• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: August 2018

రూపాయితో కనిపించని దెబ్బలు కొడుతున్న నరేంద్ర మోడీ

31 Friday Aug 2018

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Uncategorized

≈ Leave a comment

Tags

Demonetisation, Narendra Modi, RBI Report on Demonitisation, Rupee Fall

Image result for narendra modi hitting  below the belt with currency cartoons

ఎం కోటేశ్వరరావు

కత్తులతో పని లేకుండా కంటి చూపుతో ఖతం చేస్తా అన్న హీరోలను సినిమాల్లో చూశాము. రూపాయితో 135కోట్ల జనాన్ని చావు దెబ్బలు కొడుతున్న హీరో ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడో పెద్ద విజయగాధను చెప్పుకోకతప్పదు. నరేంద్రమోడీ పాలనలో హిందూ మహిళలు పెద్ద సంఖ్యలో పిల్లల్ని కనాలని సంసారాలతో పని లేని యోగులు, యోగినులు చేసిన ప్రచారం వల్లకానీయండి, మరో విధంగా గానీ నరేంద్రమోడీ తన ఖాతాలో మరొక విజయాన్ని నమోదు చేసుకున్నారు. 2015 నుంచి ఈ విశ్లేషణ రాసే సమయానికి ప్రపంచంలో మన జనాభా శాతం 17.73 నుంచి 17.74శాతానికి పెరిగింది. ఇదే సమయంలో చైనా వాటా 18.92 నుంచి 18.54కు పడిపోయింది. యోగులు, యోగినులు కూడా సన్యాసాన్ని త్యజించి, భార్యలను వదిలేసిన భర్తలు కూడా ఒకింటి వారై సంతానోత్పత్తిలో పాల్గని వుంటే మన జనాభా ఇంకా పెరిగి వుండేది, చౌకగా శ్రమను ధారపోసి మేకిన్‌ ఇండియా పిలుపును జయప్రదం చేసి వుండేవారు.

మన సమాజం ఎంతటి నేరాన్ని అయినా సహించింది, క్షమించింది. నాడు నేడు రేపు నమ్మక ద్రోహాన్ని మాత్రం సహించదు. 2016 నవంబరు 14న గోవాలోని మోపా విమానాశ్రయ శంఖుస్థాపన సందర్భంగా గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ దేశానికి ఒక విన్నపం చేశారు. ‘నేను కేవలం 50రోజులు మాత్రమే అడుగుతున్నాను. డిసెంబరు 30వరకు గడువు ఇవ్వండి. ఆ తరువాత నా వుద్ధేశ్యాలు లేదా చర్యలలో ఏదైనా లోపం కనపడితే దేశం ఏ శిక్ష విధించినా భరించటానికి నేను సిద్దంగా వున్నాను, వురికైనా సిద్దమే, సజీవ దహనం చేయండి’ అన్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. డెబ్బయ్యేండ్ల నుంచి కుంభకోణాలకు పాల్పడిన వారు నన్ను బతకనివ్వరు, వారంతా ఇప్పుడు తమ దగ్గర వున్న నల్లధనాన్ని మార్చుకొనేందుకు బ్యాంకుల ముందు బారులు తీరారని కూడా సెలవిచ్చారు. ఆ గడువు తీరిపోయి త్వరలో పెద్ద నోట్ల రద్దు రెండవ వార్షికోత్సవాలకు సిద్ధం అవుతున్నారు. ప్రతి నెలా మన్‌కీ బాత్‌ పేరుతో మాట్లాడుతూనే వున్నారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా తన పెద్ద నోట్ల రద్దు వుద్ధేశ్యం ఏమేరకు నెరవేరిందో చెప్పలేదు. హైదరాబాదు వంటి మహానగరంలో ఇది రాస్తున్న సమయానికి కూడా కొన్ని ఎటిఎంలలో గరిష్టంగా ఒకసారికి ఐదువేలకు మించి డబ్బుతీసుకొనే పరిస్ధితి లేదు. ఎక్కువసార్లు తీసుకుంటే బ్యాంకుల బాదుడు మీకు తెలిసిందే.

పోనీ రిజర్వుబ్యాంకు అయినా నిజం చెప్పిందా ! బ్యాంకింగ్‌ లావాదేవీల్లో ఏ రోజుకు ఆరోజు ఖరారు అవుతాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఇచ్చిన గడువు ప్రకారం ఏ రోజు ఎన్ని రద్దయిన నోట్లు వచ్చాయో తెలుసుకోవటం కష్టం కాదు. గడువు ముగిసి నెలలు, సంవత్సరం గడిచినా ఎన్ని నోట్లు తిరిగి వచ్చాయో చెప్పలేదు. కొద్ది రోజులు నోట్ల లెక్కింపుపూర్తి కాలేదని చెప్పారు. ఈలోగా జనం మరచి పోయారు. ఎంతకాలం దాచినా ఏదో ఒక నివేదికలో వాస్తవాలను ప్రచురించకతప్పదు కనుక తాజాగా రిజర్వుబ్యాంకు నివేదికలో వెల్లడించకతప్ప లేదు. దాని ప్రకారం 99.3శాతం రద్దయిన నోట్లు వెనక్కు తిరిగి వచ్చాయి.రాని వాటి విలువ కేవలం గాకపోయినా మరుసటి రోజుకు ఆన్‌లైన్‌లో లెక్కలు సరి చూసి 10,720 కోట్లు మాత్రమే వెనక్కు రాలేదని, మొత్తం నోట్లలో 0.0005శాతం అంటే 5,22,783 మాత్రమే నకిలీ నోట్లను కనుగొన్నట్లు రిజర్వుబ్యాంకు వెల్లడించింది.

Image result for demonetisation, rbi report cartoons

కనీసం మూడు లక్షల కోట్ల రూపాయల విలువగల నోట్లు వెనక్కు రావని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి అనూహ్య ఆదాయం వస్తుందని మోడీ సర్కార్‌ లెక్కలు వేసుకుంది. నోట్ల రద్దు వలన ఎలాంటి ఫలితం వుండదని అనేక మంది నిపుణులు ముందే చెప్పారు. వారందరూ నల్లధనాన్ని కలిగి వున్నవారి మద్దతుదార్లుగా చిత్రించారు. రద్దయిన నోట్లను మార్చుకొనేందుకు, కొత్త నోట్లు తీసుకొనేందుకు బ్యాంకుల ముందు గంటల తరబడి వరుసలలో నిలబడటం దేశభక్తికి చిహ్నంగా అనేక మంది నిజంగానే భావించారు, భ్రమించారు. ఎవరైనా నోట్లరద్దును విమర్శిస్తూమాట్లాడితే దేశద్రోహి అన్నట్లు అసహ్యించుకొని చూసినవారు, కొట్టేందుకు వచ్చిన వారు కూడా లేకపోలేదు. నోట్ల రద్దు చర్య తీసుకున్నవారు గానీ దానిని సమర్ధించిన వారుగానీ తేలు కుట్టిన దొంగల మాదిరి ఎవరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. నోట్ల రద్దు ఎవరికీ తెలియదు నరేంద్రమోడీ తీసుకున్న అత్యంత గుప్త నిర్ణయం అని అప్పుడు అందరూ మోడీకీర్తిని పెంచేందుకు ప్రచారం చేశారు. అది వికటించిన తరువాత ఇతరుల మీద నెపం మోపేందుకు అవకాశం లేకపోవటంతో ఎన్ని విమర్శలు వచ్చినా దాని గురించిన వివరాలు బయటపెట్టకుండా అడ్డుకున్నారు.

Image result for demonetisation, rbi report cartoons

ఇంతకాలం తరువాత అయినా నోట్ల రద్దు తప్పిదమనే నిజాయితీ ఎక్కడా ప్రదర్శితం కావటం లేదు. దాని వలన వచ్చిన లాభం ఏమిటో నష్టాలు ఏమిటో అధికారికంగా చెప్పే ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి లేదా రిజర్వుబ్యాంకుకు లేదు. అనేక సర్వేలు చేస్తున్న బ్యాంకు నష్టాల గురించి ఇంతవరకు ఎలాంటి అధ్యయనం చేయలేదు, లేదా రహస్యంగా చేసి వుంటే బయటకు చెప్పటం లేదు. దేశం, జనాభాపట్ల జవాబుదారీతనం అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.నష్టాల గురించి ఎవరైనా మాట్లాడిదే దానిని రాజకీయంగా మార్చి పక్కదారి పట్టిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర ధోరణి. నోట్ల రద్దు ఫలితంగా ఒక శాతం జిడిపి నష్టం జరిగిందని 2017 జనవరి-ఏప్రిల్‌ మాసాల మధ్య పదిహేను లక్షల వుద్యోగాలు హరీ మన్నాయన్నది(సిఎంఐయి) అంచనా. ఈ నష్టం సంగతి ఏమిటి? కొత్త నోట్ల మార్పిడి లేదా ఎటిఎంలు, బ్యాంకుల ముందు తమ డబ్బు తాము తీసుకోవటానికి వెచ్చించిన పని గంటలు, పెట్టిన సెలవులు దీనికి అదనం. మాజీ అర్ధిక మంత్రి పి చిదంబరం చెప్పిన లెక్కల ప్రకారం ఏడాది కాలంలో జిడిపి 1.5శాతం నష్టం విలువ 2.25లక్షల కోట్లు, అనేక వారాల పాటు 15కోట్ల మంది రోజువారీ కూలీలు పని కోల్పోయారు, నోట్ల కోసం వరుసల్లో నిలబడి వంద మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేలాది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి, ఫలితంగా లక్షల మంది కార్మికులకు పని పోయింది. ఆ నష్టం ఎంతో ఎవరూ లెక్క గట్టలేదు. ఐదు వందలకు బదులు వెయ్యి, రెండు వందలు, యాభై కొత్త నోట్లను ఎటిఎం యంత్రాలలో అమర్చేందుకు వాటిని మూసివేసినపుడు జనం అనుభవించిన యాతనలు చెప్పనవసరం లేదు. యంత్రాలలో మార్పులు చేర్పులకు ఆయా బ్యాంకుల మీద పడిన భారం గురించి కూడా ఎవరూ నోరు విప్పటం లేదు. ఎవరైనా చెబితే అది నేరుగా నరేంద్రమోడీకే తగులుతుంది, సదరు అధికారి బలి ఖాయం. ఇలా బయటకు చెప్పుకోలేని,లోపల తట్టుకోలేని ఇబ్బందులెన్నో. రిజర్వుబ్యాంకు అధికారికంగా చెప్పినదాని ప్రకారమే వెనక్కు రాని నోట్ల కంటే కొత్త నోట్లు అచ్చేసి, పంపిణీ చేసేందుకు అయిన ఖర్చు ఎక్కువ. పదమూడు వేల కోట్ల రూపాయలని చెప్పింది. నోట్లు రద్దు చేయటానికి ముందు అంటే 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఆర్‌బిఐ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌గా 65,876 కోట్లు ఇచ్చింది, నోట్ల రద్దు తరువాత 2016-17లో ఆ మొత్తం 30,659 కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. తదుపరి ఏడాది చెల్లించిన మొత్తం కూడా 50వేల కోట్లకు మించలేదు. అంటే కేవలం రెండు సంవత్సరాలలోనే 55వేల కోట్ల మేరకు కేంద్రానికి ఆదాయ నష్టం జరిగింది. ఇతర వాణిజ్యబ్యాంకులకు నిరర్ధక ఆస్ధులు పెరిగిపోవటంతో నష్టాలు వచ్చాయి, మరి రిజర్వుబ్యాంకు లాభాలు ఎందుకు పడిపోయినట్లో ఎవరైనా చెబుతారా ? దేవగిరి-ఢిల్లీ మధ్య రాజధానులను మార్చిన మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌ చర్యకు సైన్యం, పరివారమే ఇబ్బంది పడింది. నరేంద్రమోడీ చర్యకు యావత్‌ దేశం ఇబ్బంది పడింది. ఇద్దరిలో ఎవరు మెరుగు ?

నోట్ల రద్దుకు ముందు అంటే 2016నవంబరు నాలుగున మన వుపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా కూడా చెప్పినట్లు కొంత మంది బాత్‌ రూముల్లో దాచుకున్నదానితో సహా దేశంలో 17.97లక్షల కోట్ల రూపాయల నగదు చెలామణిలో వుంది. ఈ ఏడాది మార్చి నాటికి చెలామణిలో వున్న నగదు 18.03లక్షల కోట్లు, అయినా సరే బ్యాంకుల్లో వున్న తమ డబ్బును తీసుకోవాలంటే అడిగినంత మొత్తం ఇవ్వలేమని బ్యాంకులు ఎందుకు చెప్పినట్లు? అంటే తిరిగి బాత్‌రూముల్లోకి పోయిందా? పోకుండా మోడీ సర్కార్‌ ఏం చేస్తున్నట్లు ? స్వయం సేవకులతో సహా చెప్పేవారెవరూ లేరు…… పోతే పోనీ గానీ గుండు మాత్రం పొన్నకాయలా బలే వుందే అన్న ముతక సామెత మాదిరి నోట్ల రద్దు వలన జరిగిన నష్టం కంటే వచ్చిన ఫలితాలు బాగున్నాయని ఇప్పటికీ అధికారపక్ష పెద్దలూ, వారికి అనుగుణంగా, కొందరు మేథావులూ, అధికారులూ అతిశయోక్తులు చెప్పటం విశేషం. నోట్ల రద్దు వలన పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణమే ఎక్కువగా ప్రభావితమైందని ఒక అధ్యయనంలో ప్రపంచబ్యాంకు పేర్కొన్నది. గురుచరణ దాస్‌ అనే ఆర్ధికవేత్త మాట్లాడుతూ ఇండ్లలో దాచుకున్న సొమ్ము బ్యాంకుల్లోకి వచ్చింది, బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన వారందరూ భవిష్యత్‌లో పన్ను చెల్లింపుదారులుగా మారతారు, డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధ వేగంగా పెరిగింది అన్నారు. అయితే సానుకూల ఫలితాలు రావటానికి ఇది(పెద్ద నోట్ల రద్దు) మార్గం కాదు. జనాలు చెల్లించిన మూల్యం చాలా ఎక్కువగా వుంది. నా అంచనా ప్రకారం ఒక ఏడాది ఆర్ధిక అభివృద్ధిని మనం నష్టపోయాము. దేశంలో వుపాధి సమస్యను పరిష్కరించాలంటే మనం ఏటా ఎనిమిదిశాతం చొప్పున 20సంవత్సరాల పాటు పెరగాలి అని కూడా దాస్‌ చెప్పారు.

Image result for demonetisation, rbi report cartoons

రాజుగారు నందంటే నంది, పందంటే పంది గురించి చెప్పగలిగిన సమర్ధులు మన వున్నతాధికారులు.కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్క్‌ నోట నోట్ల రద్దు విజయగానంలో చోటు చేసుకున్న అంశాలు ఇలా ఆవు వ్యాసంలో విషయాల మాదిరి వున్నాయి. గతంమాదిరే కరెన్సీ వ్యవస్ధ కొనసాగి వుంటే మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేరకు నోట్ల చలామణి తక్కువ వుండేది. మూడు లక్షల కోట్ల రూపాయల నల్లధనం బ్యాంకింగ్‌ వ్యవస్ధకు దూరంగా వుండేది, నోట్ల రద్దు తరువాత రెండులక్షల కోట్ల మేరకు బ్యాంకులకు చేరింది. ఆదాయపన్ను శాఖ 1.75లక్షల కోట్ల రూపాయల మొత్తంతో ప్రమేయమున్న అనుమానిత ఖాతాల గురించి పరిశీలన చేస్తున్నది. పద్దెనిమిది లక్షల మందికి ఆదాయానికి మించి ఆదాయం వున్నట్లు గుర్తించారు. వారిమీద చర్యల ద్వారా నల్లధనం మీద దాడి లక్ష్యం నెరవేరుతుంది. గతంలో నకిలీనోట్లు పెద్ద ఎత్తున చలామణిలో వుండేవి. నోట్ల రద్దు తరువాత అవి పెద్దలెక్కలోకి వచ్చేవిగా లేవు. ఇప్పుడు ఎవరైనా ఆ నోట్లను గుర్తించగలరు, ఎవరినీ మోసం చేయలేరు. నగదు రహిత(డిజిటల్‌ ) లావాదేవీలు పెరిగి ఒక నెలలో 25కోట్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరి, మార్చినెలల్లో నగదుకు కొరత వుండేది ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇలా బూతద్దంలో చూపేందుకు గార్గ్‌ ప్రయత్నించారు.

పెద్ద మొత్తంలో కరెన్సీ చలామణిలోకి వచ్చిందని ఏలుబడిలో వున్నవారు చెబుతుంటే కొన్ని కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చలామణిలో వున్న కరెన్సీ విలువ 19.38లక్షల కోట్ల రూపాయలని, పొదుపు 2.8శాతానికి పెరిగిందని అంగీకరిద్దాం. ఇదే సమయంలో పొదుపు సొమ్ము బ్యాంకులు లేదా కార్పొరేట్‌ డిపాజిట్లలో ఐదు దశాబ్దాల కనిష్టం 2.9శాతానికి ఎందుకు పడిపోయిందన్నది విశ్లేషకుల ప్రశ్న. డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు చేరిన మొత్తంలో కొంత నోట్ల రద్దు తరువాత బ్యాంకింగ్‌ వ్యవస్ధ నుంచి వెళ్లిపోయింది. వడ్డీ రేటు తగ్గటంతో వ్యక్తిగతంగా బ్యాంకుల్లో డిపాజిట్లు చేయటం తగ్గింది. అంతకు ముందు సంవత్సరంలో 6.3శాతం వున్న డిపాజిట్లు వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో 2.9శాతానికి పడిపోయాయి.

నోట్ల రద్దుతో జనం మీద దాడి చేసిన మోడీ ఇప్పుడు కరెన్సీ విలువతో దాడికి దిగినట్లు కనిపిస్తోంది. మోడీకి దీనికి సంబంధం ఏమిటని కొందరు అడ్డు తగల వచ్చు. మోడీ సర్వాంతర్యామి, ఇందుగలదందు లేడను సందేహము వలదు లేదా అన్నీ నేనే అని గీతాకారుడు చెప్పినమన భూమిలో కరెన్సీలో ఆయన లేకుండా ఎలా వుంటాడు. నోట్ల రద్దు తన స్వంత నిర్ణయం చెప్పిన పెద్ద మనిషి పడిపోతున్న రూపాయి విలువకు కారణాలేమిటో, తన ప్రమేయం లేకపోతే జనాన్ని ఎలా ఆదుకుంటారో రాజధర్మంగా అయినా చెప్పాలి కదా ? శుక్రవారం నాడు మార్కెట్‌ వేళలు ముగిసే సమయానికి డాలరుతో మారకానికి రు.70.94గా పతనం చెంది సరికొత్త రికార్డు నమోదు అయింది. ప్రభుత్వ ఆసుపత్రుల కెళితే ఏ జబ్బుకైనా ఒకే రంగు గోళీలు, నీళ్ళ మందుపోస్తారని ప్రతీతి. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకొనేందుకు గత కొద్ది రోజులుగా మన రిజర్వుబ్యాంకు అటువంటి పనే చేసింది. జబ్బు ఒకటైతే నీళ్ల మందు చికిత్సలకు తగ్గుతుందా? ఐఎఫ్‌ఏ గ్లోబల్‌ కరెన్సీ నివేదిక ప్రకారం చమురు ధరలు ఎక్కువగా వున్నంత వరకు మన వంటి దేశాల కరెన్సీ విలువ పతనం కొనసాగుతూనే వుంటుంది. రూపాయి విలువ 70.45-70.90 లేదా అంతకు దిగువకు పడిపోవచ్చు. ఆ జోశ్యాన్ని కూడా మన రూపాయి వమ్ము చేసి ఆగస్టు 31న 70.96 నమోదు చేసింది. దిగుమతిదారులకు 70.20, ఎగుమతిదారులకు 69.75 స్ధాయిల్లో వుంటుందనే అంచనాతో లావాదేవీలను సాగించుకోవచ్చని ఐఎఫ్‌ఏ సలహా ఇచ్చింది. దిగుమతిదారుల నుంచి డిమాండ్‌ పెరగటం, మరింత పతనం అవుతుందేమో దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకుందామనే ముందుచూపుతో విదేశీ మదుపుదారులు తమ సొమ్మును వెనక్కు తీసుకోవటం ఎక్కువగా చేస్తుండటంతో రూపాయి పతనం కొనసాగుతోంది. అది త్వరలో 71లేదా 72కు చేరనుందని అనేక మంది చెబుతున్నారు.ఇప్పటికే ఈ ఏడాది పదిశాతం పతనమై ఆసియాలో అత్యంత అధ్వాన్నంగా మారిన కరెన్సీగా రూపాయి పేరు తెచ్చుకుంది.

దేశంలోపలివా, వెలుపలివా కారణాలు ఏవైనప్పటికీ డాలర్లకు డిమాండ్‌ పెరగటం మన రూపాయి విలువ పతన కారణాల్లో ఒకటి. పెట్రోలు, డీజిలు లేకపోతే గడవదు కనుక ఎన్ని డాలర్లయినా ఇచ్చి తెచ్చుకోవాలనుకుందాం.విదేశీ లిప్‌స్టిక్‌లు,లో దుస్తులు, పై దుస్తులు, నగలు, వాచీలు, బంగారం చివరికి అమెరికా నుంచి బాదం పప్పు, దోసకాయల వంటి నిత్యావసర వస్తువులు లేకపోతే తమకు గడవదు అనుకొనే వారికి కూడా మన జనం మొత్తం తరఫున అధిక ధరలకు డాలర్లను కొని ఇస్తున్నాం. ఇరాన్‌ మీద అమెరికా వాడికి కోపం వస్తే పెరిగే చమురు ధరలకు మన ఇతర దేశాల నుంచి కొనాలి తప్ప చౌకగా ఇచ్చే ఇరాన్‌ నుంచి కొనుగోలు చేయం. ఎందుకంటే ట్రంప్‌కు మన మీద కోపం వస్తుంది. ఇలాంటి వాటి కారణంగా మన కరెంట్‌ ఖాతాలోటు పెరుగుతోంది. మనం చేసుకొనే దిగుమతులకు చెల్లించే మొత్తం, మన ఎగుమతుల ద్వారా సంపాదించే ఆదాయ మొత్తానికి మధ్య వుండే తేడానే కరెంట్‌ ఖాతా లోటు లేదా మిగులు అంటాం.మరో విధంగా చెప్పాలంటే పెట్టుబడులు సంపాదించటానికి, పలుకుబడి పెంచే పేరుతో విదేశాలకు విమానాల్లో తిరగటానికి, రోజుకో కొత్త కోటు వేసుకోవటానికి మన మోడీకి అయ్యే ఖర్చు ఆయన సంపాదించిన దాని కంటే ఎక్కువ వుంది అనుకోండి.

2018 ఆర్ధిక సంవత్సరంలో మన కరెంట్‌ ఖాతా లోటు జిడిపిలో 1.9శాతం వుంటే అది 2019కి 2.8కి పెరుగుతుందని అంచనా. ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం తగ్గుతోంది. మన దేశ స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు, ప్రభుత్వాలకు అప్పులు ఇచ్చేవారు ఇంతకు ముందు గణనీయంగా పెరిగారు. ఇప్పుడు ఎందుకైనా మంచిదని వెనక్కు వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 50వేల కోట్ల రూపాయల మేర వెనక్కు తీసుకున్నారు. మనకు అప్పులు ఇచ్చేవారు డాలర్లలో ఇస్తారు, డాలర్లలోనే తీసుకుంటారు. మనరూపాయలను అంగీకరించరు. మన్మోహన్‌ సింగ్‌ పది సంవత్సరాల కాలంలో కిందికీ మీదికీ పడుతూ లేస్తూ రు.45.32 నుంచి గరిష్టంగా 68.85 వరకు పతనమై నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి రు.58.43కు పెరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మోడీ హయాంలో తొలిసారిగా మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి నాటి గరిష్ట పతనాన్ని తాకి 2017 జనవరి ఆరున రు.67.96 గా ముగిసింది. ఇప్పుడు ముందే చెప్పుకున్నట్లు 71రూపాయలను ఏక్షణంలో అయినా దాటేట్లు వుంది. పది సంవత్సరాల మన్మోహన్‌ సింగ్‌ కాలంలో నిఖర పతనం పదమూడు రూపాయలకు అటూ ఇటూగా అయితే నరేంద్రమోడీ పాలనలో కూడా అదే స్ధాయిలో జరిగింది, త్వరలో నూతన రికార్డులను కూడా నమోదు చేయవచ్చు. మోడీ అధికారానికి వచ్చినపుడు మనం ఒక వంద డాలర్లు అప్పు తీసుకున్నామనుకుంటే అసలు రు.5843. దానికి మార్కెట్లో వున్న రేటున బట్టి వడ్డీ చెల్లించాలి.( అలాగాక చంద్రబాబు నాయుడు అమరావతి నగర నిర్మా ణానికి అప్పుకు అధికవడ్డీ రేటు ఇచ్చినట్లుగా ఇస్తే అది వేరే.) చైనాతో పేచీ వచ్చింది, మాక్కూడా డాలర్ల అవసరం పెరిగింది మా సొమ్ము మాకివ్వండని అమెరికా వాడు అడిగాడనుకోండి. గత నాలుగేండ్లుగా చెల్లించాల్సిన బారు లేదా చక్ర వడ్డీగాక, అసలే 7096కు పెరిగిపోయింది. మన రూపాయి విలువ పతన పర్యవసానమిది.

దీన్నే మరో విధంగా చెప్పుకోవటం అవసరం. 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అక్కడి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు అమెరికా, ఇతర ధనిక దేశాలలో వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించారు. వుదాహరణకు ట్రేడింగ్‌ ఎకనమిక్స్‌ అనే వెబ్‌సైట్‌ విశ్లేషణ ప్రకారం అమెరికాలో సంక్షోభ సమయంలో వడ్డీ రేటు 3.6శాతం వుండగా ఒక ఏడాదిలో అది 0.25శాతానికి పడిపోయింది.2016 వరకు అదే కొనసాగి, అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రెండుశాతానికి పెరిగింది. అంతకంటే ఎక్కువగా మన దేశంలో వడ్డీ రేట్లు వున్నాయి కనుక. డాలరు బాబులు మనకు వుదారంగా అప్పులిచ్చారు. ఇప్పుడు తమ దగ్గరే వడ్డీ రేట్లు పెరిగాయి, ఇంకా పెంచుతామని అమెరికా ఫెడరల్‌ రిజర్వు( రిజర్వుబ్యాంకు వంటిది) ప్రకటించింది. గనుక మనకు అప్పు లేదా పెట్టుబడులు పెట్టటం కంటే తమ దేశమే నయమని ఎవరికి వారు వెనక్కి తీసుకుంటున్నారు. ఇది కూడా మన రూపాయి పతనానికి దారి తీస్తోంది.

మన వాణిజ్యమంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం 2018 ఏప్రిల్‌ా జూలై నెలల్లో మన చమురు దిగుమతుల విలువ 46.98 బిలియన్‌ డాలర్లు. అదే నెలల్లో ఒక ఏడాది క్రితం ఆ మొత్తం 31.02 బిలియన్లు మాత్రమే. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరగటమే దీనికి కారణం. ఇది ప్రామాణిక బ్రెంట్‌ ముడిచమురు ప్రస్తుతం పీపా ధర 78 డాలర్లు వుంది. ఈ ఏడాది అది 80 దాట వచ్చని అంచనా. చమురు ధరలు అంతకు మించి 90 డాలర్లకు పెరిగితే మన కరెంటు ఖాతా లోటు 3.6శాతానికి చేరుతుందని అంచనా. ఇదే జరిగితే జనంలో గగ్గోలు చెలరేగకుండా వుండాలంటే చమురు మీద పెంచిన పన్నులను అయినా తగ్గించాలి. లేదా పెరిగిన భారాన్ని జనం మీద మోపాలి. తగ్గిస్తే ప్రభుత్వం అదనంగో నోట్లను ముద్రించాలి, అదే జరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, అంటే ధరలు పెరుగుతాయి. భారం తగ్గించకపోయినా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. కరంట్‌ ఖాతా లోటు పెరిగితే అప్పులు తెచ్చి లేదా జనం మీద భారాలు మోపీ చెల్లింపులు చేయాల్సి వుంటుంది. ఏది జరిగినా భరించాల్సింది జనమే.

గతంలో చూసిన అనుభవాల కారణంగా విదేశీమారక ద్రవ్యనిల్వలకు ఆర్‌బిఐ కొన్ని చర్యలు తీసుకుంది. వాటి నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు ఏప్రిల్‌-జూన్‌ మాసాల మధ్య 14.5బిలియన్‌ డాలర్లను విక్రయించి డాలర్లకు డిమాండ్‌ను తగ్గించేందుకు తద్వారా రూపాయి విలువ మరింత పతనం కాకుండా చూసేందుకు ప్రయత్నించింది. రూపాయి బాండ్లను ప్రవేశపెట్టటం, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచటం ద్వారా డాలర్ల డిమాండ్‌ను తగ్గించటం వంటి చర్యలు తీసుకుంది. రూపాయి విలువ పతనాన్ని సొమ్ము చేసుకొనేందుకు ప్రవాస భారతీయులు ఇటీవలి కాలంలో పెద్ద మొత్తంలో డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీని మన దేశానికి పంపుతున్నారు. మన కరెన్సీ ఎంత పతనమైతే వారికి అంతగా కష్టపడకుండానే ఎక్కువ రూపాయలు వస్తాయి మరి. చైనాలో కరెన్సీ విలువ మన మాదిరి పతనం కాలేదు, డాలరుతో పోటీ పడుతోంది కనుక ప్రవాస చైనీయులు మనవారి కంటే ఐదు బిలియన్‌ డాలర్లు తక్కువ పంపారట. చమురు ధరలు తక్కువగా వున్నాయి గనుక సొమ్ము చేసుకుందామని పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన విమాన కంపెనీలు ఇప్పుడు దివాలా బాటలో వుండటానికి చమురు ధరలు పెరగటమే కారణం.రాబోయే రోజుల్లో దిగుమతి చేసుకొనే ఆధునిక పరికరాలు ధరలు పెరిగి టెలికాం కంపెనీలపై భారం పెరగనున్నదని అప్పుడే వార్తలు వస్తున్నాయి. మన్మోహన్‌ సింగ్‌ చివరి రోజుల్లో అంటే 2013లో ఆరునెలల దిగుమతి అవసరాలకు సరిపడా విదేశీమారక ద్రవ్య నిల్వలుంటే ఇప్పుడు మోడీ చివరి రోజుల్లో పది నెలలకు సరిపడా వున్నాయి. అనూహ్యపరిస్ధితులు తలెత్తితే పరిస్ధితి ఇంకా దిగజారి మరోసారి అప్పుల చిప్ప పట్టుకోవాల్సి వచ్చినా ఆశ్చర్య ం లేదు. ఇటువంటి విధానాలతో లబ్ది పొందేవారి కంటే నష్టపోయేవారే ఎక్కువ.1991 తరువాత అధికారంలో వున్నవారు వరుసగా రెండవ సారి ఎన్నిక అవటం 2009 ఒక్క మన్మోహన్‌ సింగ్‌ హయాంలోనే జరిగింది. మరే పార్టీ వరుసగా అధికారంలోకి రాలేదు. అందుకే పరిస్ధితులు మరింతగా దిగజారకముందే ఓటర్ల ముందుకు వెళితే ఫలితం వుంటుందేమో అన్నఆశతో నరేంద్రమోడీ ముందస్తు ఎన్నికల గురించి దూరాలోచన చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దక్షిణాఫ్రికా భూ సంస్కరణలకు అమెరికా వ్యతిరేకత!

29 Wednesday Aug 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, land reforms, South Africa, South African land reforms

Image result for Donald trump against South Africa land reforms                   అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌                                   సిరిల్‌ రాంఫొసా

 ఎం. కోటేశ్వరరావు

‘దక్షిణాఫ్రికాలో భూ స్వాధీనాలు, పెద్ద ఎత్తున రైతాంగ హత్యలూ జరుగుతున్నాయి, వాటి గురించి సునిశితంగా అధ్యయనం చేయండి’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన విదేశాంగ మంత్రి మైక్‌ పోంపియోను ఆగస్టు 22న ఆదేశించటంతో ఒక్కసారిగా దక్షిణాఫ్రికా భూసమస్య ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఒక సర్వసత్తాక దేశ అంతర్గత వ్యవహారాలలో, భూ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇంత బహిరంగంగా జోక్యం చేసుకొనేందుకు పూనుకోవటం అమెరికా తెంపరి తనానికి నిదర్శనం. కొద్ది రోజుల క్రితం మితవాద మేథావి మరియన్‌ టపీ భూ స్వాధీనాలపై దక్షిణాఫ్రికాను హెచ్చరించండి అంటూ ట్రంప్‌ను కోరుతూ ఒక వ్యాసం రాశాడు. శ్వేతజాతి రైతులను చంపుతున్నారు, వారి భూములను లాక్కుంటున్నారు అంటూ అమెరికా మీడియాలో రెచ్చగొడుతున్నారు. భూ సంస్కరణలను వ్యతిరేకించే శ్వేతజాతీయులతో కూడిన ఆఫ్రీఫోరమ్‌ ప్రతినిధులు జూన్‌లో అమెరికా వచ్చి అనేక మందిని కలిశారు, మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ట్రంప్‌ చర్యను దక్షిణాఫ్రికాలో అనేక మంది తీవ్రంగా ఖండించారు. దేశ ఉపాధ్యక్షుడు మబుజా ఒక ప్రకటన చేస్తూ భూ సంస్కరణలు సామాజిక, జాతి విభజన ఫలితాలు కాదని స్పష్టం చేశారు.
భూ సమస్య ముందుకు రావటం గురించి పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కొందరు దీనిని రాబోయే ఎన్నికల గారడీగా భావిస్తున్నారు. భూ సంస్కరణలు జరగాలన్నది సాధారణ ఏకాభిప్రాయం. ఎలా అన్నదానిపై తేడాలున్నాయి. పాతికేండ్లుగా తేల్చుకోలేని స్ధితి. జాత్యహంకార, వలసపాలనలో భూముల నుంచి స్థానికులను వెళ్లగొట్టి వలస వచ్చిన శ్వేతజాతీయులు ఆక్రమించుకున్నారు. 1994లో శ్వేతజాతి దురహంకార పాలన అంతమై ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నాయకత్వంలో త్రిపక్ష కూటమి అధికారానికి వచ్చేనాటికి తొమ్మిదిశాతం శ్వేత జాతీయుల చేతిలో 90శాతం భూమి కేంద్రీకృతమై ఉంది. భూ పంపిణీ అన్నది ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ ప్రకటించిన ప్రధాన కార్యక్రమాలలో ఒకటి. స్ధానిక ఆఫ్రికన్లను కొన్ని ప్రాంతాలకు పరిమితం చేసిన శ్వేతజాతి ప్రభుత్వం 1913లో చేసిన ఒక చట్టం ప్రకారం నల్లజాతీయులైన ఆఫ్రికన్లు ‘శ్వేత దక్షిణాఫ్రికా’లో భూములు కొనుగోలు చేసేందుకు లేదా కౌలుకు తీసుకొనే అవకాశాన్ని కోల్పోయారు, భూముల నుంచి గెంటివేతకు గురయ్యారు.
దేశాధ్యక్షుడు సిరిల్‌ రాంఫొసా తాజాగా ఒక పత్రికకు భూసమస్యపై రాసిన వ్యాసం సారాంశం ఇలా వుంది. గ్రామీణాభివృద్ధి, భూ సంస్కరణల శాఖ జరిపిన భూ తనిఖీ లెక్కల ప్రకారం 90శాతం భూమి వ్యక్తులు, ట్రస్టులు, కంపెనీల చేతిలో ఉంది. పదిశాతం ప్రభుత్వానికి చెందినది. తొంభైశాతం భూమిలో వ్యక్తుల వద్ద 39, ట్రస్టులకు 31, కంపెనీలకు 25శాతం వుంది. వ్యవసాయ క్షేత్రాలు, భూములు కేవలం ఏడుశాతం యజమానుల చేతుల్లో ఉన్నాయి. ఈ ఏడుశాతంలో 72శాతం శ్వేతజాతీయులు, 15శాతం రంగు జాతీయులు (మన దేశంలో ఆంగ్లో ఇండియన్ల మాదిరి స్ధానిక ఆఫ్రికన్లు, శ్వేతజాతీయులు, భారత జాతీయుల సంకరంతో కలిగిన జనాభా), ఐదుశాతం భారతీయ సంతతి, నాలుగుశాతం ఆఫ్రికన్లు ఉన్నారు. ట్రంప్‌ ప్రకటన విషయానికి వస్తే ఉత్తర రాష్ట్రంలో ప్రయివేటు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదన్న వార్తల పూర్వరంగంలో వెలువడింది. ప్రభుత్వ రేటు ప్రకారం రెండు కోట్ల రాండ్‌లు తీసుకొని భూమిని స్వాధీనం చేయాలని స్థానిక అధికారులు ఒక యజమానిని కోరారు. అయితే తనకు 20కోట్ల రాండ్లు ఇవ్వాలని అతను తిరస్కరించటంతో చట్టనిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకొనేందుకు పూనుకున్నారు.
ముఫ్పైశాతం భూమిని ఐదేండ్లలో పంపిణీ చేయాలన్నది 1994లో తొలి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో చేసిన వాగ్దానం. దానిలో ఇప్పటి వరకు పదిశాతం కూడా జరగలేదని 2014వరకు విధించిన గడువును 2024 వరకు పొడిగించనున్నట్టు వార్తలు వచ్చాయి. అంటే పాతికేండ్లలో చేసిందేమీ లేదన్నది చేదు నిజం. ఆఫ్రికన్లలో విపరీతంగా ఉన్న నిరుద్యోగం, పాతికేండ్లుగా అనుసరిస్తున్న నయావుదారవాద విధానాల వలన ఉపాధి అవకాశాలు పెరగకపోవటం వంటి అనేక కారణాలతో జనంలో అసంతృప్తి నానాటికీ పెరుగుతున్నది. అవినీతి, అక్రమాల కారణంగా ఏకంగా ఒక దేశాధ్యక్షుడు జాకబ్‌ జుమా కొద్ది నెలల క్రితం పదవి నుంచి తప్పుకోవాల్సి రావటం అక్కడి పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. జుమాను తొలగించకపోతే తాము సంకీర్ణ కూటమి నుంచి వైదొలుగుతామని కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించాల్సి వచ్చింది. అవినీతి విషయంలో పట్టుబట్టిన మాదిరి ఇతర ప్రజావ్యతిరేక విధానాలు లేదా భూ సంస్కరణల వంటి వాటి విషయంలో కమ్యూనిస్టు పార్టీ అలాంటి వత్తిడి పాలక కూటమి మీద తీసుకురాలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే అంగీకృత విధానాల నుంచి కూటమి నాయకురాలైన ఏఎన్‌సీ దూరంగా వ్యవహరిస్తున్నందున వచ్చే ఎన్నికలలో తాము అవసరమైతే వంటరిగా బరిలోకి దిగుతామని కమ్యూనిస్టు నేతలు హెచ్చరించారు. ఒక వేళ అదే జరిగితే భూ సంస్కరణలు ఎన్నికల సమస్యగా మారే అవకాశం లేకపోలేదు. కూటమి ఐక్యంగానే ఉన్నప్పటికీ జనం నుంచి వస్తున్న వత్తిళ్లు, నిరుద్యోగం, సాధికారత వంటి అంశాల కారణంగా భూ సంస్కరణలను వ్యతిరేకించే వారు, అనుకూలించే వారుగా ఎన్నికలలో చీలిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు.
ఎలాంటి పరిహారం లేకుండా పరిమితులు దాటిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి పంపిణీ చేసే విధంగా చట్ట సవరణ చేయనున్నట్టు అధ్యక్షుడు రాంఫొసానే ప్రకటించారు. 25వేల ఎకరాలకు పైబడి ఉన్న వారి నుంచి మాత్రమే పరిహారం చెల్లించకుండా భూములు తీసుకుంటామని ఏఎన్‌సీ అధ్యక్షుడు మంతాషే చేసిన ప్రకటన అనేక మందిలో చలనం కలిగించింది. పరిమితికి మించి వున్న భూములను అమ్ముకొనేందుకు ప్రయత్నించగా కొనే వారు కరువయ్యారు. దాంతో ప్రభుత్వ రేటుకు పదిహేను నుంచి ఇరవై రెట్లు అదనంగా ఇస్తేనే తాము భూములు వదులుకుంటామని కొందరు పట్టుబడుతున్నారు. భూములన్నీ శ్వేతజాతీయుల చేతిలో ఉండటంతో ప్రభుత్వ చర్యలు కూడా సహజంగానే వారికి వ్యతిరేకంగానే ఉంటాయి. దీంతో ఆ సమస్యకు రంగు పూసి జాతి వివక్షగా చిత్రించేందుకు పూనుకున్నారు. ట్రంప్‌ ట్వీట్‌ కూడా దానినే ప్రతిబింబించింది. స్వాభావికంగానే పెట్టుబడిదారీ వర్గం భూసంస్కరణలను సమర్ధిస్తుంది. దాని వస్తువులకు మార్కెట్‌ పెరగాలంటే జనం కొనుగోలు శక్తి పెరగాలి, అందుకుగాను భూ కేంద్రీకరణ ఒక ఆటంకం. ఒక వైపు కంపెనీ వ్యవసాయం లాభసాటి అంటూ ఆ వైపు ప్రోత్సహిస్తూనే మరోవైపు భూ పంపిణీని కూడా ప్రపంచబ్యాంకు సమర్ధించుతుండటం మిత్రవైరుధ్యానికి నిదర్శనం. విప్లవాత్మకంగా భూసంస్కరణలను అమలు జరిపే ఉద్దేశ్యం ఏఎన్‌సీ ప్రభుత్వానికి ఉంటే నిజానికి ఎప్పుడో పరిహారంతో నిమిత్తం లేకుండా సీలింగ్‌ దాటిన భూములను స్వాధీనం చేసుకొని రైతాంగానికి పంచి ఉండేది. కారణాలు ఏమైనా కొన్ని చర్యలు తీసుకోక తప్పక పోవటంతో భూస్వాముల ప్రతినిధులు పాతపడిన, పాచి పాటలు పాడటం ప్రారంభించారు. అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటంతో అవి స్పష్టమయ్యే వరకు యజమానులు వ్యవసాయ పెట్టుబడులు పెట్టటం ఆలస్యం లేదా నిలిపివేస్తారు. దాని వలన ఈలోగా కార్మికుల వేతనాలు తగ్గిపోతాయి. పెట్టుబడి తగ్గితే ఆ మేరకు నిజ ఆదాయాలు, ఉత్పత్తి, దిగుబడులు పడిపోతాయి. మాంద్యం తలెత్తుతుంది. పెట్టుబడులు కలిగిన నిపుణులు, తెలివి తేటలు కలిగిన శ్వేతజాతీయులందరూ, తమ పరిజ్ఞానంతో సహా దేశం వదలి పోతారు. భూముల స్వాధీనం కారణంగా విదేశీ పెట్టుబడిదారులు తమ మదుపు మొత్తాలను వెనక్కు తీసుకుంటారు. అదింకెన్నటికీ తిరిగి రాదు. రాజకీయంగా చూస్తే భూ స్వాధీనం పాలక పార్టీకి మంచిదేమో గానీ ఆర్థిక విధానాల రీత్యా చాల చెడుచేస్తుంది. ఇలాంటి కబుర్లతో భయపెట్టాలన్నది వృధా ప్రయత్నమే. నష్ట పరిహారం లేకుండా భూ స్వాధీనం గురించి ఇంతవరకు చట్ట సవరణే చేయలేదు. చేస్తామని ప్రకటించగానే అప్పుడే భూములు లాగేసుకున్నట్టు, శ్వేతజాతి రైతులపై దాడులు, హత్యలు చేస్తున్నట్టు అంతర్జాతీయంగా నానా యాగీ చేస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో వ్యవసాయ సమస్య కీలకమైనదే. అక్కడి జనాన్ని భూముల నుంచి వెళ్లగొట్టి వాటిని స్వాధీనం చేసుకున్నవారు పెట్టుబడిదారీ పద్ధతుల్లో వ్యవసాయం, గనుల తవ్వకం వంటి వాటిని అభివృద్ధి చేశారు. జనాన్ని దోపిడీ, అణచివేతలకు గురిచేశారు. వ్యవసాయ పంటల ఉత్పత్తి, సంపదసృష్టి, వన్యప్రాణి రక్షణ, కనీస సదుపాయాలతో జన నివాసాల ఏర్పాటు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. జాత్యహంకార పాలన పోయింది తప్ప ఆ పాలనలో గట్టిపడిన ఆస్తి, యాజమాన్య సంబంధాలలో పెద్ద మార్పు రాలేదు. వాటి స్థానంలో నల్లజాతీయుల పెత్తనం అంటే తెల్లజాతి పెట్టుబడిదారుల స్థానంలో నల్లజాతి పెట్టుబడిదారులను పెంపొందించాలనే వైఖరులు కూడా అక్కడ కొన్ని తరగతుల్లో బలంగా ఉన్నాయి. 1994తరువాత వచ్చిన అవకాశాలను అందుకు వినియోగించుకోవాలని చూసే వారు ఉన్నారు. అనేక మంది ఇప్పటికే ఆ క్రమంలో బలంగా తయారయ్యారు. వారు శ్వేతజాతి పెత్తనాన్ని వ్యతిరేకిస్తారు తప్ప పెట్టుబడిదారీ విధానాన్ని, నయా వుదారవాద విధానాలను కాపాడేందుకు పూనుకుంటారు. గత 25ఏండ్లలో కార్మికవర్గంపై జరిగిన దాడులే అందుకు నిదర్శనం. పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలతో జాత్యహంకారాన్ని, సామాజిక అసమానతలను దూరం చేయటం, దోపిడీ, స్త్రీ పురుష వివక్షను రూపు మాపటం జరిగేది కాదు. తెల్లవారి స్ధానంలో నల్లవారు రావటం తప్ప జరిగేదేమీ ఉండదు.
దక్షిణాఫ్రికాలో భూసమస్యపై గత పాతికేండ్లలో స్ధూలంగా వెల్లడైన ధోరణుల గురించి చూద్దాం. మితవాదులైన శ్వేత జాతీయులు, ఇతరంగా స్వల్పంగా వున్న భూ కామందులు మొత్తంగా ఎలాంటి సంస్కరణలు జరగరాదని పట్టుబడుతున్నారు. లేదా భూములను వదులుకోవాల్సి వస్తే పెట్టుబడిదారీ మార్కెట్‌ రేటు ప్రకారం పరిహారం ఇచ్చి తీసుకోమంటున్నారు. నయా వుదారవాదులు అమ్మకందార్లు, కొనుగోలు దార్ల సూత్రాన్ని అమలు జరపమంటున్నారు. అంటే అది కూడా డబ్బున్నవారి యాజమాన్యంలోకే భూ బదిలీ తప్ప మరొక పురోగామి ఆలోచన కాదు. మరోవైపున భూ సంస్కరణలు ఎలా అమలు జరపాలన్న విషయంలో ఏకాభిప్రాయం లేదు. ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకోవాలి అన్నది ఒక వైఖరి. ఏ భూమిని స్వాధీనం చేసుకోవాలి దేనిని కూడదు అన్నది ఇంతవరకు తేల్చుకోలేదు. పట్టణ ప్రాంతాలలోని వ్యాపారులు తమ వ్యాపారాలకు గ్రామాలలో అనుబంధంగా కొన్ని వ్యవసాయ క్షేత్రాలను కలిగి ఉండటానికి అనుమతించాలని కోరుతున్నారు. భూస్వాములు కోరుతున్నట్టు మార్కెట్‌ రేట్లకు ప్రభుత్వం కొనుగోలు చేయటం అర్థం లేని విషయం. అవన్నీ కొన్ని తరాల కింద పేదల నుంచి ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకున్నవి, కూలీలుగా వారి శ్రమను దోచుకున్న వారి ఆధీనంలో ఉన్నవి. అన్నింటినీ మించి నయా వుదారవాద విధానాలలో భాగంగా ప్రభుత్వాలు ఉత్పాదక రంగాలలో పెట్టుబడులను పెట్టటం లేదు. దక్షిణాఫ్రికాలో భూ సంస్కరణలు అమలు జరిపి పేదలకు భూమిని ఇచ్చి సాగు చేయమంటే జరిగేది కాదు. ఇప్పటి వరకు వేలాది ఎకరాల క్షేత్రాలలో పెట్టుబడిదారీ పద్ధతులలో సాగును చూసిన అక్కడి పేదలు తమకు కేవలం భూమిని ఇస్తే ఏం చేసుకోవాలనే అనాసక్తత కూడా ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అందువలన ప్రభుత్వం ఏ రూపంలో పెట్టుబడులు పెట్టాలి, ఆహార భద్రత ఎలా చేకూర్చాలి, రైతాంగానికి గిట్టుబాటు అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటి మొదలైన అనేక అంశాల మీద విధానపరమైన స్పష్టత వచ్చినపుడే సంస్కరణలు జయప్రదమౌతాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మాజీ ప్రధాని వాజ్‌పేయిపై మీడియాలో అతిశయోక్తులు !

20 Monday Aug 2018

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

AB Vajpayee, BJP, RSS

Image result for ab vajpayee, govindacharya

ఎం కోటేశ్వరరావు

మాజీ ప్రధాని ఏబి వాజ్‌పేయి దేశ రాజకీయ చరిత్రలో ఏ రకంగా చూసినప్పటికీ ఒక ప్రముఖుడనటం నిర్వివివాదాంశం. స్ధానిక, జాతీయ మీడియా సహజంగానే, అందునా కేంద్రంలో, రాష్ట్రాలలో వున్న ప్రభుత్వాలకు భయపడి లేదా భక్తితో గానీ భారీగానే ఆయన మరణవార్తలకు చోటు కల్పించింది. కేంద్ర సర్కార్‌ తీసుకున్న చర్యల వలన తన ఆదాయం రెట్టింపు అయిందని చత్తీస్‌ ఘర్‌ రాష్ట్ర రైతు మహిళ ఒకరు చెప్పిన అంశాన్ని నరేంద్రమోడీ పెద్ద ఎత్తున తన ప్రచారానికి వినియోగించుకున్నారు. అదెంత బూటకమో బయట పెట్టిన ఎబిపి న్యూస్‌ ఛానల్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌, మరొక జర్నలిస్టులను రాజీనామా చేసి బయటకు పోయే విధంగా యాజమాన్యం వత్తిడి తెచ్చింది. దీని వెనుక కేంద్ర అధికార పార్టీ పెద్దల బెదిరింపులున్నాయన్నది బహిరంగ రహస్యం. తమ నేత వాజ్‌పేయి మృతికి తగినంత చోటు కల్పించలేదని ఆ పెద్దలు కినుక వహిస్తే… ఎందుకులే తంటా అని గావచ్చు లేదా వాజ్‌పేయి అంటే మీడియా యాజమాన్యాలకు వున్న భక్తి కావచ్చు.

వాజ్‌పేయి ఒక మాజీ ప్రధాని, అటువంటి వ్యక్తి మరణించినపుడు రాజకీయాలతో నిమిత్తం లేకుండా విచారం వెలిబుచ్చటం, నివాళి అర్పించటం ఒక సంస్కారం. అలా చేయటమంటే ఆయన రాజకీయాలను, ఇతర అంశాలన్నింటితో ఏకీభవించటం అని కానే కాదు. కమ్యూనిస్టు పార్టీలు సంతాప ప్రకటనలు చేయటాన్ని సామాజిక మాధ్యమంలో తప్పుపడుతూ, వ్యంగోక్తులు విసురుతూ కొందరు వ్యాఖ్యానాలు చేశారు. వాజ్‌పేయి రాజకీయ జీవితంలో వున్న ప్రతికూలతల కారణంగా ఆయన మరణానికి విచారం ప్రకటించకపోవటం ఒక విప్లవ చర్య అనే అర్ధం వచ్చేట్లుగా కొందరి తీరు వుంది. అలా అయితే హిట్లర్‌ మరణానికి కూడా సంతాపం ప్రకటించాలి కదా అనే తీరులో స్పందించారు కొందరు. దాని గురించి వదిలేద్దాం. వాజ్‌పేయికి సంతాపం ప్రకటించిన సిపిఐ(ఎం) ప్రకటన పూర్తి పాఠం ఇలా వుంది.(The Polit Bureau of the Communist Party of India (Marxist) expresses its grief at the death of former Prime Minister Shri Atal Behari Vajpayee.Shri Vajpayee had a distinguished political career in parliament, in government and as Prime Minister of India.As a political leader he commanded respect of all sections.) ‘మాజీ ప్రధాని శ్రీ అతల్‌ బిహారీ వాజ్‌పేయి మరణం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తన విచారాన్ని వ్యక్తం చేస్తున్నది. ప్రధానిగా ప్రభుత్వంలోనూ, పార్లమెంటులోనూ వాజ్‌పేయి విలక్షణ రాజకీయ వురవడి కలిగినవారు. ఒక రాజకీయవేత్తగా అన్ని తరగతుల మెప్పు పొందారు.’ ఈ మాత్రపు ప్రకటన కూడా చేయకూడదని ఎవరైనా అనుకుంటే వారి అది వారికున్న స్వేచ్చ.

దేశ రాజకీయాలలో వాజ్‌పేయి పాత్ర గురించి మరణించిన సమయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం గురించి సామాజిక మాధ్యమంలో కొంతమంది పరివార్‌ అభిమానులు, కానివారు కూడా అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బతికి వున్నపుడు, చురుకుగా రాజకీయాల్లో వున్నపుడు కూడా ఆయన గురించి తీవ్ర విమర్శలు చేసినపుడు కూడా ‘అభిమానులు’ పై మాదిరే వ్యవహరించారు.బిజెపికి వాజ్‌పేయి ఒక ముసుగు అని వర్ణించిన ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత వేత్త కెఎన్‌ గోవిందాచార్య గురించి తెలిసిందే. వాజ్‌పేయి మరణం సందర్భంగా దాని గురించి మాట్లాడుతూ తాను చెప్పిన మాటను ఒక తరగతి మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. బిజెపిలో వాజ్‌పేయి బహుళ ఆదరణ కలిగిన వారు, అత్యధికులు ఆమోదించే ముఖ రూపసి అని చెప్పానని అయితే ముఖ రూపసి బదులు ముసుగుగా మార్చారని గోవిందాచార్య అన్నారు. ఆ వుదంతంతో గోవిందాచార్య బిజెపి, రాజకీయాలలో కూడా చోటును కోల్పోయారు.
చరిత్రలో హిట్లర్‌ను కూడా నిస్సిగ్గుగా సమర్ధించేవారున్నారు. చరిత్రలో బతికి వున్నపుడు, మరణించిన తరువాత తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొనని రాజకీయనేతలు బహు కొద్ది మంది. అలాంటి వారిలో వాజ్‌పేయి లేరు. కొంత మంది తమ అభిమాన రాజకీయ నేతల విషయంలో అతిశయోక్తులను ముందుకు తెస్తారు. పని గట్టుకొని ప్రచారం చేస్తారు. వాజ్‌పేయి విషయంలోనూ అదే జరుగుతోందా ?

ఆగస్టు 17వ తేదీన ఆంధ్రజ్యోతి పత్రికలో 1942.. ఏ లవ్‌ స్టోరీ పేరుతో ఒక వార్త వచ్చింది. దాని సారాంశం ఇలా వుంది. 1942లో గ్వాలియర్‌ విక్టోరియా కాలేజీలో వాజ్‌పేయి తన సహాధ్యాయిని ప్రేమించి దాన్ని బహిరంగంగా చెప్పలేక ప్రేమలేఖ రాసి పుస్తకంలో పెట్టి ఆమెకు ఇచ్చారు. రెండు మూడు రోజులు గడిచినా ఏ స్పందనా లేకపోవటంతో తన లేఖను ఆమె చూడలేదని అనుకున్నారు. అయితే ఆమె కూడా అంగీకరిస్తూ రాసిన లేఖను అదే పుస్తకంలో పెట్టి వాజ్‌పేయికి ఇద్దామనుకున్నారు. ఆ సమయంలో వ్యక్తిగత కారణాలతో వాజ్‌పేయి ఢిల్లీ వెళ్లినందున ఆ లేఖ ఆయనకు చేరలేదు. తమ ప్రేమ గురించి రాజకుమారి తలిదండ్రులకు చెప్పినా శాఖాబేధం కారణంగా వారు అంగీకరించలేదు. ఆమెకు 1947లో ఢిల్లీలో హడావుడిగా నిశ్చితార్ధం చేయించి ఆ తరువాత గ్వాలియర్‌ తీసుకువచ్చి పెళ్లి చేశారు. ప్రేమ విఫలం కావటంతో వాజ్‌పేయి పెళ్లి చేసుకోకుండా రాజకీయాలకు అంకితమై పోయారు. కొన్నాళ్ల తరువాత ఢిల్లీలో వాజ్‌పేయి అమెని కలిశారు. తరువాత వారింటికి తరచూ వెళ్లే వారు. భర్త చనిపోయిన తరువాత రాజకుమారి ఆయన అధికార నివాసానికి మకాం మార్చారు. వాజ్‌పేయితోనే వుండిపోయారు.’

అనేక మంది రాజకీయ నేతల మాదిరే వారి సంబంధం గురించి అనేక కధనాలు గతంలోనే వెలువడ్డాయి. వాటి మీద వాజ్‌పేయి స్పందించిందీ లేనిదీ తెలియదు. నాకు ఎక్కడా దొరకలేదు. ఆగస్టు 19నాటి ఈనాడు పత్రికలో వాజ్‌పేయీ స్వీయ నిర్బంధం ! అనే శీర్షికతో ఒక వార్తను బాక్సు కట్టీ మరీ ప్రచురించారు. దాని సారాంశం ఇలా వుంది. పెళ్లి అనే రెండు అక్షరాలకూ వాజ్‌పేయి బహుదూరం. వివాహానికి దూరంగా వుండిపోతే జీవితాన్ని జాతికి అంకితం చేసే వీలుంటుందన్నదే వాజ్‌పేయి అభిమతం అని ఆయన సన్నిహిత మిత్రుడు దివంగత గోరేలాల్‌ త్రిపాఠీ తనయుడైన విజయ ప్రకాష్‌ చెప్పారు. తొలి నుంచీ బ్రహ్మచర్య జీవితాన్నే ఇష్టపడేవారు. ఆయన పీజీ చేసే రోజులలో తలిదండ్రులు ఆయన వివాహం గురించి అనుకోవటం ఆయన చెవిన పడింది. కల్యాణమంటే విరక్తి పెంచుకున్న వాజ్‌పేయి కాన్పూర్‌లోని మిత్రుడి ఇంటిలో ఒక గదిలోకి వెళ్లి మూడు రోజులు తనను తాను బంధించుకున్నంత పని చేశారు.’

ఆంధ్రజ్యోతి వార్త ప్రకారం వాజ్‌పేయి ఒక భగ్న ప్రేమికుడు. ప్రేమికురాలు రాజకుమారి భర్త చనిపోయిన తరువాత ఆమె తన నివాసాన్ని వాజ్‌పేయి ఇంటికి మార్చి నాలుగు సంవత్సరాల క్రితం మరణించే వరకు అక్కడే వున్నారు. అందువలన పై రెండు వార్తలనూ పక్కపక్కనే పెట్టుకొని చదివితే పాఠకుడు గందరగోళంలో పడిపోతాడు. వాజ్‌పేయి గురించి ఈనాడు అతిశయోక్తులు రాసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వాజ్‌పేయి గురించి గతంలో పత్రికల్లో, మరణించిన తరువాత సామాజిక మాధ్యమంలో జరిగిన చర్చలో 1942లో క్విట్‌ ఇండియా వుద్యమంలో అరెస్టయి అప్రూవర్‌గా మారి చెప్పిన సాక్ష్యంతో కొంత మందికి శిక్షలు పడ్డాయనే అంశం. ఆయన మరణించిన సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించటం ఏమిటి? ఆయన బతికి వుండగా విమర్శిస్తే సమాధానం చెప్పటమో, సరిదిద్దుకోవటమో చేసే వారు కదా అని కొంత మంది సామాజిక మాధ్యమ చర్చల్లో అభిప్రాయపడ్డారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్ర వుద్యమానికి దూరం. అలాంటి సంస్ధలో 1939లోనే చేరిన వాజ్‌పేయి 1942లో క్విట్‌ ఇండియా వుద్యమంలో ఎలా పాల్గొన్నారు. ద్రోహం చేసినట్లు, కోర్టులో అంగీకరించిన ప్రకటన వలన ఆయన బయటపడినా కొందరికి శిక్షలు పడటం గురించి నిజా నిజాలేమిటి? దీనికి సంబంధించి ఫ్రంట్‌లైన్‌ పక్షపత్రిక 1998 ఫిబ్రవరి 7-20వ తేదీ సంచికలో ఒక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. వాజ్‌పేయిని ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తెచ్చే క్రమంలో ఆయనకు స్వాతంత్య్రవుద్యమంలో పాల్గన్న నేపధ్యం వుంది అని చెప్పేందుకు గాను సంఘపరివార్‌, బిజెపి తాపత్రయ పడింది, వాజ్‌పేయి క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొని జైలు పాలయ్యారని ప్రచారం చేశారు. చివరికి వాజ్‌పేయి కూడా స్వయంగా తాను క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొన్నట్లు చెప్పుకున్నారు. ఇక్కడే చిక్కువచ్చింది. ఇరవై ఒక్క రోజులు జైలులో వున్న తరువాత ఒక పత్రం రాసి ఇచ్చి బయటపడ్డారు. అయితే తాను ఎలాంటి పత్రం రాయలేదని, బ్రిటీష్‌ వారికి లొంగిపోలేదని వాదించారు. చివరకు మీడియా పరిశోధనలో వెల్లడైన అంశాల కారణంగా తాను పత్రంపై సంతకం చేసిన మాట నిజమే అని ఫ్రంట్‌లైన్‌ ప్రతినిధులతో అంగీకరించారు. 1942 సెప్టెంబరు ఒకటవ తేదీన ఆగ్రా జిల్లా సెకెండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు వుర్దూలో రాసిన పత్రంపై వాజ్‌పేయి ఆంగ్లంలో సంతకం చేశారు. దాదాపు అలాంటిదానినే ఆయన సోదరుడు ప్రేమ్‌ బిహారీ వాజ్‌పేయి కూడా మెజిస్ట్రేట్‌కు అంద చేశారు. ఇంతకీ ఎబి వాజ్‌పేయి రాసిచ్చిన పత్రంలో ఏముంది?

నా పేరు : అతల్‌ బిహారీ , తండ్రిపేరు : గౌరీ శంకర్‌, నా కులం: బ్రాహ్మణ, వయస్సు : 20, వృత్తి : విద్యార్ధి గ్వాలియర్‌ కాలేజి, చిరునామా : బాతేష్వర్‌, పిఎస్‌ బా, జిల్లా ఆగ్రా

మీరు దహనకాండకు పాల్పడ్డారని, నష్టపరిచారని చెబుతున్నారు, దీనికి సంబంధించి మీరేమి చెబుతారు. అన్న న్యాయూర్తి ప్రశ్నకు ‘ 1942 ఆగస్టు 27న బాతేష్వర్‌ బజార్‌లో ఆలా గానం నిర్వహిస్తున్నారు. సాయంత్రం రెండు గంటల సమయంలో కకువా అనే లీలాధర్‌ మరియు మహువా ఆలా దగ్గరకు వచ్చి ఒక వుపన్యాసం ఇచ్చి అటవీ చట్టాలను వుల్లంఘించాలని కోరారు. రెండువందల మంది జనం ఫారెస్ట్‌ ఆఫీసుకు వెళ్లారు, నేను నా సోదరుడు జనాన్ని అనుసరించాము బటేష్వర్‌ అటవీ కార్యాలయానికి చేరుకున్నాము. నా సోదరుడు, నేను కిందనే వున్నాము, జనం పైకి వెళ్లారు. నాకు కకువా మరియు మహువా తప్ప అక్కడున్నవారిలో మరే ఇతర వ్యక్తి పేరూ తెలియదు. ఇటుకలు కిందికి పడుతున్నట్లు నాకు కనిపించింది. గోడను ఎవరు పడగొడుతున్నారో తెలియదు కానీ గోడ ఇటుకలు మాత్రం పడుతున్నాయి. నేను నా సోదరుడితో కలసి మెయిపురా వెళ్లేందుకు బయలుదేరాము, జనం మా వెనుక వస్తున్నారు.పైన పేర్కొన్న వ్యక్తులు పశువుల శాల నుంచి మేకలను బలవంతంగా బిచికోలీ వైపు మళ్లించారు. అటవీ కార్యాలయంలో పది పన్నెండు మంది వున్నారు. నేను వంద అడుగుల దూరంలో వున్నాను. ప్రభుత్వ భవనాన్ని పడగొట్టటానికి నేను ఎలాంటి సాయం చేయలేదు. ఆ తరువాత మేము ఇండ్లకు వెళ్లాము.’

ఈ పత్రంపై అతల్‌ బిహారీ వాజ్‌పేయితో పాటు మెజిస్ట్రేట్‌ ఎస్‌ హసన్‌ కూడా సంతకాలు చేశారు. శిక్షా స్మృతి సెక్షన్‌ 164కింద ఈ ప్రకటనను నమోదు చేశారు. ఆ పత్రం మీద మెజిస్ట్రేట్‌ చేత్తో కింది విధంగా రాసి సంతకం చేశారు.

అతనెలాంటి తప్పు చేయలేదని గౌరీశంకర్‌ కుమారుడైన అతల్‌ బిహారీకి నేను వివరించాను, ఒకవేళ చేసి వుంటే ఏ తప్పయినా చేస్తే దానిని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యంగా పరిగణిస్తామని చెప్పాను. ఈ విషయాలు అతను స్వచ్చందంగా వెల్లడించినట్లు నేను నమ్ముతున్నాను.ఇది నా సమక్షములో తీసుకున్నది, అతల్‌ బిహారికి చదివి వినిపించబడినది, దానిలో తాను చెప్పిన అంశాలే పూర్తిగా వున్నాయని, సరైనవే అని అతను అంగీకరించాడు.

కోర్టులో చేసిన ఈ ప్రకటనను బట్టి వాజ్‌పేయి క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొనలేదు. ఆందోళనకారుల వెనుక వున్నందున ఆయనను కూడా అరెస్టు చేశారు. ఆ రోజు జరిగినదానితో తనకేమీ సంబంధం లేదని స్పష్టంగా చెప్పినందున తరువాత కేసు నుంచి ఆయన బయట పడ్డారు. నిజమైన స్వాతంత్య్ర సమర యోధులందరూ పోలీసులు, కోర్టుల ముందు తాము బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పాల్గొన్నట్లు వీరోచితంగా ప్రకటనలు చేసి చెరసాలలు, వురికొయ్యలకు తమ జీవితాలను అంకితం చేశారు. జైలు జీవితాలు, చిత్రహింసలను భరించలేని సావర్కర్‌ వంటి వారు లొంగిపోయి బ్రిటీష్‌ వారికి సేవ చేసుకుంటామని, విధేయతతో వుంటామని లేఖలు రాసి బయట పడ్డారు. ఇక వాజ్‌పేయి కోర్టులో చేసిన ప్రకటనలో తన పేరు ప్రస్తావించినందున సాక్ష్యంగా చెప్పకపోయినా తన శిక్షకు కారణం అది కూడా ఒకటని కకువా అనే లీలాధర్‌ అభిప్రాయపడ్డారు. దాన్నే కాంగ్రెస్‌ నాయకులు ప్రచారంలో పెట్టి వాజ్‌పేయి లొంగుబాటు కారణంగా స్వాతంత్య్ర సమర యోధులకు శిక్షలు పడ్డాయని ప్రకటనలు చేశారు. చాలా కాలం పాటు వాజ్‌పేయి క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొన్న సమర యోధుడని చేసిన ప్రచారం అవాస్తవమని తేలింది. తాను పాల్గొనలేదని, జరిగినదానితో జరిగినదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్వయంగా కోర్టులో ప్రకటన చేశారు. వాజ్‌పేయి గానీ మరొక నేత గానీ ఎవరి గురించి అయినా అతిశయోక్తులు ప్రచారం చేసుకోవటానికి కొందిరికి ఎలా స్వేచ్చ వుంటుందో విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించటానికి కూడా ఎవరికైనా అలాంటి స్వేచ్చే వుంటుంది. ఎవరూ చరిత్ర విశ్లేషణలు, విమర్శలకు అతీతులు కాదు. అది సభ్య సమాజం ఆమోదించిన పరిమితులకు లోబడి వుండాలి. సానుకూలంగా లేదా ప్రతికూలంగా చేసే విమర్శలు లేదా ఆరోపణలకు ఆధారాలు చూపగలిగి వుండాలి. మేం చెప్పింది మా నమ్మకం, విశ్వాసం, ఇతరులు మా మనోభావాలను దెబ్బతీస్తున్నారంటే కుదరదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా యువతలో సైద్ధాంతిక మధనం, పెట్టుబడిదారీ విధానంపై విముఖత !

17 Friday Aug 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, american youth, American youth prefer socialism to capitalism, ideological churning, prefer socialism to capitalism

Image result for american youth prefer socialism to capitalism

ఎం కోటేశ్వరరావు

5డబ్ల్యూస్‌ 1హెచ్‌ ఒక ఫార్ములా, దీని గురించి ఏ మాత్రం తెలియకపోయినా మానవ పరిణామ క్రమంలో వానరుడు నరుడుగా మారిన తరువాత యావత్‌ మానవ జాతిని గతంలో ముందుకు నడిపించింది, ఇప్పుడు నడిపిస్తున్నదీ, రాబోయే రోజుల్లో నడిపించేదీ ఇదే. ఎవరు, ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా? అన్నదే ఆ సూత్రం. అమెరికాలో తలెత్తిన వర్తమాన పరిస్ధితులు అక్కడి జనాన్ని మొత్తంగా, ప్రత్యేకించి మూడుపదుల లోపు యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అక్కడి సమాజంలో ఒక సరికొత్త మధనం ప్రారంభమైంది. వివిధ సర్వేల ఫలితాలు దాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

గతేడాది డిసెంబరు నాలుగున న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ‘సహస్రాబ్ది యువత పెట్టుబడిదారీ విధానాన్ని అసహ్యించుకోవటంలో ఆశ్చర్యం లేదు’ అంటూ మిచెల్లీ గోల్డ్‌బర్గ్‌ రాసిన ఒక విశ్లేషణను ప్రచురించింది. అది ఇలా ప్రారంభం అయింది.’ మనం పెట్టుబడిదారీ విధానాన్ని రద్దు చేయాలా అనే అంశంపై గతనెలలో శుక్రవారం రాత్రి మాన్‌హట్టన్‌(న్యూయార్క్‌)లో జరిగిన ఒక చర్చను నేను సమన్వయం చేశాను. దానిని సోషలిస్టు పత్రిక జాకోబిన్‌ నిర్వహించింది. పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధిస్తూ వుదారవాద పత్రిక ‘ రీజన్‌ ‘ సంపాదకులు పాల్గొన్నారు. హాలులోని 450సీట్లకు ఒక రోజులోనే టికెట్లు అయిపోయాయి. దాంతో దానికి రెట్టింపు మంది పట్టే చోటుకు జాకోబిన్‌ పత్రిక వేదికను మార్చింది. అదనపు సీట్ల టిక్కెట్లు కేవలం ఎనిమిది గంటలలోనే అయిపోయాయి. నేను రాగానే ప్రవేశ ద్వారం వైపు వరుసలలో వెళుతూ జనం కనిపించారు. భూ గర్భంలోని ఒక నైట్‌ క్లబ్‌ పార్టీ ఆహ్వానితుల జాబితాలో నేనున్నానా అనిపించింది. హాజరైన వారిలో అత్యధికులు 20,30వ పడులలో వున్నారు. వారి పెద్దలు ఎలాంటి శషభిషలు లేకుండా విశ్వసించిన పెట్టుబడిదారీ విధానం పట్ల ఈ తరంలోని ఒక భాగం అసాధారణ రీతిలో అనుమానంతో వుంది.

సహస్రాబ్దియువతలో 44శాతం మంది ఒక సోషలిస్టు దేశంలో నివసించాలని కోరుకుంటున్నారని, దానితో పోల్చితే పెట్టుబడిదారీ విధానం కావాలని కోరుకొనే వారు 42శాతం మందే అని ఇటీవలి సర్వేలో కనుగొనటం గురించి కమ్యూనిస్టు వ్యతిరేక ‘కమ్యూనిజం బాధితుల స్మారక సంస్ధ ‘ హెచ్చరించింది. కమ్యూనిజం కుప్పకూలటం అంటే పెట్టుబడిదారీ విధానానికి మరొక ప్రత్యామ్యాయం లేనట్లుగా అమెరికాలోని పెద్దవారికి కనిపించింది. కానీ రాను రాను మన ఆర్ధిక వ్యవస్ధ కొద్ది మంది చేతిలో పోగుబడే స్వభావ రూపం పెట్టుబడిదారీ విధానం అంటే విఫలమైన దేవుడిగా ఎక్కువ మంది యువతకు కనిపించటంలో ఆశ్చర్యం లేదు. శనివారం తెల్లవారు ఝామున ఆమోదం పొందిన దిక్కుమాలిన పన్నుల బిల్లుతో ఇప్పుడు అది మరింత స్పష్టమైంది. ఆ బిల్లు ధనికులను మరింత ధనికులుగా పేదలను మరింత పేదలుగా చేస్తుంది. టాక్స్‌ పాలసీ కేంద్రం పేర్కొన్నదాని ప్రకారం 2027 ఆదాయంలో అగ్రభాగాన వున్న ఐదు శాతం మందికి పెద్ద మొత్తంలో పన్నుల తగ్గింపు, అధమ స్ధానంలో వున్నవారికి పెంపుదల వుంటుంది. ఇక్కడ ఒక వుదాహరణ చూద్దాం. ప్రయివేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపే తలిదండ్రులకు సెనేట్‌ బిల్లు పన్నుల రాయితీని ప్రకటించింది. సహస్రాబ్ది తరంలో అత్యధికులు ఎవరైతే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతారో ఈ చర్య వాటికి నిధుల లభ్యతను కష్టతరం గావిస్తుంది.’

ట్రంప్‌ ప్రతిపాదించిన ఈ పన్నుల రాయితీలు ధనికులను మరింతగా ధనికులను గావిస్తాయి, పెట్టుబడిదారీ ఆర్ధికవేత్త థామస్‌ పికెటీ పేర్కొన్న ఆదాయ,సంపద అంతరాలను మరింతగా పెంచుతాయి. అలాంటపుడు వాటి గురించి యువత, మొత్తం సమాజం ఆలోచించకుండా ఎలా వుంటుంది. వారికి ముందుగా చెప్పుకున్న ఫార్ములా తప్ప మరొకటి దారి చూపదు. దానికి అనుగుణ్యంగానే సర్వేలు అక్కడి జనాల మనోభావాలను వ్యక్తీరిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఒక గాలప్‌ సర్వే ప్రకారం అమెరికాలో తొలిసారిగా సోషలిజం పట్ల మెజారిటీ యువతలో సానుకూల ధోరణులు వ్యక్తమయ్యాయి. పురోగామి శక్తులకు ఇది నిజంగానే ఎంతో వుత్సాహం, తిరోగామి వాదులకు నిరుత్సాహం కలిగించే అంశం. సోషలిజం, కమ్యూనిజం అంతరించింది, వాటికి భవిష్యత్‌ లేదు అని ప్రకటించిన పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకతకు నెలవైన చోటే ఈ పరిణామం జరుగుతోంది. 2010లో పెట్టుబడిదారీ విధానం పట్ల 18-29 సంవత్సరాల యువతలో 68శాతం సానుకూలత వ్యక్తం కాగా అది క్రమంగా దిగజారుతూ 2018లో 45కు పడిపోయింది, ఇదే సమయంలో తొలిసారిగా 51శాతం మంది సోషలిజం పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. డెమోక్రటిక్‌ పార్టీ, దానిని అభిమానించే స్వతంత్రులలో సోషలిజాన్ని అభిమానించే వారు 57శాతం వరకు వున్నారని కూడా తేలింది. అయితే అమెరికా సమాజంలో మొత్తంగా చూసుకున్నపుడు పెట్టుబడిదారీ విధానం పట్ల 56శాతం సానుకూలంగా వున్నప్పటికీ అది ఇప్పటి వరకు నమోదైన కనిష్ట సంఖ్య. సోషలిజం అంటే సానుకూలత పెరిగినప్పటికీ దాని సాధనకు ఒక విప్లవ పార్టీని ఏర్పాటు చేసే పరిస్ధితులు ఇంకా ఏర్పడలేదు. 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఏడాది కాలంలోనే అధిగమించామని అమెరికా పాలకులు ఎంతగా నమ్మబలికినప్పటికీ జనం దానిని నమ్మటం లేదని ఈ సర్వే నిర్దారించింది. ఎందుకంటే గత పది సంవత్సరాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలను కుదించటం లేదా నిధుల కోత పెట్టారు. గతంలో మాదిరి వాటిని అమలు జరుపుతారనే నమ్మకం పోతోంది.

1990 దశకంలో సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన సమయంలో తరుణ వయస్సు వచ్చిన వారికి, తరువాత పుట్టిన వారికి ఆధునిక ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానం సహజమైనదిగా కనిపించింది. దాని వైఫల్యం, తమ కళ్ల ముందే ధనికులకు మరిన్ని అవకాశాలను కల్పించటంతో యువత ఆ విధానం సరైంది కాదని భావిస్తోంది. అన్నింటికీ మించి వారికి పొద్దున లేస్తే చైనా తయారీ వస్తువులు లేనిదే గడవదు. తమ దేశంలో మాదిరి సమస్యలు తలెత్తినట్లు చైనా గురించి వార్తలేమీ లేవు.అధికారంలో ఎవరున్నప్పటికీ చైనాతో పెరుగుతున్న వాణిజ్యలోటు గురించి నిత్యం చర్చ జరుగుతోంది. చైనాపై వ్యతిరేకతను కూడా రోజూ రెచ్చగొడుతున్నారు, అయినప్పటికీ జపాన్‌ను వెనక్కు నెట్టి తమతో పోటీ పడేవిధంగా చైనా అభివృద్ధి చెందుతోందనే వార్తలు వెలువడుతున్నాయి. అందువలన వారికి సోషలిస్టు వ్యవస్ద గురించి పూర్తి అవగాహన లేకపోయినా తమ విధానం కంటే సోషలిజమే మెరుగైనదని వారు భావించటం సహజం.

Image result for american youth prefer socialism to capitalism

యువతను పునరాలోచనకు పురికొల్పుతున్నదేమిటి?

నిజవేతనాలు పడిపోతున్నాయి, మెరుగైన వుద్యోగాలు లేవు, ఆదాయ అసమానతలు వేగంగా పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో పరిస్ధితి మెరుగుపడుతుందనే ఆశ కనిపించటం లేదు. విద్యకోసం తీసుకున్న రుణాలు కొండలా పెరిగిపోతున్నాయి. గతంలో తమ వేతనాల్లో 18శాతం ఇండ్ల అద్దెలకు చెల్లిస్తే సరిపోయేది ఇప్పుడు అది 30శాతం దాటింది. మెరుగైన జీవనం గడవాలంటే వారానికి కనీసం 80గంటలు పని చేస్తే తప్ప అవసరమైన ఆదాయం రాదు. అన్ని గంటల పని దొరికే అవకాశాలు కూడా లేవు. స్వతంత్రంగా బతికే అవకాశాలు తగ్గిపోతుండటంతో తలిదండ్రుల మీద ఆధారపడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కాపిటలిజం ప్రతినిధులుగా డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి వారే కనిపిస్తున్నారు, ఇలాంటి వారు తమ జీవితాలను మెరుగుపరచే అవకాశాలు లేవని బలంగా నమ్ముతున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలో శాండర్స్‌ వంటి వారు సోషలిజం గురించి గతం కంటే గట్టిగా మాట్లాడుతున్నారు.

ఏ సిద్ధాంతం లేదా రాజకీయాలు లేకపోవటం కంటే ఏదో ఒక సిద్ధాంతం, రాజకీయాల మీద చర్చ జరగటం మంచిది. సిద్ధాంత, రాజకీయ రాహిత్య ధోరణులను ప్రోత్సహించేది పాలకవర్గమే. అమెరికాలో జరుగుతున్న మధనం, పరిణామాల గురించి భిన్నాభిప్రాయాలు వున్నాయి. ట్రాట్క్సీయిస్టులుగా వున్న వారి వాదన ప్రకారం పెట్టుబడిదారీ విధానానికి జన సామాన్యంలో ఎదురవుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, గందరగోళపరిచేందుకు మరొక మార్గంలో పాలకవర్గం బెర్నీ శాండర్స్‌ వంటి నకిలీ సోషలిస్టులను, వుద్యమాలను ప్రోత్సహిస్తున్నది. డెమోక్రటిక్‌ పార్టీలోని ఒక భాగం ఏర్పాటు చేసిన డెమోక్రటిక్‌ సోషలిస్ట్స్‌ ఆఫ్‌ అమెరికా(డిఎస్‌ఏ) అనే పార్టీ దాని అనుబంధ సంస్ధ తప్ప ఆ పార్టీని వ్యతిరేకించేది కాదు. దాని పెట్టుబడిదారీ, బూర్జువా రాజకీయాలకు అది ఆమోదయోగ్యమైనది. ఈ అవగాహనతో పూర్తిగా ఏకీభావం వుండకపోవచ్చు లేదా అంగీకరించవచ్చు. తాము చెప్పేదే నిజమైన సోషలిస్టు విప్లవ మార్గం అని చెప్పుకొనే ట్రాట్క్సీయిస్టులు ఎక్కడా బలమైన కమ్యూనిస్టు వుద్యమాలను నిర్మించిన లేదా సోషలిస్టు విప్లవాలకు నాయకత్వం వహించిన చరిత్రగానీ లేదు. తాము తప్ప మిగిలిన వారందరూ నకిలీలని వారు చెప్పుకుంటారు. సోషలిస్టులుగా, మార్క్సిస్టులుగా చెప్పుకొనే కొంత మంది చైనాలో జరుగుతున్నది ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధ తప్ప సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం కాదు అంటారు. అందువలన నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను బయటకు రానివ్వండి అన్నట్లుగా చర్చ జరగనివ్వాలి, భిన్నాభిప్రాయలను వినటానికి ఇబ్బంది లేదు. ఆయా దశలను బట్టి కార్యాచరణను ప్రోత్సహించాలి. జనాల వివేచన మీద విశ్వాసం వుండాలి, దాన్ని మెరుగుపరచేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలి. డెమోక్రటిక్‌ పార్టీలో వామపక్ష వాదులుగా వున్న వారు ఏర్పాటు చేసిన ఒక వేదిక తప్ప డిఎస్‌ఏ అనేది ఒక పార్టీ కాదని కూడా చెబుతారు. అయితే ఆ వేదిక సభ్యులం అని అనేక మంది సగర్వంగా చెప్పుకుంటారు. అలాంటి వారిని ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోంది.

Image result for american youth prefer socialism to capitalism

ఈ పూర్వరంగంలో అమెరికాలో జరుగుతున్న పరిణామాలను ఆహ్వానించాలా, వ్యతిరేకించాలా? మార్క్సిస్టు అవగాహన ప్రకారం కార్మికవర్గం తప్ప దోపిడీకి గురయ్యే వారందరూ సోషలిస్టు విప్లవం జయప్రదం అయ్యేంత వరకు దానికి నాయకత్వం వహించే పార్టీలతో వుండరు. తమ సమస్య పరిష్కారం కాగానే కొందరు ఆగిపోతారు. కమ్యూనిస్టు పార్టీలు దున్నేవానికి నినాదంతో రైతాంగాన్ని సమీకరిస్తాయి. ఆ సమస్య పాక్షికంగా పరిష్కారమై కొందరికి భూమి వచ్చిన తరువాత వారు వుద్యమంలో భాగస్వాములయ్యే తీరుకు, రాని వారి తీరుకు తేడా వుంటుంది. కమ్యూనిస్టులు గాని సోషలిస్టు పార్టీలు కూడా అంతే. సోషలిజం, కమ్యూనిజం అనే మాటే బూతుగా, సోషలిస్టును, కమ్యూనిస్టును అని చెప్పుకున్న వారిని వెలివేసినట్లుగా చూసే వాతావరణం వున్న అమెరికాలో అవును నేను సోషలిస్టును అని చెప్పుకోవటమే ఒక పెద్ద ముందడుగు. ఎన్నికలలో పోటీ చేసి ఒక మున్సిపల్‌ వార్డులో అయినా గెలవటం సామాన్య విషయం కాదు. అమెరికన్‌ యువతలో సోషలిజం పట్ల పెరుగుతున్న సానుకూలత ఒక మంచి పరిణామం. గతంలో కమ్యూనిజం సిద్ధాంతానికి ఆకర్షితులు అయిన వారందరూ సమగ్రంగా ఆ సిద్ధాంతం, ఆచరణలను అవపోసన పట్టిన తరువాతే కమ్యూనిస్టులుగా మారలేదు. ఇప్పుడున్న దుష్ట సమాజాన్ని మార్చాలని కోరుకుంటున్న వారికి కమ్యూనిస్టు నినాదమే ఆకర్షణీయంగా కనిపించింది కనుక ఆ వైపు మొగ్గారు. తరువాత రాటు దేలారు. అమెరికాలో అయినా మరొక చోట అయినా అదే క్రమం. అమెరికా డిఎస్‌ఏలో 2016లో ఏడువేల మంది సభ్యులుంటే గతేడాదికాలంలో ఆ సంఖ్య 47వేలకు చేరింది. నవంబరులో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలలో ఆ వేదికకు చెందిన ఇద్దరు విజయం సాధించబోతున్నారని వార్తలు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్దుల ఎంపిక పోటీలో న్యూయార్క్‌ నగరంలోని ఒక స్ధానంలో డిఎస్‌ఏ అభ్యర్ధి అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌ ప్రస్తుతం సభ్యుడిగా వున్న జోసెఫ్‌ క్రోలేను ఓడించి అభ్యర్ధిగా ఎంపికయ్యారు. డెట్రాయిల్‌ 13వ నియోజకవర్గం డిఎస్‌ఏకు బలమైనది, ఆ బృందానికి చెందిన రషీదా లాయిబ్‌ అభ్యర్ధిగా ఎంపికయ్యారు. ఈ బృందం నడిపే జాకోబిన్‌ పత్రిక సంపాదకుడిగా ప్రవాస తెలుగు సంతతికి చెందిన సుంకర భాస్కర్‌ వున్నాడు. అమెరికాలో సోషలిజం పట్ల యువతలో పెరుగుతున్న సానుకూలతను సొమ్ము చేసుకొనేందుకు భాస్కర్‌ రచనలకు న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక కొద్దికాలంగా అవకాశం ఇస్తున్నది. ప్రపంచ సోషలిస్టు పార్టీల చరిత్ర చూసినపుడు అవి ప్రధానంగా సంస్కరణల మీద కేంద్రీకరించాయి తప్ప వ్యవస్ధలో మౌలిక మార్పులను కోరలేదు. మితవాద, తిరోగమన వాదం కంటే నిస్సందేహంగా ఇవి మెరుగైనవే. డిఎస్‌ఏను సంస్కరణవాద వేదికగా భావించవచ్చు.

కారల్‌ మార్క్స్‌-ఫె˜డరిక్‌ ఎంగెల్స్‌ కంటే ముందే రకరాల సోషలిస్టు భావాలు కలిగిన వారున్నారు. వారంతా సమాజాన్ని సంస్కరించాలని, మార్చాలని కోరుకున్నారు. మార్పును కోరుకుంటే రాదు. తత్వవేత్తలు వివిధ మార్గాలలో ప్రపంచానికి వ్యాఖ్యానాలు చెప్పారు. అసలు సమస్య దానిని మార్చటం ఎలా అన్నదే అన్న మార్క్స్‌-ఎంగెల్స్‌లు తమ కమ్యూనిస్టు ప్రణాళికలో ఒక శాస్త్రీయ మార్గాన్ని చెప్పిన తరువాతే వారికీ సోషలిస్టులకు వున్న తేడాను ప్రపంచశ్రామికవర్గం గ్రహించింది. ట్రాట్క్సీయిస్టులు లేదా మరొకరో అంటున్నట్లు అమెరికాలో ఇప్పుడు సోషలిస్టులుగా చెప్పుకుంటున్నవారు కేవలం సంస్కరణలకే పరిమితం అయితే కావచ్చు. పెట్టుబడిదారీ విధానం మీద భ్రమలు పూర్తిగా పోయాయని ఎవరూ చెప్పటం లేదు. అలాంటి వారు సంస్కరణల ద్వారా మంచి భవిష్యత్‌ నిర్మాణం చేసుకోవచ్చని అనుకోవచ్చు. తమ అనుభవంలో వాటికి వున్న పరిమితులను అర్ధం చేసుకొని అక్కడి యువత,శ్రామికవర్గం ఆ తదుపరి ఏం చేయాలో, ఏ బాటను పయనించాలో నిర్ణయించుకోలేదా ? విప్లవ పార్టీని నిర్మించుకోలేదా ? పాలకవర్గ నిజరూపాన్ని గుర్తించలేదా ? అందువలన అనుమానాలు, ఎలాంటి సందేహాలు అవసరం లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

టర్కీకి అమెరికా వెన్నుపోటు !

16 Thursday Aug 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald trump, NATO allies, Recep Tayyip Erdoğan, Turkey, Turkish lira, U.S.

Image result for U.S. is stabbing Turkey in the back

ఎం కోటేశ్వరరావు

ఇనకులమున జనియించిన నృపతులు ఈ దారుణము సహించెదరా, విను వీధిని శ్రేణులుగా నిలిచి విడ్డూరమును చూచెదరా, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ, విధి విధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరూ.. అంటూ కొసరాజు రాసిన పాటకు స్వరాలు సమకూర్చి స్వయంగా గానం చేసిన ఘంటసాల గీతాన్ని లవకుశ సినిమాలో చూసి కన్నీళ్లు కార్చేవారు ఇప్పటికీ వున్నారంటే అతిశయోక్తి కాదు. అది ఇతిహాస గాధ. ప్రపంచవ్యాపితంగా ఎందరినో కష్టాల పాలు చేసే, తప్పించటానికి అవకాశం వున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పలు దేశాల మీద ప్రారంభించిన వాణిజ్య లేదా ఆర్ధిక యుద్దమనే దారుణాన్ని సహించాలా, ఎలా అడ్డుకోవాలన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న వాస్తవం. అమెరికాను మనకు మంచి స్నేహదేశంగా చిత్రించేందుకు నిక్కర్ల నుంచి పాంట్స్‌కు మారిన వారు నానా తంటాలు పడుతున్నారు. అలాంటి మిత్రదేశం దెబ్బకు తొలిసారిగా మన రూపాయి గురువారం వారం నాడు ఒక దశలో ఒక డాలరుకు మారకం విలువ 70.32కి పడిపోయి సరికొత్త రికార్డును సృష్టించింది. ఒక్క మన దేశమే కాదు ప్రపంచాన్నంతటినీ ట్రంప్‌ ప్రమాదపు అంచుల వరకు తీసుకుపోతున్నాడు. మరి ఈ దారుణాన్ని ఎవరు అడ్డుకోవాలి? జనం శ్రేణులుగా నిలిచి విడ్డూరంగా చూడాలా ?

తమ ఎగుమతులపై పన్ను విధించి కరెన్సీ లీరాను దెబ్బతీసిన అమెరికాపై ప్రతీకారంగా అమెరికా కార్లపై 120శాతం, మద్యంపై 160, పొగాకు వుత్పత్తులపై 60శాతానికి దిగుమతి పన్నును టర్కీ పెంచింది. మరోవైపు 15బిలియన్‌ డాలర్ల మేరకు టర్కీలో పెట్టుబడులు పెడతామని కతార్‌ ప్రకటించటంతో లీరా కొద్దిగా కోలుకుంది.ఏడాది క్రితం సౌదీ అరేబియా నాయకత్వంలో నాలుగు అరబ్‌ దేశాలు కతార్‌పై వాణిజ్య, దౌత్యపరమైన ఆంక్షలను విధించాన్ని టర్కీ వ్యతిరేకించింది. ఇపుడు కతార్‌ ఈ విధంగా బదులు తీర్చుకుంది. టర్కీ అవసరాలలో 15బిలియన్‌ డాలర్లు చిన్న మొత్తమే అయినప్పటికీ అమెరికాకు వ్యతిరేకంగా సాధించిన నైతిక విజయమిది.

దశాబ్దాల తరబడి ఆంక్షలతో క్యూబాను అతలాకుతలం చేసిన అమెరికా తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. గత కొద్ది సంవత్సరాలుగా వామపక్ష పాలనలో వున్న వెనెజులా, నయా పెట్టుబడిదారీ ఏలుబడిలో వున్న రష్యా, మతశక్తుల ఏలుబడిలో వున్న ఇరాన్‌, పొరుగునే వున్న మిత్రదేశాలు మెక్సికో, కెనడా, సోషలిస్టు దేశమైన చైనాపై ఆర్ధిక, వాణిజ్య దాడులను జరుపుతున్నది. ఐరోపా యూనియన్‌తో తాత్కాలిక రాజీకుదుర్చుకుంది. పాతికేండ్ల క్రితం సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత తమకిక ఎదురులేదని ప్రకటించుకున్న అమెరికా ఇప్పుడు బస్తీమే సవాల్‌ అంటూ తన, పరబేధం లేకుండా ఎందుకు కత్తులు దూస్తున్నది? పర్యవసానాలేమిటి? తాజాగా మన రూపాయి రికార్డు పతనానికి కారణం నాటో కూటమిలో కీలక సభ్యదేశమైన టర్కీపై అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఆదేశాన్ని ఏ క్షణంలో అయినా పతనంలోకి నెట్టే అవకాశం వుందని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా ఆర్ధిక, రాజకీయ, మిలిటరీ ఎత్తుగడులలో ఎంతో కీలకమైనది ఐరోపా కేంద్రంగా వున్న నాటో కూటమి.దానిని మరింతగా విస్తరించేందుకు ఒకవైపు పూనుకున్న అమెరికా మరోవైపు కీలకమైన భాగస్వామి టర్కీతో సంబంధాలను దెబ్బతీసేందుకు పూనుకుంది. తమను వెన్నుపోటు పొడిచేందుకు అమెరికా చూస్తున్నదని టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయిప్‌ ఎర్డోగన్‌ తాజా పరిణామాలపై వ్యాఖ్యానించాడు.ఆర్ధిక యుద్ధాల తూటాలు, ఫిరంగి గుండ్లు, క్షిపణులను ప్రయోగించినప్పటికీ తాము వెనక్కు తగ్గేది లేదని హెచ్చరించాడు. టర్కీ కరెన్సీ లీరా పతనమైన కారణంగానే తాము పన్నులను పెంచినట్లు ట్రంప్‌ తన చర్యను సమర్ధించుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లీరా 41శాతం పతనమైంది. దీంతో టర్కీలో విదేశీ వస్తువుల ధరలు పెరిగిపోయి డిమాండ్‌ తగ్గిపోయింది. వీటిని సాకుగా చూపి గతవారంలో టర్కీ నుంచి దిగుమతి అయ్యే వుక్కుపై 50, అల్యూమినియంపై 20శాతం చొప్పున సుంకాన్ని విధించటంతో టర్కీ కరెన్సీ లీరా, స్టాక్‌ మార్కెట్‌ మరింతగా పతనమయ్యాయి, ద్రవ్యోల్బణం 15శాతానికి పెరిగింది. ఇవన్నీ ఆర్ధిక సంక్షోభానికి దారితీయవచ్చని భావిస్తున్నారు.దీనికి మతాధికారి ఆండ్రూ బ్రూసన్‌ను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌ను కూడా ట్రంప్‌ సర్కార్‌ జోడించింది. టర్కీ యూరేసియా దేశం.ఐరోపాలో ఎక్కువ భాగం వుండటంతో అక్కడి ఏకైక ముస్లిం దేశంగా పరిగణిస్తారు. ఐరోపాలోని గ్రీస్‌, బల్గేరియా, యూరేసియాలోని జార్జియా, ఆర్మీనియా, అజర్‌బైజాన్‌, ఆసియాలోని ఇరాన్‌, ఇరాక్‌, సిరియాలు సరిహద్దుగా వుంది. ఈ ప్రాంతంలో అమెరికా తన ప్రయోజనాలకు పెద్ద పీట వేయటంతో విధిలేక కొన్ని సార్లు అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించుతున్నది, తాజా వివాదానికి నేపధ్యమిదే. నిజానికి అమెరికా చేసుకొనే దిగుమతుల్లో టర్కీ నుంచి వుక్కు 4.2, అల్యూమినియం ఒకశాతం లోపే వున్నది. అందువలన వీటి కంటే రాజకీయకారణాలే ప్రస్తుతం వుభయ దేశాల మధ్య విబేధాల పెరుగులకు కారణాలుగా చెప్పవచ్చు.

2003లో జార్జి డబ్ల్యు బుష్‌ నాయకత్వంలో ఇరాక్‌పై అమెరికా దాడి చేసింది. అది మొదలు ఆ ప్రాంతంలో అమెరికా ప్రమేయంతో జరుగుతున్న పరిణామాలలో టర్కీకి సమస్యలు తలెత్తుతూనే వున్నాయి. టర్కీ, ఇరాన్‌, సిరియా సరిహద్దు ప్రాంతంలో కుర్దులు పెద్ద సంఖ్యలో వున్నారు. ఇజ్రాయెల్‌ మాదిరి తమకు ప్రత్యేకంగా కుర్దిస్దాన్‌ ఏర్పాటు చేయాలన్నది ఎప్పటి నుంచో వారి డిమాండ్లలో ఒకటి. అది జరిగితే ఆ ప్రాంత దేశాల స్వరూపమే మారిపోతుంది కనుక ఎవరూ అంగీకరించటం లేదు. పశ్చిమాసియా వివాదాలలో అమెరికన్లు కుర్దులకు మద్దతు తెలిపి వారిని పావులుగా వాడుకుంటున్నారు. సిరియాలో అసాద్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఐఎస్‌ తిరుగుబాటుదార్లను ఎదుర్కోవటంలో కుర్దులది ప్రధాన పాత్ర. వారికి అమెరికా మద్దతు ఇస్తున్నది. ఇరాక్‌, టర్కీలలోని కుర్దులు తమకు ప్రత్యేకం దేశం కావాలంటూ చేస్తున్న సాయుధ చర్యలను అక్కడి ప్రభుత్వాలు అణచివేస్తున్నాయి.

రెండు సంవత్సరాల క్రితం టర్కీలో ఒక విఫల తిరుగుబాటు జరిగింది. దానికి కుర్దిస్ధాన్‌ వర్కర్స్‌ పార్టీ, దానితో సంబంధాలున్న అమెరికా మతాధికారి ఆండ్రూ బ్రున్‌సన్‌ సంధానకర్తగా వున్నాడని భావించిన టర్కీ ప్రభుత్వం అతగాడిని అరెస్టు చేసి విడుదలకు తిరస్కరించింది. ప్రస్తుతం అధికారంలో వున్న ఎకెపి పార్టీ సహకారంతో రెండు దశాబ్దాల క్రితం టర్కీలో గులెన్‌ పేరుతో ఒక ఇస్లామిక్‌ సంస్ధ వునికిలోకి వచ్చింది. ప్రభుత్వ అండదండలతో దానితో సంబంధం వున్న అనేక మంది ప్రభుత్వ యంత్రాంగంలోకి చొరబడ్డారు. అది ఎంతవరకు వచ్చిందంటే పోలీసు, న్యాయవ్యవస్ధలోని గులెన్‌ సభ్యులు, ఆ సంస్ధను పెంచి పోషించిన ఎకెపి పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు తలెత్తింది. చివరకు అధ్యక్షుడు ఎర్డోగన్‌పై తిరుగుబాటుకు ఆ సంస్ధ పురికొల్పింది. అయితే దానిని కఠినంగా అణచివేశారు. దానికి సహకరించాడంటూ అమెరికా మతాధికారిని అరెస్టు చేసి గులెన్‌ ఒక వుగ్రవాద సంస్ధ అని ప్రకటించింది.తిరుగుబాటును ప్రోత్సహించిన ఫతుల్లా గులెన్‌ అమెరికాలోని పెన్సిల్వేనియాలో వుంటున్నాడు. అతడిని తమకు అప్పగించాలన్న టర్కీ డిమాండ్‌ను అమెరికా తిరస్కరించింది. వుగ్రవాదం పట్ల అమెరికా మెతకగా వుందంటూ టర్కీ విమర్శించింది. అప్పటి నుంచి వుభయ దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు. ఒక దేశాన్ని లొంగదీసుకోవాలంటే దాని ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం అమెరికా ఆయుధాల్లో ఒకటి. టర్కీ విషయంలో అదే జరుగుతోందా ? ఇటీవలి కాలంలో జరిగిన మరికొన్ని పరిణామాలు అమెరికాకు మింగుడు పడటం లేదు.

అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వుపసంహరించుకున్న అమెరికా ఇరాన్‌పై విధించిన ఆంక్షలను తాము ఖాతరు చేసేది లేదని టర్కీ ప్రకటించింది. ఇటీవలి కాలంలో అమెరికా ప్రత్యర్ధి అయిన రష్యాతో టర్కీ సంబంధాలు పెరుగుతున్నాయి. క్షిపణులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. అది అమెరికన్లను మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నది. సిరియాలో రష్యా మద్దతు వున్న ప్రభుత్వానిది పైచేయిగా వుంది. రష్యా, ఇరాన్‌, టర్కీలే సిరియా పరిణామాలను నిర్దేశించేవని ఇప్పటికే తేలిపోయింది. అమెరికన్లకు అది పరాభవమే. చైనా చొరవతో ప్రారంభమైన సిల్క్‌ రోడ్‌తో పాటు చైనా, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం, తదితర చర్యలు సిరియా పునర్‌నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించటంతో పాటు ఇరాన్‌ స్ధిరపడటానికి దోహదం చేసేవిగా వున్నాయి. ఇది అమెరికన్లకు ఏమాత్రమూ అంగీకారం కాదు. సిరియా తదితర పరిణామాలలో అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌ నిలబడుతోంది. ఇరాన్‌తో వాణిజ్యాన్ని వదులుకొనేది లేదని చైనా స్పష్టం చేసింది. అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా తన వెసులుబాటు కోసం ఇరాన్‌ వంటి దేశాలతో సంబంధాల మెరుగుదలకు చమురురంగంలో పెట్టుబడుల వంటివాటితో పూనుకుంది.

ఒక మతాధికారిని అడ్డం పెట్టుకొని టర్కీని తమ కాళ్లముందు పడేసుకోవాలని చూస్తోందని ఎర్డోగన్‌ మండిపడ్డారు. అమెరికా గనుక తన పద్దతులను మార్చుకోనట్లయితే తాము కొత్త స్నేహితులు, కలసి వచ్చే వారికోసం చూడాల్సి వస్తుందని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. గత ఆరుదశాబ్దాల కాలంలో అమెరికాతో కలసి తాము ఎలాపని చేసిందీ ఏకరువు పెట్టి అవన్నీ మరచిపోయి తమతో వ్యవహరిస్తున్నారని, తమ పౌరుల ఆందోళనను అర్ధం చేసుకోవటం లేదని పేర్కొన్నాడు. తమ దేశంలో జరిగిన తిరుగుబాటు మీద సంతృప్తికరంగా అమెరికా స్పందించలేదని, తిరుగుబాటకు కారకుడైన వ్యక్తిని తమకు అప్పగించలేదని పేర్కొన్నాడు. ఒక మతాధికారి కోసం మీరు నాటోలోని మీ వ్యూహాత్మక భాగస్వామిని మార్చేందుకు చూస్తున్నారు, బెదిరింపులతో మా దేశాన్ని మీదారికి తెచ్చుకోలేరు, మీకు డాలర్లు వుంటే మాకు అల్లా వున్నాడు, మేము స్వాతంత్య్రంతో పోరాడతాము అని హెచ్చరించాడు.అమెరికా స్వయంగా వుగ్రవాద గ్రూపుగా ప్రకటించిన సిరియా మద్దతు వున్న పికెకె సంస్ధకు అమెరికా ఐదువేల ట్రక్కులు, రెండువేల విమానాల ద్వారా ఆయుధాలను అందచేసిందని, ఆ సంస్ధ చేతిలో 1984 నుంచీ వేలాది మంది తమ పౌరులు మరణించారని పేర్కొన్నాడు. అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించిన నేపధ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఎర్డోగన్‌ ఫోన్లో సంభాషించాడు.

టర్కీ పాలకుల విషయానికి వస్తే అమెరికా అనుచిత కార్యకలాపాలన్నింటిలో భాగస్వాములయ్యారు.దేశంలో భిన్నాభిప్రాయాన్ని అణచివేయటంలో పేరు మోశారు. వ్యూహాత్మక స్ధానంలో వున్న కారణంగా అమెరికా, ఇతర పశ్చిమ ఐరోపా ధనిక దేశాల మాదిరి ప్రాంతీయ పరిణామాలలో పాత్రవహించాలని సహజంగానే కోరుకుంటారు. అమెరికా బలంగా వున్నపుడు ఎర్డోగన్‌ వంటి వారు ఎలా తలొగ్గుతారో బలహీనపడినపుడు దాని నుంచి లబ్ది పొందేందుకు కూడా అదే మాదిరి తలెత్తుతారు. టర్కీ తీరుతెన్నులు ఇప్పుడు అలాగే వున్నాయి. ఇప్పుడున్న స్ధితిలో మరో అధికార కేంద్రం పెరగటాన్ని అమెరికా అంగీకరించదు. టర్కీ నాటో సభ్యురాలు, రష్యా ఆ కూటమికి ప్రధమ శత్రువు, తోటి సభ్యురాలిపై అమెరికా కత్తి గట్టింది. సిరియాకు రష్యా పూర్తి మద్దతు ఇస్తున్నది. సిరియాపై గతంలో ఐఎస్‌ తీవ్రవాదులు దాడి చేసేందుకు టర్కీ ప్రాంతాన్ని అమెరికా వుపయోగించుకుంది. ఇప్పుడు మారిన పరిస్ధితులలో ఐఎస్‌ తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు టర్కీలోని వైమానిక స్ధావరాన్ని నాటో వినియోగిస్తున్నది. అమెరికా తమపై కత్తి కట్టింది కనుక దాన్ని మూసివేయాలని కొందరు వత్తిడి తెస్తున్నారు. టర్కీ దిగుమతి చేసుకొనే చమురులో సగం ఇరాన్‌ నుంచే వస్తోంది. అమెరికా ఆంక్షలను టర్కీ తిరస్కరించింది. నాటో సభ్యురాలైనప్పటికీ రష్యా నుంచి టర్కీ క్షిపణులను కొనుగోలు చేస్తున్నది. ఇవన్నీ ఒక సంక్లిష్ట పరిస్ధితికి నిదర్శనం.ఐరోపా యూనియన్‌ తక్షణమే అమెరికాతో ఘర్షణకు దిగటానికి సిద్ధం కాదు కనుకనే పన్నుల విషయంలో తాత్కాలిక రాజీకి వచ్చింది. అమెరికాకు అనేక షరతులు విధించింది. ఐరోపా కార్పొరేట్ల ప్రయోజనాలకు దెబ్బతగలనంత వరకే ఈ రాజీ. అమెరికా వత్తిడికి తలొగ్గిన టర్కీ సర్కార్‌ మతాధికారి బ్రున్స్‌న్‌ను జైలు నుంచి గృహనిర్భంధానికి మార్చింది. తాజా వివాదంలో బ్రున్సన్‌ ఒక తురుపు ముక్క మాత్రమే. నల్ల సముద్రం, మధ్యప్రాచ్చం, పసిఫిక్‌ సముద్రాల మధ్య వున్న టర్కీ ప్రాధాన్యత గురించి అమెరికన్లకు తెలియదనుకోవటం పొరపాటు. అందువలన తెగేదాక లాగకపోవచ్చు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచ రాజకీయాల పరిణామాలు మరో మలుపు తిరుగుతాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సాగు పెట్టుబడులలో ఎగువ- పంటల దిగుబడుల్లో దిగువ !

14 Tuesday Aug 2018

Posted by raomk in Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Agriculture, agriculture in india, crops productivity low, high input costs

Image result for agriculture in india :high input costs

ఎం కోటేశ్వరరావు

ముందస్తు ఎన్నికలు మదిలో వున్న కారణంగానే సాగు ప్రారంభమైన నెల రోజుల తరువాత నరేంద్రమోడీ పంటల కనీస మద్దతు ధరలను ఆలస్యంగా ప్రకటించారని విమర్శలు ఎదుర్కొన్నారు. వెనుకో ముందో ప్రభుత్వం ఏదో ఒకటి చేసిందిగా, పెంపుదలను అభినందిస్తారా లేదా అని మోడీ మద్దతుదారులు అడగటం సహజం. 2022 నాటికి రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామని మోడీ నాలుగు సంవత్సరాలుగా చెబుతూనే వున్నారు. ఇందుకు గాను మోడీ అధికారానికి వచ్చిన రెండేళ్ల తరువాత 2016లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అది ఇంతవరకు 14నివేదికలను ప్రభుత్వానికి సమర్పించింది. అంతిమ నివేదికను సమర్పించాల్సి వుంది. దానిలో ఏమి సిఫార్సు చేస్తారో ఇంతవరకు వెల్లడి కాలేదు అయినా సరే నాలుగు సంవత్సరాల పాలన తరువాత తన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చానని నరేంద్రమోడీ స్వయంగా ప్రకటించారు.

వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న కొన్ని సమస్యలను చూద్దాం. వ్యవసాయ ధరల, ఖర్చుల కమిషన్‌(సిఏసిపి) వ్యవసాయ ఖర్చును మూడు రకాలుగా చూపింది. వుదాహరణకు ధాన్య వుత్పత్తి వాస్తవ ఖర్చు ఎ2 రు.865, రెండవది వాస్తవ ఖర్చు ఎ2, వాస్తవ ఖర్చు ఎ2 ప్లస్‌ (రైతు శ్రమ) ఎఫ్‌ఎల్‌,రు.1166, మూడవది సి2 రు 1560 ( దీనిలో వాస్తవఖర్చు ఎ2, ఎఫ్‌ఎల్‌, కౌలు, బ్యాంకు వడ్డీలు, ఇతరాలు అన్నీ వున్నాయి.) గిట్టుబాటు ధర నిర్ణయించేటపుడు ప్రభుత్వాలు సి2ను పరిగణనలోకి తీసుకోవాలి. దానికి బదులు రు.1166ను మాత్రమే తీసుకొని దానిలో యాభైశాతం కలిపితే వచ్చే మొత్తాన్ని నిర్ణయించి, ఇదే గిట్టుబాటు ధర, మా వాగ్దానాన్ని నెరవేర్చామని మోడీ సర్కార్‌ చెబుతోంది. సి2ను పరిగణనలోకి తీసుకుంటే ధాన్యం ధర రు.2,340 కావాలి. కానీ కేంద్రం రు.1750,1770 వంతున నిర్ణయించింది. అన్ని పంటలకూ ఇదే తీరు. పత్తికి రు 6,771కి గాను 5150,5450 వంతున నిర్ణయించింది.

వ్యవసాయ పెట్టుబడులలో భాగమైన ఎరువులు, పురుగు మందులు, పెట్రోలు, డీజిలు వంటి వాటిని అంతర్జాతీయ ధరల ప్రాతిపదికన(ఎరువులకు స్వల్ప రాయితీలు మినహా) ఎలాంటి రాయితీలు లేకుండా రైతాంగం కొనుగోలు చేయాల్సి వస్తున్నది. ఇదే సమయంలో మద్దతు ధరల నిర్ణయంలో అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను కూడా పరిగణనంలోకి తీసుకోవాలని, మనం ఎగుమతులలో పోటీ పడేలా వుండాలని కేంద్రం చెబుతోంది. ఇక్కడే పొంతన కుదరటం లేదు. ధనిక దేశాలన్నీ అటు రైతాంగానికి, ఇటు వ్యాపారులకు రాయితీలు ఇచ్చి మరీ ఎగుమతులు చేయిస్తున్నాయి, వినియోగదారులకు అందిస్తున్నాయి. మన దగ్గర అటువంటి పరిస్ధితి లేదు.

మన దేశంలో నూతన ఆర్ధిక విధానాలు అమలులోకి వచ్చిన తరువాత 1995 నుంచి ఇప్పటి వరకు జాతీయ నేర రికార్డుల బ్యూరో సమాచారం మేరకు రోజుకు సగటున 46 మంది రైతులు బలవన్మరణం పాలవుతున్నారు. దీనికి ఆర్ధిక, సామాజిక, భౌతిక పరమైనవిగా కారణాలను మూడు తరగతులుగా చూస్తున్నారు. ఏ కారణం ఎక్కువగా వుందన్న విశ్లేషణలో పంటలు దెబ్బతినటం, ధరలు పడిపోవటం వాటి పర్యవసానాలైన అప్పుల పాలు కావటం వంటి అంశాలే ప్రధానంగా పనిచేస్తున్నాయని తేలింది. రైతాంగ ఆత్మహత్యలు ఒక సాధారణ అంశంగా మారాయి. ప్రపంచీకరణలో ద్రవ్యీకరణ లేదా ధనీకరణ మార్కెట్లను ప్రభావితం చేస్తూ అన్ని రంగాలను అతలాకుతలం చేస్తున్నది. ఈ ప్రక్రియలో ఎక్కడా ప్రమేయం లేని రైతు అంతిమంగా ప్రభావితం అవుతున్నాడు.

అమెరికా వ్యవసాయ శాఖ 2018 జూలై రెండవ వారంలో విడుదల చేసిన సమాచారం ప్రకారం కొన్ని పంటల దిగుబడులు (ఒక హెక్టారు(రెండున్నర ఎకరాలు)కు టన్నులలో, పత్తి కిలోలు) 2016-17 సంవత్సరంలో ఆయా దేశాలలో ఎలా వున్నాయో చూద్దాం. పత్తి దిగుబడులు బర్మాలో 634, పాకిస్ధాన్‌లో 699, సిరియాలో 1089, మెక్సికోలో 1520, ఆస్ట్రేలియాలో 1602, బ్రెజిల్‌లో 1626, టర్కీలో 1742, కిలోలు వుంది.

పంట              ప్రపంచం       అమెరికా     ఐరోపా      చైనా      రష్యా      భారత్‌      ఈజిప్టు

గోధుమ           3.39         3.54      5.34      5.33    2.69      2.88      6.43

వరి                4.50         8.11      6.80     6.86     0.00      3.74      8.18

ముతక ధాన్యం   4.15        10.27      5.19     5.83     2.69      1.73      7.05

పత్తి               781          972        000     1708     000       542       673

మొక్కజన్న      5.77        10.96      7.21      5.97     5.51       2.69    8.00

తెల్ల జన్న        1.43         4.89       5.53      4.78     000       0.78     5.36

పై వివరాలను గమనించినపుడు దిగుబడి రీత్యా దాదాపు అన్ని పంటలలో మన దేశం ఎంతో వెనుకబడి వుంది. పెట్టుబడులు, మార్కెట్‌ ధరల విషయంలో ప్రపంచ మార్కెట్లకు అనుగుణ్యంగా మన రైతాంగం వ్యవహరించాల్సి వస్తోంది. దిగుబడి రీత్యా ఎంతో వెనుకబడి వుండటంతో ప్రపంచ మార్కెట్‌ ధరలు మన రైతాంగానికి ఏ మాత్రం గిట్టుబాటు కావు.

దిగుబడులు పెంచటానికి అవసరమైన వంగడాల సృష్టికి ఖర్చుతోకూడిన పరిశోధనలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇవ్వటం లేదు. ఫలితంగా పత్తి దిగుబడి హెక్టారుకు మన దేశంలో గత పది సంవత్సరాలలో 5 నుంచి4.8 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రపంచ సగటు ఎనిమిది క్వింటాళ్లు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో 35.9 నుంచి 19.1శాతం వరకు దిగుబడులు తగ్గటం గమనించాల్సిన అంశం. 2008-12 మధ్య దేశ సగటు దిగుబడి ఐదు క్వింటాళ్లు కాగా తెలుగు రాష్ట్రాలలో 5.4 వుంది, అదే 2013-17 మధ్య దేశ సగటు 4.8 కాగా తెలుగు రాష్ట్రాలలో 4.4కు పడిపోయింది. అనేక పంటల దిగుబడులలో మన దేశం చాలా వెనుక బడి వుందో దిగువ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇది కూడా మన రైతాంగాన్ని దెబ్బతీస్తోంది.(హెక్టారుకు కిలోలు)

పంట          ప్రపంచ సగటు        గరిష్టం          భారత్‌         రాష్ట్రాలు

ధాన్యం          4,636.6     చైనా6,932.4    2,400.2     పంజాబ్‌ 3974.1

మొక్కజన్న    5,640.1   అమెరికా10960.4   2,567.7 తమిళనాడు 7010

పప్పులు        731.2    ఆస్ట్రేలియా 5540.3      656.2      గుజరాత్‌ 931

కందిపప్పు      829.9        కెన్యా 1612.3       646.1   గుజరాత్‌ 1124.8

సోయాబీన్స్‌   2,755.6   అమెరికా 3,500.6       738.4       ఎంపి 831

వేరుశనగ     1,5,90.1   అమెరికా 4118.6       1,464.9  తమిళనాడు 2,574.3

లోపాలతో కూడిన కనీస మద్దతు ధరల నిర్ణయం ఒకటైతే అసలు వాటిని అమలు జరిపే యంత్రాంగం లేదు, ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్దలు అరకొరగా కొనుగోళ్లు, అదీ ప్రయివేటు మార్కెట్‌ కనుసన్నలలో మాత్రమే చేస్తున్నాయి. వుదాహరణకు పత్తి విషయం తీసుకుందాం. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సిఏసిపి) 2018-19 ఖరీఫ్‌ నివేదికలో అందచేసిన వివరాల ప్రకారం 2013-17 మధ్య ఐదు సంవత్సరాల కాలంలో క్వింటాలు ముడి పత్తి(పొట్టి పింజ) కనీస మద్దతు సగటు ధర రు. 3,763. ఇదే కాలంలో దేశీయ మార్కెట్లో రైతుకు వచ్చిన సగటు ధర రు. 4616, అంతర్జాతీయ మార్కెట్లో లభించినది రు.4674. అంటే కనీస మద్దతు ధర మార్కెట్‌ ధర కంటే తక్కువగానే వుంది. పత్తికి వ్యవసాయ ధరల కమిషన్‌ లెక్కింపు ప్రకారం అన్ని ఖర్చులను కలుపుకుంటే క్వింటాలుకు రు 6,771నిర్ణయించాల్సి వుండగా 5150,5450 వంతున నిర్ణయించింది. చైనా పత్తి రైతు సగటున హెక్టారుకు 1,708 కిలోల దిగుబడి సాధిస్తుండగా మన రైతు ప్రపంచ సగటు 781 కిలోల కంటే కూడా బాగా తక్కువగా 542కిలోలు మాత్రమే పొందుతున్నపుడు ఏ చిన్న వడిదుడుకు వచ్చినా తక్షణమే ప్రభావితం అయ్యే అవకాశం వుంది.

, దిగుబడులు పెరగక, పెరిగిన ఖర్చులకు అనుగుణంగా రైతులకు ప్రతిఫలం రాకపోవటం మరొక తీవ్ర సమస్య. రైతాంగ ఆదాయాల రెట్టింపునకు జాతీయ వర్షాధారిత సంస్ధ సిఇవో అశోక్‌ దళవాయి ఆధ్వర్యంలో ఏర్పాటయిన కమిటీ ఒక నివేదికలో ఇలా చెప్పింది. ‘ మొత్తం మీద 2004-05 నుంచి 2013-14 మధ్య కాలంలో ఒక హెక్టారు వుత్పత్తి విలువ వాస్తవ ధరలలో ఎక్కువ పంటలకు పెరిగింది. అయితే అదే సమయంలో వుత్పత్తికి అయ్యే పెట్టుబడి ఖర్చు అంతకంటే ఎక్కువగా పెరిగింది.ఫలితంగా వ్యవసాయంలో అత్యధిక పంటలకు నిఖరంగా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. 2002-03 నుంచి 2012-13 మధ్యకాలంలో వ్యవసాయ కుటుంబాల ఆదాయ పెరుగుదల 3.6శాతమే వుంది, ఇది నిజ జిడిపి అభివృద్ధి రేటు కంటే చాలా తక్కువ. అసోంలో 2009-10 నుంచి 2013-14 మధ్య కాలంలో సగటున ఒక హెక్టారుకు ఆరువేల రూపాయలకు పైగా ధాన్య రైతులు నష్టపోతే అంతకు ముందు ఐదు సంవత్సరాల సగటు రు.3,930 మాత్రమే వుంది. అదే బెంగాల్లో నష్టం 3,146 నుంచి 5,625 రూపాయలకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌ వంటి రాష్ట్రాలలో కూడా ధాన్య రైతుల సగటు ఆదాయం తగ్గిపోయింది.

ప్రభుత్వ విధానాలు కూడా కొన్ని సమయాలలో రైతులను దెబ్బతీస్తున్నాయి. గత ఎన్‌డిఏ పాలనా కాలంలో 2001జూలై నుంచి పత్తి ఎగుమతులపై పరిమాణ ఆంక్షలను ఎత్తివేసి సాధారణ ఎగుమతుల జాబితాలో చేర్చారు. దేశీయంగా ధరలు పెరుగుతుండటంతో మిల్లు యజమానుల వత్తిడికి లొంగిన యుపిఏ సర్కార్‌ 2010 ఏప్రిల్‌లో క్వింటాలు పత్తి (దూది) ఎగుమతిపై రు.2500 సుంకం విధించి నిరుత్సాహపరచింది. ఎగుమతులను పరిమితుల ఆంక్షల జాబితాలో పెట్టింది.ు ఎగుమతులతో పాటు దిగుమతులను కూడా మన సర్కార్‌ ప్రోత్సహించింది. ఈ చర్య రైతాంగంపై ప్రతికూల ప్రభావం చూపింది. మన పత్తి ఎగుమతులలో ఎగుడుదిగుడులు కూడా రైతాంగానికి లభించే ధరపై ప్రభావం చూపుతున్నాయి. గరిష్టంగా 2013-14లో గరిష్టంగా 18.6లక్షల టన్నుల పత్తి ఎగుమతి జరిగింది. అది 2016-17 నాటికి 9.1లక్షలకు పడిపోయింది.

Image result for agriculture in india :high input costs

ప్రపంచ మార్కెట్లో మన మొక్కజొన్నల కంటే రేట్లు తక్కువగా వుండటంతో ఇటీవలి కాలంలో దాదాపు ఎగుమతి ఆగిపోయింది. 2012-13లో 47.9లక్షల టన్నులు చేస్తే 2016-17 నాటికి 5.7లక్షల టన్నులకు పడిపోయింది. పప్పు ధాన్యాలన్నీ అంతర్జాతీయ ధరలకంటే మన దేశంలో ఎక్కువగా వుండటంతో తక్కువ ధరలకు వ్యాపారులు దిగుమతిచేసుకుంటున్నారు. మన మార్కెట్లో కనీస మద్దతు ధర కూడా గతేడాది రైతాంగానికి రాలేదు. గత రెండు సంవత్సరాలలో బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధరలకంటే తక్కువకే రైతాంగం అమ్ముకోవాల్సి వచ్చింది. గత రెండు సంవత్సరాలలో పప్పుధాన్యాల ధరలు కనీస మద్దతు కంటే మార్కెట్లో తక్కువ వున్నాయి. మన వ్యవసాయ ఎగుమతులు 2013-14 నుంచి 2016-17వరకు 268.7 నుంచి 233.6 బిలియన్‌ డాలర్లకు పడిపోగా, దిగుమతులు 109.7 నుంచి 185.3 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.

ఎన్నికలకు ముందు గత యుపిఏ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అది నడచిన బాటలోనే ఎన్‌డిఏ నడుస్తోంది. వుదాహరణకు గత పద్దెనిమిది సంవత్సరాలలో పత్తి ధరలను పెంచిన తీరు చూద్దాం. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ అసలు రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసింది. 2000-01 నుంచి 2003-04 వరకు పొడవు పింజ పత్తి కనీస మద్దతు ధరను 1825,1875,1895,1925 మాత్రమే చేసింది. తరువాత అధికారానికి వచ్చిన యుపిఏ ఒకటి 2009 ఎన్నికలను దృష్టిలో వుంచుకొని 2007-08లో వున్న 2030 ధరను ఏకంగా 3000కు పెంచింది. తరువాత 3000,3300కు పెంచి తరువాత 2014 ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఆమొత్తాన్ని 4000 చేసింది.నరేంద్రమోడీ సర్కార్‌ దానిని 4050 నుంచి నాలుగు సంవత్సరాలలో 4,320కి పెంచి ఇప్పుడు రు.5450 చేసింది. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌, నరేంద్రమోడీ ఇద్దరూ దొందూ దొందే అంటే కరెక్టుగా వుంటుందేమో !

రైతులు మరొకరు ఎవరిపట్ల అయినా ప్రభుత్వాలు, పాలకులు నిజాయితీతో వ్యవహరించాల్సి వుంది. అది గతంలో లేదు, ఇప్పుడూ కనిపించటం లేదు. రైతాంగాన్ని ఆదుకొనేందుకు అనుసరించే ఇతర విధానాలు, చర్యలతో పాటు వాటిలో వచ్చే వడిదుడుకులను మిగతా అంశాల కంటే బలంగా ఒక మేరకు తట్టుకొని నిలిచే దిగుబడుల పెంపు అన్నది మన దేశంలో తక్షణం తీసుకోవాల్సిన చర్య.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా ఆదేశాలు, ఆర్ధిక విధానాలతో స్వాతంత్య్రానికి ముప్పు !

03 Friday Aug 2018

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

economic policies, India foreign policy under narendra modi, Indian independence, modi foreign policy, US dictats

Image result for threat to india's independence

ఎం కోటేశ్వరరావు

డెబ్బయి రెండవ స్వాతంత్య్రవేడుకలకు దేశం సిద్దం అవుతోంది, మరోసారి అధికారానికి వచ్చి 75వ వేడుకలను కూడా తానే ప్రారంభించాలని ప్రధాని నరేంద్రమోడీ కోరుకుంటున్నారు. తన ప్రసంగంలో వుండాల్సిన అంశాల మీద సలహాలు ఇవ్వాలని కోరారు. జనాభిప్రాయానికి తలొగ్గే పాలకుడిగా కనపడే ప్రచార ఎత్తుగడలో భాగమిది. మూకదాడుల గురించి దేశ అత్యున్నత న్యాయస్ధానం ఒక చట్టాన్ని రూపొందించండని చెప్పటం సమస్య తీవ్రతకు నిదర్శనం. అయినా ఈ సమస్యపై మన ప్రధాని మౌనంగానే వున్నారు. అలాంటి పెద్దమనిషి సామాన్య జనం చెప్పే మాటలను పరిగణనలోకి తీసుకుంటారంటే నమ్మటమెలా ? వంచనగాకపోతే నిత్యం జనంతో వున్నామని చెప్పుకొనే నేతలకు జనాభిప్రాయాలేమిటో స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా చెప్పేదేమిటి?

ఐదవసారి ఎర్రకోట మీద మువ్వన్నెల జండా ఎగురవేయబోతున్న ప్రధాని ముందు ఒక పెద్ద ప్రశ్న వుంది. నిజానికి అది యావత్తు దేశ ప్రజల ముందున్న సవాలు. సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా వున్న మన విదేశాంగ విధానాన్ని నిర్దేశిస్తున్నది ఎవరు అన్నదే ఈ స్వాతంత్య్రదినోత్సవ ప్రత్యేకత అని చెప్పవచ్చు. వచ్చే రిపబ్లిక్‌ దినోత్సవవేడుకల ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను మన ప్రభుత్వం ఆహ్వానించింది. సరిగ్గా ఈ సమయంలోనే వచ్చిన కొన్ని వార్తలు ఈ ఆహ్వాన ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇరాన్‌తో వాణిజ్య లావాదేవీల విషయంలో అమెరికా ఆంక్షలకు తలగ్గకపోతే చెల్లించే మూల్యం భారీగా వుంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద సుబ్రమణియన్‌ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటికే ఫ్రాన్స్‌ను అధిగమించి ప్రపంచంలో ఆరవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించిన మన దేశం 2030 నాటికి మూడవ స్ధానానికి చేరుకోనున్నదని వార్తలు వచ్చాయి. ఆ బాటలో వున్న మనం భారీ మూల్యం చెల్లించాల్సినంత దుర్బలంగా వున్నామా? అమెరికా అడుగుల్లో నడవటం స్వాతంత్య్రపిపాసకులకు మింగుడు పడని అంశమే. ఒక చిన్న దేశం విధిలేక ఒక పెత్తందారు అడుగులకు మడుగులొత్తిందంటే అర్ధం చేసుకోగలం కానీ జనాభారీత్యా, ఘనమైన గతంతో వున్న మనదేశం అమెరికా కనుసన్నలలో నడుస్తోందంటే మన ఆత్మగౌరవం ఏమైనట్లు? నరేంద్రమోడీ లేదా ఎన్‌డిఏ పక్షాలకు ఇవేవీ తెలియకనే ట్రంప్‌కు ఆహ్వానం పలికారా? పాండవుల పక్షాన నిలవాలని ఒక నిర్ణయానికి వచ్చిన కృష్ణుడు ధుర్యోధనుడితో ముందుగ వచ్చితీవు, మున్ముందుగ అర్జున జూచితి అని చెప్పినట్లుగా అన్నీ తెలిసే మోడీ సర్కార్‌ ట్రంప్‌కు ఎర్రతివాచీ పరచేందుకు నిర్ణయించింది అనుకోవాలి. దేశభక్తులమని చెప్పుకొనే వారు చేయాల్సినపనేనా ఇది?

చైనా మన పొరుగుదేశం. రెండు దేశాల మీద బ్రిటీష్‌ పాలకులు పెత్తనం చేశారు. వాస్తవంలో ఏ ప్రాంతం ఎవరికింద వుంది అన్నది చూడకుండా ఆఫీసుల్లో కూర్చొని సరిహద్దుగీతలు గీసిన కారణంగా చైనాతో తలెత్తిన సరిహద్దు పంచాయతీలు ఇంకా పరిష్కారం కాలేదు. దేశాన్ని బ్రిటీషోడు విడదీసినపుడు మనవైపు మొగ్గిన కాశ్మీర్‌లో కొంత ప్రాంతాన్ని పాకిస్ధాన్‌ ఆక్రమించుకుంది, దాన్నొక విముక్తి ప్రాంతంగా, స్వతంత్రమైనదిగా ప్రకటించింది. ఆ సమస్య కారణంగా దానితో సంబంధాలు సజావుగా లేవు. తరువాత కాలంలో అమెరికా ప్రోద్బలంతో కాశ్మీర్‌ వేర్పాటు వాదులను రెచ్చగొట్టటం, వుగ్రవాదులను మన దేశంలో ప్రవేశపెట్టి దుర్మార్గాలకు పాల్పడటం వంటి చర్యలు తెలిసినవే. నిత్యం సరిహద్దుల్లో పోరుకు బదులు వాటిని వారూ మనం పరిష్కరించుకోవాలి. మిగతా ప్రపంచ దేశాలతో మనకు ఎలాంటి పేచీలు లేవు. స్నేహసంబంధాలే వున్నాయి, ఇప్పుడు అమెరికా వాడు వాటిని దెబ్బతీసేందుకు పూనుకోవటం ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం?

మనకు ఒక స్వతంత్ర విధానం వుంది, గతంలో సోవియట్‌ లేదా అమెరికా కూటమిలోకో మొగ్గు చూపకుండా అలీన విధానం అవలంభించాం. దాని మేరకు మన రక్షణ అవసరాల రీత్యా అణ్వాయుధాలను తయారు చేస్తున్నాం, వాటిని పరీక్షిస్తున్నాం. అందుకే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై సంతకం చేసేందుకు ఇంతకాల నిరాకరించాం, ఇప్పటికీ అదే వైఖరి కొనసాగుతోంది.దీనిపై సంతకం చేయని వాటిలో మనతో పాటు పాకిస్ధాన్‌,ఇజ్రాయెల్‌, 2011లో స్వాతంత్య్రం పొందిన దక్షిణ సూడాన్‌ వున్నాయి. ఈ ఒప్పందాన్ని అంగీకరించిన దేశాలు శాంతియుత అవసరాలకు అణుశక్తిని వినియోగించవచ్చు తప్ప అణ్వాయుధాలను తయారు చేయటానికి లేదు.

ఇరాన్‌తో ఆరు దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా ఏకపక్షంగా ప్రకటించింది. అంతవరకు పరిమితమైతే అదొకదారి, ఇరాన్‌పై ఆంక్షలు ప్రకటించింది. దానితో వ్యాపారలావాదేవీలు జరిపేవారికి కూడా అవి వర్తిస్తాయని పేర్కొన్నది. పంచాయతీ వుంటే ఆ రెండు దేశాలు తేల్చుకోవాలి తప్ప ఇతర దేశాల మీద కూడా తన ఆంక్షలు అమలు జరుగుతాయని చెప్పటం పెద్దన్న వైఖరి తప్ప ప్రజాస్వామ్యపూరితం కాదు. ఇరాన్‌తో మన సంబంధాలు ఈనాటివి కాదు. దాని అవసరాల నిమిత్తమే కావచ్చు మిగతా చమురు సరఫరా దేశాలేవీ ఇవ్వని రాయితీలను అది మనకు ఇస్తోంది, కొంత మేరకు మన రూపాయి చెల్లింపులను అంగీకరిస్తోంది. ఇది మనకూ ప్రయోజనమే కనుక మన ఇంధన అవసరాలలలో ఎక్కువభాగం అక్కడి నుంచే పొందుతున్నాము. ఇప్పుడు అమెరికా విధించిన ఆంక్షలు ఇరాన్‌తో సంబంధాలున్న అన్ని దేశాలకూ వర్తిస్తాయి. గతంలో కూడా ఆంక్షలున్నప్పటికీ టర్కీ బ్యాంకుల ద్వారా మనం సొమ్ము చెల్లించి చమురు దిగుమతి చేసుకొనే వారం. ఇప్పుడు అలాంటివి కూడా కుదరదని ట్రంప్‌ తెగేసి చెప్పాడు. గతంలో మన దేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్న సమయంలో రెండు దేశాలూ సమాన భాగస్వాములు అంటూ వూదరగొట్టిన అమెరికన్లు ఇప్పుడు మనల్ని పాలేర్లకింద జమడుతున్నారంటే అతిశయోక్తి కాదు.

Image result for us diktats to india

ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించగానే వాటితో తమకు సంబంధం లేదని, ఏ దేశంపై అయినా ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను మాత్రమే తాము పరిగణనలోకి తీసుకుంటామని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రకటించింది. ఆంక్షలు మూడోపక్ష దేశాలకూ వర్తిస్తాయని వెల్లడించగానే నెల రోజులు కూడా గడవక ముందే ఇరాన్‌ బదులు నవంబరు నుంచి మరొక దేశం నుంచి చమురు దిగుమతి ఏర్పాట్లు చేసుకోవాలని మన చమురు మంత్రిత్వశాఖ చమురుశుద్ధి కర్మాగారాలకు లేఖ రాసింది. తాము చెల్లింపులు జరపలేమని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఇది అమెరికా వత్తిడికి లొంగటం కాదా ? మన అలీన విధానం ఏమైనట్లు? ఈ పూర్వరంగంలోనే ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై ఆంక్షలను విధిస్తామన్న అమెరికా బెదిరింపుకు భారత్‌ ఎలా స్పందించాలన్న ప్రశ్నకు అమెరికాకు తలొగ్గకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద సుబ్రమణియన్‌ చెప్పారు.’ ఇదొక ప్రధాన ఆర్ధిక సమస్య గాక విదేశాంగ విధానపరమైన నిర్ణయం కూడా ఇమిడి వుంది. గతం కంటే మరింత కఠినంగా అమలు జరుపుతామని అమెరికా స్పష్టంగా చెప్పటం కనిపిస్తోంది, దీని అర్ధం మినహాయింపులు పరిమితంగా వుంటాయి. అదే జరిగితే మనం చమురుకోసం ఇతర వనరులను చూసుకోవాలి, అమెరికా చెప్పింది వినకపోతే మూల్యం చాలా ఎక్కువగా వుంటుంది. ప్రతి అంతర్జాతీయ వ్యవస్ధలో డాలరు ప్రవేశిస్తోంది, అది ఒక్క వ్యాపారానికే పరిమితం కావటం లేదు ఒక చెల్లింపు సంవిధానంగానూ ద్రవ్య మార్కెట్లలో ఒక సాధనంగా మారింది, దానికి అనుగుణంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వుంటుంది.’ అన్నారు.

ఏ దేశపెత్తనానికి తలొగ్గం అని చెప్పుకొనే ప్రభుత్వానికి సలహాలిచ్చే పెద్దమనిషి చెప్పిన ఈ మాటలకు అనుగుణంగానే మోడీ సర్కార్‌ వ్యవహరిస్తున్నది. ఇరాన్‌పై ఆంక్షలను అమలు జరుపుతామని అమెరికాకు రాత పూర్వకంగా ఇంతవరకు ఇవ్వలేదు తప్ప ఇప్పటికే ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను తగ్గించింది. దీని అర్ధం ఏమిటి? మరోవైపు అమెరికా ఆంక్షలను తాము ఖాతరు చేయబోమని చైనా, టర్కీ ప్రకటించాయి.తామే అసలైన జాతీయవాదులం, దేశభక్తులం అని చెప్పుకుంటున్న బిజెపికి ఈ పరిణామం పెద్ద పరీక్ష. అలీన విధానం, స్వతంత్ర వైఖరినుంచి వైదొలగి అమెరికా వైపు మొగ్గుచూపటమే. ఆగస్టు ఆరవ తేదీ నుంచి అమెరికా ఆంక్షల తొలి చర్యలు అమలులోకి వస్తాయి. వీటి వలన మనకు ఎలాంటి ఇబ్బందులు రావు, చమురు లావాదేవీలపై ఆంక్షలు నవంబరు నాలుగవ తేదీ నుంచి వర్తిస్తాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతున్న మనం ఇరాన్‌తో సంబంధాలు వదులుకొంటే మరింత ఇబ్బందులు పడటం ఖాయం. అమెరికా వత్తిడికి లొంగితే ప్రపంచంలో మనపరువు గంగలో కలుస్తుంది. మనతో భాగస్వామ్యానికి మిగతా దేశాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి.

భారత ఇబ్బందులను తాము అర్ధం చేసుకోగలమని, అయితే ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు ఇస్తున్న రాయితీలు నిలిచిపోతాయని, భారత సర్వసత్తాక నిర్ణయ హక్కును తాము గౌరవిస్తామని ఇరాన్‌ రాయబారి ప్రకటించారు. అమెరికా నుంచి ఇలాంటి ప్రకటన రాకపోగా ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నికీహాలీ న్యూఢిల్లీ వచ్చి ప్రధానితో సమావేశమై ఇరాన్‌తో సంబంధాలను సవరించుకోవాలని ఆదేశం మాదిరి మాట్లాడి వెళ్లారు. అంతకు ముందే తమ ఆంక్షలలో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా ప్రకటించింది. ఒక దేశాధినేతతో అమెరికా వ్యవహరించే తీరిది. అయితే అమెరికా బెదిరింపు పని చేసిందనేందుకు నిదర్శనమా అన్నట్లు జూన్‌లో ఇరాన్‌ నుంచి మన చమురు దిగుమతులు 16శాతం తగ్గాయి. ఇదే సమయంలో అమెరికా నుంచి మన చమురు దిగుమతులు రెట్టింపు అయ్యాయి. రూపాయలతో కొంత మేరకు కొనే చమురును ఇప్పుడు పెరిగిన డాలర్లతో కొనాల్సిన అగత్యం ఏర్పడింది.

మన రక్షణ ఏర్పాట్లు మనం చేసుకోవాలి. అవసరాలకు అనుగుణంగా మనం ఎవరి దగ్గర ఆయుధాలు కొనుగోలు చేయాలి, ఏ సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవాలనేది మన సర్వసత్తాక హక్కు. దీనిలో కూడా అమెరికా జోక్యం చేసుకొంటోంది. తన చట్టాలు, నిర్ణయాలను సర్వవ్యాపితంగా రుద్దాలని, అమలు చేయాలని చూస్తోంది. మన అవసరాలకు తగినవిగా రష్యా తయారీ ఎస్‌-400 గగన రక్షణ క్షిపణి వ్యవస్ధలను కొనుగోలు చేయాలని మన రక్షణ శాఖ నిర్ణయించింది. రష్యా మీద తాము ఆంక్షలను విధించిన కారణంగా రష్యాలో తయారయ్యే ఆయుధాలను కొనుగోలు చేసిన వారికి అవి వర్తిస్తాయని అమెరికా చెబుతోంది. తమకు ఐక్యరాజ్యసమితి నిబంధనలు, చట్టాలు వర్తిసాయి తప్ప అమెరికావి కాదని మన రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌ అమెరికాకు చెప్పినప్పటికీ వాటి కొనుగోలుకు మనల్ని నిరోధించే విధంగా అమెరికా వత్తిడి చేయటం మానుకోలేదు. ఒకేసారి 400 కిలోమీటర్ల పరిధిలోని 36 లక్ష్యాలను చేరుకోగలిగిన అధునాతన పరికరాలివి. మన విదేశాంగ విధానంలో జోక్యం చేసుకొనేందుకు, వత్తిడి చేసేందుకు, భారాలు మోపేందుకు ఇతర దేశాలకు అవకాశం ఇస్తున్నది ఎవరు? ఎందుకీ పరిస్ధితి ఏర్పడింది. అమెరికాకు దాసోహం అన్న కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ బూట్లలో కాళ్లు పెట్టి బిజెపి నరేంద్రమోడీ నడుస్తున్నారు. రష్యా క్షిపణి వ్యవస్ధల కొనుగోలు వ్యవహారంలో వెనక్కు తగ్గితే అది మన రక్షణకే ముప్పు, అందువలన వాటి కొనుగోలుకే కట్టుబడి వుండటంతో తమ ఆంక్షలను మన దేశానికి మినహాయింపు నిచ్చేందుకు అమెరికా పార్లమెంట్‌ ఒక బిల్లును ఆమోదించాల్సి వచ్చింది. మిగతా విషయాలలో మన సర్కార్‌ అంతగట్టిగా మన వైఖరికి ఎందుకు కట్టుబడి వుండదు ?

దేశాన్ని దీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడింది, తప్పిదాలు చేసిందనే విమర్శను తప్పుపట్టాల్సిన పనిలేదు. తిరుగులేని వాస్తవం, అందుకు ఆ పార్టీ చరిత్రలో తొలిసారిగా లోక్‌సభలో ప్రతిపక్ష గుర్తింపు హోదా కూడా లేని పార్టీగా దిగజారి భారీ రాజకీయ మూల్యం చెల్లించింది. పాలనలో అలాంటి పార్టీ ప్రభావం, రూపురేఖలను పూర్తిగా చెరిపివేయాలనే పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలేమిటి అన్నది జనం ముందున్న ప్రశ్న. వాటిలో ఒకటి ప్రణాళికా సంఘం, విధానాలను రద్దు చేయటం. గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇప్పుడు చైనా అభివృద్ధిలో ప్రణాళికా విధానం కీలకమైనది అని రుజువైంది.ఆరున్నర దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘం పనికిరానిదిగా తయారైంది అంటూ దానిని రద్దు చేసి నీతి ఆయోగ్‌ పేరుతో రూపాంతరం చెందుతున్న భారత్‌ కోసం జాతీయ సంస్ధ(నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా)ను 2015 జనవరి ఒకటి నుంచి అమలులోకి తెచ్చారు. ఇది పదిహేను సంవత్సరాల మార్గం, ఏడు సంవత్సరాల దృష్టి, వ్యూహం, కార్యాచరణతో పని చేస్తుంది. అంటే ఐదేండ్లకు బదులు ఏడు సంవత్సరాల ప్రణాళిక అనుకోవాలా? రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగి, ప్రభుత్వాలు మారటానికి అవకాశం వున్నపుడు పేరు ఏది పెట్టినా ఏడు సంవత్సరాల ప్రణాళికలంటే వచ్చే ఇబ్బందుల గురించి చెప్పనవసరం లేదు. మధ్యలో మార్చుకోకూడదా అంటే మార్చుకోవచ్చు. ఇక్కడ సమస్య అది కాదు.

1991 నుంచి నూతన ఆర్ధిక విధానాల పేరుతో అమలు చేస్తున్న విధానాలు ప్రణాళికలు అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరిపే కొన్ని కార్యక్రమాలుగా మారిపోయాయి. అప్పటి నుంచి ప్రభుత్వాలు ఒక్కొక్క బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయి. వుదాహరణకు పెరుగుతున్న జనాభా, అవసరాలకు తగినట్లుగా ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యా సంస్ధల ఏర్పాటు, మెరుగుపరచటంపోయి వాటిని ప్రయివేటు రంగానికి వదలి వేశారు. ఆ విధానాలలో భాగంగానే ప్రభుత్వాలు పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టటాన్ని నిలిపివేశారు. ఈ కారణంగానే ఒక్క రక్షణ సంబంధిత రంగాలలో తప్ప ఇతరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పిన పరిశ్రమ ఒక్కటి కూడా లేదు. విద్యుత్‌ రంగంలో ప్రయివేటు విద్యుత్‌ ఖర్చు ఎక్కువగా వుండటం వలన గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయటం, ఒకటీ అరా కొత్తగా స్ధాపించటం తప్ప ఆ రంగంలోనూ పరిమితం చేశారు. వ్యవసాయ రంగంలో గణనీయంగా తగ్గించిన కారణంగా పరిశోధన, అభివృద్ధి లేకుండా పోయింది. బహుళజాతి గుత్త సంస్ధలు వ్యవసాయరంగంలో ప్రవేశించి విత్తన రంగాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి.పర్యవసానంగా విత్తన ధరలు పెరిగాయి. ఎరువులపై ధరల నియంత్రణ ఎత్తివేసి మార్కెట్‌ శక్తులకు వదలివేశారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని పరిమితం చేసి దానినే అందచేస్తున్నారు. దీనిలో కొత్త పద్దతుల్లో అక్రమాలకు తెరలేవటం అందరికీ తెలిసిందే.

స్వాతంత్య్రానికి ముందు, తరువాత కాలంలో కార్మికవర్గ రక్షణ కోసం రూపొందించిన అనేక చట్టాలను నీరుగార్చటం, అమలుకు నోచుకోకుండా ఆటంకాలు, ఆంక్షలు విధించటం వంటి విషయాలు తెలిసిందే. మొత్తం శ్రమ జీవులందరికీ సామాజిక భద్రత కల్పించాల్సిన ప్ర భుత్వాలు వున్న వారికి వర్తింపచేస్తున్న వాటిని రద్దు చేశాయి. నూతన పెన్షన్‌ పధకం(ఎన్‌పిఎస్‌) పేరుతో 2004 తరువాత చేరిన వారికి పాత పద్దతిలో వుపయోగకరమైన పెన్షన్‌ రద్దు చేశారు. దానిని రూపొందించిన ఖ్యాతి వాజ్‌పేయి నాయకత్వంలోని గత ఎన్‌డిఏ ప్రభుత్వానిదైతే దానిని తు.చ తప్ప కుండా అమలు జరిపిన చరిత్ర తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ, రాష్ట్రాలలో అధికారంలో వున్న బిజెపి, ఇతర ప్రాంతీయ పార్టీల గురించి తెలిసిందే. నూతన పెన్షన్‌ పధకాన్ని రద్దు చేసి పాతదాన్ని పునరుద్దరించాలని వుద్యోగులు పోరుబాట పట్టారు. ఒక్క వామపక్షాలు తప్ప మిగతా పార్టీలేవీ దాని గురించి పట్టించుకోవటం లేదంటే ఆమోదం, అమలుకు అంగీకరించినట్లే.

Image result for us diktats to india

మన దేశంలో వునికిలోకి వచ్చిన ప్రతి చట్టం వెనుక ఆయా తరగతులు జరిపిన వుద్యమాల వత్తిడి, త్యాగాలు వున్నాయి. వ్యాపార సులభతరం పేరుతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. బిజెపి పాలిత రాజస్ధాన్‌ పారిశ్రామిక వివాదాల చట్ట సవరణ ప్రకారం మూడు వందలలోపు సిబ్బంది పనిచేసే చోట ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా యజమానులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్మికులను తొలగించవచ్చు. కార్మిక సంఘాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 30శాతం మంది సిబ్బంది ఆమోదం వుంటేనే అనుమతిస్తారు. గో స్లో( వుత్పత్తి నెమ్మదించటం) అనే పదానికి నిర్వచనాన్ని విస్తృతపరిచారు.ఏ కారణంతో వుత్పత్తి తగ్గినా, కార్యకలాపం విఫలమైనా దానికి బాధ్యత కార్మికులదే అని యజమానులు ఆరోపించి చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పించారు. అంటే సూటిగా చెప్పాలంటే ఏ చట్టాలు లేనపుడు యజమానుల దయాదాక్షిణ్యాలపై కార్మికులు వున్నట్లే గతంలో సాధించుకున్న హక్కులను హరించి స్వాతంత్య్ర పూర్వ పరిస్ధితిలోకి నెట్టారు. ఫ్యాక్టరీ చట్టం వర్తించాలంటే విద్యుత్‌ అవసరం లేని చోట పని చేసే కార్మికుల సంఖ్యను 20 నుంచి 40కి, అవసరం వున్నచోట 10 నుంచి 20కి పెంచారు. ఏ యజమాని అయినా చట్టాలను వుల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోకూడదనే సవరణ కూడా చేశారు. చట్టాలను వుల్లంఘించిన వుదంతాలలో వేయాల్సిన శిక్షలను కూడా ఎంతో సరళతరం చేశారు. ఇలాంటి వన్నీ బ్రిటీష్‌ వలసదారులు చేశారంటే అర్ధం వుంది, స్వతంత్ర భారత్‌లో చేయటం అంటే పరాయి పాలనకు వ్యతిరేకంగా కార్మికోద్యమం చేసిన త్యాగాలన్నీ వృధా అయినట్లే. 2014 ఆగస్టు ఒకటిన తీవ్ర కార్మిక నిరసనల మధ్య ఫ్యాక్టరీలు మరియు కాంట్రాక్టు లేబర్‌(క్రమబద్దీకరణ, రద్దు)చట్టాన్ని కార్మిక వ్యతిరేక అంశాలతో సవరించి ఒకే రోజు ప్రవే శపెట్టి అదే రోజు ఆమోదింపచేయించిన అపర ప్రజాస్వామిక నడత ఘనత బిజెపి ఖాతాలో చేరింది. అంబేద్కరిస్టులు లేదా దళిత అస్ధిత్వవాదులు చేసే ప్రకారం ఈ దేశంలో కార్మికులందరూ దళితులే. అంటే వారి అవగాహన ప్రకారం కార్మిక రంగంలో చేస్తున్న మార్పులన్నీ దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వ్యతిరేక చర్య, చట్టాల దుర్వినియోగం గాక మరేమిటి? బిజెపి కార్మిక సంస్కరణల పర్యవసానంగా రాజస్ధాన్‌లోని 7622 ఫ్యాక్టరీలలో 7252 కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే అవకాశం లేదని వెల్లడైంది.ఇదా స్వాతంత్య్రం ! అది ఎవరికి వుపయోగపడుతోంది?

ప్రభుత్వ రంగ సంస్ధలలో 50, ప్రయివేటు రంగంలో 70శాతం పైగా కార్మికులు చట్టాలు పెద్దగా వర్తించని కాంట్రాక్టు కార్మికులుగా వున్నారు.పన్నెండు గంటల పని సర్వసాధారణమైంది. ఓవర్‌ టైమ్‌ లేదు, చేయించుకొనే ఓవర్‌ టైమ్‌కు కొందరు సాధారణ సెలవులు ఇస్తారు లేదా ఓవర్‌ టైమ్‌ రెట్టింపు కంటే తక్కువగా వుంటాయి. నేడు కార్మికులు-యజమానుల మధ్య తలెత్తుతున్న వివాదాలలో అత్యధికం కార్మిక చట్టాల వుల్లంఘనలపైనే అన్నది స్పష్టం. చివరికి కార్మిక సంఘాల నమోదు కూడా దుర్లభం అవుతోంది. నమోదు ప్రక్రియ పూర్తిగాక ముందే సంఘం పెట్టుకున్న కార్మికుల వుద్యోగాలు పోతున్నాయి. ఇదేదో నరేంద్రమోడీ హయాంలోనే ప్రారంభమైందని కాదు, ఆయన ఏలుబడిలో వేగం పెరిగింది. దానికి నిదర్శనం సులభతర వాణిజ్యంలో మన స్దానం పైకి ఎగబాకటమే. తన ప్రభుత్వ ఘన విజయాలలో అదొకటని మోడీ సర్కార్‌ చెబుతోంది. కార్మికవర్గానికి ఇదొక సవాల్‌. స్వాతంత్య్రానికి ముందు మనం ఏ లక్ష్యాల కోసం పోరాడాము, తరువాత ఇప్పటి వరకు వాటికి మనం ఎంతవరకు కట్టుబడి వున్నాము, లక్ష్యాలు, గత ఆచరణ నుంచి కూడా ఇప్పుడు మనం వైదొలగుతున్న తీరు మన స్వాతంత్య్రాన్ని ఏమి చేయనున్నది అని ప్రతి ఒక్కరూ ఈ సందర్భంలోనే కాదు ప్రతి క్షణం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. నాడు బ్రిటీష్‌ తెల్లదొరల దుర్వివిధానాలకు వ్యతిరేకంగా పోరాడినట్లుగానే ఆ స్వాతంత్య్రానికి, సర్వసత్తాక అధికారానికి ముప్పు తెస్తున్న నేటి అమెరికన్‌ దొరల వత్తిడికి లంగిపోతున్న నల్లదొరల తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పరిరక్షణకోసం మరోమారు వుద్యమించాల్సిన పరిస్ధితి ఏర్పడలేదా ? ఆలోచించిండి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వ్యూహ ప్రతి వ్యూహాలతో విస్తరిస్తున్న వాణిజ్య యుద్ధం !

01 Wednesday Aug 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Counter tariffs, counterstrategies, TRADE WAR, Trade war Expanding

Image result for Trade war

ఎం కోటేశ్వరరావు

జూలై ఆరున తాను ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కొనసాగించటంపై అమెరికా, తనను తాను రక్షించుకోవటంపై దాడికి గురైన చైనా వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు పోతున్నాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ మొదలు పెట్టిన ఈ పోరు మీద ఇప్పటికీ అనేక కోణాల నుంచి విమర్శలే ఎక్కువగా వస్తున్నాయంటే ప్రపంచ పెట్టుబడిదారులు దీనిని ‘ మంచి యుద్ధం’ గా పరిగణించటం లేదనే అనేకోవాలి. తాజా పరిణామాలు, విశ్లేషణలను బట్టి వాణిజ్య దాడులను దీర్ఘకాలం కొనసాగించేందుకే అమెరికా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్‌ చర్యలు చైనా నాయకత్వ పట్టుదలను మరింత పెంచుతాయని ప్రముఖ ఆర్ధికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ హెచ్చరించాడు. ఇప్పటి వరకు వచ్చిన వార్తలను బట్టి చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై పన్నుల పెంపుద్వారా మోపిన భారాన్ని అమెరికన్‌ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు వినియోగదారులపై మోపటం ప్రారంభమైంది. పంటల ధరలు పడిపోవటంతో రైతులకు 12బిలియన్‌ డాలర్ల మేర చెల్లించాలని ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ ప్రకటన వెలువడగానే మా సంగతేమిటని పారిశ్రామికవేత్తలు అడగటం ప్రారంభించారు. ఇదే సమయంలో అమెరికా దాడి ప్రభావం చైనాపై పెద్దగా పడిన దాఖలాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా కరెన్సీ యువాన్‌ విలువ తగ్గటంతో చైనా ఎగుమతులపై పెద్ద ప్రభావం లేదన్నది వాటి సారాంశం. వెలువడుతున్న విమర్శలు, వాణిజ్య యుద్ధం ఇరుపక్షాలకూ నష్టం కలిగిస్తుందనే విశ్లేషణల పూర్వరంగంలో రెండు దేశాలూ మరోమారు చర్చలకు పూనుకోవచ్చన్నది తాజా వార్త.

అమెరికా తన మిత్రదేశాలైన కెనడా, మెక్సికోలతో పాటు ఐరోపా యూనియన్‌ వుత్పత్తులపై కూడా దిగుమతి పన్నుల విధింపుతో వాణిజ్య యుద్ధానికి తెరతీసింది. అయితే జూలై నెల మూడవ వారంలో ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జుంకర్‌-డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య రాజీకుదిరింది. అమెరికా నుంచి సోయా, సహజవాయువు(ఎల్‌ఎన్‌జి), ఐరోపా నుంచి కార్లు మరియు ఆటో విడి భాగాలను పరస్పరం దిగుమతులు చేసుకొనేందుకు, ఆటోయేతర పారిశ్రామిక వుత్పత్తులపై ఎగుమతులు, దిగుమతులపై ఆటంకాలు, పన్నులు, సబ్సిడీలను ఎత్తివేసేందుకు అంగీకరించారు. అయితే పన్నులను పూర్తిగా రద్దు చేయటం అన్నది ఎంత మేరకు సాధ్యం అన్నది ప్రశ్న. అంతిమంగా కుదిరే ఒప్పందాన్ని బట్టి స్పష్టం అవుతుంది. ఈ చర్య బహుముఖాలుగా దాడులు చేయటం తనకు మంచిది కాదన్న గ్రహింపు అమెరికాకు వచ్చినందునే ఈ తాత్కాలిక రాజీ, దానికి అది ఎంత కాలం కట్టుబడి వుంటుందన్నది కూడా సందేహమే. మా తల మీద తుపాకి గురి పెట్టి మమ్మల్ని ఒప్పించాలని చూస్తే కుదరదని ఇటీవలి కాలంలో ఐరోపా దేశాలు అమెరికాకు స్పష్టం చేశాయి. అందువల్లనే ట్రంప్‌ ఒక అడుగు వెనక్కు వేశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో చొక్కా నలగకుండా, అటూ ఇటూ ఆయుధాలను విక్రయించి లాభపడిన అమెరికాను ఎదుర్కోవాలంటే, విజయం సాధించినప్పటికీ ఎంతో నష్టాన్ని మూటగట్టుకొని, వికలాంగులుగా మారిన తాము ఐక్యంగా వుంటే తప్ప సాధ్యం కాదని గ్రహించిన ఫలితమే నేటి ఐరోపా యూనియన్‌. అందువలన వాటి రెండింటి మధ్య ఇప్పటికీ వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో అనూహ్యంగా తమకు సవాలుగా పరిణమించిన చైనాను ఎదుర్కోవటంలోనూ అవి చేతులు కలిపేందుకు వెనుకాడవు. కమ్యూనిస్టు ్యవతిరేకత, మార్కెట్లను ఆక్రమించుకోవటంలో అవి ఏవీ తక్కువ కాదు. అందువలన తమపై దాడి ప్రారంభించిన అమెరికా మీద ఐరోపా ధనిక దేశాలు వత్తిడి తెస్తాయనే భ్రమలు, తమతో చేతులు కలుపుతాయనే ఆశలు చైనాకు లేవు. అతి పెద్ద దేశంగా వున్నందున జిడిపి ఎక్కువగా వున్నట్లు కనిపించినా, అమెరికా, ఐరోపా ధనిక దేశాలతో పోల్చితే ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నదేశమే, ఈ కారణంగానే ప్రపంచ వాణిజ్య సంస్ధలో కొన్ని రాయితీలను పొందుతున్నది.

అమెరికా తరువాత మరో ధనిక దేశమైన జపాన్‌ కూడా ఇటీవలే ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక బహిరంగ వాణిజ్య ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తాయి. జపాన్‌ నుంచి చేసుకొనే దిగమతులలో 99శాతం వస్తువులపై పన్నులను ఐరోపా యూనియన్‌ రద్దు చేస్తుంది. అమెరికా-ఐరోపా యూనియన్‌ కూడా ఇదే మాదిరి ఒప్పందానికి వస్తే అప్పుడు చైనా ఇతర దేశాలతో వాణిజ్యం చేయటం కష్టం అవుతుంది లేదా వత్తిడికి లంగి తన దిగుమతి పన్నులను తగ్గించి మరింతగా తన మార్కెట్‌ను తెరవాల్సి వుంటుంది. నూతన ఆర్ధిక విధానాల పేరుతో చైనా ప్రారంభించిన సంస్కరణలకు నలభై సంవత్సరాలు నిండాయి. పశ్చిమ దేశాలకు పెద్ద ఎత్తున మార్కెట్‌ ద్వారాలు తెరిచిన కారణంగా పరస్పరం లబ్దిపొందాయి. ఈ క్రమంలో అది వాణిజ్య మిగులు దేశంగా మారింది. ఇంకా తమ వస్తువులను అదనంగా కొనాలని పశ్చిమ దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వాణిజ్య యుద్ధ మూలకారణమిదే. చైనా ఈ కాలంలో పరిశోధన, అభివృద్ధికి పెద్ద మొత్తంలో ఖర్చు చేసినప్పటికీ పశ్చిమ దేశాలతో పోల్చితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఇప్పటికీ వెనుకబడే వుంది. తమ వైపు నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపును అడ్డుకుంటే చైనా దారికి రావచ్చన్నది పశ్చిమ దేశాల వూహ. అమెరికా ఇప్పుడు క్రమంగా వాణిజ్య యుద్ధాన్ని 500బిలియన్‌ డాలర్ల మేరకు విలువగల వస్తువులకు పెంచుతానని బెదిరించింది. దీనితో పాటు చైనా పశ్చిమ దేశాల ఆధునిక పరిజ్ఞాన కంపెనీలను కొనుగోలు చేయకుండా చూడటంతో పాటు వాణిజ్య సంస్ధలో సంస్కరణల పేరుతో కొత్త నిబంధనలను ప్రవేశ పెట్టాలని కూడా అమెరికా నిర్ణయించింది. అంటే చైనాను చక్రబంధంలో బిగించి దారికి తెచ్చుకోవాలన్నది వ్యూహం.

‘చైనాతో వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. అంటే వాణిజ్య యుద్ధం నిరవధికంగా కొనసాగవచ్చు, ఇతర దేశాల ద్వారా చైనా వుక్కు అమెరికా చేరకుండా వుండాలంటే ప్రపంచం అంతటి నుంచి వచ్చే వాటి మీద పన్నులు విధించటమే ఏకైక మార్గం ‘ అని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైట్జర్‌ పార్లమెంటరీ కమిటీ ముందు చెప్పారు. అమెరికా మరో వాణిజ్య ప్రతినిధి డెనిస్‌ షెయా చైనా కమ్యూనిస్టుపార్టీపై విరుచుకుపడుతూ చైనా ప్రభుత్వ ఒప్పందాలకు విరుద్దంగా కమ్యూనిస్టు పార్టీ వాణిజ్య విధానాన్ని ఆదేశిస్తున్నదని, చైనా ఆర్ధిక విధానాల కారణంగా ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యులు నష్టపోవాల్సి వస్తోందని ఆరోపించారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యురాలిగా లబ్ది పొందిన చైనా 2005-16 మధ్య 9.5శాతం నిజ జిడిపి అభివృద్ధి రేటుతో రెండవ ఆర్ధికశక్తిగా ఎదిగిందని కూడా వుక్రోషం వెలిబుచ్చాడు. ప్రపంచ వాణిజ్య సంస్ధలో ధనిక దేశాలన్నీ చైనా మీద కత్తి గట్టటానికి సన్నద్ధం అవుతున్నాయి.

ముందు తన ఇంటిని చక్కదిద్దుకొని వాణిజ్య లోటు ఏర్పడకుండా దేశీయంగా పొదుపును పెంచుకోవాలని చైనా తిప్పి కొట్టింది. వాణిజ్య యుద్ధం ప్రారంభం సాంకేతికంగా జూలై ఆరున ప్రారంభమైనప్పటికీ దానికి నిర్ణయం, సన్నాహాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అనేక సంవత్సరాలుగా తమ సరకులను ఎక్కువగా కొనుగోలు చేసి వాణిజ్య లోటును తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తోంది. ఇదే సమయంలో ధనిక దేశాలపై ఆధారపడిన తన ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధకు వున్న పరిమితులను చైనా నాయకత్వం గుర్తించకపోలేదు. తమ పౌరుల కొనుగోలు శక్తిని పెంచటం, వెనుక బడిన ప్రాంతాల పారిశ్రామికీకరణ వంటి అంతర్గత చర్యలతో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికాతో సహా అన్ని ఖండాలలో తన వాణిజ్య అవకాశాలను పెంచుకొనేందుకు పూనుకుంది, ఆ దిశగా అనేక చర్యలను చేపట్టింది. తమ పన్నుల దాడి నుంచి కాచుకొనేందుకు చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తున్నదని అమెరికా ఆరోపిస్తోంది. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఏ దేశమైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే లాభాలతో పాటు నష్టాలు కూడా వుంటాయి. కరెన్సీ విలువ తక్కువగా వుంటే ప్రపంచ మార్కెట్‌లో ధరలపోటీలో నిలబడవచ్చు. అదే సమయంలో సదరు దేశం నుంచి పెట్టుబడులు తరలిపోతాయి. చైనా దగ్గర డాలర్‌ నిల్వలు భారీగా వున్నందున తన కరెన్సీ విలువ తగ్గించి కుక్క కాటుకు చెప్పు దెబ్బమాదిరి ప్రతీకారం తీర్చుకోవచ్చన్నది ఒక వాదన. పదకొండువందల వస్తువులపై అమెరికా విధించిన 25శాతం దిగుమతి పన్ను భారాన్ని తమ కంపెనీలపై తగ్గించేందుకు వాణిజ్య యుద్ధం ప్రారంభానికి ముందు నుంచే అంటే తన కరెన్సీ విలువ పతనాన్ని ప్రోత్సహించిందని, గత మూడునెలల్లో డాలరుతో 7.7శాతం పడిపోయిందని చెబుతున్నారు. ఇదే కాలంలో మన దేశంతో సహా అనేక దేశాల కరెన్సీ విలువలు పడిపోయాయి.’ చైనా, ఐరోపా యూనియన్‌లు కరెన్సీ విలువలను తిమ్మిని బమ్మిని చేస్తున్నాయి, వడ్డీ రేట్లు తక్కువగా వుంచుతున్నాయని’ ట్రంప్‌ స్వయంగా ట్వీటర్‌లో ఆరోపించాడు. దీనికి తగిన ఆధారాలు కనిపించటం లేదు. జర్మనీలో పదేండ్ల బాండ్లపై 0.5, అమెరికాలో 2.6 శాతం వడ్డీ వస్తుండగా చైనాలో 3.75శాతం వస్తున్న కారణంగా ఏప్రిల్‌కు ముందు పన్నెండు నెలల కాలంలో వంద బిలియన్‌ డాలర్లు చైనాకు తరలి వచ్చాయి. చైనా వడ్డీ రేటును స్ధిరంగా వుంచుతుందనే నమ్మకమే దీనికి కారణమని కొందరి విశ్లేషణ. కరెన్సీ విలువ తగ్గితే విత్త (వడ్డీ) వ్యాపారులు చైనా నుంచి బయటకు పోతారు. చైనాకు సంపదలతో పాటు అప్పులు కూడా భారీగానే వున్నాయి, అలాంటపుడు విదేశీ నిధులు బయటకుపోతే ఎన్నో చిక్కులు తలెత్తుతాయి కనుక చైనా నాయకత్వం అలాంటి పరిస్ధితిని కొని తెచ్చుకోదు అని కొందరి వాదన.

Image result for Trade war

ఒక దేశంలో కరెన్సీ విలువ పడిపోతే అది దిగుమతి చేసుకొనే వస్తువుల ధరలు పెరుగుతాయి. యువాన్‌ విలువ తగ్గితే చైనాలో అమెరికా వస్తువులు ప్రియం అవుతాయి. జూలై ఆరు తరువాత ఇప్పటి వరకు యువాన్‌ విలువ రెండున్నర శాతం తగ్గింది. అయితే ఇలాంటి హెచ్చు తగ్గులు గతంలో కూడా వున్నాయి. గతనెలలో చైనా పిఎంఐ సూచిక 51.2గా వుంది. అంతకు తగ్గితే ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో పడినట్లు. ఏమైనా ప్రభావం, పర్యవసానాల గురించి ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేము. గత నాలుగు సంవత్సరాలుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను తప్పించుకొనేందుకు రష్యా తన కరెన్సీ విలువను తక్కువగా వుంచిందని, చైనా కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుందని కొందరు అంటున్నారు.అయితే రష్యాకు దాని వలన కొన్ని సమస్యలు కూడా తలెత్తకపోలేదు. వాణిజ్య యుద్ద పర్యవసానాలు అటు చైనా ఇటు అమెరికా మీద మెల్లగా ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో సోయా, ఇతర వ్యవసాయ వుత్పత్తుల ధరలు పతనం కావటంతో రైతులను ఆదుకొనేందుకు ట్రంప్‌ సర్కార్‌ 12బిలియన్‌ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. అమెరికాకు ప్రతిగా తాము విధించిన పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభావితమయ్యే పరిశ్రమలు, సంస్ధలకు రాయితీల రూపేణా అందిస్తామని చైనా ఎప్పుడో ప్రకటించింది. రైతులకు రాయితీలు ప్రకటించటంతో మిగతా పరిశ్రమల వారు కూడా తమ సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. తమకు కూడా రాయితీలు ఇస్తే 39బిలియన్‌ డాలర్లు అవుతాయని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించింది. గతంలో తాము ఎన్నో మాంద్యాలు, అంతర్యుద్ధాల కాలంలో కూడా నిలబడ్డామని కానీ ఇప్పుడు వాణిజ్య యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మనుగడ కష్టమని 1839 నుంచి వునికిలో వున్న బ్రిన్లీ-హార్డీ కంపెనీ ప్రతినిధి చెప్పారు. వుక్కు ధరలు 33శాతం పెరిగాయని వాపోయారు. అనుచిత యుద్ధం, అసమర్ధులైన సైన్యాధికారులు, ప్రజల మద్దతు లేనపుడు గెలవటం అసాధ్యమని, ట్రంప్‌ ప్రారంభించి వాణిజ్య యుద్దం కూడా అలాంటిదే అని ప్రముఖ ఆర్ధికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ పేర్కొన్నారు. వాణిజ్య యుద్ద పర్యవసానాలు ఏమైనప్పటికీ 2020 నాటికి అమెరికా ఆర్ధిక లోటు లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందని, అదే జరిగితే పెట్టుబడులు, దిగుమతులు పడిపోవటంతో పాటు ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం వుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా సమస్య చైనా కాదని, దేశీయంగా పొదుపు చాలా తక్కువగా వుండటం అసలు సమస్య అన్నారు. ట్రంప్‌ కోరుతున్నట్లు అమెరికా నుంచి చైనా మరింతగా చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసి ఇతరులకు అమ్మితే చైనాతో వాణిజ్యలోటు తగ్గించానని ట్రంప్‌ చెప్పుకోవటానికి తప్ప పెద్ద తేడా ఏమీ వుండదు, రవాణా ఖర్చులు పెరుగుతాయి అన్నారు. చైనా వస్తువులకు డిమాండ్‌ తగ్గితే ప్రభుత్వ ప్రమేయం లేకుండానే దాని కరెన్సీ విలువ బలహీనమౌతుంది, అప్పుడు ఇతర దేశాలతో చైనా పోటీతత్వం పెరుగుతుంది. 2015లో చైనా ఆమోదించిన మేడిన్‌ చైనా 2025 విధానాన్ని అడ్డుకొనేందుకు ట్రంప్‌ ప్రయత్నించినట్లయితే కచ్చితంగా విఫలమౌతాడు, మరోవైపు నూతన ఆవిష్కరణలు, సాంకేతికంగా పైచేయి సాధించాలన్న చైనా నేతల పట్టుదలను మరింత పెంచినవారవుతారు, తాము ఇతరులపై ఆధారపడలేమని వారు గుర్తించిన తరువాత అమెరికా పట్ల వ్యతిరేకత పెరుగుతుంది అని స్టిగ్జిజ్‌ చేసిన హెచ్చరికను ట్రంప్‌ పట్టించుకుంటాడా?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లు అవసరమా ?

01 Wednesday Aug 2018

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ 1 Comment

Tags

AIR, DD, Doordarsan, Prasara Bharathi

Image result for all india radio

ఎం కోటేశ్వరరావు

ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లు అవసరమా అని ఎవరైనా అడిగితే నవతరం అవేమిటి, ఎందుకు అనే ప్రశ్నలు వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. వాటికి ఒక్క ముక్కలో అవుననిగానీ లేదనిగానీ చెప్పటం సులభం కాదు. సమస్య అవసరం అని జనం ఎందుకు బలంగా భావించటం లేదు? దేశ స్వాతంత్య్ర ప్రకటన తొలిసారిగా జనం విన్నది ఆలిండియా రేడియో ద్వారానే, జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఏ రోజువి ఆరోజు వినాలంటే రేడియో తప్ప మరొక సాధనం లేదు. పత్రికలు ప్రచురణ కేంద్రాలకు దూరంగా వున్న ప్రాంతాలకు రెండో రోజు మాత్రమే చేరే పరిస్ధితులలో వార్తల కోసం జనం పంచాయతీ ఆఫీసు రేడియో ముందు గుంపులుగా చేరి వినటం, అలాంటి దృశ్యాలను చూడటం నిజంగా ఒక తీపి జ్ఞాపకమే. దూర దర్శన్‌ అందుబాటులోకి వచ్చిన రోజుల్లో నలుపు తెలుసు టీవీలు కొనుగోలు చేసిన ధనికుల ఇండ్లలో చుట్టుపక్కల వారు తిష్టవేయటం కూడా అలాంటిదే. గతంతో పోల్చితే ఇప్పుడు రేడియోలను వింటున్నవారు ఎందరు అన్న ప్రశ్న ఒకటైతే, కేబుల్‌ నెట్‌ వర్క్‌ ద్వారా దూరదర్శన్‌ ఛానల్స్‌ అందుబాటులో వున్నప్పటికీ వాటిని చూస్తున్నవారు చాలా పరిమితం అన్న విషయం తెలిసిందే. ఎందుకిలా అయింది?

ప్రభుత్వ ప్రసార మాధ్యమాలలో పరిమితంగా ప్రతిపక్ష వాణికి చోటు దొరికి నప్పటికీ వాటిని అధికారపక్ష బాకాలుగా మార్చివేయటం మొదటి కారణం. చదువరులు పెరగటంతో ప్రయివేటు పత్రికల ప్రచురణల కేంద్రాలు విస్తరించటం, తెల్లవారే సరికి గ్రామాలకు చేరవేసే ఏర్పాట్లు జరగటంతో రేడియో, దూరదర్శన్‌లను అధికారపక్ష భజన కేంద్రాలుగా మార్చిన విషయం మరింతగా బహిర్గతమైంది, వాటి వార్తలపై ఆసక్తి సన్నగిల్లింది. ప్రయివేటు టీవీ ఛానల్స్‌ వచ్చిన తరువాత రోజంతా వినోద, వార్తా ప్రసారాలతో పాటు మీడియా వార్తల విశ్లేషణలు, సమకాలీన రాజకీయ,ఇతర అంశాలపై అధికార, ఒకింత ఎక్కువగా ప్రతిపక్షవాణికి ప్రాధాన్యత పెరగటం.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్ధలను దెబ్బతీస్తున్నట్లుగానే వీటికి కూడా అదే గతి పట్టిస్తున్నట్లు తీరు తెన్నులు వెల్లడిస్తున్నాయి.

ప్రయివేటు మీడియా సంస్ధలతో డబ్బున్న రాజకీయ పార్టీలు, నేతలు పాకేజీలను కుదుర్చుకొని వార్తల ముసుగులో తమ డబ్బా కొట్టించుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో వున్న పాలకపార్టీలు ఎలాంటి పాకేజీలు లేకుండానే ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లతో తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ పని చేస్తున్నాయి. భిన్నాభిప్రాయానికి, రెండో పక్షం ఏమి చెబుతోంది అని తెలుసుకోవాలంటే వీటికే పరిమితం అయితే కుదరదు. ఒకప్పుడు దాదాపు నలభైవేల వరకు వున్న సిబ్బందిలో నాలుగోవంతుకు పైగా కుదించారు. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయటం లేదు. కొద్ది రోజులు పోతే కొన్ని విభాగాలు పూర్తిగా ఖాళీ అయి పొరుగుసేవల సిబ్బందితో నిండినా ఆశ్చర్యం లేదు. పని చేస్తున్న సిబ్బంది వుత్సాహాన్ని నీరుగార్చటం, పాతిక, ముఫ్పై సంవత్సరాల నుంచి పని చేస్తున్న వారికి కూడా ప్రమోషన్లు ఇవ్వపోవటం, కొత్త రక్తాన్ని ఎక్కించకపోవటం, వాటిని కూడా ఆదాయం తెచ్చే సాధనాలుగా పరిగణించి, తగినంత ఆదాయం లేదని పైకి చెప్పకపోయినా గణనీయంగా బడ్జెట్‌ కుదించటం, కొత్త నియామకాలు చేపట్టకపోవటం, వంటి అనేక కారణాలు ఈ సంస్ధలను రోజు రోజుకూ ప్రజల నుంచి మరింతగా దూరం చేస్తున్నాయి. ఈ సంస్ధలలో పని చేస్తున్న వివిధ విభాగాల సిబ్బంది ముఖ్యంగా కార్యక్రమాల విభాగంలోని సిబ్బంది, అధికారులు పోరుబాట పట్టారు. గత కొద్ది రోజులుగా శాంతియుత నిరసనల్లో భాగంగా ప్లకార్డులతో ఆయా సంస్ధల ముందు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వుధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Image result for all india radio

వీరి ఆందోళనలో రెండు అంశాలున్నాయి. ఒకటి తమ వుద్యోగాలు, ప్రమోషన్లు, కొత్త నియామకాల డిమాండ్లు ఒకటైతే, సంస్ధల పరిరక్షణ, అభివృద్ధి రెండవది.గత కొద్ది సంవత్సరాలుగా ప్రసార భారతి అధికారుల అనుచిత వైఖరి కారణంగా కార్యక్రమాల సిబ్బందిలో అసంతృప్తి పేరుకుపోతోంది. ప్రోగ్రామ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ చెబుతున్నదాని ప్రకారం నియమావళిని తుంగలో తొక్కి ఖాళీలను పూర్తి చేయకపోవటం ఒకటైతే ఇతర విభాగాల నుంచి కీలకమైన పోస్టులలో అధికారులుగా నియమించటం మరొకటి. ఈ ఏడాది ఏప్రిల్‌ 28నాటికి ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ప్రోగ్రామ్‌ సర్వీసులో మంజూరైన 1,038 పోస్టులకు గాను 1,032 ఖాళీగా వున్నాయని ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం తెలిపింది. అంటే రిటైర్మెంట్‌, ఇతర కారణాలతో ఖాళీ అయిన వాటిని నింపటం నిలిపివేశారన్నది స్పష్టం. అయితే పని ఎలా జరుగుతున్నదన్న అనుమానం ఎవరికైనా రావచ్చు. వున్న సిబ్బందిలో దశాబ్దాల సర్వీసు వున్నప్పటికీ ప్రమోషన్లు ఇవ్వకుండా చేరిన క్యాడర్‌తోనే పని చేయించుకోవటం, కీలకమైన పోస్టులలో ఇతర విభాగాల నుంచి డెప్యుటేషన్‌, ఇతర పద్దతులలో తీసుకురావటం వంటివి చేస్తున్నారు. రేడియో, టీవీలలో కార్య క్రమాలు అంటే సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, నైపుణ్యం, కళా, సాహిత్యరంగాలలో అనుభవం వంటివి ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఒక కార్యక్రమం శ్రోతలు, వీక్షకులకు అందాలంటే వాటి ప్రణాళికను రూపొందించే, తయారు చేసే, ప్రసారం చేసే మూడు విభాగాల సమష్టి కృషి, సమన్వయం వుంటుంది. 1038లో 1032 ఖాళీ అంటే కార్యక్రమాలను రూపొందించేవారెవరు, అవి లేనపుడు పాతవాటినే పున:ప్రసారాలు చేస్తే శ్రోతలు, వీక్షకులు తగ్గిపోక ఏం చేస్తారు. ప్రమోషన్ల ద్వారా నింపాల్సిన 814 పోస్టులలో ప్రస్తుతం కేవలం ముగ్గురు మాత్రమే వుండగా సంవత్సరాల తరబడి 224 మంది తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తుండగా 587 పూర్తి ఖాళీగా వున్నాయంటే ప్రసార భారతి యాజమాన్య తీరు ఎలా వుందో వేరే చెప్పాల్సిన పనిలేదు.

డిఫెన్స్‌ ఎస్టేట్స్‌, సెంట్రల్‌ సెక్రటేరియట్‌, బ్రాడ్‌ కాస్ట్‌ ఇంజనీరింగ్‌, టెలికాం సర్వీసుల నుంచి అధికారులను దిగుమతి చేసి రేడియో, దూరదర్శన్‌ కార్య క్రమాల పర్యవేక్షణకు నియమించుతున్నారని, కార్య క్రమాల సిబ్బంది విమర్శిస్తున్నారు. కళా, సంస్కృతి, విద్య, కార్యక్రమాలు రూపొందించే అంశాలలో ప్రమేయం, పర్యవేక్షణలో కనీసం 17 సంవత్సరాల అనుభవం వున్న వారిని అదనపు డైరెక్టర్‌ జనరల్‌(కార్యక్రమాలు) పోస్టులలో నియమించాల్సి వుండగా ఇటీవల ఇద్దరు టెలికాం సర్వీసు అధికారులను ఆ పోస్టులకు తీసుకువచ్చారని వారు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి అధికారులు ప్రసార భారతిలో తిష్టవేస్తే ఇంక కొత్తవి, జనరంజకమైన కార్యక్రమాల గురించి ఆలోచించాల్సిన పనేముంది?

రెండవ అంశం. సామాజిక న్యాయం. ప్రపంచంలో మన రేడియో, దూరదర్శన్‌ వ్యవస్ధ అతిపెద్దది. వాటి కార్యక్రమాలు 90శాతం భూభాగానికి 99శాతం జనాభాకు అందుబాటులో వున్నాయి. అన్నింటికంటే ఇది ప్రజల ఆస్ధి, మాధ్యమం. ప్రజల పట్ల జవాబుదారీతనంతో పనిచేయాల్సిన కీలక సంస్ధలివి. ఇరవై మూడు భాషలు, 180 మాండలికాలలో కార్య క్రమాలను అందించటం సామాజిక న్యాయంలో భాగమే. విస్మరణకు గురైన భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలను ముందు తరాల వారికి అందించాలంటే వాటిని రికార్డు చేసి, చిత్రీకరించి పదిల పరచాల్సిన కర్తవ్యాన్ని ప్రభుత్వ ప్రసార మాధ్యమాలు, సంస్దలు తప్ప కేవలం లాభాలకోసమే పని చేసే ప్రయివేటు ప్రసార మాధ్యమాలు ఎందుకు చేపడతాయి. ప్రభుత్వ ప్రసార మాధ్యమాల దుర్వినియోగాన్ని అడ్డుకొనేందుకు ప్రజలు ముందుకు రావాలి. ముందు వాటిని బతికించుకోవాలి. ఒక వ్యవస్ధను నిర్మించటానికి దశాబ్దాలు, శతాబ్దాలు పడుతుంది. కూల్చివేయటానికి కొన్ని క్షణాలు చాలు. ఈ పూర్వరంగంలో ప్రసార కార్యక్రమాల సిబ్బంది చేస్తున్న, తమ న్యాయమైన డిమాండ్లను పట్టించుకోని పక్షంలో భవిష్యత్‌లో చేయతలపెట్టిన వుద్యమాలకు ప్రజలు మద్దతు ఇవ్వాల్సి వుంది. ఇదేదో కేవలం వారి ప్రమోషన్లు, వుద్యోగాల సమస్య కాదు. మనలో భాగమే. అందువలన ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లను మెరుగుపరచటానికి, జనానికి మరింత చేరువ కావటానికి, సిబ్బంది చేసే ఆందోళనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం వుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: