపొందించాలన్న వత్తిడి మేరకు బ్రెక్సిట్‌ ఒప్పంద అంశాలను పొందుపరిచారన్నది ఒక అభిప్రాయం.పరివర్తన వ్యవధిలో బ్రెక్సిట్‌ అనంతర సంబంధాలపై బ్రిటన్‌-ఇయు మధ్య ఒప్పందం కుదరకపోతే పరివర్తన కాలం పొడిగింపు వుంటుంది. అంటే యూనియన్‌ నుంచి బయటకు వెళ్లిన తరువాత కూడా బ్యాంకింగ్‌, రవాణా, పౌరసేవల వంటి అంశాలలో బ్రిటన్‌కు కూడా ఇయు సభ్యదేశాలతో సమాన అవకాశాలు కల్పించాలన్నది బ్రిటన్‌ కార్పొరేట్ల డిమాండ్‌. పరివర్తన కాలం ముగిసిన తరువాత బ్రిటన్‌లో వున్న దాదాపు 30లక్షల మంది ఇయు వలస పౌరులు అక్కడే వుండేందుకు తమకు అవకాశం ఇవ్వాలని బ్రిటన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఐదేండ్లనుంచి వుంటున్నట్లు రుజువు చేసుకున్నవారు అక్కడే స్ధిరపడిన స్ధితిలో కొనసాగవచ్చు. ఇదే నిబంధన ఇయు దేశాలలో వున్న బ్రిటన్‌ వలస పౌరులకు కూడా వర్తిస్తుంది.ఐరోపా యూనియన్‌ విధానాలను బట్టి ఇతర దేశాల వాసులు స్ధిరపడిన స్ధితిని బ్రిటన్‌ సర్కార్‌ రద్దు కూడా చేయవచ్చు. ఆర్ధికంగా సంపాదన లేని వారు తమ కుటుంబసభ్యులకు భారంగా లేమని తమకు తగినన్ని ఆర్ధిక వనరులు, సమగ్ర ఆరోగ్యబీమా వుందని రుజువు చేసుకోవాల్సి వుంది. వలస వచ్చిన వారికి బీమా సౌకర్యాన్ని వర్తింప చేయకూడదనే వత్తిళ్లు ఇప్పటికే వున్నాయి.వివాహ బంధంలో విడిపోయినపుడు భరణం చెల్లించటం గురించి తెలిసిందే.అలాగే విడిపోవాలని బ్రిటనే కోరుకుంది గనుక పరిహారంగా ఇయుకు 50బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి వుంటుంది.

పాలక టోరీ పార్టీలో బ్రెక్సిట్‌ ఒప్పందం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. అది చివరకు ఇద్దరు మంత్రుల రాజీనామా, ప్రధానిపై అవిశ్వాసతీర్మానం పెట్టాలనేంతవరకు దారితీశాయి. ఇయు నుంచి వెళ్లిపోవాలని గట్టిగా పట్టుబడుతున్నవారు పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని, వాణిజ్యం నుంచి వలసలు, వుత్పత్తుల క్రమబద్దీకరణ వరకు అన్నింటికీ బ్రిటీష్‌ చట్టాలు తప్ప ఇయు చట్టాలతో సంబంధం వుండకూడదని చెబుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నవారు బ్రిటన్‌-ఇయు మధ్య కొన్ని సంబంధాలను కానసాగించాలని, పూర్తిగా తెగతెంపులు చేసుకుంటే దేశ ఆర్ధిక వ్యవస్ధకు, రాజకీయ స్ధిరత్వానికి విపత్కరమని వాదిస్తున్నారు. ఇలాంటి అభిప్రాయాలే ప్రతిపక్ష లేబర్‌ పార్టీలోనూ వున్నాయి.బ్రెక్సిట్‌ తరువాత కూడా ఇయు కస్టమ్స్‌ యూనియన్‌లో బ్రిటన్‌ కొనసాగేందుకు వీలైన అంశం థెరేసా మే ఒప్పందంలో వుంది. ఐర్లండ్‌ అంతర్యుద్ధంలో వుత్తర ఐర్లండ్‌ ప్రాంతంలో మెజారిటీగా వున్న ప్రొటెస్టెంట్‌లు తాను బ్రిటన్‌లో భాగంగా వుండాలని కోరుకున్నారు. కాథలిక్కులు మెజారిటీ ఐర్లండ్‌లో వుండిపోయారు. రెండు ప్రాంతాల మధ్య సయోధ్యలో భాగంగా 1999లో కుదిరిన గుడ్‌ ఫ్రైడే ఒప్పందం మేరకు ఐర్లండ్‌ – వుత్తర ఐర్లండ్‌ మధ్య సరిహద్దు నిబంధనలు సులభతరంగా వున్నాయి. ఇప్పుడు బ్రిటన్‌ బయటకు పోయిన తరువాత ఐర్లండ్‌ గనుక ఇయు కఠిన నిబంధనలు అమలు జరిపితే అది 1999 ఒప్పందానికి విరుద్ధం అవుతుంది. అందువలన సరిహద్దు నిబంధనలు సులభతరంగా వుండాలని బ్రిటన్‌ కోరుతోంది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని బ్రిటన్‌ తన వుత్పత్తులను ఐర్లండ్‌లోకి పంపితే ఎలా అన్నది ఇయు సమస్య.

Image result for brexit deal or no deal

ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకోదలచిన ముసాయిదా పత్రంలోని అంశాలను వ్యతిరేకిస్తూ ఇద్దరు మంత్రులు రాజీనామా చేయగా, వారి బదులు మరొక ఇద్దరిని వెంటనే నియమించారు. ఒప్పందం తనకోసం కాదని జాతీయ ప్రయోజనాలకోసమే అని ప్రధాని చెబుతున్నారు. తన ప్రతిపాదనలకు మద్దతు ఇవ్వాలని ప్రధాని థెరెసా మే సోమవారం నాడు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్రిటీష్‌ ఇండస్ట్రీ(సిబిఐ)కివిజ్ఞప్తి చేశారు. ఈ ఒప్పందం వలన తమకు చౌకగా దొరికే కార్మికుల కొరత ఏర్పడుతుందని, తద్వారా తాము నష్టపోతామని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి.ఒప్పందం కుదురుతుందన్న వార్తలు వెలువడగానే బ్రిటన్‌ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయం నుంచి వెనక్కు తగ్గుతున్నాయని ఒక కంపెనీ తూర్పు ఐరోపాకు తరలాలని నిర్ణయించినట్లు సిబిఐ ప్రతినిధులు పేర్కొన్నారు. ఒప్పందం లేకుండా బ్రిటన్‌ విడిపోతే 50 బిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాల్సిన అవసరం వుండదని కొందరు భాష్యం చెబుతుండగా ఒప్పందం వున్నా లేకపోయినా పరిహారం చెల్లించాలని మరికొందరు చెబుతున్నారు.ఈనెల 25న బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఐరోపా యూనియన్‌ నేతలతో ఆమె సమావేశం తరువాత బ్రిటన్‌లో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో నాయకత్వ మార్పు సమస్యను ముందుకు తెచ్చినంత మాత్రాన జరిగేదేమీ వుండదని, సంప్రదింపులు ఆలస్యమయ్యే కొద్దీ ముప్పు మరింత పెరుగుతుందని ఆమె హెచ్చరించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మీడియా స్వేచ్చ, జర్నలిస్టులకు రక్షణ ఓ ఎండమావి !

14 Wednesday Nov 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Free press, Freedom of the media in india, India freedom of the press index, National Press Day

Image result for Freedom of the media, protection for journalists a mirage in the world

ఎం కోటేశ్వరరావు

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం

నరజాతి సమస్త పరపీడన పరాయణత్వం

అలాగే ఏదేశ చరిత్ర చూసినా ఎక్కడున్నది మీడియా స్వేచ్చ, జర్నలిస్టులకు రక్షణ అన్న ప్రశ్న తలెత్తుతోంది. మే మూడవ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్చాదినం, నవంబరు రెండున జర్నలిస్టులపై నేరాలు చేసిన వారిని శిక్షించకుండా వదల వద్దని కోరే అంతర్జాతీయ దినం, నవంబరు 16న భారత పత్రికా దినం !! ఎన్నిదినాలు జరిపినా ఎంతగా గొంతెత్తినా అనేక చోట్ల పరిస్ధితులు మరింత దిగజారుతున్నాయి. వాటిలో ఒకటి మన దేశం.

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు

నేను కమ్యూనిస్టును కాదు గనుక నోరు మెదపలేదు

తదుపరి వారు కార్మికనేతల కోసం వచ్చారు

నేను కార్మికనేతను కాదు గనుక మాట్లాడలేదు

తదుపరి వారు యూదుల కోసం వచ్చారు

నేను యూదును కాదు గనుక నోరు విప్పలేదు

తరువాత నాకోసం వచ్చారు

తీరా చూస్తే నాకోసం మాట్లాడేవారెవరూ మిగల్లేదు

ఈ ప్రఖ్యాత కవిత రాసింది ఒక కమ్యూనిస్టు వ్యతిరేకి మార్టిన్‌ నియోమిల్లర్‌. జర్మనీలో లూధరన్‌ పాస్టర్‌ అయిన ఈ పెద్దమనిషికి కమ్యూనిజం అంటే పడదు గనుక వారి బద్దవ్యతిరేకి అయిన నాజీ హిట్లర్‌ అధికారానికి రావటానికి సహకరించిన వారిలో ఒకడయ్యాడు.రక్తం రుచి మరిగిన పులికి కావలసింది మనిషి తప్ప కమ్యూనిస్టా కమ్యూనిస్టు వ్యతిరేకా అన్నది దానికి అవసరం లేదు. ప్రపంచమంతా తన పాదాక్రాంతం కావాలనుకున్న హిట్లర్‌ మతాన్ని ఎలా వదలి పెడతాడు. మతం కూడా అధికారానికి లోబడి వుండాల్సిందే అని హుకుం జారీ చేయటంతో నియోమిల్లర్‌ వంటి ఎందరికో భ్రమలు తొలిగి పోయాయి. పర్యవసానం కారాగారవాసం. అక్కడే పై కవితను అక్షరబద్దం గావించాడు.

ప్రతి ఏటా ప్రపంచ వ్యాపితంగా అంతర్జాతీయ పత్రికా స్వేచ్చా దినాలు జరుగుతున్నా, అంతర్జాతీయ సంస్ధలు నిరసిస్తున్నా జర్నలిస్టుల మీద దాడులు తగ్గటం లేదు. నమోదైన కేసుల్లో విచారణను సాగదీయటం, శిక్షలు పడకపోవటం ఒక ప్రధాన అంశంగా తయారైంది. ప్రతి పది కేసుల్లో ఒకదానిలో మాత్రమే శిక్షలు పడుతున్నట్లు తేలింది. మన దేశంలో షెడ్యూలు కులాలు, తెగలు, మహిళల మీద జరిగిన దాడులు, అత్యాచారాలు, హత్య కేసులలో శిక్షలు పడేవి తక్కువనే అంశం కొంత మందికే తెలుసు. జర్నలిస్టుల మీద కేసుల్లో ఆ మాత్రం శిక్షలు కూడా పడటం లేదన్న నగ్నసత్యం చాలా మందికి కనిపించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల జరిగినదాడుల కేసుల సారాంశమిదే. కనీసం రెండు చోట్ల అధికార పార్టీ ఎంఎల్‌ఏలు లేదా వారి ముఖ్య అనుచరులు జర్నలిస్టుల మీదాడులకు దిగినా ఎలాంటి చర్యలు లేవు. అనేక చోట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించిన వుదంతాలలో వాటిని పట్టించుకొని అధికారపార్టీకి మచ్చతేవద్దని ఆయా సంస్ధల యాజమాన్యాలు దాడులకు గురైన తమ సిబ్బందిని హెచ్చరించటం కొసమెరుపు. గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటన, అధికారుల బాధ్యతారాహిత్యం అని అందరికీ తెలిసినా మీడియానే కారణమని సోమయాజులు కమిషన్‌ పేర్కొన్న అంశాన్ని ఏ మీడియా సంస్ధా కనీసం ఖండించలేదు.

మన దేశంలో 1956లో ఏర్పాటు చేసిన తొలి ప్రెస్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు 1966 నవంబరు 16న ప్రెస్‌ కౌన్సిల్‌ ఏర్పడింది. అందువలన ఆ రోజును జాతీయ పత్రికా దినంగా పాటిస్తూ 1997 నుంచి ప్రెస్‌ కౌన్సిల్‌ ప్రతి ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. స్వేచ్చాయుతమైన, జవాబుదారీతనంతో కూడినదిగా మీడియా వుండాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. ఆచరణలో స్వేచ్చను హరించే వారిని, అడ్డగోలుగా వ్యవహరించే మీడియా సంస్ధలనూ సరైన దారిలో పెట్టటంలో ప్రెస్‌ కౌన్సిల్‌ విఫలమైంది. ఘటనలపై విచారణలు జరపటం, సిఫార్సులు చేయటం, సుభాషితాలు చెప్పటం తప్ప దానికి ఎలాంటి అధికారాలు లేవు. అది కూడా ఎవరు అధికారంలో వుంటే వారికి వంతపాడేదిగా మారటంతో అది ఇచ్చిన పిలుపును జర్నలిస్టులు పెద్దగా పట్టించుకోవటం లేదు.చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనట్లు మన దేశంలో ప్రెస్‌ కౌన్సిల్‌ నేడు ఆశ్రితులకు, అవకాశవాదులకు పునరావాస కేంద్రంగా మారింది. అటు తప్పు చేసిన యాజమాన్యాలను, ఇటు మీడియా స్వేచ్చను హరిస్తున్న ప్రభుత్వాలను నిలదీయలేని అటూ ఇటూగాని స్ధితిలో వుంది. గతంలో పత్రికలే వున్నందున ఏర్పడిన సంస్ధకు ప్రెస్‌ కౌన్సిల్‌ అని పేరు పెట్టారు. దాన్ని మీడియా కౌన్సిల్‌గా మార్చాలని, ప్రజాతంత్ర పద్దతుల్లో ప్రతినిధుల ఎంపిక జరగాలని, తగిన అధికారాలు ఇవ్వాలన్న న్యాయమైన డిమాండ్లను ఎవరూ పట్టించుకోవటం లేదు. యాజమాన్యాలకు ఎక్కడ ఆగ్రహం వస్తుందో అన్న భయంతో మరో మీడియా కమిషన్‌ వేయాలన్న డిమాండ్‌ను అటు కాంగ్రెస్‌ ఇటు బిజెపి రెండు ప్రభుత్వాలూ పట్టించుకోవటం లేదు.

నవంబరు 2వ తేదీ దినం విషయానికి వస్తే ‘ అంతర్జాతీయ భావ ప్రకటనా స్వేచ్చ పరస్పర మార్పిడి ‘ (ఇంటర్నేషనల్‌ ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఎక్సేంజ్‌-ఐఎఫ్‌ఇఎక్స్‌) అనే ఒక ప్రపంచ పౌర సంస్ధల యంత్రాంగం ప్రతి ఏడాది నవంబరు 23న ‘జర్నలిస్టులపై నేరాలు చేసిన వారిని శిక్షించకుండా వదల వద్దని కోరే అంతర్జాతీయ దినం’ 2011లో నిర్ణయించింది. ఆ తేదీని ఎందుకు ఎంచుకున్నారంటే 2009 నవంబరు 23న ఫిలిప్పయిన్స్‌లోని మాగుయిండానా ప్రాంత గవర్నర్‌ ఎన్నికలో ఒక అభ్యర్ధి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గనేందుకు ఇతరులు, ఆ వార్తను సేకరించేందుకు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు కూడా వెళ్లారు. వారి వాహన శ్రేణిపై విరుచుకు పడిన సాయుధ ముఠా దానిలో వారందరూ అభ్యర్ధి మద్దతుదారులుగా భావించి వారందరినీ కిడ్నాప్‌ చేసి కాల్చిచంపింది. ఈ దారుణకాండలో 58 మంది మరణించగా వారిలో 34 మంది జర్నలిస్టులే వున్నారు. 2013లో ఐఎఫ్‌ఇఎక్స్‌ సభ్యులు, భావప్రకటనా స్వేచ్చను కోరుకొనే ఇతర పౌరసమాజ కార్యకర్తల వినతి, పరిస్ధితి తీవ్రత మేరకు 2013 డిసెంబరులో ఐక్యరాజ్యసమితి 70వ వార్షికోత్సవం సందర్భంగా జనరల్‌ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించి నవంబరు రెండవ తేదీని ‘జర్నలిస్టులపై నేరాలు చేసిన వారిని శిక్షించకుండా వదల వద్దని కోరే అంతర్జాతీయ దినం’పాటించాలని నిర్ణయించింది. అదే సంవత్సరం నవంబరు రెండున మాలీ దేశంలో వార్తల సేకరణకు వెళ్లిన ఇద్దరు ఫ్రెంచి జర్నలిస్టులు ఘిష్‌లైన్‌ డ్యూపాంట్‌, క్లాడె వెర్లోన్‌లను హత్య చేశారు. అప్పటి నుంచి జర్నలిస్టుల మీద నేరాలు చేసిన వారెవరినీ వదలవద్దంటూ ఐఎఫ్‌ఇఎక్స్‌ సంస్ధ ప్రతి ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.ప్రతి ఏటా ఆ రోజు ఐరాస సభ్య దేశాలు తమ దేశాలలోని జర్నలిస్టుల కేసులను సమీక్షించాలని, దోషులకు శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకోవాలని నివేదికలు ప్రకటించాలని యునెస్కో సభ్యదేశాలకు లేఖలు రాయటమే గాకుండా ప్రతి సంవత్సరం ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నది.

ప్రతి ఏటా ప్రపంచ వ్యాపితంగా మే మూడవ తేదీన అంతర్జాతీయ పత్రికా స్వేచ్చాదినంగా పాటిస్తున్నాము. దీన్ని విండ్‌ హాక్‌ ప్రకటన అని కూడా పిలుస్తారు. నమీబియా రాజధాని విండ్‌హాక్‌లో 1991 ఏప్రిల్‌ 29 నుంచి మే మూడవ తేదీ వరకు యునెస్కో నిర్వహించిన ఒక సెమినార్‌లో ఆఫ్రికా జర్నలిస్టులు రూపొందించిన ప్రకటనను ఐరాస ఆమోదించింది. ప్రకటన జారీ చేసిన మే మూడవ తేదీని అంతర్జాతీయ దినంగా పాటించాలని కోరింది. తరువాత అనేక ప్రాంతీయ ప్రకటనలు కూడా వెలువడ్డాయి. ఈప్రకటనను అనేక దేశాలు సూత్రప్రాయంగా ఆమోదించినప్పటికీ ఆచరణలో మీడియా స్వేచ్చను మేడిపండుగా మార్చివేశాయి. మన రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్చకు హామీ వున్నప్పటికీ దీనికి మన దేశం మినహాయింపు కాదు. ప్రపంచంలో ఎత్తయిన విగ్రహం ఎక్కడుంది అంటే భారత్‌ అని చెప్పుకొనే విధంగా వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని సమున్నతంగా నిలబెట్టారు. అదే మోడీ పాలనలో మీడియా స్వేచ్చ విషయంలో మనదేశం నూట ఎనభై దేశాలలో 138 స్ధానంలో పాతాళంలో వుంది.

గత పన్నెండు సంవత్సరాలలో ప్రపంచంలోని పలు దేశాలలో దాదాపు వెయ్యి మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో హత్యకు గురయ్యారు. మన దేశంలో గతేడాదిలో 12 మంది హత్యకు గురయ్యారు. నిజానికి అంతం లేదంటూ ప్రతి ఏటా అనేక సంస్ధలు గళమెత్తుతూనే వున్నాయి. ప్రతి ఏటా మే మూడవ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్చా దినం సందర్భంగా ‘సరిహద్దులు లేని విలేకర్లు'( రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌-ఆర్‌డబ్ల్యుబి) ప్రపంచ దేశాల సూచికలను ప్రకటిస్తుంది. మనం పాకిస్ధాన్‌ కంటే కొద్దిగా ఎగువన వున్నాం. ఒక వైపు దేశంలో పరిస్ధితులు ఎలా వున్నాయో తెలిసి కూడా మన ప్రెస్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు చంద్రమౌళి కుమార్‌ ప్రసాద్‌ ఈ సూచికను తాము ఆమోదించటం లేదని ప్రకటించారు. సమాచార ప్రాతిపదికన గాకుండా అభిప్రాయాల కనుగుణంగా సూచికలను రూపొందించారని వ్యాఖ్యానించటం నరేంద్రమోడీని ప్రసన్నం చేసుకొనే పిల్లిమొగ్గ తప్ప మరొకటి కాదు. జర్నలిస్టు గౌరీ లంకేష్‌ హత్య గురించి నరేంద్రమోడీ మాట్లాడతారని ఎవరూ అనుకోలేదు కనీసం ట్విటర్‌ నుంచి కూడా ఖండన ప్రకటన రాలేదు. కొన్ని మీడియా సంస్ధలు, జర్నలిస్టులపై దాడులకు కొన్ని సంస్ధలు, కిరాయి హంతకులకు పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ మద్దతు లేకుండా జరగలేదన్నది అందరికీ తెలిసిందే. మన దేశంలో భావ ప్రకటనా స్వేచ్చ గురించి ప్రముఖ న్యాయవాది ఒక సందర్భంగా చేసిన వ్యాఖ్యకు ఎంతో ప్రాధాన్యత వుంది.’ అసలు సమస్య మాట్లాడటానికి స్వేచ్చ కాదు, మాట్లాడిన తరువాత స్వేచ్చ. మీరు కోరుకున్న విధంగా మాట్లాడటానికి అనుమతి వుంటుంది, కానీ మాట్లాడిన తరువాత మిమ్మల్ని పట్టుకొనేందుకు, బయటికి తీసుకుపోయేందుకు ఒక వ్యక్తి సిద్దంగా వుంటాడు కనుక మీరు స్వేచ్చగా మాట్లాడలేరు.’ అన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశాలలో మాట్లాడిన దానికి విరుద్దంగా నకిలీ వీడియోలను తయారు చేసి అధికారంలో వున్నవారి మెప్పు, అర్ధిక ప్రయోజనం కోసం ప్రసారం చేసిన మీడియా సంస్ధల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించక తప్పదు.

Image result for Freedom of the media, protection for journalists a mirage in the world

స్వాతంత్య్రానికి ముందు కూడా మీడియాలో రెండు తరగతులు వుండేవి. ఒకటి స్వాతంత్య్ర లక్ష్యం కోసం ప్రధానంగా పని చేసినవి, రెండవ తరగతి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులతో ఘర్షణ పడకుండా స్వామికార్యం, స్వకార్యం నెరవేర్చుకొనేవి. తరువాత దేశ మీడియాలో ఆగీత చెరిగిపోయింది. ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద కేంద్రీకరణ లేదు. ఎవరు అధికారంలో వుంటే వారి భజనచేస్తూ లాభాల వేటే ప్రధాన వ్యాపకంగా మారింది. అందుకోసం వార్తను,దృశ్యాన్ని ఒక వ్యాపార సరకుగా మార్చివేశారు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్‌ వారిని వ్యతిరేకిస్తూ పత్రికలు పెట్టిన ఎందరో తమ ఆస్ధులను కరగదీసుకున్నారు. ఇప్పుడు వామపక్షాలకు చెందిన పత్రికలు తప్ప ప్రతి ఒక్కటీ లాభాలను అరగదీస్తున్నవే. మా పత్రిక ధర మీరు కొనే సమోసా కంటే తక్కువే అని గతంలో ఒక మీడియా సంస్ధ ప్రచారం చేసుకుంది. ఇప్పటికీ పత్రికలు సమోసా కంటే తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఒక్క పత్రికలు తప్ప ప్రపంచంలో ఏ వస్తువూ తయారీ ధరకంటే తక్కువకు లభ్యం కావటం లేదు. దీని అర్ధం వాటి నిర్వాహకులకు అందుకు తగిన ఆదాయం, లాభాలు వస్తుండటమే కారణం. టీవీ ఛానల్స్‌ కూడా అంతే. కొన్ని పార్టీలు, వాటి నేతలు, వ్యాపార సంస్ధల వార్తలను ఇస్తే కాసులు కురుస్తాయి, కొన్నింటికి ఎలాంటి ప్రతిఫలమూ వుండదు. అందుకే నేడు నూటికి తొంభై తొమ్మిది సంస్ధలు మాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ప్రతిఫలం రాదు అనుకున్న గ్రామీణ, రైతులు, కార్మికులు, ఇతర కష్టజీవుల అంశాలను విస్మరిస్తున్నాయి. అలాంటి వాటికి భావ ప్రకటనా స్వేచ్చ వుంటేనే లేకపోతేనేం.అందుకే నేడు మీడియా సంస్ధలను డబ్బులు సంపాదించే మేనేజర్లు నడుపుతున్నారు తప్ప సంపాదకులు కాదు. వార్తలను అమ్ముకోవటానికి, పాకేజీలకు అడ్డుపడిన సంపాదకులు ఇంటిదారి పట్టటం తప్ప మరొక మార్గం లేదు. అందుకే గతంలో కాంగ్రెస్‌, ఇప్పుడు బిజెపి ఎవరు అధికారంలో వున్నా మీడియాను పూర్తిగా తమ చెప్పుచేతల్లోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. లంగని వాటి ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు, తద్వారా వాటి మూతకు ప్రయత్నిస్తున్నారు. ఈ పూర్వరంగంలో మీడియా స్వేచ్చకు ముంచుకువస్తున్న హాని గురించి కూడా ఒక్క మాట కూడా రాయలేని సంపాదకులను నేడు మనం చూస్తున్నాం. ఫోర్త్‌ ఎస్టేట్‌గా మన్నననలను పొందిన మీడియా రియలెస్టేట్‌గా మారిపోయిందనే వ్యంగ్యవ్యాఖ్యానాలను వినాల్సి వస్తోంది. మీడియా యజమానులు, రాజకీయనేతలకు మధ్య వున్న గీత దాదాపుగా చెరిగిపోయింది. వారి ప్రయోజనాలను వీరు వీరి ప్రయోజనాలను వారు కాపాడుకుంటున్నారు. కొందరు రాజకీయనేతలు స్వయంగా మీడియా సంస్ధలను ఏర్పాటు చేసుకున్నారు. అధికారంలో వున్నపుడు దానిని అడ్డుపెట్టుకొని లాభాలు సంపాదించటం, ప్రతిపక్షంలో వున్నపుడు వాటినే పెట్టుబడిగా పెట్టి నిలుపుకోవటం గతంలో జరిగింది. ఇప్పుడు రాజకీయ నేతలు, వారి కనుసన్నలలో మెలిగే మీడియా సంస్ధలు ఎక్కడ అధికారం వుంటే ఆవైపే చేరటం రివాజుగా మారింది. అలాంటి మీడియా సంస్ధలకు మీడియా స్వేచ్చతో పని లేకపోవటమే కాదు, స్వేచ్చకు ముప్పు తెచ్చిన పార్టీలను నిస్సిగ్గుగా సమర్ధించటం కూడా చూస్తున్నాము. దేశంలోని గుత్త పెట్టుబడిదారీ సంస్ధలు మీడియా రంగంలో ప్రవేశించటం కూడా పైదానిలో భాగమే. దేశవ్యాపితంగా పలుభాషా ఛానళ్లు కలిగిన రిలయన్స్‌ గ్రూప్‌ ద్వారా రానున్న పార్లమెంట్‌, రాష్ట్రాల ఎన్నికలలో లబ్ది పొందే ఎత్తుగడలో భాగంగానే మోడీ సర్కార్‌ రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రభుత్వరంగ సంస్ధ హాల్‌ను పక్కన పెట్టి రిలయన్స్‌ కంపెనీని ఎంచుకొనే విధంగా ప్రభుత్వం పావులు కదిపింది. ఆ కుంభకోణ వార్తలను ప్రసారం చేసినందుకు ఎన్‌డిటివి, ప్రచురించినందుకు నేషనల్‌ హెరాల్ట్‌ పత్రిక మీద రిలయన్స్‌ 15వేల కోట్లరూపాయలకు పరువు నష్టం దావా వేసింది. మీడియా స్వేచ్చ అణచివేతలో కార్పొరేట్‌ కంపెనీల పాత్రకిది నిదర్శనం. అంతకు ముందు బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడి వ్యాపారలాభం విపరీతంగా పెరిగిన తీరును ప్రచురించిన వైర్‌ వెబ్‌ పోర్టలప్‌పై వందకోట్లకు దావా వేసిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ రైతు అనుకూల విధానాల ఫలితంగా తన ఆదాయం రెట్టింపు అయిందని చత్తీస్‌ఘర్‌లోని ఒక గిరిజన మహిళా రైతు చెప్పటాన్ని బిజెపి, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. అయితే అధికారులు పనిగట్టుకొని అలా చెప్పించినట్లు ఎబిపి వార్తా ఛానల్‌ జర్నలిస్టులకు ఆ యువతే స్వయంగా చెప్పింది. ఆ వార్తను ప్రసారం చేసినందుకు ఆగ్రహించిన కేంద్ర ప్రభుత్వ,బిజెపి పెద్దలు పతంజలి కంపెనీ మీద వత్తిడి తెచ్చి ఎపిబి చానల్‌తో కుదుర్చుకున్న వంద కోట్ల యాడ్ల ఒప్పందాన్ని రద్దు చేయించారు. అంటే కార్పొరేట్ల, పాలకుల బండారాన్ని బయటపెట్టిన మీడియా సంస్ధల ఆర్ధికమూలాలను దెబ్బతీయటం ద్వారా మీడియాను తమ పాదాక్రాంతం చేసుకొనేందుకు కార్పొరేట్లు, పాలకపార్టీలు ఎలా ప్రయత్నిస్తున్నాయో స్పష్టం అవుతోంది. ఇలాంటి విషయాల్లో ఇష్టమైన వారితో పాకేజ్‌లు కుదుర్చుకోవటంలో ఇష్టం లేని వారిని ఇబ్బందులపాల్జేసి తమ దారికి తెచ్చుకోవటంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రస్తుత ముఖ్య మంత్రుల తీరుతెన్నులు అందరికీ తెలిసిందే.

Image result for Freedom of the media, protection for journalists  in india cartoons

మీడియా స్వేచ్చ సూచికలో 2012లో 131, 2014లో 140 లేదా ఈ ఏడాది 138వ స్థానం మనది అంటే అటు కాంగ్రెస్‌,ఇటు బిజెపి కూడా ఎడం కన్ను, కుడి కన్ను తేడా తప్ప ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయన్నది స్పష్టం. అందువలన వాటి గురించి చర్చించుకోవటం వృధాప్రయాస. గతంలో కాంగ్రెస్‌ అత్యవసర పరిస్ధితిని ప్రకటించి మీడియా వార్తలపై ప్రత్యక్ష సెన్సార్‌షిప్‌ విధించింది. ఇప్పుడు అదే కాంగ్రెస్‌ లేదా బిజెపి వాటితో జట్టుకట్టే పాలకవర్గ ప్రాంతీయ పార్టీలు మీడియా మీద పరోక్ష సెన్సార్‌ను అమలు జరుపుతున్నాయి. వారికి ఇష్టం లేని వార్త అసలు రాకపోవటం లేదా కనిపించీ కనిపించకుండా ఒక మూలనపడవేయటమో జరుగుతోంది.తమ విధానాలను ప్రశ్నించిన మీడియా సంస్దలకు ప్రకటనలు నిలిపివేయటం, టీవీ ఛానల్స్‌ అయితే కేబుల్‌ నిర్వాహకులను బెదిరించి ఛానల్స్‌ ప్రసారాలను అడ్డుకోవటాన్ని చూశాము. దొంగే దొంగ అని అరచినట్లుగా కుహనా వార్తలకు ఆద్యులుగా వున్న శక్తుల ప్రతి నిధులు తిష్టవేసిన కేంద్ర ప్రభుత్వం కుహనా వార్తలు రాసే జర్నలిస్టు ఎక్రిడిటేషన్‌ రద్దు చేయాలని సర్కార్‌ మార్గదర్శక సూత్రాలను సవరించింది. వాటి ప్రకారం తొలి తప్పుడు వార్తకు ఆరునెలలు, రెండోదానికి ఏడాది అక్రిడిటేషన్‌ సస్పెండ్‌ చేయాలి. మూడోసారి రాస్తే శాశ్వతంగా రద్దు చేయాలి. వీటిపై జర్నలిస్టుల నుంచి తీవ్ర విమర్శలు రావటంతో మోడీ సర్కార్‌ తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. జర్నలిస్టుల నిరసన కంటే కుహనా వార్తల తయారీ ఫ్యాక్టరీలను పెట్టి పుంఖాను పుంఖాలుగా వుత్పత్తి చేస్తున్న వారందరూ సంఘపరివార్‌కు చెందిన వారే అన్నది బహిరంగ రహస్యం. వెనుకా ముందు చూసుకోకుండా లేదా తెలిసీ అలాంటి వార్తలను ప్రచురించిన, ప్రసారం చేసిన మీడియా సంస్ధలు కూడా ప్రభుత్వ అనుకూలమైనవే. అందువలన నిజంగా వేటు పడితే అది తమ మీదే అని వారే ఎక్కువగా వత్తిడి తెచ్చారు. చిత్రం ఏమిటంటే అసలు కుహనా వార్తలు అంటే ఏమిటో, ఎవరికి, ఏ ప్రాతిపదికన ఫిర్యాదు చేయాలో కూడా నిర్ణయించకుండానే ఆ మార్గదర్శక సూత్రాలను జారీ చేశారంటే వారి స్ధితిని అర్ధం చేసుకోవచ్చు. మీడియా సంస్ధలలో రిపోర్టర్లతో పాటు కార్యాలయాల్లో పని చేసే సబ్‌ ఎడిటర్లు కూడా వార్తలు రాస్తారని, వారికి అక్రిడిటేషన్లు వుండవని(తెలుగు రాష్ట్రాలలో కొత్తగా సబ్‌ ఎడిటర్లకు అక్రిడిటేషన్లు ఇచ్చారు) అక్కడే కుహనా వార్తలు ఎక్కువగా వుత్పత్తి అవుతాయని, అన్నింటికంటే వెబ్‌ సైట్లు అలాంటి వార్తలతో జనాన్ని ముంచెత్తుతున్నాయని మార్గదర్శకాలు జారీ చేసిన వారికి తెలియదనుకోవాలా ? లేక తమ విధానాలు, వైఖరులను ఎంగడుతున్న కవులు, కళాకారులు, మేథావులు ఇలా ప్రతిఒక్కరి నోరు మూయించాలని చూస్తున్నట్లుగానే జర్నలిస్టులను కూడా బెదిరించాలనే వూపులో ఈ పని చేశారా ?

Image result for Freedom of the media, protection for journalists  in india

ఇటీవలి వరకు సమాచార రంగం మీద గుత్తాధిపత్యం వున్న సామ్రాజ్యవాద,పెట్టుబడిదారీ దేశాలు తాము వార్త అనుకున్నదానినే ప్రపంచానికి అందచేసేవి. ఆక్రమంలో తప్పుడు వార్తలను కూడా గణనీయంగా సృష్టించాయి. వాటిని ప్రాతిపదికగా చేసుకొని వియత్నాంలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసి అక్కడ కీలుబమ్మ సర్కార్‌ను ఏర్పాటు చేయాలని అమెరికన్లు నిర్ణయించారు.దానికోసం 1964 ఆగస్టునాలుగవ తేదీ అర్ధరాత్రి నాటి అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ టీవీలో ఒక ప్రకటన చేస్తూ అంతర్జాతీయ సముద్రజలాలైన టోంకిన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో తమ నౌకలపై వియత్నాం దాడి చేసిందని ప్రకటించటమే కాదు, దాని మంచి చెడ్డల విచారణకోసం ఆగకుండా ఐక్యరాజ్యసమితితో నిమిత్తం లేకుండా వెంటనే వియత్నాం మీద యుద్దం ప్రకటించి పది సంవత్సరాల పాటు అకృత్యాలకు పాల్పడ్డారు. తీరా చూసే ్త అసలు టోంకిన్‌ గల్ఫ్‌లో అమెరికా నౌకల మీద ఎలాంటి దాడి జరగలేదని తేలింది.ఇప్పటికీ అమెరికన్లు ఆ వాస్తవాన్ని అంగీకరించేందుకు సిద్దపడటం లేదు. మన కళ్ల ముందే ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోశారని తప్పుడు వార్తలను ప్రచారంలో పెట్టి దాని మీద జరిపిన దాడిని చూశాం. ఇప్పుడు సిరియాలో జరుపుతున్నదాడులు కూడా అలాంటి నకిలీవార్తల పర్యవసానాలే. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. మన దేశంలో గత ఐదు సంవత్సరాలుగా కుహనా వార్తలు సామాజిక మాధ్యమాన్ని ముంచెత్తుతున్నాయి. నిజం నాలుగు అడుగులు వేసే లోగా అబద్దం నలభై అడుగుల ముందు వుంటోంది. అవన్నీ ఒక పధకం ప్రకారమే వెలువడుతున్నాయి. ఏది నిజమో ఏది కాదో తెలుసుకోలేని గందరగోళంలో జనాన్ని పడవేసేందుకు, నిజాన్ని కూడా ఒక పట్టాన నమ్మకుండా చేసేకుట్ర దీనిలో వుంది. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ ప్రభుత్వంలో మంత్రిగా వున్న గోబెల్స్‌ ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమై కూర్చుంటుంది అన్న సూత్రంతో పని చేశాడు. ఇప్పుడు మనిషి మనిషికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావటంతో గోబెల్స్‌లు వికటాట్టహాసం చేస్తున్నారు. వెనుకా ముందూ చూడకుండా వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారాన్ని ప్రతి ఒక్కరూ ఇతరుల మీద ఎత్తిపోస్తున్నారు. నిజమైన జాతీయవాదుల మీద అవాస్తవాలు, వక్రీకరణలు ప్రచారం చేస్తూ, నకిలీలను నిజమైన వారిగా చిత్రించటం మనం చూస్తున్నదే. జాతీయవాదం, దేశభక్తి వంటి పదాలకు అర్ధాలనే మార్చివేస్తున్నారు. ప్రధాన స్రవంతి మీడియా సంస్ధలు కూడా ఇందుకు తమవంతు తోడ్పాడును అందిస్తున్నాయి. అందువలన నిజమైన వార్తలు, నిజమైన పత్రికా, మీడియా స్వేచ్చ అంటే జనం కూడా గందరగోళానికి గురి అవుతున్నారు. పరాయి పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని జాతీయవాదులుగా పిలిచిన రోజులను మరుగున పడవేస్తున్నారు. పరాయి పాలకులకు అడుగులకు మడుగులత్తిన వారిని, హిందూత్వ పేరుతో పరాయి మతాలమీద ద్వేషభావాన్ని రెచ్చగొట్టిన వారిని అసలు సిసలు జాతీయవాదులుగా ప్రచారం చేస్తున్నారు. గాంధీని హత్య చేసిన గాడ్సే అందుకు వుదాహరణ. ఈ రోజు జాతీయవాదులుగా చెప్పుకుంటున్నవారు గాంధీ ఎందుకు హత్యకు గురయ్యాడు అన్నదాని కంటే గాడ్సే గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే సమర్ధనాంశాన్ని ముందుకు తెస్తున్నారు.నేడు దేశంలో అత్యధిక మీడియా సంస్ధలు, జర్నలిస్టులు జర్మన్‌ పాస్టర్‌ ఆత్మావలోకనం చేసుకొని అనుభవసారాన్ని గ్రహించటం లేదు. తమదాకా రాలేదు కదా, వచ్చినపుడు చూద్ధాంలే అని భావిస్తున్నారు. తీరా వచ్చాక అయ్యో అన్యాయం అనే వారెవరూ మిగలరని గుర్తించకపోవటమే విచారకరం. భరతమాత శృంఖలాను బద్దలు చేసేందుకు,స్వేచ్చా స్వాతంత్య్రాల కోసం ప్రాణాలర్పించిన దేశం మనది. వాటికి భంగం కలిగితే తిరిగి అలాంటి తిరుగుబాటు చేసే చేవ వున్న జాతి మనది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా రైతాంగానికి వ్యవసాయ పరిశోధనల తోడ్పాటు !

13 Tuesday Nov 2018

Posted by raomk in CHINA, Current Affairs, Farmers, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

agricultural research, automation in china agriculture, china agriculture, chinese farmers

Image result for how the chinese farmers are benefits of agricultural research

ఎం కోటేశ్వరరావు

అలవిగాని ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు సోకితే తప్ప రైతు ఎంత ఎక్కువగా పెట్టుబడి పెడితే దిగుబడి అంత ఎక్కువగా వస్తుందన్నది అందరికీ తెలిసిన సత్యం. ఆ పెట్టుబడులు కూడా గుడ్డిగా కాకుండా శాస్త్రీయంగా వుంటే మరింత ప్రయోజనం. దానికి మార్కెట్‌ రక్షణ కూడా వుంటే నాలుగు డబ్బులు మిగులుతాయి. శాస్త్రీయ పద్దతులు, సమాచారం రైతులకు కావాలంటే ఎవరికి వారు సంపాదించుకోలేరు. అందరికీ ఆఫలాలు అందే విధంగా పభుత్వాలే సమకూర్చాలి. వాటినే పరిశోధన, అభివృద్ధి అంటున్నారు. కొత్త వాటి కోసం పరిశోధన, వున్నవాటిని మెరుగుపరటం అభివృద్ధి జరగాలి. అటువంటి దానికి ఏ దేశం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నది అనేదాన్ని బట్టి ఫలితాలు వుంటాయి.

ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా అన్ని రంగాలలో చైనా ముందుకు దూసుకుపోతున్నది అనేది వాస్తవం. దాన్ని పాలించే కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలతో ఎవరైనా విబేధించవచ్చుగాని జనం కోసం చేస్తున్న వారి కృషిని కాదనలేరు. గత నెలలో చైనా వ్యవసాయ రంగ అభివృద్ధికి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎలా వుపయోగపడుతున్నదో ఒక నివేదికను ప్రకటించారు. దాని వలన చైనాకు ఆహార భద్రత సమకూరటంతో పాటు రైతుల ఆదాయాలు పెరిగాయన్నది దాని సారాంశం. అయితే వుత్పాదక ఖర్చు ఇంకా ఎక్కువగానే వుందని, వుత్పత్తుల ధరలు ఒక పరిమితికి చేరాయని ఫలితంగా లాభాలు తగ్గుతున్నాయంటూ ఈ సమస్యతో పరిమిత వనరులు, పర్యావరణ కాలుష్యం, కీలకమైన పోటీ లేమి వంటి సవాళ్లను చైనా ఎదుర్కొంటున్నదని, వాటిని అధిగమించటానికి అవసరమైన సంస్కరణలు చేపట్టాల్సి వుందని కూడా దానిలో పేర్కొన్నారు.

వాటిలో భాగంగా మరింత నాణ్యమైన పంటల రకాలు, స్వయం చాలిత యంత్రాలు, వ్యవసాయ, ఆహార వుత్పత్తుల తయారీ, సమర్ధ నీటి వినియోగం, కాలుష్య అదుపు, వ్యవసాయ వృధాను వుపయోగించుకోవటం, పర్యావరణ పరిరక్షణ, పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రభుత్వ అకాడమీ ఐదు సంవత్సరాల ప్రణాళికను కూడా రూపొందించింది.వ్యవసాయ రంగంలో చైనా సాధించిన అంశాల గురించి ఆ నివేదికలో పేర్కొన్నవాటి సారాంశం ఇలా వుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో సాధించిన పురోగతి చైనా వ్యవసాయ అభివృద్దికి 2012లో 53.5శాతం దోహదం చేస్తే 2017నాటికి 57.5శాతంగా వుంది. ఆ పురోగతి వరి, పత్తిలో అధిక దిగుబడి, చీడపీడల నిరోధ రకాల రూపకల్పన, ప్రమాదరకర బర్డ్‌ ఫ్లూ నిరోధానికి సమర్ధవంతంగా పని చేసే వాక్సిన్ల తయారీ వంటి వాటిలో వుంది.వ్యవసాయ భూమి, మంచినీరు, ఇతర వనరుల లభ్యత తగ్గుతున్నా గత ఐదు సంవత్సరాలలో ఆహార ధాన్యాల వుత్పత్తి 60కోట్ల టన్నుల వద్ద స్ధిరంగా వుంది. జన్యుపరమైన పరిజ్ఞానంలో కనుగొన్న అంశాల ఆధారంగా పందులు, పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, బాతుల సంతతి వృద్ధి గణనీయంగా పెరిగింది. అనేక పంటలకు జన్యుపరమైన మాప్‌లను తయారు చేశారు. వ్యవసాయ రంగంలోని యంత్రాలు, పరికరాలను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేశారు. పురుగుమందులను చల్లేందుకు డ్రోన్‌లను వినియోగిస్తున్నారు.చైనాలో సాధించిన పురోగతి ప్రపంచంలోని అనేక దేశాలలో వ్యవసాయ రంగానికి వుపయోగపడుతోంది.

Image result for how the chinese farmers are benefits of agricultural research

వివిధ పంటల దిగుబడులకు సంబంధించి 2015లో భారత్‌, చైనా, ప్రపంచ సగటు వివరాలు

హెక్టారుకు కిలోలు

పంట         భారత్‌        చైనా          ప్రపంచ సగటు

వరి          3608       6891          4604

గోధుమ      2750       5393         3317

జన్న        2597       5893         5538

పప్పులు    647          1741         950

చెరకు       71466     73121        70764

వేరుశనగ   1485         3562        1682

(ఆధారం: కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసి 2017 పాకెట్‌ బుక్‌లో పేర్కొన్న వివరాలు )

ఒక దేశం సాధించిన పురోగతి గురించి చెప్పుకుంటున్నామంటే మనం సాధించినదాని గురించి తక్కువ చేయటం కాదు. పోటీ పడాలన్న వాంఛను వ్యక్తం చేయటమే.ప్రధాని నరేంద్రమోడీ వాగ్దానం చేసినట్లు 2022నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేసేందుకు ఆచరణ ఏమిటన్నది విమర్శనాత్మకంగా చూడటం అవసరం. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి మనం చేస్తున్న ఖర్చు చైనా కంటే మరీ అంత వెనుకబడి లేదని నీతి అయోగ్‌ సభ్యుడైన ప్రముఖవ్యవసాయ శాస్త్రవేత్త రమేష్‌ చంద్‌ ఆ మధ్య చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 2017-18 ఆర్ధిక సర్వేలో పేర్కొన్నదాని ప్రకారం అన్ని రంగాలలో పరిశోధన, అభివృద్దికి ఆయా దేశాల జిడిపిలో దక్షిణ కొరియా 4.3, ఇజ్రాయెల్‌ 4.2,అమెరికా 2.8,చైనా 2.1 శాతాల చొప్పున ఖర్చు చేస్తుండగా మన దేశం గత రెండుదశాబ్దాలుగా 0.6-07శాతం మధ్య ఖర్చు చేస్తున్నది. మన కంటే అమెరికా, చైనా జిడిపిలు ఏడు, నాలుగు రెట్లు అధికం అని గమనంలో వుంచుకోవాలి. అయితే చైనా కంటే మనం పెద్దగా వెనుకబడిలేమని రమేష్‌ చంద్‌ ఎలా చెప్పారు? ఆ పెద్దమనిషి మన స్ధూలాదాయంలో వ్యవసాయరంగం నుంచి వస్తున్న మొత్తాన్ని లెక్కల్లోకి తీసుకొని దానిలో వ్యవసాయ అభివృద్ధికి ఎంత ఖర్చు చేస్తున్నామో చెప్పారు. దాని ప్రకారం ట్రేడింగ్‌ ఎకనోమిక్స్‌ డాట్‌కామ్‌ అందచేసిన వివరాల ప్రకారం చూస్తే దక్షిణాఫ్రికా 3.6, బ్రెజిల్‌ 1.82, అమెరికా 1.2, చైనా 0.62, భారత్‌ 0.30శాతం ఖర్చు చేస్తున్నాయి. దీన్ని చూపి చైనాకు మనకు పెద్ద తేడాలేదని రమేష్‌ చంద్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

Image result for automation in china agriculture

ఏదేశమైనా మొత్తంగా పరిశోధన, అభివృద్ధికి చేసే ఖర్చును చూసుకోవాలి. వుదాహరణకు ఒక డ్రోన్‌ తయారు చేస్తే దాన్ని ఏ ఖాతాలో వేయాలి? దానిని నిఘా, లేదా రహస్యంగా ఫొటోలు తీయటానికి, కొన్ని చోట్ల సరకు రవాణాకూ వినియోగిస్తున్నారు. వ్యవసాయంలో కూడా వినియోగపడుతోంది. అందువలన అంకెల గారడీ చేసి అధికారంలో వున్నవారిని మెప్పించవచ్చు. సామాన్య జనానికి ప్రయోజనం లేదు. మన దేశంలో స్వాతంత్య్రానికంటే ముందే 1880లోనే దేశంలో, ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ శాఖను ఏర్పాటు చేయటం ద్వారా ఒక పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు.1919లో ఇంపీరియల్‌ అగ్రికల్చర్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పారు. స్వాతంత్య్రం తరువాత వ్యవసాయ విశ్వవిద్యాలయాను ఏర్పాటు చేసి పరిశోధన, అభివృద్ది బాధ్యతలను వాటికి అప్పగించారు. దీని వల్లనే హరిత విప్లవం జయప్రదం అయింది. తాజా పరిస్ధితిని చూస్తే మనకు అవసరమైన శాస్త్రవేత్తలు, వసతులు వున్నప్పటికీ వాటికి తగిన మొత్తంలో నిధులు, అన్నింటికీ మించి ప్రభుత్వరంగంలో పరిశోధనలు చేయించాలన్న వుత్సాహం, చొరవ పాలకుల్లో లేదు. ఇప్పటికే విత్తనాభివృద్ధి సంస్ధలను నామమాత్రం చేసి ప్ర యివేటు రంగానికి అప్పగించారు. ఏ రంగంలో అయినా పరిశోధన అంటే తక్షణమే లాభాలు చేకూర్చదు, కొన్ని సార్లు పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా ఫలితాలు కూడా రాకపోవచ్చు. దీర్ఘకాలంలో వచ్చే ఫలితాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. అది జరగటం లేదు.భిన్న వాతావరణ పరిస్ధితులున్న మన దేశంలో పరిశోధన అవసరం గురించి చెప్పనవసరం లేదు. వ్యవసాయం, హరిత విప్లవం అంటే గోధుమలు, వరి వుత్పత్తి పెంపుదల ఒక్కటే కాదు. మనదేశం ఆ రెండు పంటల విషయంలో గణనీయమైన పురోగతి సాధించిన తరువాత మన పాలకులు వ్యవసాయం మీద శ్రద్ద తగ్గించారు.ఫలితంగా వ్యవసాయ పెట్టుబడుల తగ్గింపు, వుత్పాదకత పెంపు, నీటి కొరతను అధిగమించటం, మార్కెటింగ్‌, ఆహార తయారీ వంటి అంశాలపై మన శాస్త్రవేత్తలు అవసరాలకు తగినట్లుగా స్పందించలేని స్ధితికి కారణం పాలకులు, వారి మెప్పు పొందేందుకు తాపత్రయపడే వున్నత విధాన నిర్ణాయక అధికార యంత్రాంగం తప్ప మరొకరు కాదు.భారతీయ రైతులకు మద్దతు, సరైన మార్గం అనే పుస్తకంలో రాసినదాని ప్రకారం ప్రకారం ఎరువుల సబ్సిడీకి ఒక రూపాయి ఖర్చు చేస్తే దాని మీద 88, విద్యుత్‌కు 79, రోడ్లకు 110, కాలువల మీద 0.31 పైసల వంతున తిరిగి ఆదాయం వస్తుంది, అదే వ్యవసాయ పరిశోధనకు ఒక రూపాయి ఖర్చు చేస్తే రు.11.20 ఆదాయం వస్తుందట. అమెరికాలోని వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్ధ(ఐఎఫ్‌పిఆర్‌ఐ) అధ్యయనం ప్రకారం 2030సంవత్సరానికి నిరంతర అభివృద్ధి లక్ష్యాలుగా నిర్ణయించిన పదిహేడింటిలో సగం నెరవేరాలంటే వ్యవసాయమే కీలకమని, దాని మీద పరిశోధనకు చేసే ఖర్చు నిరంతర అభివృద్ధికి తోడ్పడుతుందని, మిగతావాటితో పోల్చితే మరింతగా వనరుల సమపంపిణీ జరుగుతుందని తేలింది.

చైనా వ్యవసాయ పరిశోధనా రంగంలో ప్రభుత్వ వ్యవస్ధదే పైచేయి. ప్రయివేటు రంగం కూడా వుంది. ప్రభుత్వరంగ అదుపు అంటే వ్యవసాయ పరిశోధన ప్రజలకు చెందినది అన్న చైనా కమ్యూనిస్టు పార్టీ అవగాహన. దాని మీద చేసే ఖర్చు ప్రజలదే, వచ్చే ఫలితాలు కూడా ప్రజలకే చెందాలి. ఒక ప్రయివేటు కంపెనీ ఒక అంశంపై కేంద్రీకరించి దాని మీదే పని చేస్తుంది. కానీ ప్రభుత్వం అలా వ్యవహరించలేదు. దీన్ని చూపి ప్రభుత్వ రంగం వుత్సాహాన్ని నీరుగార్చుతుంది అని కొందరు చిత్రించవచ్చు. అటువంటి స్ధితి నుంచి ఎలా ముందుకు పోవాలా అన్నది చర్చించవచ్చు, మార్గం కనుగొనవచ్చు. చైనా సర్కార్‌ ఈ అంశం మీద అభిప్రాయాలు, సూచనలు తీసుకొంటోంది.చైనా వ్యవసాయ రంగంలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో జనం పని చేస్తున్నారు. అందువలన ఆ రంగాన్ని కమ్యూనిస్టు పార్టీ విస్మరించజాలదు. వ్యవసాయ అభివృద్ధికి చైనా ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఒక అధ్యయన పత్రం పేటెంట్ల రూపంలో వెల్లడించింది. 1985-2009 మధ్య స్ధానిక పేటెంట్‌ దరఖాస్తులు 69రెట్లు పెరగ్గా, విదేశీ పేటెంట్ల దరఖాస్తులు తొమ్మిది రెట్లు వున్నాయి. స్ధానిక దరఖాస్తులలో నవకల్పన లేదా సృష్టిగా 57.2శాతానికి గుర్తింపు వచ్చింది. విదేశీ దరఖాస్తుల విషయంలో అది 99శాతం వుంది.

వ్యవసాయానికి సబ్సిడీల ద్వారా చేయూత నివ్వటం బుద్దితక్కువ వ్యవహారమని మన దేశంలో కొందరి వాదన. సబ్సిడీలు ఇచ్చి అసమర్ధతను పెంచుతున్నారని, దాని కంటే ఆ రంగంలో పెట్టుబడులు పెట్టి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తేవటం వలన ఎక్కువ ప్రయోజమన్నది వారి భావం. యూరియాకు పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తున్నందువలన దాన్ని దుర్వినియోగ పరచి అతిగా వాడి భూములు దెబ్బతినటానికి కారకులౌతున్నారని, అవసరం కంటే విలువైన నీటిని అధికంగా వాడి దుర్వినియోగం చేస్తున్నారని రైతుల మీద చేసే ఆరోపణ గురించి తెలిసిందే. మిగతా ఎరువులను సరసమైన ధరలకు అందిస్తే ఏ రైతూ తన భూమిని పనికిరాకుండా చేసుకోడు.అలాగే రైతాంగానికి సరైన మార్గదర్శనం చేస్తే నీటి దుర్వినియోగమూ వుండదు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు 1980-81లో 3.9శాతంవుండగా 2014-15 నాటికి 2.2శాతానికి( 2016-17లో 2.6) తగ్గిపోగా ఇదే కాలంలో పెట్టుబడుల సబ్సిడీల మొత్తం 2.8 నుంచి 8శాతానికి పెరిగిందని సపోర్టింగ్‌ ఇండియన్‌ ఫార్మర్స్‌, ది స్మార్ట్‌ వే( భారతీయ రైతులకు మద్దతు, సరైన మార్గం) అనే పేరుతో రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. పెట్టుబడులకు-సబ్సిడీలకు లంకె పెట్టటం అసంబద్దం. పెట్టుబడులు పెట్టద్దని ఏ రైతూ అడ్డుకోలేదు. ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాల కారణంగా ఎరువులు, విద్యుత్‌ వంటివి రైతాంగానికి భారం అవుతున్నాయనే విషయం తెలిసిందే.ఇలాంటి అంశాల గురించి మేథోమధనం, అధ్యయనాలు జరిపి ఒక మార్గం కనుగొనటం కష్టమేమీ కాదు. ఏ రంగంలో అయినా ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది అంటే దాని వలన వచ్చే లాభం పౌరులందరికీ చెందుతుంది. ప్రభుత్వాలు మిలిటరీ, పోలీసు, కరెన్సీ, దేశ సరిహద్ధు భద్రతల వంటి విషయాలకే పరిమితమై మిగిలిన అన్ని అంశాలను ప్రయివేటురంగానికి వదలి వేయాలన్నది ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్ధ వంటి బహుళజాతి గుత్త సంస్ధల కనుసన్నలలో వాటి ప్రయోజనాలకు అనుగుణంగా పని చేసే సంస్ధలు ఆదేశం. ప్రపంచంలో ఏడు బడా కంపెనీలు వ్యవసాయ రంగంలో పరిశోధనకు ఏటా ఏడువందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ మొత్తం మన దేశంలో భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఖర్చుకు ఏడు రెట్లు ఎక్కువ. మనం చేసే ఖర్చు మన అవసరాలకు తగినదిగా లేదన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా డెమోక్రటిక్‌ పార్టీలో అణగారిన తరగతుల ముందంజ !

12 Monday Nov 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ 1 Comment

Tags

2018 US midterm elections, Democratic Socialists of America, Donald trump, US Democratic party, US Republican party

ఎం కోటేశ్వరరావు

నవంబరు ఆరవ తేదీన అమెరికా పార్లమెంట్‌కు జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు సెనెట్‌ విషయంలో తప్ప ప్రజాప్రతినిధుల సభ(కాంగ్రెస్‌) విషయంలో సర్వేల విశ్లేషణకు దగ్గరగానే వచ్చాయి. ఎగువ సభ సెనెట్‌లో ఎలాగైనా సరే మెజారిటీ సాధించాలనే పట్టుదలతో కేంద్రీకరించిన అధ్యక్షుడు డ్రోనాల్డ్‌ ట్రంప్‌కు సభలోని వందకు గాను చావుదప్పి కన్నులట్టపోయి రిపబ్లికన్‌ పార్టీకి 51వచ్చాయి. డెమోక్రాట్లకు 44, స్వతంత్రులకు రెండు రాగా తిరిగి ఓట్ల లెక్కింపు జరుగుతున్న మరో మూడు స్ధానాల ఫలితాలను ఖరారు చేయాల్సి వుంది. ప్రజాప్రతినిధుల సభలో ట్రంప్‌ బక్కబోర్లా పడ్డారు, డెమోక్రటిక్‌ పార్టీకి మెజారిటీ వచ్చింది. ట్రంప్‌ పాలనపై ప్రజాభిప్రాయ సేకరణగా భావించబడిన ఈ ఎన్నికలలో దిగువ సభలోని మొత్తం 435 స్ధానాలకు గాను ఆ పార్టీకి 227, రిపబ్లికన్లకు 198 రాగా మరో పదింటి ఫలితాలను ప్రకటించాల్సి వుంది. ఈ ఫలితాలతో అమెరికాలో విప్లవాత్మక మార్పులేవో జరుగుతాయని కాదు గానీ డెమోక్రటిక్‌ పార్టీలో అంతర్గతంగా ప్రారంభమైన మధనానికి ఎంతో ప్రాధాన్యత వుంది. ఫలితం, పర్యవసానాల గురించి వామపక్ష,పురోగామి శక్తులు తరువాతేంటి అనే ఆలోచన చేస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించగానే అనేక తరగతుల వారు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తమ సమస్యలపై వీధుల్లోకి వచ్చారు. అధికార పార్టీ అక్రమాలు, ప్రలోభాలను తట్టుకొని వుద్యమించిన వారి ఆకాంక్షలకు ప్రతిబింబంగా తాజా ఫలితాలు వచ్చాయని చెప్పవచ్చు.ఈ ఎన్నికల్లో కార్మికులు, మహిళలు, ఆఫ్రికన్‌ అమెరికన్లు, లాటినోలు, గిరిజనులు మొత్తంగా డెమోక్రాట్లు విజయం సాధించారు. అన్నీ తానై వ్యవహరించినందున రిపబ్లికన్ల ఓటమి అంటే అది వాస్తవానికి డోనాల్డ్‌ ట్రంప్‌కే వర్తిస్తుందని చెప్పవచ్చు. మన పదజాలంలో చెప్పాలంటే అమెరికాలోని సకల అణగారిన తరగతులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఓట్లు వేసి ట్రంప్‌కు చుక్కలు చూపించారు. గమనించాల్సిన ముఖ్యఅంశాలు ఇలా వున్నాయి.

అనేక దశాబ్దాల చరిత్ర చరిత్రలో తొలిసారిగా డెమోక్రటిక్‌ పార్టీలో అనేక మంది పురోగామి వాదులు(అమెరికా ప్రమాణాల ప్రకారం) ఎక్కువగా ఎన్నికయ్యారు. డోనాల్డ్‌ ట్రంప్‌, ఆ పెద్దమనిషి ప్రాతినిధ్యం వహిస్తున్న మితవాద రిపబ్లికన్‌ పార్టీ సాగించిన మహిళా వ్యతిరేక, శ్వేతజాతి మెజారిటీ నినాదాలకు చెంపపెట్టుగా అసాధారణ రీతిలో మహిళలు, రంగు వివక్షకు, జాతిపరంగా వివక్షకు గురయ్యేవారు, ఇతరులు డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. కరడు గట్టిన ఐదుగురు రిపబ్లికన్‌ గవర్నర్లను(మన ముఖ్యమంత్రులకు సమానం) ఓటర్లు ఇంటికి పంపారు. అతి పెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియాలో, ప్రపంచ ఆర్ధిక రాజధాని వంటి న్యూయార్క్‌ రాష్ట్రంలోనూ డెమోక్రాట్లదే పైచేయి. గవర్నర్లుగా వారే ఎన్నికయ్యారు. వర్గరీత్యా రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలు మౌలికంగా పెట్టుబడిదారీ విధాన ప్రతినిధులే. అందువలన అధికారంలోకి వచ్చిన తరువాత సహజంగానే ప్రజావ్యతిరేకతను వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఆ రీత్యా చూసినపుడు గతంలో ఒబామా ఎనిమిదేండ్లు అధికారంలో వున్న సమయంలో వివిధ రాష్ట్రాల చట్ట సభలలో వెయ్యి మంది వరకు డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన వారు మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ ట్రంప్‌ రెండు సంవత్సరాల ఏలుబడిలోనే 323 మంది రిపబ్లికన్లు ఇంటిదారి పట్టారు. గెలిచిన రాష్ట్రాల నియోజకవర్గాలలో పురోగామివాదుల నుంచి వంద చోట్ల మితవాదులవైపు మొగ్గగా 300చోట్ల తిరోగామి వాదులను ఓడించి పురోగామివాదుల వైపు ఓటర్లు నిలిచారు.కొన్ని చోట్ల పురోగామి అభ్యర్ధులు ఓటమి పాలైనా మొత్తం మీద ఆశక్తులతో నిండిన బృందాలు ఈ ఎన్నికలను తీవ్రంగా తీసుకోవటం మంచి పరిణామం. గతంలో ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన శివారు పట్టణాలలోని శ్వేతజాతి మహిళలు అనేక మంది ఈసారి రిపబ్లికన్లకు దూరమయ్యారు.గత రెండు సంవత్సరాలలో వివిధ సమస్యల మీద సాగించిన ఆందోళనల ఫలితాలు ఈ ఎన్నికల్లో ప్రతిబింబించాయి.ఎన్నికలకు ముందు కొన్ని చోట్ల కనీస వేతనాల పెంపుదల జరిగింది. నేరాలు చేశారనే సాకుతో ఫ్లోరిడా రాష్ట్రంలో ఓటు హక్కు తొలగించిన 14లక్షల మందికి ఈ ఎన్నికల్లో పునరుద్దరించారు.

ప్రజాప్రతినిధుల సభలో, వివిధ రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికలో గణనీయ విజయాలు సాధించిన డెమోక్రాట్లు సెనెట్‌లో ఎందుకు మెజారిటీ సాధించలేకపోయారు అన్నది సహజంగా తలెత్తే ప్రశ్న. సెనెట్‌ ఎన్నికలలో రిపబ్లికన్‌ అభ్యర్ధుల కంటే డెమోక్రాట్లకు కోటీ ఇరవై లక్షల ఓట్లు అదనంగా వచ్చాయి. సెనెట్‌ రాష్ట్రాల ప్రతినిధుల సభ. జనాభా ఎంత మంది అనేదానితో నిమిత్తం లేకుండా ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు చొప్పున యాభై రాష్ట్రాల నుంచి ఎన్నిక అవుతారు. యోమింగ్‌ రాష్ట్ర జనాభా ఆరులక్షలు లోపు, అదే కాలిఫోర్నియా జనాభా దానికి 60రెట్లు ఎక్కువ, అయినా రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరిద్దరిని మాత్రమే ఎన్నుకోవాల్సి వుంది. సాంప్రదాయకంగా గ్రామీణ ప్రాంతాలలో రిపబ్లికన్లవైపే ఓటర్లు మొగ్గు వుంటోంది. ఇది కూడా సెనెట్‌ ఎన్నికలపై ప్రభావం చూపుతోంది.ఈ విధానంలో రాష్ట్రాల సమాన ప్రాతినిధ్యం అనే ప్రజాస్వామిక అంశంతో పాటు, జనాభాతో నిమిత్తం లేని ప్రజాస్వామ్య వ్యతిరేక లక్షణం కూడా వుంది. ఇదొక్కటే కాదు, ఇంకా ఇలాంటివి వున్నాయి. ట్రంప్‌ గత ఎన్నికలలో ఎలక్ట్రొరల్‌ కాలేజ్‌లో మెజారిటీ తెచ్చుకొని అధ్యక్షుడు అయినప్పటికీ సాధారణ ఓటర్ల తీర్పు ప్రకారం ప్రత్యర్ధి హిల్లరీ క్లింటన్‌ కంటే 30లక్షల ఓట్లు తక్కువ వచ్చాయి. ప్రజాప్రతినిధుల ఓట్ల వివరాలను చూస్తే డెమోక్రాట్లకు ఏడు శాతం అధికంగా వచ్చాయి.

Image result for democratic winner alexandria

అలెగ్జాండ్రియా కాసియో కార్టెజ్‌

ప్రజాప్రతినిధుల సభకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే సెనెట్‌కు ప్రతి రెండు సంవత్సరాలకు మూడోవంతు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇది రాస్తున్న సమయానికి ఖరారైన ఫలితాల ప్రకారం డెమోక్రాట్లు గతంలో ప్రాతినిధ్యం వహించిన సీట్లలో రెండు చోట్ల ఓడిపోగా రిపబ్లికన్లు వున్న చోట్ల 29 గెలిచారు. సెనెట్‌లో రెండు చోట్ల డెమోక్రాట్లను రిపబ్లికన్లు ఓడించి (100కు 51) ఒక సీటు మెజారిటీ తెచ్చుకున్నారు.ఎన్నికలు జరిగిన 35 సీట్లలో డెమోక్రాట్లు 26చోట్ల రిపబ్లికన్లు తొమ్మిది చోట్ల గతంలో ప్రాతినిధ్యం వహించారు. తాము అధికారంలో రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాలను తమకు అనుకూలంగా రిపబ్లికన్లు పునర్విభజన చేశారని కూడా వెల్లడైంది.అయినా కొన్ని చోట్ల డెమోక్రాట్లు విజయం సాధించారు. 2020లో జరిగే ఎన్నికల నాటికి డెమోక్రాట్లు కూడా అదే ఎత్తుగడలను అనుసరించే అవకాశం వుంది. తాజా ఎన్నికల్లో కొన్ని చోట్ల రిపబ్లికన్లు కుంటి సాకులతో డెమోక్రాట్లకు పడే ఓటర్లను అడ్డుకున్నారు. దానికి సుప్రీం కోర్టు మద్దతు కూడా తోడైంది. అమెరికాలోని అడవులలో నివసించే గిరిజన ప్రాంతాలలో ఓటర్లకు పోస్టు బాక్సు నంబర్లే చిరునామాలుగా వుంటాయి. ఓటరు గుర్తింపు కార్డుకు, ఓటర్ల జాబితాలో పేర్లకు అన్నీ సరిపోలి వుండాలనే ఒక నిబంధన వుంది. పేర్లలో కామాలు, పులుస్టాప్‌లు, పేరులో మధ్యనామం సరిగా లేదు, వుచ్చారణ సరిగా లేదు అనే కుంటిసాకులను చూపి వేల ఓట్లను తిరస్కరించారు. వుత్తర డకోటా ప్రాంతంలో గిరిజన ప్రాంతాలలో వీధుల వివరాలు లేవనే సాకుతో వేలాది మంది ఓటర్లను తిరస్కరించారు. ఈ కారణం కూడా తోడై గతంలో ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికైన డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిని ఈసారి ఓడిపోయారు.

Image result for democratic winner rashida

రషీదా లాయిబ్‌

అమెరికా చరిత్రలో తొలిసారిగా ఒక గవర్నర్‌ పదవికి నల్లజాతి మహిళ స్టాసీ అబ్రామ్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధిగా జార్జియా రాష్ట్రానికి ఎన్నికయ్యారు. పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారిగా వందమందికి పైగా మహిళలు ఎన్నికవ్వటం ఒక విశేషం. ఎన్నికైన మహిళల్లో 29 ఏండ్ల పిన్న వయస్కురాలు అలెగ్జాండ్రియా కాసియో కార్టెజ్‌, ఆమె ఒక బార్‌లో వెయిట్రెస్‌( మద్యం, ఆహారపదార్దాల అందచేసే పని)గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. న్యూయార్క్‌ నగరంలోని బ్రాంక్స్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆమె తాను డెమోక్రటిక్‌ సోషలిస్టునని స్వయంగా ప్రకటించుకున్న యువతి. సోమాలియా నుంచి నిర్వాసితురాలిగా అడుగుపెట్టి అమెరికా పౌరసత్వం పొంది మినియా పోలీసు నుంచి డెమోక్రటిక్‌ పార్టీ నుంచి ఎన్నికైన తొలి సోమాలి-అమెరికన్‌ మహిళ ఇహాన్‌ ఓమర్‌. మైనారిటీల సమస్యల మీద పని చేస్తూ ట్రంప్‌ సర్కార్‌ వలసదార్ల వ్యతిరేక వైఖరిని ఎండగట్టటంలో ముందున్నారు.డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధిగా మసాచుసెట్స్‌ నగరంలోని ఒక నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా తొలిసారిగా ఎన్నికయ్యారు అయనా ప్రెస్లే. అంతకు ముందు బోస్టన్‌ నగరపాలక సంస్ధ సభ్యురాలిగాను, పదహారు సంవత్సరాల పాటు పార్లమెంట్‌ కార్యాలయంలో పని చేశారు. డెమోక్రటిక్‌ సోషలిస్టుగా ప్రాచుర్యం పొందిన రషీదా లాయిబ్‌ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళ. ఆమె పోటీ లేకుండా గెలిచారు. కాన్సాస్‌ నుంచి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులుగా గిరిజన మహిళలు షారైస్‌ డేవిడ్స్‌, డెబ్రా హాలాండ్‌ కాన్సాన్‌, న్యూ మెక్సికో నుంచి ఎన్నికయ్యారు. ఇరవై తొమ్మిది సంవత్సరాల మరో పిన్న వయస్సురాలైన అబీ ఫిన్‌కెనౌర్‌ లోవా నియోజకవర్గం నుంచి ఎన్నికైన తొలి మహిళ, డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధి.

యాభై సంవత్సరాల క్రితం మధ్యంతర ఎన్నికల్లో 49శాతం పోలింగ్‌ కాగా తాజా ఎన్నికల్లో దానికి దగ్గరగా 47శాతానికి మించి పోలు కావటం ఓటర్లలో పెరిగిన ఆసక్తి, వుత్సాహానికి నిదర్శనం. కొన్ని చోట్ల 60శాతం వరకు నమోదైంది. ఎనిమిది సంవత్సరాల క్రితం 41శాతం, నాలుగు సంవత్సరాల నాడు 36.7శాతమే నమోదైంది. ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకతతో పాటు గెలిచిన అభ్యర్ధులను పరిశీలిస్తే పురోగామి వాదులను గెలిపించాలన్న తపన పలు తరగతుల ఓటర్లలో వుందనటానికి ఇది ఒక సూచిక. గత నాలుగు సంవత్సరాలలో అనేక ఓట్లను జాబితా నుంచి తొలగించటంతో అనేక మంది పట్టుదలగా ఓట్లు నమోదు చేయించుకొని పోలింగ్‌కు వచ్చారు. గుర్తింపు కార్డుమీద పూర్తి చిరునామా వుండాలన్న నిబంధన కొద్ది వారాల ముందే విధించటంతో గిరిజనులు పెద్ద ఎత్తున కొత్త గుర్తింపుకార్డులు అచ్చువేయించుకొనేందుకు రావటంతో తొక్కిసలాట పరిస్ధితి ఏర్పడింది. చాలా మంది సమగ్రగుర్తింపు కార్డు లేకపోవటంతో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. అయినా నాలుగు సంవత్సరాలతో పోల్చితే గిరిజనులు రెట్టింపు మంది ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.

కార్మిక సంఘాలను, ఆందోళలను వ్యతిరేకించే రిపబ్లికన్లు ఓడించి పలువురు కార్మిక నేతలు ఎన్నికయ్యారు. వారిలో ఆండీ లెవిన్‌, రోజా డెలారో డి కాన్‌, బాబీ స్కాట్‌, జోహనా హేస్‌, కేంద్రా హారన్‌(తొలి గిరిజన మహిళ)ఎన్నికయ్యారు. అనేక మంది కార్మిక ప్రతినిధులు స్వల్పతేడాతో ఓడిపోయారు. ముఖ్యమైన విజయంగా విస్కాన్‌సిన్‌ రాష్ట్రంలో కార్మిక సంఘాలను తీవ్రంగా వ్యతిరేకించిన రిపబ్లికన్‌ గవర్నర్‌ను టోనీ ఎవర్స్‌ ఓడించారు. ఏడు సంవత్సరాల క్రితం రాష్ట్ర అసెంబ్లీని దాదాపు లక్ష మంది కార్మికులు ముట్టడించి నిరసన తెలపటానికి రిపబ్లికన్‌ గవర్నర్‌ వైఖరే కారణం. పార్లమెంట్‌, అసెంబ్లీలకు 743మందికార్మిక సంఘాల నేతలు ఎన్నికయ్యారు. మొత్తం శాసనసభ్యులలో దాదాపు పదో వంతు. మినెసోటా గవర్నర్‌గా టిమ్‌ వాల్జ్‌ (అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టీచర్స్‌ నేత) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో తాము 23.5లక్షల ఇండ్లకు వెళ్లామని, పని కేంద్రాలలో 50లక్షల కరపత్రాలు, కోటీ ఇరవైలక్షల ఇమెయిల్స్‌, 2,60,094 ఎస్‌ఎంఎస్‌లు, సామాజిక మీడియాలో 6.9కోట్ల పోస్టింగులతో ప్రచారం నిర్వహించినట్లు అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య ఎఎఫ్‌ఎల్‌-సిఐఓ ప్రతినిధి తెలిపారు.

ఈ ఎన్నికలలో ప్రవాస భారతీయులు, వారి సంతతికి చెందిన వారు డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అనేక మంది చట్టసభలకు ఎన్నికయ్యారు. డాక్టర్‌ అమీ బెరా వరుసగా నాలుగవ సారి కాలిఫోర్నియా నుంచి ఎన్నికయ్యారు. ఇలినాయిస్‌ నుంచి రెండవ సారి రాజా కృష్ణమూర్తి, సిలికాన్‌ వాలీ నుంచి రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌ సియాటిల్‌ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. వివిధ రాష్ట్రాల శాసనసభలకు విస్కాన్సిన్‌ నుంచి అటార్నీ జనరల్‌ స్ధానానికి జోష్‌ కౌల్‌, కెంటకీలో నీమా కులకర్ణి, అరిజోనా నుంచి అమిష్‌ షా, న్యూయార్క్‌ సెనేట్‌కు కెవిన్‌ ధామస్‌, వుత్తర కరోలినా సెనేట్‌కు మజతాబా మహమ్మద్‌, జయా చౌధురి డెమోక్రటిక్‌ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఇంకా నీరజ్‌ అతానీ(ఓహియో), మంకా ధింగ్రా( వాషింగ్ట్‌న్‌), సబీకుమార్‌(టెనెసీ), ఆషా కార్లా(కాలిఫోర్నియా) కుమార్‌ భారవే(మేరీలాండ్‌), జూలీ మాథ్యూ, కెపి జార్జి(టెక్సాస్‌), షాలినీ (మసాచుసెట్స్‌) ఎన్నికయ్యారు.

సోషలిజం పట్ల ఓటర్లలో డెమోక్రటిక్‌ పార్టీలో వెల్లడౌతున్న సానుకూల వైఖరి, ఈ ఎన్నికలలో అణగారిన వర్గాలుగా వున్నవారు గణనీయంగా విజయం సాధించటంతో అమెరికాలోని వామపక్ష శక్తులలో తదుపురి ఏమిటి అన్న చర్చ మరింతగా పెరుగుతున్నది. మరింత విశాలంగా ఆలోచించాలి, పెద్ద ఎత్తున సమీకరించాలన్నది ఒక అభిప్రాయం. రిపబ్లికన్‌ పార్టీ లేదా ట్రంప్‌ మద్దతుదారులందరూ జాత్యంహకారులు, వలసకార్మికులకు, మహిళలకు వ్యతిరేకం కాదని అందువలన మితవాదులు కాని వారిని ఆకర్షించటం ఎలా అన్నది మధిస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలో పెట్టుబడిదారీవర్గాన్ని బలపరిచే శక్తులదే పైచేయి అయినప్పటికీ పార్టీలోని పురోగామిశక్తులలో సోషలిస్టు తిరుగుబాటు రాజుకుంటున్నది. కొంత కాలం క్రితం ఆ పార్టీలో సోషలిస్టులుగా వున్నవారు తమ వైఖరికి కట్టుబడి పోరాడాలా వద్దా అనే గుంజాటనలో వుండేవారు. అయితే 2008తలెత్తిన తీవ్ర మాంద్యం, వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం, నల్లజాతీయుల జీవన్మరణ సమస్య, పర్యావరణ సమస్యలు తీవ్రతరం గావటం, సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ తాను సోషలిస్టును అని బహిరంగంగా ప్రకటించుకొని ప్రచారం చేయటం వంటి పరిణామాలతో ఇప్పుడు లక్షల మంది మేం కూడా సోషలిస్టులమే అని ప్రకటించుకున్నారు. ఈ పరిస్ధితుల్లో సోషలిస్టులేమి చేయవచ్చు అన్న చర్చ ప్రారంభమైంది.

బెర్నిశాండర్స్‌ వంటి కొంత మంది కార్మికవర్గం, సామాజిక వుద్యమాల గురించి మాట్లాడటం ఒక ముందడుగు. వారు అంతవరకే పరిమితం గాకుండా కార్మికుల ఆందోళనల దగ్గరకు వెళ్లేందుకు కూడా సిద్ధ పడుతున్నారు. ఒక విధంగా సోషల్‌ డెమోక్రాట్స్‌ మాదిరి వ్యవహరిస్తున్నారు. అంటే డెమోక్రటిక్‌ పార్టీ నాయకత్వంలోకి సోషల్‌ డెమోక్రాట్లను తీసుకు వచ్చి పురోగామి శక్తులను ఎన్నికలలో నిలబెట్టి కార్మికవర్గ సమస్యలను పరిష్కారించాలనే వైఖరికి అలాంటి వారు ప్రతినిధులు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్ధను సంస్కరించగలమనే నమ్మకం వున్నవారు, సంస్కరిస్తే చాలు సమస్యలు పరిష్కారమౌతాయనే భ్రమలు కలిగిన వారు. మరో రెండు సంవత్సరాలలో జరిగే ఎన్నికలలో ఈ పరిస్ధితి బెర్నీశాండర్స్‌ అభ్యర్ధిత్వం మీద ఎలా పని చేస్తున్నందన్నది ప్రశ్న.

డెమోక్రటిక్‌ పార్టీని సంస్కరించటం జరిగేది కాదు, ఆ పార్టీలో డెమోక్రటిక్‌ సోషలిస్టులుగా వున్న అలెగ్జాండ్రా కాసియో కోర్టెజ్‌, రషీదా లాయిబ్‌ వంటి విజయం సాధించిన వారి మాదిరి గాకుండా సోషలిస్టులే ప్రత్యక్షంగా పోటీ పడాలన్నది మరొక వాదన. ఎన్నికైన పురోగామి వాదులు వర్గపోరాటాలను ప్రోత్సహించేందుకు ముందుగా సోషలిస్టు బృందంగా ఏర్పడే అవకాశాలున్నాయని కొందరి అంచనా. ఇప్పుడు ఎన్నికైన సోషలిస్టులు సమన్వయంతో పని చేస్తూ కార్మిక పోరాటాలు, పార్లమెంటరీ, పార్లమెంటేతర కార్యక్రమాలలో తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవటం ద్వారా మరింత బలమైన శక్తిగా రూపొందేందుకు అవకాశం వుంటుందన్న సూచనలు కూడా వెల్లడయ్యాయి.

ఈ ఎన్నికలలో వామపక్ష అభ్యర్ధులు ఓటమి పొందినప్పటికీ వారు చేసిన డెమోక్రటిక్‌ సోషలిస్టు ప్రచారం, కార్యాచరణ వృధాకాదు. బెర్నీశాండర్స్‌ వంటి వారు చేసిన ప్రచారం, భావజాలం కార్మికవర్గ జీవితాలలో కొద్ది మార్పు చెందేందుకు దారితీసేదిగా వుంటుంది, అయితే అందరికీ ఆరోగ్యం, కాలేజీ విద్య వుచితం, విద్యార్ధి రుణాల రద్దు వంటి డిమాండ్లకు బహిరంగంగా మద్దతు ప్రకటించేందుకు కొందరు డెమోక్రాట్లను పురిగొల్పింది. రాష్ట్రాల అసెంబ్లీలలో తాము డెమోక్రటిక్‌ సోషలిస్టులం అని చెప్పుకున్న వారు కేవలం ముగ్గురే వుండగా ఈ సారి అలాంటి వారు పది మంది ఎన్నికయ్యారు.మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్యతో పోలిస్తే లెక్కలోకి తీసుకోవాల్సిన సంఖ్యగాక పోయినా సోషలిస్టులమని చెప్పుకొని పోటీ చేసే వారు ముందుకు రావటం గమనించాల్సిన అంశం. ఇలాంటి వారిని నిరుత్సాహపరిచేందుకు, దెబ్బతీసేందుకు డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాదులు, సోషలిస్టు వ్యతిరేకులు అడుగడుగునా ప్రయత్నిస్తారని వేరే చెప్పనవసరం లేదు.

అమెరికాలో ఇప్పుడు రెండు రకాల సోషలిస్టులు, డెమోక్రటిక్‌ పార్టీలో అంతర్భాగంగా( గతంలో మన స్వాతంత్య్రవుద్యమ సమయంలో కాంగ్రెస్‌ సోషలిస్టుల మాదిరి) పని చేస్తున్న డెమోక్రటిక్‌ సోషలిస్టులు, విడిగా పని చేస్తున్న సోషలిస్టు శక్తులు, కమ్యూనిస్టు పార్టీగా పని చేస్తున్నవారు వున్నారు. ఈ శక్తుల మధ్య ఎలాంటి సంబంధం వుండాలో కూడా చర్చ ప్రారంభించారు. ఇప్పుడు ప్రజాప్రతినిధుల సభలో డెమోక్రటిక్‌ సోషలిస్టులుగా పక్కాగా ప్రకటించుకొని గెలిచిన ఇద్దరు మహిళలు వున్నారు.రానున్న రోజుల్లో డెమోక్రటిక్‌ పార్టీలో వున్న సోషలిస్టులతో మిగతావారందరూ కలసి ఒక ప్రత్యేక పార్టీగా ఏర్పడేందుకు, స్వతంత్ర వైఖరి, కార్యాచరణ, సిద్ధాంత ప్రచారానికి, జరుగుతున్న కార్మిక, వుద్యోగ, వుపాధ్యాయ, సామాజికోద్యమాలతో సమన్వయానికి సిద్ధంగావాలన్న ప్రతిపాదన ఒకటి వుంది. దీనిలో వుండే నష్టాలూ, లాభాల గురించి కూడా ఆలోచించాలని చెబుతున్నారు. అమెరికాలో ప్రారంభమైన ఈ మధనం అక్కడి రాజకీయాలలో గణనీయమైన మార్పులకు, అది మరింత పురోగమనం దిశగా వుంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. విప్లవాలు మనం కోరుకున్నట్లుగా, ఆశించినంత వేగంగా, ఊహించిన చోట రావు అని ఎలా చెబుతామో రావని కూడా చెప్పలేము !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సోషలిజాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన అమెరికా మధ్యంతర ఎన్నికలు !

06 Tuesday Nov 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, Democratic Socialists of America, focus on Socialism, Karl Marx, rise of the left, socialists are coming, US midterm Elections

Image result for karl marx

ఎం కోటేశ్వరరావు

చివరి క్షణంలో అనూహ్య పరిస్ధితులు ఏర్పడితే తప్ప మంగళవారం నాటి అమెరికా పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ వుభయ సభల్లోనూ మెజారిటీ పక్షంగా అవతరించనున్నదని ఎన్నికల సర్వేలు చెప్పాయి. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రేలాపనలు కూడా ఓటర్లనాడి తమకు వ్యతిరేకంగా వుందని వెల్లడించటమే. అయితే పార్లమెంట్‌లో ఎవరికి మెజారిటీ వచ్చినా ఫలితం ఏమిటన్నది అసలు ప్రశ్న. గత ఎన్నికల ఫలితాలను చూస్తే అధికారంలో ఏ పార్టీ అధ్యక్షుడు వుంటే మధ్యంతర ఎన్నికల్లో సదరు పార్టీ ఓడిపోవటం అత్యధిక సందర్భాలలో జరిగింది. అందువల్లనే ప్రతి అధ్య క్షుడు తన సర్వశక్తులూ ఒడ్డి ఓటమిని తప్పించుకొనేందుకు, ప్రతిపక్ష మెజారిటీని బటాబటాగా అయినా వుంచేందుకు ప్రయత్నించాడు. ఇప్పుడు ట్రంప్‌ కూడా అలాంటి విఫల యత్నమే చేసినట్లు చెప్పవచ్చు. గత చరిత్రను చూసినపుడు ఎవరు అధికారంలో వున్నా పార్లమెంటులో ప్రతిపక్షానికి మెజారిటీ వున్నప్పటికీ అధ్యక్షులు లేదా పాలకవర్గం దేశీయంగా కార్మిక వ్యతిరేక, అంతర్జాతీయంగా వివిధ దేశాల పట్ల అనుసరించిన ప్రజాస్వామ్య వ్యతిరేక, స్వార్ధపూరిత, దుర్మార్గ , యుద్ధోన్మాద వైఖరుల్లో ఎలాంటి మార్పు లేదు. అందువలన ఒక విధంగా చూస్తే ఈ ఎన్నికలు కూడా అలాంటివే అన్నది కొందరి అభిప్రాయం.

విప్లవం ! ఈ మాట వింటే కొందరికి భయం, అందువలన ఒక గుణాత్మక మార్పు అందాం. అది ఆలశ్యం అవుతోందని ప్రగతిశీలశక్తులు ఆవేదన చెందుతుంటే , ఆలశ్యంగా అయినా వస్తుందేమో అని దాని గురించి భయపడే వారు ఆందోళన చెందుతారు. ఎవరు అవునన్నా కాదన్నా మార్పు అని వార్యం. అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతోంది, ఒక విధంగా చూస్తే ఈ ఎన్నికల ప్రత్యేకత కూడా అదే.సున్నా కంటే ఒకటి ఎంతో పెద్దది కదా ! సోషలిజం, కమ్యూనిజం అనే పదాలే వినపడకూడదు, అలాంటి భావజాలం వున్న వారు కనపడకూడదు అన్న అమెరికాలో వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నారు. గతేడాది జార్జియాలోని ఓక్‌వుడ్‌ అనే చోట లానియర్‌ టెక్నికల్‌ కాలేజీలో ఆంగ్లబోధన టీచర్‌గా డాక్టర్‌ బిల్‌ ఎలెనెబర్గ్‌ అనే అతను దరఖాస్తు చేశాడు. అతని వివరాలు చూసిన యాజమాన్యం సాహిత్యం, ఇతర అంశాలలో అతని ప్రతిభాపాటవాలను చూసి ఇన్ని తెలివి తేటలున్నాయంటే ఎవడో కమ్యూనిస్టు అయి వుంటాడని భావించి నేను కమ్యూనిస్టును కాదు అని ప్రమాణ పత్రం ఇవ్వాల్సిందే అంటూ బలవంతంగా రాయించుకున్నారు.

అలాంటి చట్టవిరుద్దమైన, కమ్యూనిస్టు వ్యతిరేక పరిస్ధితి వున్న చోట ఈ ఎన్నికల సందర్భంగా అనేక మంది పురోగామివాదులు అంతకు ముందు పాతుకుపోయి వున్నవారిని పెకలించి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులుగా పోటీలోకి వచ్చారు. సంఖ్యరీత్యా వారెంత మంది అనటం కంటే ఓటర్లలో వచ్చిన, వస్తున్న మార్పు ముఖ్యం. ఒకవైపు లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులకు అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి కొన్ని చోట్ల తీవ్రమైన ఎదురుదెబ్బలు తగిలినా అమెరికాలో సోషలిస్టు నినాదం పట్ల పెరుగుతున్న ఆకర్షణ తగ్గలేదు. దీనర్ధం అమెరికాలో వామపక్షాలు త్వరలో అధికారానికి వస్తాయని అతిశయోక్తి చెప్పటం కాదు.అమెరికాలో ఒక పార్టీ తరఫున అభ్యర్ధిగా ఎన్నిక కావాలంటే కొన్ని నెలల ముందే పోటీ చేయాలనుకునే వారు ఆయా నియోజకవర్గాలలో పార్టీ మద్దతు సంపాదించాలి. వాటినే ప్రైమరీలు అంటారు. పార్టీ అంతర్గత ఎన్నికలు జరుగుతాయి. వాటిలో నెగ్గిన వారిని సాధారణంగా అభ్యర్ధులుగా ఆయా పార్టీలు నిర్ణయిస్తాయి. మన దగ్గర మాదిరి కొన్ని పార్టీలలో కార్యకర్తల అభిప్రాయ సేకరణ పేరుతో తమకు కావాల్సిన వ్యక్తిని అభ్యర్ధిగా పెట్టటం సాధారణంగా జరగదు.

జూలై నెలలో బ్రూకింగ్‌ ఇనిస్టిట్యూట్స్‌ ప్రైమరీ ప్రాజక్టు అనే సంస్ధ ఆరువందల స్ధానాల అభ్యర్ధిత్వాలకోసం పోటీ పడిన 1600 మంది డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధుల గురించి విశ్లేషణ చేసింది. ముప్పై ఒక్క రాష్ట్రాలలో 2014ఎన్నికలలో తాము పురోగామి వాదులం అని స్వయంగా చెప్పుకున్న అభ్యర్ధులు కేవలం 60 మంది అయితే తాజా ఎన్నికలలో 280 మంది వున్నారు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో పురోగామివాదులుగా బహిరంగంగా చెప్పుకొని అభ్యర్ధులుగా ఎన్నికైన వారు 24 మంది అయితే తాజా ఎన్నికలలో 81మంది విజయం సాధించటం లేదా విజయబాటలో వున్నట్లు ఆ విశ్లేషణ పేర్కొన్నది. ఇప్పుడు అమెరికాలో పరిస్ధితి ఎలా వుందంటే అందరికీ ఆరోగ్యం అనే నినాదాన్ని బలపరచే వారందరికీ సోషలిస్టు ముద్రను తగిలిస్తున్నారు. దానికి వ్యతిరేకమా అనుకూలమా అనేది డెమోక్రటిక్‌ పార్టీలో ఒక ప్రధాన అంశం. అందరికీ ఆరోగ్యం కావాలనటమే సోషలిజం అయితే మాకది కావాలి, మేమూ సోషలిస్టులమే అని సాధారణ ఓటర్లు ఆ నినాదాన్ని బలపరిచిన వారికి మద్దతుదారులుగా మారుతున్నారంటే అతిశయోక్తి కాదు. డెమోక్రటిక్‌ పార్టీ అంటే గతంలో ప్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ వంటి కులీన వుదారవాదులది పైచేయిగా వుండేది. కానీ ఇప్పుడు వారి సంఖ్య తగ్గిపోతూ రంగు, నల్లజాతి వారి చురుకుదనం పెరుగుతున్నది. న్యూయార్క్‌ నగరంలోని ఒక ఎంపీ స్ధానంలో 20సంవత్సరాల నుంచీ గెలుస్తున్న జో క్రోలేను బార్‌లో పనిచేసిన అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌ అనే 29సంవత్సరాల యువతి ఓడించి యావత్‌ అమెరికాను ఆశ్చర్యపరచింది. స్వాతంత్య్రానికి ముందు మన దేశంలో కాంగ్రెస్‌లో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ మాదిరి డెమోక్రటిక్‌ పార్టీలో బెర్నీశాండర్స్‌ నాయకత్వంలోని డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీలో ఆమె పని చేస్తున్నది. ఇది డెమోక్రటిక్‌ పార్టీలో అంతర్భాగంగానే వుంటుంది. తాము సోషలిస్టులమని బహిరంగంగా చెప్పుకొనే ఒకాసియో వంటి వారు ఆవిర్భవించటం డెమోక్రటిక్‌ పార్టీలోని యథాతధ వాదులకు, మితవాద రిపబ్లికన్లకు ఆందోళన కలిగించే అంశమే.

On the 200th anniversary of Karl Marx’s birth, the report breathlessly notes, ‘Detailed policy proposals from self-declared socialists are gaining support in Congress and among much of the electorate.’

‘కారల్‌ మార్క్స్‌ 200వ జన్మదినోత్సవ సంవత్సర సందర్భోచితంగా అమెరికా రాజకీయ చర్చలలో సోషలిజం తిరిగి చోటుచేసుకుంటున్నది. సోషలిస్టులం అని స్వయంగా చెప్పుకుంటున్నవారి నుంచి వచ్చిన వివరణాత్మక విధాన ప్రతిపాదనలకు పార్లమెంటులోమరియు ఎక్కువ మంది ఓటర్లలో మద్దతు పెరుగుతున్నది’ అని అమెరికా అధ్యక్ష భవనంలోని ఆర్ధిక సలహాదారుల మండలి అక్టోబరు 23న ఒక శ్వేతపత్రంలో పేర్కొన్నది. 1950దశకంలో అమెరికా నలుమూలల సోవియట్‌ యూనియన్‌ పట్ల పెరిగిన కమ్యూనిస్టు సానుభూతి అమెరికన్‌ పాలకవర్గాలను భయపెట్టినట్లుగా ఇప్పుడు సోషలిజం గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నదనటానికి ఈ నివేదిక ఒక సూచిక. ఓటర్లను భయపెట్టేందుకు, సోషలిస్టులుగా ప్రకటించుకున్నవారిని ఓడించేందుకే సరిగా ఎన్నికల ముందు దీనిని విడుదల చేశారని వేరే చెప్పనవసరం లేదు. దాని కొనసాగింపుగానే పోలింగ్‌కు ఇంకా కొద్ది గంటల వ్యవధి వుందనగా ట్రంప్‌ కుటుంబం ఓటర్ల ముందు సోషలిస్టు బూచిని చూపింది. డెమోక్రాట్లు గెలిస్తే అరాచకం, సోషలిజాలను తీసుకువస్తారనే యుగళగీతాన్ని వారు అలపించారు. టీవీ యాంకర్‌ మరియు ట్రంప్‌ కోడలైన లారా ట్రంప్‌ తన మామ ఎజండాను అడ్డుకొనేందుకు డెమోక్రాట్లు వూహించటానికి కూడా వీలు లేని అంశాలను ముందుకు తెచ్చారని ఆరోపించింది. వారు సోషలిజం గురించి మాట్లాడుతున్నారు, మనం దాన్ని మరిచిపోరాదు, అది చాలా భయంకరమైనది, ప్రతి ఒక్కరూ దీనిమీద దృష్టి సారించాలి అని సెలవిచ్చింది. నాన్సీ పెలోసీ, చుక్‌ స్కుమర్‌ వంటి వారు పార్లమెంటులో వుంటే రానున్న రెండు సంవత్సరాలూ అరాచకమే, మా నాన్నను అడ్డుకుంటారు, మూక పాలనను ప్రవేశపెడతారు. ఎవరైనా తమ దేశభక్తి సూచనలను వెల్లడిస్తూ కార్లమీద అమెరికా జండాలను కడితే కార్లను తగులబెడతారు, నా తండ్రి విధ్వంసానికి వ్యతిరేకంగా వుపాధి చూపేందుకు ప్రయత్నిస్తున్నాడు, వారు వస్తే పన్నులను రెట్టింపు చేస్తారు, అది మాంద్యానికి లేదా సంక్షోభానికి దారి తీయవచ్చు, వారు చట్టాల అమలును అడ్డుకొని దాడులు చేస్తారు. అందుకే రిపబ్లికన్లకు ఓట్లు వేయాలి. అని ట్రంప్‌ కుమారుడు ఎరిక్‌ ఆరోపించాడు.

సోషలిజం వాస్తవిక ముప్పు తెస్తోందనటానికి ఈ అధ్యయనం ఒక రుజువు అని ఫాక్స్‌ న్యూస్‌ యాంకర్‌ సీన్‌ హానిటీ వర్ణించాడు. అందరికీ ఆరోగ్యం అని డెమోక్రటిక్‌ సోషలిస్టు బెర్నీ శాండర్స్‌ ప్రతిపాదించిన విధానాన్ని అమలు జరపాలంటే పదేండ్ల వ్యవధిలో 32.6లక్షల కోట్ల డాలర్ల వ్యయం అవుతుంది. అంత మొత్తాన్ని జనానికి ఖర్చు చేసేందుకు కార్పొరేట్‌ శక్తులు అంగకరించటం లేదు. అమలు జరిగితే జిడిపి పడిపోతుందని, పన్నులు పెరుగుతాయని, అమలు జరుగుతున్న ఇతర సంక్షేమ చర్యలకు కోతపడుతుందని రిపబ్లికన్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియా సర్వేల ప్రకారం ఈ విధానానికి మద్దతు ఇస్తున్న వారు డెమోక్రటిక్‌ అభ్యర్ధులలో సగానికి మించి వున్నారు. వారు కనుక ఎన్నికైతే రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో అందుకోసం పట్టుబట్టటం అనివార్యం. ఒకవైపు సోషలిస్టు నినాదం పట్ల సామాన్య ఓటర్లు అకర్షితులౌతుంటే మితవాద ఓటర్లను నిలుపుకొనేందుకు, ఆకట్టుకొనేందుకు డెమోక్రటిక్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు నాన్సీ పెలోసీ వంటి వారు మేము పెట్టుబడిదారులం అదే సరైన మార్గం అని ప్రకటించుకున్నారు. ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు ట్రంప్‌ రెచ్చగొట్టని అంశం లేదు, చేయని వక్రీకరణ, ఆడని అబద్దం లేదు. అయితే అధికారానికి వచ్చిన 649రోజుల్లో రోజుకు పది వంతున 6,420 వక్రీకరణలు, అబద్దాలు చెప్పినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ప్రకటించింది. డెమోక్రాట్లు రెట్టింపు లేదా మూడు రెట్లు పన్నులు పెంచాలని కోరుకుంటున్నారు, దేశం మీద సోషలిజాన్ని రుద్దాలని, అమెరికా సరిహద్దులను చెరిపివేయాలని చూస్తున్నారు. దేశంలోకి అక్రమంగా వలసలు వచ్చే వారిని బిడారులుగా ఒకదాని తరువాత ఒకదానిని ఆహ్వానిస్తున్నారు. అది మన దేశం మీద దండయాత్ర చేయటమే. ఇవి అలాంటి వాటిలో కొన్ని. గత కొద్ధి సంవత్సరాలుగా ముఖ్యంగా గత అధ్యక్ష ఎన్నికల నాటి నుంచి అమెరికాలో జరుగుతున్న అంతర్మధనాన్ని పరిశీలించితే డెమోక్రటిక్‌ పార్టీ నాయకుల కంటే దాని మద్దతుదార్లయిన ఓటర్లలోనే సోషలిస్టు భావజాలంవైపు ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. మరో రెండు సంవత్సరాలలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో దాని ప్రభావం ఎలా వుంటుందోనని ఇప్పటి నుంచే కొందరు విశ్లేషణలు చేస్తున్నారు.పలు మీడియా సంస్ధల ఎన్నికల సర్వేలు డెమోక్రాట్లకే మెజారిటీని చూపాయి. అయితే సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా, రిపబ్లికన్లు ఇతరులు రెచ్చగొట్టిన ప్రచారంతో డెమోక్రాట్లలోని మితవాదులు గనుక ప్రభావితమైతే అనూహ్యంగా రిపబ్లికన్లు బటాబటి మెజారిటీతో విజయం సాధించినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ నిజంగా అదే జరిగినా లేక ఈ ఎన్నికలలో డెమోక్రటిక్‌ సోషలిస్టులు గణనీయ విజయాలు సాధించినా అమెరికా రాజకీయ సమీకరణలు మరింత వేగవంతం కావటం అనివార్యం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఒక్క పటేల్‌ విగ్రహమేమిటి, నరేంద్రమోడీ ఘనతలు ఇంకా ఎన్నో !

05 Monday Nov 2018

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP Vote Politics, flying Modi, Narendra Modi, Patel Statue, Sardar patel on Kahmir issue, world tallest statue

Image result for tallest   patel statue,  narendra modi cartoons

ఎం కోటేశ్వరరావు

అనుకోకుండా ఒక ప్రయాణంలో తోటి వారితో జరిగిన మాటా మంతీలో చిన్ననాటి విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. అదే రోజు పత్రికలో ప్రపంచంలో ఎత్తయిన విగ్రహం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వార్త చదవటంతో ప్రపంచంలో పెద్ద నది ఏది, ఏ కట్టడాన్ని ఎవరు కట్టించారు వంటి అంశాలలో క్విజ్‌లో ముందున్న రోజులు గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు ప్రపంచంలో ఎత్తయిన విగ్రహం ఏది, దానిని ఎవరు పెట్టించారు అంటే పటేల్‌, నరేంద్రమోడీ అని టక్కున చెప్పే పిల్లలు గుర్తుకు వచ్చారు. బాల్యం కాదు గనుక తాజ్‌మహల్‌ను కట్టించిన వారు కాదు, దానికి రాళ్లెత్తిన కూలీలెవరన్న మహాకవి శ్రీశ్రీ ప్రశ్న నేపధ్యంలో మూడువేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి పేరు కొట్టేసిన నరేంద్రమోడీ నిర్వాకం మదిలోకి రాక మానదు కదా !

చరిత్రలో అనేక మంది పెద్ద విగ్రహాలు పెట్టించి, కట్టడాలు కట్టించినవారున్నారు. ఆ సరసన నరేంద్రమోడీ చేరారు, రేపు చెప్పుకొనేందుకు ఫలానా అని లేని మరొకరు అంతకంటే పెద్ద విగ్రహం పెట్టించవచ్చు. చిత్రం ఏమిటంటే దేశం, మన సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యల నేపధ్యంలో ఇలాంటి రికార్డులు, ర్యాంకుల గురించి జనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవటం లేదు. ఒక ప్రధానిగా ఏడాదికి సగటున ఎక్కువ దేశాలు తిరిగిన, విదేశాల్లోనే ఎక్కువ కాలం గడిపిన ప్రధాని ఎవరు , ఒక ప్రధానిగా ఐదేండ్ల కాలంలో మీడియాతో మాట్లాడని ప్రధాని ఎవరు ఇలాంటి అనేక ప్రశ్నలకు నరేంద్రమోడీ అనే అసాధారణ రికార్డులను మోడీ ఇప్పటికే సాధించారు. సమీప భవిష్యత్‌లో మరొకరు ఆ రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు కనిపించటం లేదు. క్వారా డాట్‌కామ్‌ ప్రశ్నకు వచ్చిన వివరాల ప్రకారం ఇందిరా గాంధీ మొత్తం మీద ఎక్కువగా 113, తరువాత 93తో మన్మోహన్‌ సింగ్‌, మోడీ 79, జవహర్‌లాల్‌ నెహ్రూ 70 విదేశీ పర్యటనలు చేశారు. వీరిలో మోడీ తప్ప మిగిలిన వారంతా ఎక్కువ కాలం పదవిలో వున్నారు. అందువలన సగటున ఏడాదికెన్ని అంటే నరేంద్రమోడీ 19.5, మన్మోహన్‌ సింగ్‌ 9.3, ఇందిరా గాంధీ 8, నెహ్రూ 4.1 పర్యటనలు చేశారు. చిత్రం ఏమిటంటే ఈ అంకెలతో నరేంద్రమోడీ భక్తులెవరూ విబేధించలేదు. సమాచార హక్కు చట్టం కింద నాలుగు సంవత్సరాలలో మోడీ గారు ఎన్ని దేశాలు తిరిగారు అంటే 52 అని కేంద్ర ప్రభుత్వమే సమాధానం ఇచ్చింది. దీని ప్రకారం కూడా ఏడాదికి 13దేశాలతో మోడీయే ముందున్నారు.

ఎందుకు ఇలా ఎడా పెడా తిరిగారయ్యా అని ఎవరైనా అడిగితే విదేశీ పెట్టుబడుల కోసం అని తడుముకోకుండా తొలి సంవత్సరాలలో బిజెపి నేతలు చెప్పే వారు. ఇప్పుడు నోరెత్తటం లేదు, నో కామెంట్‌ అంటూ తప్పుకుంటున్నారు. ఎందుకని నాలుగేండ్లలో ఏమి జరిగింది? మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం మన కంపెనీలలో విదేశీయులు పెట్టిన పెట్టుబడులు, మన రుణపత్రాలు కొనుగోలు, తదితర రూపాలలో పెట్టే పెట్టుబడులను ఎఫ్‌పిఐ అంటారు. అవి 2014 నుంచి 2017వరకు వరుసగా 2,18,511-82,793-43,428-1,83,334 కోట్ల వంతున వచ్చాయి.2018లో ఇప్పటి వరకు పదినెలల్లో లక్ష కోట్ల రూపాయలు వెనక్కు పోయాయి. ఈ వార్తలను చదువుతున్న సమయంలోనే సులభతర వాణిజ్య ర్యాంకులో మన దేశం 2014లో 142వ స్ధానంలో వున్నది కాస్తా 2018లో 77కు చేరుకుంది. అంటే విదేశీయులు, స్వదేశీయులు వాణిజ్యాన్ని అంత సులభంగా చేసుకోవచ్చు అని ప్రపంచబ్యాంకు చెప్పింది. అలాంటపుడు ఈ ఏడాది లక్ష కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వెనక్కు ఎందుకు పోయినట్లు ? మంచి రాంకుకు పెట్టుబడులకు సంబంధం లేదా ? లేక ఇక్కడ వ్యాపారం లాభసాటిగా లేదని విదేశీయులు గ్రహించారా ? ర్యాంకుల సర్వే జరిగిన సమయంలో పరిస్ధితికి ఇప్పటికి తేడా వచ్చిందా ? వస్తే ఎందుకు ? ఏతా వాతా చివరకు తేలిందేమంటే రాంకు వచ్చినా సంతోషించే స్ధితిలో నరేంద్రమోడీ లేరు. ఇదే ర్యాంకు గతంలో వచ్చి వుంటే మీడియా ఎంత హడావుడి చేసి వుండేదో కదా !

అతి పెద్ద పటేల్‌ విగ్రహాన్ని ఐక్యతా ప్రతీకగా మోడీ సర్కార్‌ చిత్రించింది. కాలం కలసి రాకపోతే తాడే పామైకరుస్తుందంటారు. విగ్రహం గురించి చర్చ కంటే సిబిఐలో చెలరేగిన కుమ్ములాటల్లో నరేంద్రమోడీ పాత్ర, రిజర్వుబ్యాంకు స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, వివాదాస్పద బాబరీ మసీదు స్ధల యాజమాన్య కేసు విచారణ జనవరికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు, దాన్ని జీర్ణించుకోలేని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆగ్రహం, రామాయణంలో పిడకల వేటలో పటేల్‌తో పోలిస్తే మరుగుజ్జు వంటి విగ్రహాన్ని రాముడికి పెడతామని వచ్చిన వార్తల్లో పటేల్‌ విగ్రహ వార్తను జనం మరచి పోయారు. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల గురించి అన్నట్లుగా బిజెపి నిత్యం చెప్పేది ఐక్యత, చేసేది విచ్చిన్నం, అదే బిజెపి అసలు రూపం !

సంస్ధానాల విలీనం అనేది స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఎవరు అధికారంలో వున్నా చేసే పనే. లేకపోతే దేశ భద్రతకే ముప్పు. దానికి నాయకత్వం వహించాల్సింది హోంశాఖ, దానికి మంత్రిగా ఎల్లయ్య వున్నా పుల్లయ్య వున్నా యంత్రాంగం చేస్తుంది తప్ప రాజకీయ నాయకత్వం కాదు. ఆ సమయంలో వల్లభాయ్‌ పటేల్‌ వున్నారు. అంతే. నాటి మంత్రివర్గ నిర్ణయాన్ని అమలు జరిపారు. ఆయన వల్లనే విలీనం జరిగిందని అంటేనే అభ్యంతరం, వాస్తవ విరుద్ధం. పటేల్‌ లేనట్లయితే ఈ రోజు కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు రైళ్లు వుండేవి కావని నరేంద్రమోడీ సెలవిచ్చారు. ఇది కాశ్మీరు విషయంలో పటేల్‌ పాత్రకు పూర్తి విరుద్దం.

చరిత్ర తెలియకపోవటం తప్పు కాదు, తెలుసుకోకుండా వ్యాఖ్యానించటం తొందరపాటు అవుతుంది. అన్నింటికీ మించి చరిత్ర గురించి సంఘపరివార్‌ చరిత్రకారులు చెప్పే అంశాలను గుడ్డిగా నమ్మి వ్యాఖ్యలు చేస్తే వూబిలో పడతారు. కాశ్మీరు సంస్ధానంలో మెజారిటీ జనాభా ముస్లింలు, పాలకుడు హిందూరాజు. మేము పాకిస్ధాన్‌లో లేదా భారత్‌లోగానీ కలిసేది లేదు, యథాతధ స్ధితిలో వుంటాము అని పాక్‌తో కాశ్మీర్‌రాజు హరి సింగ్‌ ఒప్పందం చేసుకున్నాడు. భారత్‌తో కూడా అలాంటి ఒప్పందం చేసుకొనేందుకు సిద్దపడ్డాడు. నాటి నేషనల్‌ కాన్ఫరెన్సు పార్టీ నేత షేక్‌ అబ్దుల్లా తాము భారత్‌తోనే వుంటామని ప్రకటించాడు. ఎవరు దేశభక్తులు, ఎవరు దేశద్రోహులు ? అయితే 1947 సెప్టెంబరు నాటికే పాకిస్ధాన్‌ పాలకులు కాశ్మీర్‌ ఆక్రమణకు పాల్పడ్డారు. అక్టోబరులో విధిలేక హరిసింగ్‌ విలీనానికి అంగీకరించటంతో కేంద్ర ప్రభుత్వం మిలిటరీని పంపింది, అప్పటికే ఈ రోజు మనం ఆక్రమిత కాశ్మీర్‌గా పిలుస్తున్న ప్రాంతాన్ని పాక్‌సేనలు ఆక్రమించాయి. అయితే పాక్‌ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని తాము విలీనం చేసుకోలేదని అంతకు ముందు రాజు ప్రకటించినట్లుగా స్వతంత్య్ర రాజ్య ఏర్పాటులో భాగంగా విముక్తి చేశామని ఆ ప్రాంతాన్ని ఆజాద్‌ కాశ్మీర్‌ అని ప్రకటించారు. దానికి ఒక స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ పూర్వరంగంలో నాటి కేంద్ర ప్రభుత్వం తాము కూడా కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి భారత్‌లో అంతర్భాంగా చేస్తామని ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. జునాఘడ్‌, హైదరాబాదు సంస్ధానాలను భారత్‌లో విలీనం చేస్తే కాశ్మీర్‌ దేశంలో విలీనంగాకపోయినా మేము దానిని శత్రువుగా చూడబోమని వల్లభాయ్‌ పటేల్‌ తనకు స్పష్టంగా హామీ ఇచ్చినట్లు నాటి బ్రిటీష్‌ పాలకుడు మౌంట్‌బాటన్‌ పేర్కొన్నాడు. అయితే కాశ్మీర్‌లోని వాస్తవ పరిస్ధితి, మిగతా నాయకుల వ్యతిరేకత కారణంగా వెంటనే పటేల్‌ కూడా తన వైఖరిని మార్చుకున్నట్లు చెబుతారు. కాశ్మీరులో మెజారిటీ ముస్లింలు వున్నందున ఆ తలనొప్పి భారత్‌కు ఎందుకు అని పటేల్‌ భావించినట్లు చెబుతారు.

ఇప్పుడు పటేల్‌ భారత రాజకీయాలలో చూపే ప్రభావమేమీ లేదు. అందువలన పటేల్‌ గురించి అతిశయోక్తులు చెప్పకుండా వుంటేనే ఆయన గౌరవం నిలుస్తుంది. 1947 అక్టోబరులోనే కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌కు సైన్యాన్ని పంపి నేటి ప్రాంతాన్ని కాపాడింది. కాశ్మీర్‌కు ప్రత్యేక పత్తి ఇవ్వటాన్ని తప్పుపడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ను రద్దు చేస్తానని బిజెపి చెప్పటం అంటే మన దేశం నుంచి కాశ్మీర్‌ వేరుపడి పోవాలని కోరుకొనే దేశద్రోహులకు అక్కడి జనాన్ని రెచ్చగొట్టేందుకు అవకాశం ఇవ్వటమే.

ఇక నిజాం రాజు ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసిన సమయంలో నిజాం భారత్‌లో విలీనం కాలేదు. 1948 ఆగస్టు 21న నిజాం రాజు ఐరాసకు ఫిర్యాదు చేశాడు. పరిస్ధితి చేయిదాటి పోతోందని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 13న పోలీసు చర్యకు పూనుకుంది. మొత్తం అన్ని సంస్ధానాలను విలీనం చేసింది. దానిలో పటేల్‌ ప్రత్యేకత ఏమీ లేదు. నిజానికి ఆయన రాజకీయ చరిత్రలో సంస్ధానాలకు వ్యతిరేకంగా లేదా సంస్ధానాల ప్రజల సమస్యల మీద పోరాడిన చరిత్ర కూడా లేదు.

Image result for tallest   patel statue,  narendra modi cartoons

ప్రపంచంలో అతి పెద్ద విగ్రంగా పటేల్‌ది పెట్టినంత మాత్రాన ఆయనకు కొత్తగా వచ్చే ఖ్యాతి ఏమీలేదు. దేశ ఐక్యతకు చిహ్నంగా పటేల్‌ను కొత్తగా వర్ణిస్తున్న బిజెపి నాయకత్వం కాశ్మీర్‌ విషయంలో దేశద్రోహకరమైన వైఖరిని తీసుకుంటూ మరోవైపు దేశంలో సామాజిక అనైక్యతకు, నిర్మించిన వ్యవస్ధలను ఒకదాని తరువాత ఒకదానిని నాశనం చేస్తూ మరోవైపు పటేల్‌ విగ్రహం పెట్టి ఐక్యత గురించి కబుర్లు చెప్పటమే బిజెపి చేస్తున్న మోసం. ఇలాంటి వారిని గుండెలు తీసిన బంట్లు అంటారు.

మోడీ పాలనలో దేశ ఆర్ధికాభివృద్ధి చైనా కంటే ఎక్కువగా వుందని, త్వరలో దాన్ని అధిగమించబోతున్నామని చెబుతున్నారు. 2018 ప్రపంచ ఆకలి సూచిక తయారీకి తీసుకున్న 120 దేశాలలో చైనా 25వ స్ధానంలో వుంటే మనది 103, మన కంటే పేద దేశాలైన నేపాల్‌, బంగ్లాదేశ్‌ 72,86 స్ధానాల్లో వున్నాయి. మనం 106దిగా వున్న పాకిస్ధాన్‌తో పోటీ పడుతున్నాం. ప్రపంచంలో రక్తహీనత జనాభాలో మనమే మొదటి స్ధానంలో వున్నాం. కుష్టు, క్షయ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలలో గత నాలుగు సంవత్సరాలలలో మనమే ముందున్నాం. దేశాన్ని డిజిటల్‌ యుగంలోకి తీసుకుపోతామని చెబుతున్నవారి పాలనలో పరిష్కారం సంగతి దేవుడెరుగు , కనీసం ఏ ఒక్కదానిలో అయినా పురోగతి వుందా ? రోగాలు, రొష్టులతో మనం ఎంత నష్టపోతున్నామో తెలుసా? రైతులు వ్యవసాయం చేసి అప్పులపాలవుతుంటే సాధారణ జనం రోగాలతో అప్పులపాలవుతున్నారని అనేక నివేదికలు చెబుతున్నాయి. వీటన్నింటి గురించి ప్రధాని మన్‌కీ బాత్‌లో ఎప్పుడైనా ప్రస్తావించారా? వాటిని పట్టించుకోవటం మాని మూడువేల కోట్ల రూపాయలు పెట్టి ఒక విగ్రహాన్ని నెలకొల్పటం అవసరమా? అంత మొత్తం ఖర్చును భరించే స్ధాయి మన జనానికి వుందా ? ఆర్ధికంగా నాలుగు సంవత్సరాలలో చెప్పుకొనేందుకు సాధించిందేమీ లేదు, వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని దర్జాగా దేశం దాటి పోతున్న నేరంగాండ్లను ఒక్కడంటే ఒక్కడిని పట్టుకోకుండా వదలి వేయటం, ఓట్లను దండుకొనేందుకు ఎక్కడ వివాదాస్పద అంశం దొరుకుతుందా అని చూసే దేశవ్యాపిత మత రాజకీయాలు, విగ్రహాల రాజకీయాలు, వేల కోట్ల అవినీతికి తెరలేపిన రాఫెల్‌ విమాన కొనుగోలు అవినీతి అక్రమాలు, వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు, నెపాన్ని ఇతరుల మీద నెట్టేందుకు సిబిఐ, ఆర్‌బిఐ వంటి అనేక వ్యవస్ధలను నాశనం చేసే ప్రమాదకర పోకడలు. అందువలన ప్రపంచంలో ఎత్తయిన విగ్రహాన్ని నెలకొల్పటమే కాదు, పైన చెప్పుకున్న వాటన్నింటి ఘనత కూడా కచ్చితంగా నరేంద్రమోడీకే దక్కాలి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: