• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: October 2019

లాటిన్‌ అమెరికాలో నయా ఉదారవాద విధానాలు-పర్యవసానాలు !

30 Wednesday Oct 2019

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Latin America, Opinion, USA

≈ Leave a comment

Tags

Argentina elections, Bolivarian Revolution, Latin America, Lenín Moreno, neoliberalism, Neoliberalism in Latin America

Image result for chilean protests

ఎం కోటేశ్వరరావు
లాటిన్‌ అమెరికాలో ఒక వైపున ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమాలు, మరోవైపున కొన్ని దేశాల్లో ఎన్నికలతో అక్కడి పరిణామాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. చిలీ, ఉరుగ్వే,హైతీ, బొలీవియాలో ఆందోళనలు జరిగాయి. అర్జెంటీనా, బొలీవియా, ఈక్వెడోర్‌లో సాధారణ, కొలంబియాలో స్ధానిక సంస్దల ఎన్నికలు ముగిశాయి. చిలీ పాలకులు ఒక అడుగు దిగినా అక్కడి ఉద్యమం ఆగలేదు. ఉరుగ్వేలో ప్రభుత్వం రద్దు చేసిన సబ్సిడీలను, పెంచిన భారాలను వెనక్కు తీసుకుంటూ ఉద్యమకారులతో ఒక ఒప్పందం చేసుకోవటంతో తాత్కాలికంగా ఆందోళనలు ఆగాయి. స్థలాభావం రీత్యా ఉద్యమాలకు సంబంధించి మరో సందర్భంలో చర్చించుదాం. నాలుగు దేశాల్లో జరిగిన ఎన్నికల ప్రాధాన్యతను చూద్దాం.
నాలుగు సంవత్సరాల క్రితం మితవాద శక్తులు విజయం సాధించిన అర్జెంటీనాలో అంతకు ముందు అధికారంలో ఉన్న ప్రజాతంత్ర లేదా వామపక్ష శక్తులు తిరిగి ఈ గద్దెనెక్కాయి. బొలీవియాలో వామపక్ష ఇవో మోరెల్స్‌ మరోసారి అధికారానికి వచ్చారు. ఉరుగ్వేలో అధికారంలో ఉన్న వామపక్ష బ్రాడ్‌ ఫ్రంట్‌ మెజారిటీకి అవసరమైన 50శాతం ఓట్లను సాధించలేదు, పెద్ద పార్టీగా అవతరించి వచ్చే నెలలో జరిగే అంతిమ పోటీకి సిద్దం అవుతోంది. కొలంబియాలో కొలంబియా విప్లవ సాయుధ శక్తులు(ఎఫ్‌వామపక్ష సాయుధ సంస్ధ (ఎఫ్‌ఏఆర్‌సి)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న తరువాత జరిగిన తొలి స్ధానిక సంస్ధల ఎన్నికలలో రాజధాని బగోటాతో సహా అనేక ప్రధాన పట్టణాలు, ప్రాంతాలలో వామపక్ష శక్తులు విజయం సాధించాయి. కొన్ని దేశాలలో తలెత్తిన ఉద్యమాలు, కొన్ని దేశాలలో జరిగిన ఎన్నికలలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల విజయాల వెనుక ఉన్న అంశాలేమిటి, వాటిని ఎలా చూడాలన్నది ఒక ప్రశ్న.
అర్జెంటీనా ఎన్నికల ఫలితం వామపక్ష జనాకర్షకం వైపు మొగ్గుదలకు సూచిక అని ఒక విశ్లేషణ శీర్షిక. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అర్జెంటీనాలో సామాజిక న్యాయం కోరే న్యాయ పార్టీ పేరుతో ముందుకు వచ్చిన శక్తులు పెట్టుబడిదారీ విధానం, కమ్యూనిజాలకు భిన్నంగా తృతీయ మార్గం అనుసరిస్తామని చెప్పుకున్నాయి. ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు ఆ పార్టీకి చెందిన జువాన్‌ డోమింగో పెరోన్‌ అధ్యక్షుడిగా ఎన్నికై ఒక వరవడికి నాంది పలకటంతో ఆ పార్టీని పెరోనిస్టు పార్టీ అని కూడా అంటారు. సంక్షేమ చర్యలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రత్యర్ధి పార్టీలు పెరోనిస్టులను నిరంకుశులని కూడా విమర్శిస్తారు. పెరోనిస్టు పార్టీ విధానాలతో విబేధించిన వారు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి విడివడి వేరే పార్టీని ఏర్పాటు చేసిన మావోయిస్టులు ఈ ఎన్నికలలో విజయం సాధించిన పెరోనిస్టు పార్టీ అభ్యర్ధికి మద్దతు ప్రకటించారు. మొత్తంగా చూస్తే అర్జెంటీనాలో కమ్యూనిస్టుల బలం పరిమితం.

Image result for argentina new president
తాజా ఎన్నికల విషయానికి వస్తే 2015లో అధికారం కోల్పోయిన పెరోనిస్టు పార్టీ తిరిగి విజయం సాధించింది. గతంలో ఆ పార్టీలో తెరవెనుక ప్రముఖ పాత్ర వహించిన ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ ప్రస్తుత అధ్యక్షుడు మార్సియో మక్రీని తొలి దశ ఎన్నికల్లోనే ఓడించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం నలభైశాతం ఓట్లు తెచ్చుకొని ప్రధమ స్ధానంలో ఉన్న అభ్యర్ధికి రెండో స్ధానంలో వున్న వారికి పదిశాతం ఓట్ల తేడా ఉండాలి లేదా పోలైన ఓట్లలో 45శాతం తెచ్చుకొని ప్రధమ స్ధానంలో ఉంటే ఎన్నికైనట్లు పరిగణిస్తారు. ప్రస్తుతం ఫెర్నాండెజ్‌ 48శాతం ఓట్లు సాధించి తొలి దశలోనే ఎన్నికయ్యారు. పెరోనిస్టు పార్టీకి చెందిన మాజీ దేశాధ్యక్షురాలు క్రిస్టినా కిర్చెనర్‌ వైఖరితో విబేధించి పార్టీకి దూరంగా ఉన్న ఫెర్నాండెజ్‌తో సర్దుబాటు చేసుకొని అధ్యక్ష అభ్యర్ధిగా, ఆమె ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఫెర్నాండెజ్‌ అధ్యక్షుడే అయినా అసలు సారధి క్రిస్టినా అనే అభిప్రాయం కొంత మందిలో ఉంది. గత అనుభవాల రీత్యా ఫెర్నాండెజ్‌ తనదైన ముద్ర వేయటానికి ప్రయత్నిస్తారని కూడా మరో అభిప్రాయం వెల్లడైంది.
లాటిన్‌ అమెరికా రాజకీయాల్లో నేడున్న పరిస్ధితుల్లో ఫెర్నాండెజ్‌ ఎన్నిక ప్రజాతంత్ర, పురోగామి శక్తులకు ఊపునిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. వెనెజులాలో వామపక్ష నికోలస్‌ మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా జరుపుతున్న కుట్రలకు ఓడిపోయిన మార్సియో మక్రీ మద్దతు ఇచ్చాడు. తిరుగుబాటుదారు జువాన్‌ గురుడోను అధ్యక్షుడిగా గుర్తించిన వారిలో ఒకడు. ఇప్పుడు మదురో కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఆర్ధికంగా ఉన్న ఇబ్బందులు, ఐఎంఎఫ్‌తో సంబంధాల కారణంగా అమెరికా వత్తిడికి తలొగ్గితే అనే సందేహం ఉండనే వుంటుంది. గతంలో అధికారంలో ఉన్న పెరోనిస్టు పార్టీ, మక్రీ సర్కారు కూడా సంక్షేమ చర్యల విషయంలో తప్పితే మొత్తంగా నయావుదారవాద విధానాలనే అనుసరించారు. అందువల్లనే గతంలో పెరోనిస్టు క్రిస్టినా సర్కార్‌ మీద జనంలో అసంతృప్తి తలెత్తింది. మక్రీ అనుసరించిన విధానాల కారణంగా జనజీవనం మరింత దిగజారింది. ద్రవ్యోల్బణం 50శాతం, అభివృద్ధి సూచనలు కనుచూపు మేరలో కనపడటం లేదు, ఉపాధి తగ్గింది, దారిద్య్రం పెరిగింది. ఈ నేపధ్యంలో ఐఎంఎఫ్‌, ఇతర సంస్ధలతో వందబిలియన్‌ డాలర్లకోసం గత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. దాన్ని తీసుకుంటే చిలీ, ఉరుగ్వే మాదిరి సంక్షేమ చర్యలు, సబ్సిడీలకు తిలోదకాలివ్వాల్సి ఉంటుంది. ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.
బొలీవియాలో అక్టోబరు 20న జరిగిన ఎన్నికల్లో ‘సోషలిజం దిశగా ఉద్యమం’ (మువ్‌మెంట్‌ టువార్డ్స్‌ సోషలిజం-మాస్‌) పార్టీ నేత ఇవో మొరేల్స్‌ మరోసారి ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ అనేక దేశాలు ఆ ఎన్నికను ఇంకా గుర్తించలేదు. అక్రమాలపై విచారణ జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది. అమెరికా దేశాల సంస్ధ అలాంటి విచారణ జరిపి అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే మరోసారి ఎన్నికలు జరపటానికి తాను సిద్ధమే అని మొరేల్స్‌ ప్రకటించారు. ఆదివాసీలు మెజారిటీగా ఉన్న బొలీవియాలో ఐదు వందల సంవత్సరాల తరువాత తొలిసారిగా ఆ సామాజిక తరగతులకు చెందిన మొరేల్స్‌ దేశాధ్యక్షుడయ్యారు.ఒక ఉద్యమకారుడిగా ఉన్న సమయంలో పాలకపార్టీ, మాదక ద్రవ్యాల మాఫియా గూండాలు ఆయనమీద దాడి చేసి మరణించాడనుకొని వదలి వెళ్లారు. బతికి బయటపడి అనేక ఉద్యమాల తరువాత 2006లో అధికారానికి వచ్చారు. రాజ్యాంగంలో అనేక మార్పులు చేసి సామాన్య జనానికి సాధికారత కలిగించటంతో పాటు దారిద్య్ర నిర్మూలనకు ఎన్నో చర్యలు తీసుకున్నారు. తొలి నుంచి ఆయనను అధికారం నుంచి తొలగించేందుకు అమెరికాతో చేతులు కలిపిన శక్తులను ఎదుర్కొని నిలిచారు. మొరేల్స్‌ గెలిస్తే తాము ఆ ఎన్నికను గుర్తించబోమని ప్రతిపక్షాలు ముందే ప్రకటించాయి. దానికి అనుగుణ్యంగానే విచారణ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి.

Image result for claudia lopez
కొలంబియా స్ధానిక సంస్ధల ఎన్నికల విషయానికి వస్తే దేశాధ్యక్ష పదవి తరువాత ప్రాధాన్యత కలిగిన రాజధాని బగోటా మేయర్‌గా వామపక్ష వాది క్లాడియా లోపెజ్‌ను ఎన్నుకున్నారు. ఆ నగర తొలి మహిళా మేయర్‌గా కూడా ఆమె చరిత్రకెక్కారు. మాజీ అధ్యక్షుడు, పచ్చి మితవాది అయిన అల్వారో యురిబి ఒక ట్వీట్‌లో స్ధానిక సంస్ధల ఎన్నికలలో తమ ఓటమిని అంగీకరిస్తూ మధ్యే, వామపక్ష వాదుల వైపు ఓటర్లు మొగ్గు చూపారని వ్యాఖ్యానించాడు. అవినీతి వ్యతిరేక ఆందోళనకారిణిగా పేరున్న లోపెజ్‌ ఒక జర్నలిస్టు. పారామిలిటరీ దళాల రాజకీయ జోక్యం గురించి పరిశోధనాత్మక కధనాలు వెల్లడించినందుకు ఆమెను చంపివేస్తామనే బెదిరింపులు రావటంతో 2013లో కొలంబియా వదలి విదేశాల్లో తలదాచుకున్నారు.2016లో ఎఫ్‌ఏఆర్‌సితో ఒప్పందం కుదిరిన తరువాత స్వదేశం వచ్చి రాజకీయ కార్యాకలాపాల్లో పాల్గొని 2018లో ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
ఉరుగ్వేలో 2005 నుంచి అధికారంలో ఉన్న వామపక్ష బ్రాడ్‌ ఫ్రంట్‌ పెద్ద పార్టీగా అధ్యక్ష ఎన్నికలలో ముందుకు వచ్చినప్పటికీ అవసరమైన సంఖ్యలో ఓట్లను తెచ్చుకోలేకపోయింది. సగానికి పైగా ఓట్లు తెచ్చుకోవాల్సి ఉండగా పార్టీ అభ్యర్ధి డేనియల్‌ మార్టినెజ్‌కు 40.7శాతం వచ్చాయి. దీంతో నవంబరు 24న ప్రధమ, ద్వితీయ స్ధానాల్లో వున్న అభ్యర్ధుల మధ్య తుది పోటీ జరగనుంది. మితవాద నేషనల్‌ పార్టీకి చెందిన లాకలే పౌ 29.7శాతం తెచ్చుకున్నాడు, మూడు, నాలుగు స్ధానాల్లో 12.8, 11.3శాతం చొప్పున ఓట్లు తెచ్చుకున్న మితవాద పార్టీలు లాకలేకు మద్దతు ఇస్తామని ప్రకటించాయి. ఆ ఓటింగ్‌లో ఎలాంటి మార్పు లేనట్లయితే బ్రాడ్‌ఫ్రంట్‌ గెలిచే అవకాశం వుండదని విశ్లేషణలు వెలువడ్డాయి.2014 ఎన్నికల్లో బ్రాడ్‌ ఫ్రంట్‌కు తొలి దశలో 49.45శాతం వచ్చాయి. తుది ఎన్నికల్లో 56శాతం తెచ్చుకుంది. ఈ సారి తొలి దశలో ఓట్లు గణనీయంగా తగ్గినందున అంతిమ ఫలితం గురించి ఉత్కంఠనెలకొన్నది.
నేషనల్‌, కొలరాడో మితవాద పార్టీల కూటమి 1830 నుంచి తిరుగులేని అధికారాన్ని చలాయించింది. 2005లో బ్రాడ్‌ఫ్రంట్‌ దానికి తెరదించింది. అయితే ఈ ఎన్నికల్లో శాంతి భద్రతలు, పౌరులకు భద్రత అంశాలతో పాటు ఎదుగూ బొదుగూ లేని ఆర్ధిక స్ధితి, ఏడున్నరశాతం ద్రవ్యోల్బణం, తొమ్మిదిశాతం నిరుద్యోగం కారణంగా బ్రాడ్‌ ఫ్రంట్‌ మద్దతు కొంత మేరకు దెబ్బతిన్నట్లు ఓట్ల వివరాలు వెల్లడించాయి. అయితే ఓటర్లు తిరిగి మితవాద శక్తులకు అధికారాన్ని అప్పగిస్తారా అన్నది చూడాల్సి వుంది.

Image result for neoliberalism and its consequences in latin america
లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాలలో ప్రజా ఉద్యమాలు తలెత్తటానికి, కొన్ని చోట్ల వామపక్ష శక్తులకు ఎదురు దెబ్బలు తగలటానికి, తిరిగి ఓటర్ల మద్దతు పొందటానికి ఆయా దేశాలలో అనుసరిస్తున్న నయా ఆర్ధిక విధానాలే కారణంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ విధానాల ప్రయోగశాలగా మారిన లాటిన్‌ అమెరికాలో దాదాపు అన్ని దేశాలలో వాటిని అమలు జరిపేందుకు గతంలో నియంతలను పాలకవర్గాలు ఆశ్రయించాయి. చిలీ వంటి చోట్ల వాటిని వ్యతిరేకించినందుకు కమ్యూనిస్టు అయిన సాల్వెడార్‌ అలెండీ వంటి వారిని హతమార్చేందుకు కూడా వెనుదీయలేదు. ప్రజాస్వామ్య ఖూనీ, సంక్షేమ చర్యలకు కోత, ప్రజల మీద భారాలు మోపటం, ఆర్ధిక వ్యవస్ధలను దివాలా తీయించిన పూర్వరంగంలో అక్కడ వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు నిర్వహించిన నిరంతర పోరాటాల కారణంగా జనం మద్దతు పొంది ఈ శతాబ్ది ప్రారంభంలో అనేక దేశాలలో అధికారానికి వచ్చాయి. అయితే నయా వుదారవాద విధానాల పునాదులను పెకలించకుండా ఉన్నంతలో జనానికి మేలు చేకూర్చేందుకు ఆ ప్రభుత్వాలు పని చేసి వరుస విజయాలు సాధించాయి. అయితే పెట్టుబడిదారీ వ్యవస్ధలో వాటికి వున్న పరిమితుల కారణంగా జనంలో కొంతకాలానికి అసంతృప్తి తలెత్తటం, కొన్ని చోట్ల అవినీతి కారణంగా బ్రెజిల్‌, అర్జెంటీనా వంటి చోట్ల ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే అర్జెంటీనాలో ప్రత్యామ్నాయంగా వచ్చిన పాలకుల తీరు మరింతగా దిగజారటంతో తిరిగి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులకు పట్టం కట్టారు. ఈక్వెడోర్‌లో అధికారానికి వచ్చిన రాఫెల్‌ కొరెయా 2007-17 అధ్యక్షుడిగా అనేక సంక్షేమ చర్యలు చేపట్టారు. అంతకుముందు పాలకులు చేసిన అప్పులతో తమకు సంబంధం లేదని ప్రకటించటమే కాదు, అంతర్జాతీయ కోర్టులలో వాదించి 60శాతం మేరకు అప్పును రద్దు చేయించారు.దారిద్రాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే 2017ఎన్నికలో వామపక్ష అభ్యర్ధిగా విజయం సాధించి లెనిన్‌ మొరెనో వామపక్ష విధానాలకు స్వస్ధి చెప్పి దేశీయంగా, అంతర్జాతీయంగా నయావుదారవాద విధానాలు, రాజకీయ వైఖరులను అనుసరించి ప్రజాగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తప్పుడు కేసులతో రాఫెల్‌ కొరియాను అరెస్టు చేయించేందుకు ప్రయత్నించాడు. ప్రజల మీద భారాలు మోపేందుకు పూనుకోవటంతో తాజాగా అక్కడ ప్రజాందోళనలు తలెత్తాయి. విధిలేని స్ధితిలో తలగ్గాల్సి వచ్చింది. అందువలన లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు వర్గపోరాటాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయి, రాజీలేని విధానాలతో పాటు నయా వుదారవాద విధానాల బాటను వీడాల్సిన అవసరాన్ని అక్కడి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాదంతో మరింత ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వుంటుంది. దాన్ని ఎదుర్కొవటం తప్ప మరొక దగ్గరి దారి లేదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

విద్రోహిగా మారిన విడి సావర్కర్‌ భారత రత్నమా ?

20 Sunday Oct 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

A militant turned british agent vd savarkar, Bharat Ratna ?, Saverkar Hindutva, vd savarkar

Image result for savarkar, chitragupta

ఎం కోటేశ్వరరావు
విజేతలే చరిత్రను రాశారు అని బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ చెప్పాడు. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోందా ? ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో తమకు విజయం చేకూర్చితే ఫలాన చర్యలు చేపడతామని ఎన్నికల ప్రణాళిక రూపంలో ఓటర్ల ముందుకు వస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో తాము వినాయక దామోదర్‌ సావర్కర్‌కు (విడి సావర్కర్‌) భారత రత్న అవార్డు ఇప్పించేందుకు కృషి చేస్తామని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి పరోక్షంగా తన హిందూత్వ అజెండాకు ఆమోదం పొందేందుకు పూనుకుంది. పెన్సిలిన్‌ ఇంజక్షన్లు అందరి శరీరాలకు సరిపడవు. అందువలన పరీక్ష చేసేందుకు రోగికి పరిమిత మొత్తంలో ముందు ఎక్కించి వికటించిన లక్షణాలు కనిపించకపోతే నిర్ణీత డోనుసు అందించటాన్ని మనం చూశాము. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ తన రాజకీయ విభాగం బిజెపి ద్వారా అటువంటి ప్రయోగానికే పూనుకుందని చెప్పవచ్చు. సావర్కర్‌ ఒక్కడి గురించి చెబితే తలెత్తే వ్యతిరేకతను నీరు గార్చేందుకు లేదా ఒక ఎత్తుగడగా మహారాష్ట్రకు చెందిన సంస్కర్తలు జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే పేర్ల సరసన సావర్కర్‌ను చేర్చారు. ఇది పూలే దంపతులను అవమానించటం తప్ప మరొకటి కాదు.
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మతోన్మాద శక్తులు తప్ప వామపక్ష భావజాలం నుంచి పెట్టుబడిదారీ వ్యవస్ధను కోరుకొనే వారి వరకు సామ్రాజ్యవాద వ్యతిరేకత ప్రాతిపదికగా పని చేశారు. దేశంలో ఉన్న సామాజిక పరిస్ధితుల్లో లౌకిక వాదం ఒక ఐక్యతా శక్తిగా పని చేసింది. అందువల్లనే మన చరిత్రను దానికి అనుగుణ్యంగానే చరిత్రకారులు రచించారు. అనేక మంది చరిత్రను మార్క్సిస్టు దృక్కోణంలో శాస్త్రీయంగా రూపొందించేందుకు ప్రయత్నించారు. వారిలో కమ్యూనిజంతో సంబంధం లేని వారు, కమ్యూనిస్టులు కాని వారు ఎందరో ఉన్నారు.

బిజెపి నయా భారత్‌ , నయా దేశ పిత, నయా భారత రత్నలు !
జర్మనీ చరిత్రకు వక్రభాష్యం చెప్పిన నాజీల మాదిరి మన దేశ చరిత్రను వక్రీకరించి మత కోణంలో జనాల మెదళ్లకు ఎక్కించేందుకు ప్రయత్నం జరుగుతోంది. దానికి గాను ప్రస్తుతం ఉన్న పుస్తకాలలో చరిత్రను వక్రీకరించారని, బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు, కమ్యూనిస్టు అవగాహన మేరకు రాసినది తప్ప మన ఘనమైన గత చరిత్రను ప్రతిబింబించటం లేదని నిరంతరం ప్రచార దాడి చేస్తున్నారు. ప్రతిదాన్నీ మత కోణంతో చూసే తిరోగమన శక్తులు మతకోణంతో చరిత్రను జనాల మెదళ్లకు ఎక్కించే ప్రయత్నం తీవ్రంగా జరుగుతోంది. దేశ చరిత్రలో తొలిసారిగా మతోన్మాద భావజాల ప్రాతిపదికగా పని చేసే వారు పార్లమెంటరీ వ్యవస్ధలోని నాలుగు ప్రధాన పదవులైన తొలిసారిగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్లుగా బాధ్యతల్లో ఉన్న సమయమిది. గతంలో అనేక రంగాలలో ఆశక్తులు ప్రవేశించినప్పటికీ పూర్తి ఆధిపత్యాన్ని కలిగిన సమయమిదే. అంటే ఆ శక్తులు విజయం సాధించాయి. వారి చర్యలు ఇప్పుడు విన్‌స్టన్‌ చర్చిల్‌ చరిత్ర గురించి చెప్పిన అంశాలను గుర్తుకు తెస్తున్నాయి.

జవహర్‌లాల్‌ నెహ్రూను ఆధునిక భారత నిర్మాతగా అనేక మంది పరిగణిస్తారు. అందువలన నరేంద్రమోడీ తాను నూతన భారత్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పుకోవటం ద్వారా నూతన భారత నిర్మాతగా చరిత్రకెక్కేందుకు చూస్తున్నారు. మహాత్మాగాంధీని జాతిపితగా పరిగణిస్తున్నంత కాలం మరొకరిని ఆ స్ధానంలో ఉంచలేరు. అందువల్లనే నరేంద్రమోడీని డోనాల్డ్‌ ట్రంప్‌ భారత దేశ పిత అని వర్ణించాడు. దేశంలో ఇప్పటి వరకు ప్రకటించిన భారత రత్నలో మతోన్మాదులు ఎవరూ లేరు. నయా భారత్‌ కనుక రాబోయే రోజుల్లో వారే నిజమైన జాతీయవాదులు, జాతి రత్నాలుగా చరిత్రకు ఎక్కనున్నారంటే అతిశయోక్తి కాదు.

విప్లవకారుడు-విద్రోహి -మతోన్మాది !

మన దేశ చరిత్రలో వి డి సావర్కర్‌ అత్యంత వివాదాస్పద వ్యక్తి. యువకుడిగా తీవ్రవాద జాతీయ వాద భావాలకు ఆకర్షితుడైన వారిలో ఒకరు. తరువాత లండన్‌లో న్యాయవిద్య చదివే సమయంలో అక్కడ స్వాతంత్య్ర భావాలతో పని చేసే వారితో ఏర్పడిన పరిచయాల ప్రభావంతో కొన్ని రచనలు కూడా చేశారు. 1857 ప్రధమ స్వాతంత్య్రపోరాటంలో హిందువులు-ముస్లింలు ఎలా కలసిపని చేశారో వివరిస్తూ మరాఠీలో ఒక పుస్తకం కూడా రాశారు. తీవ్రవాద భావాలతో స్వాతంత్య్రం కోసం పనిచేస్తున్న అనేక మంది మాదిరి బ్రిటీష్‌ పాలకులు కేసులు బనాయించి 50 సంవత్సరాల జైలు శిక్షవేసి సావర్కర్‌ను కూడా అండమాన్‌కు పంపారు. అప్పటి వరకు నిర్బంధం అంటే ఏమిటో తెలియని సావర్కర్‌ అండమాన్‌ వెళ్లిన వారు తిరిగి రారు అనే ప్రచారం, కొన్ని వుదంతాలను విని పిరికిబారి జైలు నుంచి బయట పడేందుకు గాను బ్రిటీష్‌ ప్రభుత్వానికి విధేయుడిగా వుంటానని అరడజను లేఖలు రాసి బయటపడటమే కాదు, బ్రిటీష్‌ వారికి ఎలా కావాలంటే అలా సేవ చేస్తానని రాసి ఇచ్చాడు. తరువాత దాన్ని తుచ తప్పకుండా అమలు జరిపాడు. దీనికి సంబంధించిన ఆధారాలు బయట పడిన తరువాత తమ నేత ఒక ఎత్తుగడగా ఆ లేఖలు రాసినట్లు సంఘపరివార్‌ నేతలు చెప్పటం ప్రారంభించారు. ఇదే సమయంలో మితవాద తిరోగమన హిందూత్వ ప్రచారకుడిగా మారిపోయాడు. బ్రిటీష్‌ వారిపై తిరుగుబాటు చేసేందుకు సుభాస్‌ చంద్రబోస్‌ భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేస్తే యువకులు బ్రిటీష్‌ సైన్యంలో చేరేందుకు సావర్కర్‌ తోడ్పడ్డారని, స్వాతంత్య్ర సమరాన్ని పక్కదారి పట్టించేందుకు హిందూత్వ భావజాలాన్ని ముందుకు తెచ్చారని విమర్శకులు పేర్కొన్నారు. చివరకు మహాత్మా గాంధీ హత్యకేసులో కూడా సావర్కర్‌ ఒక ముద్దాయని, సాంకేతిక కారణాలతో కేసునుంచి బయటపడ్డారని పరిశీలకులు పేర్కొన్నారు.

Image result for vd savarkar chitraguptaఇద్దరు దేశ భక్తులు – రెండు లేఖలు- ఎంత తేడా !
సంఘపరివార్‌ శక్తులు అటు భగత్‌ సింగ్‌ను ఇటు విడి సావర్కర్‌ను దేశ భక్తులుగానే పరిగణిస్తాయి. సావర్కర్‌ను తమ ఆరాధ్య దైవంగా పరిగణిస్తాయి. జైలు శిక్షకు గురైన సావర్కర్‌ అండమాన్‌ జైలు నుంచి తనను విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి నమ్మిన బంటుగా పని చేస్తానని లేఖ రాశాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదానికి బహుళ ప్రచారం తెచ్చిన భగత్‌ సింగ్‌ తనకు విధించిన ఉరిశిక్షను అమలు జరపాలని లేఖ రాశాడు. ఆ మేరకు తన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించాడు. అదే సావర్కర్‌ విషయానికి వస్తే తనను జైలు నుంచి విడుదల చేసిన బ్రిటీష్‌ వారికి విధేయుడిగా మారిపోయి స్వాతంత్య్ర వుద్యమం నుంచి దూరం అయ్యాడు. హిందూత్వశక్తిగా మారాడు.

ద్విజాతి సిద్ధాంతం, పాక్‌ ఏర్పాటును కోరిన ముస్లింలీగ్‌తో అధికారం !

పాకిస్ధాన్‌ ఏర్పాటు గురించి మహమ్మదాలీ జిన్నా, ముస్లింలీగ్‌ నేతలు ప్రతిపాదన తీసుకు రావటానికి రెండు సంవత్సరాల ముందే హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతులంటూ సావర్కర్‌ ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్‌ నేతలు అరెస్టయిన సమయంలో హిందూ మహాసభ నేతగా వున్న సావర్కర్‌ సింధు, బెంగాల్‌ రాష్ట్రాలలో ముస్లింలీగ్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటుకు నాయకత్వం వహించారు. ఆచరణాత్మక రాజకీయాలంటూ ఆ చర్యలను సమర్ధించుకున్నారు.అంతే కాదు హిందువులందరూ బ్రిటీష్‌ మిలిటరీ చేరాలని దేశమంతటా ప్రచారం చేసిన ‘ అపర దేశ భక్తుడు ‘. హిందూ మహాసభ, ముస్లింలీగ్‌ రెండూ కూడా స్వాతంత్య్రవుద్యమానికి దూరంగా వున్నవే కావటం గమనించాల్సిన అంశం.1943లో సింధు రాష్ట్ర అసెంబ్లీ భారత్‌ నుంచి పాకిస్ధాన్‌ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అయినప్పటికీ హిందూమహాసభ నేతలు మంత్రి పదవుల్లోనే కొనసాగారు. తీరా భారత్‌ను విభజించిన తరువాత దానికి గాంధీయే కారకుడని అదే సావర్కర్‌ ద్వేషం పెంచుకున్నారు. 1948 ఫిబ్రవరి 27న జవహర్‌లాల్‌ నెహ్రూకు రాసిన లేఖలో గాంధీ హత్యలో సావర్కర్‌ పాత్ర గురించి ప్రస్తావించారు. హిందూమహాసభకు చెందిన మతపిచ్చిగల వారు నేరుగా సావర్కర్‌ నాయకత్వంలో చేసిన, అమలు జరిపిన కుట్రలో భాగంగానే బాపూ హత్య జరిగిందని పేర్కొన్నారు. కుట్ర గురించి విచారణ జరిపిన కపూర్‌ కమిషన్‌ కూడా పటేల్‌ వ్యాఖ్యలను నిర్ధారించింది.

Related image
సావర్కర్‌ ‘విలువల ‘ ప్రాతిపదికన జాతి నిర్మాణం-మోడీ !

సావర్కర్‌ విలువల ప్రాతిపదికనే జాతీయవాదంతో జాతి నిర్మాణం జరుగుతున్నదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఆర్టికల్‌ 370ని వ్యతిరేకించిన వారే వీర సావర్కర్‌ను కించపరుస్తూ ఇంతవరకు భారత రత్న అవార్డు ఇవ్వకుండా అడ్డుపడ్డారని కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు.సావర్కర్‌ భరతమాత నిజమైన పుత్రుడని గతంలో ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ వారు కొద్ది రోజులు పోతే మహాత్ముడిని హత్య చేసిన గాడ్సేకు సైతం భారత రత్న ఇస్తారని కాంగ్రెస్‌ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తే సావర్కర్‌కు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు.1857లో జరిగిన తిరుగుబాటును ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామం అని తొలిసారిగా గుర్తించింది సావర్కర్‌ అని హౌమంత్రి అమిత్‌ షా ఒక సభలో చెప్పారు. కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ఇందిరా గాంధీ స్వయంగా సావర్కర్‌ను అనుసరించారని ఆయన సమీప బంధువు రంజీత్‌ చెప్పారు. సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలని బిజెపి చెప్పిన అంశం జనం ముందు వుంది. అది తప్పనుకుంటే జనం వ్యతిరేకంగా ఓటు వేస్తారని అన్నాడు.

కాంగ్రెస్‌ అవకాశవాదం !
వాజ్‌పేయి ప్రధానిగా వున్న సమయంలో సావర్కర్‌ చిత్రపటాన్ని పార్లమెంట్‌ హాలులో పెట్టాలన్న స్పీకర్‌ మనోహర్‌ జోషి ప్రతిపాదనను కాంగ్రెస్‌ వ్యతిరేకించలేదు. స్పీకర్ల ప్రతిపాదనలను ఎవరూ వ్యతిరేకించరని కొందరు కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ సావర్కర్‌ స్మారక నిధికి 1970లో వ్యక్తిగతంగా పదకొండు వేల రూపాయల విరాళం ఇచ్చారని, ఆయన స్మారకంగా ఒక తపాలా బిళ్లను విడుదల చేశారని అయితే సోనియా గాంధీ సావర్కర్‌ను వ్యతిరేకిస్తున్నారని బిజెపి విమర్శలు కురిపించింది. బ్రిటీష్‌ పలకులకు సావర్కర్‌ క్షమాభిక్ష పెట్టమని లేఖలు రాసిన విషయం ఇందిరా గాంధీకి తెలిసి వుండకపోవుచ్చు, తెలిసిన తరువాత సోనియా గాంధీ ఎందుకు సమర్ధించాలి అనే అభిప్రాయాలు కూడా వెల్లడయ్యాయి.సావర్కర్‌కు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదు, అయితే ఆయన హిందూత్వను మాత్రం అంగీకరించం అని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు.

Image result for savarkar, chitraguptaImage result for savarkar, chitragupta
వీర సావర్కర్‌ బిరుదు వెనుక అసలు కధ !
సంఘపరివార్‌, బిజెపి వాటి అనుబంధ సంస్ధల కార్యకర్తలు, అభిమానులు సావర్కర్‌ను వీర బిరుదు తగిలించి పిలుస్తారు. ఆ బిరుదు ఎవరిచ్చారు, ఏ వీరత్వం కారణంగా వచ్చింది అంటే ఎవరూ సమాధానం చెప్పరు. వీర సావర్కర్‌ జీవితం పేరుతో ఒక పుస్తకం ప్రచురితమైంది.1926లో చిత్రగుప్త అనే గుప్త నామ రచయిత దానిలో సావర్కర్‌ వీరత్వం గురించి గొప్పగా రాశారు. 1966లో ఆయన మరణించిన రెండు దశాబ్దాల తరువాత 1987లో సావర్కర్‌ రచనల అధికారిక ముద్రణ సంస్ధ వీర సావర్కర్‌ ప్రకాశన్‌ ఆ పుస్తకాన్ని రెండోసారి ప్రచురించింది. చిత్రగుప్త అంటే మరెవరో కాదు స్వయంగా సావర్కరే అని దానికి ముందు మాట రాసిన రవీంద్ర రామదాస్‌ వెల్లడించారు. అంటే అది సావర్కర్‌ ఆత్మకధ అన్నది నిర్ధారణ అయింది. పుట్టుకతోనే సావర్కర్‌ హీరో అని తన గురించి తానే దానిలో రాసుకున్నారు.

Image result for vd savarkar chitragupta
అతిశయోక్తులు – అవాస్తవాలు !
‘ అతను తెలివి గలవ్యక్తి, అతను ధైర్యశాలి, అతను ఒక దేశ భక్తుడు, వర్తమాన ప్రభుత్వ వ్యవస్థ రూపంలో దాగి వున్న దుష్టశక్తిని నేను గుర్తించటానికి చాలా ముందే ఆయన గుర్తించారు.ఆయన ప్రేమించిన దేశం బాగుండాలని కోరుకున్నందుకు అండమాన్‌ వెళ్లాల్సి వచ్చింది. న్యాయమైన ప్రభుత్వంలో అయితే ఆయనొక ఉన్నతమైన పదవిలో వుండే వారు’ అని మహాత్మాగాందీ పేర్కొన్నట్లు చాలా కాలంగా సంఘపరివార్‌ ప్రచారంలో పెట్టింది. ఈ మాటలు 1921జూన్‌ 18వ తేదీ యంగ్‌ ఇండియా పత్రికలో రాసినట్లు బిజెపి తన చిత్రాలలో పెట్టింది. అయితే దీని మీద అనుమానం వచ్చిన ప్రతీక్‌ సిన్హా అనే గుజరాత్‌ జర్నలిస్టు పరిశీలించి అసలు ఆ తేదీతో యంగ్‌ ఇండియా సంచికే లేదని 1921 జూన్‌ ఒకటి, ఎనిమిది, పదిహేను, ఇరవై రెండు, ఇరవై తొమ్మిదవ తేదీలతో ఐదు సంచికలు వున్నట్లు పేర్కొన్నారు. తాను 15, 22వ తేదీ సంచికలను చూశానని తనకెక్కడా సావర్కర్‌ గురించి ప్రస్తావన గానీ, ))ఆ మాటలు కనపడలేదని తెలిపారు. మహాత్మాగాంధీకి ఆపాదించిన ఈ మాటల గురించి ఇంటర్నెట్‌లో గూగులమ్మను అడగ్గా రెండు ఫలితాలు కనిపించాయని అవి రెండూ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా హిందూత్వ ప్రచార సైట్లని సిన్హా పేర్కొన్నారు.

ఆవు దేవత కాదన్న సావర్కర్‌ !
గోమాత అంటూ గోరక్షకుల పేరుతో కొందరు చేసిన దాడులతో మన దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా అడుగంటిన విషయం తెలిసిందే. అసలైన హిందూ హృదయ సామ్రాట్‌గా పరిగణించే సావర్కర్‌ ఆవు ఒక సాధారణ జంతువు తప్ప దేవత కాదని అన్నారు. అవి మానవులకు ఉపయోగపడతాయి గనుక వాటిని కాపాడుకోవాలి తప్ప దేవతలు కాదని రాశారు. పాలకు ప్రతీక ఆవు తప్ప హిందూ దేశానికి కాదని కూడా పేర్కొన్నారు.
‘స్వంత అభిప్రాయాలు కలిగి ఉండే హక్కు సావర్కర్‌కు ఉంది. ఆయన హేతువాదాన్ని నమ్మారు.మనోద్వేగాల కంటే వుపయోగితావాదానికి ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే అదే సమయంలో గాంధీ కూడా ప్రజల మనోద్వేగాలను గౌరవించారు ‘ అని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత వేత్త ఎంజివైద్య వ్యాఖ్యానించారు.

అమిత్‌ షా అతియోక్తి !
1857లో జరిగిన ఉదంతాన్ని సిపాయిల తిరుగుబాటుగా బ్రిటీష్‌ పాలకులు ప్రచారం చేశారు. కొందరు చరిత్రకారులు కూడా అదే విధంగా చూశారు. అయితే ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం అని తొలిసారిగా సావర్కర్‌ వర్ణించినట్లు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా చెప్పటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు.’ భారత్‌లో జరిగిన అలజడి ఒక సిపాయి తిరుగుబాటు కాదు, ఒక జాతీయ తిరుగుబాటు, జాన్‌ బుల్‌ దానిని మిలిటరీ తిరుగుబాటుగా పరిగణించవచ్చుగానీ వాస్తవం ఏమంటే అది జాతీయ తిరుగుబాటు ‘ అని 1857 జూలై 28, 31 తేదీలలో కారల్‌ మార్క్సు వ్యాఖ్యానించారు. అప్పటికి అసలు వి డి సావర్కర్‌ పుట్టనే లేదు. లండన్‌లో బారిష్టర్‌ చదవటానికి వెళ్లిన సమయంలో మార్క్స్‌ రచనలు చదివి సావర్కర్‌ ఆ అభిప్రాయానికి వచ్చి వుండవచ్చు.

హిందూత్వ-నాజీ పోలిక !
హిందూత్వ ఒక జీవన విధానం తప్ప మతానికి సంబంధించింది కాదని సంఘపరివార్‌ శక్తులు పదే పదే చెబుతారు, కొంత మంది అది నిజమే అనుకుంటున్నారు. యావత్‌ ప్రపంచం హిట్లర్‌ మూకలు, అనుయాయులను నాజీలు అని పిలిచే విషయం తెలిసిందే. అయితే హిట్లర్‌, ఆతగాడి అనుయాయులు ఎన్నడూ దాన్ని అంగీకరించలేదు, తమను జర్మన్‌ జాతీయ సోషలిస్టులుగా, తమది జాతీయ సోషలిజంగా వర్ణించుకున్నారు. మహారాష్ట్రలో బిజెపి, శివసేన హిందూత్వశక్తులుగా రంగంలో వున్నాయి. హిందూత్వకు సావర్కర్‌ ప్రతీకగా వున్నారు. స్వాతంత్య్రవుద్యమసమయంలో సావర్కర్‌ భావజాలాన్ని మరాఠాలు ఆమోదించలేదు. అయితే మారిన పరిస్ధితుల్లో అనేక దశాబ్దాలపాటు ఆయన అనుయాయులు చేసిన ప్రచారం కారణంగా అనేక మంది సావర్కర్‌ నిజమైన జాతీయవాది అని భావిస్తున్నారు. దీన్ని సొమ్ము చేసుకొనేందుకు ఆయనకు భారత రత్న ఇవ్వాలనే ప్రతిపాదనను బిజెపి ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు.
ముందు వక్రీకరణలతో గందరగోళాన్ని సృష్టించటం, మెల్లగా తమ అజెండాను ఎక్కించటాన్ని చూస్తున్నాము. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే అదే నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్‌ సూత్రాన్ని అమలు జరుపుతున్నారు. ఇదే సమయంలో మెజారిటీ హిందూ మతోన్మాదశక్తులను జాతీయవాదులుగా చిత్రించి అసలైన జాతీయవాదులు, లౌకికశక్తుల మీద దాడి చేస్తున్నారు. దానిలో భాగమే సావర్కర్‌కు భారత రత్న బిరుదు సాధన వాగ్దానం. అది అమలు జరిగితే తదుపరి గాంధీని హత్యచేసిన గాడ్సేను ముందుకు తెచ్చినా ఆశ్చర్యం లేదు. విజేతలే చరిత్రను రాయటం అంటే ఇదే. అందువలన ‘చరిత్రను విస్మరించిన తరానికి గతమూ, భవిష్యత్‌ రెండూ ఉండవు ‘ అని చెప్పిన రాబర్ట్‌ హెయిన్‌లిన్‌ మాటలను ఈ సందర్భంగా గుర్తుకు తేవాల్సి ఉంది. ఏది అసలైన చరిత్ర ? ఏది నకిలీ ? వాట్సాప్‌ యూనివర్సిటీ చరిత్ర పాఠాల పట్ల తస్మాత్‌ జాగ్రత్త ! అక్కడ వైద్య శాస్త్రం చదవకుండా వైద్యం చేసే నకిలీ వైద్యుల మాదిరి చరిత్ర తెలియని వారు సుప్రసిద్ధ చరిత్ర కారులుగా మనకు బోధిస్తారు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

సిరియాలో కొత్త పరిణామం – టర్కీ తాత్కాలిక కాల్పుల విరమణ !

20 Sunday Oct 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Syrian Kurds, Turkish military intervention in Syria, US support Turkey

Image result for turkey military offensive in syria
ఎం కోటేశ్వరరావు
రాజీ లేదా మారణహౌమం మధ్య ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే పౌరులే తమకు ముఖ్యమని, అందుకే సిరియా అధ్యక్షుడు అసాద్‌, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌తో ఒక అవగాహనకు వచ్చినట్లు సిరియన్‌ డెమోక్రటిక్‌ ఫోర్సెస్‌(ఎస్‌డిఎఫ్‌) ప్రధాన కమాండర్‌ మజులుమ్‌ అబ్దీ చెప్పారు. కొద్ది రోజులుగా టర్కీ దళాలు సిరియాలోని కర్దుల ఆధీనంలోని ప్రాంతాలపై దాడులు జరుపుతున్న పూర్వరంగంలో తాజా పరిణామం చేసుకుంది. ఒక వైపు టర్కీ దాడులు కొనసాగిస్తుండగా సిరియా-టర్కీ సరిహద్దుల్లో వుగ్రవాదులకు వ్యతిరేక పోరు పేరుతో దించిన తమ దళాలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇది జరగ్గానే సిరియా అధ్యక్షుడితో ఎస్‌డిఎఫ్‌ ఒక అవగాహనకు వచ్చింది. వెంటనే సిరియా దళాలు ఆ ప్రాంతానికి తరలి వెళ్లి టర్కీ దాడులను అడ్డుకునేందుకు సిద్దం అయ్యాయి. ఈ పరిణామంతో యావత్‌ సిరియా ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినట్లు అయిందని, రష్యా, ఇరాన్‌ ఆ ప్రాంతంపై పై చేయి సాధించినట్లే అనే అభిప్రాయాలు వెల్లడి అవుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాల్లో ఇది మరొక మలుపు.
టర్కీ ప్రారంభించిన దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేయాలని ఒక ఒప్పందం కుదిరింది. ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుందని ప్రకటించారు. అయితే ఇది సమగ్రమైనది కాదని తేలిపోయింది. అమెరికా దీన్ని ముందుకు తెచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు పెనెస్‌ ప్రకటించినదాని ప్రకారం సిరియాలోని కర్దు ప్రాంతాలపై ఐదు రోజుల పాటు టర్కీ దాడులను నిలిపివేస్తుంది. అమెరికా తన వంతుగా ఆప్రాంతంలో ఉన్న కర్దు దళాలను అక్కడి నుంచి ఉపసంహరించే విధంగా అమెరికా పని చేస్తుంది. తమ దళాలు తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటిస్తాయి తప్ప శాశ్వతంగా కాదని మజులుమ్‌ అబ్దీ చెప్పారు. టర్కీ-సిరియా సరిహద్దులో 30కిలో మీటర్ల మేర ప్రాంతంలో వున్న తమ దళాలు కొన్ని చోట్ల నుంచి మాత్రమే వెనక్కు పోతాయి తప్ప పూర్తిగా కాదని స్పష్టం చేశారు. తమ దళాలు వెనక్కు వచ్చేందుకు ఒక నడవాను ఏర్పాటు చేయమని అడిగారని, ఇదే సమయంలో టర్కీ దళాలు అందుకు పూనుకోలేదని అన్నారు. మంగళవారం నాటికి కర్దు దళాల ఉపసంహరణ జరగనట్లయితే తిరిగి దాడులను ప్రారంభిస్తామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ప్రకటించాడు.
సిరియా నుంచి అమెరికా దళాలను ఉపసంహరించాలన్న అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాన్ని అమెరికన్‌ కాంగ్రెస్‌(పార్లమెంట్‌ దిగువ సభ) 354-60 ఓట్లతో తిరస్కరించింది. ఐఎస్‌ తీవ్రవాదుల మీద పోరులో అమెరికాకు కీలక మిత్రులుగా ఉన్న కర్దిష్‌ యోధుల పట్ల అనుచితంగా ప్రవర్తించటమే అని సిఐఏ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ డేవిడ్‌ పెట్రాస్‌ వ్యాఖ్యానించాడు. తమకు పర్వతాలు తప్ప ఇతర మిత్రులు ఎవరూ లేరని కర్దులు ఎప్పుడూ చెబుతూ ఉంటారని అయితే అమెరికన్లు వారికి మిత్రులే అని ట్రంప్‌ చర్య విద్రోహం తప్ప వేరు కాదని అన్నారు. ఐఎస్‌పై పోరులో పదివేల మంది కర్దులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇప్పటి వరకు సిరియాలోని అమెరికా దళాలు ఐఎస్‌ వ్యతిరేక పోరులో ముందు పీఠీన లేవని పోరాడుతున్న వారికి సాయం చేసే పాత్ర పోషించాయని చెప్పారు.
అమెరికా దళాలు అర్ధంతరంగా ఖాళీ చేసిన సైనిక కేంద్రాన్ని రష్యన్‌ సేనలు స్వాధీనం చేసుకున్నాయని, అక్కడ చూస్తే అమెరికన్లు వదలి వెళ్లిన సగం సగం ఆహార పదార్దాలతో వున్న ప్లేటు బల్లలపై కనిపించాయని ఒక టీవీ పేర్కొన్నది. రష్యన్లు ఐఎస్‌ తీవ్రవాదుల పట్ల చాలా కఠినంగా ఉంటారని, ఇతర చోట్ల మాదిరే సిరియాలో కూడా వారిని చంపివేస్తారని డోనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌లో వ్యాఖ్యానించాడు.
పశ్చిమాసియాలో పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఎవరు ఎవరికి ఎప్పుడు మిత్రులుగా మారతారో, శత్రువులుగా తయారవుతారో తెలియని స్ధితి. ఈ ప్రాంతంలోని దేశాలు, అక్కడ వున్న సహజ సంపదలను కొల్లగొట్టటంతో పాటు మిలిటరీ రీత్యా పట్టుసాధించేందుకు అమెరికా అనుసరిస్తున్న విధానాలు మారణహౌమాన్ని సృష్టిస్తూ శాంతిని లేకుండా చేస్తున్నాయి. తన లక్ష్యాల సాధనకు కర్దిస్ధాన్‌ ఏర్పాటుకు తోడ్పడతామని ఆశ చూపుతూ ఆ ప్రాంతంలోని కర్దులను అమెరికా పావులుగా వాడుకొంటున్నది. తామే ప్రవేశపెట్టిన ఐఎస్‌ తీవ్రవాదులను అణచే పేరుతో అ క్కడ తిష్టవేయాలని చూసిన అమెరికా, ఐరోపా యూనియన్‌, వాటితో చేతులు కలిపిన టర్కీ దేశాలకు తాజా పరిణామం పెద్ద ఎదురు దెబ్బ.
మజులుమ్‌ అబ్దీ చెప్పినదాని ప్రకారం గత నాలుగు సంవత్సరాలుగా సిరియా మీద దాడులకు దిగిన జీహాదీ లేదా ఐఎస్‌ తీవ్రవాదులకు వ్యతిరేకంగా మాత్రమే కర్దులు పోరాడారు తప్ప టర్కీ, అమెరికా మిలిటరీ మీద ఒక్క తూటాను కూడా కాల్చలేదు. కర్దు ప్రాంతాలను ఆక్రమించిన ఐఎస్‌ తీవ్రవాదులను ఎదిరించేందుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా టర్కీ, అమెరికా రెండూ కర్దులకు ఆయుధాలిచ్చాయి. కర్దులు ఐఎస్‌ తీవ్రవాదులను సిరియాలో అదుపు చేశారు. ఇదే సమయంలో అమెరికా హామీ మేరకు దాని మాటలు నమ్మి టర్కీ తమ మీద దాడులకు దిగదనే భరోసాతో కర్దులు టర్కీ సరిహద్దులనుంచి వెనక్కు తగ్గారు. అయితే ప్రస్తుతం టర్కీ అదే ఐఎస్‌ తీవ్రవాదులకు ఆయుధాలిచ్చి సిరియా ప్రాంతాలను తిరిగి ఆక్రమించేందుకు ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు ఏకంగా దాడులకు దిగుతున్నది. ఈ దశలో కూడా సిరియన్‌ కర్దులు అమెరికా మీద విశ్వాసం వుంచి టర్కీ మీద పలుకుబడిని వుపయోగించి సిరియా సమస్యను పరిష్కరించాలనే కోరుతున్నారు. అమెరికా అక్కడి నుంచి తన సైన్యాన్ని ఉపసంహరిస్తానని చెప్పటాన్ని కూడా వారు తప్పుపట్టటం లేదు. దాని ఇబ్బందులు దానికి వున్నాయని సరిపెట్టుకుంటున్నారు. టర్కీ దాడులు తీవ్రతరం కావటంతో విధిలేని పరిస్ధితుల్లో తమ జనాన్ని రక్షించుకొనేందుకు సిరియా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని మిలిటరీని దించేందుకు అంగీకరించామని మజులుమ్‌ అబ్దీ చెప్పారు. జనాన్ని రక్షిస్తామని సిరియా, రష్యా ప్రతినిధులు చెప్పటాన్ని కూడా మేము పూర్తిగా నమ్మటం లేదు. అసలు ఎవరిని నమ్మాలో తెలియటం లేదు, విధిలేని పరిస్ధితుల్లో అంగీకరించాము అన్నారు.
ఆదివారం నాడు కుదిరిన ఒప్పందం మేరకు కర్దు దళాల ఆధీనంలో వున్న రెండు పట్టణాల ప్రాంతాన్ని సిరియా సైన్యానికి అప్పగించారు. గత ఆరు రోజులుగా టర్కీ చేస్తున్న దాడులకు ఉత్తర సిరియాలో ఎందరు మరణించిందీ తెలియదు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పదమూడువేల మంది ఐఎస్‌ తీవ్రవాదులను తాము బందీలుగా చేశామని కర్దులు ప్రకటించారు. కర్దుల ప్రాంతాలపై దాడుల కారణంగా అనేక వందల మంది ఐఎస్‌ తీవ్రవాదులు బందీల శిబిరాల నుంచి తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి. వారిని కర్దులే విడుదల చేశారని అమెరికన్‌ మీడియా చెబుతోంది. టర్కీ చర్యలను భారత్‌తో సహా అనేక దేశాలు ఖండించాయి. ఐరోపా యూనియన్‌ టర్కీ మీద ఆంక్షలను విధించాలని తలపెట్టినా దాని మీద వచ్చిన వత్తిడి కారణంగా సభ్యదేశాల విచక్షణకు వదలివేశారు. యుద్ద విమానాలతో సహా టర్కీ ఆయుధాలన్నీ అమెరికా, ఐరోపా దేశాల నుంచే కొనుగోలు చేస్తున్నది. కర్దు తిరుగుబాటుదార్లను టర్కీ ఉగ్రవాదులుగా చిత్రిస్తోంది. సిరియా విముక్తి సేనపేరుతో వున్న ఐఎస్‌ తీవ్రవాదులను సిరియా విముక్తి ప్రదాతలుగా పరిగణిస్తోంది.
సిరియా-టర్కీ సరిహద్దు ప్రాంతాల నుంచి తమ సేనలను వుపసంహరించుకుంటామని అమెరికా ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ టర్కీ వత్తిడికి లొంగిపోయిన ట్రంప్‌ ఆకస్మిక నిర్ణయం తీసుకోవటంతో కర్దులు హతాశులయ్యారు. అమెరికా తమను మోసం చేసిందని భావిస్తున్నారు. అందుకే వెంటనే రష్యా మధ్యవర్తిత్వంతో సిరియా ప్రభుత్వంతో ఒక అవగాహనకు వచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. అయితే గతంలో కర్దులను అణిచివేయటంలో సిరియా ప్రభుత్వం కూడా తక్కువ తినలేదు. ఇప్పుడు కర్దుల ఆధీనంలోని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తరువాత మరోసారి అణచివేతకు పూనుకోవచ్చనే అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి.
ఇంతకాలం ఐఎస్‌ తీవ్రవాదులను అణచేందుకే ఉత్తర సిరియాలో వున్నామని ప్రకటించిన అమెరికా ఇప్పుడు అక్కడి నుంచి తప్పుకోవటం అంటే మొత్తంగా సిరియాను ప్రభుత్వానికి అప్పగించి తోకముడిచినట్లే అన్నది కొందరి వ్యాఖ్యానం. ఇదే సమయంలో టర్కీతో సిరియా యుద్ద పర్యవసానాలు ఎలా వుంటాయన్నది చూడాల్సి వుంది. తమ దేశంలో తలదాచుకున్న 20లక్షల మంది సిరియన్ల రక్షణ ప్రాంతాలను ఏర్పరచేందుకే తాము దాడులు చేస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయిప్‌ ఎర్డోగన్‌ చెబుతున్నాడు.
పశ్చిమాసియాలో అనేక తెగలలో కర్దిష్‌ ఒకటి. పశ్చిమ, మధ్య ఆసియా ప్రాంతాలపై ఆధిపత్య పోరు లో సఫావిద్‌ – ఒట్టోమన్‌ సామ్రాజ్యాల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. ఒప్పందాలు జరిగాయి. వాటిలో భాగంగా కర్దులు గణనీయంగా లేదా మెజారిటీ వున్న ప్రాంతాలు చీలిపోయాయి. సులభంగా అర్ధం చేసుకోవాలంటే నేటి టర్కీ, సిరియా, ఇరాన్‌, ఇరాక్‌ దేశాలలో ఈ ప్రాంతాలు వున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన ఒట్టోమన్‌ సామ్రాజ్యాన్ని ముక్కలు చేశారు. తరువాత వాటికి స్వాతంత్య్రం ఇచ్చే క్రమంలో యూదులకు ఇజ్రాయెల్‌ మాతృదేశంతో పాటు కర్దులకు ఆయా దేశాలలో స్వయం పాలిత ప్రతిపత్తి మంజూరును పరిశీలించాలని సామ్రాజ్యవాదులు సూచించారు. టర్కీ తప్ప మిగిలిన దేశాలు వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు. టర్కీ అయితే తమ దేశంలో కర్దు అనే పదం వినపడకుండా చేసింది. చివరకు ఆ భాష మాట్లేవారిని కూడా వెంటాడి వేధించింది. కర్దులకు కొండ ప్రాంతాల టర్కులని పేరు పెట్టింది. ఈ నేపధ్యంలో కర్దు ప్రాంతాలలో అనేక తిరుగుబాట్లు జరిగాయి.పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్‌ ఏర్పాటు నిర్ణయం జరగటం, స్వయంప్రతిపత్తి ప్రాంతాల డిమాండ్‌ను సక్రమంగా అమలు జరపకపోవటంతో అది 1945లో నాలుగుదేశాలలోని కర్దు ప్రాంతాలతో కర్దిస్ధాన్‌ ఏర్పాటు చేయాలనే నినాదంగా మారింది.

Image result for Syrian Kurds  fight
కర్దిస్ధాన్‌ సాధనకు నాలుగు దేశాలలో తలెత్తిన ఉద్యమాలు సాయుధ రూపం తీసుకున్నాయి. వాటిని అణచివేయటంలో ఏ దేశ పాలకులూ తక్కువ తినలేదు. ఇదే సమయంలో తన రాజకీయ, ఆధిపత్య ఎత్తుగడలలో భాగంగా అమెరికన్లు నాలుగు చోట్లా కర్దులకు మద్దతు ఇచ్చి వారి తిరుగుబాట్లను ప్రోత్సహించారు. వాటిలో కర్దిస్ధాన్‌ వర్కర్స్‌ పార్టీ(పికెకె) ప్రధాన సంస్ధగా ముందుకు వచ్చింది. టర్కీలో కర్దులపై అణచివేతకు వ్యతిరేకంగా విద్యార్ధులు దీనిని ప్రారంభించారు.1984లో పూర్తి స్ధాయి తిరుగుబాటుగా మారింది.అనేక పరిణామాల తరువాత 2013లో పికెకె కాల్పుల విరమణ ప్రకటించింది. రెండు సంవత్సరాల తరువాత టర్కీ దాడులు, ఇతర పరిణామాల కారణంగా కాల్పుల విరమణ విరమించింది.
ఇరాక్‌, సిరియాలలో కర్దుల స్వయంపాలిత ప్రాంతాల ఏర్పాటును టర్కీ వ్యతిరేకించటమే కాదు, ఆ ప్రాంతాలలోని కర్దులపై తరచుగా దాడులు చేస్తున్నది. ఇరాకీ కర్దు ప్రాంతాలలో తనకు అనుకూలమైన ఉగ్రవాద బృందాలకు సాయం చేసి ఆ ప్రాంతంలో తన తొత్తులను ప్రతిష్టించాలని కూడా టర్కీ చూసింది. ఇప్పుడు అమెరికా,ఐరోపా యూనియన్‌ మద్దతుతో మరోసారి సిరియాలోని కర్దు ప్రాంతాలపై దాడులకు దిగుతున్నది, ఐఎస్‌ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చి సిరియాను అస్ధిరం చేయాలని చూస్తున్నది. మంగళవారంతో ఐదు రోజుల కాల్పుల విరమణ గడువు ముగియనున్నది. ఒప్పందానికి టర్కీ-కర్దులు తమవైన భాష్యాలు చెబుతున్నందున తిరిగి మరోసారి టర్కీ దాడులకు తెగబడుతుందా ? టర్కీని అమెరికా నివారిస్తుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆర్‌సిఇపి ఒప్పందం-మోడీ సర్కార్‌ 2024 ఓట్ల లెక్కలు !

19 Saturday Oct 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ASEAN, free trade agreement, RCEP, RCEP INDIA, Regional Comprehensive Economic Partnership

Image result for RCEPఎం కోటేశ్వరరావు
ఇప్పటి వరకు వెలువడిన సూచనలు, ధోరణులను బట్టి ‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం(ఆర్‌సిఇపి)’ ఒప్పందంపై మన దేశం సంతకాలు చేసే అంశం చివరి నిమిషం వరకు ఉత్కంఠను కలిగించే అవకాశం వుంది. నవంబరు నాలుగవ తేదీన బ్యాంకాక్‌ సమావేశంలో సంతకాలు జరగనున్నాయి. దానికి మన ప్రధాని నరేంద్రమోడీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం పునరాలోచన గురించి ఇంతవరకు ఎలాంటి వార్తలు లేవు. మన ఎగుమతిదార్లకు తగినన్ని రాయితీలు సంపాదించేందుకు ప్రయత్నించి ఒప్పందం మీద సంతకం చేయాలన్న వైఖరితో మన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమేరకు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఒప్పందం మన ఆర్ధిక వ్యవస్ధను మరింతగా దెబ్బతీస్తుందనే అభిప్రాయాల పూర్వరంగంలో మోడీ సర్కార్‌ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు. అధికారిక అభిప్రాయాలు వెల్లడి కాలేదు.
ఎగుమతి, దిగుమతి వాణిజ్య లాబీయిస్టులు ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఉండి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. మరోవైపు ఈ ఒప్పందం షరతులు అమలు జరిగితే ఇప్పటికే మన దేశ వ్యవసాయ, అనుబంధ రంగాలలో నెలకొన్న సంక్షోభం లేదా తీవ్ర సమస్యలు మరింతగా పెరిగే అవకాశం వుంది కనుక ఒప్పందంపై సంతకాలు చేయరాదని రైతు సంఘాలు మరోవైపున డిమాండ్‌ చేస్తున్నాయి.
ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ)లో భాగస్వాములు అయినప్పటికీ గత దశాబ్దకాలంగా అనేక దేశాలు రక్షణాత్మక చర్యలకు పూనుకుంటున్నాయి. అనేక దేశాలు ద్విపక్ష ఒప్పందాలు, ప్రాంతీయ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దానిలో భాగమే ఆర్‌సిఇపి. గత ఐదు సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ ప్రచార ఆర్భాటం తప్ప మన దేశం నుంచి ఎగుమతులను పెంచటంలో ఘోరంగా విఫలమైంది. ఆర్‌సిఇపి విషయానికి వస్తే దీనిలో ఆగేయ ఆసియాలోని బ్రూనీ, కంపూచియా, ఇండోనేషియా, లావోస్‌, మలేసియా, మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయ లాండ్‌, వియత్నాం(వీటిని ఆసియన్‌ దేశాలని కూడా అంటారు)లతో పాటు చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలతో కూడిన కూటమి మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం గురించి 2012 నవంబరు నుంచి చర్చలు జరుగుతున్నాయి.

ఈ కూటమి ఆసియన్‌ దేశాల 2012 సమావేశంలో పురుడుపోసుకుంది.గత కొన్ని సంవత్సరాలుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. తుది ఒప్పంద దశకు చేరుకుంది. పదహారు దేశాలలో 340 కోట్ల మంది జనాభా ఉన్నారు.2017 వివరాల ప్రకారం ప్రపంచ జిడిపిలో 39శాతం అంటే 49.5 లక్షల కోట్ల డాలర్ల వాటా వుంది. ప్రపంచంలో అతి పెద్ద వాణిజ్య కూటమి కానుంది.2050 నాటికి ఈ దేశాల జిడిపి 250లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. అందువలన ఇంత పెద్ద కూటమికి దూరంగా ఉండేందుకు మన దేశంలోని బడా కార్పొరేట్‌ సంస్ధలు ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించవు. గత అనుభవాలను గమనంలో వుంచుకొని రైతు సంఘాలు భయపడుతున్నట్లుగా రైతాంగాన్ని బలిపెట్టి అయినా వాణిజ్య, పారిశ్రామిక, సేవారంగాల కార్పొరేట్లు తమ ప్రయోజనాలకోసం కృషి చేస్తాయని వేరే చెప్పనవసరం లేదు.చైనా నుంచి మరిన్ని రాయితీలను రాబట్టాలని అవి కేంద్రం మీద వత్తిడి చేస్తున్నాయి.

ఇక మన దేశం విషయానికి వస్తే ఈ ఒప్పందంలో భాగస్వామి అయితే సంభవించే నష్టాలేమిటి, కలిగే లాభాలేమిటి అన్న చర్చ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. ఆసియన్‌ దేశాలకు మన దేశం నుంచి 2018-19లో 9.56శాతం పెరిగి 37.47 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. అయితే ఇదే సమయంలో దిగుమతులు 25.87శాతం పెరిగి 59.32 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం ఏ దేశానికీ క్షేమకరం కాదు. అందువలన వాణిజ్య మిగులు సంగతి తరువాత లోటును తగ్గించుకొనేందుకే మన ప్రయత్నాలన్నీ పరిమితం అవుతున్నాయి. సంప్రదింపుల ప్రారంభంలో అంటే 2010-11లో ఆసియన్‌ దేశాలతో మన వాణిజ్య లోటు 12 బిలియన్‌ డాలర్లు వుంటే 2018-19 నాటికి 22 బిలియన్లకు పెరిగింది.

ఆసియన్‌ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఆర్‌సిఇపి) విషయానికి వస్తే మన దేశం 74శాతం వరకు పన్నులను రద్దు చేసేందుకు అంగీకరించగా ఇండోనేషియా 50, వియత్నాం 70శాతం మాత్రమే అంగీకరించాయి. ఇది మన కార్పొరేట్‌లను కలవర పెడుతున్నది.కనీసం చైనా కంటే పదిశాతం మేరకు అయినా మనకు అనుకూలంగా వుండాలని కోరుతున్నాయి. ఇతర దేశాలతో దాదాపు ఒప్పందం తుది దశలో ఉండగా చైనాతో ఇంకా ఆదశకు రాలేదు. ఇటీవల చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ పర్యటన సందర్భంగా ఈ అంశం మంత్రుల స్ధాయిలో చర్చించాలని అనుకున్నారు. మన దేశం కూటమిలో భాగస్వామి కాకుండా ప్రయోజనం లేదని భావించిన దేశాలు సంప్రదింపులకు గడువును పెంచాయి.

ఇటీవల నీతి ఆయోగ్‌ వివిధ కూటములు, దేశాలతో మన ఎగుమతులు, దిగుమతుల గురించి చేసిన సమీక్షలో ఒక్క శ్రీలంక విషయంలో తప్ప మిగిలిన అన్నింటి విషయంలో నష్టం తప్ప లాభం లేదని తేలింది. రెండు వైపులా జరిగే వాణిజ్యంలో 75శాతం మేరకు ఆర్‌సిఇపి స్వేచ్చా వాణిజ్య ఒప్పంద పరిధిలోకి వస్తాయి. మొత్తం పన్నెండువేల ఉత్పత్తులకు సంబంధించి తొమ్మిదివేల వరకు పన్నులను తగ్గించాల్సి వుంటుంది. పదమూడు వందల ఉత్పత్తులు పన్నుల నుంచి మినహాయింపు పొందిన జాబితాలో , 1800 వస్తువులు ఆచితూచి వ్యవహరించాల్సిన జాబితాలో ఉన్నాయి. మన దేశం మినహాయింపు జాబితాలో పదిశాతం వస్తువులను చేర్చగా అనేక దేశాలు అంతకంటే ఎక్కువ వస్తువులనే తమ జాబితాల్లో చేర్చాయి.

మూడు సంవత్సరాల క్రితం మతిమాలిన పెద్ద నోట్ల రద్దు, తగినంత కసరత్తు లేకుండా జిఎస్‌టి ప్రవేశపెట్టటం, ఇతర కారణాలతో దేశం ప్రస్తుతం రోజురోజుకూ మాంద్యంలోకి కూరుకుపోతోంది. ఈనేపధ్యంలో మోడీ సర్కార్‌ రాజకీయంగా తన లాభనష్టాలను లెక్కవేసుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒప్పందం వ్యవసాయంతో పాటు అనుబంధ పాడి, సేవా రంగాలను దెబ్బతీస్తుందని రైతు సంఘాలు, ఇతర సంస్ధలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి. నవంబరులో ఆర్‌సిఇపి ఒప్పందం కుదిరితే దాని అంశాలు 2021-22 నాటికి అమల్లోకి వస్తాయి. వాటి ప్రభావం 2023-24లో కనిపిస్తుంది. ఒక వేళ అది ప్రతికూలమైతే ఆ ఏడాది జరిగే ఎన్నికల్లో తమ భవిష్యత్‌ ఏమిటన్నది బిజెపి తేల్చుకోలేకపోతున్నది.

Image result for RCEP

బిజెపి ప్రతిపక్షంలో ఉండగా ఇలాంటి ఒప్పందాలను అది వ్యతిరేకించింది, ముఖ్యంగా స్వదేశీ జాగరణ మంచ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన సంస్ధ ఇప్పటికీ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల కారణంగా 2018లో మన దేశం 530 కోట్ల డాలర్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయింది. ఇప్పటికే అనేక దేశాల మార్కెట్లు మనకు అందుబాటులో వున్నాయని, ఈ ఒప్పందం ద్వారా కొత్తగా సాధించేదేమిటి అన్న ప్రశ్నకు సరైన సమాధానం రావటం లేదు. పాడి, పామోలిన్‌ రైతాంగం తీవ్రంగా నష్టపోతారని బయటకు వచ్చిన పత్రాల సమాచారం వెల్లడిస్తున్నది.

ఆలిండియా కిసాన్‌సభ (ఎఐకెఎస్‌) రాగల పర్యవసానాల గురించి ఒక ప్రకటనలో రైతాంగాన్ని హెచ్చరించింది. దేశంలో పది కోట్ల రైతు కుటుంబాలకు పాడి పరిశ్రమ జీవనాధారంగా వుందని, పాలధరలో 71శాతం రైతాంగానికి చేరుతోందని పేర్కొన్నది. ప్రస్తుతం పాల వుత్పత్తుల దిగుమతులపై విధిస్తున్న 64శాతం పన్ను రద్దు చేస్తే దిగుమతులతో పాల ధర పతనం అవుతుందని హెచ్చరించింది. న్యూజిలాండ్‌ తన పాలవుత్పత్తుల్లో 93శాతం ఎగుమతులు చేస్తోందని, మన దేశంలో పాలపొడి కిలో 260 రూపాయల వరకు వుండగా న్యూజిలాండ్‌ నుంచి 160-170కే లభిస్తుందని కిసాన్‌ సభ పేర్కొన్నది.దేశంలోని వ్యవసాయ రంగంలో 85శాతం మంది రైతులు చిన్న సన్నకారేనని ఆర్‌సిఇపి ఒప్పందం వారి పాలిట శాపం అవుతుందని హెచ్చరించింది. ఇప్పటికే ఆటోమొబైల్‌ తదితర అన్ని రంగాలూ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తరువాత విదేశాల నుంచి దిగుమతి అయ్యే చౌకధరల వుత్పత్తులతో సమస్య మరింత తీవ్రం కావటం అనివార్యమని ఆయా రంగాల నిపుణులు ఇ్పటికే హెచ్చరించారు.

Image result for RCEP

ఈనెల 11,12 తేదీల్లో బ్యాంకాక్‌లో జరిగిన ఆర్‌సిఇపి మంత్రుల సమావేశంలో మన దేశం లేవనెత్తిన అంశాల కారణంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే సమావేశం ముగిసింది. ముందే చెప్పుకున్నట్లు గతంలో కుదిరిన అవగాహన ప్రకారం ఒప్పందం అమలు జరిగితే సంభవించే ప్రతికూల ప్రభావంతో 2024 ఎన్నికల్లో దెబ్బతగులుతుందనే అంచనాతో ఒప్పందం అమలు సంవత్సరాన్ని 2014కు బదులు 2019గా మార్చాలని మన వాణిజ్య మంత్రి ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. గత రెండు సంవత్సరాల్లో మన పరిశ్రమల పరిరక్షణ చర్యల్లో భాగంగా సగటున దిగుమతులపై పన్నును 13 నుంచి 17శాతం వరకు పెంచారు. ఇప్పుడు ఒప్పందంపై సంతకాలు చేస్తే వెంటనే పన్ను తగ్గించాల్సి వుంటుంది. వివిధ తరగతుల నుంచి వస్తున్న వత్తిళ్ల పూర్వరంగంలో మన దేశం గతంలో లేని కొన్ని కొత్త అంశాలను ఒప్పందంలో చేర్చాలని ప్రతిపాదించింది. దీని వెనుక రెండు వాదనలు వినిపిస్తున్నాయి. తాము చివరి వరకు మన ప్రయోజనాల రక్షణకే ప్రయత్నించామని, విధిలేని స్ధితిలో సంతకాలు చేశామని చెప్పుకొనేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇదే సమయంలో మొత్తంగా మన ఆర్దిక వ్యవస్ధకే ముప్పు వస్తుందని భావిస్తే తమ షరతులకు అంగీకరించలేదనే మిషతో ఒప్పందానికి దూరంగా వుండవచ్చు. ఈ నేపధ్యంలోనే భారత్‌ లేవనెత్తిన అంశాలపై మిగతా సభ్య దేశాలను అంగీకరింపచేసే బాధ్యత భారతే తీసుకోవాలని కొన్ని దేశాలు ఈనెల రెండవ వారంలో జరిగిన సమావేశంలో ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి.ఇంకా పక్షం రోజులు వున్నందున హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన తరువాత కేంద్ర సర్కార్‌ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈనెల పది నుంచి 20వ తేదీ వరకు ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ నిరసన కార్యక్రమాలను ప్రకటించింది. అయితే వాటికి పెద్దగా స్పందన వున్నట్లు మీడియాలో మనకు కనపించదు. పైన చెప్పుకున్నట్లు ఓట్ల లెక్కలు కేంద్ర పాలకులను ప్రభావితం చేస్తాయా? కార్పొరేట్ల వత్తిడిది పై చేయి అవుతుందా చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తెలంగాణా ఆర్టీసి సమ్మె – అసంబద్ద వాదనలు !

13 Sunday Oct 2019

Posted by raomk in Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

KCR, KCR warning to RTC staff, TSRTC staff strike

Image result for TSRTC staff strike-some illogical arguments

ఎం కోటేశ్వరరావు

అక్టోబరు ఐదవ తేదీ నుంచి జరుగుతున్న సమ్మెను మరింత ఉధృతం చేయాలని ఆర్‌టిసి కార్మికులు నిర్ణయించారు. వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అదేశించారు. ఈ సందర్భంగా ముందుకు వస్తున్న వాదనల తీరుతెన్నులను చూద్దాం.
ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేము మా ఎన్నికల ప్రణాళికలో పెట్టలేదని పాలక టిఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. నిజమే పెట్టలేదు.ఆర్‌టిసిలో 20శాతం రూట్లను ప్రయివేటు వారికి ఇస్తామని కూడా టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో చెప్పనిదాన్ని అమలు జరపాలని కెసిఆర్‌ ఎందుకు ఆదేశించినట్లు ? నామాటే శాసనం అన్నట్లుగా మాట్లాడే కెసిఆర్‌ తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ అధికారానికి వస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతారు అన్నారు. మరి దాన్నెందుకు నిలబెట్టుకోలేదు. పోనీ దళితులకు భూమి వాగ్దానం ఎందుకు అమలు జరపలేదు.
మన దేశంలో పార్టీల ఎన్నికల ప్రణాళికలు రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల వంటివే తప్ప ఓటర్లకు హక్కులు ఇచ్చేవి కాదు. టిఆర్‌ఎస్‌ చెబుతున్నదాని ప్రకారం ప్రణాళికలో పెట్టిన వాటిని ఎంతమేరకు అమలు జరిపారు ? మచ్చుకు 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రతి మండల కేంద్రంలో 30పడకలు, నియోజకవర్గ కేంద్రంలో 100 పడకలు, ప్రతి జిల్లా కేంద్రంలో (24) నిమ్స్‌ తరహా ఆసుపత్రులు అని చెప్పారు. ఎన్ని చోట్ల అమలు జరిపారో చెప్పగలరా ? వాటి అమలుకు ఇంకా ఎంత సమయం తీసుకుంటారో వివరించగలరా ?
2018 ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటారా ? గత ఎన్నికల ప్రణాళికలో చెప్పినవి మొత్తం అమలు జరిపామని, అవిగాక రైతు బంధువంటి చెప్పని కొత్త పధకాలు అమలు జరిపామని కూడా చెప్పుకున్నారు. అందువలన వారి మాదిరే ఆయా పరిస్ధితులను బట్టి వివిధ తరగతులు కూడా ఎన్నికల ప్రణాళికలతో నిమిత్తం లేకుండా తమ సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టే హక్కు కలిగి వున్నారు.
ఉద్యోగులు లేదా ఇతర కష్టజీవులు కోరుతున్న లేదా లేవనెత్తే న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ ఎన్నికల ప్రణాళికకు ముడిపెట్టటం ఒక ప్రమాదకర పోకడ. ముఖ్యమంత్రి సచివాలయంలోని తన కార్యాలయానికి రావటం విధి. దాన్ని ఎన్ని రోజులు నిర్వహించారు? సిఎం కార్యాలయానికి రారు, నివాసాన్నే కార్యాలయంగా చేసుకుంటారని పార్టీ ఎన్నికల ప్రణాళికలో పెట్టలేదే ?
రోడ్డు రవాణా సంస్ధల విలీనం ఇతర రాష్ట్రాలలో లేదని అంటున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రైతు బంధును తెలంగాణాలోనే ప్రవేశపెట్టామని చెప్పుకున్నవారు ఈ విషయంలో చొరవ ఎందుకు చూపకూడదు? విలీనం చేయకూడదనే అడ్డంకులేమీ లేవు కదా ! అసలు అలా విలీనం చేస్తే తలెత్తే సమస్యలేమిటో, ఎందుకు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారో రాష్ట్రప్రజలకు, కార్మికులకు చెప్పకుండా ఇతర రాష్ట్రాల గురించి అడ్డగోలు వాదనలు ఎందుకు?
హర్యానా, పంజాబ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, సిక్కిం, అండమాన్‌, చండీఘర్‌ వంటి చోట్ల బస్సు సర్వీసులు ప్రభుత్వశాఖల్లో భాగంగానే నిర్వహిస్తున్న విషయం టిఆర్‌ఎస్‌ నేతలకు తెలియదా ? వాటి సంగతేమిటి ?
విలీన డిమాండ్‌ రావటానికి కారణం ఏమిటి ? ప్రయివేటు బస్సుల కంటే ఆర్టీసి బస్సులకు పన్ను ఎక్కువ, గతంలో వున్న ఆర్టీసి ఒక డీలరుగా డీజిల్‌, పెట్రోలు కొనటం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంస్ధకు జమచేసే వారు. డీలరుషిప్పులను రద్దు చేసి ప్రయివేటు వారికి లబ్ది కలిగించారు. రాయితీలు ప్రకటించేది ప్రభుత్వం-అమలు జరపాల్సింది ఆర్‌టిసి. వచ్చే నష్టాన్ని ప్రభుత్వం సంస్ధకు చెల్లించటంలేదు. ప్రయివేటు బస్సులు స్టేజికారేజ్‌లుగా తిరుగుతూ ఆర్‌టిసి ఆదాయానికి గండిగొడుతుంటే పాలకులకు పట్టదు. నష్టాలకు అదొక కారణం. వాటిని నియంత్రించే అధికారం ఆర్‌టిసికి లేదు. రవాణాశాఖ తాను చేయాల్సిన పని తాను చేయదు. అందుకే అసలు ఇవన్నీ ఎందుకు విలీనం చేసి ప్రభుత్వమే నడిపితే పోలా అనే విధంగా కార్మికులలో ఆలోచన కలిగించింది ప్రభుత్వ పెద్దలు కాదా ?

Image result for TSRTC staff strike-some illogical arguments
ప్రయివేటీకరణ విషయంలో బిజెపి, కాంగ్రెస్‌ రెండు నాల్కలతో మాట్లాడితే, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తే వాటి గురించి జనమే తేల్చుకుంటారు. బిజెపి నేడు కేంద్రంలో అనేక అప్రజాస్వామిక అంశాలను ముందుకు తెస్తున్నది, వాటన్నింటినీ సమర్ధిస్తున్నది టిఆర్‌ఎస్‌. తమ రాష్ట్రాన్ని రద్దు చేసి రెండుగా చీల్చాలని, ఆర్టికల్‌ 370 రద్దు చేయాలని ఏ కాశ్మీరీ అయినా టిఆర్‌ఎస్‌ను అడిగారా ? ఆర్టికల్‌ 370 రద్దు బిజెపి వాగ్దానం, మరి దానికి టిఆర్‌ఎస్‌ ఎందుకు మద్దతు ఇచ్చినట్లు ? కాశ్మీర్‌ రాష్ట్ర హొదా రద్దు ఏ పార్టీ ప్రణాళికలోనూ లేదు, దానికి ఎందుకు పార్లమెంట్‌లో ఓటువేసినట్లు ? టిఆర్‌ఎస్‌ తన ప్రణాళికలో వాటి గురించి కనీస ప్రస్తావన కూడా చేయలేదే !
రైల్వేల ప్రయివేటీకరణ గురించి ఇప్పుడు టిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారు? వాటి మీద పార్టీ వైఖరి ఏమిటి? వ్యతిరేకమైతే ఎప్పుడైనా నోరు విప్పారా ? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నట్లు ? కేంద్రంలో బిజెపి చేస్తే లేని తప్పు తాము చేస్తే ఎలా తప్పు అని అంటున్నారు తప్ప తాము ఆ తప్పు చేయటం లేదు అని ఎందుకు చెప్పరు ? అటు రైల్వేలు, ఇటు ఆర్‌టిసి ప్రయివేటీకరణ అయితే జేబులు గుల్ల చేసుకొనేది జనమే. ఇదంతా తోడు దొంగల ఆటలా వుందంటే తప్పేముంది?
1990 నుంచి అమలు చేస్తున్న నూతన ఆర్ధిక విధానాల్లో భాగంగా రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్దల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వాలు వదిలించుకోవాలన్నది ఒక షరతు. దానిలో భాగంగానే అనేక రాష్ట్రాలలో రోడ్డు రవాణా సంస్ధలను నిర్వీర్యం చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌,చత్తీస్‌ఘర్‌, ఝార్కండ్‌ వంటి చోట్ల మూసివేశారు. తెలంగాణా విధానం కూడా అదే అయితే సూటిగా చెప్పాలి. న్యాయమైన కోర్కెలకోసం జరుపుతున్న ఆందోళనను సాకుగా తీసుకొని మూసివేతకు లేదా నిర్వీర్యానికి పూనుకోవటాన్ని ఏమనాలి? అలాంటి చోట్ల విద్యార్ధులు, వుద్యోగులు, ఇతర తరగతులకు మన ఆర్టీసిల్లో మాదిరి వుచిత పాస్‌లు, రాయితీలు కోల్పోయారు. కెసిఆర్‌ కూడా అందుకు శ్రీకారం చుడితే సూటిగా చెప్పాలి.

Image result for TSRTC staff strike
ప్రభుత్వశాఖలో ఆర్టీసి విలీనం డిమాండ్‌ను ప్రతిపక్షాలు ముందుకు తేలేదు,సిబ్బంది సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. సమ్మెలోకి పోయేంతవరకు విలీనంతో సహా ఏ ఒక్క డిమాండ్‌ గురించి చర్చలు జరపని సర్కార్‌ కార్మికులకు మద్దతు ప్రకటించిన పార్టీల మీద విరుచుకుపడటం ఏమిటి? అసలు వాటికి ఎందుకు అవకాశం ఇవ్వాలి?
బస్సులన్నీ నడుస్తున్నాయని ఒక వైపు చెబుతారు, మరోవైపు విద్యాసంస్ధలకు సెలవులను పొడిగిస్తారు. సిబ్బంది ఉద్యోగాలన్నీ పోయినట్లే అని ప్రకటిస్తారు? మరోవైపు రోజువారీ పని చేసే తాత్కాలిక వుద్యోగులను నియమించాలని ఆదేశాలిస్తారు? బస్సులు నడిపేందుకు రిటైరైన వారిని నియమించాలని చెప్పటం అంటే ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటమాడేందుకు నిర్ణయించటం తప్ప జవాబుదారీతనం వున్న ప్రభుత్వం చేసే పనేనా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

గ్జీ జింపింగ్‌ మహాబలిపుర పర్యటన-మోడీ మితి మీరిన విశ్వాసం ?

12 Saturday Oct 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

China-India informal summit, Mamallapuram informal summit, narendra modi overconfidence, Narendra Modi with Xi Jinping in Mamallapuram, Xi Jinping mahabalipuram visit

Image result for China's Xi Jinping mahabalipuram visit : narendra modi overconfidence

ఎం కోటేశ్వరరావు
అంతర్జాతీయంగా ప్రధాని నరేంద్రమోడీ నాయక (ప్రజా) రంజకత్వం సహజంగా పెరిగిందా లేక కృత్రిమంగా పెంచారా అని తర్జన భర్జనలు పడేవారున్నారు. ఏది జరిగినప్పటకీ పెరిగిందనే ఎక్కువ మంది భావిస్తున్నారు. ఏకీభవించటమా లేదా అన్నది ఎవరిష్టం వారిదే.
ఎక్కువ మంది భావిస్తున్నదాని ప్రకారం మోడీ-ప్రపంచ నేతలు ఎవరి అవసరాల కోసం వారు పరస్పరం సహకరించుకుంటున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ హౌడీ మోడీ కార్యక్రమం సందర్భంగా హూస్టన్‌ స్డేడియంలో జరిగిన సభ. దానిలో మోడీ గారు ట్రంప్‌కు ఎన్నికల ప్రచారం చేశారు. దానికి ప్రతిగా మోడీ దేశపిత అని ట్రంప్‌ బదులు తీర్చుకున్నారు. హూస్టన్‌ అభిమానుల సంబరం అంబరాన్ని అంటితే, వెలుపల నిరసనకారుల అసమ్మతి కూడా వెల్లడైంది. అయితే ‘నిష్పాక్షికం’ అని చెప్పుకొనే మీడియా ఆనంద సమయంలో అసమ్మతి వినిపించటం, కనిపించటం అశుభం అని కాబోలు స్డేడియం లోపలి హేలనే చూపింది తప్ప వెలుపలి గోలను పట్టించుకోలేదు.
చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ మహాబలిపుర ఇష్టాగోష్టి సమావేశానికి రాక సందర్భంగా చైనాను మనం ఎలా కట్టడి చేయవచ్చో కథలతో పాటు మనకు నమ్మదగ్గ మిత్ర దేశం కాదని మీడియా హితవు చెప్పి కాషాయ దళాల ముందు తన దేశభక్తిని ప్రదర్శించుకుంది. జింపింగ్‌తో కలసి మహాబలిపుర సందర్శన చేస్తే వచ్చే ప్రచారంలో మోడీ వాటా సగమే. అందువలన పైచేయి సాధించేందుకు శనివారం పొద్దున్నే లేచి ఒక సంచి భుజాన వేసుకొని మహాబలిపురం బీచ్‌లో పడివున్న ప్లాస్టిక్‌ సీసాలను సేకరించి స్వచ్చ భారత్‌ గురించి చెప్పటమే కాదు ఆచరించి చూపిన ప్రధానిగా ప్రత్యేక ప్రచారాన్ని పొందారు.

ఇద్దరు మహానేతలు సందర్శనకు వచ్చే సమయంలో బీచ్‌లో వ్యర్ధాలను కూడా తొలగించరా ! ఇదేమి మర్యాద ? ప్రపంచ అగ్రనేతలు వచ్చే సమయాల్లో ఎంతో ముందుగానే ఆ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకొని అణువణువూ గాలించి ఎలాంటి పేలుడు పదార్ధాలు సముద్ర తీరంలో లేవని నిర్ధారించుకుంటారు కదా ! పర్యటన ముగిసే వరకు సాధారణ పర్యాటకులను రానివ్వరు కదా ! అలాంటపుడు వ్యర్ధాలు వేయటాన్ని సిబ్బంది ఎలా అనుమతించారు? ఎలా వదలివేశారు అని అంతర్జాతీయ మీడియాలో కాస్త బుర్రవున్నవారు ప్రశ్నిస్తే సమాధానం ఏమిటి ? ఇలాంటి నాటకీయ చర్యలతో మోడీ ప్రతిష్ట పెరుగుతుందా ?

Image result for narendra modi swachh bharat mahabalipuram
రోజూ ఎందరో యువతీ యువకులు సంచులను భుజాన వేసుకొని వీధుల్లో చెత్తను ఏరుకుంటూ పొట్టపోసుకొనే దృశ్యాలు మనం చూసేవే. దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి వారి సంఖ్య ఐదు లక్షలని, దేశం మొత్తం మీద 15 నుంచి 40లక్షల మంది వరకు వున్నారని ఒక అంచనా. వారి గాధలను మీడియా ఏమేరకు ఇచ్చిందో మనకు తెలియదు. ప్రధానికి వచ్చే రేటింగ్‌కు వారికి రాదు. స్వచ్చ భారత్‌, ప్లాస్టిక్‌పై నిషేధం అమలు జరిగితే వారిలో కనీసం సగం మందికి ఆ వుపాధిపోవటం ఖాయం.( ఈ విశ్లేషణ రాసే సమయానికి మహాబలిపుర ఇష్టాగోష్టి ఫలితాలు వెలువడలేదు. కనుక మీడియాలో వెల్లడైన కొన్ని అంశాలకు మాత్రమే ఇది పరిమితం అని గమనించ మనవి)
కర్మ సిద్దాంతాన్ని నమ్మే వారి అంతరంగం ప్రకారం(బహిరంగంగా చెబితే మన ఖర్మ ఎలా కాలుతుందో అనే భయం కావచ్చు) రెండో సారి నరేంద్రమోడీకి అంతగా కలసి రావటం లేదట. అంతర్జాతీయంగా నేతల ప్రశంసలు తప్ప మిగతా అంశాలలో దేశీయ ఆర్ధిక రంగంలో అన్నీ అశుభాలే ఎదురవుతున్నాయని వాపోతున్నారు. అదే సిద్దాంతం ప్రకారం ఎవరు చేసిన దానిని వారు అనుభవించకతప్పదని ఎవరైనా అంటే మనోభావాలను కించపరిచే, దేశద్రోహలు అయిపోతారు.’ ఇదేమి ఖర్మమో ‘ !

Image result for China's Xi Jinping mahabalipuram visit : narendra modi overconfidence
గత ఐదు సంవత్సరాలుగా దేశాన్ని ప్రపంచ మార్కెట్లో పోటీకి తట్టుకొనేదిగా తయారు చేస్తున్నామని నరేంద్రమోడీ చెప్పుకోవటాన్ని కొందరు అంగీకరించకపోయినా ఎక్కువ మంది జేజేలు పలికారు. మరి అదేమిటో ఏ రోజు ఏ పత్రిక తిరగేస్తే, ఏ టీవీని చూస్తే ఆర్ధిక రంగంలో దిగజారుడు ఏ ఏడాదితో పోలుస్తారో అని సందేహించాల్సి వస్తోంది. దవోస్‌ కేంద్రంగా పనిచేసే ప్రపంచ అర్ధిక వేదిక(డబ్ల్యుఇఎఫ్‌) రూపొందిస్తున్న ప్రపంచ పోటీతత్వ సూచిక 2019లో మన దేశం గత ఏడాది కంటే పది పాయింట్లు దిగజారి 68వ స్ధానంలోకి పోయింది. 2008-09 నుంచి ప్రారంభమైన ఈ సూచికలో పదేండ్ల క్రితం చైనా 30వ స్ధానంలో వున్నది. స్ధిరంగా నిలుపుకోవటం లేదా మెరుగుపరచుకోవటం తప్ప అంతకంటే దిగజారలేదు, తాజా సూచికలో 28వ స్దానంలో వుంది. అదే మన దేశం విషయానికి వస్తే 50వ స్ధానంతో ప్రారంభమైంది. తాజా సూచిక 68. మెరుగుపడటం లేదా కనీసం స్ధిరంగా వుండటం లేదన్నది స్పష్టం. ఇదంతా ఎప్పుడు ? యాభై ఆరు అంగుళాల ఛాతీ విరుచుకొని ఐదేండ్లు సాము చేసిన తరువాత !

నరేంద్రమోడీ సర్కార్‌ సాధించిన విజయ గాధలలో వినిపించేది దేశపు సులభతర వాణిజ్య సూచిక. 2014లో 142గా వున్నది 2018 నాటికి 77వ స్ధానానికి ఎగబాకటం. ఇది రాస్తున్న సమయానికి 2019 సూచిక ఇంకా వెలువడలేదు. అది మరింత ఎగబాకినా, దిగజారినా నరేంద్రమోడీకి సంకటమే. సులభతరవాణిజ్య సూచిక ఇంకా ఎగబాకితే ఆర్ధిక వ్యవస్ధలో కనిపిస్తున్న ‘అశుభాల’ సంగతేమిటని జనం ప్రశ్నించకపోయినా ఆలోచిస్తారు. జనం మెదళ్లు పని చేయటం ప్రారంభించటం పాలకులకు ఎల్లవేళలా ప్రమాదరకమే. సూచిక దిగజారితే కబుర్లు తప్ప మాకు ఒరగబెట్టిందేమీ లేదని కార్పొరేట్‌ శక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తాయి. వారి సంఖ్య తక్కువ, వారేమనుకుంటే మాకేం జాతీయ భావాలతో ఓటేసే జనం వుండగా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. జనం రంగంలోకి రానంత వరకు ఏ పాలకుడిని ఎప్పుడు అందలమెక్కించాలో, ఎప్పుడు దించాలో నిర్ణయించేది వారే.
అమెరికా-చైనా వాణిజ్య యుద్దంతో దెబ్బలాడుకుంటుంటే చైనా కంపెనీలు మన దేశానికి తరలి వస్తాయని, మనం చైనా వస్తువుల దిగుమతులను నిలిపివేస్తే మనం చెప్పినట్లు చైనా వింటుందని నరేంద్రమోడీ సర్కార్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మీడియా ‘అగ్రహారీకులు’ కొందరు దీనికి అనుగుణ్యంగా అమెరికా తరువాత చైనా వస్తువులను ఎక్కువగా దిగుమతి చేసుకొనేది మనమే అన్నట్లుగా తాము నమ్మటమే కాదు, జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

2018 వివరాల ప్రకారం చైనా నుంచి వంద రూపాయల విలువగల వస్తువుల ఎగుమతి జరిగితే మన దేశానికి వచ్చినవి అక్షరాలా మూడు రూపాయల పదిపైసల కిమ్మత్తు కలిగినవి. మన కంటే ఎగువన వున్న ఆరు దేశాలు, ప్రాంతాలు 48.10 రూపాయల విలువగల వస్తువులను దిగుమతులు చేసుకున్నాయి. వాటిలో అమెరికా 19.20, హాంకాంగ్‌ 12.10, జపాన్‌ 5.40, దక్షిణ కొరియా 4.40, వియత్నాం 3.40, జర్మనీ 3.10 చొప్పున దిగుమతి చేసుకున్నాయి. అందువలన మన కోడి కూయకపోతే చైనాకు తెల్లవారదు అని ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే నరేంద్రమోడీ ప్రకటించిన మేకిన్‌ ఇండియా వస్తువుల ఎగుమతుల వైఫల్యం, మేడిన్‌ చైనా దిగుమతులు చేసుకుంటున్నట్లు అంగీకరించటమే.

గత రెండు దశాబ్దాలలో చూస్తే ఉభయ దేశాల మధ్య వాణిజ్య గణనీయంగా పెరిగింది.2000-01లో చైనా నుంచి దిగుమతులు 150 కోట్ల డాలర్లయితే మన ఎగుమతులు 83.1కోట్ల డాలర్లు, తేడా 67.1కోట్ల డాలర్లు. అదే 2008-09 నాటికి మన దిగుమతులు 32 బిలియన్లకు పెరగ్గా ఎగుమతులు 2007-08 నాటికి పదిబిలియన్‌ డాలర్లకు మించలేదు.2012 -13లో గరిష్టంగా 18 బిలియన్లకు చేరాయి తరువాత ఐదు సంవత్సరాల పాటు 13 బిలియన్‌ డాలర్లకు మించి జరగలేదు. చైనా నుంచి దిగుమతులు మాత్రం రెట్టింపు అయ్యాయి.2018లో మన ఎగుమతులు 16.5 బిలియన్‌ డాలర్ల కిమ్మత్తు కలిగినవి. మన కంటే చైనా దిగుమతులు 57.4బిలియన్‌ డాలర్లు ఎక్కువ, అంటే 74 బిలియన్‌ డాలర్ల మేర మనం దిగుమతులు చేసుకున్నాం. కమ్యూనిస్టు చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవటం నేరం, ఘోరం, దేశద్రోహం అని ఎవరైనా అంటే పై అంకెలను బట్టి అతల్‌ బిహారీ వాజ్‌పేయి, తరువాత ఏలుబడి సాగించిన మన్మోహన్‌ సింగ్‌ కంటే నరేంద్రమోడీ పెద్ద దేశద్రోహం చేసినట్లే ! చైనాతో పోలిస్తే ఘోరంగా విఫలమైనట్లే ? ఈ ఐదేండ్ల కాలంలో సామాజిక మీడియాలో చైనా వస్తువులను బహిష్కరించాలంటూ కాషాయ దళాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. నరేంద్రమోడీ ఆచరణ భిన్నంగా వుంది.

ఇటీవలి కాలంలో మన మీడియాలో చైనా నుంచి వలసపోతున్న కంపెనీల గురించి వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. అది వాస్తవమే, అయితే చైనాలో వున్న ఫ్యాక్టరీలెన్ని వాటిలో తరలిపోయే వాటి శాతం ఎంత అన్న నిర్దిష్ట సమాచారం లేదు. సర్వేజనా సుఖినో భవంతు అన్నది మన సంస్కృతి అని ఒక వైపు చెబుతూనే మన దేశంలో రోజు రోజుకూ మూతబడుతున్న ఫ్యాక్టరీల గురించి పట్టని మీడియా చైనా ఫ్యాక్టరీల గురించి అత్యుత్సాహం ప్రదర్శించటాన్ని ఏమనాలి?
చైనా నుంచి తరలిపోతున్న ఫ్యాక్టరీలు ఎక్కువగా వియత్నాం, తైవాన్‌, చిలీలకు పోతున్నాయన్నది తాజాగా వెలువడిన ఒక విశ్లేషణ సారాంశం. దీనికి అమెరికాతో వాణిజ్య యుద్దం కంటే ఇతర కారణాలు ప్రధానంగా పని చేస్తున్నాయని, ఈ పోటీలో నష్టపోయేది దక్షిణాసియా అంటే భారత్‌ అని కూడా చెబుతున్నారు. రెనే యువాన్‌ సన్‌ అనే పరిశోధకురాలు ‘ తదుపరి ప్రపంచ ఫ్యాక్టరీ : చైనా పెట్టుబడులు ఆఫ్రికాను ఎలా పున:రూపకల్పన చేస్తున్నాయి ‘ అనే గ్రంధం రాశారు. ఆమె తాజాగా రాసిన విశ్లేషణ సారాంశం దిగువ విధంగా వుంది.

Image result for China's Xi Jinping mahabalipuram visit : narendra modi overconfidence
‘ గత దశాబ్దకాలంగా ముందుకు వస్తున్న ఒక ముఖ్యమైన ధోరణిని వాణిజ్యయుద్దం కేవలం వేగవంతం చేసింది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా చైనా వుత్పత్తిదారులు కార్మికులను తగ్గించే యాంత్రీకరణ సాంకేతికతల మీద పెట్టుబడులు పెట్టటమా లేక ఫ్యాక్టరీలను వేరే చోట్లకు తరలించటమా అన్నది ఎంచుకోవాల్సి వుంది. రెండవ అంశాన్ని వారు ఎంచుకుంటున్నారు. తమ దేశంలో పెద్ద సంఖ్యలో జనాభా వుంది కనుక పెట్టుబడిదారులు వాలిపోతారనే మితిమీరిన విశ్వాసాన్ని భారత్‌ వదిలిపెట్టాలి.’
మరో విశ్లేషకుడు ఎమాన్‌ బారెట్‌ చెప్పిన అంశాల సారం ఇలా వుంది.’ తయారీదారులు చైనాను వదలి వెళ్లాలని చూస్తున్నారు, అయితే అదంతా వాణిజ్య యుద్దం వలన కాదు. అమెరికా వాణిజ్య యుద్దం ప్రకటించక ముందే చైనా వేతన ఖర్చులు పెరుగుతున్నాయి. 2008 గ్వాంగ్‌డూయింగ్‌ రాష్ట్రంలో కనీసవేతనం 4.12 యువాన్లు వుంటే 2018నాటికి 14.4యువాన్లకు పెరిగింది. జౌళి కర్మాగారాలు అంతకంటే తక్కువ వేతనాలకు కార్మికులు దొరికే దేశాలకు తరలిపోవాలని కోరుకుంటున్నాయి. సాంకేతికత తక్కువగా వుండే ఇలాంటివి తరలిపోవటం దీర్ఘకాలంలో చైనాకు అనుకూలంగా మారతాయి.2015లో చైనా ప్రకటించిన మేడిన్‌ చైనా 2025 ప్రకారం ఆధునిక తయారీ కేంద్రంగా మారాలన్నది లక్ష్యం. తక్కువ ఖర్చుతో పని చేసే ఫ్యాక్టరీలు తరలిపోతే మిగిలినవి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాల్సి వుంటుంది. జర్మనీ పరిశ్రమ 4.0 నవీకరణ చేసేందుకు బిలియన్ల డాలర్లను సమకూర్చుకుంటున్నది, చైనా విధానం కూడా దానికి దగ్గరగా వుంది. పశ్చిమ దేశాల సాయం లేకుండా ఆ లక్ష్యాన్ని చైనా చేరుకోగలదా అనే సమస్య వాణిజ్య యుద్ధాన్ని తొందరపరచింది. అనేక కంపెనీలు పూర్తిగా చైనాను వదలి పెట్టాలని అనుకోవటం లేదు. ప్రపంచంలో ప్రస్తుతం రెండవ పెద్ద మార్కెట్‌గా వున్న చైనాను వదలి పెట్టాలని ఎవరూ అనుకోవటం లేదు. ప్రధాన మైన భాగాలను చైనాలో తయారు చేసి వాటిని నౌకల ద్వారా ఇతర దేశాలకు తరలించి అక్కడ ఆ దేశాల పేరుతో అంతిమంగా వస్తువులను తయారు చేసి ఇవ్వాలనే అనే ఆలోచనతో వున్నాయి.(ఉదాహరణకు మన దేశంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న మారుతీ కార్ల ప్రధాన భాగాలు జపాన్‌లో తయారు చేసి మన దేశంతో సహా ఇతర దేశాలకు తరలించి ఆయా దేశాల బ్రాండ్ల పేరుతో వాటిని విక్రయించిన మాదిరి) ”

Image result for China's Xi Jinping mahabalipuram visit : narendra modi overconfidence
ఈ నేపధ్యంలో చైనా నుంచి మన దేశానికి వచ్చే ఫ్యాక్టరీల మీద ఆశపెట్టుకోవటం మబ్బులను చూసి ముంతలోని నీరు పారపోసుకోవటం తప్ప వేరు కాదు. ఒక వేళ వచ్చినా అవి ఆధునికమైనవి కాదు. తాజా సాంకేతిక పరిజ్ఞానంతో వస్తూత్పత్తికి అవసరమైన నైపుణ్యం మన దేశంలో లేకపోవటం మన ప్రపంచ పోటీతత్వ సూచికలో మన వెనుకబడటానికి, దిగజారటానికి కారణాల్లో ఒకటన్నది స్పష్టం. జనాభా ఎంత మంది అన్నది కాదు, వారిలో ఎందరికి నైపుణ్య సామర్ధ్యం సమకూర్చామన్నది ముఖ్యం. ఈ విషయంలో నరేంద్రమోడీ సర్కార్‌ విజయం సాధించిందా ? వైఫల్యం చెందిందా ? యాభైఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో చేయలేనిదాన్ని ఐదేండ్లలో, 70 ఏండ్లలో చేయలేని దాన్ని 70 రోజుల్లో చేశామని చెప్పుకుంటున్నవారు ఈ విషయంలో ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నట్లు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కష్టజీవుల్లో భ్రమలను పోగొడుతున్న కెసిఆర్‌కు ‘అభినందనలు’ !

08 Tuesday Oct 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, Opinion, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

KCR, KCR warning to RTC staff, TS RTC staff strike

Image result for kcr

ఎం కోటేశ్వరరావు
ముందుగా తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ‘అభినందనలు’ చెప్పాలి. కార్మికులు, వుద్యోగులు,సకల కష్ట జీవుల్లో నెలకొన్న భ్రమలను తొలగించేందుకు, కార్మిక, వుద్యోగ సంఘాల ఐక్యతకు దోహదం చేస్తున్న ‘ఒకే ఒక్కడు ‘ కెసిఆర్‌ అంటే అతిశయోక్తి కాదు. చరిత్రలో అనేక సందర్భాలలో ఇదే రుజువైంది.దశాబ్దాల తరబడి చైతన్యం కలిగించేందుకు ప్రయత్నించిన ఉద్యమకారుల కృషి కంటే కొందరు పాలకుల ఒకటి రెండు చర్యలు జనానికి కనువిప్పు కలిగించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.
పోరుబాట వదలి, పాలక పార్టీల సార్ల ముందు సాష్టాంగ ప్రమాణ బాట పడితే సమస్యలన్నీ పరిష్కారమౌతాయంటూ ఇటీవలి కాలంలో అనేక సంఘాల నాయకత్వాలు చెప్పిన సూక్ష్మంలో మోక్షాన్ని అందుకోవచ్చని కష్టజీవులు కూడా గుడ్డిగా నమ్మారు. ఎండమావుల వెంట పరుగులెత్తుతున్నారు. ఇదేదో రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామం కాదు. రూపం మార్చుకున్న పెట్టుబడిదారీ విధానం నేతి బీరలో నెయ్యి మాదిరి నయా వుదారవాదం ముందుకు తెచ్చిన అస్ధిత్వ ధోరణులు లేదా రాజకీయాలు కష్టజీవులను భ్రమల్లో ముంచుతున్నాయి. గొర్రె కసాయి వాడిని నమ్మినట్లుగా కష్టజీవుల పరిస్ధితి తయారైంది.

Image result for kcr
సమ్మెలో పాల్గొన్న కార్మికులను వుద్యోగాల నుంచి ఊడగొడతానని సార్‌ కెసిఆర్‌ ఇప్పుడు కొత్తగా ప్రకటించారని చాలా మంది అనుకుంటున్నారు. నిజానికి గతేడాది జూన్‌ 11 నుంచి తలపెట్టిన సమ్మె సందర్భంగానే హెచ్చరించారని మరచి పోరాదు. అయినా సరే తరువాత జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో ఆయన నాయకత్వానికే ఓటు వేశారు. తెలంగాణా రాష్ట్ర ఆందోళన సమయంలో తామంతా పాల్గొన్నామని ఇప్పుడు ఇలా చేయటం ఏమిటని అనేక మంది గుండెలు బాదుకుంటున్నారు. పరాయి పాలకులను నెత్తినెక్కించుకోవటం కంటే మా దొరలను మోయటమే మాకు గర్వకారణంగా వుంటుందని గతంలో వాదించిన విషయాలను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. అలా దొరలను నెత్తినెక్కించుకున్న వారిలో కార్మికులు, వుద్యోగులు, వుపాధ్యాయులతో సహా ఎవరూ తక్కువ కాదు.
ఒకసారి అస్ధిత్వ ధోరణులకు ప్రభావితులై వర్గదృక్పధం కోల్పోయిన తరువాత దొరలు, దొరసానులనే కాదు చివరకు వివిధ రూపాల్లో ముందుకు వచ్చే ఫాసిస్టు లక్షణాలను, ఫాసిస్టు శక్తులను సైతం బలపరచటానికి జనం వెనుకాడరు. ప్రపంచ ద్రవ్యపెట్టుబడి విధానాల పర్యవసానంగా జీవనోపాధి కుచించుకుపోతున్నది. ఈ నేపధ్యంలో ఉద్యోగాలలో వున్న వారు గతంలో సంపాదించుకున్న హక్కులను నిలబెట్టుకొనేందుకుగానీ, పోగొట్టుకున్నవాటిని తిరిగి పొందేందుకు గానీ ముందుకు రాకపోగా అధికార పార్టీని ఆశ్రయిస్తే ఎలాగొలా నెట్టుకురావచ్చని ఆశపడతారు.పోరుబాటను విడిచిపెడతారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దేనికైనా సిద్ధపడతారు. కనుకనే తాను కొత్తగా ఆర్టీసిలోకి తీసుకోబోయే ఉద్యోగులు తాము యూనియన్లకు, సమ్మెలకు దూరంగా వుంటామని హామీ పత్రాలను రాసివ్వాల్సి వుంటుందనే ఒక నిరంకుశమైన అంశాన్ని ముఖ్యమంత్రి బహిరంగంగానే చెప్పగలుగుతున్నారు. రిక్రూట్‌మెంట్‌ చేస్తే గీస్తే ప్రభుత్వ వుద్యోగులు, వుపాధ్యాయులు కూడా తాము ఏ యూనియన్‌ సభ్యత్వం తీసుకోము అని రాసివ్వాలని అడగరనే హమీ ఎక్కడుంది. ఇన్ని సంఘాలు ఎందుకని ఒకసారి మాట్లాడతారు. తాను ఇచ్చిన హామీలనే అమలు జరపమని కోరినందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్ధల సిబ్బందిని వుద్దేశించి తోక కుక్కను నడుపుతుందా లేక కుక్క తోకను ఆడిస్తుందా అంటూ అవమానకరంగా మాట్లాడారు. ఒక్కో సమయంలో ఒక్కో శాఖ సిబ్బందిని అవమానాలపాలు చేసి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆర్టీసి యూనియన్లు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాయని అంటున్నారు.
అస్ధిత్వ ధోరణుల కారణంగానే ఎవరి సంగతి వారు చూసుకోవాలనే వైఖరి నేడు వివిధ కార్మిక సంఘాల మధ్య నెలకొని వుంది. ఆర్టీసి వుద్యోగులకు రెండున్నర సంవత్సరాలుగా పిఆర్‌సి డిమాండ్‌ను పట్టించుకోని ముఖ్యమంత్రి ప్రభుత్వ వుద్యోగులు తమ పిఆర్‌సిని పట్టించుకుంటారని నమ్మటం భ్రమగాకపోతే ఏమిటి? ఆర్‌టిసి కార్మికుల పట్ల ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తుంటే మిగతా వుద్యోగ, కార్మిక సంఘాలు ఖండించటం, తోటి వుద్యోగులకు కనీసం నైతిక మద్దతు ప్రకటన కూడా ఇవ్వకపోవటానికి కారణం ఏమిటి ? రేపు తాము పోరుబాట పడితే ఇతరుల మద్దతు అవసరం లేదా ? ఎవరికి వారు ఆలోచించుకోవాలి.

Image result for kcr
ఆర్‌టిసి కార్మికుల విషయానికి వస్తే దసరా పండగ ముందు సమ్మె చేయటం ఏమిటంటూ వారికి వ్యతిరేకంగా జనంలో మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. సామాజిక మాధ్యమంలో హిందూత్వ ప్రభావానికి లోనైన వారు హిందువుల పండగ సందర్భంగానే సమ్మె చేస్తున్నారంటూ పోస్టులు పెట్టారు. వారికి మతోన్మాదం తప్ప సమ్మెలో వున్నవారు కూడా అత్యధికులు హిందువులే అన్న విషయం వారికి పట్టదు. గతేడాది జూన్‌లో సమ్మె నోటీసు ఇచ్చినపుడు ఏ పండగా లేదు. అయినా సరే ప్రభుత్వం సమ్మె నోటీసును తీవ్రంగా తీసుకుంది. జూన్‌ 7న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మీడియాతో మాట్లాడుతూ ఒక వేళ సమ్మెంటూ జరిగితే ఆర్‌టిసి చరిత్రలో ఇదే చివరిది అవుతుంది, సిబ్బంది వుద్యోగాలను కోల్పోతారు అని బెదిరించారు. అప్పుడు మూడువేల కోట్ల నష్టం గురించి మాట్లాడిన సిఎం దాన్ని పూడ్చేందుకు లేదా కొత్త నష్టాలను నివారించేందుకు తీసుకున్న చర్యలేమీ లేవు. ఇప్పుడు తిరిగి తాజా అంకెలతో, ప్రయివేటు బస్సులు, కొత్త సిబ్బంది అంటూ కార్మికులను భయపెట్టేందుకు లేదా రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. పదహారు నెలల క్రితం చేసిన వాదనలనే ముందుకు తెచ్చారు. కొత్త ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు. అవన్నీ ఆర్‌టిసిని మరింతగా దెబ్బతీసేవే తప్ప బాగు చేసేవి కాదు. ఆ సంస్ధకు వున్న విలువైన ఆస్ధులను కాజేసేందుకు ఎవరు అధికారంలో వున్నప్పటికీ పాలకపార్టీల పెద్దలు ఉమ్మడిగా వున్నపుడు, రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రయత్నిస్తూనే వున్నారు.
తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐర్‌ అండ్‌ పిఆర్‌( తాత్కాలిక భృతి, వేతన సవరణ)పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. బడ్జెట్‌ కేటాయింపులు లేవు గనుక వాటిని సాధ్యమైన మేరకు వాయిదా వేసేందుకు, ఒక వేళ ఇవ్వాల్సి వచ్చినా నామ మాత్రంగా పెంచేందుకు అవసరమైన నేపధ్యాన్ని సిద్దం చేశారని ఉద్యోగులు మరచి పోరాదు. సంక్షేమ చర్యలతో జనాలను ఆకర్షించేందుకు చూసే పాలకులు ఆర్ధిక పరమైన సమస్యలను ఎదుర్కొన్నపుడు వాటికే ఎసరు పెడతారని గ్రహించాలి. అలాంటి పరిస్ధితి ఎదురైనపుడు కార్మికులు, వుద్యోగుల ముందు రెండు మార్గాలు వున్నాయి. బెదిరింపులకు భయపడి ప్రభుత్వాలకు లొంగిపోయి ఆర్ధికంగా నష్టపోవటం ఒకటైతే అందరూ ఒక్కటై ఒకరికి ఒకరు తోడై ఉమ్మడిగా పోరుబాట పట్టి న్యాయమైన కోర్కెలను సాధించుకోవటం రెండవది. ప్రపంచ వ్యాపితంగా మొదటిదే ఎక్కువగా జరుగుతోంది. నయా వుదారవాద ప్రభావం కార్మికవర్గం మీద తీవ్రంగా వుంది.

Image result for kcr
ప్రపంచంలో అతి పెద్ద దేశమైన చైనాలో ఏటేటా కార్మికుల,వుద్యోగుల వేతనాలు పెరుగుతున్నందున పరిశ్రమలు, వాణిజ్యాలు గిట్టుబాటుగాక వేతనాలు ఎక్కడ తక్కువగా వుంటాయో అక్కడికి తరలి పోవాలని చూస్తున్నాయనే వార్తలను చూస్తున్నాము. దానికి కారణం అక్కడి పాలకులు కష్టజీవుల పక్షాన వుండటమే అన్నది స్పష్టం. చైనా నుంచి బయటకు పోయే వాటిని మన దేశానికి రప్పించాలని కేంద్రంలో అధికారంలో వున్న నరేంద్రమోడీ, ఆయన విధానాలనే అనుసరిస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూస్తున్నారు. ప్రభుత్వ వుద్యోగులు, కార్మికుల వేతనాలు పెరిగితే ప్రయివేటు రంగంలో వున్న వారి వేతనాల పెంపుదలకు వత్తిడి, ఆందోళనలూ ప్రారంభమౌతాయి. అందువలన సంఘటితంగా వున్న వారినే దెబ్బతీస్తే అసంఘటిత రంగంలో వున్న వారు ముందే నీరుగారి పోతారు.
పెట్టుబడులను ఆకర్షించాలని చూసే ప్రతి రాష్ట్ర పాలకులూ ఈ పరిస్ధితినే కోరుకుంటారు. దీనికి కెసిఆర్‌ మినహాయింపు కాదని అర్ధం చేసుకోవాలి. ఉన్న యూనియన్ల నాయకత్వాలను లోబరచుకోవటం, సాధ్యంగాకపోతే వాటిని చీల్చి తమ కనుసన్నలలో పనిచేసే వారితో కొత్త సంఘాలను ఏర్పాటు చేయటం వంటి పాలక టీఆర్‌ఎస్‌ పార్టీ అజెండా, పరిణామాలు, పర్యవసానాలన్నీ దానిలో భాగమే. ఇది రాస్తున్న సమయానికి ఆర్‌టిసి సమ్మె సంపూర్ణంగా జరుగుతోంది. ప్రభుత్వ బెదిరింపులు కార్మికుల మీద పని చేయలేదు. తోటి వుద్యోగ, కార్మిక సంఘాల మద్దతు లేకపోతే ఈ ఐక్యత, పట్టుదల ఎన్ని రోజులు వుంటుంది అన్నది సమస్య. దసరా తరువాత నిరంకుశ, నిర్బంధ చట్టాల దుమ్ముదులుపుతారు. ఆర్‌టిసి కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌ వైఖరి వారికే పరిమితం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. యావత్‌ వుద్యోగ, కార్మికులకూ ఆ ముప్పు పొంచి వుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు : బిజెపి, మిత్ర పక్షాల వైఖరి ఏమిటి ?

07 Monday Oct 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Intolerance, Narendra Modi, Prime Minister Narendra Modi, sedition case against 49 celebrities

Image result for sedition case against 49 celebrities

ఎం కోటేశ్వరరావు

జై శ్రీరామ్‌, గోరక్షణ తదితర నినాదాల మాటున దేశంలో జరుగుతున్న అసహన, విద్వేషపూరిత, మూక దాడులను నివారించాలని కోరుతూ వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీకిి బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ చర్య ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ బీహార్‌లోని ముజఫర్‌ పూర్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి (సిజెఎం) కేసు నమోదుకు జారీ చేసిన ఆదేశాలు మరోసారి ఆ లేఖపై మరో రూపంలో చర్చకు దారి తీశాయి. అసలు దేశ ద్రోహం ఏమిటి అన్న ప్రశ్నను ముందుకు తెచ్చాయి. కోర్టు తీరు తెన్నులపై సామాజిక, సాంప్రదాయ మాధ్యమంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. (మేథావులూ మీరెటు వైపో తేల్చుకోండి అనే శీర్షికతో 49 మంది మేథావులు, దానికి పోటీగా 62 మంది రాసిన లేఖ గురించిన విశ్లేషణలో చర్చించినందున చర్విత చరణం కాకుండా వుండేందుకు ఆసక్తి కలిగిన వారికోసం లింక్‌ను అందచేస్తున్నాను.https://vedikaa.com/2019/07/27/intellectuals-which-side-are-you-on/)

Image result for sedition case against 49 celebrities: what is the bjp and its allies view ?

కేసును ఆమోదించి ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి , కేసును దాఖలు చేసిన లాయరు ఎలాంటి రాజకీయ అభిప్రాయాలు కలిగివున్నారన్నది ఒక అంశం. విధులలో వున్న న్యాయమూర్తి గనుక ఆయనకు వాటిని ఆపాదించలేము. ఫిర్యాదులోని అంశాలను బట్టి న్యాయవాది సుధీర్‌ కె ఓఝా బిజెపి మద్దతుదారుగా కనిపిస్తున్నది, కాకపోవచ్చు కూడా, ఎందుకంటే సదరు పెద్దమనిషి గత చరిత్రను చూస్తే మీడియాలోనూ, న్యాయవ్యవస్ధలో పేరు కోసం, తన వృత్తి, కక్షిదారులను పెంచుకొనేందుకు వందల కేసులు దాఖలు చేసి ఒక పెద్ద లిటిగెంట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఏ పార్టీ వారిని, ఏ రంగ ప్రముఖులను వదలిపెట్టలేదు. అది ఎప్పటి నుంచో సాగుతోంది. మానసిక సమస్య కూడా కావచ్చు.

ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినవి, కోర్టులలో ప్రజాప్రయోజన వాజ్యాల (పిల్స్‌) దాఖలుకు సంబంధించి కొన్ని సవరణలు లేదా సంస్కరణలు తీసుకురావాల్సి వుంది. న్యాయవాది సుధీర్‌ కె ఓఝా చేసిన ప్రధాన ఆరోపణ 49 మంది ప్రముఖులు రాసిన లేఖ కారణంగా ప్రపంచ వ్యాపితంగా దేశ పరువుకు నష్టం కలిగింది, ప్రభావం కలిగించే ప్రధాని పని తీరును గుర్తించలేదు, దేశద్రోహ ధోరణులను ప్రోత్సహించేదిగా వుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదిగా వుంది.

నలభై తొమ్మిది మంది ప్రముఖుల లేఖ అంశాలలో ఎక్కడా పై లక్షణాలు లేవు. ప్రధానికి దేశంలో తలెత్తిన పరిస్ధితి గురించి వినతి మాత్రమే వుంది. ఒక వేళ వున్నాయి అనుకుంటే దానికి పోటీగా రాసిన 62 మంది ప్రముఖుల లేఖతో ఆ నష్టం పూడినట్లే, దేశ పరువు నిలబడినట్లే, ప్రధాని పని తీరు దేశానికి తెలిసింది, దేశద్రోహ ధోరణులకు అడ్డుకట్ట వేసింది కనుక న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయమూర్తి కొట్టివేసి వుండాల్సింది. లేదూ మరొక కోణంలో చూస్తే దేశద్రోహ ధోరణులను ప్రోత్సహించేదిగా 49 మంది లేఖ వుందనుకుంటే 62 మంది లేఖకే మీడియాలో ఎక్కువ ప్రచారం వచ్చింది. తొలి లేఖ అంశాలను చూడని వారు అనేక మంది దీన్ని చూసి తెలుసుకున్నారు. అంటే పరోక్షంగా ‘దేశద్రోహాన్ని ప్రోత్సహించే ధోరణులకు ‘ 62 మంది ప్రచారం ఇచ్చి, వ్యాప్తికి దోహదం చేసినట్లే కదా ! కేసు దాఖలు చేసిన వారికి, అంగీకరించిన న్యాయమూర్తి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారా ? అలాంటి వారి మీద చర్య వుండాలా వద్దా ?

ఈ కేసులో నిర్దిష్టమైన నేరం లేదు. ఆవు వ్యాసం వంటిది. ఆవును పెంచితే అలా జరుగుతుంది, ఇలా లబ్ది కలుగుతుంది అని చెప్పినట్లుగా వుంది తప్ప మరొకటి కాదు. అందువలన కేసు నమోదైంది బీహార్‌లో గనుక దీని పట్ల రాష్ట్ర జెడియు-బిజెపి సంకీర్ణ సర్కార్‌ వైఖరి ఏమిటి ? రాసిన లేఖ కేంద్రానికి కనుక కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పరిగణిస్తోందన్నది స్పష్టం కావాలి. లేఖ రాసిన ప్రముఖులను, లేఖలోని అంశాలను ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పరిగణిస్తున్నాయి. దేశ ద్రోహానికి పాల్పడినట్లు అవికూడా భావిస్తే తమ వైఖరి కూడా అదే అని, లేనట్లయితే వారికి వున్న భావప్రకటనా స్వేచ్చను వుపయోగించుకున్నారు, అది దేశద్రోహం కాదని అయినా కోర్టుకు చెప్పాలి. అలాగాక మేము కేసు పెట్టలేదు, దానితో మాకు సంబంధం లేదు, చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని చెబితే భావ ప్రకటనా స్వేచ్చను హరించటానికి మద్దతు ఇస్తున్నట్లే లెక్క !

రాజ్యాంగంలో కోర్టుల పరిధులు స్పష్టంగా వున్నాయా ? వుంటే ఈ కేసులో నిందితులుగా వున్న వారు ముజఫర్‌ నగర్‌ జిల్లా వాసులు లేదా బీహార్‌, ఒక రాష్ట్రానికి చెందిన వారు కాదు. ఒక వేళ కుట్రకేసు అయితే అది ఎక్కడ జరిగిందో దాని వివరాలను పోలీసులు దాఖలు చేయాలి. లేఖ రాసిన వారిలో ఒక రైన ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ తమ మీద దాఖలైన దేశద్రోహ కేసు వార్త విని ‘ ఈ దేశంలో ఏమి జరుగుతోందో నాకు అర్ధం కావటం లేదు, అలాంటి పిటీషన్‌ను ఒక కోర్టు ఎలా స్వీకరిస్తుంది ? గాడ్సేను పొగిడిన వారు దేశ వ్యతిరేకులుగా కనిపించటం లేదు. గాంధీ చిత్రాలపై కాల్పులు జరిపిన వారు ఎంపీలుగా స్వేచ్చగా తిరుగుతున్నారు. వారిని ఏ కోర్టూ ప్రశ్నించలేదు.” ఈ మాటలు ఒక్క గోపాలకృష్ణన్‌వే కాదు, కాస్త బుర్రవున్న ప్రతివారి మదిలో తలెత్తినవి. అనేక అంశాలను సూమోటోగా తీసుకొని విచారిస్తున్న కోర్టులు ఈ మాటలను పరిగణనలోకి విచారణ తీసుకోవాలని ఎవరైనా కోరుకోవటం తప్పెలా అవుతుంది?

కోర్టులు ఒక నిర్ణయం తీసుకొనే ముందు, అదీ ఇలాంటి అంశాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంది. కోర్టు ఆదేశాల ప్రకారం దాఖలైన కేసు నిందితులలో ఒకరైన ప్రముఖ దర్శకులు శ్యాం బెనెగల్‌ బంగ్లాదేశ్‌తో కలసి నిర్మించబోయే ఒక చిత్ర పధకానికి మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి తన మీద దేశద్రోహం కేసులా, ఏం జరుగుతోందో అర్ధం కావటం లేదు అని శ్యాం బెనెగల్‌ ఆశ్చర్యపోయారు. దేశద్రోహం నేరారోపణ ఎందుకు చేశారో నాకు చిన్నమెత్తు కూడా అర్ధం కాలేదు, అసంగతానికి పరాకాష్ట. దేశంలో భయంతో కూడిన వాతావరణం వుంది, దాన్ని మనం తొలగించాలి. ఆ పని ఎవరు చేయగలరు? ప్రధాన మంత్రి దేశాన్ని నడుపుతున్నారు. అందుకే మేము అయనకు విజ్ఞప్తి చేశాము. మా మీద దాఖలైన కేసుకు సంబంధించి నేను ఎలాంటి చర్య తీసుకోను. నేను ఇక్కడ ఒక సామాన్య పౌరుడిని. పెరుగుతున్న నేరాలను గమనంలోకి తీసుకోవాలని ప్రధాని ముందుకు ఒక సమస్యను తీసుకువచ్చాము. ఆ విధంగా ఆయనకు తెలుస్తుంది. జూలైలో ప్రముఖులు లేఖ రాస్తే అప్పటి నుంచి ఇంతవరకు ప్రధాని కార్యాలయం నుంచి స్పందన లేదు’ అన్నారు. బంగ బంధు ముజిబుర్‌ రహ్మాన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆయన భాగస్వామి. మరి ఆయన వ్యాఖ్యలకు కోర్టు సమాధానం ఏమిటి ?

ఈ అంశం మీద ఇంకా అనేక స్పందనలు వెలువడ్డాయి. కేసును వెనక్కు తీసుకోవాలని వినతులు వచ్చాయి. స్ధలాభావం రీత్యా ప్రస్తావించటం లేదు. కోర్టుద్వారా కేసు నమోదు చేయటంతో మరోసారి దేశ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల తీరు తెన్నులు మరోసారి మీడియా, జనం నోళ్లలో నానుతున్నాయి. అంతర్జాతీయ ప్రచారం వచ్చింది. అంటే మరోసారి దేశ ప్రతిష్టకు, ప్రధాని పనితీరుకు మచ్చ వచ్చింది కనుక స్పందించిన రాజకీయ పార్టీలు, ప్రముఖులతో పాటు ఇప్పుడు మీడియాను కూడా దేశద్రోహం కేసుల్లో ఇరికిస్తారా ?

న్యాయవాది సుధీర్‌ కె ఓఝా విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు ఒక లిటిగెంట్‌గా కనిపిస్తోంది. అనేక మందిపై గతంలో కేసులు దాఖలు చేశాడు. ఢిల్లీలో దొరికే వుచిత వైద్య లబ్దికోసం జనాలు ఇక్కడికి వాలిపోతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీ వాల్‌ అన్నారని, బీహార్‌ నుంచి వచ్చేవారిని వేరు చేసి మాట్లాడారంటూ తాను కేజరీవాల్‌పై కూడా కేసు దాఖలు చేస్తానంటూ ఓఝా తాజాగా ప్రకటించాడు. జాతీయ రాజధాని ఢిల్లీలో అమలు చేస్తున్న వైద్య సౌకర్యాల గురించి సెప్టెంబరు 30న కేజరీవాల్‌ ఒక ప్రకటన చేశారు. దానిలో ‘ ఒక వ్యక్తి బీహార్‌ నుంచి ఐదు వందల రూపాయల టికెట్‌ కొని ఢిల్లీ వస్తాడు. ఇక్కడ లభించే ఐదు లక్షల రూపాయల విలువైన వుచిత చికిత్స తీసుకొని తిరిగి వెళ్లిపోతాడు. పరిస్ధితి అలా వుంది. వారు మన దేశ పౌరులు గనుక అలా జరగటం సంతోషమే, అయితే ఢిల్లీ సామర్ధ్యం పరిమితమే కదా ‘ అని పేర్కొన్నారు. దీనిలో బీహార్‌ అని పేర్కొన్నారు కనుక కేసు వేస్తా అని ఓఝా చెప్పాడు. నిజానికి ఓఝా కేసు దాఖలు చేయాల్సింది బీహార్‌ పాలకుల మీద. వారి నిర్వాకం కారణంగానే అక్కడి జనం ఇతర చోట్లకు పోయి అవమానాల పాలు కావాల్సి వస్తోంది కనుక స్వంత జనానికి వుచిత ఆరోగ్య సదుపాయం కల్పించాలని కేసులు దాఖలు చేస్తే అర్ధం వుంది.

1996లో న్యాయవాదిగా వృత్తి ప్రారంభించినప్పటి నుంచి 745 ప్రజాప్రయోజన వ్యాజ్య కేసులు దాఖలు చేసినట్లు చెప్పుకున్నాడు. వాటిలో ఒకటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మీద కూడా స్ధానిక కోర్టులో వేసింది వుందట.భారత్‌కు వ్యతిరేకంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడటం పరోక్షంగా యుద్దానికి కాలుదువ్వటమే అన్నది అభియోగం.

ఏమిటంటే కాశ్మీరులో హింస, గుజరాత్‌లో కొట్లాటలు, ముంబై వుగ్రముట్టడికి గురైనపుడు నలభై తొమ్మిది మంది ప్రముఖులు ఎందుకు స్పందించలేదని ఓఝా ప్రశ్నించాడు. వారు స్పందించారా లేదా అన్నది పక్కన పెడదాం. ఆ వాదన ప్రకారం అయితే ఆయా సందర్భాలలో స్పందించని యావత్‌ రాతి గుండెల మీద కేసులెందుకు దాఖలు చేయలేదు, వాటిని నివారించటంలో విఫలమైన పాలకులను ఎందుకు బోనెక్కించ లేదు, అనేక అంశాల మీద స్వయంగా స్పందించే కోర్టులు, న్యాయమూర్తులు కూడా స్పందించలేదని కేసులు ఎందుకు వేయలేదు. స్పందించిన అంశం సరైనదా కాదా అన్నది వదలి పెట్టి మిగతా వాటి మీద ఎందుకు స్పందించలేదని ఎదురు దాడి చేయటం అంటే ప్రశ్నించే తత్వాన్ని సహించకపోవటం తప్ప వేరు కాదు. సచిన్‌ టెండూల్కర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వటం గురించి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మీద క్రిమినల్‌ కేసు దాఖలు చేశాడు. ఇలా ఎందరి మీదనో కేసులు వేశాడు.

Related image

ఈ సందర్భంగా ఇలాంటి వారి వల్ల కోర్టుల సమయం వృధా అవుతోంది. కేసుల్లో వున్నవారికి చేతి చమురు వదులుతుంది. అందువలన న్యాయవ్యవస్ధలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం కూడా వుంది. తమ పరిధి వెలుపుల వున్న కేసులను కోర్టులు దాఖలు చేసిన సమయంలోనే తోసి పుచ్చి ఎక్కడ దాఖలు చేయాలో ఫిర్యాదుదారుకు దారి చూపాలి. ఏదీ వూరికే రాదు అన్నట్లు తమ సమయాన్ని వృధా చేసినందుకు తగిన ఫీజును అర్జీదారు నుంచి వసూలు చేయాలి. వుదాహరణకు 49 మంది ప్రముఖులు ఒక రాష్ట్రానికి చెందిన వారు కాదు. అలాంటి వారి మీద కేసును ఒక జిల్లా కోర్టు చేపట్టటం అర్ధరహితం. ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగిపోతోంది. పని గట్టుకొని ప్రశ్నించే, విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించే గొంతులను అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతోంది. జనాలకు న్యాయం మరీ దూరంగా వుండకూడదు, ప్రాధమిక సాక్ష్యాలు వున్నాయి అనుకుంటేే స్ధానిక కోర్టుల్లో దాఖలైన వాటిని పై కోర్టులకు నివేదించాలి. లేదూ అంత సీన్‌ లేదనుకుంటే అసలు స్వీకరణ దశలోనే తిరస్కరించాలి. రాజకీయ పరమైన, భావజాలాలకు, విమర్శలకు సంబంధించిన అంశాలను ఏ కోర్టులు విచారించాలో, కేసులను ఎక్కడ దాఖలు చేయాల్లో నిర్దిష్ట నిబంధనలను రూపొందించటం అవసరం. అన్ని ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్నది అదే. తమ పరిధిలో లేని వాటిని వున్నతాధికారులకు పంపినట్లే, కోర్టులు కూడా అలాగే వ్యవహరించినపుడే వాటి పని తీరు మెరుగుపడుతుంది. దుర్వినియోగమూ తగ్గుతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నిందితులకు రాజకీయ ఆశ్రయం !

06 Sunday Oct 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Adani, Ambani, Ambani and Adani, crony capitalism in India, India crony capitalism, Narendra Modi

Image result for political patronage  for economic offenders, india

(ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నేరస్ధులకు అవధుల్లేని అవకాశాలు ! విశ్లేషణ ముగింపు రెండవ భాగం)

ఎం కోటేశ్వరరావు

ఆర్ధిక నేరగాళ్ల గురించి కూడా మన దేశంలో రాజకీయాలు చేయటం ఒక విషాదం. ఒక పార్టీలో వుంటూ ఆర్ధిక నేరాల ఆరోపణలను ఎదుర్కొన్నవారు మరో పార్టీలో చేరగానే పునీతులౌతున్నారు. కేసులు మరుగునపడుతున్నాయి. దీనికి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం తప్ప మరొక కారణం కనిపించటం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 17న ఎకనమిక్‌ టైమ్స్‌లో ఒక వార్త వచ్చింది. గత మూడు సంవత్సరాలలో మహారాష్ట్రలో ఆర్ధిక నేరాలకు పాల్పడిన వారి వివరాల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన వివరాలను ఆ పత్రిక ఇచ్చింది. నూట ఎనభైకి పైగా కేసులు రాగా ఆర్ధిక నేరాల ముంబై పోలీసు విభాగం చేపట్టింది రెండు మాత్రమే. ఈ కేసులలో రూ. 19,317 కోట్ల మేరకు దుర్వినియోగం జరిగినట్లు అంచనా లేదా అనుమానం కాగా స్వాధీనం చేసుకున్న సొమ్ము రెండున్నర కోట్ల రూపాయలు మాత్రమే. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ వార్షిక నివేదిక ప్రకారం తీవ్ర అక్రమాల దర్యాప్తు కార్యాలయం(సిఎఫ్‌ఐఓ)కు 2017 డిసెంబరు నుంచి 2018 నవంబరు వరకు 33 కేసులను దర్యాప్తు చేయాలని ఆదేశించగా కేవలం ఐదు మాత్రమే పూర్తయ్యాయి. కొన్ని కేసులలో మూడు లేదా నాలుగు సంస్ధలు చేపడుతున్నందున సమయంతో పాటు డబ్బు వ ధా అవుతోంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కేసును మూడు సంస్ధలు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ముంచిన నీరవ్‌ మోడీ కేసును మూడు సంస్ధలు దర్యాప్తు చేస్తున్నాయి. భూషణ్‌ స్టీల్స్‌ అక్రమాల కేసులో ఎండీ నీరజ్‌ సింగాల్‌ అరెస్టును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దర్యాప్తు సంస్ధ అనుసరించిన పద్దతుల్లో లోపాలు, ఇతర కొన్ని అక్రమాలు దీనికి కారణం.

2015 నేషనల్‌ క్రైమ్‌ రికార్డుల బ్యూరో సమాచారం ప్రకారం అంతకు ముందు పది సంవత్సరాలలో ఆర్ధిక నేరాలు రెట్టింపైనట్లు వెల్లడైంది.2006లో ప్రతి లక్ష మందికి 6.6 నమోదు కాగా 2015 నాటికి 11.9కి పెరిగాయి. రాజస్ధాన్‌లో 17.42 నుంచి 37.4కు, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 12.01 వుంటే తెలంగాణాలో 24.6 నమోదయ్యాయి.ఆర్ధిక నేరాల పెరుగుదల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద, సులభతర వాణిజ్యం మీద ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని అనేక మంది చెబుతున్నారు. అయితే లావాదేవీలు పెరిగినందున దానికి అనుగుణ్యంగానే నేరాలు కూడా పెరిగాయన్నది కొందరి అభిప్రాయం.ప్రతి స్ధాయిలో డబ్బు అందుబాటులో వుండటం నేరాల పెరుగుదలకు కారణం అని న్యాయవాదులు అంటున్నారు.

గత ఐదు సంవత్సరాలలో దేశం నుంచి 27 మంది ఆర్ధిక నేరగాండ్లు దేశం విడిచి పోయారని 2019 జనవరి నాలుగున కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా లోక్‌సభకు ఒక రాతపూర్వక సమాధానంలో చెప్పారు. వీరిలో 20 మంది మీద రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరగా ఎనిమిది మీద నోటీసులు జారీ అయినట్లు తెలిపారు. 2018 జూలై 25వ తేదీన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వికె సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం 2015 నుంచి ఆరుగురు మహిళలతో సహా 28 మంది ఆర్ధిక అవకతవకలు, నేరాలకు సంబంధించి చట్టపరమైన చర్యలను ప్రారంభించామని, వారంతా విదేశాల్లో వున్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు.

2018 మార్చి 23న ప్రభుత్వం రాజ్యసభకు తెలిపిన సమాచారం ప్రకారం నేరగాండ్ల అప్పగింతకు అప్పటి వరకు 48దేశాలతో ఒప్పందాలు, మరో మూడు దేశాలతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. సిబిఐ 23, ఇడి 13 కేసులను దర్యాప్తు చేస్తుండగా విజయ మాల్య, మెహుల్‌ చోక్సి, నీరవ్‌ మోడీ, జతిన్‌ మెహతా, ఆషిష్‌ జోబన్‌ పుత్ర, చేతన్‌ జయంతిలాల్‌ సందేశరా, నితిన్‌ జయంతి లాల్‌ సందేశరా, దీప్తిబెన్‌ చేతన్‌ కుమార్‌ సందేశారా రెండు సంస్ధల దర్యాప్తులో నిందితులుగా వున్నారు. ఆర్ధిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారి జాబితాలో దిగువ పేర్లు వున్నాయి.

పుష్ప బైద్‌, అషిష్‌ జీబన్‌ పుత్ర, ప్రీతి అషిష్‌ జీబన్‌ పుత్ర, విజయమాల్య, సన్నీ కల్రా,సంజరు కల్రా, సుధీర్‌ కుమార్‌ కల్రా, ఆరతి కల్రా, వర్ష కల్రా, జతిన్‌ మెహతా, వుమేష్‌ పరేఖ్‌, కమలేష్‌ పరేఖ్‌, నిలేష్‌ పరేఖ్‌, ఏకలవ్య గార్గ్‌, వినరు మిట్టల్‌,చేతన్‌ జయంతిలాల్‌ సందేశరా, నితిన్‌ జయంతి లాల్‌ సందేశరా, దీప్తిబెన్‌ చేతన్‌ కుమార్‌ సందేశరా, నీరవ్‌ మోడీ, నీషాల్‌ మోడీ, సబయ సేథ్‌, రాజీవ్‌ గోయల్‌, అల్కా గోయల్‌, లలిత్‌ మోడీ, రితేష్‌ జైన్‌, హితేష్‌ నరేంద్రభారు పటేల్‌, మయూరీ బెన్‌ పటేల్‌.

గత ఐదు సంవత్సరాలలో విదేశాలకు పారిపోయిన ఆర్ధిక, ఇతర నేరగాండ్లు పద్దెనిమిది మందిని కేంద్ర ప్రభుత్వం దేశానికి రప్పించింది.1. అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు కేసులో రాజీవ్‌ సక్సేనా(యుఏయి నుంచి)తో పాటు లాబీయిస్టు దీపక్‌ తల్వార్‌, ఇదే కేసులో మధ్యవర్తి పాత్ర వహించిన బ్రిటీష్‌ జాతీయుడు క్రిస్టియన్‌ మిచెల్‌, 2. మోసం, ఫోర్జరీ, నేరపూరిత కేసులలో ఇండోనేషియా నుంచి మహమ్మద్‌ యాహ్యా, అక్కడి నుంచే ఇదే కేసులలో వినరు మిట్టల్‌, 3. యుఏయి నుంచి వుగ్రవాద కార్యకలాపాల కేసులో మన్సూర్‌ లేదా ఫరూక్‌ టక్లా, 4. బ్యాంకు అక్రమాల కేసులో రుమేనియా జాతీయుడు ఎంఎం ఫరూక్‌ యాసిన్‌ను నికరాగువా నుంచి, 5. వుద్యోగాల పేరుతో టోకరా కేసులో అబూబకర్‌ కదిర్‌ లోనట్‌ అలెగ్జాండ్రును సింగపూర్‌ నుంచి,6. హత్య కేసులో బంగ్లాదేశ్‌ నుంచి అబ్దుల్‌ రౌత్‌ మర్చంట్‌ మహమ్మద్‌ సుల్తాన్‌, 7. హత్యాయత్నం కేసులో సింగపూర్‌ నుంచి కుమార్‌ క ష్ణ పిళ్లె, 8.భారత్‌కు వ్యతిరేకంగా వుగ్రవాద కేసులో యుఏయి నుంచి అబ్దుల్‌ వాహిద్‌ సిద్ది బాపాను, 9.హత్యాయత్నం కేసులో మారిషస్‌ నుంచి కళ్లం గంగిరెడ్డి, 10. వుగ్రవాద కేసులో అనూప్‌ చెటియా నుంచి బంగ్లాదేశ్‌ నుంచి, కిడ్నాప్‌, హత్య కేసుల్లో ఇండోనేషియా నుంచి చోటా రాజన్‌,11. హత్య కేసులో మొరాకో నుంచి బన్నాజే రాజా, 12. హత్య కేసులో థారులాండ్‌ నుంచి జగతార్‌ సింగ్‌ను మన దేశానికి రప్పించారు.

వీరుగాక ఆర్ధిక నేరాలకు పాల్పడిన మరికొందరిని దేశం విడిచి పోకుండా చూడాలని కార్పొరేట్‌ మంత్రిత్వ వ్యవహారాల శాఖ 20 మంది పేర్లతో ఒక జాబితాను తయారు చేసి ఐబికి అదచేసింది. వారిలో జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌, అనిత గోయల్‌, దీపక్‌ కొచార్‌, వీడియోకాన్‌ ఎండీ వేణుగోపాల్‌ ధూత్‌ తదితరుల పేర్లు వున్నట్లు వెల్లడైంది. నరేష్‌ గోయల్‌, అనితా గోయల్‌ దుబారు మీదుగా లండన్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ముంబ్‌ విమానాశ్రయంలో వారిని నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఆర్ధిక నేరాలకు పాల్పడి దేశం వదలి పారిపోయే వారి గురించి విచారణకు వున్న చట్టాలు పటిష్టంగా లేనందున కొత్తగా 2018లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్నే చేయాల్సి వచ్చింది. విజయ మల్య అనే పెద్ద మనిషి 18-20 సంచులు తీసుకొని పారిపోతుంటే నిఘాసంస్ధల సిబ్బంది విమానాశ్రయంలో గుడ్లప్పగించి చూశారు. ఆయన కదలికల మీద కన్నేసి వుండమన్నారు తప్ప అరెస్టు చేయాలనే ఆదేశాలు లేవని వారు చెప్పిన విషయం తెలిసిందే. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ముంచిన నీరవ్‌ మోడీ విషయంలో కూడా అదే జరిగింది. కొత్త చట్టం ప్రకారం వంద కోట్ల రూపాయలకు పైబడి అక్రమాలకు పాల్పడి పారిపోయిన వారిని ఒక ప్రత్యేక కోర్టులో విచారిస్తారు. విచారణ సమయంలో నిందితుల ఆస్ధులను స్వాధీనం చేసుకోవచ్చు. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా మాట్లాడిన సభ్యులు దాదాపు రెండులక్షల నలభైవేల కోట్ల రూపాయల మేరకు అక్రమాలకు పాల్పడినట్లు,పారిపోయిన నిందితులు 39 అని చెప్పారు.గతేడాది పార్లమెంట్‌కు ప్రభుత్వం చెప్పినదాని ప్రకారం 31 మంది దేశం వదలి పారిపోయారు. అలాంటి నిందితులను మనకు అప్పగించటానికి వీలుగా కేవలం 57దేశాలతో మాత్రమే ఒప్పందాలున్నాయి. అనేక మంది నిందితులు అవి లేని దేశాలకు పారిపోయారు.

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ సజావుగా వుందా లేక ఇబ్బందుల్లో వుందా అన చెప్పటానికి బ్యాంకుల్లో పేరుకు పోతున్న నిరర్ధక ఆస్ధులు ఒక సూచిక. మన దేశంలో ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి. ఏటా లక్షల కోట్ల రూపాయల బకాయిలను పారు బాకీలుగా పక్కన పెడుతున్నారు. వాటిని వసూలు చేస్తామని మరోవైపు చెబుతుంటారు. అలాంటి బాకీలను పరిష్కరించుకోవటంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. 2019 మార్చి నాటికి 8.06లక్షల కోట్ల రూపాయల నిరర్ధక ఆస్తులున్నాయి. మూడు నెలల గడువు తీరినా కనీస మొత్తం చెల్లించని వాటిని, రుణం తీర్చటం కోసం రుణం తీసుకున్న మొత్తాలను నిరర్ధక ఆస్ధులుగా పరిగణిస్తున్నారు. గతంలో వాటిని రావాల్సిన బకాయిలుగా చూపే వారు. ఇప్పుడు ప్రతి ఏటా రద్దు చేసిన వాటిని మినహాయించి చూపుతూ నిరర్ధక ఆస్ధుల మొత్తం తగ్గుతున్నట్లు చిత్రిస్తున్నారు. అలా చేయకపోతే బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రావటం లేదు.ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ అందించిన సమాచారం ప్రకారం 2018 ఆర్ధిక సంవత్సరంలో 1.28లక్షల కోట్లు,2019లో 1.77లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్ధులను రద్దు చేశారు. ఈ చర్యలు ఆర్ధిక నేరస్ధులను ఆదుకోవటం కాదా ?

Image result for India crony capitalism cartoons

ప్రతి ఆర్ధిక విధానంలోనూ లబ్ది పొందేవారు వుంటారు. పాతికేండ్ల సంస్కరణల ఫలితాల గురించి ఆర్ధిక వ్యవహారాల ప్రముఖ జర్నలిస్టు స్వామినాధన్‌ ఎస్‌ అంక్లేసరియా అయ్యర్‌ 2016లో రాసిన విశ్లేషణను కాటో సంస్ధ ప్రచురించింది. దానిలో వున్న అంశాలతో ఏకీభవించటం లేదా విబేధించటం వేరే విషయం. ఆర్ధిక నేరాలు అనే ఈ విశ్లేషణతో ముడిపడిన దానిలోని కొన్ని అంశాల సారం ఇలా వుంది.

Image result for India crony capitalism: political patronage

” 1991 తరువాత అంతకు ముందు రాజకీయ సంబంధాలున్న కొన్ని కుటుంబాల ప్రాబల్యం అంతరించి కొత్తవారు ఎదిగారు. కొత్తగా వాణిజ్య రంగంలోకి వచ్చిన(ముఖ్యంగా రియలెస్టేట్‌, మౌలిక సదుపాయాల రంగం) వారిని ఆశ్రిత పెట్టుబడిదారులు అని పిలిచారు. వారికి బలమైన రాజకీయ సంబంధాలు తప్పనిసరిగా వుంటాయి. వారింకా సురక్షితమైన గుత్త సంస్ధలుగా మారలేదు, వాటిలో అనేక మంది(డిఎల్‌ఎఫ్‌, యూనిటెక్‌, లాంకో, ఐవిఆర్‌సిఎల్‌) దారుణంగా విఫలమయ్యారు. భారత్‌లో లంచాలను రాజకీయ నేతల బలవంతపు వసూలు అని పిలుస్తారు, ఎందుకంటే లంచాలు కొన్ని సందర్భాలలో అనిశ్చితంగానూ కొన్ని సార్లు ప్రతికూల ఆపదగా వుంటాయి. ఆర్ధిక సరళీకరణ మరియు పోటీ కొన్ని సందర్భాలలో పేరుగాంచిన పాత కంపెనీలను దివాలా తీయించాయి.(హిందుస్ధాన్‌ మోటార్స్‌, ప్రీమియర్‌ ఆటోమొబైల్స్‌, జెకె సింథటిక్స్‌, డిసిఎం) తీవ్రమైన పోటీని తగినంత సౌష్టవంగా వుంటేనే మనుగడ సాగించగలవని సూచించాయి.1991లో సెన్సెక్స్‌లో వున్న 30 కంపెనీలలో రెండు దశాబ్దాల తరువాత కేవలం తొమ్మిదే మిగిలాయి.కొత్త కంపెనీల గురించి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘ ఈ కంపెనీలు ధనికుల సంతానం కాదు, సరళీకరణ సంతానం ‘ అన్నారు. గత పాతికేండ్లలో పాతపద్దతిలోని లైసన్సులు, అదుపులు రద్దయ్యాయిగానీ కొత్తవి, అధికార యంత్రాంగపు ఆటంకాలు వచ్చాయి. పర్యావరణం, అడవులు, గిరిజన హక్కులు, భూమి, కొత్త అవకాశాలైన చిల్లరవర్తకం, టెలికాం, ఇంటర్నెట్‌ సంబంధిత కార్యకలాపాల్లో వీటిని చూడవచ్చు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తగినంతగా సరళీకరించటంలో ఘోరంగా విఫలమయ్యాయి. దాంతో వాణిజ్య, పారిశ్రామికవేత్తలు అవినీతి, ఫైళ్లను పక్కన పడేయటం గురించి తీవ్రంగా ఫిర్యాదులు చేస్తున్నారు.

భారత్‌లో నేరగాండ్లు రాజకీయాల్లో భాగస్వాములౌతున్నారు, తరచుగా కాబినెట్‌ మంత్రులు అవుతున్నారు.దీంతో వారి మీద వున్న ఆరోపణలను పరిశీలించకుండా చేసుకోగలుగుతున్నారు. ఏడిఆర్‌ విశ్లేషణ ప్రకారం 2014లో ఎన్నికైన 543 మంది లోక్‌సభ సభ్యులలో 186 మంది మీద నేరపూరిత కేసులు పెండింగ్‌లో వున్నాయి. 2009లో ఎన్నికైన వారిలో 158 మంది మీద వున్నాయి. 2014లో ఎన్నికైన వారిలో 112 మంది మీద హత్య, కిడ్నాప్‌, మహిళల మీద నేరాల వంటి తీవ్ర కేసులు వున్నాయి. ఏ పార్టీ కూడా పరిశుద్దంగా లేదు. అన్ని పార్టీల్లో నేరగాండ్లు పుష్కలంగా వున్నారు. అలాంటి వారు ప్రతిపార్టీకి డబ్బు,కండబలం, ప్రాపకాలను సమకూర్చుతారు.

 

Image result for India crony capitalism cartoons

దేశాల్లో జిడిపితో పాటు అవినీతి పెరుగుతోంది. భారత గత పాతిక సంవత్సరాల అనుభవం దీనికి మినహాయింపు కాదు. వ్యభిచార కేంద్రాన్ని నిర్వహించే ఒక మహిళ ప్రచారంలో పెట్టిన ఫొటోల కారణంగా సెక్స్‌ కుంభకోణంలో ఒక రాష్ట్ర గవర్నర్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. నగంగా వున్న ముగ్గురు యువతులు ఆ గవర్నర్‌తో వున్నారు. వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలికి ఒక గని అనుమతి ఇప్పిస్తానన్న వాగ్దానాన్ని గవర్నర్‌ నిలబెట్టుకోలేకపోయాడు. ప్రతీకారంగా ఆమె ఫొటోలను బయటపెట్టింది.మొదట వచ్చిన వారికి తొలి కేటాయింపు( వాస్తవానికి గడువు గురించి ముందుగానే స్నేహితులకు తెలియచేసి లబ్ది చేకూర్చారు) పద్దతిలో స్పెక్ట్రమ్‌ కేటాయింపుల వలన ఖజానాకు 1.76లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, వేలం వేయకుండా మంత్రిత్వశాఖ విచక్షణతో బొగ్గు గనులు కేటాయించిన కారణంగా 1.86లక్షల కోట్ల నష్టం వచ్చిందని కాగ్‌ నివేదిక పేర్కొన్నది. ఆర్ధిక సంస్కరణలు పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారమిచ్చాయని విమర్శకులు అంటారు. సమగ్రంగా సరళీకరణ గావించిన రంగాలలో అవినీతి అద శ్యమైంది. 1991కి ముందు పారిశ్రామిక, దిగుమతి లైసన్సులు, విదేశీమారకద్య్రవ్య కేటాయింపులు, రుణాల వంటి వాటికి లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. సంస్కరణల తరువాత అవన్నీ సులభంగా లభ్యమౌతున్నాయి. పన్నుల తగ్గింపు కారణంగా స్మగ్లింగ్‌ దాదాపు అంతమైంది. అయితే అన్ని సహజవనరుల, టెలి కమ్యూనికేషన్స్‌ స్ప్రెక్ట్రమ్‌ విలువలను భారీగా పెంచిన కారణంగా వాటి కేటాయింపుల్లో ముడుపులకు అవకాశం కలిగింది. గతంలో ప్రభుత్వ రంగానికి మాత్రమే కేటాయించబడిన రంగాలలో ప్రయివేటు రంగ భాగస్వామ్యానికి తెరిచారు. ప్రభుత్వ-ప్రయివేటు రంగ భాగస్వామ్యం తరచుగా ఆశ్రిత పెట్టుబడిదారుల కారణంగా నష్టం కలిగిస్తోంది. సరళీకరణ తరువాత అనేక రంగాల్లో అవినీతి పోయిందని అయితే కొన్నింటిలో ఎక్కడైతే ఎక్కువగా నియంత్రణలు, అవినీతి ఎక్కువగా వుంటాయో సహజవనరులు, రియలెస్టేట్‌ రంగాల్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అవినీతి మరింత పెరిగింది. ఇటీవలి కాలంలో కొన్ని రంగాలలోని విస్త త అవినీతి పూర్తిగా సరళీకరించిన రంగాల్లో మెరుగుదలను మరుగున పడవేస్తున్నది.” నయా వుదారవాద లేదా సరళీకరణ విధానాలను పూర్తిగా సమర్ధించే అంక్లేసరియా అయ్యర్‌ వంటి వారే అవినీతి గురించి చెప్పకతప్పలేదు. అందరికీ కనిపిస్తున్న అవినీతి సమర్ధకులకు ఒక పట్టాన కనిపించదు. సరళీకరణ విధానం అంటే ప్రజల సంపదను కొంత మందికి కట్టబెట్టటం. ఈ క్రమంలో రాజకీయ-వ్యాపారవేత్తలు లేదా కలగలసిన వారు ప్రజాధనంతో నడిచే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం, ఎగవేయటం అనే అక్రమాలు సర్వసాధారణంగా మారాయి. తెల్లవారే సరికి ధనవంతుడి వయ్యావా లేదా అన్నదే గీటు రాయి, ఎలా అయ్యారన్నది అనవసరం అన్న విలువలే నేడు సమాజాన్ని నడిపిస్తున్నాయి. అలాంటపుడు అక్రమాలకు కొదవేముంటుంది ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం- ఆర్ధిక నేరస్ధులకు అవధుల్లేని అవకాశాలు !

06 Sunday Oct 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

crony capitalism, crony capitalism BJP, crony capitalism in India, crony capitalism INC

Image result for crony capitalism in indiaమొదటి భాగం

ఎం కోటేశ్వరరావు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్నది పాత సామెత. లాభం వుంటేనే రాజకీయనేతలు, వ్యాపారులు కూడా వరద, కరవు ప్రాంతాలకు పోతారు అన్నది సరికొత్త నానుడి. ప్రస్తుతం లాభం, వ్యాపారం, రాజకీయాలను, వాటికోసం పని చేసే వారిని విడదీసి చూడలేని స్ధితి. తొలి పార్లమెంట్‌లో లక్షాధికారులైన ఎంపీలు ఎందరున్నారు అని వెతకటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు కోట్లకు పడగలెత్తని, వ్యాపారులు కాని ఎంపీలు ఎందరున్నారు అని తెలుసుకొనేందుకు బూతద్దాలతో చూడాల్సి వస్తోంది.
రాజకీయం-వ్యాపారానికి వున్న సంబంధాలను మన దేశంలో రెండుగా చూడాల్సి వుంది. ఇది పరాయి దేశాల వలసలుగా, అక్రమణలుగా మారిన అన్ని దేశాలలో పూసల్లో దారంలా కనిపిస్తుందని చెప్పవచ్చు. స్వాతంత్య్రానికి ముందు పరాయి పాలకులను పారద్రోలేందుకు సమాజంలోని పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సహా అన్ని తరగతుల వారూ పాల్గొన్నారు. ఏ తరగతి అజెండా వారికి వున్నప్పటికీ వాటిని ముందుకు తీసుకుపోవాలంటే పరాయిపాలకులు ఆటంకంగా వున్నారన్న ఏకైక కారణమే వారిని ఒక వేదిక మీదకు తెచ్చింది. అందువల్లనే జాతీయ వాదంలో రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి దోపిడీకి గురయ్యే కష్టజీవులు తాము దోపిడీ నుంచి విముక్తి కావాలని కోరుకున్నారు. రెండవది స్వదేశీ పారిశ్రామిక, వాణిజ్య శక్తులు బలపడి తాము స్వంతంగా వ్యవహరించగలం అనుకున్న తరువాత విదేశీ కంపెనీలతో పోటీకి వ్యతిరేకంగా జాతీయవాదాన్ని ముందుకు తేవటం. స్వాతంత్య్రం రాకముందు మన దేశంలో బ్రిటీష్‌ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేసే విధంగా అక్కడి పెట్టుబడిదారులు విధానాలను నిర్దేశించారు. తరువాత మన దేశంలో పెట్టుబడిదారులు, ఫ్యూడల్‌ వ్యవస్ధ ఇంకా బలంగా వున్న వున్నందున పెట్టుబడిదారులు, భూస్వామ్య తరగతులను కలుపుకొని తమ అజెండాను అమలు జరిపారు. తమ పెట్టుబడులు, వ్యాపారాలకు పోటీ రాకుండా చూసేందుకు అప్పటికే ఒక స్ధాయికి చేరిన వారు లైసన్స్‌ పద్దతిని ముందుకు తీసుకు వచ్చారు. భూస్వాముల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఆ వ్యవస్ధను కాపాడేందుకు చేయాల్సిందంతా చేశారు. భూ సంస్కరణల చట్టాలను ఆలశ్యం చేయటం, చేసిన వాటిని నీరుగార్చటం దానిలో భాగమే.
స్వాతంత్య్రం తరువాత ఎవరైనా పరిశ్రమలు, వ్యాపారాలను ఏర్పాటు చేయాలంటే లైసన్సులు అవసరం. వాటికోసం పారిశ్రామిక, వ్యాపారవేత్తలు అధికారంలో వున్న రాజకీయ నేతలను ఆశ్రయించటంతో అవినీతి ప్రారంభమైంది. తమ పనులు జరిపించుకొనేందుకు కొందరు రాజకీయనేతలను లాబీయిస్టులుగా మార్చుకోవటం లేదా అలాంటి వారిని రాజకీయాల్లోకి ప్రోత్సహించి నిధులిచ్చి గెలిపించుకోవటం చేసే వారు. 1991కి ముందే వ్యాపారులు రాజకీయ ప్రవేశం చేయటం, రాజకీయాల్లో వున్న వారు వ్యాపారాల్లో ప్రవేశించటం ప్రారంభమైనా ఆ తరువాత అది మరింత వేగం పుంజుకుంది. నూతన ఆర్ధిక విధానాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మటం, పారిశ్రామిక, వాణిజ్య, సేవా రంగాల నుంచి ప్రభుత్వం వైదొలగాలనే విధానపర నిర్ణయాల తరువాత అది జనానికి మరింత స్పష్టంగా కనిపించింది. దాన్నే నీకది, నాకిది అని అందరూ కుమ్మక్కై పంచుకోవటంగా చూస్తున్నాము. ఇది వాటంగా వున్న తరువాత పార్టీలు లేవు, సిద్ధాంతాలు లేవు. బెల్లం ఎక్కడ వుంటే అక్కడకు చీమలు చేరినట్లు ఎక్కడ అధికారం వుంటే అక్కడకు చేరటం, దానికి కార్యకర్తల అభీష్టమనో, నియోజకవర్గ అభివృద్ధి అనో చెప్పే వారు. ఇప్పుడు వాటి జాబితాలోకి దేశ ప్రయోజనాల కోసం అని కొత్త పదాన్ని చేర్చారు. కమ్యూనిస్టు పార్టీలు తప్ప మిగిలిన పార్టీలు వేటికీ అంటూ సొంటూ, నీతి, అవినీతి తేడా లేదు.

Image result for crony capitalism in india
సంపదలను పోగేసుకొనేందుకు ఎంతకైనా తెగించే వ్యాపారులు, రాజకీయవేత్తలు, వారికి సహకరించే వున్నత అధికారగణం ఒక దగ్గర చేరినపుడు నీకిది, నాకది, వారికది అని పంచుకుంటారు. దీన్నే క్రోనీ కాపిటలిజం లేదా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అంటున్నాము. మీడియా రంగంలో సైతం ఏ పత్రిక, ఏ ఛానల్‌ చరిత్ర చూసినా ఏమున్నది కొత్తదనం, సమస్తం వ్యాపారమయం అన్నట్లుగా ఇలాంటి వ్యాపార-రాజకీయవేత్తలు వాటి వెనుక వుంటారు. వార్తలను అందించి జనానికి సేవ చేద్దామని కాదు, అది కూడా తమ రాజకీయ లాభం కోసమే అన్నది తెలిసిందే. గత ప్రభుత్వం తమ ఆశ్రితులకు బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల నుంచి అపరిమితంగా రుణాలిప్పించి అక్రమాలకు పాల్పడిందన్నది ప్రస్తుత పాలకుల తీవ్ర ఆరోపణ. చిత్రం ఏమిటంటే అలాంటి అక్రమార్కుల మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి అన్నది అంతగా ఎవరూ అడగటం లేదు. గతంలో వారు ఇచ్చిన రుణాలలో లక్షల కోట్లను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తున్నది.

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం దేశం మీద ఎలా ప్రభావం చూపుతుందో రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా పని చేస్తున్న సమయంలో 2014 ఆగస్టు 11న లలిత్‌ దోషి స్మారక వుపన్యాసంలో రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. దీని వుచ్చునుంచి బయట పడాలంటే పౌర సేవలను పటిష్టం చేయటం ఒక మార్గం అన్నారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం పారదర్శకత, పోటీని దెబ్బతీసి చివరకు ఆర్ధిక పురోగతిని మందగింప చేస్తుందని అన్నారు.(అంటే లైసన్స్‌ రాజ్యాన్ని మరోరూపంలో ముందుకు తెస్తుంది) ” వుపాధి, పౌర సేవలను పొందేందుకు పేదలు, నోరు లేని వారికి రాజకీయ నేతల అవసరం వుంది. కుటిల రాజకీయవేత్తకు అందుకు గాను నిధులు, ఇతర అవసరాల కోసం వాణిజ్యవేత్తల ప్రాపకం అవసరం. అవినీతి పరులైన వాణిజ్యవేత్తలు పౌర వనరులు, కాంట్రాక్టులను చౌకగా పొందాలంటే కుటిల రాజకీయవేత్తల మద్దతు అవసరం. రాజకీయవేత్తలకు పేదలు, నోరులేని వారి ఓట్లు అవసరం. ఇలా ప్రతి ఒక్కరూ ఇతరుల మీద ఆధారపడే బంధంతో ఒక వలయంలో వున్నారు. అది యథాతధ స్ధితిని పటిష్టపరుస్తుంది….ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం రాజ్యాధికారం గల కొందరు ధనిక పెద్దలను సృష్టిస్తుంది, అది అభివృద్ధిని మందగింప చేస్తుంది” అన్నారు.

Image result for crony capitalism in india

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇతర అవసరాలకు మళ్లించి తిరిగి చెల్లించగల శక్తి వుండి కూడా ఎగవేసే వారిని బుద్ది పూర్వక ఎగవేతదారులు అంటున్నాము. 2015 మార్చి నెల నుంచి 2019 మార్చినెలతో ముగిసిన ఆర్ధిక సంవత్సరం వరకు బుద్ధి పూర్వకంగా రుణాలు ఎగవేసిన వారి సంఖ్య 5,349 నుంచి 8,582కు పెరిగిందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జూన్‌ 25న లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో చెప్పారు. అంటే ఐదేండ్లలో 60శాతం పెరిగారు. వీరిలో 6,251కేసులలో తనఖా వున్న ఆస్ధుల మీద చర్యలు ప్రారంభించారు, 8,121కేసులలో రుణ వసూలు దావాలు వేశారు, 2,915 కేసులలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎగవేసిన వారి నుంచి 7,600 కోట్ల రూపాయలను వసూలు చేశారు. బ్యాంకులకు ఇలాంటి బాపతు చెల్లించాల్సిన సొమ్మునే నిరర్ధక ఆస్తులంటున్నాము. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఆ మొత్తం 8.06లక్షల కోట్ల రూపాయలు. 2016-19 ఆర్ధిక సంవత్సరాల మధ్య బ్యాంకులు వసూలు చేసిన సొమ్ము 3.59లక్షల కోట్లు పోను ఇంకా రావాల్సింది పైన పేర్కొన్న మొత్తం. యాభై కోట్ల రూపాయలు, అంతకు మించి రుణాలు తీసుకొని ఎగవేసిన వారి ఫొటోలను బ్యాంకుల్లో ప్రదర్శించాలని(పోలీస్‌ స్టేషన్లలో పాత నేరస్దులు, కేడీ గాండ్ల మాదిరి) ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరింది. వారి కోసం గాలింపునకు నోటీసులు జారీ చేయాలని కూడా కోరింది. వారి పాస్‌పోర్టుల సర్టిఫైడ్‌ కాపీలను సంపాదించాలని సూచించింది.

Image result for crony capitalism in india

సాధారణ పెట్టుబడిదారీ విధానంలో పరిశ్రమలు, వ్యాపారం వర్ధిల్లాలి అంటే నష్టభయం వుంటుంది. కానీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలో లాభాలను ఎలా సంపాదించాలో వ్యాపారులు-అధికారంలో వున్న రాజకీయవేత్తలు, వారికి సహకరించే వున్నతాధికారులు కుమ్మక్కై ముందుగానే నిర్ధారించుకొని అందుకు అనుగుణ్యం పావులు కదుపుతారు. దీనిలో మరొకరితో పోటీ వుండదు. కావాల్సిన అనుమతులు, ప్రభుత్వ నిధులు, పన్నుల రాయితీలు ఇతర అన్ని రకాల సౌకర్యాలను అధికారంలో వున్న పెద్దలు సమకూర్చుతారు. దానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఇలాంటి వారు మన కళ్ల ముందే అనూహ్యంగా అపార సంపదలను పోగేసుకుంటారు. దీనికి అనువైన అవకాశాలను నయావుదారవాద విధానాలు కల్పించాయి. తెలంగాణాలో ప్రాజక్టుల రీ డిజైనింగ్‌ పేరుతో చేసిన పనుల మీద తలెత్తిన అవినీతి ఆరోపణలు, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు పనుల అప్పగింత, టెండర్ల విధానం. రెండు చోట్లా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వివాదాలు వీటి పర్యవసానమే.
మిలిటరీ, సరిహద్దులు, కరెన్సీ, పోలీసుల వంటి విభాగాలు మినహా మిగిలిన అన్ని రంగాల నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి, ప్రయివేటు రంగానికి, విదేశీ కంపెనీలకు గేట్లు బార్లా తెరవాలని సంస్కరణల పేరుతో ఎప్పుడైతే నిర్ణయించారో అప్పటి నుంచి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం మూడు పూవులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ఏ దోపిడీ విధానమైనా దానికి అవినీతి తోడుగా వుంటుంది. ఈ కారణంగానే దేశంలో నేడు ఏ పెద్ద కంపెనీ ఏ అక్రమానికి పాల్పడింది, దాని వెనుక ఏ రాజకీయనేతలున్నారో అనే వార్తలు వెలువడుతున్నాయి. అధికార అండచూసుకొని బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల నుంచి ఇచ్చిన మేరకు అప్పులు, ప్రభుత్వం నుంచి రాయితీలు దండుకో, నిధులను దేశం దాటించు, వాటినే విదేశీ పెట్టుబడుల రూపంలో తిరిగి తీసుకురా లేదా ఇతర బినామీ కంపెనీలకు మళ్లించు, సంస్ధలను దివాలా తీయించు. కేసులు పెడతారా విదేశాలకు పారిపో లేదా దొరికిపోతావా పోయేదేముంది పైసాకు కొరగాని పరువు తప్ప కూడబెట్టుకున్న ఆస్ధులేవీ పోగొట్టుకున్నవారెవరూ లేరుగా ! ఇదే కదా పై నుంచి కింది వరకు నేడు దేశంలో వున్న ఆలోచనా సరళి.
Image result for crony capitalism in india
మన దేశంలో నయా వుదారవాదం 1980దశకంలోనే ప్రారంభమైనా 1991లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం తరువాత సంస్కరణల పేరుతో గత విధానాలకు తిలోదకాలివ్వటం పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయట పడటానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకుల నుంచి రుణాలు, నిధులు ఎప్పుడైతే తీసుకున్నామో వాటికి విధించిన షరతుల్లో భాగంగా విదేశీ వస్తువులపై ఆంక్షలను ఎత్తివేసి ఆ కంపెనీలకు మార్కెట్‌ను తెరిచే, ప్రయివేటు రంగానికి అన్ని బాధ్యతలు, అవకాశాలను ఇచ్చే నయా వుదారవాద విధానాలు ప్రారంభమయ్యాయి. వీటిని కాంగ్రెస్‌ ప్రారంభించినా తరువాత అధికారానికి వచ్చిన బిజెపి నాయకత్వం కూడా పూర్తిగా, మరింత ఎక్కువగా అమలు జరిపింది, జరుపుతోంది. అంతకు ముందు వివిధ కారణాలతో అప్పులపాలైన రైతులు కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడినా, 1991లో నూతన విధానాలు అమలులోకి వచ్చిన తరువాత వ్యవసాయ రంగంలో సంక్షోభం తలెత్తి రోజూ ఏదో ఒక మూలన రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !
  • నోబెల్‌ శాంతి బహుమతి అంటూ ప్రపంచంలో నరేంద్రమోడీ పరువు తీసిన భజన మీడియా !
  • ఆంధ్రప్రదేశ్‌ 2023-24 బడ్జెట్‌ : ఐదేండ్లలో అప్పులు రెట్టింపు , ఆస్తుల కల్పన నాసికట్టు, జగన్‌ ముందస్తు ఎన్నికలకు పోతారా ?
  • ఇరాన్‌ – సౌదీ ఒప్పందం : మధ్య ప్రాచ్యంలో అమెరికా కుట్రలకు చైనా చెక్‌ !
  • ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 235 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: