• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: January 2019

వెనెజులాలో మదురో సర్కార్‌పై సైనిక తిరుగుబాటుకు అమెరికా మద్దతు !

23 Wednesday Jan 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Opinion, USA

≈ Leave a comment

Tags

Caracas, Juan Guaidó, military coup, Nicolás Maduro, Socialists United of Venezuela (PSUV), USA, Venezuela president, Venezuelan military

ఎం కోటేశ్వరరావు

డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ లాటిన్‌ అమెరికాలోని వెనెజులాలో జోక్యం చేసుకో నుందా ? మరోసారి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన వామపక్ష మదురోను కూలదోసేందుకు ప్రత్యక్షంగా తన సైన్యాన్ని పంపుతుందా? పశ్చిమాసియా, ఇతర ప్రాంతాల్లో తగిలిన ఎదురు దెబ్బలను గుర్తుకు తెచ్చుకొని పరిసర దేశాల మిలిటరీతో తన లక్ష్యాన్ని నెరవేరుస్తుందా లేక వెనెజులా మిలిటరీని ప్రభావితం చేసి తిరుగుబాటు చేయిస్తుందా ? ప్రస్తుతం వెనెజులాలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తలెత్తుతున్న ప్రశ్నలివి. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలు, అంతర్జాతీయ పరిణామాల నేపధ్యంలో వెనెజులాలో మిలిటరీ జోక్యం ఆ ఒక్క దేశానికే పరిమితం అవుతుందా? ప్రపంచవ్యాపిత పర్యవసానాలకు దారి తీస్తుందా ! అసలు వెనెజులాలో, దానికి సంబంధించి బయట ఏమి జరుగుతోంది?

బుధవారం నాడు అధ్యక్షుడు మదురోకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సైనిక తిరుగుబాటుకు, ప్రదర్శనలకు పిలుపు ఇచ్చిన నేపధ్యంలో వునికిలో లేని పార్లమెంట్‌ అధ్యక్షుడు జువాన్‌ గుయైడోకు అమెరికా వుపాధ్యక్షుడు మైక్‌ పెనెస్‌ మద్దతు ప్రకటించి ప్రత్యక్ష జోక్యానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి తిరుగుబాటు చేసిన వారిలో 27 మందిని అరెస్టు చేశారని, మరికొందరని అరెస్టు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అధ్యక్ష భవనానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఒక సైనిక అవుట్‌ పోస్టును స్వాధీనం చేసుకున్న కొందరు సైనికులు రెండు మిలిటరీ ట్రక్కులు,కొన్ని ఆయుధాలు తీసుకొని బయలు దేరగా వారిని అరెస్టుచేసినట్లు తొలి వార్తలు తెలిపాయి. అంతకు కొన్ని గంటల ముందు సామాజిక మాధ్యమంలో దర్శనమిచ్చిన అనేక వీడియోలలో సైన్యంలోని నేషనల్‌ గార్డ్స్‌ తాము మదురోను అధ్యక్షుడిగా గుర్తించటం లేదని తమకు మద్దతుగా జనం వీధుల్లోకి రావాలని చెప్పినట్లుగా వుంది. అరెస్టులకు ముందు సామాజిక మాధ్యంలో దర్శనమిచ్చిన వీడియోలో పార్లమెంటు నేత, తాత్కాలిక అధ్యక్షుడంటూ ప్రకటించిన జువాన్‌ గుయైడో మాట్లాడుతూ తిరుగుబాటు చేయాలని, కాల్పులు జరపాలని తాము కోరటం లేదని, మన పౌరుల హక్కుల కోసం తమతో పాటు కలసి రావాలని కోరుతున్నామని సైనికులకు విజ్ఞప్తి చేశాడు. మదురోను వదలి వచ్చిన మిలిటరీ, ఇతర పౌర అధికారులకు తాము క్షమాభిక్ష పెడతామని పార్లమెంటు ప్రకటించింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే సుప్రీం కోర్టు ఒక ప్రకటన చేస్తూ మదురో అధ్యక్ష స్వీకారం చెల్లదంటూ కొద్ది రోజుల క్రితం పార్లమెంట్‌ చేసిన తీర్మానం చెల్లదని, రాజ్యాంగ వుల్లంఘనకు పాల్పడిన పార్లమెంట్‌ నేతలు నేరపూరితంగా వ్యవహరించారో లేదో దర్యాప్తు చేయాలని ఆదేశించింది. గతంలో కూడా ఇలాంటి చెదురుమదురు తిరుగుబాట్లు, మదురోపై హత్యాయత్నాల వంటివి జరిగాయి. ఈ వుదంతం కూడా అలాంటిదేనా అన్నది చూడాల్సి వుంది. రానున్న కొద్ది రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ శక్తుల కుట్రల పర్యవసానాలు మరింతగా వెల్లడి అవుతాయి.

లాటిన్‌ అమెరికాలో వామపక్షం అధికారంలోకి వచ్చిన దేశాలలో ఒకటి వెనెజులా ! హ్యూగో ఛావెజ్‌ బతికి వున్న సమయంలోనే ఆయన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ఇంటా బయటి శక్తులు చేయని యత్నం లేదు. ఆయన రాజకీయ వారసుడిగా అధికారంలోకి వచ్చిన నికొలస్‌ మదురోకు వ్యతిరేకంగా కూడా అదే జరుగుతోంది. గత ఏడాది మేనెలలో జరిగిన ఎన్నికలలో మదురో మరో ఆరు సంవత్సరాలకు తిరిగి ఎన్నికయ్యారు. ఈనెల పదవ తేదీన తిరిగి అధికారాన్ని స్వీకరించారు. 2015లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో ప్రతిపక్షం మెజారిటీ సాధించింది. తరువాత మదురోను తొలగించాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి.2017లో సుప్రీం ట్రిబ్యునల్‌ పార్లమెంట్‌ అధికారాలను రద్దు చేసింది. అధికారంలేని పార్లమెంట్‌ కొనసాగుతోంది. తరువాత నూతన రాజ్యాంగ రచనకు రాజ్యాంగపరిషత్‌కు ఎన్నికలు జరిగాయి.2018 మే నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రెండవసారి మదురో ఎన్నికను అమెరికా మరికొన్ని దేశాలు గుర్తించేందుకు నిరాకరించాయి. రెండవ సారి ప్రమాణ స్వీకారానికి బలీవియా అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌, క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డైయాజ్‌ కానెల్‌, నికరాగువా అధ్యక్షుడు డేనియల్‌ ఓర్టేగా, సాల్వడోర్‌ అధ్యక్షుడు సాల్వడోర్‌ శాంఛెజ్‌ సెరెన్‌ వంటి నేతలు హాజరు కాగా చైనా ప్రత్యేక ప్రతినిధిని పంపింది. మొత్తం 94దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మదురో మాట్లాడుతూ తమ పార్టీ 19ఏండ్ల పాలనా కాలంలో 25ఎన్నికలు జరిగాయని ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనమని చెప్పారు. వెనెజులా మిలిటరీ మదురోకు విధేయత ప్రకటించింది.

మదురో అధికార అపహర్త అంటూ అధికారాలు లేని పార్లమెంట్‌ జనవరి 11న ఒక తీర్మానం చేసి జువాన్‌ గుయైడోను అధ్యక్షుడిగా నియమించినట్లు ప్రకటించింది. అధికార వ్యవస్ధలో శూన్యం ఏర్పడినపుడు నూతన అధ్యక్షుడిని నియమించే అధికారం తమకుందని చెప్పుకుంది. ఈనెల 23న మదురోకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయాలని, సైన్యం తిరుగుబాటు చేసి పార్లమెంట్‌కు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరాయి. తదుపరి ఎన్నికలు జరిగే వరకు తనది ఆపద్ధర్మ ప్రభుత్వమని గుయైడో చెప్పుకున్నాడు. ప్రభుత్వ యంత్రాంగం, మిలిటరీలోని మధ్య, దిగువ సిబ్బంది తిరుగుబాటు చేసి తమకు మద్దతు ఇస్తారని ప్రతిపక్ష శిబిరం చెప్పుకుంటోంది. వెనెజులా ఆస్ధులు, ఖాతాలను స్దంభింప చేయాలంటూ పార్లమెంట్‌ 46దేశాలకు లేఖలు రాసింది. మరిన్ని ఆంక్షల అమలుకు తాము ప్రయత్నిస్తామని అమెరికా ప్రకటించింది. రెండోసారి మధురో అధికార స్వీకరణను అమెరికాతో పాటు లిమా బృందంగా పరిగణించబడే 13దేశాలు గుర్తించేందుకు నిరాకరించాయి. వాటికి కొలంబియా, బ్రెజిల్‌ నాయకత్వం వహిస్తున్నాయి.

బస్సు డ్రైవర్ల యూనియన్‌ నేతగా రాజకీయ జీవితం ప్రారంభించిన మదురో ఏడు సంవత్సరాల పాటు ఛావెజ్‌ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు. ఛావెజ్‌ కాన్సర్‌ నుంచి కోలుకొనే అవకాశం లేని స్ధితిలో ఆయన తన రాజకీయ వారసుడిగా మదురోను గుర్తించారు. 2013లో తొలిసారి మదురో పోటీ చేసినపుడు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడ్డాయి. పదకొండు మంది పాలకపార్టీ కార్యకర్తలను హత్యచేశాయి. 2015లో ప్రతిపక్షాలు పార్లమెంట్‌ ఎన్నికలలో మెజారిటీ సాధించిన వెంటనే ఆరునెలల్లో మదురోను పదవీచ్యుతుని గావిస్తామని ప్రకటించాయి. పార్లమెంట్‌ -అధ్యక్షుడి మధ్య తలెత్తిన వివాదం చివరకు 2017లో సుప్రీం కోర్టు పార్లమెంట్‌ అధికారాలను రద్దు చేయటంతో ముగిసింది. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ప్రతిపక్షాలు కుట్రలు చేస్తూనే వున్నాయి. పార్లమెంట్‌ స్ధానంలో ఎన్నికైన నూతన రాజ్యాంగ సభ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాల్సి వుంది.

మదురోను గద్దె దింపేందుకు తక్షణమే ట్రంప్‌, ఇతరులు కదలనట్లయితే ఇంకో అవకాశం వుండదని, మరొక క్యూబా మాదిరి మారిపోతుందని అమెరికా, లాటిన్‌ అమెరికాలోని వామపక్ష వ్యతిరేకశక్తులు తొందర పెడుతున్నాయి. అమెరికా, ఐరోపా యూనియన్‌, లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాలు ఇంతకు ముందే గతేడాది జరిగిన మదురో ఎన్నికను గుర్తించటం లేదని ప్రకటించాయి. ఇంత హడావుడి చేస్తున్నప్పటికీ ప్రతిపక్ష జువాన్‌ గుయైడో ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేసినట్లు ప్రకటించలేదు, తరువాత చేస్తానని మాత్రమే చెబుతున్నాడు. ఈనెల 23న మదురోకు వ్యతిరేకంగా జనాన్ని వీధుల్లో ప్రదర్శనలు చేయించాలని, ఈలోగా మిలిటరీలో తిరుగుబాటు రెచ్చగొట్టాలన్నది ప్రతిపక్షం రూపొందించిన అనేక పధకాలలో ఒకటి. సుప్రీం కోర్టు, మిలిటరీ మద్దతు లేని ఏ ప్రభుత్వమూ ఇప్పుడున్న స్దితిలో వెనెజులాలో నిలిచే అవకాశం లేదు. అయితే పధకంలో భాగంగా కెనడా, బ్రెజిల్‌, అమెరికా దేశాల సంస్ధ పార్లమెంట్‌ తీర్మానాన్ని అభినందిస్తున్నామని, గుర్తిస్తామని చెప్పటం ద్వారా గుయైడోను అధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్లు పరోక్షంగా తెలిపాయి. అధికారిక ప్రకటన చేస్తే గుయైడోను వెంటనే అరెస్టు చేసే అవకాశం వుంది. దాని బదులు అతగాడు నియమించే రాయబారులను గుర్తిస్తూ మదురో సర్కార్‌ నియమించిన వారిని ఖాళీ చేయించటం ద్వారా తమ మద్దతును వెల్లడించవచ్చన్నది ఒక సమాచారం. ఒక వేళ అలా కానట్లయితే ఏదో ఒక దేశ రాయబార కార్యాలయంలో రాజకీయ ఆశ్రయం కల్పించి అక్కడి నుంచి సమాంతర ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన చేయించే ఆలోచన కూడా లేకపోలేదు. అది చేస్తే మదురో సర్కార్‌ రాయబార కార్యాలయం మీదకు సైన్యాన్ని పంపకపోవచ్చని బ్రెజిల్‌ రాయబార కార్యాలయ ప్రతినిధి చెప్పారు. గుయైడో ద్వారా వెనెజులాకు మానవతా పూర్వక సాయ అభ్యర్ధన ప్రకటన చేయించి సరిహద్దులకు కొంత మొత్తం సాయాన్ని పంపితే మదురో సర్కార్‌ దానిని అనుమతించదని, ఆ చర్య జనంలో మదురో పట్ల వ్యతిరేకతను పెంచవచ్చని మదురో వ్యతిరేక శక్తులు ఆశిస్తున్నాయి.

Image result for us supported military coup against venezuela president nicolas maduro

తాజా పరిణామాల్లో వెనెజులా వ్యవహారాలలో కెనడా ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో తన పట్టు పెంచుకోవాలని గత కొంతకాలంగా కెనడా పాలకవర్గం అవకాశాల కోసం చూస్తోంది. దానిలో భాగంగానే మదురో రెండవ సారి ప్రమాణ స్వీకారం చేయకముందే మదురో పాలన చట్టబద్దమైనదిగా తాము పరిగణించటం లేదని ప్రకటించింది. లిమా బృందంలో మెక్సికో కూడా సభ్యురాలిగా వున్నప్పటికీ తాత్కాలికంగా అయినా అది మదురో వ్యతిరేక వైఖరికి దూరంగా వుంది. మెక్సికోలో నూతనంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ ఒబ్రడార్‌ వెనెజులా నేత మదురోకు ఆహ్వానం పంపారు. అమెరికా విషయానికి వస్తే నిరంతరం వెనెజులా మిలిటరీలో తిరుగుబాటు, చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. తన చేతికి మట్టి అంటకుండా వ్యవహరించాలని అమెరికా చూస్తున్నది. అందుకే కెనడా వంటి వాటిని ముందు పెడుతున్నది. అమెరికా దేశాల సంస్ధ ప్రధాన కార్యదర్శి ఆల్మగారో కుట్రను ప్రోత్సహిస్తున్నవారిలో ఒకడు. గుయైడో తానేమిటో చెప్పుకోక ముందే వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడంటూ స్వాగతం పలికాడు. ఈనెల పదిన మదురో ప్రమాణ స్వీకార సమయంలో అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో ఒక ప్రకటన చేస్తూ తక్షణమే తిరుగుబాటు ద్వారా మదురోను బర్తరఫ్‌ చేయాలని వెనెజులా మిలిటరీని బహిరంగంగా కోరాడు. మరుసటి రోజు గుయైడోకు ఫోన్‌ చేసి మద్దతు ప్రకటించాడు.ఈ నెల 12న విదేశాంగశాఖ ఒక ప్రకటన చేస్తూ పాలకుల మార్పులో భాగంగా మిలిటరీ తిరుగుబాటుకు తమ మద్దతు వుంటుందని ప్రకటించింది. గూఢచార సంస్ద సిఐఏ సంగతి సరేసరి. అధికారులను ప్రలోభాలకు గురిచేయటం, బ్లాక్‌మెయిల్‌ చేయటం, అనేక పుకార్లను వ్యాపింపచేయటంలో తన పని తాను చేస్తున్నది.

లాటిన్‌ అమెరికాలో పచ్చి నియంతలను నిస్సిగ్గుగా సమర్ధించిన అమెరికా నిర్వాకాన్ని అక్కడి జనం అంత తేలికగా మరచిపోతారనుకుంటే వారి చైతన్యాన్ని తక్కువగా అంచనా వేయటమే. నియంతలకు వ్యతిరేకంగా పోరాడి అధికారానికి వచ్చిన వామపక్ష శక్తులు నయావుదారవాద విధానాల పునాదుల మీద సంక్షేమ కార్యక్రమాలను అమలు జరిపి గతకొన్ని సంవత్సరాలుగా ప్రజాభిమానం పొందారు. అయితే అది దీర్ఘకాలం సాగదని, దోపిడీ సంబంధాలను తెంచివేసి ప్రత్నామ్నాయ విధానాలను అమలు జరిపినపుడే జనం మద్దతు వుంటుందని స్పష్టమైంది. కొన్ని చోట్ల వామపక్ష ప్రభుత్వాల మీద తలెత్తిన అసంతృప్తితో జనం అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి చోట్ల మితవాద, ఫాసిస్టు శక్తులను గద్దెనెక్కించారు. అచిర కాలంలోనే వాటి విధానాల మీద జనం వీధులకు ఎక్కుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి నిరంతరం కబుర్లు చెప్పే అమెరికా, కెనడా వంటి దేశాలు, అమెరికా దేశాల సంస్ధ వెనెజులా లేదా మరొక చోట మిలిటరీ చర్యలు, మిలిటరీ తిరుగుబాట్లను ప్రోత్సహించి సమర్ధించుకోవటం అంత తేలిక కాదు. అయితే వైరుధ్యాలు ముదిరినపుడు సామ్రాజ్యవాదులకు మీన మేషాల లెక్కింపు, ఎలాంటి తటపటాయింపులు వుండవు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నాజీ గోబెల్స్‌ అడుగుల్లో కాషాయ పరివారం !

22 Tuesday Jan 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, india's saffron brigade, Narendra Modi, narendra modi bhakts, Nazi Goebbels

Image result for modi's big lie cartoons

ఎం కోటేశ్వరరావు

ఘనుడై నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 2014 జూన్‌ నుంచి 2018 సెప్టెంబరు వరకు మన దేశ స్వదేశీ, విదేశీ అప్పు మొత్తం 54,90,763 కోట్ల నుంచి 82,03,253 కోట్లకు పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి. వీటి మీద సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లోని ఒక గ్రూప్‌ చర్చలో పాల్గన్న మోడీ, బిజెపి అభిమానులు, కార్యకర్తల స్పందన గమనిస్తే దానిని ప్రత్యక్షంగా చూసేందుకు హిట్లర్‌ ప్రచార మంత్రి జోసెఫ్‌ గోబెల్స్‌ కుల సంఘాలు ఆమోదిస్తే హిందూత్వ తాలిబాన్‌ కుటుంబాలలో ఎక్కడో అక్కడ పుట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయితే తెలిసీ అలాంటి వాడిని కనేందుకు ఏ తల్లీ అంగీకరించదు కనుక టెస్ట్‌ ట్యూబ్‌ జీవిగా పుట్టేందుకు ఒక మట్టి కుండను సరఫరా చేయమని ఆంధ్రవిశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ నాగేశ్వరరావుకు ఈ పాటికి గోబెల్స్‌ వర్తమానం పంపే వుంటాడు.

ప్రభుత్వ రుణ వార్తను ఇచ్చిన ఒక మీడియా సంస్ధను, వార్త కటింగ్‌ను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన వ్యక్తి ఒక అబ్బకు పుట్టిన వారు కాదని,అప్పులన్నీ హాజ్‌యాత్రకోసం చేసిన వని, కాంగ్రెస్‌ వారు 54లక్షల కోట్లు అప్పులు చేసి మోడీకి అప్పగిస్తే నాలుగున్నరేండ్లలో 32లక్షల కోట్ల వడ్డీ అయిందని, ఇండియా అప్పుకు, మోడీ చేసిన అప్పుకు తేడా తెలియదని, ఎల్లో మీడియా ఫేక్‌ న్యూస్‌ నమ్మవద్దని, అది అప్పుకాదు మోడీ మిగిల్చిన మొత్తం అంటూ విరుచుకుపడ్డారు.తెలివి తేటలు కలిగిన ఇంకొందరు గతంలో యుపిఏ హయాంలో చేసిన అప్పు కంటే మోడీ చేసిన అప్పు తక్కువ శాతం అంటూ సమర్ధనకు పూనుకున్నారు. బూతులు తిట్టేవారి కంటే వీరు కొంత నయం. వీటిని చూస్తుంటే జర్మనీలో నాజీలు, హిట్లర్‌ ప్రచారం అక్కడి సమాజం మీద ఎలాంటి ప్రభావం కలిగించిందో ప్రత్యక్షంగా అర్ధం అవుతోంది. 1897లో పుట్టిన గోబెల్స్‌ ‘ఆంగ్లేయుల నాయకత్వ రహస్యం ప్రత్యేకించిన కొన్ని తెలివితేటల మీద ఆధారపడలేదు. అది మూర్ఖ సూక్ష్మబుద్ధి మీద ఆధారపడిందంటే ఆశ్చర్యం కాదు. ఎవరైనా అబద్దం చెప్పదలచుకుంటే అది పెద్దదై వుండాలి, దానికే కట్టుబడి వుండాలి, దానిని కొనసాగించాలి.అది అపహాస్యంగా కనిపిస్తున్నా సరే దానికే కట్టుబడి వుండాలి.’ అని ఒక రచనలో పేర్కొంటాడు. దానిని మరింతగా అభివృద్ది చేసి ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుంది, చివరకు తొలిసారి అబద్దం చెప్పిన వాడు కూడా ఒక దశలో నిజమే అని నమ్మే విధంగా తయారవుతాడు అని నిరూపించాడు.

Image result for modi's  big lie   cartoons

అప్పులు చేయటం సరైనదా కాదా అన్నది ఒక అంశం. అత్యంత ధనిక దేశం అమెరికా నుంచి దాన్ని తలదన్నేందుకు ప్రయత్నిస్తున్న చైనా వరకు అన్ని దేశాలు అప్పులు చేస్తున్నాయి. మన దేశం అందుకు మినహాయింపు కాదు. కేంద్రంగానీ, రాష్ట్రాలు గానీ, అది కాంగ్రెస్‌ లేదా బిజెపి అయినా ఎవరైనా చేస్తున్నది అదే. ప్రతి ఏటా బడ్జెట్‌లో గతంలో వున్న అప్పులు తీర్చేందుకు, వాటికి అసలు, వడ్డీ కోసం కేటాయింపులు చేస్తారు. లోటు బడ్జెట్‌ను పూడ్చుకొనేందుకు కొత్త అప్పులు చేస్తారు. మోడీ సర్కార్‌ సగటున ఏటా ఆరులక్షల కోట్ల మేరకు అప్పు చేస్తున్నది.ఈ ఏడాది అంటే 2019 మార్చి నెలాఖరులోపు కేంద్ర ప్రభుత్వ లోటు అంచనా 6.24లక్షల కోట్ల రూపాయలు. అయితే ఆర్ధిక సంవత్సరం తొలి ఎనిమిది నెలలకే 7.17 కోట్లకు చేరింది. అంటే ప్రపంచబ్యాంకు పరిభాషలో చెప్పాలంటే ఆర్ధిక కట్టుబాటును వుల్లంఘించటమే. ఈ లోటును పూడ్చుకొనేందుకు అప్పు చేయాలి లేదా నోట్ల ముద్రణకు పాల్పడాలి. ఇంతకు మించి మరొక ప్రత్యామ్నాయం లేదు ఈ వాస్తవం మోడీ భక్తులకు తెలియదా లేక తెలిసినా వాస్తవాన్ని అంగీకరించేందుకు నిరాకరిస్తూ ఎదురుదాడికి పాల్పడుతున్నారా ? వైఫల్యాలను కప్పి పుచ్చుకొనే క్రమంలో ఎదురుదాడి ఒక పద్దతి.

నరేంద్రమోడీకి లేనిదాన్ని ఆపాదించేందుకు ఆయన నియమించుకున్న యంత్రాంగం అనేక అవాస్తవాలను ప్రచారంలో పెట్టింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పెట్టుబడులు తెచ్చేందుకే మోడీ విదేశీ ప్రయాణాలు చేశారు. నరేంద్రమోడీ సర్కార్‌ అసలు అప్పులు చేయలేదు, ప్రపంచ బ్యాంకు నుంచి ఎలాంటి అప్పులు తీసుకోలేదు. కాంగ్రెస్‌ పాలనా కాలంలో చేసిన అప్పులన్నీ తీర్చాడు. ఇంకా ఇలాంటి ఎన్నో అతిశయోక్తులను మోడీకి ఆపాదించారు. వీరాభి అభిమానులు వాటన్నింటినీ నమ్మారు కనుకనే సామాజిక మాధ్యమంలో స్పందన అలా అదుపు తప్పింది. మోడీ విశ్వసనీయత ఎలా తయారైందంటే ఆయనే స్వయంగా తన ప్రభుత్వం అప్పులు చేసిందని నిజం చెప్పినా అంగీకరించే స్ధితి లేదు. మూకోన్మాదం అంటే ఇదేనా ? గోబెల్స్‌ చెప్పినదానికి అనుగుణ్యంగానే బిజెపి నేతల తీరు తెన్నులున్నాయి. ఒక బిజెపిని ఓడించటానికి అన్ని పార్టీలు ఏకమౌతున్నాయి.నేను కాపలాదారుగా పహారా కాస్తుంటే దేశాన్ని లూటీ చేసిన వారంతా ఏకమౌతున్నారు. ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నది సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ, ఆయన భజన బృందం. తెలంగాణాలో అన్ని స్ధానాలకు పోటీ చేస్తున్న ఏకైక పార్టీ మాది, అధికారం మాదే. మీడియా, జనం పగలబడి నవ్వుతున్నా గల్లీ నుంచి ఢిల్లీ నేతల వరకు ఎన్నికల ప్రచారంలో చెప్పింది అదే. వారికా ధైర్యం, అంతటి తెలివి తేటలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే గోబెల్స్‌ చెప్పిన అంశమే.అతని వుపదేశాన్ని మరింత నవీకరిస్తూ పక్కాగా అమలు జరుపుతున్నది హిట్లర్‌, గోబెల్స్‌ భావజాలం, ప్రచార పద్దతులను అరువు తెచ్చుకున్న కాషాయ పరివారం, వారితో ఏదో ఒక దశలో స్నేహం చేసిన, చేస్తున్న వారు అంటే ఎవరికైనా కోపం వస్తే చేయగలిగిందేమీ లేదు.

Image result for modi's big lie cartoons

ఈ రోజు దేశంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమిలో 40కి పైగా చిన్నా పెద్ద పార్టీలు వున్నాయి. బిజెపిని ఓడించటానికి అన్ని పార్టీలు ఏకమైతున్నాయని చెప్పటం గోబెల్స్‌ ప్రచారం కాదా ? ఎన్‌డిఏ పేరుతో వున్నది తమ పార్టీ ఒక్కటే అని చెప్పమనండి. కాపలాదారుగా నరేంద్రమోడీ సక్రమంగా విధి నిర్వహిస్తే విజయ మాల్య, నీరవ్‌ మోడీ వంటి వేల కోట్ల రూపాయలను ఎగవేసిన వారు దేశం వదలి ఎలా పోయారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేసిన వారు, నిధులను దారి మళ్లించిన వారు గత నాలుగు సంవత్సరాలలో ఇబ్బడి ముబ్బడిగా ఎలా పెరిగారు? కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన అప్పులని చెబుతున్నవాటిలో కొన్ని లక్షల కోట్లను రాని బాకీల కింద రద్దు ఖాతాలో రాసిన వారెవరు? వసూలు చేయకుండా అడ్డుపడ్డదెవరు ? తీసుకున్న రుణాల వాయిదాల చెల్లింపులో విఫలమైన ప్రతి రుణఖాతా రుణ వ్యవధిని బట్టి నిరర్ధక ఆస్ధి అవుతుంది. అలాంటపుడు కాంగ్రెస్‌ హాయాంలో ఇచ్చిన అప్పులు తమ హాయాంలో ఇచ్చిన వాటిని వేరు చేసి తమ ఘనత, కాంగ్రెస్‌ కాలంలో ఇచ్చిన వాటి బండారాన్ని ఎందుకు బయటపెట్టరు.

అబద్దం ఆడదలచుకుంటే అది పెద్దదై వుండాలన్న బ్రిటీష్‌ కుటిల నీతిని ప్రదర్శించింది సాక్షాత్తూ నరేంద్రమోడీయే. పెద్ద నోట్ల రద్దు లక్ష్యాలు, నల్లధనం గురించి చెప్పింది పెద్ద అబద్దం కాదా ? జనం ఏమనుకున్నా అదే అబద్దానికి కట్టుబడి వుండాలి, నోరు విప్పకూడదు అన్నదానికి నరేంద్రమోడీ నోట్ల రద్దు గురించి ‘కట్టుబడి ‘ వున్నారా లేదా ? ఏండ్లు గడుస్తున్నా దాని మీద ఒక్క మాటైనా మాట్లాడారా ? ఎంత నిబద్ధత ! తాను నోరు విప్పక పోవటమే కాదు, రిజర్వు బ్యాంకు నోరు కూడా మూయించారా లేదా ? ఎన్నికలకు ముందు విదేశాల్లో నల్లధనం గురించి మాట్లాడిందేమిటి ? తరువాత అసలు నోరు విప్పారా ? గోబెల్స్‌ చెప్పిందానికి ట్టుబడి వున్నారా లేదా ? ఎవరేమనుకుంటే మాకేటి సిగ్గు అన్నట్లుగా వుండాలన్నాడు గోబెల్స్‌. కుహనా సైన్సు గురించి చెప్పిన మాటలను ప్రపంచం అపహస్యం చేస్తున్నా ఎవరైనా మానుకున్నారా ? వేదాల్లో అన్నీ వున్నాయష అని చెప్పేవారి సంఖ్య తగ్గలేదు, చెప్పేవారు మరింత పెరిగారు. తలకాయలూపే వారు ఇబ్బడి ముబ్బడి అయ్యారా లేదా ! పురాతన కాలంలో మనకు ప్లాస్టిక్‌ సర్జరీ నుంచి విమానాలు, టెస్ట్‌ ట్యూబ్‌ బేబీల నుంచి ఖండాంతర నియంత్రిత క్షిపణులు మన దగ్గర వున్నాయంటే నిజమే అని నమ్మేవారు తయారయ్యారా లేదా ? వినాయకుడికి ప్లాస్టిక్‌ సర్జరీ గురించి ప్రధాని మోడీ స్వయంగా చెప్పిన తరువాత ఆయన కటాక్ష వీక్షణాల కోసం పరితపించే వారు కొందరైతే, నిజంగా నమ్మే కొందరు అలాంటి ప్రచారాలు చేస్తున్నారు

Related image

వుపాధి గురించి తాము చేసిన వాగ్దానాలను అమలు జరిపానని మోడీ నమ్మబలుకుతున్నారు. ఇదొక పెద్ద అబద్దం. దాన్నుంచి బయట పడలేరు, వాస్తవాన్ని అంగీకరించలేరు. ఆవులను కాయటం కూడా వుద్యోగమే అని బిజెపి త్రిపుర ముఖ్యమంత్రి సెలవిచ్చాడు. పకోడీలు అమ్మేవారు రోజుకు రెండువందల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇది కూడా వుద్యోగ కల్పనే అని నరేంద్రమోడీ చెప్పిన తరువాత అనుచరులు మరింతగా రెచ్చిపోతారని వేరే చెప్పాలా? గతేడాది జూలై 21న ప్రధాని మోడీ లోక్‌సభలో వుపాధి గురించి చెప్పిన అంశాలేమిటో చూద్దాం. గతేడాది కాలంలో కోటికి పైగా వుద్యోగాలు(వుపాధి) కల్పించాం. 2017సెప్టెంబరు 2018 మే మాసాల మధ్య వుద్యోగుల భవిష్యనిధి సంస్ధ(ఇపిఎఫ్‌ఓ)లో 45లక్షల మంది నూతన చందాదారులుగా చేరారు. ఇదే కాలంలో నూతన పెన్షన్‌ స్కీములో 5.68లక్షల మంది నూతన ఖాతాదారులుగా చేరారు. కేవలం తొమ్మిదినెలలో ఈ రెండు పధకాల్లో చేరిన వారి సంఖ్య 50లక్షలు దాటుతుంది. పన్నెండు నెలల్లో 70లక్షలు దాటవచ్చు. ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్ల వంటి వారు మరో ఆరులక్షల మంది వృత్తిలో చేరి వుంటారు. గతేడాది దేశంలో7.6లక్షల వాణిజ్య వాహనాల విక్రయం జరిగింది. నాలుగోవంతు పనిలోంచి తొలగినా 5.7లక్షల వాహనాలు నిఖరంగా వుంటాయి. ఒక్కొక్కదాని మీద ఇద్దరు పని చేసినా 11.4లక్షల మందికి వుపాధి కల్పించినట్లు కాదా అంటూ ప్రతిపక్షాలను మోడీ తనవాదనా పటిమతో ప్రశ్నించారు. స్వరాజ్య అనే ఆర్‌ఎస్‌ఎస్‌వారు నడిపే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రభుత్వం ఎన్నో వుద్యోగాలు కల్పించినా దాన్ని సాధికారికంగా చేప్పేందుకు అవసరమైన సమాచారం లేదని పేర్కొన్నారు.ఇదొక పెద్ద అబద్దం

Image result for modi's big lie cartoons

నీతి అయోగ్‌ వుపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా ఆధ్వర్యంలో వుపాధి కల్పన సమాచారం మీద ఒక నివేదిక తయారు చేశారు. వుద్యోగ కల్పన దృశ్యం కలతపరిచేదిగా కనిపించటంతో దాన్ని పక్కన పెట్టేశారు. అయినా ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం వుండి, నాలుగున్నర సంవత్సరాలు ప్రధాని పదవిలో వున్న పెద్దమనిషి వుద్యోగాల సమాచారం లేదని చెప్పటం సిగ్గుపడాల్సిందిగా వుంది కదా ! కార్మికశాఖ 2016-17 సంవత్సరానికి తయారు చేసిన నివేదికను కూడా ప్రభుత్వం తొక్కి పెట్టిందని చెబుతున్నారు. దొరికిందేదో చేయక కోరిన వుద్యోగం రాలేదని ఖాళీగా వున్న వారిని నిరుద్యోగులుగా లెక్కించకూడదని మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేవకర్‌ సెలవిచ్చారు. నిజమే రాజకీయ నిరుద్యోగులకు అది వర్తిస్తుంది, పదవులేమీ ఇవ్వకపోయినా అధికారపార్టీ తనలో చేరినవారందరికీ కండువాలు కప్పి మందలో కలిపేసుకుంటే అలాంటి వారు ఏమి చేస్తున్నారో ఎలా సంపాదించుకుంటున్నారో చూస్తున్నాము. కానీ వుపాధి విషయంలో అలా కుదరదే. కొత్తగా ఎవరైనా పకోడి బండి పెట్టుకుంటే వున్న తమకే బేరాల్లేకపోతే నువ్వొకడివా అంటూ గుర్రుగా చూసే పరిస్ధితి. జవదేవకర్‌ నిర్వచనం ప్రకారం ఆవుల పెంపకం, పకోడి బండి, టీ ఫ్లాస్కులు తీసుకొని రోడ్డెక్కటానికి అవకాశం లేని వారందరినీ నిరుద్యోగులుగా లెక్కించటానికి లేదు. దేశంలో నిరుద్యోగులు 2018 డిసెంబరులో 7.4శాతానికి పెరిగారు. జనవరి ఆరవ తేదీ నాటికి 30రోజు సగటు నిరుద్యోగుల సంఖ్య 7.8శాతానికి పెరిగింది. డిసెంబరులో మొత్తం వుపాధి పొందుతున్నవారి సంఖ్య 3.97కోట్లు, అదే 2017 డిసెంబరులో వున్నవారితో పోల్చితే 1.1 కోట్లు తక్కువ. తాను చెప్పిన దానిని ఎలాంటి జంక గొంకు లేకుండా పాటిస్తున్న వారిని చూసి గోబెల్స్‌ ముసిముసి నవ్వులు నవ్వుతూనే వుంటాడు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

క్యూబా సేంద్రీయ సాగు ప్రాధాన్యత, పరిమితులు !

19 Saturday Jan 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Agriculture, cuba organic agriculture, cuba organic agriculture importance and limitations, organic agriculture

Image result for cuba organic agriculture

ఎం కోటేశ్వరరావు

చమురు నుంచి తయారయ్యే రసాయనాలు అందుబాటులో వున్నప్పటికీ అవి లేకుండా వ్యవసాయం చేస్తున్నారా ? అవి లేకుండా వ్యవసాయాన్ని మీరు ఎంచుకుంటారా ? అని హవానా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలను అమెరికాకు చెందిన వ్యవసాయ పరిశోధకులు, విద్యార్దులు, రైతులతో కూడిన 13 మంది బృందం అడిగిన ప్రశ్న. హవానా శాస్త్రవేత్తలు సేంద్రీయ వ్యవసాయ రంగంలో తాము కనిపెట్టిన అంశాలను అమెరికన్లకు వివరించిన తరువాత వేసిన ప్రశ్న ఇది. ఆ బృందంలోని ముగ్గురు రైతులు తప్ప మిగతావారికి నిరంతర వ్యవసాయ అధ్యయనం ప్రధానం. ఆ బృందానికి ఆతిధ్యం ఇచ్చిన క్యూబన్లకు జీవన్మరణ సమస్య. అప్పటికే సోవియట్‌ కూలిపోయి పది సంవత్సరాలు గడుస్తున్నది. ఆ కాలాన్ని ప్రత్యేకమైనదిగా పిలిచారు. కోటీ పదిలక్షల మంది జనాభాకు ఆకస్మికంగా చమురు లభ్యత నిలిచిపోయింది. వ్యవసాయం రంగంతో సహా వాటితో నడిచే యంత్రాలన్నీ మూతబడ్డాయి. చేతిలో పంచదార తప్ప ఆహార పదార్ధాలను కొనుగోలు చేసేందుకు డబ్బు లేదు. మరొక దేశం నుంచి గతంలో మాదిరి ఆహారం, ఇతర అవసరాలు వచ్చే స్ధితి లేదు. ఆ నేపధ్యంలోంచే ఆహార సరఫరాకు నిరంతర వ్యవసాయ పద్దతుల పాటింపు ఒక అనివార్య పర్యవసానం. అనేక దేశాలలో ప్రాచుర్యంలో వున్న సేంద్రీయ వ్యవసాయానికి, క్యూబాలో చేస్తున్నదానికి తేడా వుంది. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల దుష్ఫలితాలకు దూరంగా వుండాలన్న ధనిక తరగతి అవసరాల కోసం స్వచ్చమైన వుత్పత్తుల సాగు ఒకటి. దానికి భిన్నంగా రసాయన ఎరువులు, పురుగు మందులు కొనటానికి డబ్బులేని పరిస్ధితుల్లో జనానికి సాధారణ ఆహార సరఫరా కోసం క్యూబా సోషలిస్టు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మరొకటి. ఆ దిశగా అక్కడ సాధించిన విజయం గురించి అనేక మందిలో ఆసక్తి తలెత్తింది. అయినప్పటికీ ఈ విధానం ఎంతో సంక్లిష్టమైనదని మేము చెప్పదలచాము అని ఒకటిన్నర దశాబ్దాల తరువాత అమెరికా బృంద సభ్యుడొకరు క్యూబా వ్యవసాయం గురించి రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు. సిద్ధాంత నిబద్దతతో సాధించిన పురోగతిగాక మరేమిటని ప్రశ్నించారు.

నిరంతర అభివృద్ధి సామాజిక పురోగమనానికి తోడ్పడుతుంది. కానీ తమకు అది సాధ్యమే కాదు అవసరం అని కూడా క్యూబన్లు నిరూపించారు. చచ్చిన చేపలు ఏటి వాలున కొట్టుకుపోతాయి, బతికిన చేపలు ఎదురీదుతాయి. ప్రతికూలతలను అధిగమించేందుకు సోషలిస్టు భావజాలం ఎలా వుత్తేజం కలిగిస్తుందో క్యూబాను చూస్తే అర్దం అవుతుంది. విప్లవానికి ముందు, తరువాత కూడా క్యూబా అంటే చెరకు,పంచదారకు మారుపేరు. సోషలిస్టు విప్లవం తరువాత అది సోవియట్‌ సాయంతో చెరకుతో సహా ఇతర పంటలను ఆధునిక యంత్రాల సాయంతో సాగు చేసింది.1991లో సోవియట్‌ కూలిపోయిన తరువాత ఒక్కసారిగా ఆ యంత్రాలన్నీ మూలనపడితే, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కారణం అందరికీ తెలిసిందే, సోవియట్‌ నుంచి సాయంగా అందిన చమురు సరఫరా ఆగిపోయింది, ఎరువులు, పురుగుమందులు లేవు. తిరిగి గుర్రాలతో వ్యవసాయం చేసే స్ధితికి తిరోగమించింది. దానికి తోడు కరవు, తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు. పంచదారను కొనే వారు లేరు. కనీస అవసరాలను దిగుమతి చేసుకుందామంటే అమెరికా దిగ్బంధం, అంక్షలు. ఈ పరిస్ధితి మరొక విప్లవానికి దారి తీసిందంటే అతిశయోక్తి కాదు. అదే చమురు, యంత్రాలు, పురుగు మందులు, రసాయనిక ఎరువులతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేసి జనాల కడుపు నింపటం ఎలా అన్నదే ఆ విప్లవ లక్ష్యం. సోషలిస్టు భావజాలంతో వుత్తేజితులై, దానికి కట్టుబడి వున్న నాయకత్వం, తమ బాటలో జనాన్ని నడిపించిన తీరు క్యూబాలో సేంద్రీయ వ్యవసాయ విప్లవానికి దారితీసింది. దీని అర్ధం క్యూబా సమస్యలన్నింటినీ పరిష్కరించింది అని కాదు. విప్లవానికి ముందు, తరువాత కూడా క్యూబాలో ఆహారధాన్యాల స్వయం సమృద్ధి లేదు. అరవై నుంచి ఎనభై శాతం వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. ఇప్పటికీ విదేశాల మీద ఆధారపడుతున్నప్పటికీ ఆహార రంగంలో గణనీయ పురోగతి సాధించింది.

ముందే చెప్పుకున్నట్లు సోవియట్‌ కూలిపోయిన దగ్గర నుంచి క్యూబాలో ప్రత్యేక పరిస్ధితి ఏర్పడింది. శాంతి సమయంలో ప్రేత్యేక కాలమిది అని కాస్ట్రో వర్ణించారు. పంచదార ఎగుమతులతో విదేశీమారక ద్రవ్యం సంపాదించాలంటే ఎవరినీ కొనుగోలు చేయనివ్వకుండా అమెరికన్‌ ఆంక్షలు. వున్నంతలో పొదుపు చేసి చమురు, ఇతర అవసరాలను దిగుమతి చేసుకొందామంటే డబ్బు లేదు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా చమురు, యంత్రాలు, ఎరువులు, పురుగుమందులు లేకుండా పంటలు పండించే పద్దతులను కనుగొనేందుకు పూనుకున్నారు. అవసరమైన సేంద్రీయ పద్దతుల మీద శాస్త్రవేత్తలు పని చేశారు. భూమి ఇప్పటికీ ప్రభుత్వం చేతుల్లోనే వుంది. సంస్కరణల ఫలితంగా పండించి, పంటలను అమ్ముకొనే హక్కు మాత్రమే జనానికి వుంది. వంద ఎకరాలకు తక్కువగా వున్న కమతాలలో సేంద్రీయ సాగు పద్దతులను ప్రవేశపెట్టి అనేక విజయాలను సాధించారు. దిగుమతులను గణనీయంగా తగ్గించగలిగారు.

సేంద్రీయ వ్యవసాయం ఒక ఎండమావి కాదు, మా దేశ పంచదార కర్మాగారాలలో సగాన్ని మూసివేయటం మా ఆహార స్వయం ఆధారదిశగా వేసి తొలి అడుగు అని వ్యవసాయ పరిశోధకుడు ఫెర్నాండో ఫ్యూన్స్‌ మోంనోజోట్‌ అన్నారు. సోవియట్‌ నుంచి చమురు, ఎరువులు, పురుగు మందులు వచ్చే నావలు ఆకస్మికంగా ఆగిపోయాయి, అవింకేమాత్రం వచ్చే అవకాశం లేదు, మనకు ఈ రసాయనాలన్నీ అవసరమా అని జనం అడగటం ప్రారంభించారు అని ఒక సేంద్రీయ క్షేత్ర యజమాని మిగుయెల్‌ ఏంజెల్‌ సాల్సిని చెప్పారు . ప్రభుత్వం అనేక రాయితీలను ప్రకటించింది. వుత్పత్తులను స్ధానికంగా విక్రయించేందుకు అనుమతించింది. సేంద్రీయ పద్దతి జయప్రదం అవుతుందనే హామీ లేకపోయినప్పటికీ, నెమ్మదిగా జరిగినప్పటికీ ఆర్ధిక వ్యవస్ధ మెరుగైంది. మంత్లీ రివ్యూ అనే పత్రిక జరిపిన ఒక అధ్యయనంలో తేలిన అంశాల ప్రకారం 1988-2007 మధ్య కాలంలో పురుగుమందుల వినియోగం 72శాతం తగ్గింది, కూరగాయల వుత్పత్తి 145శాతం పెరిగింది. ఫ్రెంచి వ్యవసాయ శాస్త్రవేత్త రెనె డ్యూమోంట్‌ తగిన యాజమాన్య పద్దతులతో క్యూబా ప్రస్తుతం వున్న జనాభాకంటే ఐదు రెట్ల మందికి తగిన విధంగా తిండిపెట్టగలదు అన్నారు. 2010లో తన జనానికి అది కడుపునింపే స్ధితిలో లేదు, అది వినియోగించే ఆహారంలో 80శాతం దిగుమతి చేసుకొనేది, దానిలో 35శాతం అమెరికా నుంచి వచ్చేది. అన్నింటికి మించి క్యూబాలోని సగం భూమి వ్యవసాయానికి పనికి రానిది లేదా వృధాగా వుంది.

నియంత బాటిస్టా, అంతకు ముందున్న పాలకుల హయాంలో సారవంతమైన భూమిని చెరకుసాగుకు వుపయోగించారు. పంచదారను అమెరికా, ఇతర దేశాలకు ఎగుమతి చేశారు.ఆరుదశాబ్దాల క్రితం విప్లవం తరువాత ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. అనివార్య పరిస్ధితులలో అంతకు ముందు మాదిరే పంచదారను తయారు చేసి అమెరికా బదులు సోవియట్‌, ఇతర దాని మిత్ర దేశాలకు ఎగుమతి చేశారు. సోవియట్‌ కూలిపోయిన తరువాత 1990-94 మధ్య వ్యవసాయ వుత్పత్తి గణనీయంగా పడిపోయింది. పెద్ద క్షేత్రాలలో యంత్రాలతో వ్యవసాయం చేసే స్ధితి లేదు. చిన్న రైతాంగం వాటిని నిర్వహించలేరు. అమెరికా దిగ్బంధం మరింత పెరిగింది. ఆహార వినియోగం తగ్గి సగటున ప్రతి ఒక్కరు పది కిలోల వరకు బరువు తగ్గారు. ఈ పూర్వరంగంలో ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ క్షేత్రాల యాజమాన్య పద్దతులను మార్చింది. స్వతంత్ర సహకార క్షేత్రాలతో పాటు ప్రయివేటు క్షేత్రాలను కూడా అనుమతించింది. స్వతంత్ర వ్యవసాయ క్షేత్రాలు వేటిని వుత్పత్తి చేయాలో నిర్ణయించుకొనే స్వేచ్చ ఇచ్చింది. అయితే వుత్పత్తులను నిర్ణీత ధరలకు ప్రభుత్వానికి విక్రయించాల్సి వుంటుంది. ఇప్పుడు 70శాతం మేరకు ప్రయివేటు క్షేత్రాలలో వుత్పత్తి అవుతోంది. వుత్పత్తిలో 80శాతం ప్రభుత్వానికి, మిగిలినదానిని ప్రయివేటుగా విక్రయించుకోవచ్చు. ఇటీవల చేసిన మార్పుల ప్రకారం 35లక్షల ఎకరాల మేర ప్రభుత్వ భూమిని కమతాలుగా విభజించి వుచితంగా రైతులకు కౌలుకు ఇచ్చారు. దానిని వారి వారసులకు బదలాయించే వీలు కల్పించారు. స్ధానిక కమిటీలకు వుత్పత్తి విషయాలలో స్వయంప్రతిపత్తి, అధికారాలను ఎక్కువగా కల్పించారు. ప్రయివేటు సహకార సంస్ధలు కూడా ఇప్పుడు ఆహారపంపిణీలో భాగస్వాములు కావచ్చు. ఇన్ని చేసినప్పటికీ దేశంలో ఆహార సమస్య వుంది.

వుష్ణమండల పర్యావరణంలో తెగుళ్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఇతర వ్యాధులు ఎక్కువే.భూ సారం, మంచినీటి నిర్వహణ కూడా అంతతేలిక కాదు. చిన్న, పెద్ద పట్టణ ప్రాంతాలలో అందుబాటులో వున్న ప్రతి నేలలో సేంద్రీయ పద్దతిలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు.గణనీయ భాగం ఇక్కడ వుత్పత్తి అవుతోంది. ఒకే పంటకు బదులు బహుళ పంటల సాగును ప్రోత్సహించారు. పంటలు ఆరోగ్యంగా పెరిగేందుకు సహజ పద్దతులను అనుసరించారు. పరపరాగ సంపర్కాన్ని జరిపే కీటకాలను ఆకర్షించేందుకు బంతిపూలను వినియోగించారు.నత్రజని వున్న బీన్స్‌ను సేంద్రియ ఎరువుగా వుపయోగించారు. హానికారక క్రిమి, కీటకాలను దూరంగా వుంచేందుకు మిత్ర కీటకాలను ప్రయోగించారు. పోషక పదార్ధాలున్న కంపోస్టును పెద్ద ఎత్తున తయారు చేశారు. 1988లో వినియోగించిన రసాయనాలలో నాలుగోవంతుతోనే 2007లో మరింత ఆహారాన్ని వుత్పత్తి చేయటం నిజమైన వ్యవసాయ విజయమే. గత కొద్ది సంవత్సరాలలో మారిన పరిస్ధితులలో వెనెజులా రసాయన ఎరువులను పంపుతోంది. దాంతో సేంద్రీయ వ్యవసాయం ఎందుకు అనే అభిప్రాయం కూడా కొంత మందిలో తలెత్తింది. వాటితో పని లేకుండానే గణనీయ విజయాలు సాధించినపుడు తిరిగి వెనుకటి కాలానికి వెళ్లటం ఎందుకు అనేవారు కూడా గణనీయంగా వున్నారు. ప్రభుత్వ వుద్యోగాల ద్వారా వచ్చే ఆదాయం కంటే ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో పట్టణ ప్రాంతాలలో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం నాలుగు రెట్లు ఎక్కువగా వుండటంతో అనేక మంది వుద్యోగాలకు రాజీనామా చేసి వ్యవసాయానికి పూనుకున్నారు.

Image result for cuba organic agriculture

సేంద్రియ వ్యవసాయ పద్దతి క్యూబన్ల కడుపు నింపుతుందా అన్నది ఒక ప్రశ్న. గత్యంతరం లేని స్ధితిలో ఏటికి ఎదురీదినట్లుగా సోషలిస్టు చైతన్యంతో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జనం సేంద్రీయ పద్దతుల్లో చిన్నతరహా కమతాలలో సాగు చేస్తూ అనేక దేశాలకు తమ అనుభవాలను పంచుతున్నారంటే అతిశయోక్తి కాదు. అనేక మందికి చెరకు తోటలు, పంచదార ఫ్యాక్టరీల్లో పని చేయటం తప్ప మరొకటి రాదు అలాంటి వారు నేడు ఇతర వుత్పాదక రంగంలో భాగస్వాములు అవుతున్నారు. క్యూబా ప్రస్తుతం మొక్క జన్నలను బ్రెజిల్‌, బియ్యాన్ని వియత్నాం, రొట్టెలను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. పట్టణాలలో పెరటి తోటలు, ఇండ్లపైన కోళ్ల పెంపకం వంటివి గతంలో వుండేవి. ఇప్పుడు పాడుపడిన పట్ణణ, పంచదార ఫ్యాక్టరీల ప్రాంతాలలో కూరగాయలు, పండ్లవంటి వాటిని ఎక్కడ ఖాళీ వుంటే అక్కడ సాగు చేస్తున్నారు. క్యూబాను సందర్శించే పర్యాటకులకు కొన్ని చోట్ల అవి దర్శనీయ స్ధలాలుగా మారాయంటే అతిశయోక్తి కాదు. తాము సాధించిన విజయాల గురించి క్యూబన్లు అతిశయోక్తులు చెప్పుకోవటం లేదు. ‘ సేంద్రీయ వ్యవసాయం పెద్ద మొత్తాలలో దిగుబడులు సాధించటానికి తోడ్పడదు, మా సమస్యలన్నింటినీ పరిష్కరించదు, కానీ అనేక సమస్యలను అది పరిష్కరించింది. అసలు ఆ పద్దతిని ప్రారంభించటమే ప్రాధాన్యత సంతరించుకుంది. దడాలున తగిలిన దెబ్బ వాస్తవం నుంచి తేరుకొనేందుకు పర్యావరణ వ్యవసాయ సాగు తలెత్తింది.సోవియట్‌ కూలిపోవటమే ఆ వాస్తవం, ఆ రోజులు ఎంతో కష్టమైనవి, ఏదో విధంగా ఎక్కడో ఒక చోట ఆహారాన్ని వుత్పత్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడింది ‘ అని వ్యవసాయ శాఖ అధికారి జాన్‌ జోస్‌ లియోన్‌ చెప్పారు. సేంద్రీయ సాగు అంటే పాటించాల్సిన ప్రమాణాలేమిటో తెలియదు, స్ధానికంగా పండిన దానిని సాగు చేయటమే సోషలిస్టు క్యూబా భవిష్యత్‌ అవసరం అని కొందరు భావిస్తే మరి కొందరు పుదీనా వంటి అమెరికా, ఐరోపా మార్కెట్లకు అవసరమైనవి సాగు చేసే అవకాశంగా కొందరు భావించారు. మొత్తంగా సాగు మీద ఆసక్తిని కలిగించటంలో ప్రభుత్వం జయప్రదమైంది. ప్రభుత్వం కేటాయించిన భూమిలో సేంద్రీయ వ్యవసాయమే చేయాలి, ఫలానా పంటలనే పండించాలనే నిబంధనలేమీ పెట్టలేదు. స్ధానిక వ్యవసాయ పద్దతులను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని రూపొందించింది, ప్రభుత్వ మార్గదర్శనం, సంస్ధాగత నియంత్రణ, సోషలిస్టు చైతన్యంతో పాటు ఈ కార్యక్రమానికి సానుభూతిపరులైన విదేశీయుల సాయం కూడా తీసుకున్నారు. కెనడా, ఐరోపా యూనియన్‌కు చెందిన అనేక ధార్మిక సంస్ధలు పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చాయి. ఈ కార్యక్రమం, సహకారంలో భాగంగా సేంద్రియ సాగు మెళకువలు, నాణ్యమైన విత్తనాల అందచేత, వుత్పిత్తి విక్రయాలకు కొనుగోలుదార్లతో సంబంధాలను ఏర్పాటు చేయటం వంటి అంశాలున్నాయి.

సాధించిన విజయాలతో పాటు సేంద్రియ సాగుతో క్యూబన్‌ రైతులు సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. ఆశించిన స్ధాయిలో ఆహార వుత్పత్తి పెరగటం లేదు. దిగుబడులు తక్కువగా వుంటున్నాయి. దశాబ్దం క్రితం నామ మాత్రంగా వున్న వుత్పత్తి ఇప్పుడు మొత్తం వుత్పత్తిలో 20శాతం వరకు సేంద్రియ సాగు వాటా వుంది. ‘విదేశాల్లో వున్నవారు నిరంతర వ్యవసాయం సాగించే ఒక స్వర్గంగా మమ్మల్ని చూస్తున్నారు. మేము అలా అనుకోవటం లేదు. ఒక చెడు వ్యవసాయ పద్దతి నుంచి బయటపడుతూ అంతకంటే మెరుగైన దానిని అనుసరిస్తున్నాము అని హవానా జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేస్తున్న మైకేల్‌ మార్కెవెజ్‌ వ్యాఖ్యానించాడు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పరిహాసం పాలైన జలంధర్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ !

11 Friday Jan 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Science

≈ Leave a comment

Tags

Indian Science Congress (ISC), pseudo-scientific beliefs, science congress 2019, scientific temper, unscientific statements

Image result for science congress 2019

ఎం కోటేశ్వరరావు

పరస్పర విరుద్దశక్తులు నిరంతరం పని చేస్తూనే వుంటాయి. ఒకటి వెనక్కు లాగుతుంటే మరొకటి ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తుంది. ఈ పోరులో ఇప్పటి వరకు జరిగిన చరిత్ర అంతా మొత్తం మీద పురోగామి శక్తుల విజయమే. అయినా సరే ఎప్పటికప్పుడు తిరోగామి శక్తులు తమ పని తాము చేస్తూనే వుంటాయి. జనవరి మూడు నుంచి ఏడవ తేదీ వరకు పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన భారత సైన్స్‌ కాంగ్రెస్‌ 106వ సమావేశాలలో కూడా జరిగింది అదే. అక్కడ చేసిన కొన్ని వుపన్యాసాలు, సమర్పించిన పత్రాలు ప్రపంచంలో మనల్ని నగుబాట్లపాలు చేశాయి. ప్రపంచ మీడియా వీటి గురించి బహుళ ప్రచారమిచ్చింది.రెండు సంవత్సరాల క్రితం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన బయాలజిస్ట్‌, నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన వి రామకృష్ణన్‌ తాను హాజరైన సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశంలో సైన్సు గురించి చర్చించింది తక్కువని తానింకోసారి ఇలాంటి సమావేశాలకు హాజరు కానని చెప్పిన మాటలు ఇంకా మన చెవుల్లో గింగురు మంటున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా సదరు వుపన్యాసాలను అడ్డుకొనేందుకు ప్రయత్నించలేదు. గత మూడు సమావేశాలలోనూ జరిగింది అదే. తాజా సమావేశాలు భవిష్యత్‌ భారత్‌ : శాస్త్రము, సాంకేతికము అనే ఇతివృత్తంగా జరిగాయి. ఆందోళనకరమైన అంశం ఏమంటే గత సమావేశాల అనుభవాలను చూసి అలాంటి శక్తులు ఆ వేదికను వుపయోగించుకోవటాన్ని అడ్డుకొనేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. అశాస్త్రీయ విషయాలను నిరూపిత అంశాలుగా చిత్రిస్తున్న వారిని ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సమావేశాలలో నిలదీసి ప్రశ్నించకపోవటం మన శాస్త్రవేత్తల భావదారిద్య్రానికి నిదర్శనమా ! లేక తాము నమ్మిన, పరిశోధించిన అంశాలమీదే అపనమ్మకమా ? రెండూ ప్రమాదకరమే !

న్యూటన్‌ పుట్టక ముందే గురుత్వాకర్షణ శక్తి వుంది, డార్విన్‌ తాను చెప్పిన పరిణామ క్రమంలో భాగంగానే ఒక మానవుడిగా పుట్టాడు. వాటిని ఒక శాస్త్రీయ పద్దతిలో వివరించటమే వారు చేసింది. ఆ రంగాలలో నిష్ణాతులైన వారు వాటిని అంగీకరించారు. అవి ప్రపంచం ముందుకు వచ్చినపుడు ఏ వేద లేదా సంస్కృత పండితుడు అవన్నీ తమకు ఎప్పుడో తెలుసని సవాలు చేసిన వారుగానీ, వివరించిన వారు గానీ లేరు. రాబోయే రోజుల్లో ఎవరైనా ఆ సిద్ధాంతాలు తప్పని ఆధారాలతో నిరూపిస్తే ఆ నూతన సిద్ధాంతాలను సమాజం అంగీకరిస్తుంది, అనుకరిస్తుంది. అదేమీ లేకుండా ఫలానా సిద్దాంతాన్ని నేను తప్పు అంటున్నాను, లేకపోతే ఇవన్నీ వేదాల్లోనే వున్నాయనో పిచ్చివారెవరైనా చెబితే శాస్త్రవేత్తలు ప్రశ్నించలేకపోవటం నిజంగా మన దౌర్భాగ్యం కదూ ! ఇతర దేశాలతో పోటీపడి మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అందరూ కోరుకుంటారు. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సభలు జరుగుతున్నాయంటే ఆ రంగంలో మన పురోగతి, సాధించిన విజయాలను సమాజం ముందుంచి శాస్త్రవిషయాల పట్ల భావిభారత పౌరుల్లో ఆసక్తికలిగించాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్నదేమిటి? దానికంటే ఆశాస్త్రీయ విషయాలను ముందుకు తెచ్చి వేదాల్లో అన్నీ వున్నాయష అనే రోజుల్లోకి తీసుకుపోతున్నారు. నిజానికి ఇదొక మానసిక వ్యాధి లక్షణంలా వుంది. ప్రతి సమాజం ఘనమైన గతంతో పాటు సిగ్గుపడాల్సిన అంశాలను కూడా కలిగి వుంటుంది. గత సమాజాల్లో అంతా ఘనతే వుంటే జనం మార్పులను ఎందుకు కోరుకున్నట్లు ?

జలంధర్‌ సైన్స్‌ సభల్లో కొందరు చేసిన ప్రవచన అంశాలు దేశాన్ని వెనక్కు తీసుకుపోయేవిగా వున్నాయి. అవేమిటో సంక్షిప్తంగా చూద్ధాం. మహాభారత కాలం నాటికే మన దేశంలో బడ్డు తాడు కణాల పరిశోధన వుంది, వంద కుండల్లో వంద అండాలను పెట్టి కౌరవులను పుట్టించారు, ఇది టెస్ట్‌ ట్యూబ్‌ పిల్లల పరిజ్ఞానం కాదా అంటూ ఆంధ్రావిశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ జి నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ పేరుమోసిన విద్యావేత్త మేధస్సు అంతవరకే పరిమితం కాలేదు, రావణుడికి ఎందరు ఎక్కినా ఒకరికి ఖాళీ వుండే పుష్పక విమానం వుండటమే కాదు, లంకలో ఇరవైనాలుగు చిన్నా పెద్ద విమానాలు, ఎన్నో విమానాశ్రయాలు వుండేవని, సైనిక అవసరాలకువిమానాలను వాడారని కూడా రామాయణం చదివితే మనకు తెలుస్తుందని కూడా సెలవిచ్చారు. అంతేనా చార్లెస్‌ డార్విన్‌ పరిణామ సిద్ధాంతం కంటే ముందే దాని గురించి మనకు తెలుసని డార్విన్‌ చెప్పినదాని ప్రకారం తొలి జీవి నీటి నుంచి ప్రారంభమైందని దశావతారాల్లో మత్స్యావతారం మొదటిదని అంటే దశావతారాలు పరిణామ సిద్దాంతమని కూడా నాగేశ్వరరావు చెప్పారు. విష్ణువు దగ్గర లక్ష్యాన్ని చేధించి తిరిగి వచ్చే నియంత్రిత క్షిపణుల మాదిరి శంఖుచక్రం వుందని కూడా చెప్పారు.

రావణుడి గురించి చెప్పిన రావుగారు రాముడి విమానాల గురించి చెప్పలేదు. పురాణాల ప్రకారం సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాల్లో రకరకాల విమానాలున్నాయి. వాటిలో ఎక్కువ భాగం మానసిక శక్తితోనే నడిచాయి. అలాంటపుడు రాముడికి విమానాలెందుకు లేవు, అడవులకు రధాల మీద, నదులు దాటేందుకు పడవలు ఎందుకు ఎక్కారు. విమానాల మీద పోవచ్చు కదా ! రావణుడు అడవిలోని సీతను అపహరించేందుకు రధంలో వచ్చాడు, సీతను రధంలో ఎక్కించుకొని పోయి సముద్రాన్ని ఎలా దాటాడు, రధాన్ని ఎక్కడ వుంచాడు, సముద్ర ప్రయాణానికి ఓడను వుపయోగించాడా ? విష్ణుమూర్తి అవతారంగా చెబుతున్న రాముడి దగ్గర నియంత్రిత క్షిపణి శంఖుచక్రం బదులు విల్లు, బాణాలు ఎందుకున్నాయి, విమానాలు ఎందుకు లేవు? లంకను చేరుకొనేందుకు రాముడి దగ్గర ఓడలు కూడా లేవా, వుంటే వానర సైన్య సాయంతో వారధిని ఎందుకు కట్టించినట్లు ? రావణుడిని సంహరించేందుకు క్షిపణి ప్రయోగం ఎందుకు చేయలేదు. హనుమంతుడు లంకా దహనం చేశాడని రాశారు తప్ప రావణుడి దగ్గర వున్న పుష్పక విమానాన్ని, ఇతర విమానాలను, లంకలోని విమానాశ్రయాలను దహనం చేయలేదా, వానర లేదా రాముడి సేనలపై రావణుడు వైమానిక దాడులు ఎందుకు చేయలేదు, రావణుడిని వధించిన తరువాత రాముడు ఆ విమానాలను స్వాధీనం చేసుకోలేదా ? ఆ తరువాత ఆ విమానాలు, క్షిపణులు ఏమయ్యాయి అనే ప్రశ్నలకు కూడా వైస్‌ ఛాన్సలర్‌గారు సమాధానాలు చెప్పాల్సి వుంది. మన వేదాలు లేదా సంస్కృత గ్రంధాలను పరదేశీయులు అపహరించారు, వాటి ఆధారంగా నూతన అవిష్కరణలు చేశారు అని చెబుతారు. ఇలాంటి కాకమ్మ కధలు వినటానికి వీనుల వింపుగా వుంటాయి. మనమెందుకు చేయలేదు ? ఇలాంటివి ఇంకా చాలా వున్నాయి.

Image result for science congress 2019,protests

సమస్య ఏమంటే మన శాస్త్రవేత్తలు ఇలాంటి ప్రచారాన్ని ఖండిస్తూ ఎందుకు ముందుకు రావటం లేదు. వేదికలపై ఎందుకు అనుమతిస్తున్నారు. దీనికి ప్రధానంగా ఒకటి కనిపిస్తోంది. ప్రభుత్వం సైన్స్‌ కాంగ్రెస్‌ వంటి వాటికి ధన, ఇతర రూపాలలో కొంత సాయం చేస్తున్నది. వాటిని ప్రారంభిస్తున్న ప్రధాని, కేంద్ర మంత్రులు స్వయంగా ఇలాంటి అశాస్త్రీయ విషయాలను తమ సందేశాలలోవెల్లడిస్తున్నారు. అందువలన వారికి లేదా వారి దివాలాకోరు భావజాలానికి వ్యతిరేకత వ్యక్తం చేస్తే సాయం ఆగిపోవచ్చు, నిర్వాహకుల వుద్యోగాలకు ముప్పు రావచ్చు, ప్రమోషన్లు ఆగిపోవచ్చు, అలాంటపుడు ఎవరేమి చెబితే మన కెందుకు అనే దిగజారుడుతనం తప్ప మరొకటి కనిపించటం లేదు. వినాయకుడికి ఏనుగు తల అతికించటాన్ని బట్టి మనకు గతంలోనే ప్లాస్టిక్‌ సర్జరీ తెలుసుని సాక్షాతూత ప్రధాని నరేంద్రమోడీయే చెప్పిన తరువాత గతంలో ఒక సైన్స్‌ కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఆల్జీబ్రా, పైధాగరస్‌ సిద్ధాంతాలను ప్రపంచానికి భారత్‌ ఇచ్చిందని చెప్పటంలో ఆశ్చర్యం ఏముంది. ముంబై విశ్వవిద్యాలయ సంస్కృత విభాగ అధిపతి గౌరీ మహులీకర్‌ ఒక పత్రికలో రాసిన వ్యాసంలో జామెట్రిక్‌ ఫార్ములా గురించి క్రీస్తుకు పూర్వం 800 సంవత్సరాల క్రితమే సులభ సూత్ర అనే గ్రంధంలో బౌధాయన రాశాడని వాటినే పైథాగరస్‌ సిద్దాంతం అంటున్నామని ఆ పెద్దమనిషి పేర్కొన్నాడు. ఏడు వేల సంవత్సరాల క్రితమే భరద్వాజ మహర్షి విమానాల గురించి రాశాడని యుద్ధాలకు వుపయోగించే వాటిలో ఒక్కోదానికి 30 ఇంజన్లు వుండేవని, అవి ఎటు కావాలంటే అటు తిరిగి, ఎగిరేవని కెప్టెన్‌ ఆనంద్‌ జె బోడాస్‌ చెప్పాడు. కిరణ్‌ నాయక్‌ అనే మరో పెద్దమనిషి అయితే మహాభారత యుద్ధకాలంలో విమానాలతో యుద్ధం చేసిన వారు తలకు హెల్మెట్లు వాడారని నేను చెప్పేది నమ్మకపోయినా అలాంటి ఒక హెల్మెట్‌ను నాసా కనుగొన్నదని కావాలంటే గూగుల్‌లో తెలుసుకోవచ్చని పేర్కొన్నాడు. ఇలాంటి చెత్తను సమర్ధించుకోవటానికి నాసా పేరును వుపయోగించుకోవటం ఒక ఫ్యాషన్‌గా మారింది.తాజా సమావేశాలలో శాస్త్రవేత్తను అని చెప్పుకొన్న కెజె కృష్ణన్‌ అనే వ్యక్తి న్యూటన్‌, ఐనిస్టీన్‌లకు పెద్దగా భౌతిక శాస్త్రం గురించి తెలియదని, ప్రపంచాన్ని మోసం చేశారంటూ తాను చెప్పేదాన్ని అంగీకరిస్తే భవిష్యత్‌కు మరింత వుపయోగమన్నాడు. ఇప్పుడు ప్రపంచానికంతకూ తెలిసిన గురుత్వాకర్షణ తరంగాలకు నరేంద్రమోడీ తరంగాలని పేరు పెట్టాలని, గురుత్వాకర్షక కాంతికి హర్షవర్దన్‌(కేంద్రమంత్రి) పేరు పెట్టాలని ఒక శాస్త్రవేత్తకు వుండకూడని తన లక్షణాన్ని చక్కగా బయట పెట్టాడు. ఏ శాస్త్రవేత్తయినా కొత్త సిద్ధాంతం లేదా పద్దతిని కనిపెడితే అనేక సందర్భాలలో అతను లేదా ఆమె పేరు పెడతారు. ఈ పెద్దమనిషి ఎలాగూ తనను శాస్త్రలోకం ఆమోదించదు కనుక గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లుగా మోడీ, హర్షవర్ధన్‌ పేర్లు పెట్టాలని కోరాడు. అబ్దుల్‌ కలాం కంటే భవిష్యత్‌లో కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ పెద్ద శాస్త్రవేత్త అవుతారని కృష్ణన్‌ సెలవిచ్చాడు. కొంత మంది అతితెలివి గల వారు సంస్కృత అనువాదాలు కాదు అసలు రాతలను చదివితేనే వాటిలో చెప్పిన సిద్ధాంతాలను వెలికి తీయవచ్చునని వాదిస్తారు. ఎవరు వద్దన్నారు ? పాలకులకు ఇలాంటి విషయాలు ఇష్టంగా వున్నట్లు గమనించిన తరువాత ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి మెప్పించర సుమతీ అన్నట్లు చెప్పేవారు తయారైతే అదుపు చేయాల్సిన వారు కూడా మన కెందుకులే అని వూరుకుంటున్నారు.

సైన్స్‌ కాంగ్రెస్‌లో అశాస్త్రీయ ప్రకటనలు చేయటాన్ని సభకు హాజరైన వారు ఖండించకపోయినా బెంగళూరులో కొందరు శాస్త్రవేత్తలైనా నిరసించి పరువు కాపాడారు. ఇదేమాత్రం చాలదు. వివిధ సంస్ధలకు చెందిన వున్నతాధికారులేమి చేస్తున్నారు. సైన్స్‌ కాంగ్రెస్‌ అజెండా నిర్ణయంలో ప్రభుత్వానికేమీ పాత్ర వుండదని ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు కె విజయ రాఘవన్‌ చెప్పారు. అంధ్రవిశ్వవిద్యా లయ వైస్‌ ఛాన్సలర్‌ నాగే శ్వరరావు చెప్పిన అంశాలను విమర్శిస్తూ అతని మీద ఒక ఫిర్యాదును దాఖలు చేయాలన్నారు. ఒక ప్రముఖ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా వున్న బయాలజిస్ట్‌ నాగేశ్వరరావు చెత్త మాట్లాడుతున్నపుడు శాస్త్రవేత్తల్లో వేడి పుట్టాలని అన్నారు. నాగేశ ్వరరావు, కృష్ణన్‌ మాట్లాడిన అంశాలు అపహాస్యం పాలుగావటంతో వాటితో తమకేమీ సంబంధం లేదని సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రేమేందు పి మాధుర్‌ ప్రకటించారు. తదుపరి తమ సమావేశాల్లో ప్రసంగించే వారికి సంబంధించి నిబంధనలు సవరించనున్నామని, వారేమి మాట్లాడేది తెలుసుకొని, ఇతర విషయాలు మాట్లాడబోమనే హామీలు తీసుకొని సరైన వారిని ఎంపిక చేస్తామని చెప్పారు. తానే గనుక ప్రసంగ సమయంలో అక్కడ వుండి వుంటే ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించేవాడినని, ఆధారం చూపమని కోరి వుండే వాడినని అన్నారు. సైన్స్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మనోజ్‌ చక్రవర్తి విలేకర్లతో మాట్లాడుతూ నాగేశ్వరరావు మాటలతో తాను దిగ్భ్రాంతి చెందానని, అతనికి ఈ విషయాలు ఎలా తెలుసు, ఏదైనా ఆధారం వున్నదా, శాస్త్ర సమాజం దిగ్భ్రాంతి చెందింది అని వ్యాఖ్యానించారు. తాము కొల్‌కతా వెళ్లిన తరువాత అతను చేసిన ప్రసంగాన్ని ఖండిస్తూ లాంఛనంగా ఒక ప్రకటన చేస్తామని వెల్లడించారు. ఈ ప్రకటనలతో వైస్‌ ఛాన్సలర్‌ నాగేశ్వరరావుకు ఏమైనా పరువు ప్రతిష్టలుంటే పదవి నుంచి తప్పుకొని వుండాల్సింది.

ఇలాంటి చెత్త మాట్లాడేవారి గురించి సైన్స్‌ కాంగ్రెస్‌ పెద్దలకు గతంలో ఫిర్యాదులు అందలేదా అంటే మూడు సంవత్సరాల క్రితమే ముంబై సమావేశం తరువాత తాము ఆందోళన చెందుతున్న అంశాల గురించి సైన్స్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశామని బెంగళూరుకు చెందిన బ్రేక్‌ త్రూ సైన్స్‌ సొసైటీ కార్యదర్శి కెఎస్‌ రజని చెప్పారు. తరువాత మైసూరు, తిరుపతి, ఇపుడు జలంధర్‌లో అదే పునశ్చరణ అయిందని, ఇలాంటి వాటిని ఎలా అనుమతిస్తున్నారని జనం నిర్వాహకులను నిలదీయాలని అన్నారు. ప్రముఖ రసాయన శాస్త్ర ప్రొఫెసర్‌ సిఎఆర్‌ రావు మాట్లాడుతూ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలకు తాను రావటం లేదని, వస్తే ఇలాంటి ప్రకటనలను ఆమోదించినట్లు అవుతుందని అన్నారు.

గత పాతిక సంవత్సరాలుగా డైనోసార్లపై పరిశోధనలు జరుపుతున్నట్లు చెప్పుకుంటున్న పంజాబ్‌ విశ్వవిద్యాలయ జియాలజిస్టు అషు ఖోస్లా ఈ సమావేశాలకు సమర్పించిన ఒక పత్రంలో బ్రహ్మ ఒక పెద్ద శాస్త్రవేత్త అని, డైనోసార్ల గురించి వేదాల్లో ప్రస్తావన వుందని, అసలు వాటికా పేరు మన సంస్కృతం నుంచే వచ్చిందన్నారు. భారతీయ డైనోసార్‌ అస్దికలను తమ బృందం గుజరాత్‌లోని ఖేదా జిల్లాలో కనుగొన్నదని చెప్పారు. నిజంగానే కనుగొని వుండవచ్చు, కానీ బ్రహ్మ పెద్ద శాస్త్రవేత్త, ఈలోక సృష్టికర్త, ఆయనకు డైనోసార్ల గురించి తెలుసు అని చెప్పిన మాటలతో అతని పరిశోధనను అనుమానించాల్సి వస్తోంది.

https://vedikapress.files.wordpress.com/2019/01/ff809-1465846477930.png

ప్రపంచం మీద ప్రభావం చూపిన నాలుగువేల మంది శాస్త్రవేత్తలలో భారతీయులు కేవలం పది మందే అన్నది టెక్‌2 న్యూస్‌ విశ్లేషణ. ప్రతి ఏటా ప్రపంచవ్యాపితంగా ఎక్కువగా వుటంకించిన శాస్త్రవేత్తల జాబితాను క్లారివేట్‌ అనలిటిక్స్‌ అనే సంస్ధ గత ఐదు సంవత్సరాలుగా ప్రచురిస్తున్నది.2018 జాబితాలో పేర్కొన్న పది మందిలో సిఎన్‌ఆర్‌ రావు (ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, బెంగళూరు),దినేష్‌ మోహన్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌), రాజీవ్‌ వర్షనే (వ్యవసాయ శాస్త్రవేత్త, ఇక్రిశాట్‌), అశోక్‌ పాండే, టాక్సికాలజీ పరిశోధకులు, అవినిష్‌ అగర్వాల్‌, అలోక్‌ మిట్టల్‌, జ్యోతి మిట్టల్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సు), రజనిష్‌ కుమార్‌(కెమికల్‌ ఇంజనీరింగ్‌), సంజీవ్‌ సాహు(నానో టెక్నాలజీ), శక్తివేల్‌ రత్నస్వామి(కంప్యుటేషనల్‌ మాథమాటిక్స్‌). నాలుగువేల మంది శాస్త్రవేత్తలు 60దేశాలకు చెందిన వారు. వీరిలో 80శాతం మంది కేవలం పదిదేశాలకు చెందిన వారైతే 70శాతం ఐదుదే శాల నుంచి వున్నారు. దేశాల రీత్యా అమెరికా 2,639,బ్రిటన్‌ 546, చైనా 482, భారత్‌ 10 మంది వున్నారు. సంస్ధల రీత్యా హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం 186మందితో అగ్రస్ధానంలో వుంది. ఒకే అంశం మీద పరిశోధన చేసే వారినే గతంలో జాబితాలో చేర్చగా ఈ ఏడాది వివిధ రంగాలలో పని చేస్తున్నవారికి చోటు కల్పించటంతో మన సంఖ్య పదికి చేరిందట. పదిహేను సంవత్సరాల క్రితం చైనా-భారత్‌ ఒకే స్దాయిలో వుండేవి, ఇప్పుడు ప్రపంచ శాస్త్ర పరిశోధన ఫలితాల్లో చైనా 15-16 శాతం సమకూర్చుతుండగా మన దేశ వాటా నాలుగు శాతమే అని సిఎన్‌ఆర్‌ రావు చెప్పారు. సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాలు దీనికి దోహదం చేసే అంశాలలో వున్నాయి. ఇవిగాక పారిశ్రామిక భాగస్వామ్యాలు, పెట్టుబడులు కూడా ప్రభావం చూపుతాయి.

పురాతన భారత దేశం వేదాలకే కాదు, వాటి ప్రామాణ్యతను ప్రశ్నించిన చార్వాకులకు కూడా నిలయమే. ప్రపంచంలో ప్రతి మతం తాను ప్రవచించిన దానిని వ్యతిరేకించిన లేదా ప్రశ్నించిన వారిని నాశనం చేసింది. దానికి మన దేశం మినహాయింపు కాదు.వేదాలను లేదా వాటిలో చెప్పిన అంశాల ప్రాతిపదికగా వున్న నాటి మతం, దాన్ని ఆశ్రయించిన నాటి పాలకులు చార్వాకులను భౌతికంగా అంతం చేయటమే కాదు, వారి రచనలను కూడా నాశనం చేశారు. విమర్శిస్తూ రాసిన వారి రచనల నుంచే చార్వాకులు ఏమి చెప్పారనేది మనకు తెలుస్తున్నది. ప్రత్యక్ష ప్రమాణం ప్రాతిపాదికగా వారు వ్యవహరించారన్నది స్పష్టం. చార్వాకులు లేదా లోకాయతుల అణచివేత తరువాత కాలంలో ఆ దృష్టి మన సమాజంలో కొరవడింది. చివరకు అది బ్రాహ్మలు మాత్రమే వేదాలు చదవాలి. క్షత్రియుడు మాత్రమే కత్తి పట్టాలి. శూద్రులు వ్యవసాయమే చేయాలి. పంచములు వూరికి దూరంగా వుండాలి. స్త్రీలు ఏ సామాజిక తరగతిలో వున్నా వారికి స్వాతంత్య్రం లేదు. చదువు అవసరం లేదు. సముద్ర ప్రయాణాలు చేసిన వారికి ప్రోత్సాహం సంగతటుంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనేదాకా పోయింది. ఇలా సమాజంలో అనేక బంధనాలు, ఆటంకాలను సృష్టించిన సమాజం కొన్ని వందల, వేల సంవత్సరాలు కొనసాగిన కారణంగా మన జనంలో శాస్త్ర స్పృహ అడుగంటింది. కుల వృత్తికి సాటిరాదు గువ్వల చెన్నా అన్నట్లుగా ఎదుగూబదుగూ లేకుండా సాగింది.

ప్రతి సమాజం అనేక వూహలకు నిలయమైంది. వాస్తవంతో పని లేకుండా వూహలతో నిండిన సాహిత్యాన్ని సృష్టించారు. అందుకు మన దేశం మినహాయింపు కాదు. వాటినే ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ నుంచి వైస్‌ ఛాన్సలర్‌ నాగేశ్వరరావు వంటి వారి వరకు అనేక మంది పురాతన శాస్త్రంగా చెప్పటమే కాదు, ఆధునిక ఆవిష్కరణలకు జోడించి చెబుతున్నారు. ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా మానవుడికి ఏనుగుకు పరిమాణంలో ఎంతో తేడా వుంటుంది. వినాయకుడికి అంత పెద్ద ఎనుగు తలను అతికిస్తే ఆ భారాన్ని ఎలా భరించేవాడు, దాన్ని వేసుకొని అతి చిన్న ఎలుకవాహనం మీద ఎలా ఎక్కేవాడు, అన్నింటికీ మించి ప్లాస్టిక్‌ సర్జరీ నిపుణులు వుంటే తెగిన వినాయకుడి తలనే ఎందుకు అతికించ కుండా, ఏనుగు తలను ఎందుకు తెచ్చారు, అంతకంటే చిన్న జంతువులు దొరకలేదా అనే సందేహాలు రానవసరం లేదా ?

ఆశాస్త్రీయ భావజాలాన్ని ప్రచారం చేస్తున్న పాలకులు, వారికి వంత పలికే కుహనా లేదా ఆత్మను చంపుకొని తాము చదివిన దానికి భిన్నంగా కుహనా శాస్త్ర అంశాలను చెప్పేవారిని ఎదిరించేందుకు ధైర్యం చేయని అశక్తులు అసలు సైన్సు సమావేశాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఇటు వంటి సమావేశాలే సమాజంలో సైన్సు పట్ల ఆసక్తి కలిగిస్తాయని చెప్పలేము గానీ ఇవొక అవకాశం. పరిశోధన, ప్రచారానికి తగిన నిధులు కేటాయించేందుకు రానురాను పాలకులు విముఖత చూపుతున్నారు. సమాజాన్ని తిరోగమనంలో నడపాలని చూసే వారికి శాస్త్రీయ, ప్రత్యామ్నాయ విధానాల అవగాహన పెరగటం ఏమాత్రం ఇష్టం వుండదు. పరిశోధన, అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించని దేశమూ, సమాజమూ ముందుకు పోయిన దాఖలా మనకు కనపడదు. యధారాజా తధా ప్రజ అన్నట్లు ఆ పని చేయని పాలకులు వున్నపుడు వారికి వంతపాడే మేథావులు కూడా ఇష్టగానాలు, నృత్యాలే చేస్తారు. జలంధర్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో జరిగింది అదే. ఇలాంటి ధోరణులను ప్రతిఘటించకపోతే రాబోయే సమావేశాల్లోనూ అదే పునరావృతం అవుతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఐరోపాలో ఆగని కార్మిక నిరసనలు, పచ్చి మితవాద పార్టీల ఐక్యతా యత్నాలు !

10 Thursday Jan 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

far-right alliances in Europe, rally in Belgrade against Serbian president, Slave Law in Hungary, Winter of discontent

హంగరీ ప్రదర్శనలు

ఎం కోటేశ్వరరావు

ఐరోపాలో ప్రస్తుతం భౌతికంగా చలి, రాజకీయంగా వేడి పోటీ పడుతున్నాయి.మే నెలలో ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. ఈ పూర్వరంగంలో పలు చోట్ల పెల్లుబుకుతున్న ఆందోళనలనల పట్ల ఎలా వ్యవహరించాలో పాలక పార్టీలకు దిక్కుతోచటం లేదు. పచ్చి మితవాదులు, నయా నాజీలు, ఫాసిస్టు శక్తుల ప్రభావం పెరుగుతోంది. ఫ్రాన్సులో పసుపు చొక్కాల ఆందోళనను చల్లబర్చేందుకు అధ్యక్షుడు మక్రాన్‌ కొన్ని రాయితీలు ప్రకటించినప్పటికీ ప్రతి శనివారం జరుగుతున్న నిరసన ప్రదర్శనలు ఐదవ తేదీన కూడా జరిగాయి. సోషలిజాన్ని కాలదన్నుకొని పెట్టుబడిదారీ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టిన దేశం హంగరీ. పూర్తి పరిహారం లేకుండా ఓవర్‌టైమ్‌ చేయటం లేదా చేసిన పనికి వెంటనే చెల్లింపులు చేయనవసరం లేకుండా వీలు కల్పిస్తూ పార్లమెంట్‌ ఆమోదించిన బిల్లును ‘బానిస చట్టం ‘గా వర్ణిస్తూ దానికి వ్యతిరేకంగా వేలాది మంది కార్మికులు వణికిస్తున్న చలిని కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిపారు. మరోపూర్వ సోషలిస్టు రాజ్యమైన సెర్బియాలో వరుసగా ఐదవ శనివారం ఐదవ తేదీన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ఇవి మచ్చుకు కొన్ని. గతానికి భిన్నంగా ఈ ఆందోళనల సందర్భంగా జనం తీవ్రంగా స్పందించటం ఒక ముఖ్యాంశం. అన్ని చోట్లా ఆందోళనల లక్షణాలు ఒకే విధంగా లేనప్పటికీ మొత్తం మీద చూసినపుడు జనాకర్షక వైఖరులు, ఆర్ధిక జాతీయవాదం ముందుకు వస్తున్నాయి. ఇవి విడివిడిగానూ, ఒకదానినొకటి ఆశ్రయించిగానీ వుంటాయి. ఈ వైఖరిని ఐరోపా యూనియన్‌ను బలహీనపరిచేందుకు దోహదం చేస్తుందన్నది కొందరి అంచనా. పది సంవత్సరాల క్రితం పెట్టుబడిదారీ ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపివేసి ఇప్పటికీ ప్రభావం చూపుతూ అందరికీ సుపరిచితమైన 2008 ఆర్ధిక సంక్షోభం పర్యవఐరోటసానాలే ఇవన్నీ అని చెప్పవచ్చు.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత స్ధూలంగా ఐరోపాలో సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీలు, మితవాద పార్టీలుగా రాజకీయ పక్షాలు వున్నాయి. గత పది సంవత్సరాలలో సాంప్రదాయ మితవాదం స్ధానే పచ్చిమితవాద శక్తులు పెరిగి పెద్దవి అవుతున్నాయి. గత పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ తాము నూతన ఐరోపాను నిర్మిస్తామనే ప్రజాకర్షక వాగ్దానాలు, వలస కార్మికులు ముఖ్యంగా ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే శక్తులు పెరుగుతున్నాయి. ముస్లిం తీవ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా నాయకత్వంలో పశ్చిమాసియా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యంలో ఐరోపా ప్రభుత్వాల మద్దతుతో దాడులు చేస్తున్న పూర్వరంగంలో ఐరోపాలోని మితవాద శక్తులలో ముస్లిం వ్యతిరేకత పెరగటంలో ఆశ్చర్యం లేదు. పదేండ్ల నాటి ఆర్ధిక సంక్షోభంతో వలస కార్మికుల రాక తమ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదనే భావం ఐరోపాలో కలుగుతున్నది.

కొన్ని దేశాలలో జరుగుతున్న పరిణామాలు కొన్నేండ్ల నాటి అరబ్బు వసంత కాల ఆందోళనలను పోలి వున్నాయన్నది కొందరి వర్ణన. సోవియట్‌ యూనియన్‌ మాదిరి ఆరు నుంచి 28 దేశాలకు విస్తరించిన ఐరోపా యూనియన్‌ కూడా ప్రజాకర్షక, ఆర్ధిక జాతీయవాదాలతో కూలిపోతుందా అని కూడా పరిపరివిధాల ఆలోచిస్తున్న వారు లేకపోలేదు. అనేక దేశాలలోని పరిణామాలు అంతర్గత రాజకీయ నాటకాల లక్షణాలను కూడా కలిగి వున్నాయి. వీటికి వలసల సమస్య వుమ్మడిగా వుంది. అమెరికా, రష్యాలు ఐరోపా రాజకీయవేదిక మీద ప్రధాన పాత్రధారులుగా వున్నాయి. ఐరోపా యూనియన్‌ వుమ్మడిగా రష్యాను వ్యతిరేకిస్తున్నది, అదే సమయంలో కొన్ని దేశాలు భిన్నవైఖరిని వ్యక్తం చేస్తున్నాయి. ఐరోపా యూనియన్‌ తమ శత్రువు అని డోనాల్డ్‌ ట్రంప్‌ వర్ణించిన అంశం కూడా తెలిసిందే. ఈ పరిణామాలు వాటి మధ్య వున్న అంతర్గత వైరుధ్యాలకు నిదర్శనం. పాలకవర్గాలు రాజీపడుతున్న కారణంగా ఒక కొత్త రూపాన్ని తీసుకొనే స్థితి ఇంకా రాలేదు. ఒక కూటమిగా ఐరోపా బతికి బట్టగలుగుతుందా అన్న సందేహాలు కూడా వెలువడుతున్నాయి.

2019వ సంవత్సరం ఐరోపాలో అనేక పరిణామాలు సంభవిస్తాయని జోశ్యాలు వెలువడుతున్నాయి. మార్చి 29 ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగనుంది. ఇటలీ ఆర్ధిక సంక్షోభం మరింత ముదరవచ్చు. మే నెలలో జరిగే ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికలలో మితవాద పార్టీలు మెజారిటీ సాధించటం లేదా దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయి.పూర్వపు యుగోస్లావియా నుంచి ప్రత్యేక దేశంగా ఆవిర్భవించిన సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ యుసిక్‌ నియంతృత్వ వైఖరికి వ్యతిరేకంగా వేలాది మంది గత ఐదు వారాలుగా ప్రతి శనివారం రాజధాని బెల్‌గ్రేడ్‌లో ప్రదర్శనలు జరుపుతున్నారు. నవంబరు నెలలో క్రుసెవాక్‌ పట్టణంలో ప్రతిపక్ష నేత బర్కొ స్టెఫానోవిస్‌ మీద దాడి చేసిన దుండగులు అధికారపక్షానికి చెందిన వారేనని ప్రతిపక్షాలు విమర్శించాయి.డిసెంబరు ఎనిమిది నుంచి జరుగుతున్న ప్రదర్శనల్లో విద్యార్ధులు, కళాకారుల వంటి అనేక మంది ప్రముఖులు భాగస్వాములౌతున్నారు. యాభై లక్షల మందిలో ఒకరిని అనే బ్యానర్‌ వెనుక ప్రదర్శనలు జరుపుతున్నారు. ఒక వేళ 50లక్షల మంది వీధుల్లోకి వచ్చినప్పటికీ తాను ప్రతిపక్షంతో మాట్లాడేది లేదని, జనంచెప్పేది వింటానంటూ అధ్యక్షుడు యుసిక్‌ జనాన్ని మరింతగా రెచ్చగొట్టాడు. ముఫ్పై ప్రతిపక్ష పార్టీలు, సంస్ధలు సెర్బియా కోసం కూటమి పేరుతో ప్రదర్శనలు జరుపుతున్నాయి.దేశం రోజు రోజుకూ నియంతృత్వంవైపు పయనిస్తున్నదని, ప్రజాస్వామిక వ్యవస్ధలను చిన్నచూపు చూస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మీడియాలో స్వేచ్చలేదు, జర్నలిస్టులకూ స్వేచ్చ లేదని, ఎన్నికలు కూడా స్వేచ్చగా జరిగే పరిస్ధితి లేదని విమర్శిస్తున్నాయి.

యాభై లక్షల మందిలో ఒకరిని అనే బ్యానర్‌ వెనుక ప్రదర్శనలు

ఏడాదికి నాలుగు వందల గంటల పాటు ఓవర్‌టైమ్‌ వర్క్‌ చేయాలన్న యజమానులకు అనుగుణంగా చట్టం చేసిన హంగరీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డిసెంబరులో ప్రారంభమైన నిరసనలు ఈనెలలో కూడా కొనసాగాయి. ఐదవ తేదీన జాతీయ సమ్మెకు పిలుపు నివ్వగా మరోసారి 19వ తేదీన నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. మెరుగైన వేతనాలు, సులువైన వుద్యోగ విరమణ విధానాన్ని కూడా వారు కోరుతున్నారు.అయితే ఈ ఆందోళనల వెనుక హంగేరియన్‌-అమెరికన్‌ బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ హస్తం వుందని, పెద్ద మొత్తంలో నిధులు అందచేసినట్లు హంగరీ ప్రభుత్వం ఆరోపించింది. వలసదారుల అనుకూల విధానాలను తాము అడ్డుకుంటున్న కారణంగానే ఇదంతా జరుగుతోందని పేర్కొన్నది. కార్మిక చట్టంతో సహా అనేకం నిరంకుశంగా వున్నాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. మరింత పని మరింత సంపాదన అనే ముసుగులో ఓవర్‌టైమ్‌ పరిమితిని ఏడాదికి 250 నుంచి 400గంటలకు పెంచటమే కాదు, పని చేసినందుకు వేతనం ఇంతకు ముందున్న చట్ట ప్రకారం ఏడాది లోపు ఎప్పుడైనా చెల్లించవచ్చు. తాజా చట్టంలో ఆ పరిమితిని మూడు సంవత్సరాలకు పెంచారు. కొన్ని సందర్భాలలో అదనపు వేతనం చెల్లించే అవకాశ ం లేకుండా చేశారు. ఇప్పటికే ఇరుగుపొరుగు దేశాలతో పోల్చితే పని గంటలు ఎక్కువ, వేతనాలు తక్కువగా వున్నాయి. హంగరీ నుంచి పెద్ద సంఖ్యలో విదేశాలకు వలసలు పోయిన కారణంగా స్ధానిక బహుళజాతి కంపెనీ ఫ్యాక్టరీలు, కార్యాలయాల్లో పనిచేసే కార్మికుల సంఖ్య తక్కువగా వుండటంతో బలవంతంగా పని చేయించేందుకు ఈ చట్టాన్ని తీసుకు వచ్చారు. దీంతో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన వారు కూడా నిరసనలలో భాగస్వాములయ్యారని వార్తలు వచ్చాయి.

అనేక దేశాలలో జనం వీధుల్లోకి రావటం అక్కడి అసంతృప్తికి నిదర్శనం అయితే పచ్చి మితవాద పార్టీలు జనాన్ని ఆకర్షించటం మరొక సూచిక.2019 వారిదే అవుతుందా ? ఇటలీలో గతేడాది జరిగిన ఎన్నికలలో 630కిగాను 125 సీట్లు తెచ్చుకొని ఇటలీ సంకీర్ణ ప్రభుత్వంలో నార్తరన్‌ లీగ్‌ అనే మితవాద పార్టీ భాగస్వామిగా వుంది. పేరుకు చిన్నపార్టీ అయినా ప్రభుత్వ అజెండాను రూపొందించటంలో పెద్ద పాత్ర నిర్వహిస్తున్నది. యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడిగా వున్న జీన్‌ క్లాడ్‌ జుంకర్‌ తరచూ ఈ ప్రజాకర్షక శక్తులు, జాత్యంహంకారులు, ఫాసిస్టులు, సిల్వనీ(ఇటలీ) లీపెన్‌, జర్మనీ ఎఎఫ్‌డిపార్టీ వంటితో ఐరోపా ప్రమాదంలో వుంది అంటారు. ప్రస్తుతం హంగరీ, నార్వే, స్వీడన్‌, ఫిన్లాండ్‌, ఆస్ట్రియా, ఇటలీల్లో పచ్చి మితవాద పార్టీలు పాలక పక్షాలు లేదా భాగస్వామ్య పక్షాలుగా వున్నాయి. గతేడాది స్లోవేనియా పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికలలో 90కి గాను రెండు పచ్చిమితవాదపార్టీలు 29 సీట్లు తెచ్చుకున్నాయి. అక్కడి ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు. హంగరీ ఎన్నికలలో 199 స్ధానాలకు గాను రెండు మితవాద పార్టీలు 133, 26 చొప్పున 159 సీట్లు తెచ్చుకొన్నాయి. ఇటలీ ఎన్నికలలో మెజార్టీ సీట్లు మితవాద పార్టీలకే వచ్చాయి. దిగువ సభలోని 630 సీట్లకుగాను మూడు మితవాద పార్టీలకు కలిపి 379 వున్నాయి. ఎగువ సభలో 315కుగాను 140 తెచ్చుకున్నాయి. 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభ ఫర్యవసానంగా ప్రస్తుతం ఇటలీ తీవ్రమైన ఆర్ధిక సమస్యల్లో వుంది. జర్మనీలో ఐదు సంవత్సరాల క్రితం ఏర్పడిన జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ(ఎఎఫ్‌డి) 2017 ఎన్నికల్లో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీగా ముందుకు వచ్చింది.2015లో దాదాపు పదిలక్షల మంది జర్మనీకి వలస వస్తే వారిలో ఎక్కువ మంది ముస్లిం దేశాల నుంచి వచ్చిన వారే వున్నారు. ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి ఎఎఫ్‌డి బలం సంపాదించుకుంది.

వివిధ సర్వేలు మితవాద శక్తులు గతం కంటే బలంగా తయారవుతున్నాయని, వివిధ పార్టీల మధ్య విబేధాలున్నప్పటికీ ఐరోపాయూనియన్‌కు బ్రేకులు వేసేవిగా వున్నాయని చెబుతున్నారు. ఇటీవలి వరకు అనేక దేశాలలో నోటి తుత్తర శక్తులుగా వున్నప్పటికీ ప్రస్తుతం అనేక దేశాలలో అధికారంలో వుండటం లేదా అధికార పక్షాలకు మద్దతు ఇచ్చేవిగా తయారయ్యాయి. ఇటీవలి కాలంలో పెరిగిపోయిన వలసలను వ్యతిరేకిస్తూ వలసల రహిత ఐరోపా కావాలని, ఐరోపా యూనియన్‌ బదులు ఐరోపా జాతులుగా వుండాలని చెబుతున్నాయి. యూరోబారో మీటర్‌ తాజా సర్వే ప్రకారం ఐరోపా యూనియన్‌ సభ్యత్వం తీసుకోవటం మంచిదే అయినప్పటికీ అది తప్పుడు మార్గంలో నడుస్తున్నదని 62శాతం మంది అభిప్రాయపడ్డారు. వలసల తక్షణ సమస్యగా భావిస్తున్నారు. మితవాద పార్టీలు 20శాతం మేరకు ఐరోపా వ్యాపితంగా ఓట్లను తెచ్చుకొనేవిగా వున్నాయని, ఇది మెజారిటీ సాధించేందుకు దోహదం చేయకపోయినా ఐరోపా యూనియన్‌ పనికి ఆటంకాలు కలిగించేందుకు వీలుకలిగిస్తాయని భావిస్తున్నారు. మేము ఒక చారిత్రక మలుపులో వున్నాం, తీవ్రమైన ప్రపంచీకరణ ముగింపుకు రానున్నది అని ఫ్రెంచి నేషనలిస్టు పార్టీ నాయకురాలు మారినె లీపెన్‌ ఇటీవల సోఫియా నగర పర్యటనలో చెప్పారు.

ఐరోపాలో జర్మన్‌- ఫ్రెంచి కూటమి ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు ఏకం కావాల్సి వుందని పచ్చి మితవాద పార్టీ నార్తరన్‌ లీగ్‌ నాయకుడు ఇటలీ డిప్యూటీ ప్రధాని, హోంమంత్రి మాట్టియో సాల్విని పోలాండ్‌ పాలకపార్టీ నేతలతో బుధవారం నాడు చెప్పారు. పోలాండ్‌ లా మరియు జస్టిస్‌ పార్టీ కూడా పచ్చిమితవాది అన్న విషయం తెలిసిందే. మే నెలలో జరిగే ఐరోపా పార్లమెంటరీ ఎన్నికలకు ముందే భావసారూప్యత గలిగిన పార్టీలు ఒక్కటై ‘ఐరోపా వసంతానికి’ నాంది పలకాలని సాల్విని కోరాడు. ఈ రెండు పార్టీలు ముస్లిం వ్యతిరేకత, ఐరోపా యూనియన్‌ వ్యతిరేకత వంటి అంశాలలో ఏకీభావం కలిగి వున్నాయి. పోలాండ్‌ హోం మంత్రి జోచిమ్‌ రుడ్‌జిన్‌స్కీతో కలసి విలేకర్లతో మాట్లాడాడు. ఐరోపా విలువలను పునరుద్దరించాలని, బ్యూరోక్రాట్ల పాలనకు దూరంగా వుండాలని కోరాడు. ఐరోపా వ్యాపితంగా వున్న తమ వంటి పార్టీలైన ఫైవ్‌ స్టార్‌ మువ్‌మెంట్‌ (ఎం5ఎస్‌) వంటివాటితో సమన్వయం చేసుకోవాలని సాల్విని ప్రయత్నిస్తున్నాడు. అక్టోబరు నెలలో ఫ్రెంచి నేషనల్‌ ఫ్రంట్‌ నాయకురాలు మారినె లీపెన్‌తో ఇప్పటికే చర్చలు జరిపాడు. ఇటలీ ఎం5ఎస్‌ పార్టీ అక్కడ పార్లమెంట్‌లో పెద్ద పార్టీగా విజయం సాధించి నార్తరన్‌ లీగ్‌తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ నేత యుగీ డి మాయియో మంగళవారం నాడు బ్రసెల్స్‌లో పోలాండ్‌ కుకిజ్‌ 15 పార్టీ నేత పావెల్‌ కుకిజ్‌, ఫిన్లాండ్‌, లాత్వియా మితవాద పార్టీ నేతలతో చర్చలు జరిపాడు. ఫ్రాన్స్‌లో పసుపు చొక్కాల వారు ఆందోళన విరమించవద్దని కోరాడు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దేశభక్తిని ఓట్ల వ్యాపార సరకుగా మార్చుతున్న బిజెపి !

07 Monday Jan 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP pseudo patriotism, Gujarat studens roll call, patriotism, pseudo patriotism, Real patriotism

Image result for bjp patriotism

ఎం కోటేశ్వరరావు

‘ఒక దుర్మార్గుడి అంతిమ ఆశ్రయం (దిక్కు) దేశభక్తి ‘ అని 18వ శతాబ్దపు బ్రిటన్‌ రచయిత శామ్యూల్‌ జాన్సన్‌ చేసిన వ్యాఖ్య కొందరి విషయంలో నిజమే అనిపిస్తోంది కదూ! మన దేశాన్ని ఆక్రమించి మనలను పాలించిన మొఘలాయీ, బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన వారిని దేశభక్తులు, జాతీయ వాదులు అని పిలిచారు, జనం గౌరవించారు. స్వాతంత్య్రం వచ్చి మనలను మనమే పాలించుకుంటున్నాం. బ్రిటీష్‌ వారి కాలంలో వారితో చేతులు కలిపిన వారి వ ారసులు ఇన్ని దశాబ్దాల తరువాత మేమే అసలు సిసలు జాతీయవాదులం, దేశభక్తిలో మాకు సాటి లేదు, దానిలో 24గంటలూ మునిగి తేలుతున్నాం, మాతో మునగని వారందరూ దేశద్రోహులే అంటున్నవారిని ఏమని పిలవాలి ?

అవును నిజం ! ఇప్పటి వరకు ఎస్‌ సర్‌ లేదా ఎస్‌ మిస్‌, ప్రజెంట్‌ సర్‌ లేదా మిస్‌ లేదా మేడం అన్న అందరినీ వారికి తెలియకుండానే దేశద్రోహుల ఖాతాలో జమ చేసేందుకు పూనుకున్నారు. దానిలో భాగంగానే హాజరు వేసే సమయంలో జై హింద్‌ లేదా జై భారత్‌ అని చెప్పాలట. ఎస్‌ సర్‌ అన్న వారి కంటే జైహింద్‌ అన్న వారికే గుజరాత్‌ టీచర్లు రాబోయే రోజుల్లో సర్టిఫికెట్లు ఇవ్వాల్సి వుంటుంది. జై హింద్‌ అనని వారు దేశభక్తులు, భావి భారత పౌరులు కాదు, దేశవ్యతిరేకులు. పిచ్చి ముదురుతోంది. కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అన్నట్లు దేశభక్తి లేదా బ్రిటీష్‌ వ్యతిరేక జాతీయవాదంతో ఏమాత్రం సంబంధం లేని వారి వారసులు ఇప్పుడు కొత్త దేశభక్తుల అవతారం ఎత్తారు. తాజాగా గుజరాత్‌ బిజెపి సర్కార్‌ జైహింద్‌, జై భారత్‌ ఆదేశాలు జారీ చేసింది. చిన్న వయస్సు నుంచి పిల్లలకు జాతీయ వాదంలో తర్ఫీదునిచ్చేందుకు తామీ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నది.

జై హింద్‌, భారత్‌ అంటే తప్పేమిటి అన్నది వెంటనే వచ్చే ప్రశ్న. తప్పేమీ లేదు. అనేక యుద్ధాల్లో ప్రాణాలర్పించిన మన సైనికులు బడుల్లో హాజరు కోసం జై హిందు అనలే, అయినా సైన్యంలో చేరారా లేదా, వారికి దేశభక్తి లేకుండానే అలా నడుచుకుంటూ వెళ్లారా? సింధు నాగరికత వర్ధిల్లిన ప్రాంతాన్ని పరదేశీయుల పలుకు నుంచి వచ్చిన హిందు పదంతో ఎవరికీ అభ్యంతరం లేదు. హిందూ మతానికి దేశానికి పెడుతున్న లంకెతోనే వస్తున్న ఇబ్బంది. జర్మన్‌ హిట్లర్‌ కూడా తనది జాతీయ సోషలిస్టు కార్మిక పార్టీ అని చెప్పుకొని ఆ పేరుతో చరిత్రలో కనీవిని ఎరుగని మారణకాండకు పాల్పడ్డాడు. నాజీల మేడిపండు జాతీయ సోషలిజం అవగాహనను ప్రతి విద్యార్ధి ఆమోదించాలని వత్తిడి చేశారు. వ్యతిరేకించిన పిల్లలను విడిగా వుంచి భయపెట్టారు. అతగాడి భావజాలాన్ని అరువు తెచ్చుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌, దాని సృష్టి బిజెపి, ఇతర సంస్దలన్నీ తాము జాతీయవాదులని తామే అసలు సిసలు జాతీయ వాదులమని, తమది హిందూత్వ జాతీయవాదమని, ఒక జీవన విధానమని ఒళ్లంతా రాసుకొని వూరేగుతున్నారు. దాన్ని వ్యతిరేకించే వారే కాదు, అంగీకరించని వారిని కూడా దేశద్రోహులని ముద్రవేస్తున్నారు కనుకనే అభ్యంతరం తెలియచేయాల్సి వస్తున్నది. 1947కు ముందు బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా మనమంతా జాతీయవాదులం, ఇప్పుడు మనం భారతీయులమని గర్వంగా చెప్పుకోవచ్చు తప్ప భారత జాతీయవాదులం అంటే మిగతా దేశాలు ఒప్పుకోవు. ఈ తరహా జాతీయవాదంతోనే గతంలో జర్మనీ,ఇటలీ,జపాన్‌ వంటి దేశాలలో హిట్లరు, ముస్సోలినీ, టోజో వంటి నియంతలు తయారై ప్రపంచాన్ని నాశనం చేశారు. వారిని ఆదర్శంగా తీసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పే అఖండ భారత్‌ అంటే ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పాకిస్ధాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మయన్మార్‌ వరకు అన్నీ భారత్‌లో భాగమే.

మమ్మల్ని రాజకీయంగా వ్యతిరేకిస్తే అభ్యంతరం లేదుగానీ ప్రతి నిత్యం, ప్రతి సందర్భంలోనూ మీరు మాత్రం మేము చెబుతున్న తరహా దేశభక్తిని నిరూపించుకోవాలనే ఒక అప్రజాస్వామిక అభిప్రాయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి శక్తులు వ్యాపింప చేస్తున్నాయి. పరిణితి చెందిన ఏ దేశంలోనూ ప్రతిక్షణం ప్రతి ఒక్కరూ దేశభక్తిని బహిరంగంగా ప్రదర్శించాలనే ధోరణి లేదు. అమెరికా విద్యా సంస్ధలలో హియర్‌( వున్నాను) అంటారు తప్ప జై యుఎస్‌ఏ లేదా లాంగ్‌ లివ్‌ అమెరికా అనరు. వారికి దేశభక్తి లేనట్లా, లేక నేర్పనట్లా ? జర్మనీలో నియంత హిట్లర్‌ను పొగిడే విధంగా టీచర్లను మలచారు, హై హై నాయకా అన్నట్లు టీచరు వచ్చీ రావటంతోనే హిట్లర్‌ నామ జపం చేయగానే పిల్లలందరూ పొలో మంటూ ప్రతిజ్ఞ చేసినట్లుగా పొగిడే వారు. ఏదైనా అతి చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ. గోవులనే తీసుకోండి. గోమాత రక్షణ పేరుతో గోగూండాలను ప్రోత్సహించిన వారిలో వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ఒకరు. ఆ పెద్దమనిషి చర్యలతో పాలివ్వని పశువులకు గడ్డిపెట్టలేని రైతులు వాటిని రోడ్ల మీదకు వదలి వేశారు. ఇప్పుడవి మేతకోసం పంటపొలాల మీద పడుతున్నాయి. గగ్గోలు పెట్టిన రైతులు కొన్ని చోట్ల వాటిని తోలుకుపోయి ప్రభుత్వ పాఠశాలల్లో వుంచి తాళాలు వేశారని వార్తలు. అనేక చోట్ల అవి పంటలను నాశనం చేయకుండా రైతులు పొలాల చుట్టూ కంచెలు వేసుకోవటం, కాపాలా కాయటం చేయాల్సి వస్తోంది. సమాజాన్ని వెనక్కునడపాలని చూసే వారికి ఇలాంటి అంశాలు ఎదురైనా వాటి నుంచి పాఠాలు తీసుకోకుండా మరింతగా వెనక్కు నడిపేందుకు చూస్తారు.

సినిమా హాళ్లలో దేశభక్తి నింపేందుకు ఎలాంటి ప్రహసనం నడిచిందో చూశాము. ఎందుకు నిలబడాలని ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా చూసిన అనుభాలను ఇంకా మరచి పోలేదు. తొలుత ప్రభుత్వ నిర్ణయంగా సినిమా హాళ్ల దేశభక్తిని సమర్ధించిన సుప్రీం కోర్టు తరువాత ఆ నిర్ణయం మీద దాఖలైన అప్పీళ్ల సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమైనవి. కాళ్లూ, చేతుల మీద తమ దేశభక్తి ప్రదర్శన చేయాలని జనాన్ని బలవంతం చేయలేము, జాతీయ గీతం పాడుతున్నపుడు ఒక వ్యక్తి లేచినిలబడనప్పుడు అతనిలో దేశభక్తి తక్కువని అనుకోకూడదు అని పేర్కొన్నది. అంతే కాదు ప్రభుత్వం సినిమాలకు వచ్చేవారు టీ షర్టులు, పొట్టి నిక్కర్లు వేసుకోకూడదు, అలాంటి దుస్తులతో జాతీయ గీతాలాపన సమయంలో లేచి నిలవటం అవమానించటమే అని నిర్ణయిస్తే పరిస్ధితి ఏమిటి అని కూడా సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఇపుడు గుజరాత్‌ లేదా ఒకవేళ ఇదేదో ఓట్లు కురిపించేట్లుందే అని రేపటి నుంచి దాన్ని అనుసరించే ఇతర బిజెపి రాష్ట్రాలలో కూడా అమలు చేస్తే ఇదే పరిస్ధితి ఎదురవుతుంది.గతంలో కేరళ కేసులో జాతీయ గీతాలాపన సందర్భంగా నిబంధనల ప్రకారం లేచి నిలబడాలి తప్ప గీతాన్ని ఆలపించాలన్న నిబంధన ఎక్కడా లేదని, ఆలపించని కారణంగా ఎవరిమీదైనా చర్యలు తీసుకోవటం చెల్లదని సుప్రీం కోర్టు చెప్పింది. గుజరాత్‌ సర్కార్‌ లాజిక్కు ప్రకారం చూస్తే దేశంలో ఫోన్లు, ప్రతి కార్యాలయం, ఫ్యాక్టరీ, బజారుల్లో కూడా దేశభక్తిని నేర్పేందుకు జై హింద్‌, జై భారత్‌ అని పలకరించుకోవాల్సి వుంటుంది. ఏది తినాలో ఏది తినకూడదో, ఏది ధరించాలో ఏదికూడదో, ఎవరిని వివాహం చేసుకోవాలో ఎవరిని కూడదో చెబుతున్న కాషాయ దళాలు ఇప్పటికే దేశంలో ఎక్కడబడితే అక్కడ తామరతంపరగా పుట్టుకు వస్తున్నాయి. గుజరాత్‌ చర్యలు ఈశక్తులను మరింతగా రెచ్చిపోయేట్లు చేసేవి తప్ప వేరు గాదు. పిచ్చి మరింత ముదిరి పిల్లలందరూ జాతీయ జండా రంగులతో లేదా కాషాయ యూనిఫారాలు వేసుకోవాలని నిర్ణయించినా ఆశ్చర్యం ఏముంటుంది. దేశభక్తి, దేశ ద్రోహాన్ని కూడా ఓట్లవేటలో వ్యాపారంగా మార్చివేస్తున్నారని గ్రహించటం అవసరం. అందుకే ఒక దుర్మార్గుడి అంతిమ ఆశ్రయం (దిక్కు) దేశభక్తి అన్న శామ్యూల్‌ జాన్సన్‌ను గుర్తు చేయాల్సి వచ్చింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా, చైనా, చైనా – రెచ్చగొట్టిన అమెరికా నూతన రక్షణ మంత్రి

04 Friday Jan 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

china china china, Message to Compatriots in Taiwan., patrick shanahan, Taiwan, Taiwan independence, US provocation, Xi Jinping

Image result for china china china patrick shanahan

ఎం కోటేశ్వరరావు

జనవరి రెండవ తేదీన ప్రపంచంలో జరిగిన పరిణామాలలో రెండు ఆసక్తికరంగా వున్నాయి. ఒకటి అమెరికా రక్షణశాఖ తాత్కాలిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే పాట్రిక్‌ షహనాహన్‌ పెంటగన్‌ అధికారులతో మాట్లాడుతూ మనం ఒకవైపు సిరియా, ఆఫ్ఘనిస్తాన్లలో ఇస్లామిక్‌ తీవ్రవాదులతో పోరాడుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో కేంద్రీకరించాల్సింది చైనా, చైనా, చైనా అని వ్యాఖ్యానించినట్లు రక్షణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. కొన్ని మీడియా సంస్ధలు అదే శీర్షికతో వార్తలను ఇచ్చాయి. దానికి కొద్ది సేపటి ముందే చైనా రాజధాని బీజింగ్‌లో మాట్లాడిన దేశాధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. తోటి తైవాన్‌ సోదరులకు ఒక విన్నపం అంటూ 1979లో చైనా చేసిన ప్రకటన 40వ వార్షికోత్సవం సందర్భంగా రెండు ప్రాంతాల మధ్య ఇంతకాలం నెలకొన్న స్ధిరమైన సంబంధాల దశ నుంచి పునరేకీకరణకు చొరవ చూపాల్సిన సమయమాసన్నమైందని చెప్పారు. బలవంతంగా విలీనం చేసుకొనేందుకు తమకు అవకాశం వున్నా శాంతియుత పద్దతులకే ప్రాధాన్యత ఇస్తామని జింపింగ్‌ చెప్పారు. నిజానికి ఇది తైవాన్‌ కంటే అమెరికాకు చేసిన హెచ్చరికగానే తీసుకోవాల్సి వుంది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న వుద్రిక్తతలకు ఇది ఒక సూచికగా కూడా చెప్పవచ్చు.

ఏడు దశాబ్దాల క్రితం చైనాలో విప్లవం జయప్రదమై కమ్యూనిస్టులు అధికారానికి వచ్చే సమయానికి తైవాన్‌ అనే రాష్ట్రం, కమ్యూనిస్టుల ఆధీనంలోకి రాలేదు. ప్రస్తుతం అక్కడ దాదాపు రెండున్నర కోట్ల మంది జనం వున్నారు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంగా వున్న హాంకాంగ్‌ బ్రిటీష్‌ వారి కౌలు కింద, మకావో దీవులు పోర్చుగీసు కౌలు కింద వున్నాయి. చుట్టూ సామ్రాజ్యవాదుల కుట్రలు. ఇంటా బయటి శత్రువుల కుట్రలను అధిగమించి ప్రధాన భూభాగం చైనాలో కమ్యూనిస్టులు నిలదొక్కుకోవటానికి దాదాపు పది సంవత్సరాలు పట్టింది.ఈలోగా జరిగిన అనేక పరిణామాల పర్యవసానంగా తైవాన్‌ విలీనం సంక్లిష్టంగా మారింది. కొత్త సమస్యలను ముందుకు తెచ్చింది.

చైనా సంస్కరణలతోపాటు కమ్యూనిస్టు చైనా ప్రభుత్వాన్ని అమెరికా గుర్తించి, తైవాన్‌కు సాంకేతికంగా గుర్తింపు రద్దు చేసి కూడా 40సంవత్సరాలు గడిచాయి. 1978 డిసెంబరు 15న తాము చైనాను గుర్తిస్తున్నట్లు, తైవాన్‌తో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్లు నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ ప్రకటించారు. ఈ నిర్ణయం 1979 జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఆ రోజు నుంచి తైవాన్‌ సంబంధాల చట్టం పేరుతో అమెరికా తైవాన్‌తో నూతన సంబంధాలకు కూడా నాలుగు దశాబ్దాలు నిండాయి. ఆ చట్టం ప్రకారం అమెరికా ఒక దేశాన్ని అధికారికంగా గుర్తించినపుడు ఎలాంటి సంబంధాలుంటాయో ఒక్క రాయబారకార్యాలయం, రాయబారి నియామకం తప్ప ఆయుధాల విక్రయంతో సహా మిగిలినవన్నీ అనధికారికంగా కొనసాగుతాయి. అందుకుగాను తైవాన్‌లో అమెరికన్‌ సంస్ధ పేరుతో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకాలం ఆధునిక ఆయుధాలు, విమానాలు, జలాంతర్గాములతో సహా అన్నింటినీ తైవాన్‌కు విక్రయించిన అమెరికా గతేడాది తైవాన్‌లో జోక్యానికి ప్రాతిపదికవేసుకుంది. తైపే లోని అమెరికన్‌ సంస్ద రక్షణకు మెరైన్‌ దళాలను పంపాలని అమెరికా విదేశాంగశాఖ ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోరింది. అంతకు ముందు తొలిసారిగా 2017లో రెండు యుద్ధనౌకలను తైవాన్‌ జలసంధిలోకి అమెరికా తరలించింది. మరోసారి జెట్‌ యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా పూనుకుంది. ఈ పూర్వరంగంలో గ్జీ జింపింగ్‌ ప్రకటన, హెచ్చరికలను చూడాల్సి వుంది.

1949లో చైనాలో మావో జెడాంగ్‌ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గుర్తించేందుకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలుఐక్యరాజ్యసమితి కూడా నిరాకరించింది. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ మూడు దశాబ్దాల పాటు అసలైన చైనాగా కొనసాగింది. అయితే 1960 దశకంలో సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్ధాంతిక విబేధాలు తలెత్తిన నేపధ్యం, విదేశీ పెట్టుబడులు అవసరమని చైనా నాయకత్వం భావించిన తరుణంలో ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్‌లో ప్రవేశానికి అవకాశాలు వచ్చాయని అంచనా వేసిన అమెరికా పారిశ్రామిక, వాణిజ్య వర్గాల వత్తిడి మేరకు 1970దశకం రెండవ అర్ధభాగంలో కమ్యూనిస్టు చైనాతో సయోధ్యకు అమెరికా సిద్దపడింది. రాజకీయంగా సోవియట్‌ మీద వత్తిడి పెంచే లక్ష్యం కూడా దాగి వుండటంతో అమెరికా నేతలు చైనాకు దారితీశారు. పరస్పరం లాభదాయకమని గుర్తించి 1979 జనవరి ఒకటి నుంచి దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒకే చైనాను సాంకేతికంగా గుర్తించినప్పటికీ తైవాన్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేంత వరకు, తైవాన్‌ పౌరులు ఆమోదించే వరకు తైవాన్‌పై చైనా సార్వభౌమత్వాన్ని గుర్తించటం లేదని, యథాతధ స్ధితిని మార్చేందుకు తైవాన్‌ లేదా చైనా ప్రయత్నించకూడదని, చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తే తైవాన్‌కు మద్దతు ఇస్తామని తన చట్టంలో రాసుకుంది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో అవాంఛనీయ జోక్యమే అని ఆ చట్టం మీద చైనా వ్యాఖ్యానించింది.

అంతర్భాగమైన తైవాన్‌ దీవులను విలీనం చేసుకొనే అవకాశం వున్నప్పటికీ చైనా తన అధికారాన్ని వుపయోగించలేదు. దీనికి వివిధ అంశాలు దోహదం చేశాయి. 1949లో చైనా పాలకుడిగా వున్న చాంగ్‌కై షేక్‌ తైవాన్‌కు పారిపోతూ తనతో పాటు మొత్తం బంగారు నిల్వలను త్రిదళాలకు చెందిన ఇరవైలక్షల మంది సైనికులను కూడా తరలించాడు. అంతర్యుద్ధ సమయంలో బర్మా సరిహద్దులతో సహా అనేక చోట్ల నిధుల కోసం నల్లమందు సాగును ప్రోత్సహించి పెద్ద మొత్తంలో నిధులు పోగేశాడు. దాదాపు పన్నెండువేల మంది సైనికులు బర్మా సరిహద్దు ప్రాంతాలలో తిష్టవేసి అమెరికా సాయంతో 1954వరకు తిరుగుబాట్లు చేయించాడు. చైనా అధికారం తనదే అని ప్రకటించుకున్నాడు. తైవాన్‌ను సైనిక పరంగా విలీనం చేసుకొనేందుకు మావో నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలో 1950లో వుత్తర కొరియాపై అమెరికా నాయకత్వంలోని సేనలు దక్షిణ కొరియా రక్షణ పేరుతో దాడులకు దిగాయి. వుత్తర కొరియాను కాపాడుకొనేందుకు నాటి సోవియట్‌ యూనియన్‌, చైనా తన సైనికబలగాలను ఇటువైపు మళ్లించాల్సి వచ్చింది. దాంతో తైవాన్‌ విలీనం వాయిదా పడింది. ఐక్యరాజ్యసమితిలో అమెరికా అండతో నాడున్న బలాబలాల్లో చాంగ్‌కై షేక్‌ నాయకత్వంలోని ప్రభుత్వాన్నే అధికారికమైనదిగా గుర్తింపును కొనసాగించారు. తరువాత అమెరికన్లు తైవాన్‌ను ఒక బలీయమైన సైనికశక్తిగా నాటి నుంచి నేటి వరకు తయారు చేస్తూనే వున్నారు.

తైవాన్‌ వెన్నుదన్నుగా అమెరికా వున్న పూర్వరంగంలో దాన్ని ఎదిరించి తైవాన్‌ను విలీనం చేసుకోగలిగిన శక్తి చైనాకు ఇటీవలి వరకు లేదన్న విశ్లేషకుల అంచనా వాస్తవానికి దగ్గరగా వుంది. ఇప్పుడు అజెండా, మార్గాన్ని నిర్దేశించే శక్తి వచ్చినట్లు గ్జీ ప్రకటనను బట్టి భావిస్తున్నారు.హాంకాంగ్‌లో 1992లో పాక్షిక అధికారాలు కలిగిన చైనా-తైవాన్‌ ప్రతినిధులు జరిపిన సమావేశంలో చైనా అంటే ఒక్కటే అనే ఒక ఏకాభిప్రాయం వ్యక్తమైంది. రెండు ప్రాంతాల మధ్య సంబంధాల పునరుద్దరణకు నాంది పలికింది. అయితే దానిని గుర్తించేందుకు తైవాన్‌లోని డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ నిరాకరిస్తోంది. భిన్న భాష్యాలు చెబుతోంది. చైనా ఒక్కటే, అవిభక్త దేశానికి ఏకైక ప్రతినిధి పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా(పిఆర్‌సి), ఒకే దేశంలో రెండు వ్యవస్ధలు, విలీనం శాంతియుతంగా జరగాలి, తప్పని సరి అయితే బలప్రయోగం తప్పదు అన్నది బీజింగ్‌ భాష్యం. తైవాన్‌ కేంద్రంగా వున్న డెమోక్రటిక్‌ పార్టీ, మరికొందరి భాష్యం ప్రకారం చైనా ఒక్కటే, దాని అసలైన ప్రతినిధి రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా(ఆర్‌ఓసి), జలసంధికి రెండువైపులా వున్న ఒకే దేశం. రెండు ముక్కలూ సార్వభౌమత్వం కలిగినవే. రెండు దేశాలూ సంప్రదించుకోవచ్చు. విలీనానికి బల ప్రయోగం జరపబోమని మేము వాగ్దానం చేయటం లేదు, అన్ని రకాల అవసరమైన పద్దతులను కలిగి వుంటాం. తైవాన్‌ స్వాతంత్య్రం అనేది చరిత్ర ధోరణికి వ్యతిరేకం, మరొక మార్గం లేని చోటుకు అది తీసుకుపోతుంది. శాంతియుత విలీనం తరువాత తైవాన్‌ సోదరుల సామాజిక వ్యవస్ధను జీవన విధానాన్ని పూర్తిగా గౌరవిస్తాం, ప్రయివేటు ఆస్ధులు, మతవిశ్వాసాలను, న్యాయమైన హక్కులు, ప్రయోజనాలను పూర్తిగా రక్షిస్తాం అని జనవరి రెండవ తేదీన గ్జీ స్పష్టం చేశారు. గతేడాది జరిగిన స్ధానిక ఎన్నికలలో 1992ఏకాభిప్రాయాన్ని గుర్తించని, వ్యతిరేకించే డిపిపి, కొమింటాంగ్‌ పార్టీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సాధారణ ఎన్నికలు 2020లో జరగనున్నాయి. హాంకాంగ్‌, మకావూల విలీనం సమయంలో అక్కడ వున్న పెట్టుబడిదారీ వ్యవస్ధలను 2049 డిసెంబరు 31వరకు కొనసాగిస్తామని చైనా ప్రభుత్వం పేర్కొన్నది.ఇదే అంశాన్ని తైవాన్‌కు కూడా వర్తింప చేస్తామన్నదే గ్జీ తాజా సందేశ అంతరార్ధం.

Image result for angry  patrick shanahan

చైనా పట్ల కఠిన వైఖరిని తీసుకోవాలనే వైఖరి కలిగిన షహనాహన్‌ పెంటగన్‌లో మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించదు. బస్తీమే సవాల్‌ అంటూ చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగిన డోనాల్డ్‌ ట్రంప్‌కు సై అంటే సై అనే రక్షణ మంత్రి తోడయ్యాడు. 2018 జాతీయ రక్షణ వ్యూహం పేరుతో పెంటగన్‌ రూపొందించిన పత్రంలో వ్యూహాత్మక పోటీదారు చైనా అని పేర్కొన్నారు. చైనా, రష్యాల నుంచి తలెత్తుతున్న ముప్పులు అగ్రభాగాన వున్నాయని, వారినియంత్రత్వ వైఖరులకు అనుగుణ్యంగా ప్రపంచాన్ని మలచాలని, పెంటగన్‌ ప్రాధాన్యతల్లో వాటిని ప్రధానమైనవిగా చేర్చాలని పేర్కొన్నారు. అమెరికా రక్షణ ఖర్చులో సింహభాగాన్ని పొందుతున్న ఐదు అగ్రశ్రేణి ఆయుధ కంపెనీల్లో ఒకటైన బోయింగ్‌లో మూడు దశాబ్దాలపాటు వున్నత అధికారిగా షహనాహన్‌ పని చేశాడు. సిరియా నుంచి సేనల వుపసంహరణ ప్రకటనకు నిరసనగా రక్షణ మంత్రి మాటిస్‌ రాజీనామా చేసిన తరువాత వుప మంత్రిగా వున్న షహనాహన్‌ తాత్కాలిక మంత్రిగా వుంటారని ప్రకటించిన రోజే ట్రంప్‌ సర్కార్‌ బోయింగ్‌ నుంచి యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అతగాడిని వుప మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారని వచ్చిన వార్తల గురించి సెనెట్‌ కమిటీ అధ్యక్షుడిగా వున్న జాన్‌ మెకెయిన్‌ వ్యాఖ్యానిస్తూ కోళ్ల గూటిలో నక్కను పెడతారని అనుకోవటం లేదన్నాడు.

షహనాహన్‌ మాటలను బట్టి రానున్న రోజుల్లో ఒకవైపు వాణిజ్య యుద్ధంతో పాటు మిలిటరీ రీత్యా మరింతగా చైనాపై కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వున్న బలాబలాను బట్టి అమెరికాను అతిక్రమించే శక్తి చైనాకు లేదు. అయితే అమెరికా అలాంటి దుస్సాహసానికి ఒడిగడితే తగిన మూల్యం చెల్లించే విధంగా ప్రతిఘటించే శక్తి చైనా సంతరించుకుంది. అమెరికా ఖండాంతర అణు క్షిపణులతో సమానమైన డాంగ్‌ఫెంగ్‌ 41క్షిపణి చైనా అమ్ములపొదిలో 2017లో చేరింది. అణుయుద్ధమే సంభవిస్తే విజేతలంటూ ఎవరూ వుండరు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రధాని మోడీ కావాలని దాచినవి, తెలిసి కూడా ఎఎన్‌ఐ అడగనివి !

02 Wednesday Jan 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

ANI, Narendra Modi, Narendra Modi interview, Narendra Modi interview with ANI

Image result for What Narendra Modi hide, What ANI did not asked

ఎం కోటేశ్వరరావు

మిన్నువిరిగి మీద పడితే తప్ప ప్రధాని నరేంద్రమోడీ మీడియా గోష్టిలో ముఖాముఖీ మాట్లాడని భారత తొలి ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టించటం ఖాయమని తేలిపోయింది. బహుశా ప్రపంచంలోనే తొలి ప్రజాప్రతినిధి కూడా అయి వుండవచ్చు. పది సంవత్సరాల కాలంలో మూడంటే మూడు సార్లు మాత్రమే మీడియాతో మాట్లాడిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను మౌనముని అని ఎద్దేవా చేసిన వారిలో బిజెపి కూడా వుంది. సోనియగాంధీ అనుమతి ఇవ్వని కారణంగా మన్మోహన్‌ అలా చేసి వుండవచ్చు. నాకు 56 అంగుళాల ఛాతీ వుంది, రిమోట్‌ కంట్రోలు లేదు అని చెప్పుకొనే నరేంద్రమోడీ ఒక్కసారి కూడా మాట్లాడకపోవటానికి కారణాలేమిటో ? అయితే ఏ ప్రధానీ ఇవ్వనన్ని ఫోజులు మీడియా కెమెరాలకు ఇచ్చారు కదా అని ఆయన భక్తకోటి దెబ్బలాటకు దిగవచ్చు. అలాంటి పెద్ద మనిషి నరేంద్రమోడీ జనవరి ఒకటవ తేదీన, హిందూత్వశక్తులు, అసలు సిసలు భారతీయతకు ప్రతీకలం అని చెప్పుకొనే వారు మొహాలు ఎక్కడో పెట్టుకొని సిగ్గుపడే విధంగా ఎఎన్‌ఐ అనే వార్తా సంస్ధకు ఆంగ్ల సంవత్సరాది రోజు 95నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చారు. అది యాదృచ్చికం తప్ప ఆంగ్ల సంవత్సరాదికి మోడీ ఇంటర్వ్యూకు సంబంధం లేదని వితండవాదం లేదా భాష్యం చెప్పే బాపతు కూడా మనకు తగలవచ్చు.

బ్రిటన్‌లో చాలా కాలం కిందట రాజు గారి తరువాత రాణీగారి ప్రతిపక్షంగా వ్యవహరించే పార్టీలు వుండేవి. అంటే రాజు, రాణీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అణగిమణగి ప్రశ్నించే పక్షాలవి. అలాగే నరేంద్రమోడీ మన దేశంలో అలాంటి మీడియాను రంగంలోకి తెచ్చిన ఆద్యుడిగా చెప్పుకోవాలి. ఒక యాంకర్‌గా చర్చలో పాల్గనేవారి మీదకు ఎక్కే ఆర్నాబ్‌ గోస్వామి నక్క వినయాలతో నరేంద్రమోడీని ఇంటర్య్వూ చేసిన విషయం తెలిసిందే. అంటే ముందుగానే ఏ ప్రశ్నలు అడగాలో ఏమి జవాబులు చెబుతారో, వాటి మీద వుప ప్రశ్నలు వేయకుండా ఎలా నోరు మూసుకోవాలో అన్నీ ముందే నిర్ణయం అవుతాయి. ఒక వేళ నోరు జారితే ఆ భాగాన్ని తొలగిస్తారనుకోండి అది వేరే విషయం. జనవరి ఒకటిన ఎఎన్‌ఐ ఇంటర్వ్యూ కూడా అలాంటి ముందస్తు ఏర్పాటుతో జరిగిందే అని వేరే చెప్పనవసరం లేదు. ఆ షరతుకు ఒప్పుకుంటేనే తన గదిలో మోడీ నోరు విప్పుతారు.

కొంత మంది ఓటమి లేదా తప్పిదాలను ఒక పట్టాన ఒప్పుకోరు, అందునా అవకాశవాద రాజకీయ నాయకులు కిందపడ్డా మాదే విజయం అంటారు. రెండు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ చేసిన పెద్ద నోట్లను రద్దు గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పిందేమిటి? ఇదేమీ ఝట్కా (ఆకస్మిక నిర్ణయం) కాదు, ఏడాది క్రితమే మీ దగ్గర నల్లధనం ఏదైనా వుంటే డిపాజిట్‌ చేయండి, అపరాధరుసుం చెల్లించండి, మీకు సాయం దొరుకుతుంది అని హెచ్చరించా. అయినప్పటికీ ఇతరుల మాదిరే మోడీ కూడా వ్యవహరిస్తారులెమ్మని కొంతమందే స్వచ్చందంగా ముందుకు వచ్చారు. నోట్ల రద్దుకు ముందు సమాంతర ఆర్ధిక వ్యవస్ధ వుంది, అది అంతర్గతంగా ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసింది. సంచుల్లో దాచిన కరెన్సీ బ్యాంకింగ్‌ వ్యవస్ధలోకి తిరిగి వచ్చింది.’ అన్నారు మోడీ.

మోడీ మహాశయుడు నోట్ల రద్దు గురించి చెప్పిందాంట్లో కొత్తదేమీ లేదు. సాధించింది ఏమిటో చెప్పాలి కదా ! ఎంత నల్లధనం బయపడింది, దానిని ఎలా వుపయోగించారు, దాని వలన ఆర్ధిక వ్యవస్ధకు జరిగిన మేలేమిటి? బ్యాంకింగ్‌ వ్యవస్ధకు పెద్ద మొత్తంలో కరెన్సీ వస్తే ఇప్పుడు బ్యాంకులకు ప్రభుత్వం మూలధనం సమకూర్చేందుకు రిజర్వుబ్యాంకుల వద్ద వున్న మిగులును ఇమ్మని ఎందుకు అడుగుతున్నట్లు ? వీటి గురించి ఎంత తరచినా కేంద్ర ప్రభుత్వం లేదా రిజర్వుబ్యాంకు అధికారికంగా ఒక్క ప్రకటనా చేయలేదు. ఒక సాధారణ అంశం మాదిరి, 2018 ఆగస్టులో తన వార్షిక నివేదికలో తప్పదు కాబట్టి వివరాలను పొందుపరచింది. దాని ప్రకారం రద్దయిన నోట్లలో 99.3శాతం తిరిగి బ్యాంకులకు వచ్చాయి. ఆ మిగిలిన 0.7శాతం కూడా చిరిగిపోయి, ధ్వంసమై చెలామణిలో లేని లేదా ఆమాయకంగా మార్చుకోకుండా తమవద్దే వుంచుకున్న అమాయక సామాన్యుల వద్ద వుండిపోయింది తప్ప అది నల్లధనం కాదు. రద్దు వలన వచ్చిన లాభం కంటే జరిగిన నష్టమే ఎక్కువని అందరికీ తెలిసిన అంగీకరించటానికి 56 అంగుళాల ఛాతీకి ధైర్యం చాల్లేదు.

రిజర్వుబ్యాంకు గవర్నర్‌ వుర్జిత్‌ పటేల్‌ రాజీనామా గురించి నరేంద్రమోడీ పెద్ద జోక్‌ పేల్చారు. మొదటిసారిగా బయట పెడుతున్నానంటూ రాజీనామాకు ఆరేడు నెలల ముందే తాను తప్పుకుంటానని చెప్పారని, వ్యక్తిగతంగా తనకు రాతపూర్వకంగా తెలియచేశారని నరేంద్రమోడీ చెప్పారు. రాజీనామా సమయంలోనే ఈ విషయం ఎందుకు చెప్పలేదు, అదేమైనా రహస్యమా, దేశ భద్రతకు సంబంధించిన అంశమా ? రిజర్వుబ్యాంకు వద్ద వున్న నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదలాయించమని పటేల్‌ను వత్తిడి చేసిన అంశం బహిరంగ రహస్యం. మిగులు నిధులు, ఇతర కొన్ని అంశాలలో తాము చెప్పినట్లు చేయకపోతే కుదరదని తెగేసి చెప్పటమే గాక దేశ చరిత్రలో తొలిసారిగా రిజర్యుబ్యాంకు చట్టంలోని సెక్షన్‌ ఏడును ప్రయోగించింది. దాని ప్రకారం ప్రభుత్వం చెప్పినట్లు రిజర్వుబ్యాంకు వ్యవహరించాల్సి వుంటుంది. ఒక స్వతంత్ర ప్రతిపత్తిగలిగిన సంస్ధకు అధిపతిగా వున్న వ్యక్తిలో ఏ కాస్త ఆత్మగౌరవం వున్నా దానికి నిరసనగా రాజీనామా చేయటం తప్ప మరొక మార్గం లేదు. వుర్జిత్‌ పటేల్‌ ఆ పని చేయకుండా తన వ్యక్తిగత కారణాలు చూపి తప్పుకున్నాడు. అయినా నరేంద్రమోడీ ఈ విషయం గురించి పిట్టకథలు చెబుతున్నారు. రాజీనామాకు అనుమతించాలంటూ ఆరేడు నెలల క్రితం పటేల్‌ రాసిన లేఖను మోడీ బయట పెట్టి వుంటే ఆయన చెబుతున్న మాటలకు విశ్వసనీయత వుండేది.

రాజకీయాల గురించి ఎంత జాణతనంతో మాట్లాడినా చెల్లుతుంది. రైతాంగరుణ భారం వంటి తీవ్ర సమస్యల గురించి ప్రధాని మోడీ చాలా చులకనగా మాట్లాడారు. రుణాల రద్దు లాలీపాప్‌ వంటివన్నారు. అదే నిజమైతే ఆయన పార్టీ మంత్రులు ఎందుకు రుణాల రద్దు గురించి మాట్లాడుతున్నట్లు ? మోడీ మాట్లాడటానికి ఒక రోజు ముందే తమకు ఒడిషాలో అధికారమిస్తే రైతుల రుణాలను రద్దు చేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా మోడీ తీరు వుంది. రుణాల రద్దు కొద్ది మందికే వుపయోగపడుతున్నాయని, బ్యాంకుల నుంచి తీసుకొనే వారు తక్కువ, వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకొనే వారే ఎక్కుని కూడా మోడీ సెలవిచ్చారు.ఆయనకు వాస్తవాలు తెలియవా, నివేదికలు చదవరా ? చదివించుకోరా ? అర్ధంగాకపోతే వివరించమని అధికారులను అడగరా ? బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొనే రైతులు చాలా తక్కువని ప్రధానే చెప్పారంటే అర్ధం ఏమిటి? బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వటం లేదనే కదా ? అదే నిజమైతే కేంద్రం గత ఐదేండ్లుగా ఏమి చేస్తున్నట్లు, ప్రాధాన్యతా రంగంగా ప్రకటించిన వ్యవసాయానికి రుణాలు తగినన్ని ఇవ్వలేదని బ్యాంకులను ఎందుకు నిలదీయలేదు. అసలు వాస్తవం ఏమంటే 2018ఆగస్టులో నాబార్డు వెల్లడించిన అధ్యయనం ప్రకారం 52.5శాతం రైతు కుటుంబాలు రుణభారంలో కూరుకుపోయాయి. వీరిలో కేవలం 11.5శాతమే వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకున్నారు. మోడీ చెప్పిందేమిటి ?

సర్జికల్‌ దాడులు తీవ్రముప్పుతో కూడుకున్నవి గనుక ఎక్కువ సేపు సాగించకుండా తెల్లవారక ముందే పూర్తి చేసి రమ్మని తాను స్పష్టమైన మార్గదర్శక సూత్రాలను జారీచేసినట్లు ప్రధాని చెప్పుకున్నారు. వినేవారుంటే చెప్పేవారు ఎన్నయినా పిట్టకథలు చెబుతారు. ఇలాంటి దాడుల గురించి గతంలో వాటిని నిర్వహించిన వారు చెప్పాలి. లేని గొప్పలు చెప్పుకోవటం తప్ప ఏ అనుభవంతో మోడీ మార్గదర్శక సూత్రాలు జారీ చేసినట్లు? గతంలోనూ అనేక దాడులు జరిపారు అయినా ఏ ప్రధానీ వాటిని ఇంతగా గొప్పలు చెప్పుకోలేదు. గోవధల పేరుతో మూకదాడులు చేసిన వారి గురించి మోడీ ఖండించారు. మరోవైపు ఆయన మంత్రులు చేసిందేమిటి? దాడులకు పాల్పడి శిక్షలు పడిన ఎనిమిది మంది నేరగాండ్లు బెయిలు మీద బయటకు వచ్చినపుడు హజారీబాగ్‌లో పూలదండలు వేసి మరీ కేంద్ర మంత్రి జయంత సిన్హా స్వాగతం పలికారు. ఇదేమి పనయ్యా అని అడిగితే అది భావ ప్రకటనా స్వేచ్చ అంటూ మరో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గడుసుతనంతో తప్పించుకున్నారు. దాద్రి హత్య కేసులో నిందితుడు చస్తే శవం మీద జాతీయజండాను కప్పి ఒక నేరగాడికి గౌరవం ఇచ్చిన మరో మంత్రి మహేశ్‌శర్మలు మోడీగారి ఈ సమయంలో గుర్తు లేదా లేక మంత్రులను ఖండించినట్లా ? ఎందుకీ వంచన? వుత్తర ప్రదేశ్‌లో గోరక్షకులుగా చెప్పుకొనే ఒక పోలీసు అధికారినే హత్య చేసిన విషయం తెలిసిందే.

Image result for Narendra Modi hypocrisy

రాఫెల్‌ విమాన ఒప్పందం గురించి మోడీ అతి తెలివి తర్కానికి పాల్పడ్డారు. అదానీ, అంబానీలకు లబ్ది చేకూర్చారు కదా అన్న ప్రశ్నకు వ్యక్తిగతంగా నా పేరు చెప్పలేదు కదా ప్రభుత్వాన్ని అన్నారు, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఎంత ఇచ్చారో చెప్పమనండి అని అడ్డుసవాలు విసిరారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు తమ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని అన్నారు. అయితే మోడీగారు చెప్పనిది, ఇంటర్వ్యూ చేసిన వారు అడగనిది ఏమిటి ? 126 విమానాల కోసం గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి అధిక ధరలకు 36విమానాలు ఎందుకు కొన్నారు ? ఎంతో అనుభవం వున్న హాల్‌ను విస్మరించి ఎలాంటి అనుభవం లేని అనిల్‌ అంబానికి కాంట్రాక్టు ఎందుకిచ్చారు? అంబానీ కంపెనీ దివాలా తీసిందా లేదా ? విమానాల ధరల వివరాలను పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీకి కాగ్‌ ఇచ్చినట్లు సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అలాంటిదేమీ లేదని కమిటీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధికారయుతంగా చెప్పారు. 2జి స్పెక్ట్రమ్‌ మాదిరి సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ ఎందుకు జరపరు? భారత ప్రభుత్వమే అంబానీ కంపెనీ పేరు సిఫార్సు చేసిందని ఫ్రెంచి మాజీ అధ్యక్షుడు హోలాండే ప్రకటించినదాని సంగతేమిటి ?

ముమ్మారు తలాక్‌ అంశం లింగవివక్షకు సంబంధించింది, శబరిమల అంశం సాంప్రదాయం అని మోడీ మహిళల పట్ల వివక్షను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు మెజారిటీ న్యాయమూర్తుల తీర్పును విస్మరించి వివక్షను సమర్ధించిన మహిళా న్యాయమూర్తి ఇందు మల్హోత్రా చెప్పిన అంశాలను ప్రధాని వివరించారంటే దేశానికి ఏ సందేశం పంపినట్లు ? అన్ని కేసులలోనూ మైనారిటీ న్యాయమూర్తుల వ్యతిరేక తీర్పులనే సమర్ధిస్తారా ? అదే ప్రాతిపదిక అయితే ఆధార్‌ కేసులో ఆ పధకాన్ని పూర్తిగా రద్దు చేయాలంటూ మైనారిటీ తీర్పు చెప్పిన చంద్రచూడ్‌ వైఖరిని అనుసరించి ఆధార్‌ను రద్దు చేస్తారా ? శబరిమలలో మహిళల పట్ల వివక్షను ప్రధాని సమర్ధిస్తున్న సమయంలోనే కేరళ మహిళా మానవహారంలో పాల్గన్నట్లు చెబుతున్న 30 నుంచి 50లక్షల మంది వరకు మహిళలు ప్రధాని వైఖరిని ఖండించినట్లే. ఇలా అనేక అంశాలను మోడీ కావాలనే విస్మరించారు, ఇంటర్వ్యూ చేసిన వారికి అవన్నీ తెలిసి కూడా అడగకుండా దాటవేశారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ నోట మరో పచ్చి అబద్దం !

01 Tuesday Jan 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

another big lie from Donald Trump, Donald trump, donald trump motormouth, policing the world, U.S. Military Bases Worldwide, US World Police Cap

Image result for donald trump , us world police

ఎం కోటేశ్వరరావు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే ! అమెరికా పాలకవర్గమూ అలాంటిదే ! వారికి యుద్ధమూ లాభమే, పోరు నిలిపివేతా లబ్ది చేకూర్చేదే అయితే దేనికైనా సిద్ధపడతారు ! అది ఆసియా ఖండమా, ఐరోపానా అన్నదానితో నిమిత్తం లేదు ! అందుకు డెమోక్రాట్లు- రిపబ్లికన్లూ అన్న తేడా లేదు ! అవసరమైతే పార్లమెంటులో రెండు పార్టీలు కలసి ఎవరు అధ్యక్షుడిగా వున్నా అడ్డుకుంటాయి లేదా మద్దతు ఇస్తాయి ! ఆ రెండు పార్టీల మధ్య తగాదా అధికారం దగ్గర తప్ప కార్పొరేట్ల ప్రయోజనాల గురించి కాదు. తమ లక్ష్యాన్ని చేరుకొనేందుకు అనుసరించాల్సిన ఎత్తుగడలు, అనుసరించాల్సిన మార్గాల మీద తప్ప లక్ష్యం మార్పు రద్దు గురించి కాదు. అమెరికా రాజకీయాలు, విధానాలను నిర్ణయించేది అక్కడి గుత్త సంస్ధలు తప్ప సామాన్యులు కాదు. రాజకీయ నేతలు వాటి తోలుబమ్మలే. అందుకే వారు ఎలా ఆడిస్తే అలా ఆడతారు. అమెరికా ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అన్నింటా అగ్రస్ధానం తమదే అనే దాని ఆటలు సాగటం లేదు. అదిరింపు, బెదిరింపు, బుజ్జగింపు, లాలింపు, తప్పదనుకుంటే రాజీ ఇదీ ఇప్పటి దాని స్ధితి. ఇలా చెప్పటం అంటే అమెరికా పని అయిపోయిందని కాదు. అగ్రరాజ్యానికి కూడా అనువుగాని పరిస్ధితులు ఎదురైనపుడు సింహం కూడా ఒకడుగు వెనక్కు వేయకత తప్పదు. ఏమిటా పరిస్ధితి, ఎందుకీ పరిణామాలు !

సిరియా నుంచి పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సగం మంది సైనికులను వుపసంహరించనున్నట్లు ట్రంప్‌ సంచలన ప్రకటన, దానికి నిరసనగా దేశ రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ రాజీనామా, ఆ తరువాత మెక్సికో సరిహద్దులో గోడకు నిధుల కేటాయింపుపై పార్లమెంట్‌లో వ్యతిరేకత, అది ప్రభుత్వ స్ధంభనకు దారితీత, ఇది కొనసాగుతుండగానే ఆకస్మికంగా ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ నగరంలో తిష్టవేసిన అమెరికన్‌ దళాల వద్దకు వెళ్లి ఇంకేమాత్రం అమెరికా ప్రపంచ పోలీసుగా వుండబోదని ఒక ప్రకటన. ఇవన్నీ పక్షం రోజుల్లో వరుసగా జరిగిన పరిణామాలు. అమెరికా జాతీయంగా, అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న సంక్షోభం, సమస్యల తీవ్రతకు ప్రతిబింబాలు. ఒక వారంలో ఒకదాన్ని సంచలనాంశంగా మారిస్తే మరో వారంలో మరో అంశాన్ని ముందుకు తెస్తున్న ట్రంప్‌ తీరుతెన్నులు ప్రపంచానికి పజిల్‌గా వుంటున్నాయి. ఒక ప్రకటన చేయటం దాని మీద స్పందనలు ఎలా వుంటాయో చూడటం, దానికి అనుగుణ్యంగా తదుపరి చర్యలు. వీటిలో ప్రపంచ పోలీసుగా అమెరికా పాత్ర గురించి వివరంగా పరిశీలించుదాం. చరిత్రలో తొలి ప్రపంచ పోలీసుగా బ్రిటన్‌ వ్యవహరిస్తే తదుపరి ఆ పాత్రను అమెరికా పోషిస్తోంది. కర్రవున్నవాడిదే గొర్రె అన్నట్లుగా ప్రపంచంపై పెత్తనం కోసం తమకు తాముగా కర్రపెత్తనం చలాయించటం తప్ప ఈ దేశాలకు ఎవరూ ఆ బాధ్యతను అప్పగించలేదు. ఆ పాత్రలో తామింక వుండలేమని ట్రంప్‌ చెప్పటం వెనుక పరమార్ధం ఏమిటి?

రేపటి నుంచి మిమ్మల్ని తినబోనని పులి చెబితే మేకలు నమ్ముతాయా, ట్రంప్‌ మారుమనస్సు పుచ్చుకున్నాడా ? ఎందుకింత పెద్ద అబద్దం చెప్పాడు. అమెరికా సమాజానికి ఇది ఒక ప్రజాకర్షక అంశంగా తయారైంది. అందుకే ఇటీవలి కాలంలో ఎవరు అధికారంలో వున్నా అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడాల్సివస్తోంది. ప్రపంచ పోలీసు పాత్రలో వుండాలనుకోవటం లేదు అన్న మాటలు కాదు, కొనసాగింపు అంశం ముఖ్యం. ‘ భారం మొత్తం మేమే భరించటం సముచితం కాదు. మమ్మల్ని, నిస్సందేహమైన మా మిలిటరీని తమ రక్షణకు వుపయోగించుకోవాలని ఇతర దేశాలు చూడటాన్ని ఇంకేమాత్రం మేము కోరుకోవటం లేదు.’ అన్నాడు.ప్రస్తుత స్ధాయిలో అమెరికా మిలిటరీ ఖర్చు వెర్రి తప్ప మరొకటి కాదు, అదుపులేని ఆయుధపోటీగా మారినందున అర్ధవంతమైన ముగింపు పలకాలి, ఒక రోజు తాను, చైనా, రష్యా నాయకులు దీని గురించి చర్చ ప్రారంభించకతప్పదు అని గతంలో ట్రంప్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు.జనాభాలో సగం, జిడిపిలో పదోవంతు కలిగిన పొరుగుదేశం వుత్తర కారియానుంచి రక్షణ కోసం దక్షిణ కొరియాను అమెరికా ఎందుకు కాపాడాలి. అమెరికా కంటే రష్యాకు మరింతదగ్గరగా వుంది జర్మనీ, తూర్పు నుంచి (రష్యా) నుంచి వస్తున్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అది జిడిపిలో ఒక శాతం కూడా ఖర్చు చేయటం లేదు వాటికోసం అమెరికా ఎందుకు ఖర్చు చేయాలి అని కూడా ప్రశ్నించాడు. గత కొద్ది సంవత్సరాలుగా తమ మిలిటరీ రక్షణ పొందాలని చూసే దేశాలు అందుకయ్యే ఖర్చులో అధికభాగం భరించాలని అమెరికా సందర్భం వచ్చినపుడల్లా చెబుతోంది, వత్తిడి తెస్తోంది. దక్షిణ కొరియాలో ఏటా మూడున్నర బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసి తమ సైన్యాన్ని అక్కడ ఎందుకు కొనసాగించాలని ట్రంప్‌ గతేడాది ప్రశ్నించాడు. మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా వుండాలంటే కొనసాగించక తప్పదని సిరియానుంచి సైనిక దళాల వుపసంహరణను వ్యతిరేకిస్తూ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన మాటిస్‌ స్పష్టం చేశాడు. ఇస్లామిక్‌ తీవ్రవాదులను అణచే పేరుతో సిరియాలో ఏటా 15, ఆఫ్ఘనిస్తాన్‌లో 45 బిలియన్‌ డాలర్లను ఏటా అమెరికా ఖర్చు చేస్తోంది. ఇంత ఖర్చు చేసి సాధించేదేమిటి? అనే ప్రశ్నకు పాలకులు సూటిగా సమాధానం చెప్పే స్ధితిలో లేరు.

పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తల విశ్లేషణ, అవగాహన ప్రకారం ఒక దేశ రక్షణ ఖర్చు కంటే అప్పుల చెల్లింపు ఎక్కువైన దేశాలు కుప్పకూలిపోతాయి. గతంలో కమ్యూనిజాన్ని, తరువాత ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని అణచే పేరుతో లేదా వాటి నుంచి దేశాలను రక్షించే సాకుతో ప్రపంచ వ్యాపితంగా అమెరికా తన సేనలను మోహరించింది. ప్రత్యక్షంగా ఆయా దేశాల గడ్డమీద లేదా ఏ క్షణంలో అయినా జోక్యం చేసుకొనేందుకు వీలుగా సమీప ప్రాంతాలలో వేసిన తిష్టవలన గానీ 150 దేశాల్లో అమెరికా సైన్యాలు వున్నట్లు లెక్క. ప్రస్తుతం అమెరికా జాతీయ రుణ భారం 21లక్షల కోట్ల డాలర్లు.2012లో ఫెడరల్‌ లోటు బడ్జెట్‌ లక్ష కోట్లు దాటగా 2018లో 779 బిలియన్‌ డాలర్లుంది.2020 నాటికి ఐదుశాతం రక్షణతో సహా ప్రతి శాఖ కోత విధించాలని ట్రంప్‌ కోరాడు. రుణ చెల్లింపులు రక్షణ ఖర్చుకంటే ఎక్కువైన కారణంగానే రోమన్‌ సామ్రాజ్యం, సోవియట్‌ యూనియన్‌ దివాలా తీశాయని, అమెరికా ఇప్పుడు దానికి దగ్గరగా వస్తోందని హార్వర్లు ప్రొఫెసర్‌ నియాల్‌ ఫెర్గూసన్‌ హెచ్చరించాడు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా సైనిక కేంద్రాలు వివిధ ప్రాంతాలు, సముద్రాలలో ఐరోపాలో 330, ఆసియాలో 210, మధ్య ప్రాచ్యంలో 73, లాటిన్‌ అమెరికాలో 71, పసిఫిక్‌లో 66, ఆఫ్రికాలో 24,కెనడా లేదా గ్రీన్‌లాండ్‌లో నాలుగు, అట్లాంటిక్‌లో రెండు చొప్పున మొత్తం 750 వున్నాయి.

ఇటీవల పార్లమెంట్‌ బడ్జెట్‌ కార్యాలయం(సిబిఓ) తెలిపిన సమాచారం ప్రకారం 2018లో జాతీయ అప్పు మీద చెల్లించిన వడ్డీ 371బిలియన్‌ డాలర్లు, ఇది రక్షణ బడ్జెట్‌లో సగం. ప్రస్తుత బడ్జెట్‌ పోకడలను బట్టి ఐదు సంవత్సరాలలో రక్షణ కంటే వడ్డీ చెల్లింపులకు కేటాయించాల్సిన మొత్తం పెరగనుంది. పది సంవత్సరాలలో వడ్డీ,సామాజిక భద్రత వంటి పధకాలకు పన్ను వసూళ్లలో 85శాతం ఖర్చు అవుతుందని, జిడిపిలో 2018లో 3.1శాతంగా వున్న రక్షణ బడ్జెట్‌ 2028నాటికి 2.6శాతానికి తగ్గనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఐరోపాలోని ధనిక దేశాల రక్షణ ఖర్చు గణనీయంగా పెరగనుంది. వడ్డీ రేట్ల పెరుగుదల అంచనా కంటే వేగంగా వుంటే ఇంకా ముందే ఏడాదికి వడ్డీ చెల్లింపులు 900బిలియన్‌ డాలర్లకు చేరి రక్షణ ఖర్చును మించి పోవచ్చు. చైనా, ఐరోపా యూనియన్‌ దేశాల రక్షణ ఖర్చు జిడిపిలో రెండుశాతానికి చేరితే త్వరలోనే అమెరికాతో సమం కావచ్చు. ఇప్పుడున్న తీరు తెన్నులను బట్టి 2035నాటికి చైనా, ఐరోపా యూనియన్‌లు అమెరికాను అధిగమించనున్నాయి.

సామ్రాజ్యం అంటే వలసలు లేదా అధీన రాజ్యాలు కలిగి వుండటం అన్నది సాంప్రదాయ అర్ధం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఆ పరిస్ధితి అంతరించింది కనుక ఇప్పుడు ప్రపంచవ్యాపితంగా ఎన్ని సైనిక కేంద్రాలు, ఎందరు సైనికులున్నారన్నది సామ్రాజ్యవాదానికి తాత్పర్యంగా చెప్పవచ్చు.దీనికి ముందే చెప్పుకున్న సైనిక కేంద్రాలే నిదర్శనం. చమురు రవాణా సక్రమంగా జరిగేందుకు నావల ప్రయాణించే మార్గాలు, పైపులైన్ల రక్షణ మొదలు అనేక వ్యూహాత్మక అవసరాలకు అమెరికా ఈ కేంద్రాలను, సైన్యాన్ని వినియోగిస్తున్నది. వీటికి ఏటా 156 బిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతున్నది. సాంప్రదాయక సామ్రాజ్యవాదం అది బ్రిటన్‌ లేదా ఫ్రెంచి, డచ్‌, పోర్చుగీసు, స్పెయిన్‌ ఏదైనా కావచ్చు, వందల సంవత్సరాలు వలస దేశాలలో తిష్టవేసి ప్రధానంగా వాటిని తమ పరిశ్రమలకు ముడివస్తువులను సరఫరా చేసే దేశాలుగానూ, పారిశ్రామిక వస్తువులకు మార్కెట్లగానూ వినియోగించుకున్నాయి. కానీ అమెరికా సామ్రాజ్యవాదం వీటితో పాటు అంతకు ముందు లేని కమ్యూనిజం వ్యాప్తి నిరోధం, కమ్యూనిస్టు దేశాల అణచివేతను కూడా జోడించి వివిధ ప్రాంతాలలో కుట్రలకు తెరలేపింది, నియంతలను బలపరిచింది, యుద్ధాలను, వాటికి అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తూ ఆర్ధికంగా లబ్దిపొందుతున్నది. ఈ కారణంగానే మిలిటరీ పారిశ్రామిక కార్పొరేట్‌లు అవతరించాయి.వుదాహరణకు మనకందరకు తెలిసిన బోయింగ్‌ కంపెనీ ప్రయాణీకుల విమానాలతో పాటు యుద్ధ జెట్‌ విమానాలతో పాటు అనేక మారణాయుధాలను కూడా తయారు చేస్తున్నది. అవి నిత్యం పని చేస్తూ వుండాలంటే ప్రపంచంలో నిత్యం ఏదో ఒక మూల ఒక దేశం మరొక దేశంతో కొట్లాడుకోవాలి లేకపోతే అమెరికాయే ప్రత్యక్షంగా ఎక్కడో ఒక చోట దాడులకు తెగబడుతూ వుండాలి. రక్షణ ఒప్పందాలు, ముప్పు పేరుతో అనేక దేశాలను తన గుప్పెటలోకి తెచ్చుకొని నిరంత ఆయుధ విక్రయాలతో దోపిడీ సాగిస్తున్నది. అలాంటి దేశం తెల్లవారేసరి తాను ప్రపంచ పోలీసు పాత్రనుంచి తప్పుకోవాలను కుంటుందా ? తన ఆయుధ పరిశ్రమలను మూసివేసుకుంటుందా ? లాభాలను వదులుకుంటుందా ?

Image result for donald trump on us world police cartoons

విదేశాలలోని సైనిక స్ధావరాలలో అమెరికా లక్షన్నర మంది సైనికులను మోహరించింది. నిజానికి పాతికేండ్ల క్రితం ప్రచ్చన్న యుద్ధంలో విజయం సాధించామని, కమ్యూనిజం అంతరించిందని చెప్పిన అమెరికా విదేశాల్లోని సగం సైనిక కేంద్రాలనైనా తక్షణమే మూసి వుండాల్సింది. కానీ కేంద్రాల సంఖ్యతో పాటు సైనికులను మోహరించిన దేశాల సంఖ్య కూడా 40 నుంచి 80కి పెరిగింది.సహజంగానే ఖర్చు కూడా తడిచి మోపెడు అవుతుంది. ఈ ఖర్చు ఎంతో నిజానికి బయటి ప్రపంచానికి తెలియదు. విదేశీ స్ధావరాల వార్షిక ఖర్చు ఎంత అని పార్లమెంట్‌ కోరితే 21 లేదా 22 బిలియన్‌ డాలర్లని పేర్కొన్నారు. అయితే దీన్నెవరూ నమ్మటం లేదు, ఏడాదికి కనీసం 250 బిలియన్‌ డాలర్లని కొందరి అంచనా. పైకి చెప్పకపోయినప్పటికీ జపాన్‌లో 113, దక్షిణ కొరియాలోని 83 సైనిక కేంద్రాలు నిజానికి ఏక్షణంలో అయినా చైనా లేదా రష్యాతో యుద్ధానికి తలపడే సన్నద్దతతో గత ఏడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. దీని వలన సామాన్యజనానికి భారం తప్ప వారికి ఒరుగుతున్నదేమీ లేదు. ఆయుధ పరిశ్రమలకు నిరంతరం లాభాలు వస్తున్నాయి.నిరంతరం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అమెరికా 33 అప్రజాస్వామిక దేశాలలో సైనిక కేంద్రాలను నడుపుతున్నదని ఒక మాజీ అధికారి పేర్కొన్నాడు. ఇవే కాదు సైనిక స్ధావరం వున్న ప్రతి దేశం అమెరికా ఆయుధాలు, వస్తువులకు అవి మార్కెట్లుగా వున్నాయని వేరే చెప్పాల్సిన పని లేదు. అందుకే ట్రంప్‌ మరో పచ్చి అబద్దం ఆడాడని చెప్పాల్సి వస్తోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: