• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: December 2017

లాస్‌ ఏంజల్స్‌ కార్మిక సంఘాలలో కమ్యూనిస్టుల అనర్హత ఎత్తివేత !

30 Saturday Dec 2017

Posted by raomk in Uncategorized

≈ Leave a comment

Tags

communist, communist exclusion, Los Angeles County Federation of Labor, US communist party

ఎం కోటేశ్వరరావు

కాలిఫోర్నియాలోనే కాదు, మొత్తం అమెరికాలోనే లాస్‌ ఏంజల్స్‌ కౌంటీ లేబర్‌ ఫెడరేషన్ను ఎంతో శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. అలాంటి ఫెడరేషన్‌ వెలి యుగానికి మంగళం,స్వాగతానికి నాంది పలికే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కార్మిక సంఘాలలో కమ్యూనిస్టులకు స్ధానం లేదు అనే నిబంధన తొలగిస్తూ డిసెంబరు 18న నిబంధనావళిని సవరించింది. ఇది నిజంగా ప్రపంచ కమ్యూనిస్టులకు ఎంతో వుత్సాహాన్నిచ్చే అంశం. కమ్యూనిస్టులంటే ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్తుల కంటే ఎక్కువగా దూరంగా పెట్టే విధంగా ప్రచారం చేసిన అమెరికాలోని ఒక ప్రముఖ రాష్ట్రంలో ఇలాంటి ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవటం చిన్న విషయమేమీ కాదు. అక్కడి పరిస్ధితిలో మార్పు ప్రారంభానికి అదొక సూచిక. దీనికి ఒక మహిళ ఆద్యురాలు కావటం మరొక విశేషం.

కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకొనేందుకు 1798నాటి పరాయి శత్రు మరియు దేశద్రోహ చట్టాలకు 1917,18లో దుమ్ము దులిపింది.కమ్యూనిజంపై ప్రచ్చన్న యుద్ధానికి నాందిగా 1947లో టాఫ్ట్‌-హార్టలే చట్టాన్ని చేసింది. వీటిని ప్రయోగించి కార్మిక సంఘాలలో కమ్యూనిస్టులకు స్ధానం లేకుండా చేసేందుకు కార్మిక సంఘాల నాయకత్వాలపై బెదిరింపులకు పాల్పడి వత్తిడి తెచ్చింది. దాంతో అనేక సంఘాలు ఆమేరకు తమ నిబంధనావళులను సవరించాయి. కమ్యూనిస్టులుగా తెలిసిన వారెవరినీ అనుమతించకుండా అడ్డుకున్నాయి. అప్పటికే కమ్యూనిస్టులని తెలిసివారిని బహిష్కరించాయి. కార్మిక సంఘాలపై కమ్యూనిస్టుల ప్రభావాన్ని తగ్గించే పేరుతో కార్మిక నాయకులుగా వున్న అనేక మంది నాయకులు సిఐఏ, విదేశాంగశాఖతో కుమ్మక్కయి విదేశాలలో కమ్యూనిస్టు ప్రభావితమైన వనే పేరుతో కార్మిక యూనియన్లను విచ్చిన్నం చేసేందుకు కొమ్ముకాశారు.

లాస్‌ ఏంజల్స్‌ ఫెడరేషన్‌లో ఇలాంటి పురోగామి మార్పుకు కారణం మరియా ఎలెనా డురాజో అనే ఒక మహిళ చొరవ అంటే అతిశయోక్తి కాదు. ఆరులక్షల మంది సభ్యులున్న ఆ కార్మిక సంఘానికి తొలిసారిగా నాయకత్వం వహించిన అతివగా కూడా ఆమె చరిత్రకెక్కింది.2006 నుంచి 14 వరకు కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యత నిర్వహించిన ఆమె అమెరికా జాతీయ కార్మిక సంఘంలో బాధ్యతలకు ఎన్నికై లాస్‌ ఏంజల్స్‌ ఫెడరేషన్‌ నాయకత్వం నుంచి తప్పుకున్నారు. 2018లో జరగనున్న కాలిఫోర్నియా సెనెట్‌ ఎన్నికలలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. లాస్‌ ఏంజల్స్‌ రాజకీయాలలో ఏకైక శక్తివంతమైన మహిళ అని లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది.

అమెరికాలోని రెండు రాజకీయపక్షాలలో తక్కువ ప్రమాదకారిని ఎంచుకోవాలనే రాజకీయం నడుస్తోంది. ఇటీవలి కాలంలో దాన్నుంచి బయటపడాలనే మధనం అనేక తరగతులలో ప్రారంభమైంది. తక్కువ ప్రమాదకారి రాజకీయాలకు స్వస్ధి పలకాలని అమెరికా ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ మరియు కాంగ్రెస్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఆర్గనైజేషన్స్‌(ఎఎఫ్‌ఎల్‌-సిఐఓ) అక్టోబరు చివరి వారంలో జరిగిన సమావేశం ఆమోదించిన ప్రధాన రాజకీయ తీర్మానంలో పేర్కొనటం అమెరికా కార్మికోద్యమం, రాజకీయాలలో ఒక ముఖ్యపరిణామం. రెండింటిలో ఏది తక్కువ ప్రమాదకారి అని చూడటానికే మనం పరిమితం కావటంలోనే ఎంతో సమయం గడచిపోయిందని తీర్మానం పేర్కొన్నది. అయితే స్పష్టమైన ప్రత్యామ్నాయం ఎలా వుండాలనే అంశపై చర్చలో భిన్న అభిప్రాయాలు వెలువడినప్పటికీ ఒక ప్రత్యామ్నాయం కావాలనే అంశంపై మొత్తం మీద ఏకీభావం వెల్లడి కావటం విశేషం. సమాఖ్య రాజకీయ కమిటీ, మరియు ,అఖిల అమెరికా మున్సిపల్‌ వుద్యోగుల సంఘాధ్యక్షుడు లీ సాండర్స్‌, అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టీచర్స్‌ అధ్యక్షుడు రాండీ వెయిన్‌ గార్టన్‌ పై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమెరికాలో ఈ రెండు అతి పెద్ద వుద్యోగ సంఘాలు. మొత్తం మీద సభ నిర్వాహకులు పేరు పెట్టకపోయినా ఒక కార్మికపార్టీ పెట్టాలని అందరితో అనిపించారు. కార్పొరేట్స్‌, ధనికులకు అనుకూలంగా పనిచేస్తున్న రాజకీయ వ్యవస్ధ కార్మికవర్గానికి స్ధంభాలుగా వుంటూ మంచి వుద్యోగాలు, భద్రతకు మద్దతు ఇచ్చేవాటిని ఒకదాని తరువాత మరొకదానిని హరించిందని, రాజకీయ వ్యవస్ధ కార్మికులను దశాబ్దాలుగా విఫలులను చేసిందని వెయిన్‌ గార్టన్‌ పేర్కొన్నారు.

డెమోక్రటిక్‌ మరియు రిపబ్లికన్‌ పార్టీలు రెండూ కార్పొరేట్ల ఆధిపత్యంలో వున్నాయని కార్మికవర్గ పార్టీని ఏర్పాటు చేయాలని కోరిన ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను గట్టిగా ముందుకు తెచ్చిన తపాలా కార్మిక సంఘాధ్యక్షుడు మార్క్‌ డైమండ్‌స్టెయిన్‌ మాట్లాడుతూ 1993లో నాఫ్టాను ఆమోదించిన నాటి నుంచి తానీ ప్రతిపాదనను ముందుకు తెస్తూనే వున్నానని పేర్కొన్నారు.2008 ఎన్నికలలో అమెరికా పార్లమెంట్‌ వుభయ సభలలో మెజారిటీతో పాటు అధ్యక్ష పదవిని చేపట్టినపుడు డెమోక్రటిక్‌ పార్టీ కార్మికవర్గానికి ప్రాధాన్యత, కార్మిక సంస్కరణలకు పూనుకోకుండా పసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్యం పేరుతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం వంటి వాటిని ముందుకు తెచ్చిందని డైమండ్‌స్టెయిన్‌ చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున ప్రతిస్పందన లభించింది. రిపబ్లికన్లు యూనియన్లను దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారు. డెమోక్రటిక్‌ అధ్య క్షుడు బిల్‌క్లింటన్‌ వాల్‌స్ట్రీట్‌(కార్పొరేట్లు)పై నియంత్రణలను ఎత్తివేశారు. ఒక కార్మికవర్గపార్టీ నిర్మాణం అన్నది దీర్ఘకాలిక పధకంగా వుండాలి, దానికి కార్మికవర్గంతో పాటు ఇతర సమాజ మద్దతు కూడా కావాలి.రెండు పార్టీల వ్యవస్ధకు పరిమితమై వుండాలని చెప్పటం ఎంత తప్పవుతుందో కార్మికవర్గ పార్టీకే మన వుద్యమం పరిమితం కావాలనం కూడా అంతే తప్పువుతుందని డైమండ్‌ స్టెయిన్‌ వ్యాఖ్యానించారు. ఆయనకు వ్యవసాయ కార్మిక సంఘనేత బాల్డ్‌మర్‌ వెల్‌స్క్వెజ్‌,ఇతరులు మద్దతు ఇచ్చారు. కార్మికపార్టీని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదిస్తున్న డడ్జిక్‌ మాట్లాడుతూ కార్మికవర్గ పార్టీ నిర్మాణానికి ఒక దృక్కోణం వుండాలి, ఇసుక గూళ్లను కడితే లాభం లేదని కింది నుంచి కార్మికోద్యమ నిర్మాణం జరగాలని అన్నారు. ఇపుడున్న విధానంతోనే కొనసాగుతూ భిన్నమైన ఫలితాలు రావాలని ఆశించటం పరిష్కారం కాదని ఒక ప్రతినిధి స్పష్టం చేశారు. కార్మికవర్గం వెనుక పట్టుపట్టిన వర్తమాన స్ధితిలో కార్మికవర్గ పార్టీ నిర్మాణం చేయలేమని కొందరు వాదించారు. ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు గ్రెగ్‌ జునేమన్‌ మాట్లాడుతూ నడవబోయే ముందు మన దోగాడాలి, పరుగెత్తబోయే ముందు నడవాలి, దౌడు తీయబోయే ముందు పరుగెత్తాలి అన్నారు. కార్మికవర్గ పార్టీని పెట్టటానికి సుముఖంగా వున్నవారు ముందు స్ధానిక, రాష్ట్ర ఎన్నికలలో పాల్గనాలి, డెమోక్రటిక్‌ పార్టీ వారు మనకెలాంటి వుపకారం చేయటం లేదు, చేయబోరు అని వ్యవసాయ కార్మిక సంఘనేత చేసి వ్యాఖ్యను అందరూ అంగీకరించారు. మన విప్లవానికి అనుకూలమైన కార్మివర్గం అనే అంశంపై జరిగిన ఒక చర్చలో ఏడు జాతీయ సంఘాల ప్రతినిధులు పాల్గన్నారు. గతేడాది డెమొక్రటిక్‌ పార్టీ ప్రాధమిక శాఖల సమావేశాలలో బెర్నీ శాండర్స్‌ సవాలుతో తలెత్తిన వుద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశ నిర్ణయంతో వెంటనే అమెరికాలో కార్మికవర్గ దృక్పధంతో పనిచేసే కొత్త పార్టీ ఏర్పడనుందనే భ్రమలకు లోనుకావాల్సిన అవసరం లేదు. రెండు ప్రధాన పార్టీలను (నిజానికి అనేక పార్టీలున్నా ఎన్నికలలో ప్రధానంగా పోటీ పడే రెండు పార్టీలే పోటీ పడుతుండటంతో అక్కడ నిజంగా రెండు పార్టీలే వున్నాయని జనం అనుకుంటారు) ముందుకు తీసుకు వచ్చి అవే ఒకదానికొకటి ప్రత్యామ్నాయం అని నమ్మించటంలో అమెరికాతో సహా అనేక ధనిక దేశాలలో పాలకవర్గం జయప్రదమైంది. మరొక ప్రత్యామ్నాయం కనుచూపు మేరలో కనిపించని ఏది తక్కువ ప్రమాదకారి అయితే దాన్ని ఎంచుకోవటానికి జనం కూడా అలవాటు పడ్డారు. అయితే ధనిక దేశాలలో పెరుగుతున్న ఆర్ధిక అంతరాలు,కార్మికవర్గం సాధించుకున్న విజయాలు ఒక్కొక్కటి వమ్ముకావటం ప్రారంభమైన తరువాత రెండు పార్టీలు ఒకటే అనే నిర్ధారణకు జనం రావటం ప్రారంభమైంది. పది సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం ఈ ఆలోచనను మరింతగా పెంచి ఒక మధనానికి దారితీసింది. సాంప్రదాయ పార్టీలను జనం నమ్మటం లేదని గ్రహించటంతో వారి అసంతృప్తిని సొమ్ము చేసుకొనేందుకు పచ్చిమితవాద శక్తులు ముందుగా రంగంలోకి దిగాయి.ఇది కూడా వర్గ సమీకరణలను వేగవంతం చేసేందుకు పురికొల్పే పరిణామమే. వర్గదృక్పధం గల శక్తులు ఏ రూపంలో ముందుకు వస్తాయనేది చూడాల్సి వుంది.

అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య చేసిన తీర్మానం డెమోక్రటిక్‌ పార్టీకి ఒక తీవ్ర హెచ్చరిక వంటిది. తక్కువ హానికరం చేసేదనే పేరుతో మితవాద రిపబ్లికన్‌ పార్టీకి బదులు తమకు ఓట్లు వేయటం తప్ప కార్మికులకు మరొక మార్గం లేదని ఆ పార్టీ ఇంకేమాత్రం భ్రమలో వుండకూడదని వేసిన తొలి కేక ఇది. సమాఖ్య సమావేశంలో తక్కువ హాని చేసే పార్టీని ఎంచుకోవాలనే వైఖరికి స్వస్తి పలకాలనే తీర్మానాన్ని ముందుకు తెచ్చిన నేతలిద్దరూ రాజకీయంగా డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ కమిటీ సభ్యులే. అందువలన తమ తీర్మానం స్వయంగా తమ పార్టీకే వ్యతిరేకమని వారికి తెలియనిది కాదు. పార్టీలతో నిమిత్తం లేకుండా వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో కార్మికఅనుకూల అజెండాను ముందుకు తేవాలని కూడా పై తీర్మానం పిలుపునిచ్చింది. ఈ అజెండా, తీర్మానాన్ని కార్మికవర్గంలోని అన్ని తరగతుల వారికి వివరించేందుకు అవసరమైన సమాచార వ్యవస్ధను కూడా కార్మిక సమాఖ్య నిర్ణయించింది.

కార్మికవర్గంలో తొలుగుతున్న భమ్రలు, జరుగుతున్న మధనానికి ప్రతిబింబమే కార్మిక సమాఖ్య తీర్మానం.దీనికి గతేడాది డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడిన బెర్నీ శాండర్స్‌ తాను సోషలిస్టును అని బహిరంగంగా ప్రకటించి బరిలోకి దిగటం, పెద్ద ఎత్తున యువత నీరాజనం పట్టటం కూడా అనుకోకుండా జరిగింది కాదు. నవంబరు 11-12 తేదీలలో అమెరికా కమ్యూనిస్టుపార్టీ నిర్మాణ మహాసభ జరిగింది. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నిక అవటం, అతగాడి విధానాలు కమ్యూనిస్టుపార్టీ నిర్మాణానికి నూతన పరిస్ధితిని కల్పించిందని నివేదికలో పేర్కొన్నారు. ఎన్నికల తరువాత ఏడాదిలో వెయ్యి మంది కొత్త సభ్యులు చేరారని తెలిపారు. ఫేస్‌బుక్‌లో పార్టీ సభ్యత్వ కార్డు బమ్మను పోస్టు చేయగానే వందల మంది సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొంత మంది వ్యక్తిగతంగా చేరగా మరికొందరు బృందాలుగా సభ్యత్వం కోసం వచ్చారు. ఓహియో విశ్వవిద్యాలయంలో ఒక సభలో కమ్యూనిస్టుపార్టీ నేత చేసిన వుపన్యాసం తరువాత అక్కడికక్కడే పన్నెండు మంది సభ్యత్వం కావాలని అడిగారు. ఇలా అనేక నగరాలలో యువత ముందుకు వస్తోందని నివేదికలో పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన క్లబ్బుల ద్వారా ముందుగా జనాన్ని పిటీషన్లపై సంతకాలు చేయమని, తరువాత ప్రదర్శనలకు హాజరు కమ్మని అడుగుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. అలా వచ్చిన వారిని మీరు కమ్యూనిస్టుపార్టీలో ఎందుకు చేరకూడదని చర్చ పెడుతున్నారు. అలాంటి పద్దతుల్లో చేరిన వారు కూడా ఎందరో వున్నారు. ఈ అనుభవాన్ని చూసిన తరువాత అనేక చోట్ల కమ్యూనిస్టు పార్టీ క్లబ్బులను ఏర్పాటు చేసి జనాన్ని ఆకర్షించేందుకు పూనుకుంది. ఇటీవలి కాలంలో పార్టీ ఫేస్‌బుక్‌, వెబ్‌సైట్లను సందర్శి ంచే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పార్టీ పెరుగుదల కేవలం ప్రారంభం మాత్రమే. అయితే ఇది అన్ని చోట్లా ఒకే విధంగా లేదు. అనేక చోట్ల కార్యక్రమాలు నిర్వహించటం సాధ్యం కానప్పటికీ పార్టీలో చేరుతున్న తీరుతెన్నులను ఇటీవలి కాలంలో చూడలేదని నివేదిక పేర్కొన్నది. లోపాల గురించి వివరిస్తూ పెరుగుదల సంతోషకరమే అయినప్పటికీ అతిగా చెప్పనవసరం లేదు, అనేక చోట్ల సభ్యుల, నాయకుల వయస్సుపైబడిన తీరు కనిపిస్తోంది.కొందరు సమావేశ ం కావటం లేదు, రోజువారీ పోరాటాలలో పాల్గనటం లేదు, కొందరు వెబ్‌సైట్లకే పరిమితం అవుతున్నారు. సభ్యులతో సంబంధాలు, ఇతర అంశాలకు సంబంధించి అనేక అంశాలను ఈ సభలోచర్చించి అవసరాలకు అనుగుణ్యంగా కార్యకలాపాలను పెంచి ప్రజాబాహుళ్య పార్టీగా పెంపొందించాలని నిర్ణయించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పచ్చిమితవాద సంవత్సరంగా 2017 !

27 Wednesday Dec 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Europe Far-Right, Far-right politics, fascist, fascist ideology, populism, Right-wing, Right-wing populism

ఐరోపా దేశాలలో ప్రజాకర్షక పచ్చిమితవాద పార్టీలు

ఎం కోటేశ్వరరావు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే. అలాగే ఏ దేశమైనా వలస కార్మికులను అనుమతించటం, ఆహ్వానిస్తున్నదంటే అది అక్కడి కార్పొరేట్ల లాభాలను పెంచటం కోసమే అన్నది స్పష్టం. కార్పొరేట్ల లాభాల వేటే ప్రపంచంలో మితవాద, పచ్చిమితవాద శక్తుల ముప్పును ప్రపంచానికి తెస్తోంది. 2017లో జరిగిన పరిణామాలను నెమరు వేసుకుంటే ఈ ధోరణి మరింత స్పష్టంగా వెల్లడి అయింది. అందుకే కొందరు పరిశీలకులు దీన్ని మితవాద సంవత్సరంగా వర్ణించారు.ఐరోపా, లాటిన్‌ అమెరికా ఖండాలలోని పలు దేశాలలో వెల్లడైన ధోరణులు ఇందుకు అవకాశమిచ్చాయి. అయితే దీన్ని చూసి ఇప్పటికిప్పుడు గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేనప్పటికీ ఒక ప్రమాదకరమైన సంకేతమిది. ఏ దేశ పాలకవర్గమైనా తన ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుంది. అవసరమైతే మితవాద శక్తులను ప్రోత్సహిస్తుంది, నష్టం అనుకుంటే అదుపులో వుంచుతుంది.

2017 సంవత్సరాన్ని అవలోకించుకుంటే ప్రపంచ వ్యాపితంగా మితవాద అనుకూల,అభ్యుదయ, కమ్యూనిస్టు వ్యతిరేక శక్తుల ప్రభావం పెరగటంతో పాటు కమ్యూనిస్టు వ్యతిరే వాదనల ఆకర్షణ తగ్గటం కూడా మరోవైపున కనిపిస్తోంది. ఇదొక విచిత్ర పరిస్ధితి. ఆర్ధిక అసమానతలు తీవ్రం కావటం, సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్దలను కూల్చివేసిన తరువాత సంక్షేమ కార్యక్రమాలకు మంగళం పాడటం ఇటీవలి కాలంలో పెరుగుతున్నది.2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలో పెట్టుబడిదారీ వ్యవస్ధకు అంతుబట్టటం లేదు. ఇలాంటి సంక్షోభాలను జనం మీదకు నెట్టి తాము బయటపడటం దోపిడీ వర్గ నైజం. పైన పేర్కొన్న కారణాలతో అనేక దేశాలలో యువతలో అసంతృప్తి పెరుగుతోంది. మితవాదులు, వుదారవాదులుగా ఇంతకాలం రాజకీయ రంగంలో వున్న సాంప్రదాయ పార్టీలు పెట్టుబడిదారీ వ్యవస్ధలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించటంలో విఫలమయ్యాయి. అందువల్లనే ఇటీవలి కాలంలో ఏ ఒక్క పార్టీ కూడా వరుసగా రెండవ సారి ఎన్నికల విజయం సాధించటం లేదు. ఈ పూర్వరంగంలో ప్రత్యామ్నాయంగా పచ్చి మితవాద ఫాసిస్టు శక్తులు ప్రపంచమంతటా ప్రజాకర్షక నినాదాలను, వలసదారుల వ్యతిరేక ముఖ్యంగా ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో ముందువరుసలో వున్నాయి. మన దేశంలో సంఘపరివార్‌ కూడా అదే చేస్తున్న విషయం తెలిసిందే.

లాభార్జనకు అవసరమైన విధాన నిర్ణేత అగ్రగామిగా వున్న ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్తే. దానికి అవసరం అయినపుడు స్వేచ్చా వాణిజ్యం నష్టం అనుకున్నపుడు రక్షణాత్మక విధానాలను ముందుకు తెచ్చినదీ అదే వ్యవస్ధ. ప్రపంచీకరణ, స్వేచ్చామార్కెట్‌ నినాదాలను తారక మంత్రాలుగా పఠించిన ఘనాపాఠీలు ఇప్పుడు మరో పల్లవి అందుకుంటున్నారు. వాటిలో భాగంగా 2001లో ప్రారంభించిన దోహా దఫా చర్చలు ఎప్పుడు ముగుస్తాయో తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రపంచ వాణిజ్య సంస్ధ వైఫల్యాన్ని సూచిస్తున్నది.ఒకవైపు ఈ చర్చలను ముందుకు సాగనివ్వకుండా చేస్తున్న ధనిక దేశాలు మరోవైపు తమ ఆర్ధిక, అంగబలాన్ని వుపయోగించి దేశాలతో బేరసారాలాడి ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఐరోపా యూనియన్‌లో వుండి పొందే లబ్ది కంటే దాన్నుంచి బయటపడి ఎక్కువ లాభాలు సంపాదించాలనే యావతోనే బ్రిటన్‌ నష్ట పరిహారం చెల్లించి మరీ బయటకు వచ్చేందుకు నిర్ణయించింది. ప్రతి అగ్రరాజ్యం తన స్వీయ రక్షణాత్మక విధానాలకు తెరతీసింది. మార్కెట్లను పంచుకొనే క్రమంలో విబేధాలు ముదిరి చివరకు యుద్ధాలకు కూడా కారణం కావటం చూశాము.రక్షణాత్మక విధానాల గురించి నిరంతరం చర్చ జరుగుతోంది. ఏదో ఒక రక్షణాత్మక విధానం లేకుండా ఏ ధనిక రాజ్యం అభివృద్ధి చెందలేదనేది ఒక అభిప్రాయమైతే, స్వేచ్చావాణిజ్యం అనేది ఒక మినహాయింపు రక్షణాత్మక విధానం ఒక వ్యవస్ధ అని ఒకరు భాష్యం చెప్పారు. కార్పొరేట్‌ సంస్ధలు బహుళజాతి సంస్ధలుగా రూపాంతరం చెందిన తరువాత ఇది కొన్ని మార్పులకు లోనైనప్పటికీ దాని మౌలిక స్వభావమైన మార్కెట్ల ఆక్రమణ, నిరోధాలతో పాటు సంక్షేమచర్యల వ్యతిరేకత, సంక్షోభాలకు గురికావటంలో మార్పు లేదు. ఒకవైపు రక్షణాత్మక చర్యలతో పాటు వలస కార్మికులను ఆహ్వానించటం తాజా ధోరణిగా వుంది.

అనేక దేశాలలో సంక్షేమ చర్యలను వ్యతిరేకించే సాంప్రదాయ మితవాదులు గణనీయ భాగం వుండటం తెలిసిందే. ఇప్పుడు ఐరోపాను ప్రభావితం చేస్తున్నది పచ్చి మితవాదులు, ఆశ్చర్యం ఏమంటే వారు తమ స్ధానాన్ని మరింత బలపరుచుకొనేందుకు ప్రజాకర్షక నినాదాలు పెద్ద ఎత్తున ముందుకు తెస్తున్నారు. వారికి వలస కార్మికులు, ఇస్లామిక్‌ దేశాల నుంచి వచ్చే వారు లక్ష్యంగా మారి స్ధానిక యువత, కార్మిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారు. బ్లూమ్‌బెర్గ్‌ విశ్లేషణ ప్రకారం గత మూడు దశాబ్దాల కాలంలో 22 ఐరోపా దేశాలలో ప్రజాకర్షక పచ్చిమితవాద పార్టీలకు గతం కంటే మద్దతు పెరిగింది. ఇటీవలి పార్లమెంటరీ ఎన్నికలలో సగటున ఆపార్టీలు 16శాతం ఓట్లు సంపాదించాయి. అదే 1997లో ఐదుశాతం వుంటే దశాబ్దం క్రితం 11శాతం వచ్చినట్లు పేర్కొన్నది. ఒక లెక్క ప్రకారం గత నాలుగు సంవత్సరాలలో ఐరోపాలో ఇటువంటి పార్టీలకు మూడు కోట్ల మంది ఓట్లు వేయగా, ఒక్క 2017లోనే మూడు దేశాలలో కోటీ 79లక్షల మంది వున్నారు కనుకనే దీన్ని మితవాద సంవత్సరంగా పరిగణిస్తున్నారు. చౌకగా శ్రమ చేయటానికి ముందుకు వచ్చే వలస కార్మికులతో పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు లాభాలు ఎక్కువ కనుకే వారు వలసలను ఆహ్వానిస్తున్నారు. గతంలో తమకు అవసరమైన ముడి సరకులను దిగుమతి చేసుకొని తమ పారిశ్రామిక వస్తువులను ఎగుమతి చేసి లబ్ది పొందిన కార్పొరేట్లు ఇప్పుడు ద్రవ్యపెట్టుబడిదారులుగా మారారు. వారు ఫ్యాక్టరీలు పెట్టరు, వస్తువులను వుత్పత్తి చేయరు కానీ లాభాలను పిండుకుంటారు. ధనిక దేశాలలోని పెట్టుబడిదారులు, వ్యాపారులు స్ధానికంగా వస్తువులను తయారు చేయించటం కంటే శ్రమశక్తి చౌకగా వుండే చోట వస్తు తయారీ, దిగుమతులు చేసుకోవటం వారికి లాభసాటిగా వుంది. అందుకు గాను గతంలో వ్యక్తం చేసిన కమ్యూనిస్టు వ్యతిరేకతను పక్కన పెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారిన చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటున్నారు. దీని వలన స్ధానికులలో నిరుద్యోగం ఏర్పడి లేదా వేతనాలు తగ్గిపోయి ఐరోపా దేశాలలో మితవాదశక్తులు జనాన్ని రెచ్చగొట్టటానికి వీలుకలుగుతోంది.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ చేసిన ఒక అధ్యయనం ప్రకారం 1990-2015 మధ్య ధనిక దేశాలలో పని చేయగలిగిన వయస్సు జనాభాలో వలస వచ్చిన వారు 15-20శాతం మధ్య వున్నారు. స్విడ్జర్లాండ్‌లో గరిష్టంగా 35శాతం,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడా వంటి చోట్ల 25శాతం వరకు వున్నారు. అందువలననే ఇటీవలి కాలంలో అమెరికా కంటే ఈ దేశాలకు మన తెలుగు ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువగా వుంటున్నాయి.పనిచేసే వయస్సుగల వారిలో ఒక శాతం వలసవచ్చిన వారు వుంటే దీర్ఘకాలంలో ఆయా దేశాల జిడిపిలో రెండుశాతం పెరుగుదలకు దారితీస్తుందని ఐఎంఎఫ్‌ పేర్కొన్నది.స్ధానికంగా లభ్యమయ్యేవారు తక్కువగా వుండటంతో వారి స్ధానంలో ఇంటి పనులు, పిల్లల సంరక్షణ వంటి పని చేసేందుకు పెద్ద నైపుణ్యం లేని వారిని కూడా ధనిక దేశాలు ఆహ్వానిస్తున్నాయి. అది కూడా వారికి లాభసాటిగానే వుంది. ధనిక దేశాలలో వచ్చిన ఈ మార్పు కార్పొరేట్లు, కొంత మేరకు స్ధానికులకు కూడా లాభసాటిగానే వుంటున్నప్పటికీ దివాలాకోరు ఆర్ధిక విధానాల కారణంగా ఆర్ధిక అసమానతలు పెరిగి, సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయి. వలస వచ్చేవారు చౌకగా దొరుకుతుండటంతో స్ధానికుల బేరమాడే శక్తి తగ్గుతున్నది. ఇలాంటి అంశాలన్నీ పచ్చిమితవాదం పెరగటానికి బాగా అనువుగా వున్నాయి.

ఐరోపాకు గుండెకాయ వంటి జర్మనీలో ఎన్నికలలో ప్రత్యామ్నాయ పార్టీ పేరుతో ముందుకు వచ్చిన పచ్చిమితవాదులు 1961తరువాత 13శాతం ఓట్లు, 90సీట్లతో పార్లమెంటులో అడుగు పెట్టారు. నాలుగు సంవత్సరాల క్రితం 4.7శాతం మాత్రమే వచ్చాయి. ఇటీవల ఎన్నికలలో ఆస్ట్రియాలో 46.2, పోలెండ్‌లో 38, ప్రాన్స్‌లో 34, డెన్మార్క్‌లో 21, హంగరీలో 20, ఫిన్లాండ్‌లో 18, నెదర్లాండ్‌, స్వీడన్లలో 13 శాతం చొప్పున ఓట్లు తెచ్చుకున్నారు.అనేక తూర్పు ఐరోపా దేశాలలో ఇలాంటి శక్తులు పెరుగుతున్నాయి. నాలుగు సంవత్సరాల వ్యవధిలో పదిలక్షల మంది వలస కార్మికులను అనుమతిస్తామని ఏంజెలా మెర్కెల్‌ చేసిన ప్రకటన కారణంగా 1949 తరువాత ఆమె నాయకత్వంలోని క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ అతి తక్కువ ఓట్లు పొందింది.ఇస్లాంపై నిషేధం విధించాలనే నినాదంతో చెక్‌ రిపబ్లిక్‌లో మితవాదులు రెండవ స్ధానంలో ఓట్లు తెచ్చుకున్నారు.

పచ్చిమితవాద శక్తుల పెరుగుదల ఐరోపాకే పరిమితం అనుకుంటే పొరపాటు. అమెరికాలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అక్కడ కూడా పరిస్ధితి అలాగే వుంది. అనేక చోట్ల నయా నాజీ బృందాలు రెచ్చిపోతున్నాయి. సకల అవాంఛనీయ శక్తులను ఆహ్వానించటం, మద్దతివ్వటం అమెరికా పాలకవర్గానికి కొత్తేమీ కాదు. ఫాసిస్టులకు కూక్లక్స్‌క్లాన్‌ వంటి సంస్ధలు, అనేక మంది పెట్టుబడిదారులు నాజీలకు బహిరంగంగా మద్దతు ఇచ్చారు.1930 దశకంలో హిట్లర్‌ బ్రౌన్‌ షర్టులు,ముస్సోలినీ బ్లాక్‌ షర్టుల మాదిరి అమెరికాలో సిల్వర్‌ షర్టులు, ఖాకీ షర్టుల వంటి ఫాసిస్టు మూకలు అవతరించినా పెద్దగా ఎదగలేదు.దానికి కారణం తొలి దశలో అంతర్గతంగా అమెరికన్లు కూడా హిట్లర్‌కు మద్దతు ఇచ్చినా రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తరువాత అమెరికా హిట్లర్‌ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపింది. అప్పటి వరకు ఫాసిస్టు షర్టులను చూసీ చూడనట్లు వున్న అమెరికా యంత్రాంగం అమెరికా వైఖరితో మారటంతో వారిని అదుపు చేసేందుకు పూనుకుంది, దాంతో వారు దేశద్రోహులుగా జనం భావించారు. ప్రస్తుతం దేశ వ్యాపితంగా నాజీల మాదిరి నినాదాలతో ఏదో ఒక చోట ప్రదర్శనలు జరపని రోజు లేదు.వారి తీరుతెన్నులపట్ల ఎంతో సానుభూతితో వుండే డోనాల్డ్‌ ట్రంప్‌కు జనం వేసిన ఓట్లలో మెజారిటీ లేకపోయినా ఎలక్టరల్‌ కాలేజీ పేరుతో నడుస్తున్న అప్రజాస్వామిక ఎన్నికల విధానం ద్వారా అధ్యక్షుడయ్యాడు. భయం పెరిగినపుడు మూఢత్వం కూడా పెరుగుతుంది. అనేక ధనిక దేశాలలో గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆర్ధిక సంక్షోభంతో జనంలో భయం పెరుగుతూనే వుంది. అందువలన రానున్న రోజులలో మూఢత్వం ఇంకా పెరగటం అనివార్యం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చిలీ ఎన్నికలు వామపక్షాలకు మరో హెచ్చరిక !

21 Thursday Dec 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion

≈ Leave a comment

Tags

Chile Elections 2017, Latin America’s Left, Latin America’s Right, Latin America’s Rightward Shift

ఎం కోటేశ్వరరావు

డిసెంబరు 17న లాటిన్‌ అమెరికాలోని చిలీ అధ్యక్ష తుది ఎన్నికలు జరిగాయి. మితవాద అభ్యర్ధి సెబాస్టియన్‌ పినెరా గెలిచాడు అనటం కంటే వామపక్ష అభ్యర్ధి అలెజాండ్రో గలియర్‌ ఓటమి పాలయ్యాడని చెప్పాలి. ఆశ్చర్యంగా వుంది కదూ ! సగానికిపైగా ఓటర్లు అసలు ఎన్నికల్లో పాల్గనలేదు, మొదటి దఫా పోలైన ఓట్లలో 64శాతం ఓట్లు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులుగా వున్న అభ్యర్ధులకే వచ్చాయి. తుదివిడత పోటీలో వారి మధ్య ఐక్యత లోపించిన కారణంగా వామపక్ష అభ్యర్ధి ఓటమి పాలయ్యారు. జనాభాలో 45శాతంగా వున్న ఆదివాసులు ఎక్కువ మంది మితవాద పినేరా వైపు మొగ్గుచూపినట్లు విశ్లేషణలు వెలువడ్డాయి.తొలి విడత పోలింగ్‌లో ఓటర్లు కేవలం 46.72 శాతం మాత్రమే ఓటర్లు పాల్గన్నారు. తుది విడతలో 49శాతం వరకు పెరిగినప్పటికీ ఎన్నికలకు దూరంగా వున్న ఓటర్లను సమీకరించటంలో వామపక్ష కూటమి పెద్దగా చేసిందేమీ లేనట్లు స్పష్టమైంది. ఓటింగ్‌ శాతం తగ్గిన అత్యధిక సందర్భాలలో మితవాద, ప్రజావ్యతిరేక శక్తులే చురుకుగా వుంటాయన్నది ప్రపంచ అనుభవం.

ఎన్నికల గడువు దగ్గర పడిన తరువాత నూతన వామపక్ష కూటమి బ్రాడ్‌ఫ్రంట్‌లోని పార్టీలు, తొలిదశలో పోటీ పడిన ఇతర అభ్యర్ధులు గులియర్‌కు మద్దతు ప్రకటించినప్పటికీ అప్పటికే సమయం మించిపోయింది. వారికి వచ్చిన ఓట్లన్నీ గులియర్‌కు పడి వుంటే ఎంతో సులభంగా విజయం లభించి వుండేది. అలా జరగలేదు. సోషలిస్టుపార్టీ నేత బాచ్‌లెట్‌ ప్రభుత్వం పసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్య ఒప్పందం వైపు మొగ్గు చూపటం, వెనెజులాపై ఆరోపణల దాడి జరపటం వంటి అంశాలు కొత్తగా ముందుకు వచ్చిన వామపక్ష కూటమివైపు వామపక్ష అభిమానులు గణనీయంగా మొగ్గు చూపేందుకు దోహదం చేశాయి. బ్రాడ్‌ ఫ్రంట్‌ నేతలు కూడా ప్రచారంలో మితవాద పినేరా కంటే గులియర్‌పై దాడిని ఎక్కుపెట్టటం కూడా దాని మద్దతుదారులు రెండో విడత ఎన్నికలలో ఓటింగ్‌కు దూరం కావటమో లేక నామమాత్రంగా గులియర్‌కు వేసి వుండటమో జరిగింది.

లాటిన్‌ అమెరికాలో ఒక మార్క్సిస్టుగా ఎన్నికలలో ఎన్నికైన ఒక దేశాధ్యక్షుడిగా సాల్వెడార్‌ అలెండీ చరిత్రకు ఎక్కారు. ప్రజాస్వామ్యబద్దంగా 1970లో చిలీ అధ్యక్షుడిగా ఎన్నికైన అలెండీని కొనసాగనిస్తే లాటిన్‌ అమెరికా అంతటా అదే పరిణామం పునరావృతం అవుతుందని భయపడిన అమెరికా కుట్ర చేసి మిలిటరీ జనరల్‌ పినోచెట్‌ నాయకత్వంలో తిరుగుబాటుకు తెరదీసింది. దానిని ఎదుర్కొనేందుకు స్వయంగా తుపాకి పట్టి కుట్రదారుల చేతుల్లో బలైన నేత అలెండీ.

      నవంబరు 19న జరిగిన పోలింగ్‌లో ఎనిమిది మంది పోటీ పడగా వారిలో పినెరాకు 36.64, గలియర్‌కు 22.7, మరో వామపక్ష అభ్యర్ధి బియాట్రిజ్‌ సాంఛెజ్‌కు 20.27శాతం ఓట్లు వచ్చాయి. ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాని కారణంగా తొలి రెండు స్ధానాలలో వున్నవారి మధ్య తుది పోటీ జరిగింది. గలియర్‌ న్యూ మెజారిటీ పేరుతో వున్న అధికార వామపక్ష ప్రజాతంత్ర కూటమి అభ్యర్ధి. ఈ కూటమిలో చిలీ అనగానే గుర్తుకు వచ్చే సాల్వెడార్‌ అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీ నాయకురాలు కాగా కమ్యూనిస్టుపార్టీ, సోషలిజం- పెట్టుబడిదారీ విధానాలలోని మంచిని అమలు జరపాలని చెప్పే విరుద్ద విధానాల క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఇతర చిన్న పార్టీలు వున్నాయి.. మొదటి ఇద్దరి మధ్య తుదివిడత పోటీలో పినేరా 54.58 శాతం ఓట్లతో విజయం సాధించాడు. ఈ ఎన్నికలకు దూరంగా మెజారిటీ ఓటర్లు 51.5శాతం వున్నారు. అధికారంలో వున్న న్యూ మెజారిటీ కూటమి అనుసరించిన విధానాలతో ఓటర్లు ఎంతగా విసిగిపోయారో ఈ అంకె వెల్లడించింది. ఈ కారణంగానే చిలీలో ఇద్దరు ప్రజాభిమానం లేని అభ్యర్ధుల మధ్య పోటీ అనే శీర్షికతో ఒక మీడియా వార్తనిచ్చింది. అధికార కూటమి అభ్యర్ధి ఓటమిని అనేక మంది ముందే సూచించారు. ఎన్నికలకు నెల రోజుల ముందే క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధికార కూటమి నుంచి వైదొలగి తన అభ్యర్ధిని పోటీకి పెట్టింది. ఆరు సంవత్సరాల క్రితం వువ్వెత్తున ఎగిసిన విద్యార్ధి వుద్యమానికి నాయకత్వం వహించిన వారితో పాటు కొన్ని చిన్న వామపక్ష పార్టీలతో ఈ ఏడాది ప్రారంభంలో బ్రాడ్‌ ఫ్రంట్‌ పేరుతో ఏర్పడిన కూటమి అభ్యర్ధే రెండవ స్ధానంలో వుంటారా అన్న వాతావరణం నవంబరు ఎన్నికల సమయంలో ఏర్పడింది. సోషలిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం అమలు జరిపిన విధానాలపై విబేధాల కారణంగా అన్ని వామపక్ష పార్టీలు,శక్తుల మధ్య ఐక్యత కుదిరేది కాదని ముందే తేలిపోయింది.

ఈ పూర్వరంగంలో జరిగిన తుది విడత ఎన్నికలలో మితవాది పినేరా విజయం సాధించాడు. పార్లమెంట్‌ దిగువ సభలోని 155 స్ధానాలకు గాను పినేరా నాయకత్వంలోని కూటమి72 సాధించగా న్యూ మెజారిటీ కూటమి 43, బ్రాడ్‌ ఫ్రంట్‌ 20, క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌పార్టీ కూటమి 14 స్ధానాలు సాధించాయి. ఇతర పార్టీలకు 6 వచ్చాయి. న్యూ మెజారీటీ కూటమిగతం కంటే ఒక సీటును కోల్పోగా దాని భాగస్వామి కమ్యూనిస్టు పార్టీ ఆరు నుంచి ఎనిమిది సీట్లకు పెంచుకుంది. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన, మరోసారి గెలిచిన పినేరా చిలీ నియంత పినోచెట్‌ అనుచరుడు. అతనికి దేశంలోని 15 రాష్ట్రాలలో 13చోట్ల ఆధిక్యత లభించింది. తుది విడత పోటీ పడిన ఇద్దరు అభ్యర్ధుల పట్ల ఓటర్లు అనాసక్తి కనపరచటానికి కారణం వివిధ తరగతుల జీవితాలు చిన్నా భిన్నం కావటానికి కారణమైన స్వేచ్చామార్కెట్‌ లేదా నయా వుదారవాద విధానాలపై ఇద్దరూ వ్యతిరేకంగా మాట్లాడకపోవటమే. తాను గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే అనుసరిస్తానని గలియర్‌ ప్రకటించగా, తాను కార్పొరేట్‌లాభాలపై పన్నులు తగ్గిస్తానని పినేరా వాగ్దానం చేశాడు. వామపక్ష ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో వున్నప్పటికీ నియంత పినోచెట్‌ హయాంలో రూపొందించిన ప్రజావ్యతిరేక రాజ్యాంగాన్ని మార్చటానికి పెద్దగా ప్రయత్నించలేదు. తనను ఎన్నుకుంటే ఆ పని చేస్తానని వామపక్ష కూటమి అభ్యర్ధి గలియర్‌ ప్రకటించినప్పటికీ జనంలో విశ్వాసం కలగలేదని ఓటర్ల అనాసక్తి వెల్లడించింది. గతంలో తాము కోల్పోయిన భూములను తిరిగి పొందేందుకు పోరాడుతున్న ఆదివాసులపై బాచ్‌లెట్‌ ప్రభుత్వం నియంత పాలనలో చేసిన వుగ్రవాద చట్టాన్ని ప్రయోగించి మిగతాపార్టీలకూ వామపక్షాలకు తేడా లేదన్న విమర్శలను మూటగట్టుకుంది. విద్యారంగంలో కూడా జనం కోరిన విధంగా విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు తగిన ప్రయత్నం చేయలేదు.మిగతా లాటిన్‌ అమెరికా దేశాల మాదిరే ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయని కారణంగా పది సంవత్సరాలుగా ధనిక దేశాలలో కొనసాగుతున్న ఆర్ధిక సంక్షోభ ప్రభావం చిలీపై కూడా ఎన్నికలకు ముందు బాచ్‌లెట్‌ ప్రభుత్వానికి జనాదరణ అత్యంత తక్కుగా వున్నట్లు సర్వేలు వెల్లడించాయి.

ప్రపంచ సాంప్రదాయ పెట్టుబడిదారీ, ఇటీవలి కాలపు ద్రవ్య పెట్టుబడిదారీ విధానాలు, వాటికి వున్నత రూపమైన సామ్రాజ్యవాద ప్రయోగశాలగా లాటిన్‌ అమెరికాను మార్చారు. పోరాట సాంప్రదాయం కలిగిన లాటిన్‌ అమెరికాలో తమ దోపిడీకి అడ్డులేకుండా చేసుకొనేందుకు, వామపక్ష, ప్రజావుద్యమాలను వుక్కుపాదంతో అణచివేసేందుకు ప్రజాస్వామిక వ్యవస్ధలను ప్రహసన ప్రాయంగా మార్చి ప్రతి దేశంలోనూ మిలిటరీ నియంతలను రంగంలోకి తెచ్చిన చరిత్ర తెలిసిందే. ‘చికాగో పిల్లలు’గా పిలిపించుకున్న అమెరికన్‌ సలహాదారులు అందచేసిన దివాలాకోరు నయా వుదారవాద విధానాల అమలు ఫలితంగా ఆర్ధికంగా దివాలా, అప్పులపాలైన ఆ ప్రాంత దేశాలలో మిలిటెంట్‌ వుద్యమాలు, తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. తీవ్రమైన అమెరికా వ్యతిరేకత పెల్లుబికింది. పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా అమెరికా ప్రతిష్టించిన పాలకులను సమర్ధించటానికి జంకే పరిస్ధితులు ఏర్పడ్డాయి. సరిగ్గా ఇదే సమయంలో సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసి ప్రచ్చన్న యుద్ధంలో తాము విజయం సాధించామని ప్రకటించుకుంది అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద కూటమి. అంత పెద్ద విజయం సాధించిన తరువాత తమ పెరటితోటలో నియంతల స్ధానంలో నయా వుదారవాద విధానాలను అమలు జరిపే సరికొత్త శక్తులను రంగంలోకి తెచ్చేందుకు అమెరికా అనుమతించింది. ఆక్రమంలో ఆ పాలకుల వైఫల్యం, ఆ కారణంగా ఏర్పడే ఖాళీలో వామపక్ష శక్తులు విజయం సాధిస్తాయన్నది సామ్రాజ్యవాద శక్తులు వూహించని పరిణామం. ఆ క్రమాన్ని అడ్డుకోవటం అంటే తిరిగి సైనిక, మితవాద నియంతలను ప్రతిష్టించటం లేదా మరోసారి ప్రజాస్వామ్య పీకనులిమినట్లు ప్రపంచానికి తెలియచెప్పటమే. అందువలన తనను వ్యతిరేకించే శక్తులను అనుమతించటం తప్ప వారికి మరొక తక్షణ మార్గం లేకపోయింది.

దశాబ్దాల తరబడి లేని ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించటం, తక్షణం వుపశమనం కలిగించే చర్యలు, కొన్ని సంక్షేమ పధకాలను అమలు జరిపిన కారణంగా వెనెజులా, బ్రెజిల్‌, అర్జెంటీనా, బలీవియా వంటి చోట్ల వరుసగా వామపక్ష శక్తులు విజయాలు సాధించటం అది ఇతర దేశాలకు వ్యాపించిన చరిత్ర తెలిసిందే. అయితే నయావుదారవాదం, ద్రవ్యపెట్టుబడిదారీ విధానాల ప్రాతిపదికన ఏర్పడిన దోపిడీ వ్యవస్ధ మూలాలను దెబ్బతీయకుండా వాటి పెరుగుదలను అనుమతిస్తూనే మరోవైపు సంక్షేమ చర్యలను అమలు జరపటం ఎంతో కాలం సాధ్యం కాదని గుర్తించటంలో లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తుల వైఫల్యం కనిపిస్తోంది. నయా వుదారవాద విధానాల చట్రం నుంచి బయటపడని కారణంగా ఆ ప్రభుత్వాలు కూడా ప్రజల అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి తోడు వామపక్షాలుగా వున్న కొన్ని పార్టీల నేతల అవినీతి అక్రమాలు, విధానపరమైన వైఫల్యాల కారణంగా మితవాద, కార్పొరేట్‌ శక్తులు జనాన్ని రెచ్చగొట్టటంలో కొంత మేర జయప్రదం అయ్యాయి. అర్జెంటీనా, బ్రెజిల్‌లో మితవాదులు అధికారానికి రాగా వెనెజులా పార్లమెంట్‌లో ఆధిక్యతను సాధించారు. చిలీలోని వామపక్ష శక్తులు కూడా నయావుదారవాద పునాదుల మీదే పాలన సాగించటం, అధ్యక్షురాలు బాచ్‌లెట్‌ కుటుంబ సభ్యులపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణలపై విచారణ వంటివి అక్కడ ఓటమికి కారణం. మితవాది పినేరా విజయం సాధించటానికి దారితీసిన పూర్వరంగాన్ని నెమరువేసుకోవటం అవసరం. చిలీ రాజ్యాంగం ప్రకారం ఒక దఫా అధ్యక్షపదవికి ఎన్నికైన వారు తదుపరి ఎన్నికలలో పాల్గనటానికి అవకాశం లేదు. తాజా ఎన్నికలలో విజయం సాధించిన సెబాస్టియన్‌ పినేరా 2010-14 మధ్య అధ్యక్షుడిగా పని చేశాడు. తరువాత అధ్యక్షురాలిగా ఎన్నికైన మిచెల్లీ బాచ్‌లెట్‌ అంతకు ముందు ఒకసారి అధ్యక్షరాలిగా పని చేశారు. అంటే గత పదమూడు సంవత్సరాలలో బాచ్‌లెట్‌-పినేరా పాలనా తీరుతెన్నులను చూసిన చిలీ ఓటర్లు పళ్లూడగొట్టుకొనేందుకు ఏ రాయి అయినా ఒకటే అనే నిర్వేదానికి లోనయ్యారంటే అతిశయోక్తి కాదు. నియంత పినోచెట్‌ పాలన 1990లో అంతరించినా వాడి హయాంలో రూపొందించిన కార్పొరేట్‌ అనుకూల, ప్రజావ్యతిరేక రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు లేకుండా గత 27 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఎవరు అధికారంలోకి వచ్చినా ఒకటే అని ఓటర్లు భావిస్తున్నందున ఇటీవలి ఎన్నికలలో మెజారిటీ ఓటర్లు పోలింగ్‌ బూత్‌లవైపు చూడటం లేదు. తాజా ఎన్నికలకు ముందు జరిగిన ఒక సర్వేలో కేవలం 29శాతం మంది మాత్రమే రాజకీయ పార్టీల పట్లవిశ్వాసం వెలిబుచ్చగా సగం మంది తమకు రాజకీయాలంటే ఆసక్తిలేదని పేర్కొన్నారు. పినోచెట్‌ నియంతృత్వానికి గురైన కుటుంబానికి చెందిన వ్యక్తిగా మిచెల్లీ బాచ్‌లెట్‌పై వున్న గౌరవం, అధ్యక్షుడిగా పినేరా అవినీతి అక్రమాలతో విసిగిపోయిన జనం గత ఎన్నికలలో బాచ్‌లెట్‌వైపు మొగ్గారు. ఈసారి ఆమె పోటీకి అనర్హురాలు కావటంతో జర్నలిస్టు అయిన గులియర్‌ను అభ్యర్ధిగా నిలిపారు. అయితే అతనిని బయటి వ్యక్తిగా చూశారని విశ్లేషకులు చెబుతున్నారు. తాను ప్రజలందరి అధ్యక్షుడిని అని ప్రచారం చేసుకోవటం కూడా దెబ్బతీసి వుండవచ్చు.

ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్లుగా అర్జెంటీనా, బ్రెజిల్‌లో ఇటీవల పెద్ద ఎత్తున అక్కడి మితవాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జనం తిరిగి వీధులలోకి వస్తున్నారు. అందువలన ఇప్పటికీ అధికారంలో వున్న లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులుగానీ, అధికారం కోల్పోయిన దేశాల్లోని శక్తులుగానీ నయావుదారవాద మూలాలను దెబ్బతీసి దోపిడీ నుంచి కార్మికవర్గాన్ని కాపాడే ప్రత్యామ్నాయ అర్ధిక విధానాలకు రూపకల్పన చేసి ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనటం తప్ప మరొక దగ్గర మార్గం కనిపించటం లేదు. గత రెండు దశాబ్దాలలో సాధించిన విజయాలు,తాజాగా ఎదురవుతున్న అపజయాలను సమీక్షించుకొని ముందుకు ఎలా పోవాలా అన్న మధనం ఇప్పటికే అక్కడి వామపక్ష శక్తులలో ప్రారంభమైంది. నయా వుదారవాద పునాదులపై నిర్మించిన వ్యవస్ధలను కూల్చకుండా ప్రత్యామ్నాయ నిర్మాణాలు చేయలేమని తేలిపోయింది. ప్రపంచ సోషలిస్టు శక్తులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన సమయంలోనే లాటిన్‌ అమెరికాలో అరుణపతాక రెపరెపలు ప్రారంభమయ్యాయి. సోషలిస్టు శిబిరానికి తగిలిన ఎదురుదెబ్బల కంటే ప్రస్తుతం లాటిన్‌ అమెరికాలో ఎదురవుతున్న ఓటములు పెద్దవేమీ కాదు. ఇప్పటికే వెనెజులాలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మిగతా దేశాలలో కూడా ఆ క్రమం అనివార్యం. కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌ వూహించినట్లుగా తమకాలంలో అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో విప్లవం సంభవించలేదు. అనూహ్యంగా ఇతర చోట్ల వచ్చింది. లాటిన్‌ అమెరికాలో తదుపరి దశ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు, కార్పొరేట్‌, మితవాద శక్తుల పునాదులను కూల్చివేయటమే కనుక వాటి నుంచి ప్రతిఘటన గతం కంటే తీవ్రంగా వుంటుంది. ఆ పరిణామాలు ఎలా వుంటాయన్నది జోశ్యం చెప్పే అంశం కాదు.చుంచెలుక భూమిలో నిరంతరం తవ్వుతూ అప్పుడప్పుడు బయటికి కనిపించినట్లుగా విప్లవ క్రమం అంతర్గతంగా నిరంతరం జరుగుతూనే వుంటుంది. అది ఎప్పుడు, ఎలా,ఎక్కడ బయటకు వస్తుందో చెప్పలేము.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

లోక్‌సభ ముందస్తు ఎన్నికలను ముందుకు తెచ్చే గుజరాత్‌ విజయం ?

19 Tuesday Dec 2017

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Congress party, gujarat election verdict, lok sabha midterm polls, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

గుజరాత్‌ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎలాగైతేనేం అక్కడ మా మోడీ విజయం సాధించాడా లేదా అని బుర్రలో గాక మరెక్కడో మెదళ్లున్నవారు చేసే వాదనలు పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే అలాంటి అలగా తరగతి ఎప్పుడూ అన్ని పాలకవర్గ పార్టీల వెనుకా వుంటుంది. ఇలాంటి వారు నిజంగా ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే శక్తులకు వుత్తేజమిస్తుంటారు. తాము అధికారంలోకి వస్తే, విదేశాల్లోని నల్లధనాన్ని తెచ్చి బ్యాంకు ఖాతాల్లో తలా పదిహేను లక్షల రూపాయలు వేస్తామన్నట్లుగా ఎన్నికల ప్రచారంలో జనాన్ని నమ్మించారు. ఇదేమిటయ్యా అమిత్‌ షా అని ఎన్నికల తరువాత అడిగితే ఎన్నికల జుమ్లా , ఓట్ల కోసం అనేకం చెబుతుంటాం అని చిరునవ్వు నవ్వేశాడు. గుజరాత్‌లో ఈసారి తమకు 150 సీట్లు వస్తాయని ఆ పెద్దమనిషే ప్రచారం చేశాడు. అవెక్కడ అంటే జుమ్లా అని మరోసారి నవ్వేస్తారు. సోమవారం నాడు ఓట్ల లెక్కింపు సందర్భంగా కొన్ని గంటల పాటు బిజెపి నేతలకు ముచ్చెమటలు పట్టాయి.

సంఘపరివార్‌ ప్రయోగశాల గుజరాత్‌. గత రెండు దశాబ్దాలుగా మైనారిటీల వ్యతిరేక, మెజారిటీ అనుకూల మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఓటు బ్యాంకును తయారు చేసేందుకు అది చేయని అవాంచనీయ చర్యలు లేవు.అలాంటి చోట కూడా బిజెపి చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా స్వల్పమెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంది. సమగ్ర విశ్లేషణలకు సమాచారం ఇంకా అందుబాటులోకి రావాల్సి వుంది. పూర్తిగా పట్టణ లేదా లేదా అత్యధిక భాగం పట్టణ ఓటర్లున్న 53 నియోజకవర్గాలలో బిజెపి 45చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 129 గ్రామీణ నియోజకవర్గాలలో 72 చోట్ల గెలిచింది. మతోన్మాదం పట్టణాలలో ఎక్కినంతగా గ్రామీణంలో ఎక్కదని, ఎక్కినా వ్యవసాయ సంక్షోభంలో తమకు మతం వండి వార్చేదేమీ వుండదని గ్రామీణులు గ్రహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇదొక మంచి సంకేతం. పట్టణ ప్రాంతాలలో కూడా బిజెపి సీట్లు తెచ్చుకున్నప్పటికీ దాని ఓట్లు 2014తో పోల్చితే పదకొండు శాతం వరకు తగ్గాయి. ఈ పరిణామం కూడా బిజెపి ఆందోళన కలిగించేదే. మొత్తం మీద చూసినపుడు లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే బిజెపి ఓట్లు 10.2 నుంచి 10.9 మధ్య తగ్గగా ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఓట్లు 6.2 నుంచి 10.8శాతం వరకు పెరిగాయి. అంటే బిజెపికి తగ్గిన ఓట్లు పూర్తిగా కాంగ్రెస్‌కు పడలేదు.

ఒక నమూనా రాష్ట్రంగా అభివృద్ధి చేశానని చెప్పుకున్న చోటే నరేంద్రమోడీ ఆ విషయం మినహా మిగతా విషయాలన్నీ ముందుకు తెచ్చారు. కాంగ్రెస్‌ నేత నీచ్‌ కిసామ్‌కా ఆద్మీ( నీచపు పనులు చేసే వ్యక్తి) అని చేసిన వ్యాఖ్యకు కాళిదాసు కవిత్వానికి తన పైత్యాన్ని జోడించినట్లుగా గుజరాత్‌లో అత్యధికంగా చదివే గుజరాత్‌ సమాచార్‌ పత్రిక ‘మోడీ నీచ్‌ జాతినో మానాస్‌ ఛే (ఒక తక్కువ కులంలో పుట్టిన మోడీ) అన్నట్లుగా కులాన్ని, మోడీ పేరును జతచేసి మొదటి పేజీలో సంచలనాత్మకంగా ప్రకటించి చివరి క్షణంలో బిజెపికి మేలు చేసింది. కీలక సమయాల్లో మీడియా ఎలాంటి పాత్ర పోషించగలదో ఈ ఎన్నికలు నిరూపించాయి. బిజెపి, మోడీ మీద కోపంతో ఓటర్లు మరొక ప్రత్యామ్నాయం లేదు కనుక కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు తప్ప నిజానికి కాంగ్రెస్‌ మీద అభిమానం కలగటానికి ఒక ప్రతిపక్షంగా గత రెండు దశాబ్దాలలో అక్కడ అది చేసిందేమీ లేదు. ఈ పూర్వరంగంలో గుజరాత్‌ ఎన్నికల ఫలితాల పర్యవసానాలు ఎలా వుంటాయి అన్నది చర్చనీయాంశంగా ముందుకు వస్తోంది.

బిజెపికి పోటీగా మరో పార్టీలేని చోట్ల తమవైపు తిరిగి ఓటర్లు మొగ్గుతారని కాంగ్రెస్‌లో ఆశలు రేగుతాయి. అనేక పార్టీలున్న చోట్ల ఎవరికి వారే తామే ప్రత్యామ్నాయంగా ఓటర్ల ముందుకు వచ్చేందుకు కాంగ్రెసేతర పార్టీలు పోటీ పడతాయి. కాంగ్రెస్‌ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా వున్న చోట్ల ఆప్‌, బిఎస్‌పి వంటి పార్టీలు దెబ్బతింటాయి. ఓటర్లు తమకు ఇష్టం వున్నా లేకపోయినా బిజెపిపై తలెత్తిన అసంతృప్తితో నిఖరంగా ఆ పార్టీని ఓడించగల శక్తివైపే మొగ్గు చూపవచ్చు.ప్రాంతీయ పార్టీలు బలంగా వున్న చోట్ల కాంగ్రెస్‌ పరిస్ధితి ఇప్పుడున్న మాదిరే వుండవచ్చు లేదా దిగజారవచ్చు. అటు కాంగ్రెస్‌ లేదా బిజెపి బలంగా లేని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి చోట్ల ఇప్పటి వరకు బిజెపితో అంటకాగిన లేదా బిజెపి పంచన చేరాలని చూస్తున్న పార్టీలలో పునరాలోచన మరింత తీవ్రంగా జరగవచ్చు. ప్రాంతీయ పార్టీలను మింగి తాను ఎదగాలని బిజెపి చూస్తున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ వంటి చోట్ల గుజరాత్‌ ఫలితాలు బిజెపిని ఇరుకున పెడతాయి.శివసేన, తెలుగుదేశం వంటి పార్టీలు నష్ట నివారణ చర్యలకు దిగుతాయి, సమయం వచ్చినపుడు, వాటంగా వుంటే బిజెపిని వదలిపోయినా ఆశ్చర్యం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి తాను బలపడేందుకు అటు తెలుగుదేశం, ఇటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏది వాటంగా వుంటే దానితో వుండేందుకు గల అవకాశాలను చూస్తున్నది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను నిరాకరించిన బిజెపి దాని కంటే మెరుగైన ప్రత్యేక పాకేజీ ఇస్తామని చెప్పి దానికి కూడా మొండి చేయి చూపింది. పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి అటు తెలుగుదేశం పార్టీ ఇటు బిజెపి ఎవరి నాటకాన్ని వారు బాగారక్తి కట్టిస్తున్నారు. ఒక వేళ బిజెపి తో తెగతెంపులు చేసుకొంటే రాష్ట్రానికి బిజెపి చేసిన ఈ ద్రోహాలను జనం ముందు పెట్టి తెలుగుదేశం ఒంటి కంటితో( ఎందుకంటే చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం ప్రకారం మరో కన్ను తెలంగాణా కనుక ఆయనకు మిగిలింది మరొకటి మాత్రమే అనే అవగాహనతో) ఏకధారగా నీరు గార్చి ఓటర్ల ముందుకు వెళ్లేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకొని ముందస్తు ఎన్నికలకు పోవాలని ఆలోచన చేస్తున్నారన్నది బలంగా వినిపిస్తున్న వార్తలు. ఇక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ విషయానికి వస్తే గుజరాత్‌ ఫలితాలు జగన్‌లో ముఖ్యమంత్రి పీఠంపై మరింతగా ఆశలు పెంచవచ్చు. ఒక ప్రతిపక్షంగా విఫలమైనప్పటికీ గుజరాత్‌ ఓటర్లు బిజెపి మీద వ్యతిరేకతతో కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లే ఆంధ్రప్రదేశ్‌లో వున్న ప్రధాన ప్రతిపక్షం తామే గనుక తమ మీద ఇష్టం వున్నా లేకపోయినా చంద్రబాబు మీద వ్యతిరేకతతో జనం ఓట్లు వేస్తారనే ఆశలు కలగవచ్చు.

ఇక బిజెపి విషయానికి వస్తే అన్ని పార్టీల కంటే గుజరాత్‌లో గెలిచిన సంతోషం కంటే దాని పర్యవసానాల గురించి ఆందోళన పెరగటం ఖాయం. పార్టీలో నరేంద్రమోడీ ఏకపక్ష వైఖరితో ఇప్పటికే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్న శక్తులు మరింతగా దాడిని పెంచుతాయా లేక మొదటికే మోసం వస్తే ఎలా అని సర్దుబాటు చేసుకుంటాయా అన్నది ఒక అంశం. అధికారమే పరమావధిగా వుండే పాలకపార్టీలలో అత్యధిక సందర్భాలలో బాధితులు రాజీపడిన సందర్భాలు తక్కువ. గ్రామీణుల ఆదాయాలను రెట్టింపు చేసి అదనంగా అన్న వస్త్రాలను అంద చేస్తామని చెప్పిన నరేంద్రమోడీ విధానాలు వున్న వస్త్రాలను కూడా లాగివేస్తున్నాయి. లోకసభ ఎన్నికల నిర్దిష్ట గడువు వరకు పరిస్ధితి ఇలాగే వుంటే పట్టణ ప్రాంతాలతో పాటు అంతకంటే ఎక్కువగా గ్రామీణంలో బిజెపి వ్యతిరేకత పెరగటం అనివార్యం.

బిజెపి లేదా కాంగ్రెస్‌ గానీ ప్రజావ్యతిరేక, ద్రవ్యపెట్టుబడిదారీ అనుకూల, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యసంస్ధ ఆదేశిత విధానాల అమలులో తక్షణమే వెనక్కు తిరిగి రాలేనంతగా కూరుకుపోయాయి. వాటిని మరింత వేగంగా, ఎక్కువగా అమలు జరపాలనే వత్తిడి పెరుగుతోంది. అదే జరిగితే గ్రామీణ వ్యవస్ధ మరింత తీవ్ర సంక్షోభానికి గురి కావటం అనివార్యం. నరేంద్రమోడీ విషయానికి వస్తే తాను ప్రజలకు చేసిన వాగ్దానాలకంటే పైన చెప్పుకున్న శక్తుల విధానాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతి ఏటా రూపొందించే సులభతర వాణిజ్య ర్యాంకులో మోడీ సర్కార్‌ ఏకంగా 130 నుంచి వందవ స్ధానానికి ఎగబాకింది. ప్రపంచ ధనిక దేశాలలో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక సంక్షోభం 2018లో పదవ సంవత్సరంలో ప్రవేశించనుం ది. అది ఎప్పటికి పరిష్కారం అవుతుందో, కనీసం సంక్షోభ పూర్వపు స్ధాయికి అయినా ఎప్పుడు వస్తుందో తెలియని స్ధితి. దాని పర్యవసానాలు మన ఆర్ధిక వ్యవస్ధపై బలంగా పడే సమయంలో నరేంద్రమోడీ అధికారానికి వచ్చారు. గత మూడున్నర సంవత్సరాలలో వుత్పాదక, ఎగుమతి రంగాలలో దిగజారుడు ఆ సంక్షోభపర్యవసానాలే. అయితే చమురు ధరలు గణనీయంగా పడిపోవటంతో దిగుమతుల బిల్లు తగ్గిపోయి జనానికి పెద్దగా నొప్పి కలగలేదు. గత కొద్ది నెలలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి, రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయని జోశ్యం చెబుతున్నారు. ఇప్పటికే లీటరుకు పది రూపాయలకు పైగా ధరలు పెరిగాయి, కిరోసిన్‌, గ్యాస్‌ సబ్సిడీ క్రమంగా తగ్గిస్తున్నారు. ఇప్పటి మాదిరే వున్నప్పటికీ మన దిగుమతుల బిల్లు పెరిగిపోయి, దానిని సర్దుబాటు చేసేందుకు వ్యవసాయ రంగానికి, ఇతర సంక్షేమ చర్యలకు ఇస్తున్న సబ్సిడీలను మరింతగా కోత పెట్టటం, లేదా పన్ను భారాలను పెంచటం మినహా మరొక దగ్గరదారి లేదు. వీటన్నింటినీ చూసినపుడు ఏం చేసినా అది మోడీ ప్రతిష్టను మరింత దిగజార్చుతుంది. అందువలన గడువుకు ముందే ముందస్తున్న ఎన్నికలకు పోతారని గత కొంతకాలంగా వినవస్తున్నది. గుజరాత్‌లో భారీ మెజారిటీతో గెలిస్తే దాన్ని చూపి దేశమంతటా ప్రచారం చేసేందుకు ముందుస్తున్న ఎన్నికలకు పోతారని ముందుగానే పండితులు అంచనాలు వేశారు. ఇప్పుడు గెలిచినా దాన్ని పెద్దగా చెప్పుకొని సంబర పడే స్దితి లేదు.వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, చత్తీస్‌ఘర్‌ బిజెపి పాలితం కాగా కర్ణాటక కాంగ్రెస్‌, త్రిపుర సిపిఎం ఏలుబడిలో వున్నాయి. వాటి ఫలితాలు కూడా లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైతే అది రాజకీయంగా బిజెపికి నష్టం. ఇది కూడా ముందస్తు ఎన్నికలను ముందుకు తెస్తుందనే చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పార్లమెంట్‌, రాష్ట్రాలలో నేపాల్‌ కమ్యూనిస్టు ఐక్యకూటమి ఘనవిజయం !

13 Wednesday Dec 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

cpn uml, kp sharma oli, Nepal communists, Nepal elections, prachanda

మాజీ ప్రధాని, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ యుఎంఎల్‌ అధ్యక్షుడు కెపి శర్మ ఓలీ

ఎం కోటేశ్వరరావు

ప్రపంచంలో కమ్యూనిస్టులకు ఎదురు దెబ్బలు తగిలిన పూర్వరంగంలో నేపాల్‌ కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించారు.ఒక నాడు ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా ప్రకటించిన నేపాల్‌లో అన్ని మతాలకు సమాన గుర్తింపు నిచ్చే లౌకిక, ప్రజాస్వామ్య నూతన రాజ్యాంగం రచనలో కమ్యూనిస్టులు భాగస్వాములు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన స్ధానాలలో మూడింట రెండు వంతులపైగా మెజారిటీ ఇప్పటికే సాధించారు. దామాషా స్ధానాలను కలిపినపుడు కూడా అదే మెజారిటీ పొందే అవకాశాలున్నాయి. కమ్యూనిస్టులే సంపూర్ణ మెజారిటీతో ఏర్పాటు చేసే ప్రభుత్వం నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాతే ఇదే ప్రధమం. నవంబరు 26, డిసెంబరు ఏడవ తేదీన రెండు విడతలుగా 275 సీట్లకు జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టుల విజయం హిమాలయ దేశంపై ఆసక్తి చూపుతున్న అన్ని దేశాలలో ముఖ్యంగా కమ్యూనిస్టులు అధికారానికి రావద్దని కోరుకుంటున్న వారిలో వేడిపుట్టించిందంటే అతిశయోక్తికాదు.

పార్లమెంట్‌లోని 275 స్ధానాలు ఏడు రాష్ట్రా( ప్రాంతాలు)లలో విస్తరించి వున్నాయి. వాటిలో 165 నియోజకవర్గాలకు మనదేశంలో మాదిరి ప్రత్యక్ష ఎన్నికలు, 110 స్ధానాలకు పార్టీలకు వచ్చిన ఓట్లను బట్టి దామాషా పద్దతిలో ఎన్నికలు జరిగాయి.  165కు గాను 116 చోట్ల కమ్యూనిస్టులు విజయం సాధించారు. మొత్తం ఓట్లు లెక్కింపు పూర్తి అయిన తరువాత పదిహేనవ తేదీన దామాషా ప్రాతిపదికన వచ్చిన సీట్లను పార్టీలకు కేటాయిస్తారు. బుధవారం నాటికి జరిగిన లెక్కింపు వివరాల మేరకు దామాషా ఓట్లలో నేపాలీ కమ్యూనిస్టుపార్టీ యుఎంఎల్‌ 35.35శాతం ఓట్లతో ముందుండగా నేపాలీ కాంగ్రెస్‌ 33.62శాతంతో రెండవ స్ధానంలో, 13.63 శాతంతొ మావోయిస్టు సెంటర్‌ మూడవ స్ధానంలో కొనసాగుతోంది. మరో మూడు పార్టీలు సాధించాల్సిన కనీస మూడుశాతం కంటే ఎక్కువ తెచ్చుకొని దామాషా సీట్లలో ప్రాతినిధ్యం పొందనున్నాయి. మొత్తం స్ధానాలలో 33శాతం మహిళలకు కేటాయించారు. ఏడు ప్రాంతాల శాసనసభకు జరిగిన ఎన్నికలలోనూ నేపాల్‌ కమ్యూనిస్టుపార్టీ యుఎంఎల్‌ అభ్యర్ధులు ఆరు చోట్ల మెజారిటీలో వున్నారు. ఒక రాష్ట్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. రాష్ట్రాల శాసన సభలలో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల స్ధానాలలో యుఎంఎల్‌ 166,మావోయిస్టు సెంటర్‌ 73, నేపాలీ కాంగ్రెస్‌ 45, ఇతర పార్టీలు 45 తెచ్చుకున్నాయి. దామాషా సీట్లకు గాను నమోదైన పార్టీలు కనీసంగా ప్రతి రాష్ట్రంలో 1.5శాతం ఓట్లు తెచ్చుకుంటే ప్రాతినిధ్యం పొందుతాయి.

మావోయిస్టు సెంటర్‌ నేత ప్రచండ

తమ కూటమి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధిస్తుందనే విశ్వాసాన్ని ఎన్నికల ముందు వ్యక్తపరచిన యుఎంఎల్‌ నాయకుడు కెపి శర్మ ఓలీ మాటలను అతిశయోక్తిగా వర్ణిస్తూ మహా అయితే స్వల్ప మెజారిటీ సాధించవచ్చునేమో అని అనేక మంది కొట్టిపారేశారు. మావోయిస్టులు అధికారంలో కొనసాగుతూనే ప్రతిపక్షంలో వున్న యుఎంఎల్‌ పార్టీతో అవగాహనకు రావటంపై సహజంగానే వుభయ పార్టీలలో కొంత అసంతృప్తి రేపింది. సీట్లు కోల్పోయిన వారు, రాని వారు కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తారేమోనని సందేహించారు. కమ్యూనిస్టు పార్టీల మధ్య అవగాహనను దెబ్బతీసేందుకు మావోయిస్టు సెంటర్‌ నేత ప్రచండకు చివరి క్షణంలో నేపాలీ కాంగ్రెస్‌నేతలు ప్రధాని పదవిని ఎరవేసినా ఆశ్చర్యం లేదని కొందరు వూహించారు. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ కమ్యూనిస్టులు విజయకేతనం ఎగుర వేశారు. మూడింట రెండువంతుల కంటే ఎక్కువగా సీట్లను పొందారు.

అక్టోబరు రెండవ తేదీన నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(యుఎంఎల్‌) నేపాలీ కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు సెంటర్‌) మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 60:40 దామాషా పద్దతిలో రెండు పార్టీలు పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత పార్టీల ఐక్యతా క్రమాన్ని ప్రారంభిస్తారు. యుఎంఎల్‌ పార్టీ 80, మావోయిస్టు సెంటర్‌ 36 సీట్లు గెలుచుకుంది. రద్దయిన పార్లమెంటులో పెద్ద పార్టీగా వున్న నేపాలి కాంగ్రెస్‌కు 23, ఇతర పార్టీలకు 26 సీట్లు వచ్చాయి. మావోయిస్టు సెంటర్‌ నుంచి విడిపోయి నయాశక్తి పార్టీ ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని బాబూరామ్‌ భట్టారాయ్‌ని తమ గుర్తుపై పోటీ చేసేందుకు మావోయిస్టు సెంటర్‌ నిరాకరించింది. దాంతో ఆయన నేపాలీ కాంగ్రెస్‌తో అవగాహనకు వచ్చి పార్లమెంటుసీటులో విజయం గెలిచారు. వచ్చిన వార్తలను బట్టి యుఎంఎల్‌ పార్టీ అధ్యక్షుడు కెపి శర్మ ఓలి ప్రధానిగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. నేపాల్‌ నూతన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగిన 30 రోజుల లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వుంది. ఎన్నికల తరువాత రెండు పార్టీల విలీనం జ రుగుతుందని గతంలో ప్రకటించారు.

. రాచరిక వ్యవస్ధ అంతరించిన తరువాత నేపాల్‌ రాజకీయ అవనికపై నేపాలీ కాంగ్రెస్‌, యుఎంఎల్‌, మావోయిస్టు సెంటర్లే ప్రధాన పాత్ర పోషించాయి. వాటి మధ్యే సంకీర్ణ కూటమి అవగాహనలు కుదిరాయి, ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి, విడిపోయాయి. అందువలన వైఫల్యాలకు మూడు పార్టీలను బాధ్యులను చేయాల్సి వుంటుంది. అసలే పేద దేశం దానికి తోడు దశాబ్దాల పాటు ఫూడల్‌ రాచరిక వ్యవస్ధలో ప్రజాస్వామ్యం, ఎలాంటి అభివృద్ధి లేని దేశంలో రాచరికానికి వ్యతిరేకంగా దీర్ఘకాలం సాగిన అంతర్యుద్ధం, అది ముందుకు తెచ్చిన అంశాలు, వేర్పాటు వాదం వంటి సమస్యలు నూతన ప్రభుత్వం ముందున్నాయి.చైనాతో సన్నిహిత సంబంధాలతో పాటు ఆ దేశ పెట్టుబడులను ఆహ్వానించాలని కమ్యూనిస్టులు కోరుకుంటున్న కారణంగానే జలవిద్యుత్‌ ప్రాజక్టుల వంటివి ఆలశ్యమయ్యాయని విమర్శకులు ఆరోపించారు. అదే సమయంలో నేపాలీ కాంగ్రెస్‌కు గతంలో భారత్‌తో వున్న సంబంధాల కారణంగా భారత్‌తో స్నేహంగా వుండాలనే వైపు మొగ్గు చూపారని కూడా విశ్లేషకులు పేర్కొన్నారు.

రాచరిక వ్యవస్ధ కూలిపోయిన తరువాత ఏర్పడిన అనేక సంకీర్ణ ప్రభుత్వాలు, భాగస్వామ్య పక్షాల మధ్య తలెత్తిన సమస్యలు, నూతన రాజ్యాంగంపై ఏర్పడిన ప్రతిష్ఠంభన, కొన్ని ప్రాంతాలలో వ్యతిరేకత వ్యక్తం కావటం, ఇరుగు పొరుగు దేశాలజోక్యం, ప్రభావం,పేదరికం, దారిద్య్రం, ప్రజల ఆకాంక్షల వంటి అనేక సమస్యలు నూతన ప్రభుత్వం ముందున్నాయి. ఈ పూర్వరంగంలో నూతన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగటమే ఒక ముఖ్యాంశంగా చెప్పాల్సి వుంటుంది. రిపబ్లికన్‌, ఫెడరల్‌ లక్షణాలతో కూడిన నూతన రాజ్యాంగాన్ని 2015 సెప్టెంబరులో ఆమోదించారు. 2018జనవరిలోగా కొత్త రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగాలన్నది ఆదేశం. రద్దయిన పార్లమెంట్‌లో అధికార కూటమిలో వున్న నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు సెంటర్‌) ప్రధాన ప్రతిపక్షంగా వున్న నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(యుఎంఎల్‌)తో అవగాహనకు రావటం దేశ రాజకీయాలలో నూతన వుత్తేజాన్ని నింపటంతో పాటు ప్రజామోదం పొందినట్లు ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి.

ఎన్నికలకు ముందు నేపాల్‌లో కొన్ని ఆసక్తికర పరిణామాలు సంభవించాయి. నేపాలీ కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రభుత్వంలో మావోయిస్టు సెంటర్‌ భాగస్వామి. దాని మంత్రులు రాజీనామా చేయకుండానే ప్రతిపక్ష యుఎంఎల్‌ పార్టీతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది. దీంతో నేపాలీ కాంగ్రెస్‌ దేశంలోని కమ్యూనిస్టేతర పార్టీలన్నింటినీ ప్రభుత్వంలోకి ఆహ్వానించటమే గాక కొత్త మంత్రులను కొందరిని చేర్చుకొని వారికి మావోయిస్టు మంత్రుల శాఖలను కేటాయించారు. రాచరిక వ్యవస్ధను సమర్ధించే రాష్ట్రీయ ప్రజాతంత్రపార్టీ, మధేశీపార్టీల వంటి వాటిని చేరదీశారు. అయితే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్నట్లుగా వాటి మధ్య ఐక్యత కానరాలేదు. మధేశీ పార్టీలలో ఒకటైన ఎన్‌డిఎఫ్‌ మాత్రమే నేపాలీ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఎన్నికల ప్రచార తీరు తెన్నులను చూస్తే కమ్యూనిజమా లేక ప్రజాస్వామ్యమా అన్న పద్దతిలో మార్చివేసిన కమ్యూనిస్టేతర పార్టీలు దేశంలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టచూశాయి. ఇదే సమయంలో ఎన్నికలను విచ్చిన్నం చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. అసంతృప్తి చెందిన మావోయిస్టులు, ఇతరులు కొందరు కొన్ని చోట్ల బాంబుల దాడులు కూడా జరిపారు. కొన్ని చోట్ల సైన్యాన్ని దింపాల్సి వచ్చింది. మొత్తం మీద ఎన్నికలు జరగటం ఒక విశేషంగానే పరిశీలకులకు కనిపించింది.

మాజీ ప్రధాని, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ యుఎంఎల్‌ అధ్యక్షుడు కెపి శర్మ ఓలీ విజయోత్సవ సభలో మాట్లాడుతూ ప్రజలు మా కార్యక్రమాన్ని ఆమోదించారు. వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు అభివృద్ధికోసం ప్రతిపక్షాలను కూడా కలుపుకుపోతాం, దేశాభివృద్ధికి ఏకాభిప్రాయం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదన్నారు. ఇతర శక్తులను విమర్శించే లేదా నిందించే రోజులు పోయాయి, ఇప్పుడు దేశం స్ధిరత్వాన్ని చూడనుంది, మేం అభివృద్ధి గురించి తప్ప రాజకీయాలు మాట్లాడబోం అన్నారు.పార్లమెంటరీ మెజారిటీ సాధించటంతోనే స్ధిరత్వం రాదని అభివృద్ధి, సంపదల సృష్టికి నేతలు సుముఖత చూపితేనే సాధ్యమని చెప్పారు.

ఎన్నికల తరువాత దేశం రాజకీయ స్ధిరత్వం మరియు అభివృద్ధి బాటలో ప్రవేశించిందని మావోయిస్టు సెంటర్‌ అధ్యక్షుడు పుష్ప కమాల్‌ దహాల్‌( ప్రచండ) వ్యాఖ్యానించారు.చిటవాన్‌ మూడవ నంబరు పార్లమెంటరీ స్ధానం నుంచి విజయం సాధించిన సందర్భంగా ఎన్నికల సంఘ అధికారి ధృవీకరణ పత్రం అందచేసే సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రచండ పాల్గన్నారు. దేశం ఇంకేమాత్రం గందరగోళ పరిస్ధితులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని వామపక్ష కూటమికి ప్రజలిచ్చిన బాధ్యతను వమ్ముకానివ్వబోమని చెప్పారు. ఈ విజయం ప్రపంచవ్యాపితంగా వివిధ కారణాలతో నీరసపడి వున్న పురోగామివాదులు, కమ్యూనిస్టులలో ఎంతో వుత్సాహాన్ని నింపుతుందని వేరే చెప్పనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా తలచుకుంటే అక్రమాలకు కొదవా-హొండురాస్‌లో మరోసారి ప్రజాస్వామ్యం ఖూనీ !

06 Wednesday Dec 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Honduras, Honduras democracy hijaked, Salvador Nasralla, Tegucigalpa, yankees

ఎం కోటేశ్వరరావు

ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయటాన్ని అంగీకరించబోమన్న హొండురాన్లపై పాలకులు వుక్కుపాదాన్ని మోపేందుకు పూనుకున్నారు. దేశమంతటా పది రోజుల పాటు కర్ఫ్యూ ప్రకటించి రక్తాన్ని కండ్ల చూస్తున్నారు. తెలియందేముంది, మేమున్నాం అంటూ సకల అప్రజాస్వామిక చర్యలకు మద్దతు ఇచ్చే అమెరికన్లు తాజా దుండగానికీ మద్దతు ఇస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు. రాజకీయ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం నాటి వరకు 11మంది మరణించినట్లు మానవహక్కుల సంఘం ప్రకటించింది. మరోవైపు పోలీసు బలగాలు తాము ప్రభుత్వ ఆజ్ఞలను పాటించేది లేదని తిరుగుబాటును ప్రకటించాయి. కర్ఫ్యూను వుల్లంఘించి ప్రదర్శనలు జరుపుతున్న వారిపై బల ప్రయోగానికి నిరాకరించాయి. ప్రదర్శనల్లో పాల్గొన్నవారిని సురక్షితంగా ఇండ్లకు చేర్చేందుకు ముందుకు వస్తున్నాయి. అనేక చోట్ల పోలీసులు కూడా ప్రదర్శకులతో కలసి అధ్యక్షుడు హెర్నాండెజ్‌ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దక్షిణ అమెరికా ఖండంలోని మధ్య అమెరికాగా పిలిచే కరీబియన్‌ దేశాలలో ఒకటైన హొండురాస్‌కు ఈశాన్యంలో నికరాగువా, నైరుతిలో ఎల్‌ సాల్వెడార్‌, పశ్చిమాన గౌతమాలా, దక్షిణాన పసిఫిక్‌, వుత్తరాన కరీబియన్‌ సముద్రాల మధ్యలో తొంభైలక్షల మంది జనాభా వున్న దేశమది.నవంబరు 26న ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత అధ్యక్షుడు మితవాది జువాన్‌ ఆర్లొండో హెర్నాండెజ్‌ తిరిగి ఎన్నికౌతాడని అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా వామపక్షాలు, ఇతర ప్రజాతంత్ర శక్తులు బలపరిచిన టీవీ జర్నలిస్టు సాల్వెడార్‌ నసరల్లా విజయం సాధించే దిశగా వున్నట్లు ఓట్ల లెక్కింపు సరళి వెల్లడించింది. పోలైన ఓట్లలో 58శాతం లెక్కించిన సమయానికి ఐదుశాతం మెజారిటీతో నసరల్లా ముందున్నారు. అయితే సాంకేతిక కారణాలు చూపి ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. రెండు రోజుల తరువాత ప్రారంభించగా నాటకీయంగా నసరల్లా మెజారిటీ తగ్గిపోయి హెర్నాండెజ్‌ స్వల్పమెజారిటీకి చేరుకున్నారు. ఓట్ల లెక్కింపును నిలిపివేయగానే ఓటర్ల తీర్పును వమ్ము చేయనున్నారని గ్రహించిన నసరల్లా ఎన్నికలలో తాను గెలిచానని, తీర్పును వమ్ముచేసేందుకు పూనుకున్నందున నిరసన తెలపాలని తన మద్దతదార్లకు పిలుపునిచ్చారు.

టీవీ జర్నలిస్టు సాల్వెడార్‌ నసరల్లా

ఇదే సమయంలోే ఎన్నికల పరిశీలకురాలిగా వున్న అమెరికా దేశాల సంస్ధ(ఓఏఎస్‌) హొండూరాస్‌ ప్రతినిధి బృందం నాయకుడు జార్జ్‌ క్విరోగా ఒక ప్రకటన చేస్తూ ఓట్ల లెక్కింపులో అక్రమాలు, తప్పిదాలు, వ్యవస్ధా పరమైన సమస్యలున్నందున ఫలితాన్ని గురించి చెప్పలేమని, తిరిగి లెక్కింపు జరపాలని ప్రకటించారు. ఈ పూర్వరంగంలో అనుమానాలున్న వెయ్యి పోలింగ్‌ కేంద్రాల ఓట్లను తిరిగి లెక్కించిన తరువాత మొత్తం 99.98శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని, హెర్నాండెజ్‌ 42.98, నసరల్లా 41.39 శాతం చొప్పున పొందినట్లు సోమవారం నాడు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. అయితే విజేత ప్రకటన చేయలేదు. శుక్రవారం రాత్రి నుంచి కర్ఫ్యూ ప్రకటించి ఈ ఓట్ల లెక్కింపు తతంగం జరిపారు. తాజా ఓటింగ్‌ ఫలితాన్ని ప్రకటించకముందే వాటిని తాము అంగీకరించేది లేదని అన్ని పోలింగ్‌ కేంద్రాల ఓట్లను తిరిగి పార్టీల ప్రతినిధుల, పరిశీలకుల సమక్షంలో జరపాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాపితంగా జనం ప్రదర్శనలకు దిగారు. భద్రతా దళాలు వారిపై భాష్పవాయు, నీటి ఫిరంగులను ప్రయోగించాయి.కొన్ని చోట్ల కాల్పులు జరిపాయి. దేశంలోని మొత్తం 5,179 పోలింగ్‌ బూత్‌ల ఓట్లను తిరిగి లెక్కించాలని, లేనట్లయితే నిరసన తెలుపుతామని నసరల్లా నాయకత్వంలోని అలయన్స్‌ పార్టీ ప్రకటించింది.

రాజధాని టెగు(టెగుసియాగల్పా)తో సహా ఎక్కడా పోలీసులు ప్రస్తుత అధ్యక్షుడు ప్రకటించిన కర్ఫ్యూ ఆజ్ఞలను అమలు జరపరని, రాజకీయ సంక్షోభం పరిష్కారమయ్యే వరకు తాము యూనిట్లకే పరిమితం అవుతామని పోలీసు ప్రతినిధి ప్రకటించారు.’ మాకు రాజకీయ సిద్ధాంతాలు లేవు, మేము శాంతిని కోరుకుంటున్నాము, మేము ప్రభుత్వ ఆజ్ఞలను పాటించేది లేదు, ఈ విషయంలో మేము అలసిపోయాము.మేము జనంతో ఘర్షణ కొనసాగించలేము, అణచివేతను కోరుకోవటం లేదు, దేశ ప్రజల మానవహక్కులను వుల్లంఘించజాలం’ అని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ప్రతినిధి ప్ర కటించాడు. అంతకు ముందు కొట్లాటల నిరోధ కోబ్రా దళ సభ్యుడు మాట్లాడుతూ ‘ఇదేమీ సమ్మె కాదు, వేతనాలు లేదా డబ్బు గురించి కాదు, మా విధి దేశ ప్రజలకు శాంతి, భద్రత కల్పించటం, వారిని అణచివేయటం కాదు, దేశ ప్రజలందరూ సురక్షితంగా వుండాలని కోరుకుంటున్నాం’ అని చెప్పారు. ఈ ప్రకటనల పరంపర కొనసాగుతుండగానే మరో పోలీసు ప్రతినిధి ఒక టీవీలో మాట్లాడుతూ కొంత మంది పోలీసులు నిరాహారదీక్షకు పూనుకుంటారని ప్రకటించారు. ‘మేము మానవహక్కుల వుల్లంఘనలో భాగస్వాముల కాబోం, మేమా పని చేస్తే త్వరలోనో తరువాతో అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వుంటుంది. వాస్తవానికి గతంలో మా వున్నతాధికారుల హక్కుల వుల్లంఘన కారణంగా మేము ఇప్పటికే పరిహారం చెల్లిస్తున్నాము.యూనిఫాంలో వున్న సిబ్బంది మెరుగైన పని పరిస్ధితులు వుండాలని కోరుతున్నారు, వాటిని మా డిప్యూటీ డైరెక్టర్‌ తిరస్కరించారు. మాకు కావాల్సింది యజమానులు కాదు, నాయకులు, మా కమిషనర్‌ నాయకుల కోవకు చెందుతారు. వీధులలో గస్తీ తిరిగే సిబ్బందికి నిరాకరించి అనుబంధంగా వుండే వారికి మాత్రమే వేతనాలు ఎందుకు పెంచారు.ఇది సరైనది కాదు. అని చెబుతూ తమ డిమాండ్లు ఇవి అని టీవీలో ఒక ప్రకటన చదివారు. మరోవైపు భద్రతా దళాలు అనేక మంది విదేశీ జర్నలిస్టులను అదుపులోకి తీసుకొని స్వదేశాకు పంపివేయటం ప్రారంభించాయి.

ఇదిలా వుండగా హొండురాస్‌లో ఎన్నికల కమిషన్‌ క్రమపద్దతిలో ఓట్ల లెక్కింపు జరిపిందని అమెరికా వున్నతాధికారి ఒకరు కితాబునిచ్చారు.హెర్నాండెజ్‌ అమెరికాకు అత్యంత సన్నిహితుడు. ఈక్రమంలోనే అతగాడిని రక్షించేందుకు పూనుకుంది.హొండురాస్‌ సర్కార్‌ అవినీతి వ్యతిరేకత పోరాటం, మానవ హక్కుల పరిరక్షణకు మద్దతు ఇస్తోందంటూ అమెరికా విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రక ప్రకటనలో పేర్కొన్నది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసే ఇలాంటి శక్తులకు మద్దతు ఇవ్వకపోతేనే ఆశ్చర్యం. లాటిన్‌ అమెరికాలో నియంతలకు వ్యతిరేకంగా అనేక దేశాలలో పోరాడిన వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు అధికారంలోకి రావటాన్ని అమెరికా తొలి రోజుల్లో అడ్డుకోలేకపోయింది. ఇటీవలి కాలంలో చట్టబద్దమైన కుట్రలకు తెరతీసి అనేక దేశాలలో మితవాదులకు పెద్దపీట వేసి తన మద్దతుదార్లుగా మారుస్తున్నది. హొండురాస్‌లో కూడా అదే పునరావృతం అవుతోంది.

అటు వుత్తర అమెరికా ఖండానికి ఇటు దక్షిణ అమెరికా ఖండానికి మధ్యలో కీలకమైన ప్రాంతంలో వున్న హొండూరాస్‌లో ప్రజాస్వామ్యం ఒక మేడి పండు. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగంలోని ప్రతి వ్యవస్ధ ఆమోద ముద్రవేయాల్సిందే. అది నందంటే నంది పందంటే పంది. రాజ్యాంగాన్ని సవరించటం అన్నది అప్రజాస్వామికమని ఇంతవరకు ఏ కోర్టూ చెప్పలేదు.2009లో నాటి అధ్యక్షుడు మాన్యువల్‌ జెలయా రాజ్యాంగసవరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు నిర్ణయించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరపటం రాజ్యాంగ బద్దమేనని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు నిలిపివేసింది తప్ప రాజ్యాంగ సవరణ రాజ్యాంగ బద్దమా కాదా అన్న విషయం చెప్పలేదు. ఈ లోగా పార్లమెంట్‌, అటార్నీ జనరల్‌, ఎన్నికల సంఘం జెలయా నిర్ణయం రాజ్యాంగ విరుద్దమని ప్రకటించాయి.వాటిని ఖాతరు చేయని జెలయా బ్యాలట్‌ పత్రాలు, బాక్సులను పోలింగ్‌ కేంద్రాలకు తరలించాలని జారీ చేసిన ఆదేశాన్ని మిలిటరీ అధిపతి తిరస్కరించాడు. ఈ సమయంలో తమ ఆదేశాన్ని పాటించలేదనే పేరుతో జెలయాను పదవి నుంచి తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మిలిటరీ ఆయనను నిదుర మంచం మీద నుంచి తీసుకు పోయి పక్కనే వున్న కోస్టారికా దేశంలో విడిచి వచ్చింది. ఒక దేశ పౌరుడిని మరొక దేశంలో అక్రమంగా వదలి రావటం ఏ చట్టం ప్రకారం సమర్ధనీయమో, మిలిటరీ చేసిన పని తప్పోకాదో కూడా సుప్రీం కోర్టు విచారించలేదంటే ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో చూడవచ్చు. జెలయా, కుటుంబ సభ్యులు కోస్టారికా నుంచి బయలు దేరి రహస్యంగా కాలినడకన తిరిగి హొండూరాస్‌ చేరుకొని బ్రెజిల్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. తరువాత ఆయన మీద కేసులు ఎత్తివేసి దేశంలో కొనసాగనిచ్చారు.

రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఒకసారి పదవీ బాధ్యతలలో వున్న తరువాత రెండసారి అధ్యక్షపదవికి పోటీ చేయటానికి అర్హత లేదు. ఆ రీత్యా చూసినపుడు తాజా ఎన్నికలలో అధికారంలో వున్న అధ్యక్షుడు హెర్నాండెజ్‌ పోటీ చేయటానికి లేదు.అయినా కేంద్ర ఎన్నికల సంఘం మూడింట రెండు ఓట్ల మెజారిటీతో ఆమోదం తెలపటంతో పోటీ చేసినా సుప్రీం కోర్టు, ఇతర రాజ్యాంగ సంస్ధలు నోరు మెదపలేదు. అనుకున్నదొకటీ అయింది ఒకటి అన్నట్లుగా సులభంగా విజయం సాధిస్తాడని అనుకున్న హెర్నాండెజ్‌ వెనుకబడటంతో ఆయన నియమించిన ఎన్నికల సంఘం సాంకేతిక సమస్యలు తలెత్తాయనే సాకు చూపి ఓట్ల లెక్కింపును రెండు రోజుల పాటు నిలిపివేసి మెజారిటీతో వున్న ప్రతిపక్ష అభ్యర్ధికంటే హెర్నాండెజ్‌కు స్వల్ప మెజార్టీ వచ్చిందని ప్రకటించి ఎన్నికలను బూటకంగా మార్చివేసింది. ప్రస్తుతం మెజారిటీ ఓట్లు సాధించి విజయం సాధించిన ప్రతిపక్ష అభ్యర్ధి జర్నలిస్టు అయిన సాల్వెడార్‌ నసరల్లా ఓ ప్రజాస్వామికవాది, గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తి ప్రజామద్దతు పొందిన వ్యక్తి. ఆయనను మాజీ అధ్యక్షుడు, వామపక్షాలతో సహా పురోగామి పార్టీలు, శక్తులు బలపరిచాయి. నసరుల్లాకు వున్న అనర్హత ఏమంటే అమెరికాకు బంటుగా పనిచేస్తాడనే హమీ లేకపోవటమే. అందుకే ఓట్ల లెక్కింపు మధ్యలోనే ఫలితాన్ని తారుమారు చేశారు. అమెరికా తలచుకుంటే అక్రమాలకు కొదవా ?ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగినందున మొత్తం ఓట్లను తిరిగి లెక్కించాలి లేదా ఎన్నికను రద్దు చేసి తిరిగి జరపాలని ప్రతిపక్ష అభ్యర్ధి సాల్వెడార్‌ నసరల్లా డిమాండ్‌ చేశారు. గురు, శుక్రవారాలలో ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం వుందని వార్తలు వచ్చాయి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా ఎన్నికను తొత్తడం గావించి, మరింతగా అణచివేతకు పూనుకుంటే పరిణామాలు ఏ రూపం తీసుకొనేది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: