• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: April 2016

Andhra Pradesh first state in the country to become Open Defecation Free in urban areas

30 Saturday Apr 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, Open Defecation, urban areas

UD Secretary reviews progress of Swachh Bharat Mission with all 110 Municipal Commissioners

Andhra Pradesh is set to become the first State in the country to make all of its urban areas ‘Open Defecation Free’ by October 2nd this year, marking the two years of the launch of Swachh Bharat Mission by Prime Minister Shri Narendra Modi.

The State officials gave this assurance during a review of progress of Swachh Bharat Mission in all the 110 municipalities of Andhra Pradesh by Shri Rajiv Gauba, Secretary(Urban Development) at Visakhapatnam today. Shri Gauba went to the port city for review of progress of urban missions like Smart city Mission, Atal Mission for Rejuvenation and Urban Transformation (AMRUT) and Swachh Bharat Mission. He held extensive discussions with the Collectors of all the 13 districts and Municipal Commissioners of all the 110 urban local bodies in Andhra Pradesh on their action plans for ensuring sanitation.

During the review, it emerged that Andhra Pradesh which has been in the forefront of construction of toilets in urban areas can make all 100 municipalities Open Defecation Free by October 2 this year as per the action plans in progress.

As against the Mission target of construction of 1,94,336 individual household toilets in urban areas of Andhra Pradesh, work has started in respect of 1,53,779 and construction of 1,04,732 toilets has already been completed.

In addition to the central assistance of Rs.4,000 per toilet, Andhra Pradesh Government is extending assistance of an additional Rs.11,000 per toilet giving a big boost for the programme.

Regarding Community and Public Toilet seats, as against the mission target of 4,614 seats, work has started on 3,887 seats and 1,952 seats have already been constructed.

In respect of Solid Waste Management, out of the total wards of 3,458 in 110 municipalities, 100% door-to-door collection and transportation of such waste is being done in 3,072 wards i.e 89% of total urban wards in the state.

The State Governments has also awarded works for construction of 10 Waste to Energy Plants for generating 63 MW of power from the 6,440 tonnes of municipal waste being generated per day in the state. Shri Gauba was informed that these plants would be commissioned during 2017-18.

Shri Gauba complimented the State Government and all concerned officials for good progress under Swachh Bharat Mission in urban areas and for becoming the first state to make all urban areas open defecation free much ahead of the target this year.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఇండోనేషియాలో కమ్యూనిస్టుల వూచకోతపై విచారణకు ఆదేశం

30 Saturday Apr 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

1965 Symposium, Indonesian Communist Party (PKI)., Jokowi, PKI, victims of 1965

సత్య

    యాభై సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో దాదాపు ఐదులక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోసి, లక్షలాది మందిని చిత్రహింసలు, జైలు పాలు చేసిన దుర్మార్గంపై దర్యాప్తు జరిపి వాస్తవాలను వెల్లడించటంతో పాటు దోషులను శిక్షించాలన్న డిమాండ్‌ రోజు రోజుకూ పెరుగుతోంది. దానికి అనుగుణ్యంగానే ఈ వారంలో దేశాధ్యక్షుడు జోకోవి దర్యాప్తునకు ఆదేశించాల్సి వచ్చిందని భావిస్తున్నారు. మిలిటరీతో పాటు నాడు హత్యాకాండలో మిలిటరీకి సహకరించి నేడు పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నవారు దర్యాప్తును సాధ్యమైన మేరకు అడ్డుకోవాలని, వీలుకానపుడు దానినొక ప్రహసంగా మార్చాలని మరోవైపు నుంచి వత్తిడి తెస్తున్నారు. కమ్యూనిస్టులను హత్య చేసి సామూహికంగా పూడ్చిపెట్టిన ప్రాంతాల గురించి వివరాలు సేకరించాలని అధ్యక్షుడు తమను ఆదేశించినట్లు సీనియర్‌ మంత్రులు జోకో విడోడో, లుహుత్‌ పాండజైటన్‌ ప్రకటించారు. సమాచారం గురించి ప్రభుత్వం తమను, ఇతరులను కూడా సంప్రదిస్తున్నదని ఇండోనేసియన్‌ పరిశోధనా సంస్ధ అధిపతి హరీస్‌ అజహర్‌ వెల్లడించారు.

    మాజీ జనరల్‌ అయిన మంత్రి లుహుట్‌ దర్యాప్తు గురించి మాట్లాడుతూ ఇంతకాలంగా లక్షల మంది మరణించారని చెబుతున్నాం, అయితే అందుకు సంబంధించిన ఒక్క సామూహిక ఖనన ప్రాంతాన్ని కూడా కనుగొనలేదన్నారు. అలాంటివి ఏమైనా వుంటే కనుగొనమని అధ్యక్షుడు నాకు చెప్పారు అన్నారు.స్పష్ట మైన ఆధారాలున్నాయని మానవ హక్కుల బృందాలు చెబుతున్నాయి.

    దుష్టులైన కొంత మంది మిలిటరీ జనరల్స్‌తో కలసి కమ్యూనిస్టులు కొందరు జనరల్స్‌ను హత్య చేసి తిరుగుబాటు చేశారని, దాన్ని అణచివేసే క్రమంలో కొంతమంది మరణించి వుండవచ్చని ఇప్పటి వరకూ మిలిటరీ చెబుతోంది. దాని గురించి మాట్లాడిన వారిని వేధింపులకు గురి చేసింది. అసలు చర్చకే అవకాశం ఇవ్వలేదు. అమెరికా పన్నిన పెద్ద కుట్రలో భాగంగా సైనిక జనరల్స్‌ను కొంత మందిని పధకం ప్రకారం హత్యగావించి ఆ నెపాన్ని కమ్యూనిస్టులపై మోపి వూచకోతకు పాల్పడ్డారన్నది వాస్తవం. చైనీస్‌ ఇండోనేషియన్స్‌ను, కమ్యూనిస్టులు కాని వారిని కూడా అనుమానంతో మిలిటరీ, దానికి సహకరించిన మతోన్మాదశక్తులు హత్యకావించాయి. ఎన్నో లక్షల మందిని అనుమానంతో చిత్రహింసలు పెట్టారు. జైలు పాలు గావించారు. వారికి వుద్యోగాలు రాకుండా అడ్డుకున్నారు. విదేశాలలో తలదాచుకున్నవారిలో వేలమంది ఇప్పటికీ స్వదేశానికి రాలేదు.

   ఇంతవరకు అసలు ఈ దుర్మార్గం గురించి మాట్లాడటానికి, చర్చించటానికి అనుమతించని ఇండోనేషియా ప్రభుత్వం ఏకంగా తానే గతవారంలో ఒక సెమినార్‌ను ఏర్పాటు చేసింది. వాస్తవాల వెల్లడికి ప్రభుత్వం పూనుకుంటుందన్న ఆశాభావం కొందరు వెల్లడిస్తే, ఈ సమస్య గురించి భవిష్యత్‌లో ఎవరూ మాట్లాడకుండా దీనికి ముగింపు పలికేందుకే ఈ తతంగం నడిపిందని భావించేవారు కూడా వున్నారు.ఈ వూచకోతపై నేర విచారణ జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఇచ్చిన నివేదికను ప్రస్తుతం ప్రభుత్వం తిరస్కరించి పక్కన బెట్టటమే దీనికి మూలం. సమాచారం సేకరించి ప్రభుత్వం ఏమి చేయనుందని అనేక హక్కుల బృందాలు సందేహిస్తున్నాయి. అన్నింటికీ మించి ఎవరైనా సాక్ష్యాలు చెప్పటానికి ముందుకు వస్తే వారికి రక్షణ, వేధించకుండా హామీ ఏమిటన్నది కీలకమైన సమస్య.

   ప్రపంచానికంతటికీ మానవ హక్కుల గురించి సుద్దులు చెప్పే అమెరికా ఇండోనేషియా కమ్యూనిస్టుల వూచకోత గురించి తన వద్ద వున్న వివరాలను వెల్లడించేందుకు నిరాకరిస్తోంది. ఇండోనేషియా స్వాతంత్య్ర వుద్యమనేత, జాతిపితగా పరిగణించబడే సుకర్ణో కమ్యూనిస్టుల పట్ల సానుకూల వైఖరితో వుండేవారు.ఈ పూర్వరంగంలో 30లక్షల మంది సభ్యులను కలిగి వున్న కమ్యూనిస్టు పార్టీ ఆయనకు బాసటగా వుండేది. ఈ పూర్వరంగంలోనే 1963లో సిఐఏ సలహాదారు అమెరికాను హెచ్చరించాడు.’ కమ్యూనిస్టుపార్టీని ఇలాగే కొనసాగనిస్తే ఆగ్నేయాసియాలో చట్టబద్దంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఇండోనేషియాలో ఏర్పడే అవకాశం వుందని’ పేర్కొన్నాడు. అది జరిగిన రెండు సంవత్సరాల తరువాతే మిలిటరీ నాయకత్వంలో వూచ జరిగింది. అనేక దేశాలకు సంబంధించి తన వద్ద వున్న సమాచారాన్ని 30 సంవత్సరాల తరువాత బహిరంగ పరచటాన్ని ఒక విధానంగా అమెరికా పాటిస్తోంది.అయితే ఇండోనేషియా విషయంలో మాత్రం ఆ పని చేసేందుకు నిరాకరించటం గమనించాల్సిన అంశం. ఈ దారుణంలో అమెరికా అధికారుల ప్రమేయం వుందని వెల్లడైన కొన్ని ప్రాధమిక పత్రాలు వెల్లడించటమే దీనికి కారణం.

     సహజ సంపదలు, రబ్బరు తోటలకు ప్రసిద్ధి చెందిన కారణంగా 1940 దశకం నుంచీ అమెరికన్లు ఇండోనేషియాపై కన్ను వేశారు. 1958లో సుకర్ణో ప్రభుత్వంపై జరిగిన విఫల కుట్రకు అమెరికా ఆర్ధిక సాయం చేసింది. దాంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికా ఆర్ధిక ఆంక్షలకు పాల్పడింది. 1965 కుట్రకు ముందు అమెరికా విదేశాంగశాఖ అధికారులు పార్లమెంటరీ కమిటీ ముందు మాట్లాడుతూ సుకర్నో రంగం నుంచి తప్పుకుంటే మిలిటరీ ఆ స్ధానాన్ని భర్తీ చేస్తుందని అందువలన అమెరికా తన తలపులను తెరిచి వుంచాలని చెప్పారు. ముందస్తుగా వేసుకున్న పధకంలో భాగంగా అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా గూఢచార సంస్థలు కట్టుకధలను ప్రచారంలో పెట్టాయి. మిలిటరీ జనరల్స్‌ను హత్య చేసేందుకు, చైనా నుంచి ఆయుధాలను సేకరించేందుకు, ముస్లిం మత నేతలను హతమార్చేందుకు కమ్యూనిస్టు పార్టీ పధకం వేసిందన్న కధనాలను ప్రచారంలో పెట్టాయి.

    వూచకోత తరువాత తనకేమీ సంబంధం లేనట్లు అమెరికా మౌనం పాటించింది.కొద్ది నెలల తరువాత న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో జేమ్స్‌ రెస్టన్‌ అనే వ్యాఖ్యాత ‘ ఇండోనేషియాలో తిరుగుబాటు వెనుక తాను వున్నట్లు చెప్పుకోకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించింది. అయితే దీనర్ధం వాషింగ్టన్‌కు దీనితో ఏ సంబంధమూ లేదని కాదు’ అని పేర్కొన్నారు. వూచకోతకు ముందుగా చేసిన ప్రచారంలో పేర్కొన్న అంశాలనే మిలిటరీ జనరల్‌ సుహార్తో కూడా ప్రచారంలో పెట్టి కమ్యూనిస్టులపైకి ముస్లింలను వుసిగొల్పాడు. ఇదే విషయాన్ని ఆనాడు ఇండోనేషియాలో అమెరికా రాయబారిగా వున్న మార్షల్‌ గ్రీన్‌ తన వర్తమానాలలో తెలియ చేశాడు. తిరుగుబాటుదార్లకు ఎక్కడ అవసరమైతే అక్కడ సాయం చేయాలని కూడా పేర్కొన్నాడు.ఈ తిరుగుబాటులో కమ్యూనిస్టులు, చైనాకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ప్రచార విభాగాలను రంగంలోకి దించాలని కూడా సూచించాడు. వియత్నాంలో గ్రామ పెద్దలను మట్టుపెట్టి కమ్యూనిస్టులపై నెపం మోపిన పద్దతులలో ఇండోనేషియాలో జనరల్స్‌, మత పెద్దల విషయంలోనూ కమ్యూనిస్టులపై ప్రచారం చేయాలని సూచించాడు. తమతో సంబంధాలలో వున్న మిలిటరీ, ఇస్లామిక్‌ నేతలతో రాయబార కార్యాలయం వ్యూహం గురించి చర్చలు జరిపిందని, ముస్లిం దళాల సాయంతో మిలిటరీ పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టులను అరెస్టు చేసి హతమార్చిందని పేర్కొన్నాడు.

      1965 డిసెంబరులో టైమ్‌ పత్రిక వూచకోత గురించి తన వార్తలో ఇలా పేర్కొన్నది.’ వేలాది మంది కమ్యూనిస్టులు, ఎరుపు సానుభూతి పరులు, వారి కుటుంబాలను వూచకోశారు. మారు మూల జైళ్లలో వేలాది కమ్యూనిస్టు కుటుంబాలను ప్రశ్నించి బాక్‌లాండ్స్‌ సైనిక యూనిట్లు వురి తీసినట్లు తెలుస్తోంది. రాత్రి పూట కమ్యూనిస్టుల ఇండ్లకు ముస్లిం పట్టీలను గుర్తులుగా వేలాడదీసిి ‘పరాంగ్స్‌’ అని పిలిచే పదునైన త్తులతో మొత్తం కుటుంబాలన్నింటినీ పొడిచి చంపి శవాలను లోతైన గోతులలో పూడ్చి పెట్టారు. తూర్పు జావా ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలలో హత్యాకాండ బహిరంగంగా సాగింది. కమ్యూనిస్టులుగా భావించిన వారిని పట్టుకొని వారి నుదుళ్లకు పట్టీలు పెట్టి వారిని పొడవైన స్ధంభాలకు కట్టి గ్రామాలలో వూరేగించి తరువాత చంపివేశారు. తూర్పు జావా, సుమత్రా వుత్తర ప్రాంతంలో ఎంత భారీగా హత్యలు జరిగాయంటే పూడ్చిన శవాలు కుళ్లిపోయి, దుర్వాసనలతో తీవ్రమైన పారిశుధ్య సమస్యలు తలెత్తాయి.ఆ ప్రాంత నదులు, వాగులు వంకలన్నీ శవాలతో నిండిపోయాయి. అనేక చోట్ల నదులలో ప్రయాణానికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని ప్రయాణీకులు తెలిపారు.’

    1966 ఫిబ్రవరి నాటికి కనీసంగా నాలుగు లక్షలమందిని హతమార్చినట్లు అమెరికా రాయబార కార్యాలయం అంచనా వేసింది. అంటే హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబు వేసినపుడు మరణించిన వారి కంటే ఎక్కువ.’ఇక్కడి (అమెరికా ) నుంచి రహస్యంగా పరోక్ష సాయం లేకుండా ఇది జరిగి వుండేది కాదు’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో జేమ్స్‌ రెస్టన్‌ వ్యాఖ్యానించారు. 1960 దశకంలో ఇండోనేషియాతో అమెరికా సంబంధాల గురించి చరిత్రకారుడు బ్రాడ్లే సింప్సన్‌ 2008లో వెల్లడించిన తన అధ్యయనంలో సిఐఏ రికార్డులలో బయటకు వచ్చినవి చాలా తక్కువని, అంతకంటే చాలా ఎక్కువగా సిఐఏ రహస్య కార్యకలాపాలు వున్నట్లు వీటిని బట్టి చెప్పవచ్చని పేర్కొన్నాడు. ఇరవయ్యవ శతాబ్దంలో అత్యంత దుర్మార్గమైన రాక్షస కాండలలో ఒకటిగా పరిగణించబడే ఇండోనేషియా వుదంతాలలో అమెరికా ప్రత్యక్ష, ప్రరోక్ష ప్రమేయం ఎంత వుందో వెల్లడి కావాలంటే వారి దగ్గర వున్న పత్రాలన్నింటినీ బయట పెడితే తప్ప మరొక మార్గం లేదు. అమెరికాపై ఇండోనేషియా సర్కార్‌ ఆమేరకు వత్తిడి తెస్తుందా, తన పాత్రను బయటకు రాకుండా చేసేందుకు వాటిని అమెరికా భూస్తాపితం చేస్తుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మహిళల దర్గా ప్రవేశానికి జావేద్‌ అక్తర్‌ మద్దతు

30 Saturday Apr 2016

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

AIMIM, Javed akhtar, Trupti Desai, women entry Dargh's

సత్య

   తృప్తి దేశాయ్‌ ! భూమాత రాన్‌ రాగిణి బ్రిగేడ్‌ నాయకురాలు !! శని శింగనాపూర్‌ శని దేవాలయ ప్రవేశం కోసం వుద్యమించి విజయం సాధించిన యోధురాలు. తరువాత కొల్లా పూర్‌ మహలక్ష్మి, నాసిక్‌ త్రయంబకేశ్వర దేవాలయాలలో జయప్రదంగా ప్రవేశించి పూజలు నిర్వహించారు. ప్రార్ధనా మందిరాలలో మహిళల ప్రవేశంపై నిషేధాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తృప్తి దేశాయ్‌కు సుప్రసిద్ధ సినీ గీత రచయిత జావేద్‌ అక్తర్‌ మద్దతు ప్రకటించారు. దేవాలయాలు, దర్గాలు అన్న విచక్షణ లేకుండా చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా సభ్యులుగా చేరేందుకు మహిళలకు అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు సంస్ధ అధిపతి మోహన్‌ భగవత్‌కు లేఖ రాయాలని అక్తర్‌ సూచించారు. అంతకు నాలుగు రోజుల ముందు తృప్తి దేశాయ్‌ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌లో కూడా మహిళలను అనుమతించాలని కోరుతూ తాను సంస్ధ అధిపతికి లేఖ రాస్తానని ప్రకటించారు. ఏ ప్రిల్‌ 28వ తేదీన ముంబైలోని పురాతన హాజీ అలీ దర్గాలో ప్రవేశించేందుకు తృప్తి నాయకత్వంలోని మహిళల బృందం ప్రయత్నించింది. మహిళలకు ప్రవేశం లేదనే పేరుతో దర్గా పాలకవర్గం ఆమెను అనుమతించలేదు. దేశాయ్‌తో పాటు అనేక సంస్ధలకు చెందిన మహిళలు ప్రార్దనలు చేసేందుకు సాయంత్రం ఐదు గంటలకు వెళ్లారు. పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు వారిని అడ్డుకొని కారునుంచి దిగకుండా చుట్టుముట్టారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటమే గాక కారు దిగవద్దంటూ సలహా ఇచ్చారు. రాత్రి ఏడున్నరకు దర్గాను మూసివేశారు. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే నంటూ తాము శాంతియుతంగా వివక్ష పాటించే అన్ని ప్రార్ధనా మందిరాలు, ప్రాంతాలలో ప్రవేశానికి ఆందోళన చేస్తామని ప్రకటించి వెనుదిరిగారు. ఇది తొలి రోజు మాత్రమే. మాకేమీ తొందర లేదు, 2012 నుంచి దర్గా అంశం కోర్టులో వుంది అన్నారు.తమ ఆందోళనకు మద్దతు ప్రకటించాలని సినీ హీరోలు షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌లకు తృప్తి దేశాయ్‌ విజ్ఞప్తి చేశారు. వారు తమ వైఖరి ఏమిటో ప్రకటిస్తే వారి అభిమానులందరూ తమతో కలసి వస్తారని అన్నారు.

  దాంతో తాము ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని ప్రకటించి ముఖ్యమంత్రిని కలుసుకొనేందుకు ఆయన నివాసం వద్దకు వెళ్లింది. ముందస్తు అనుమతి లేదనే పేరుతో నివాసంలోకి పోలీసులూ రానివ్వలేదు. ముఖ్యమంత్రి నివాసం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవటంపై తృప్తి దేశాయ్‌ నిరసన వ్యక్తం చేశారు. దర్గాదగ్గర నాపై దాడి చేసేందుకు కొందరు ప్రయత్నించారు. దాని గురించి ముఖ్యమంత్రికి విన్నవించుకుందామని వెళుతుంటే ముందస్తు అనుమతి లేదని అడ్డగించుతున్నారు, ఇదేమి ప్రజాస్వామ్యం, బిజెపి చెప్పే మహిళలకు మంచి రోజులంటే ఇవేనా ‘ అని ఆమె మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు.

    దర్గాలో ప్రవేశించేందుకు వచ్చిన వారిని అవసరమైతే బలప్రయోగంతో అడ్డుకుంటామని దర్గా దగ్గర తన బృందంతో వున్న సమాజవాది పార్టీ నాయకురాలు రుక్సానా సిద్దికీ చెప్పారు.తృప్తిపై సిరాతో దాడి చేస్తామని మజ్లిస్‌ పార్టీ నేత హాజీ రఫత్‌ హుస్సేన్‌ హెచ్చరించారు. దీనికి కొద్ది రోజుల ముందు శివసేన నేత అరాఫత్‌ షేక్‌ మాట్లాడుతూ ఆమె గనుక దర్గాలోకి ప్రవేశిస్తే చెప్పులతో కొడతామని బెదిరించారు. అయితే అరాఫత్‌ ప్రకటనతో తమ పార్టీకి సంబంధం లేదని తరువాత శివసేన చెప్పుకుంది.

    అసలు ఈ సమస్యను అనవసర పెద్ద వివాదంగా చేశారని దర్గా పాలక మండలి సభ్యుడు రిజ్వాన్‌ మర్చంట్‌ అంటున్నారు. దర్గాను సందర్శించకుండా సోదరీ మణులను నిషేధించలేదు, ఆపలేదు. వారికి ప్రత్యేక మార్గాలు, హుండీలు వున్నాయి. వారి కోసం ప్రత్యేకంగా స్థలం కూడా కేటాయించాము. ఒక పురుష ముస్లిం ఫకీరు సమాధి దగ్గరకు మహిళలను అనుమతించటం, దానిని తాకటం ఇస్లాం ప్రకారం తీవ్రమైన పాపం, అందుకే వారిని దాని దగ్గరకు అనుమతించటం లేదు.’ అన్నారు.

    దర్గాలో ప్రవేశం నిషేధంపై విచారణ జరుపుతున్న బొంబై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. శబరి మల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశ నిషేధంపై ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్నది. బహుశా ఈ తీర్పు వచ్చిన తరువాత దర్గా కేసుపై కూడా తీర్పు వస్తుందని భావిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అబ్బ మైసూరా రెడ్డి బలే చెప్పిండు కదా !

28 Thursday Apr 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, Others

≈ Leave a comment

Tags

CHANDRABABU, Mysoora Reddy, YS jagan, ysrcp

ఎం కోటేశ్వరరావు

     తెలుగు రాష్ట్రాలలో ఫిరాయింపు రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సినిమాలకు పంచ్‌ డైలాగులు అందించే విధంగా పాలక రాజకీయ పార్టీల నేతలు తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ మారుతున్నా అని గతంలో చెప్పేవారు. కార్యకర్తలు తప్ప ఓటర్ల తీర్పును పట్టించుకోరా అన్న విమర్శలు రావటంతో నియోజక వర్గ అభివృద్ది కోసమంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇంకా గట్టిగా గతంలో తిట్టిన పార్టీలోనే ఇప్పుడు ఎందుకు చేరుతున్నావంటే అప్పుడు మా నాయకుడు ప్రత్యర్ధులను తిట్టమన్నారు గనుక తిట్టాను తప్ప నిజానికి నా కలాంటి అభిప్రాయం లేదని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ఇప్పుడు సీనియర్‌ నేత కనుక మైసూరా రెడ్డి మరో పెద్ద ముందడుగు వేశారు.

   తనకు ఈ వయస్సులో పార్టీలు మారి చెడ్డ పేరు తెచ్చుకోకూదని వుందని, రచనా వ్యాసంగం పెట్టుకోవాలని అనుకుంటున్నానని చెబుతున్నా మధ్యవర్తులు వైఎస్‌ జగన్‌ ఇంటికి వుదయం ఫలహారానికి తీసుకు వెళ్లారట. వెళ్లీ వెళ్లగానే తన ప్రమేయం లేకుండానే ఘటనలు జరిగాయట. వెళుతుండగానే టీవీలలో వార్తలు రావటం, వెళ్లగానే కండువా కప్పటం, ఆ వెంటనే తెలుగు దేశం పార్టీ నుంచి సస్పెండ్‌ చేయటం అన్నీ జరిగిపోయాయట. తుదకు మానవతా దృక్పధంతో సర్దుకొని వైఎస్‌ఆర్‌సిపి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశారట. ఇంత కాలం తరువాత తెలిసో తెలియకో వేసిన తప్పటడుగు వెనుకకు తీసుకుంటే గౌరవ ప్రదంగా వుంటుందని అనుకున్నారట. అందుకే రాజీనామా చేశారట. ఈ వార్తలను చూసిన తరువాత మైసూరా రెడ్డిలో అవసరాలకు అనుగుణంగా సర్దుకు పోయే పక్కా అధికార రాజకీయ నాయకుడే గాక మంచి సినిమా కథకుడు కూడా దాగి వున్నట్లు వెల్లడైంది.

   బట్ట తొలిగితే సరి చేసుకో అని ఎవరైనా చెబుతారు, అసలు బట్టలు లేకుండా తిరిగే వారికి చెప్పేందుకు ఎవరు ముందుకు వస్తారు. మహాకవి శ్రీశ్రీ బతికి వున్నా, మరో రూపంలో జన్మించినా

పదండి ముందుకు పదండి తోసుకు

కనపడలేదా అధికార గద్దెలు, వినపడలేదా రా రమ్మని బాబు పిలుపులు

సిగ్గు ఎగ్గులు, నీతి నియమాలూ, ఫిరాయింపు నిరోధ చట్టాలు,

వయస్సులు, వంకాయలా మనకడ్డంకి పదండి ముందుకు పదండి తోసుకు

పోదాం పోదాం అధికార పార్టీలోకి

   అంటూ మహాప్రస్తానాన్ని తిరిగి రాసి వుండేవారు. ఒకసారి పార్టీ మారిన తరువాత మరోసారి ఫిరాయించటానికి కూడా తటపటాయింపులు వుంటాయని మైసూరా చెప్పటం వింతలలో వింత. పదవి వస్తుందా రాదా, పది కోట్లు సంపాదించుకుంటామా లేదా అన్నది తేలలేదు అంటే మెరుగ్గా వుండేది.

    కాంగ్రెస్‌తో రాజకీయ జీవితం ప్రారంభించిన మైసూరా అక్కడ పూర్తిగా అధికారాన్ని, ఫ్యాక్షన్‌ రాజకీయాలను అనుభవించారు. తాను తీవ్రంగా వ్యతిరేకించే రాజశేఖరెడ్డి తిరుగులేని నేతగా ఎదగటంతో కాంగ్రెస్‌ నుంచి బయట పడి తెలుగు దేశంలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. తరువాత వైఎస్‌ జగన్‌కు పరిస్థితులు అనుకూలంగా వున్నట్లు కనిపించటంతో వైఎస్‌ఆర్‌సిపిలో చేరారని ఇప్పటి వరకూ అందరూ అనుకుంటున్నారు. భవిష్యత్‌లో పార్టీ మారే వారికి మరొక మహత్తర అస్త్రాన్ని అందిస్తున్నాననే విషయం బహుశా ఆయనకు తెలియకుండానే జరిగి వుంటుంది.అదే మంటే తాను అయోమయంలో వున్న స్థితిలో టిఫిన్‌కు తీసుకు వెళ్లి కండువా కప్పారన్న భయంకర పచ్చి నిజాన్ని వెల్లడించారు. రాబోయే రోజుల్లో పార్టీ ఫిరాయించిన వారిని ఎందుకు మారారు అంటే ఆ బలహీన క్షణంలో ఏం జరిగిందో తెలియలేదు, లేచి చూస్తే పరాయి పార్టీ కండువా కప్పి వుండటం కనిపించింది. పార్టీ గౌరవాన్ని కాపాడేందుకు ఇష్టం లేకపోయినా దానిలోనే వుండాల్సి వచ్చింది. ఆ పార్టీ యజమాని ఏదో మానవత్వం లేనివాడే అనుకున్నా మానవతా వైఖరితో అక్కడే కొనసాగా గానీ ఇంత మానవత్వం లేని వాడని తెలిసిన తరువాత అక్కడ వుండటం మానవత్వానికే మచ్చ అని బయటకు వచ్చా అని అమాయకంగా చెప్పవచ్చు, సానుభూతి పొందవచ్చు. ఇప్పటికే ఫిరాయింపుల పర్వంలో వున్న వారూ, రాబోయే తరాలకూ ఇది ఒక హెచ్చరిక వంటిది కూడా. ఎప్పుడూ అయోమయంలో, లేదా తెలియని మైకంలో వుండ కూడదని, వుంటే ఎవరైనా తీసుకుపోయి కండువాలు కప్పేస్తారని గ్రహించాలి. లేదా తెలిసినా తెలియనట్లు నటించాలి.

    రచనలు చేయాలనుకున్నారు మైసూరా ఆందోళన చెందనక్కర లేదు. అయితే రాయలసీమ ఫ్యాక్షన్‌ గురించి ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. ఇదే సమయంలో తెలుగు సినిమాలకు అసలే కధల కొరత వుంది. తమ కోసం పైరవీలు చేస్తే తప్ప వ్యాసాలు రాస్తే తెలుగు పత్రికలు డబ్బులు ఇవ్వవని మైసూరా రెడ్డికి చెప్పనవసరం లేదు. టీవీ ఛానల్స్‌ రేటింగ్‌లు పెంచే సంచలనాలు బయట పెట్టేందుకు ఆయన దగ్గర అలనాటి జ్ఞాపకాలు వున్నా ఆ వ్యక్తులు లేరు కనుక ఇప్పుడు చెప్పినా ప్రయోజనం వుండదు. పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోయింది కనుక అదీ వృధా ప్రయాసే.ఏ మాటకామాటే చెప్పుకోవాలి. మైసూరా రెడ్డి వంటి నేతల రాజకీయ జీవితాలన్నీ తెరిచిన పుస్తకాలే. రాబోయే తరాలు కొత్తగా తెలుసుకోవాల్సింది, అనుసరించాల్సిన ఆదర్శాలేమి వున్నాయి గనుక. దాని బదులు దర్శక, నిర్మాతలకు తన సరికొత్త పిట్ట కథలను వినిపిస్తే డబ్బుకు డబ్బు పేరుకు పేరు వస్తుందేమో ఆలోచిస్తే మంచిది.

     చంద్రబాబు నాయుడు తనకు తరువాత తన కుమారుడికీ, మనవడికీ రాజకీయంగా ప్రతిపక్షం లేకుండా చేయాలనే విజన్‌ 2030,2050తో పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకు గాను ఎవరు వస్తే వారికి పచ్చ కండువాలు కప్పుతున్నారు. గతంలో పార్టీలు మారిన వారు తన దగ్గరకు రావటమే తడవుగా అభివృద్ధి ముద్రవేస్తున్నారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసిన పచ్చి నిజం ఇలాంటి వారి గురించి చంద్రబాబుకు తెలియక కాదు.ముందు మైండ్‌ గేమ్‌తో ఎదుటి వారిని దెబ్బతీయాలి. అందుకు ఎవరినైనా ఆకర్షించు, అందుబాటులోకి వస్తే వాడుకో, అవసరం తీరగానే వదిలెయ్‌. చంద్రబాబు నాయుడు విద్యార్ధిగా రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఈ సిద్ధాంతాన్నే నమ్ముకున్నారని, తు.చ తప్పకుండా ఆచరిస్తున్నారని చెబుతారు. ఇలాంటి వారి లక్షణం ఏమంటే ఎవరినీ ఒక పట్టాన నమ్మరు. విస్వసనీయత సమస్యను ఎదుర్కొంటారు. ఒక మంచి వ్యక్తి పార్టీ నుంచి బయటకు పోయే పరిస్థితి వస్తే సమర్ధించుకోవటం కష్టం. అదే నాలుగు పార్టీలు మారిన అవలక్షణం వున్న వారు పోతే వారికి తాను ఎంత చేసినా పార్టీ మారారని తేలికగా ఒకమాటతో తుడిచి వేసుకోవచ్చు.

     ఇక వైఎస్‌ఆర్‌సిపి విషయానికి వస్తే ఆ దుకాణంలో ఎందరుంటారో లేదో తెలియదు. ఫిరాయించిన వారెవరి సభ్యత్వమూ పోకుండా స్పీకర్లు కాపాడగలరని రెండు తెలుగు రాష్ట్రాలే గాక దేశమంతటా రుజువైంది.అధికార రాజకీయాలలో ఎవరూ అంటరాని వారు, శాశ్వత శత్రువులు వుండరు, బొబ్బిలి , విజయనగరం రాజాలే ఒక ఒరలో ఇమిడిపోయినపుడు మిగతావారి పౌరుషాలు ఏపాటి? అందువలన రాబోయే రోజుల్లో ఎవరైనా పార్టీలో మిగిలితేనే ఆశ్చర్యం. తెలుసు కోవాల్సిన నీతి ఏమంటే ఎలుకలు అన్న తరువాత కలుగుల్లోకి పోకుండా వుంటాయా అధికార పార్టీలన్న తరువాత జనం పార్టీలు మారకుండా వుంటారా అనే వైరాగ్యం అలవరచుకుంటే మంచిది. అంతకు మించి ఎవరూ ఏమీ చేయలేరు. కొందరు మట్టివాసన పసిగట్టి వర్షం వస్తుందని గ్రహిస్తారు. అలాగే ఎన్నికల సమయం వచ్చినపుడు అధికారం వచ్చేట్లు వుంటే పసిగట్టిన వారు తిరిగి వస్తారు, నిజంగానే అధికారం వస్తే నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని మిగిలిన వారూ కాళ్ల ముందు వాలతారు. ఎలాగూ ప్రజా సమస్యల మీద చేసే పనేమీ లేదు. చేయాలనే దృష్టీ లేదు కనుక 2019 వరకు కోర్టు కేసులను చూసుకుంటూ, గతంలో వెనకేసుకున్నదానిని కాపాడుకుంటూ వచ్చే ఎన్నికలలో పెట్టుబడులు లాభాల గురించి ఇప్పటి నుంచే కసరత్తు చేయమని కొత్త ఆడిటర్లను నియమించుకుంటే మంచిది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీకి నోటి తుత్తర సుబ్రమణ్యస్వామి వరమా ! శాపమా !

28 Thursday Apr 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Loose cannons, Modi, Narendra Modi, Subramanya swamy, Swamy

ఎం కోటేశ్వరరావు

    రాజ్యసభకు నామినేటెడ్‌ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ప్రధాని నరేంద్రమోడీకి వుపయోగపడతారా? సమస్యలను కొని తెస్తారా అన్న చర్చ జరుగుతోంది. పూవు పుట్టగానే పరిమళిస్తుంది ! తలిదండ్రులు తమకు బిడ్డలు పుట్టినపుడు కంటే వారు ప్రయోజకులైనపుడు ఎక్కువ సంతోషిస్తారు !! పది సంవత్సరాల తరువాత పార్లమెంట్‌లో అడుగు పెట్టి నోరు విప్పిన 15 సెకన్లలోనే రాజ్యసభ వాయిదా పడిందంటే ఆయన నోరు ఎంతటి ప్రతిభావంతమైనదో వేరే చెప్పనవసరం లేదు. అఫ్‌కోర్సు ఆయన మాటలను రికార్డులనుంచి తొలగించారనుకోండి. సభా కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నందున జనానికి ఆ సమాచారం చేరిపోతుంది, మాట్లాడిన వారి ప్రయోజనం నెరవేరుతుంది. ఆ తరువాత అధికారిక రికార్డులలో వుంటేనేం లేకుంటేనేం ! సభ వాయిదా పడటం, కార్యకలాపాలు కుంటుపడటం, సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా చూడటం అదేగా పాలకపార్టీ వ్యూహం. నరేంద్రమోడీ నాయకత్వం అదే కోరుకొంటోందా ?

     సుబ్రమణ్య స్వామి రాజకీయంగా జనసంఘంలో పుట్టి దీపంలా వెలిగి, తరువాత జనతా పార్టీలో నాగలి పట్టిన రైతు అవతారమెత్తి, తరువాత దానిని బిజెపిలో విలీనం చేసి కమలం పువ్వుతో పరిమళిస్తున్నారు. తాజాగా నామినేటెడ్‌ కోటాలో రాజ్యసభలో అడుగు పెట్టి తనకు రాజకీయ జన్మనిచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆనందం కలిగిస్తున్నారు. అచ్చ తెలుగులో నోటి తుత్తర గాడిగా పిలిపించుకొంటూ నిత్యం ముస్లింలపై విరుచుకుపడే ఈ తమిళ బ్రాహ్మణుడు కుటుంబ విషయాలలో అందుకు భిన్నమైన వ్యక్తి అన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

     సంఘపరివార్‌ సంస్థలలో శిక్షణ పొందిన వారి పరిభాషలో చెప్పాలంటే స్వయంగా ‘లవ్‌ జీహాదీ’. పార్సీ మతస్థులను ‘సంతృప్తి పరచటానికి’ ఆ మతానికి చెందిన రుక్సానాను చదువుకునే సమయంలో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ముస్లింలను ‘సంతృప్తి పరచటానికి’ తన ఒక కుమార్తెను ఒక ముస్లింకు ఇచ్చి వివాహం చేశాడు.’హిందువులను సంతృప్తి పరచటానికి ‘ మరో కుమార్తెను విశాఖ పట్టణానికి చెందిన ప్రముఖ రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి ఇఏఎస్‌ శర్మ కుమారుడు, ప్రొఫెసర్‌ అయిన సంజయ శర్మతో వివాహం చేశారు . అయినా సరే నిత్యం తోటి లవ్‌ జీహాదీలతో కలసి ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే ఈ పెద్దమనిషిని హిందూ తాలిబాన్‌ అంటే అతికినట్లు సరిపోతుందేమో.

     అంతకు ముందు జనసంఘం, జనతా పార్టీ ఎంపీ. కేంద్రమంత్రిగా పని చేసిన ఆయనను తాజాగా బిజెపి రాజ్యసభకు నామినేట్‌ చేసింది. బిజెపి సభ్యుడైన స్వామి సాంకేతికగా ప్రస్తుతం రాజ్యసభలో స్వతంత్రుడు. అలాంటి వారు ఏదో ఒక పార్టీని ఎంచుకోవచ్చు. ఈ స్వామి స్వభావం, పార్టీలోని నాయకులతో వున్న వైరుధ్యాలను బట్టి ఏం చేస్తారో చూడాల్సి వుంది. ఇలాంటి వారిని పిల్లిని చంకన పెట్టుకు వచ్చే వారు అనికూడా అంటారు.

    సంఘపరివార్‌ విధేయుడిగా తనను తాను రుజువు చేసుకున్న స్వామి హార్వర్డ్‌ ఆర్ధిక శాస్త్రవేత్త. ఎవరికి వుపయోగపడతారన్నది వేరే విషయం. ఆయన బదులు ఒక న్యాయవాది అయిన అరుణ్‌ జెట్లీని ఆర్ధిక మంత్రిగా తీసుకున్నపుడు స్వామిని ఎందుకు విస్మరించారని గతంలో చర్చ జరిగింది.డెబ్బయి ఆరు సంవత్సరాల సదరు స్వామి బిజెపికి నష్టం చేస్తాడా, లాభం చేకూరుస్తాడా? అసలు ఆయనను రాజ్యసభకు ఎందుకు ఎంచుకున్నారు అన్నది ఇప్పుడు చర్చ కావటం కూడా స్వామి ప్రత్యేకతల్లో ఒకటి. జెట్లీ -స్వామి వుప్పునిప్పులా , ఒక గదిలో ఎవరో ఒకరు మాత్రమే వుంటారని చెబుతారు. అలాంటిది ఇప్పుడు రాజ్యసభలో జెట్లీ నాయకత్వంలో స్వామి పనిచేయాల్సి వస్తోంది. తాను నల్లధనాన్ని వెలికి తెచ్చేందుకు ఆరు అంశాలతో కూడిన లేఖను ప్రభుత్వానికి రాశానని, ఆర్ధిక మంత్రి తీసుకున్న చర్యలను చూస్తే నల్లధనం వెనక్కు రాదని ఆరునెలల క్రితం జైట్లీపై ధ్వజమెత్తిన స్వామి, తనకు బాధ్యతలు ఇస్తే ఆరునెలల్లో ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తానని అయితే మనకు ఒక ఆర్ధిక మంత్రి ఇప్పటికే వుండి పోయారే అని వ్యంగ్యంగా అన్నారు. తన జనతా పార్టీని బిజెపిలో విలీనం చేసేందుకు జైట్లీ అడ్డు పడ్డారని, తరువాత 2014 ఎన్నికలలో న్యూఢిల్లీ నుంచి పోటీ చేసేందుకు సీటు రాకుండా చేశారని స్వామి మండిపడుతూ వుంటారు.

    ఇవన్నీ బహిరంగ రహస్యాలే. అయినా స్వామిని నామినేట్‌ చేయటానికి నరేంద్రమోడీ ఎందుకు సుముఖత చూపారన్నది ప్రశ్న. బిజెపిలో అరుణ్‌ జైట్లీ వృద్ధ నేత ఎల్‌కె అద్వానీ శిష్యుడు అన్నది బహిరంగ రహస్యం. అంటే నరేంద్రమోడీకి వ్యతిరేకం కాకపోయినా అనుకూలం కాదు.మోడీకి తగినంత ఆంగ్ల పరిజ్ఞానం లేని కారణంగా ఎవరైనా విదేశీయలు, ఇతర ప్రముఖులు వచ్చినపుడు అంతా అరుణ్‌జెట్లీ మాట్లాడతారని చెబుతారు. రెండవది తనకు వ్యతిరేకంగా పార్టీలో, ప్రభుత్వంలో మరొక అధికార కేంద్రం ఏర్పడకుండా చూసుకోవాలని నిరంతరం మోడీ చూస్తుంటారని వార్తలు. సుబ్రమణ్యస్వామి పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రత్యేక అభిమానం చూపే వారు వున్నారని మోడీకి తెలుసు. అందువలన అటు వారిని సంతృప్తి పరచటానికి, ఇటు జైట్లీను అదుపులో వుంచటానికి సుబ్రమణ్యస్వామి తగిన వ్యక్తని భావించారని విశ్లేషణ.ఇదే కోవకు చెందిన వారు ఇంకా అరుణ్‌ శౌరీ, రామ్‌జత్మలానీ, యశ్వంత సిన్హా వంటి వారు ఇంకా వున్నారు. వారందరికీ కూడా పునరావాసం కల్పిస్తారా ? వారి నోరు మూయించకపోతే బిజెపిని విమర్శించటానికి ప్రతిపక్షాలు అవసరం లేదని ఇంతకు ముందే వారు తమ సత్తా ఏమిటో వెల్లడించుకున్నారు.

    సాధారణంగా చాలా మంది రాజకీయ నాయకులు అనేక విషయాలను ఆఫ్‌ ద రికార్డు అని చెప్పి మరీ విలేకర్లకు ఎంతో వినోదంతో పాటు అనేక వాస్తవాలు చెబుతారు. సుబ్రమణ్యస్వామి సాఫ్ట్‌వేర్‌లో ఆఫ్‌ ద రికార్డు లేదు, దేన్నీ దాచుకోరు. తనకు ఆర్ధిక మంత్రి పదవి, బ్రిక్స్‌ బ్యాంకు గవర్నర్‌ పదవి, జెఎన్‌యు వైస్‌ ఛాన్సలర్‌ పదవి ఇస్తామని వాగ్దానం చేశారని స్వయంగా చెప్పారు. పేరు మోసిన కోర్టు పక్షిగా ప్రాచుర్యంలోకి వచ్చిన సుబ్రమణ్యస్వామి ఎప్పుడో ఎవరూ దొరకనపుడు తన మీదే ఒక కేసు వేసుకున్నా ఆశ్చర్యం లేదని జోక్స్‌ వెలువడ్డాయి.

    రాజ్యసభలో తొలిసారిగా నోరు విప్పి అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో సోనియా గాంధీ పాత్ర గురించి మాట్లాడి సభ వాయిదాకు కారకుడైన స్వామి తన చర్యకు ఏ మాత్రం విచార పడలేదట.నేనేదో మంచి బాలుడిని అనా నన్ను రాజ్యసభకు నామినేట్‌ చేసింది అని తోటి సభ్యుడితో వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కేసులో కాంగ్రెస్‌ ముఖ్యంగా సోనియా గాంధీపై దాడి చేస్తున్న స్వామిని భీష్ముడిపై దాడికి శిఖండిని వినియోగించినట్లే రాజ్యసభలో బలంగా వున్న కాంగ్రెస్‌పై దాడికి సుబ్రమణ్యస్వామిని ఆయుధంగా వాడుకోవాలని బిజెపిలోని ఒక బలమైన తరగతి కోరుకుందట. ఇలాంటివారితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు వడ్డీతో సహా చెల్లిస్తాం, కేవలం మాపై దాడి కోసమే రాజ్యసభకు నామినేట్‌ చేశారు. అని కాంగ్రెస్‌ ఎంపి ఒకరు వ్యాఖ్యానించారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పత్తి పంటపై కెసిఆర్‌ది తద్దినపు తంతా ?

27 Wednesday Apr 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Others, Prices

≈ Leave a comment

Tags

alternative crops, cotton, cotton cultivation, cotton subsidies, KCR, WTO

ఎం కోటేశ్వరరావు

     తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి కె. చంద్రశేఖరరావు ఏప్రిల్‌ 24వ తేదీన ఒక ప్రకటన చేశారు. ఒక విధంగా అది సాధారణం కాదు. రానున్న రోజుల్లో పత్తి పంట తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం వుంది కనుక రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సలహాయిచ్చారు. పత్తి ఎగుమతి సుంకాన్ని పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, నైరోబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్ధ సమావేశంలో పత్తి ఎగుమతులపై రాయితీలను రద్దు చేసే నిర్ణయంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా సంతకం చేశారని, అందువలన రానున్న రోజులలో పత్తి సంక్షోభం తీవ్రం కానుందన్నది ముఖ్య మంత్రి ప్రకటన సారాంశం.

    అసలేమీ పట్టించుకోకపోవటం కంటే ఆలస్యంగా అయినా మేలుకోవటం మంచిదే కదా అనే బి పాజిటివ్‌ (ప్రతిదీ మన మంచికే ) అనే దృక్పధానికి అనుగుణంగా వుందనుకుంటే కెసిఆర్‌ ప్రకటన ఓకే. మిగతా ముఖ్యమంత్రులు ఈ మేరకైనా మొక్కుబడి తీర్చుకున్నారో లేదో తెలియదు. బహుశా కేసిఆర్‌ ముఖ్య మంత్రి కాక ముందు ఒక్క తెలంగాణా రాష్ట్ర సాధన తప్ప మరొక విషయాన్ని పట్టించుకొని వుండరు. రాష్ట్రం వచ్చిన తరువాత మిగతా విషయాలన్నీ చూసుకుందామనుకొని లేదా చేసుకొందామని అనుకొని వుండవచ్చు. అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల తరువాత పత్తి రైతులను హెచ్చరించటం గుడ్డిలో మెల్ల. ఎనిమిది సంవత్సరాల వ్యవధిలో అంటే 2018 నాటికి భారత్‌ ఎగుమతులపై ఇచ్చే సబ్సిడీని క్రమంగా తగ్గించాలని, ఈ లోగా సబ్సిడీని పెంచరాదని ప్రపంచ వాణిజ్య సంస్ధ 2010లోనే భారత్‌ను కోరింది. అంటే పత్తి,పత్తి వుత్పత్తుల ఎగుమతులపై సబ్సిడీని కూడా ఎత్తివేయాల్సి వుంటుంది.

     అమెరికా అంటే వామపక్షాలు మినహా మన రాజకీయ పార్టీల నేతలకు అది సైకిలైనా, కారయినా, హస్తం, కమలం పువ్వయినా మరొకరికైనా మహా ప్రీతి. కొన్ని దేశాల వారు తొడకోసు కుంటే మనవారు మెడ కోసుకుంటారని యుపిఏ పాలనా కాలంలో అన్ని పార్టీల వారు కలసి అమెరికాతో ఒప్పందాలపై సై అంటూ పార్లమెంట్‌లో మైనారిటీ యుపిఏ ప్రభుత్వాన్ని గట్టెక్కించి మద్దతు పలికారు. అదే అమెరికా మన పత్తి సబ్సిడీలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా వత్తిడి తెస్తోన్న విషయాన్ని కూడా కెసిఆర్‌ తన ప్రకటనలో ఎందుకు పేర్కొనలేదో తెలియదు. బహుశా రాష్ట్రానికి అమెరికా నుంచి వచ్చే పెట్టుబడుల కోసం వ్యూహాత్మకంగా మౌనం దాల్చి వుంటారని మనం అనుకోవాలి.

    గతేడాది అక్టోబరు 29న కేంద్ర ప్రభుత్వం వస్త్రాలతో సహా వాణిజ్య వుత్పత్తుల ఎగుమతులపై ఇస్తున్న రాయితీలను పొడిగిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అందుకు గాను కేటాయింపులను 18 నుంచి 21వేల కోట్ల రూపాయలకు పెంచినట్లు తెలిపింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత మన ఎగుమతులు దిగజారటం తప్ప పెరగని పూర్వరంగంలో ఈ చర్య తీసుకున్నారు. దీనిపై అమెరికాకు కోపం వచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో తలసరి ఆదాయం వెయ్యి డాలర్ల కంటే తక్కువ వున్నపుడు, ఆ దేశం నుంచి అన్ని రకాల వస్త్ర ఎగుమతులు వరుసగా ప్రపంచ వాణిజ్యంలో 3.25శాతం దాటితే ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధల ప్రకారం ఎగుమతి రాయితీలను రద్దు చేయాలన్న ఒక నిబంధనను అమెరికా వెలికి తీసి ఆ మేరకు ప్రపంచ వాణిజ్య సంస్ధకు ఫిర్యాదు చేసింది.ఆ తరువాతే నైరోబీలో జరిగిన సమావేశంలో కెసిఆర్‌ చెప్పినట్లు నిర్మలా సీతారామన్‌ సంతకం చేశారు. నిజానికి ఇది జరగబోతోందని గతేడాది జనవరిలోనే అధికార వర్గాలను వుటంకిస్తూ వార్తలు వచ్చాయి.(http://www.financialexpress.com/article/economy/textile-export-subsidy-under-wto-scanner/25566/

     ఇప్పుడు రైతులను హెచ్చరించిన ముఖ్య మంత్రి ఏడాది కాలంగా, కేంద్రం సంతకం చేసినపుడు ఎందుకు మౌనంగా వున్నట్లు ? ఇలాంటి సమస్యలపై టిఆర్‌ఎస్‌ పార్టీ లేదా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఇలా ఒక్కొక్క పంట సాగును మానివేస్తూ పోతూ వుంటే అప్పుడు కెసిఆర్‌ అండ్‌ కో ప్రభుత్వం ముందు పరిష్కరించాల్సిన సమస్యలే వుండవు, పోనీ ప్రత్యామ్నాయంగా మిగిలే పంటలేమి వుంటాయి? రైతులు ఏమైనా ఫరవాలేదనా ? అని ఎవరైనా అంటే వారు తెలంగాణా అభివృద్ధి వ్యతిరేకి అన్న ముద్ర సిద్ధంగా వుంటుంది కదా !

    కనీస మద్దతు ధరకంటే తక్కువ రైతాంగం అమ్ముకుంటున్నపుడు వారిని ఆదుకొనేందుకు చర్యలు తీసుకొని వుండుంటే అరే బయ్‌ ఇంక మనం చేయగలిగింది లేదు, వేరే పంటలు వేసుకోండి అంటే అర్ధం వుండి వుండేది. అదేమీ చేసినట్లు కనిపించటం లేదే ! మచ్చుకు గతేడాది నవంబరు మొదటి వారంలో పత్తి ధరలను చూసినపుడు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇటు తెలంగాణాలోనూ పెద్ద తేడాలేమీ లేవు. అంతకు ముందు కంటే తక్కువ లేదా స్ధిరంగా వున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. రైతాంగ ఆత్మహత్యలు ఎక్కడ ఎక్కువ ఎక్కువ తక్కువ అన్న చర్చలోకి పోనవసరం లేదు. ఒక అన్నదాత బలవన్మరణానికి పాల్పడినా అది పాలకుల విధానాల వైఫల్యం తప్ప మరొకటి కాదు.

   పత్తి పంట తమను అప్పుల వూబి నుంచి బయట పడవేస్తుందనే ఆశతో రైతాంగం సాగు చేస్తున్నారు. వారిని దాని నుంచి మళ్లించాలనుకోవటం తప్పుకాదు. మరికొద్ది వారాలలో సాగుకు సిద్ధం అవుతున్న తరుణంలో కేవలం ఒక ప్రకటనతో సరిపెట్టాల్సిన అంశంగా ప్రభుత్వం భావిస్తోందా ? గతేడాది పంట మొత్తం రైతుల చేతి నుంచి బయటకు పోయిన తరువాత అంతకు ముందుతో పోల్చితే పత్తి ధరలు పెరిగాయి. అందుకు అంతర్జాతీయ పరిస్థితులు కూడా తోడయ్యాయి. రైతాంగాన్ని మానసికంగా సిద్దం చేయాలంటే వారితో ప్రత్యక్షంగా చర్చించాలి, వున్న అనుమానాలను నివృత్తి చేయాలి. ప్రపంచ వాణిజ్య సంస్ధ, కేంద్ర ప్రభుత్వం, తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి మధనం జరపాలి. వేరే ప్రాంతాల మేథావులు తప్పుదారి పట్టిస్తారనుకుంటే తెలంగాణాలో కావాల్సినంత మంది వున్నారు. వారికే పరిమితం చేయవచ్చు. పత్తి విత్తనాల ధరల గురించి జరిగినంత చర్చ ప్రత్యామ్నాయ పంటల గురించి లేదంటే అతిశయోక్తి కాదేమో !

    ప్రత్యామ్నాయ పంటల గురించి ప్రతి ఏటా వ్యవసాయ ముద్రించే కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రి మొక్కుబడిగా వుంటోంది తప్ప రైతులను ఏమాత్రం ప్రభావితం చేయటం లేదు. రైతులు ప్రత్యామ్నాయంవైపు చూడాలంటే పత్తి కంటే అవి ఆకర్షణీయంగా వుండాలి. కనీసం తొలి సంవత్సరాలలో అయినా ప్రోత్సాహకాలు, మార్కెటింగ్‌ హామీ వుండాలి. ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి ఒక్కొక్కటిగా వైదొలుగుతున్న స్ధితిలో కేవలం ప్రకటనలు నమ్మి ముందుకు వస్తారా ? ఇప్పటికైనా పత్తి గురించి ఒక సమగ్రమైన శ్వేత పత్రాన్ని ప్రకటించి దానిని రాజకీయాలకు అతీతంగా చర్చించి రైతాంగం ముందుకు వెళ్లటం సముచితంగా వుంటుంది. లేకుంటే తద్దినపు తంతుగానే భావించాల్సి వుంటుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ప్రభుత్వ పాఠశాల విద్య పరిరక్షణే చికాగో టీచర్ల ‘మే డే ‘దీక్ష

26 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, USA

≈ Leave a comment

Tags

Chicago Teachers, Chicago teachers strike, Chicago Teachers Union

చికాగో టీచర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు కరేన్‌ లెవిస్‌

ఎం కోటేశ్వరరావు

    చరిత్ర ఎంతో చిత్రమైనది ! ఆదిమానవ దశలో ప్రకృతిని జయించి దానిని తన అదుపులో పెట్టుకొనేందుకు పోరు సాగించటమే ఏకైక కర్తవ్యం. కుటుంబం, వ్యక్తిగత ఆస్ధి, దానిని కాపాడుకొనేందుకు రాజ్యాంగాల పుట్టుక తరువాత సమాజాన్ని జయించి తమ అదుపులో పెట్టుకొనేందుకు మానవాళిలోనే ఒక వర్గం పూనుకున్న తరువాత మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమే. దానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరులో ఏ వైరుధ్యం ఎప్పుడు ముందుకు వస్తుందో, ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, అది ఎలా పరిష్కారమౌతుందో ఎవరూ జోస్యం చెప్పలేరు. అందుకే చరిత్ర ఎంతో చిత్రమైనది. అనేక మంది ఆ చిత్రాల గురించి ప్రస్తావించారు.

   చుంచెలుక జీవిత పర్యంతం నిరంతరం భూమిలో ఎక్కడో అక్కడ తవ్వుతూనే వుంటుంది. అది దాని స్వభావం, ఎప్పుడు బయటికి వస్తుందో తెలియదు.కొన్నిసార్లు మనకు అలా కనిపించి ఇలా మాయమై పోతుంటుంది. కానీ నిరంతరం అది తవ్వుతూనే వుంటుంది. ప్రఖ్యాత నాటక రచయిత షేక్‌స్పియర్‌ ఈ చిత్రమైన జీవి గురించి తన హామ్లెట్‌ నాటకంలో ప్రస్తావించారు. కారల్‌ మార్క్సు దానిని విప్లవానికి అన్వయించారు. ఆయన ఊహించిన విధంగా బాగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలలో విప్లవం రాలేదు. కానీ అందుకు భిన్నంగా అంతకంటే తక్కువ అభివృద్ధి చెందిన రష్యాలో వచ్చింది. తరువాత అత్యంత వెనుకబడిన ఫ్యూడల్‌ చైనాలో వచ్చింది. చరిత్ర చిత్రాల గురించి ఎంగెల్స్‌ ఇలా పేర్కొన్నారు.’మన కంటికి ఆకస్మికంగా కనిపించే గొప్ప విప్లవాలన్నింటికీ ముందు కాలపు ఆలోచనలు, సాహిత్యం, రాజకీయాల ఫలితంగా నిశ్చల మరియు రహస్య విప్లవాలు జరిగే తప్పనిసరిగా జరిగి వుంటాయి. విప్లవం ప్రతి కంటికీ కనిపించదు.’

    ఈఏడాది నవంబరులో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో బెర్నీ శాండర్స్‌ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడటం ఒక అనూహ్య పరిణామం. అమెరికాలో సోషలిస్టు, కమ్యూనిస్టు అని ఎవరైనా చెప్పుకుంటే వారిని ఎయిడ్స్‌ రోగి మాదిరి చూసేట్లు అక్కడి పాలకులు చేశారు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని నూరిపోశారు. అభ్యుదయ వాదులు, మ్యూనిస్టులుగా పేరు పడిన వారు నిరంతరం ఎప్పుడు ఏ కమ్యూనిస్టు వ్యతిరేక వున్మాది దాడి చేస్తాడా అని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు వుండేవంటే అతిశయోక్తి కాదు. అలాంటి గడ్డలో నేను సోషలిస్టును, కమ్యూనిస్టును అని బహిరంగంగా ప్రకటించి సియాటిల్‌ నగర పాలక సంస్ధ ఎన్నికలలో భారతీయ సంతితికి చెందిన కష్మా సావంత్‌ ఒకసారి కాదు రెండు సార్లు 2013,15లో పోటీ చేసి విజయం సాధించారు.ఆమె ఒక టీచర్‌గా పనిచేసింది. బెర్ని శాండర్స్‌ తనను సోషలిస్టుగా, అభ్యుదయ వాదిగా స్వయంగా ప్రకటించుకున్న డెమోక్రటిక్‌పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా తనను నిలపాలని తనకు అందుకు అన్ని రకాల అర్హతలు వున్నాయని పార్టీలో మద్దతు సంపాదించేందుకు హిల్లరీ క్లింటన్‌తో పోటీ పడుతున్నారు. అందుకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు మన మీడియాలో అప్పుడపుడూ మనం చూస్తున్నాం.

     సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకతకు పురిటి గడ్డగా పేరు మోసిన అమెరికాలో అవును మేం కూడా శాండర్స్‌ మాదిరి డెమోక్రటిక్‌ సోషలిస్టులమే అంటూ మిలియన్ల కొలదీ యువతరం ఆయనకు జేజేలు పలకటం ఎవరైనా వూహించారా? అదీ సోషలిజంపై సాగించిన ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని, కమ్యూనిజానికి సమాధి కట్టా మని, తమకు ఇంక ఎదురులేదని ప్రకటించుకున్న అమెరికా పాలకవర్గానికి చెమటలు పట్టిస్తారని ఎవరైనా కలగన్నారా ? బెర్నీ శాండర్స్‌ పచ్చి కమ్యూనిస్టు తెలుసా అంటూ ఆయన గురించి చిలవల పలవలతో కూడిన వ్యతిరేక కధనాలు రాయని కార్పొరేట్‌ పత్రికలు, రేడియోలు, టీవీలు లేవంటే అతిశయోక్తి కాదు. బెర్నీ, ఆయన మద్దతుదారులు సోషలిస్టులు, కమ్యూనిస్టులా అయితే ఏమిటట, మా గురించేగా మాట్లాడుతున్నారు అంటూ రోజురోజుకూ వారి పట్ల సానుకూలతను పెంచుకుంటున్నారని స్వయంగా అమెరికా సంస్ధల సర్వేలే వెల్లడించటం గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అయితే ఇవన్నీ యాదృచ్చికంగా జరిగాయా ?ఎంగెల్స్‌ చెప్పినట్లు ఎన్నో కారణాలు,ఎన్నెన్నో పరిణామాలు దోహదం చేశాయి.అంటే చుంచెలుక అమెరికాలో మరోసారి అంతర్గతంగా తొలుస్తోందా ? ఏమో చరిత్ర చిత్రాలను ఎవరు వూహించగలరు ?

      అమెరికా ఖండాల చరిత్రను చూస్తే ఇలాంటి పరిణామాలు ఆశ్చర్యం గొలపవు. మొత్తంగా వలస వచ్చిన వారితో, బానిసలుగా ఆఫ్రికా ఖండం నుంచి బలవంతంగా పట్టుకు వచ్చిన వారితో ఏర్పడిన అమెరికా సంయుక్త రాష్ట్రాలలో(యుఎస్‌ఏ) ఇప్పుడు రిపబ్లికన్‌ పార్టీ నేతలు భారత్‌ వంటి దేశాల నుంచి వుపాధికోసం వచ్చే వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభాలు నిత్యకృత్యం. వాటి నుంచి బయట పడటానికి ఒక నాడు వలసలను స్వయంగా ప్రోత్సహించింది. నూతన ప్రపంచం పేరుతో అమెరికా ఖండాలలోని ప్రకృతి సంపదలను స్వంతం చేసుకున్న ఐరోపా పాలకవర్గం తమకు అవసరమైన పని వారి కోసం పెద్ద ఎత్తున ఐరోపా నుంచి వలసలను ప్రోత్సహించింది. వలస కార్మికులకు రంగుల కలలను చూపింది.ఆఫ్రికా నుంచి అక్కడి జనాన్ని బానిసలుగా పట్టుకు వచ్చింది.అలాంటి పెట్టుబడిదారీ వర్గానికి ప్రతినిధిగా ముందుకు వస్తున్న రిపబ్లికన్‌ పార్టీ వలసలకు వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ఎందుకు ?

     1870దశకంలో ఐరోపాలో తీవ్రమైన ఆర్ధిక మాంద్యం ఏర్పడింది. దాని ప్రభావం అమెరికాపై పడింది. దానిలో భాగంగా 1873 సెప్టెంబరు 18న అమెరికాలోని అగ్రశ్రేణి బ్యాంకింగ్‌ సంస్ధ జె కూక్‌ అండ్‌ కంపెనీ కుప్పకూలింది.ఈ కంపెనీ అమెరికాలో రైలు మార్గాలకు పెట్టుబడులు పెట్టింది.అంతకు ముందు ప్రపంచ ఆక్రమణలో తమ వాటా కోసం ఆధిపత్య పోరులోఅమెరికా జరిపిన అనేక యుద్ధాల సమయంలో రుణ లావాదేవీలను నిర్వహించటంలో కీలక పాత్ర పోషించింది.అమెరికాపై ఈ మాంద్య ప్రభావం ఆ నాడు ఎంత తీవ్రంగా వుందంటే ఈ బ్యాంకు కుప్పకూలటంతో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ పది రోజుల పాటు మూత పడింది. కంపెనీలకు అప్పులు కరవయ్యాయి.పద్దెనిమిదివేల వ్యాపార సంస్ధలు దివాలా తీశాయి. నిరుద్యోగం 1876 నాటికి 14శాతానికి పెరిగింది. పని దొరికిన కార్మికులకు కూడా ఆరునెలలు మాత్రమే, అదీ 45శాతం వేతన కోతతో రోజుకు ఒక డాలరు కంటే తక్కువకే పనిచేశారు. దేశంలోని 364 రైలు మార్గ కంపెనీలలో 89 దివాలా తీశాయి.అంతకు ముందు ప్రభుత్వం రైలు మార్గాల నిర్మాణాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది.అందుకుగాను పెద్ద విస్తీర్ణంలో భూమి, ఇతర సబ్సిడీలను ఇచ్చింది.దాంతో మదుపుదార్లందరూ రైలు మార్గ కంపెనీలకు తమ పెట్టుబడులను మరల్చారు. బ్యాంకులన్నీ డబ్బును ఇటు మళ్లించాయి. మాంద్యం అటు రైలు మార్గ కంపెనీలు, ఇటు వాటిలో పెట్టుబడులు పెట్టిన వారినీ తీవ్రంగా దెబ్బతీసింది. సబ్సిడీ రూపంలో రాయితీలను పొందేందుకు ఆ సమయంలో అంత విస్తరణ అవసరమా లేదా అని చూడకుండా పెట్టుబడిదారులు 1866-73 మధ్య 55వేల కిలోమీటర్ల మేర కొత్త మార్గాలను నిర్మించారు. ఈ పూర్వరంగంలో మాంద్యం కారణంగా ఒకే ఏడాది మూడుసార్లు కార్మికుల వేతనాలను తగ్గించారు. దానికి నిరసనగా 1877లో అమెరికాలో జరిగిన రైల్వే కార్మికుల సమ్మెలను కొంత మంది మహా తిరుగుబాటుగా వర్ణించారు.ఇదే తరువాత కాలంలో ప్రపంచ కార్మికవర్గ దీక్షా దినమైన ‘మే డే ‘కు నాంది పలికిందంటే అతిశయోక్తి కాదు.

      పశ్చిమ వర్జీనియాలోని మార్టినెస్‌బర్గ్‌లో 1877 జూలై 14న ప్రారంభమైన రైల్వే కార్మిక సమ్మె అనేక ప్రాంతాలకు విస్తరించి 45 రోజుల పాటు జరిగింది. దీనికి ఏ కార్మిక సంఘమూ పిలుపునివ్వలేదు. ఏ పార్టీ మద్దతు పలకలేదు. మాంద్యంతో కార్మికుల నుంచి వెల్లువెత్తిన నిరసన నుంచి చెలరేగిన ఈ సమ్మె, హింసాకాండను అణచివేసేందుకు స్ధానిక, రాష్ట్ర, కేంద్ర పోలీసు, మిలిటరీ బలగాలను దించారు. మాంద్యం 1878-79 నాటికి తగ్గిపోయింది. అయితే ఆ సందర్భంగా కార్మికుల్లో తలెత్తిన నిరసనను పాలకులు అణచివేసినా కార్మికవర్గం అనేక పాఠాలు నేర్చుకుంది. పశ్చిమ వర్జీనియాలో ప్రారంభమైన సమ్మె అణచివేతకు ఆ రాష్ట్ర గవర్నర్‌ రాష్ట్ర పారామిలిటరీ బలగాలను ఆదేశించాడు. బల ప్రయోగానికి ఆ దళాలు నిరాకరించాయి. దాంతో కేంద్ర దళాలను దించాడు. ఇలా అనేక రాష్ట్రాలలో జరిగింది. పలుచోట్ల కార్మికులు, మిలిటరీ దళాలతో తలపడ్డారు.మేరీలాండ్‌లో మిలిటరీ కాల్పులలో పది మంది కార్మికులు మరణించారు.పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఒక రైలు మార్గ యజమాని అయిన థామస్‌ అలెగ్జాండర్‌ స్కాట్‌ కార్మికులకు కొద్ది రోజుల పాటు ‘తూటాల భోజనం పెట్టండి ఎలా వుంటుందో రుచి చూస్తారు’ అని వ్యాఖ్యానించాడు.దాంతో జరిపిన కాల్పులలో 20 మంది మరణించారు.ఇలా అనేక చోట్ల స్ధానిక ప్రభుత్వాల ఆదేశాల కంటే రైలు కంపెనీల యజమానుల ఆదేశాలమేరకు సాయుధ దళాలు కార్మికులను అణచివేశాయి.

     ముందే చెప్పుకున్నట్లు ఈ సమ్మె అనేక అనుభవాలను నేర్పింది. మిస్సోరీ రాష్ట్రంలో సెయింట్‌ లూయీస్‌ వర్కింగ్‌ మెన్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మిస్సోరీ నది పరిసర ప్రాంతాలలో అనేక మంది ఇతర కార్మికులు సానుభూతిగా సమ్మె చేశారు. చివరకు రోజుకు ఎనిమిది గంటల పని, బాలకార్మికుల నిషేధం డిమాండ్లతో అమెరికాలోనే తొలి సాధారణ సమ్మెగా అది మారిపోయింది. నది రెండువైపులా ఎనిమిది వేల మంది సాయుధ బలగాలను దించి సమ్మెను అణచివేశారు. కనీసం పద్దెనిమిది మందిని కాల్పులలో చంపివేశారు.

     ఈ సమ్మె అణచివేత తరువాత భవిష్యత్‌లో ఆందోళనలను ఎలా నిర్వహించాలా అని కార్మికవర్గం ఆలోచించింది. మరోసారి ఇలాంటి ఆందోళనలు పునరావృతం కాకుండా ఎలా చూడాలా అని యజమానులు పధకాలు వేశారు. కార్మికుల పట్ల మరింత కఠిన వైఖరిని అనుసరించాలని నిర్ణయించారు. అనేక రాష్ట్రాలలో కొత్త సాయుధ దళాలను తయారు చేశారు. జాతీయ సాయుధ దళాలకు అనేక పట్టణాలలో కేంద్రాలను నిర్మించారు. కార్మికులను అణచివేసేందుకు కొన్ని చట్టాలను కూడా కొత్తగా రూపొందించారు. ఇదే సమయంలో కార్పొరేట్‌ శక్తులను ఎదుర్కోవటంలో కార్మికవర్గం కూడా తనలో ఇమిడి వున్న శక్తిని గుర్తించింది.పిట్స్‌ బర్గ్‌లో సమ్మె అణచివేతకు సారధ్యం వహించిన సాయుధ దళాధికారి మాటల్లోనే ‘ ఒకే లక్ష్యం, ఒకే స్ఫూర్తి వారిలో కనిపించింది. కార్పొరేషన్ల శక్తిని దెబ్బతీసేందుకు ఏ పద్దతి అయినా అనుసరించవచ్చని వారు సమర్ధించుకున్నారు’ అన్నాడు. కార్మికులలో పెరిగిన చైతన్యం కారణంగా యజమానులు కూడా తెగేదాకా లాగితే తమకూ నష్టమే అని కూడా గ్రహించకతప్పలేదు. ఈ పూర్వరంగంలోనే బాల్టిమోర్‌ అండ్‌ ఓహియో రైలు మార్గ కంపెనీ 1880 మే ఒకటిన వుద్యోగుల సహాయ విభాగాన్ని ప్రారంభించి అనారోగ్యం, ప్రమాదాలకు గురైనపుడు సాయం, మరణిస్తే పరిహారం చెల్లించేందుకు ఏర్పాటు చేసింది. అదే కంపెనీ మరో నాలుగు సంవత్సరాల తరువాత పెన్షన్‌ పధకాన్ని ప్రారంభించిన తొలి పెద్ద యాజమాన్యంగా పేరు తెచ్చుకుంది.

  రైల్వే కార్మికుల ఆందోళన తరువాత అనేక పరిశ్రమలలో సమ్మెలు గణనీయంగా పెరిగాయి.1884అక్టోబరు ఏడున అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య 1886 మే ఒకటవ తేదీ నుంచి రోజుకు ఎనిమిది గంటల పని విధానం అమలులో వుండేట్లుగా ఎక్కడి కక్కడ కార్మిక సంఘాలు తీర్మానించి అమలు జరిపించుకోవాలని ఒక తీర్మానంలో అమెరికా, కెనడా కార్మికవర్గాన్ని కోరింది. మరుసటి ఏడాది సమావేశంలో కూడా అదే తీర్మానాన్ని పునరుద్ఘాటించింది. ఈ పిలుపు కార్మికవర్గంలో ఎంతో విశ్వాసాన్ని, వుత్సాహాన్ని నింపింది. రెండు సంవత్సరాల కాలంలోనే కార్మిక సంఘాల సభ్యత్వం రెండు నుంచి ఏడులక్షలకు పెరగటమే దానికి నిదర్శనం. ఎంగెల్స్‌ చెప్పినట్లుగా ‘మన కంటికి ఆకస్మికంగా కనిపించే గొప్ప విప్లవాలన్నింటికీ ముందు కాలపు ఆలోచనలు, సాహిత్యం, రాజకీయాల ఫలితంగా నిశ్చల మరియు రహస్య విప్లవాలు జరిగే తప్పనిసరిగా జరిగి వుంటాయి. విప్లవం ప్రతి కంటికీ కనిపించదు.’

   ప్రపంచాన్ని మరో మలుపు తిప్పిన మే డే పూర్వరంగం కూడా అలాంటిదే. 1881-84 మధ్య కాలంలో అమెరికాలో ఏడాదికి సమ్మెలు, లాకౌట్లు ఏడాదికి 150 జరగ్గా వాటిలో వున్న కార్మికులు లక్షా 50వేల మంది వున్నారు. తరువాత క్రమంగా పెరిగాయి 1886లో దాదాపు పదివేల సమ్మెలలో ఏడులక్షల మంది కార్మికులు పాల్గొన్నారు. అదే ఏడాది పనిగంటలను పన్నెండు నుంచి ఎనిమిదికి తగ్గించాలని కోరుతూ మే ఒకటిన జరిగిన జాతీయ సమ్మెలో 12వేల కంపెనీల కార్మికులు పాల్గొన్నారు.ఈ ఆందోళనకు కేంద్రంగా చికాగో మారింది. మే మూడవ తేదీన మెకార్మిక్‌ రీపర్‌ వర్క్స్‌ పరిశ్రమ వద్ద పోలీసులు కార్మికులను రెచ్చగొడుతూ జరిపిన కాల్పులలో ఆరుగురు మరణించారు. దానికి నిరసనగా మే నాలుగవ తేదీన చికాగోలోని హే మార్కెట్‌ ప్రాంతంలో కార్మికులు ప్రశాంతంగా సభ జరిపారు. కుట్రలో భాగంగా పోలీసులే బాంబులు వేసి తమ అధికారి ఒకరిని చంపివేశారు. దాన్ని సాకుగా చూపి కార్మికులపై తిరిగి కాల్పులు జరిపారు. ఆ సందర్భంగా నలుగు కార్మికులు మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే అంతకంటే ఎక్కువ మంది కనిపించలేదు. ఆ సందర్భంగానే ఒక పోలీసు మరణించాడు. తరువాత గాయాలతో మరో ఆరుగురు మరణించారు. తరువాత వెల్లడైన అంశమేమంటే గాయాలతో మరణించిన ఆరుగురు కూడా పోలీసులు విచక్షణా రహితంగా జరిగిన కాల్పుల తూటాలకు గాయపడిన వారే అని తేలింది. ఈ వుదంతంలో ఎనిమిది మంది కార్మికులును బాధ్యులుగా చేస్తూ కేసు పెట్టి, విచారణ తతంగం జరిపి వారిని వురి తీశారు. నిజానికి వారు కాల్పులు జరిగిన సమయంలో హే మార్కెట్‌ ప్రాంతంలోనే లేరు. ఆ చర్య అమెరికన్లనే గాక యావత్‌ ప్రపంచ కార్మికవర్గాన్ని మరింతగా ఆగ్రహానికి గురిచేసింది. తరువాత 1889 జూలై 14న పారిస్‌లో జరిగిన రెండవ ఇంటర్నేషనల్‌ సమావేశం చికాగో కార్మిక పోరాటాన్ని సమీక్షించి, అమెరికా కార్మిక సంఘ సూచనను ఆమోదిస్తూ మరుసటి ఏడాది 1890 నుంచి మే ఒకటవ తేదీని అంతర్జాతీయ కార్మిక దీక్షా దినంగా పాటించాలని తీర్మానించింది.

    1870దశకపు మాంద్యం తరువాత మరో రెండు దశాబ్దాలకు 1893-94లో అమెరికాను మరో మాంద్యం కుదిపేసింది. దేశవ్యాపితంగా సమ్మెలు వెల్లువెత్తాయి. ఇరవై ఆరు రాష్ట్రాలలో కార్మికులు-భద్రతా దళాలు తలపడేంతగా పరిస్ధితులు దిగజారాయి.ఈ సందర్భంగా పుల్‌మాన్‌ అనే రైల్వే కంపెనీలో జరిగిన సమ్మె వైఫల్యం కార్మికోద్యమంలో కొత్త పరిణామాలకు నాంది పలికింది.అప్పటి వరకు కార్మికులు ఏ విభాగంలో పనిచేసినా ఒకే యూనియన్‌లో వుండే వారు. ఈ సమ్మె సందర్బంగా కొన్ని విభాగాల వారు సమ్మెలో పాల్గొనలేదు. అది విభాగాల వారీ యూనియన్ల ఏర్పాటుకు దారి తీసింది.(వుదా టీచర్లలో కాడర్‌ సంఘాలు ఏర్పడిన మాదిరి ) దీనివలన వుపయోగాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి. ఇప్పటికీ ఈ మంచి చెడ్డల గురించి చర్చలు జరుగుతూనే వున్నాయి.

     సరిగ్గా 130 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో రోజుకు ఎనిమిది గంటల పని విధానాన్ని కోరుతూ జరిగిన ఆందోళనతో మే డే వునికిలోకి వచ్చింది. అదే చికాగో నగరం ప్రస్తుతం ఈ ఏడాది మేడే సందర్భంగా టీచర్ల ఆందోళనకు సమాయత్తం అవుతోంది. గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా, ప్రపంచ వుపాధ్యాయ వుద్యమంలో చికాగో టీచర్స్‌ యూనియన్‌ ఒక ప్రత్యేక స్ధానం సంపాదించుకుందంటే అతిశయోక్తి కాదు.జూన్‌ 30వ తేదీతో గత ఒప్పంద గడువు ముగుస్తున్నా కొత్త ఒప్పందం చేసుకొనేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవటంతో ఏప్రిల్‌ ఒకటవ తేదీన సమ్మె చేసిన టీచర్లు మే పదహారవ తేదీన మరోసారి సమ్మెకు దిగే విధంగా అక్కడి ప్రభుత్వం, మేయర్‌ చర్యలు వున్నాయి. చికాగో టీచర్ల వుద్యమం ప్రపంచ టీచర్లకు వేగు చుక్కగా, కొత్తదారి చూపుతున్నది. అమెరికా పాలకుల నయా వుదారవాద విధానాలలో భాగంగా ఇప్పటికే వున్నత విద్యత బాధ్యత నుంచి తప్పుకున్న ప్రభుత్వం పాఠశాల విద్య నుంచి కూడా తప్పుకొనేందుకు వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన విద్యను అందించటం లేదనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రయివేటు సంస్ధలకు స్కూళ్ల నిర్వహణ బాధ్యత అప్పగిస్తున్నది. దానికి ముద్దుగా చార్టర్‌ స్కూళ్లు అని పేరు పెట్టింది. నిధులను పెద్ద మొత్తంలో వాటికి మళ్లిస్తున్నది. ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్ధులను దూరం చేయాలంటే అక్కడి సౌకర్యాలకు కోత పెట్టాలి. అందుకు గాను అవసరమైన నిధులను కోత పెట్టటం ప్రారంభించింది. రాజ్యాంగం ప్రకారం నగరపాల సంస్ధలు కూడా ప్రభుత్వాల మాదిరి బాండ్ల జారీ ద్వారా అప్పులు తీసుకోవచ్చు.( మన దేశంలో గ్రేటర్‌ కార్పొరేషన్ల పేరుతో పెద్ద మున్సిపాలిటీలలో పరిసర ప్రాంతాలను కలిపి పెద్ద నగర పాలక సంస్ధలుగా మార్చటంలో అసలు లక్ష్యం అదే). మీరు స్కూళ్లు నడపాలనుకుంటే అప్పులు చేయండి, వాటిని తీర్చటానికి ప్రజలపై పన్నులు, ఇతర భారాలు మోపండని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వత్తిడి చేస్తున్నాయి. పన్నులు, భారాలు మోపటం అంటే జనాన్ని రెచ్చగొట్టటం తప్ప వేరు కాదు. అసలే 2008 నుంచి తీవ్ర ఆర్ధిక మాంద్యం, నిజవేతనాలు పడిపోతున్న స్ధితిలో పౌరులు స్కూళ్ల కోసం అప్పులు, పన్నుల భారాలను వ్యతిరేకించటం సహజం.

     అమెరికాలో వున్న పరిస్థితులలో టీచర్ల సమ్మె ఒక రోజు జరిగినా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఎక్కడైనా టీచర్లు ఆందోళనకు దిగితే ఆ రోజు మా పిల్లలను ఎవరు చూస్తారంటూ తలితండ్రులు టీచర్లపై దెబ్బలాటకు వస్తారు. పాలకులు కూడా అదే రెచ్చగొడతారు. దీన్ని గమనించే గత కొద్ది సంవత్సరాలుగా చికాగో టీచర్స్‌ యూనియన్‌ తాము చేస్తున్న ఆందోళన కేవలం తమ బిల్లు-బెల్లుకే కాకుండా మొత్తం కార్మికవర్గ ప్రయోజనాలకే అని తలిదండ్రులు, కార్మికవర్గాన్ని ఒప్పించటంలో చాలా వరకు సఫలీకృతం అయింది. ఇదే సమయంలో ప్రయివేటు స్కూళ్లు తమపై ఎంత భారం మోపుతున్నాయో గ్రహించటం కూడా తలిదండ్రులలో ప్రారంభమైంది. ఈ కారణంగానే ఏప్రిల్‌లో సమ్మె చేసిన వుపాధ్యాయులు తిరిగి మేనెలలో మరో సమ్మెకు సన్నద్దం అవుతున్నారు. ప్రభుత్వం సంప్రదింపులు జరిపేందుకు అవసరమైన గడువు ముగిసిన తరువాత ఏరోజైనా పది రోజుల సమ్మె నోటీసు ఇచ్చి మే 16న సమ్మె చేయాలని తాత్కాలికంగా నిర్ణయించారు. చికాగో నగరం ఇల్లినాయిస్‌ రాష్ట్రంలో వుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్ల అప్పు ప్రస్తుతం 20 బిలియన్‌ డాలర్లకు చేరిందని అంచనా.(బిలియన్‌ అంటే వంద కోట్లు, ఒక డాలర్‌ మన రూపాయలలో 68కి సమానం) దీనిలో ఒక్క చికాగో నగర అప్పు మూడో వంతు వుంది.ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఒక్కొక్క విద్యార్ధిపై సగటున పదివేల డాలర్ల అప్పు వున్నట్లు ఒక పత్రిక అంచనా వేసింది.అనేక నగరపాలక సంస్ధలలో స్ధానికంగా వసూలు చేసిన పన్నుల మొత్తం అప్పులపై వడ్డీలకే సరిపోతోందట.

   ఈ పూర్వరంగంలో టీచర్లు తమ ప్రతిపాదనలను అంగీకరిస్తే వారి వేతనాల పెంపుదలకు అంగీకరిస్తామని ప్రభుత్వం లంకె పెడుతోంది. పొమ్మన కుండా పొగపెట్టినట్లు మరోవైపు రుణం దొరక్కుండా చేసి స్కూళ్ల మూతలకు రంగం సిద్దం చేస్తోంది. పరోక్షంగా పాఠశాలల ప్రయివేటీకరణ, మూతలకు అంగీకరించాలని వత్తిడి చేస్తోంది. దీనిని చికాగో టీచర్స్‌ యూనియన్‌ అంగీకరించటం లేదు. దీంతో ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. ఏప్రిల్‌ ఒకటవ తేదీన జరిపిన సమ్మె చట్ట బద్దమా కాదా అని తాము విచారించే ముందు తాత్కాలికంగా అయినా చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని ప్రభుత్వమే కోర్టును కోరింది. ఒక స్వతంత్రం వాస్తవాల విచారణ సంస్ధ రూపొందించిన నివేదికను టీచర్ల యూనియన్‌ ఆమోదించాలని చికాగో నగర ప్రభుత్వ పాఠశాలల సిఇఓ ఫారెస్ట్‌ క్లేపూల్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయని పక్షంలో స్కూళ్ల మూత, తరగతి సైజు పెంపు, లేఆ ఫ్‌లు తప్పవని అన్నారు. స్వతంత్ర వాస్తవాల వెల్లడి బృందం సమర్పించిన నివేదిక ప్రకారం రానున్న నాలుగు సంవత్సరాలలో టీచర్ల వేతనం 8.75శాతం పెంచుతారు. దానికి కూడా కొన్ని షరతులు వున్నాయి. మన దేశంలో 2004 తరువాత సర్వీసులో చేరిన వారికి నూతన కంట్రి బ్యూటరీ పెన్షన్‌ విధానం వర్తింప చేస్తున్నట్లే 1980 దశకం నుంచి అమలులో వున్న పెన్షన్‌ విధానం బదులు టీచర్లు తమ పెన్షన్ల కోసం ఏడు శాతం మొత్తాలను చెల్లించాల్సి వుంటుంది. ఏటా రెండు శాతం మూల వేతనం పెంపుదల చొప్పున రెండు సంవత్సరాలకు ఒప్పందం చేసుకోవాలని, ఇతర లబ్దులను కొనసాగించాలని, చార్టర్‌ స్కూళ్ల సంఖ్యను పరిమితం చేయాలని, తరగతి గదిలో పిల్లల సంఖ్యను పెంచకూడదని టీచర్లు డిమాండ్‌ చేస్తున్నారు. తాజా పరిణామాలపై చికాగో టీచర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు కరేన్‌ లెవిస్‌ మాట్లాడుతూ ‘సమ్మె చేయాలని టీచర్లెవరూ కోరుకోవటం లేదు. ఇదేమీ సంతోషించాల్సిన సందర్భం కాదు, మా విద్యార్ధుల ముందు మేము ప్రేమించే బోధన చేయటానికి ఇష్ట పడతాము. కానీ ఈ బోర్డు (ప్రభుత్వం) ప్రభుత్వ పాఠశాల విద్యను రక్షించుకొనేందుకు గాను మా విద్యార్ధులు, తలిదండ్రులు, పాఠశాల కమిటీలను సంఘటితర పరచటం తప్ప మాకు మరొక అవకాశం లేకుండా చేస్తున్నది. పాఠశాల విద్యకు మరిన్ని నిధులు రాబట్టే విషయంలో బోర్డు, టీచర్ల యూనియన్‌ ఒకటే, అయితే అది ఒప్పందం కుదిరిన తరువాత.మేము నిధుల గురించే కాదు, స్కూళ్ల మూసివేత ద్వారా పెద్ద సంఖ్యలో టీచర్లను కోల్పోకుండా లోపాలు లేని హామీలు కోరుతున్నాం, మేము హామీలు కోరుతుంటే వారే వేరే భాషలో ఇతర విషయాలు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు మేము ఎంతో ఆశాభావంతో వున్నాం, మేము ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సివుంది’ అన్నారు. మరోవైపున పాఠశాల బోర్డు సిఇఓ యూనియన్‌పై ఆరోపణలు చేస్తూ వాస్తవాలకు అనుగుణంగా ఆలోచించటం లేదని, ఊహా ప్రపంచంలో వుందని వ్యాఖ్యానించారు.

     అమెరికాలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ తరతమ తేడాలతో తీవ్రమైన నిధుల కోత, రుణ సమస్యను ఎదుర్కొంటున్నాయి. బలమైన చికాగో టీచర్స్‌ యూనియన్‌ను లొంగదీసుకోవటం లేదా యూనియన్‌ను దెబ్బతీస్తే మిగతా ప్రాంతాలలో పాఠశాల విద్యపై వేటు వేయటం సులభం అవుతుంది. అందుకు ప్రభుత్వం అడ్డదారులు వెతుకుతుంటే వాటిని అధిగమించటానికి చికాగో టీచర్స్‌ యూనియన్‌ కూడా అంతే తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అందుకే అది పటిష్టం కావటం, విజయం సాధించటంపై అనేక అంశాలు ఆధారపడి వున్నాయి.

గమనిక : ఈ వ్యాసం వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణా టీచర్‌ మాస పత్రిక మే నెల సంచిక నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వచ్చేవి అచ్చేదిన్‌ కాదు జనానికి చచ్చే దినాలు : ప్రపంచ బ్యాంకు

26 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

Forecasts, gloomy days, World Bank

ఎంకెఆర్‌

   ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చేసిన అనేక వాగ్దానాలలో రెండు ప్రాధాన్యతగలిగినవి. ఒకటి విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వందరోజుల్లో వెనక్కు తెచ్చి ప్రతి వారి ఖాతాలో పదిహేనులక్షలు వేస్తామన్నది ఒకటి. రెండవది 2022 నాటికి రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది మరొకటి. ఇవి రెండూ ఎంతో ముఖ్యమైనవి. మొదటి దాని గురించి అసలు సాబ్‌ అలా చెప్పలేదు అనే వారు కొందరు, ప్రాణ, విత్త, మాన భంగములందు అబద్దాలు చెప్పవచ్చు అన్నట్లుగా ఎన్నికల సమయంలో చెప్పిన వాటినన్నింటినీ అమలు జరపలేరంటూ సమర్ధించేవారు మరి కొందరు. ఇంకొందరున్నారు చెప్పినట్లు నల్లధనాన్ని వెనక్కు తీసుకురాలేకపోయినా కొత్తగా విదేశాలకు తరల కుండా చేశారంటారు. అయితే అది కూడా వాస్తవం కాదని, గత రెండు సంవత్సరాలలో కొత్తగా భారతీయులు బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు పనామా పత్రాలు వెల్లడించాయి కనుక అది కూడా వాస్తవం కాదని తేలిపోయింది. బహుశా వారికి అచ్చేదిన్‌ వచ్చి వుంటాయి. రెండవది రైతుల ఆదాయాలు రెట్టింపు చేయటం. ప్రపంచ వ్యాపితంగా వ్యవసాయ వుత్పత్తుల ధరలు పతనమౌతున్న తరుణంలో ఆదాయాలు రెట్టింపు చేస్తామని ఓట్లను కొల్ల గొట్టేందుకు నరేంద్రమోడీ చెప్పటం మరో నల్లధనం వెలికితీత వంటిదే. మోడీ అంతరంగమైన అమిత్‌ షా ఏదో మాయాజాలం చేసి వాగ్దానాలు అమలు చేస్తారు అని నమ్ముతున్నవారు ఇంకా వున్నారు. అయితే తాజాగా మంగళవారం నాడు ప్రపంచ బ్యాంకు 2016 జోశ్యం గురించి చేసిన ప్రకటన ఆ ఆశల మీద కూడా నీళ్లు చల్లింది.జనం మీద భారం మోపే చమురు ధరలు పెరుగుతాయన్నది ఒకటి. కోట్లాది మంది రైతులు నోట్లే రాబోయే రోజుల్లో కూడా మట్టే అని మరొకటి. జనవరి జోశ్యంలో 2016-17లో వ్యవసాయ వుత్పత్తుల ధరలు గతేడాదితో పోల్చితే 1.8శాతం పెరుగుతాయని ప్రపంచబ్యాంకు పేర్కొన్నది. మూడు నెలలు తిరిగే సరికి రెండవ సవరింపులో 2016లో 1.8, 2017లో 1.7శాతం మేరకు ధరలు పతనమౌతాయని పేర్కొన్నది. తదుపరి అంచనాలలో ఏం చెబుతుందో తెలియదు. ఇప్పుడు చెప్పిన రెండూ జనానికి అచ్చేదిన్‌ కాదు జనానికి చచ్చే దినాల రానున్నాయని వెల్లడిస్తున్నాయి.

    సరిగ్గా బ్యాంకు ఈ నివేదికను రూపొందిస్తున్న తరుణంలోనే ఇక నుంచి రైతులు తమ వుత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. అందుకు గాను ఏప్రిల్‌ 14న ‘ఇనామ్‌’ ప్రారంభించారు. దీన్ని ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ అని పిలుస్తున్నారు. రైతులు సమీప మార్కెట్లో అక్కడి వ్యాపారులు చెప్పిన అతి తక్కువ ధరలకు తమ వుత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తున్నదని ఇనామ్‌ ద్వారా కోరుకున్న ధరకు అమ్ముకొని అధికంగా సంపాదించుకోవచ్చని ప్రధాని ప్రకటించారు. తొలి దశలో ఎనిమిది రాష్ట్రాలలోని 22 మార్కెట్‌ యార్డులను అనుసంధానించారు.మొత్తం 585 వ్యవసాయ మార్కెట్‌ యార్డులను 2018 నాటికి పూర్తిగా అనుసంధానిస్తారు. అయితే ఇందుకు రాష్ట్రాలు చట్టాలను సవరించి అనుసంధానానికి ఆమోదం తెలపాల్సివుంటుంది. తొలి దశలో గుజరాత్‌, తెలంగాణా, రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, వుత్తర ప్రదేశ్‌, హర్యానా , జార్ఖండ్‌, హిమచల్‌ ప్రదేశ్‌కు చెందిన మార్కెట్లను అనుసంధానించారు. ఇరవై అయిదు రకాల పంటలను విక్రయించుకోవచ్చు. తొలి దశలో ఆయా రాష్ట్రంలోని మార్కెట్లలో మాత్రమే లావాదేవీలు జరుగుతాయి. వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో క్రయ విక్రయాల ద్వారా ఆయా రాష్ట్రాలకు ఆదాయం వస్తోంది. వాటిని కోల్పోవటానికి ఏ రాష్ట్రమూ అంగీకరించదు. అందువలన ఈ సమస్యను ఎలా పరిష్కరించేది చూడాల్సి వుంది. దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చన్న విధానం అమలులోకి రావటం అంత సులభం కాదని చెబుతున్నారు.

   గత కొద్ది సంవత్సరాలుగా వ్యవసాయ పంటలపై రైతాంగానికి వస్తున్న ఆదాయాలు పడిపోతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ విధానాలలో భాగంగా తమ బాధ్యతల నుంచి ఒక్కొక్క రంగం నుంచి క్రమంగా తప్పుకుంటున్నాయి. ఈ మార్కెట్లు కూడా దానిలో భాగమే. ఈ ఏడాది బడ్జెట్‌లో రైతాంగానికి పెద్ద పీట వేసినట్లు ప్రభుత్వం, మీడియా కూడా డబ్బా కొట్టాయి. బడ్జెట్‌ను అంకెల గారడీ అని కూడా వర్ణిస్తారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ 2022 రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని పదే పదే చెబుతున్నారు. దీనిలో రెండు అర్ధాలు వున్నాయి. ఒకటి ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఆ మేరకు రైతాంగ వుత్పత్తుల ధరలు పెరిగితే రైతులకు ఎక్కువ డబ్బు వచ్చినట్లు కనిపించవచ్చుగానీ అదే సమయంలో వారి పెట్టుబడులు కూడా అంతకంటే ఎక్కువ పెరుగుతాయి. స్ధిర ధరలలో పెరుగుదల ఎంత అన్నదే నిజమైన కొలబద్ద అవుతుంది. అలా జరగాలంటే ప్రభుత్వాలు అది కేంద్రమైనా, రాష్ట్రాలైనా ఎంత మేరకు బడ్జెట్‌ కేటాయింపులు జరిపాయన్నదానిని బట్టే వుంటుంది.

    ద్రవ్యోల్బణం కారణంగా గతేడాది కంటే విలువ తగ్గిన రూపాయల కేటాయింపు అంకెల్లో ఎక్కువగా కనిపించినా, దేశ స్ధూలాదాయంలో శాతాలలో చూస్తే గతేడాది కంటే వ్యవసాయంలో భాగమైన గ్రామీణ వుపాధికి కేటాయింపు 0.3శాతం తగ్గింది. వాటిలో గతేడాది బకాయిల మొత్తం, యంత్రాల వినియోగానికి అనుమతుల వంటి వాటిని చూస్తే వాస్తవానికి ఇంకా ఎక్కువ తగ్గుతుంది. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాలలో రైతుల ఆదాయంలో ఇది కూడా ఒక భాగంగా మారిన విషయం తెలిసిందే. అందువలన ఆదిలోనే హంసపాదు అన్నట్లు గ్రామీణ బడ్జెట్‌గా వర్ణించిన దానిలో దానికి ప్రాధాన్యత ఇవ్వలేదని తేలిపోయింది.

                                     వ్యవసాయ రంగంలో సంక్షోభం

     గత కొద్ది సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో సంక్షోభ తీవ్రత పెరుగుతోంది. అందువలననే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత కూడా రైతుల ఆత్మహత్యల తీవ్రత పెరిగింది తప్ప తగ్గటం లేదు.గత ఐదు సంవత్సరాలలో సగటున రోజుకు 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు తెలుపుతుండగా గతేడాది ఆ సగటు 52కు పెరిగింది.వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ హయాంలో వ్యవసాయరంగం తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నది. దానిని మరుగు పరచి దేశం వెలిగిపోతోంది అన్న ప్రచారంతో ఎన్‌డిఏ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటంతో తీవ్ర ఎదురు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే.సరిగ్గా అటు వంటి పరిస్థితి మరోసారి ప్రారంభమై దిగజారటం వేగం పుంజుకుంటున్న స్ధితిలో నరేంద్రమోడీ రైతాంగానికి ఆదాయాల రెట్టింపు వంటి అనేక ఆశలు చూపి అధికారంలోకి వచ్చారు. రైతాంగం సంక్షోభంలో భాగంగా రుణవూబిలో కూరుకుపోయిన కారణంగానే రుణాల రద్దు నినాదానికి ఆంధ్రప్రదేశ్‌లో రైతులు మొగ్గు చూపి చంద్రబాబు నాయుడికి పీఠం అప్పగించారు.

     2004ఎన్నికలలో ఎన్‌డిఏ రైతుల ఆగ్రహాన్ని చూసిన తరువాత కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నది. గ్రామీణ వుపాధి కార్యక్రమం దాని పర్యవసానమే. దీనికి తోడు ప్రపంచ వ్యాపితంగా వ్యవసాయ వుత్పత్తుల ధరల పెరుగుదల ప్రభావం మన దేశంపై కూడా పడి రైతుల ఆదాయాలు పెరిగాయి.అది మరో నిర్మాణ రంగం పెరుగుదలకు దోహదం చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వెళ్లిన వారికి వేతన రూపంలో ఆదాయాలు పెరగటానికి కూడా దారితీసింది. ఇది కొంత మేరకు సంక్షోభాన్ని పెరగకుండా చేసింది తప్ప పూర్తిగా పరిష్కరించలేదు. యుపిఏ రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత లోటు తగ్గింపు పేరుతో కోతలు విధించటం ప్రారంభించింది. ఇదే సమయంలో వ్యవసాయ వుత్పత్తుల ధరల పెరుగుదల ఆగిపోయి మరోసారి వెనుక పట్టు పట్టింది. బడ్జెట్‌ కోతలో భాగంగా వ్యవసాయానికి పెట్టుబడులు తగ్గాయి. 2010-11 నుంచి అప్పటి వరకు స్ధిరంగా వున్న వ్యవసాయ సంక్షోభం తిరిగి పెరగటం ప్రారంభమైంది. మోడీ హయాంలో ఇంకా పెరుగుతోంది. మాంద్యం లేదా సంక్షోభం తలెత్తినపుడు పెట్టుబడిదారులకు రాయితీలు తప్ప ప్రజా సంక్షేమానికి కోత పెడతారు. దానిలో వ్యవసాయం కూడా ఒకటని వేరే చెప్పనవసరం లేదు. వ్యవసాయ రంగం సంక్షోభంలో వున్న వర్తమాన తరుణంలో కొన్ని విభాగాలకు కొంత కేటాయింపులు పెంచినంత మాత్రాన రానున్న ఆరు సంవత్సరాలలో రైతుల అదాయాలు రెట్టింపు అవుతాయంటే అంతకంటే హాస్యాస్పదం మరొకటి వుండదు. నిజానికి ఎరువులు,డీజిల్‌, ఇతర పెట్టుబడులపై ఇస్తున్న రాయితీలను ఎత్తివేసిన తరువాత బడ్జెట్‌లో నామమాత్రంగా కేటాయింపులు పెంచినా దాని వలన రైతాంగానికి ఎలాంటి వుపయోగం వుండదు.

      నరేంద్రమోడీ సర్కార్‌ అన్ని రంగాలలో విదేశీ పెట్టుబడుల గురించి జపం చేస్తోంది. ఆయనను ప్రధాని గద్దెపై కూర్చొనేందుకు ఎంపిక చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ మరోవైపు స్వదేశీ జాగరణ మంచ్‌ పేరుతో కబుర్లు చెబుతోంది. ఆహార వుత్పత్తుల రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇస్తామని అరుణ్‌ జెట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పటం ఆచరణలో విదేశీ ఆదరణ మంచగా దేశాన్ని మార్చటమే. . ఇది చిన్న సన్నకారు రైతాంగానికేమీ వుపయోగపడదని ముఖ్యంగా పండ్లు, కూరగాయల రైతాంగానికేమీ ప్రయోజనం లేదని అనేక మంది నిపుణులు చెబుతున్నారు.ప్రభుత్వ రంగంలో పెట్టుబడులను పెంచితేనే వారికి లబ్ది చేకూరుతుంది. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు అంటే ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధన, పేదరిక నిర్మూలన కూడా ఇమిడి వుంది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించటం అంటే విదేశీ కార్పొరేట్‌, ప్రయివేటు శక్తులకు పెద్ద పీట వేయటమే. విదేశీ పెట్టుబడులు వ్యవసాయరంగంలో ప్రవేశించటం వాటి లాభాల కోసం తప్ప మన బాగుకోసం కాదు. బ్రిటీష్‌ వారు తమ ఆక్రమిత దేశాలైన భారత్‌, చైనా వంటి చోట్ల తమ లాభాల కోసం నల్లమందు సాగు, తయారీని ప్రోత్సహించి జనాన్ని నల్లమందు భాయీలుగా మార్చటమే కాదు చివరకు నల్లమందు యుద్ధాలు చేసిన విషయం చరిత్ర చెబుతోంది.

      అంతెందుకు వర్తమాన చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ వుగ్రవాదులను పెంచి పోషించేందుకు అమెరికన్లు అక్కడ వారిచేత అదే పని చేయించారు. ఇప్పుడు మత్తుమందుల రవాణాలో ఆఫ్ఘనిస్తాన్‌ ఒక కీలక ప్రాంతంగా మారింది. తాలిబాన్లకు అవసరమైన ఆదాయ వనరుగా మారింది. వ్యవసాయంలో విదేశీ పెట్టుబడులంటే మరో విధంగా చెప్పాలంటే ఈ విధానం వెనుక వున్న పరమార్ధం తన బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవటం, మార్కెట్‌ శక్తులకు రైతాంగాన్ని అప్పగించటమే. దానిలో అంతర్బాగంగానే రైతులకు ఏమాత్రం వుపయోగపడకుండా ఇప్పుటికే వున్న పంటల బీమా పధకంలో మార్పులతో అందుకు శ్రీకారం చుట్టింది. రైతాంగానికి రక్షణ కల్పించే అనేక అంశాలలో బీమా ఒకటి మాత్రమే. బీమా సంస్ధలు ప్రీమియం స్వీకరించే ముందు చెప్పే కబుర్లకు తరువాత చెల్లించాల్సిన సమయంలో పెట్టే షరతులకు ఎంత తేడా వుంటుందో తెలిసిందే. అయినా వ్యవసాయ సంక్షోభానికి సమగ్ర పంటల బీమా అన్నది ఒక తోడ్పాటు మాత్రమే తప్ప జిందా తిలిస్మాత్‌ కాదు. మరో విధంగా చెప్పాలంటే సామాజిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొని రైతాంగాన్ని ఒక ఆర్ధిక సరకుగా ద్రవ్య వ్యాపారులకు అప్పగించే నయా వుదారవాద విధానం తప్ప మరొకటి కాదు. పశ్చిమ దేశాలలో మనకంటే మెరుగైన వ్యవసాయ బీమా పధకాలు వున్నప్పటికీ ఏదో ఒక పేరుతో ప్రభుత్వాలు భారీ మొత్తంలో సబ్సిడీలు ఇవ్వటమే గత దశాబ్దన్నర కాలంగా దోహా చర్చలు ముందుకు పోకపోవటానికి అడ్డుపడుతున్న కారణాలలో ఒకటని గుర్తించాలి. మోడీ సర్కార్‌ ఆ సబ్సిడీల గురించి మాట్లాడటం లేదు, వున్నవాటిని క్రమంగా రద్దు చేస్తోంది.

    ప్రపంచ బ్యాంకు వ్యవసాయం గురించి తాజాగా చెప్పిన అంశాల గురించి చూద్దాం. గత ఎనిమిది త్రైమాసకాలుగా (రెండు సంవత్సరాలుగా) ప్రపంచంలో వ్యవసాయ వుత్పత్తుల ధరలు పడిపోతూనే వున్నాయి.గతేడాది కంటే తొమ్మిదిశాతం తక్కువ. ఎక్కువ భాగం వ్యవసాయ వుత్పత్తుల ధరలు ఈ ఏడాది పతనం అవుతాయి. ధాన్యం ధరలు 3.4శాతం తగ్గుతాయని జనవరిలో వేసిన అంచనాను తాజాగా 5.3శాతానికి పెంచింది. వ్యవసాయ ధరలు తగ్గటంతో పాటు చమురు, గ్యాస్‌ ధరలు పెరుగుతాయని చెప్పటం అంటే అంటే పరోక్షంగా రైతులపై మరింత భారం మోపటమే. ఎరువుల ధరలు తక్షణమే పెరుగుతాయి.ఇది ఒక విష వలయం. ఒకదాని ప్రభావం మరొకదానిపై పడి అన్నింటినీ దెబ్బతీస్తాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Selling of Medicines Banned in Foreign Countries

26 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, Health, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Analgin, Medicines, Nimesulide, Pioglitazone

A drug banned / restricted in one country may continue to be marketed in other countries as the respective Governments examine the usage, doses, indications permitted, etc. along with the overall risk-benefit ratio and take decisions on the continued marketing of any drug in that country. In India, safety issues concerning drug formulations are, as and when noted, assessed in consultation with the experts. Safety and efficacy issues relating to certain drugs which have been banned in some countries have been examined and some of these have been allowed for continued marketing subject to stipulated condition/restrictions. These include:

I. Nimesulide:- The manufacture, sale and distribution of Nimesulide formulation for human use in children below 12 years of age has been prohibited in the country.

II. Analgin:- The manufacture for sale, sale and distribution of Analgin and its formulations containing Analgin for human use was initially suspended in the country w.e.f. 18.06.2013. Subsequently, DTAB examined the issue of suspension of manufacture and sale of the said drug on 25.11.2013 in its 65th meeting and on the basis of the recommendations of the DTAB, the ban was revoked subject to the condition that manufacturers will be required to mention the following on their package insert and promotional literature of the drug:-

“The drug is indicated for severe pain and pain due to tumour and also for bringing down temperature in refractory cases when other antipyretics fail to do so”.

III Pioglitazone:- The manufacture for sale, sale and distribution of the drug Pioglitazone and formulations containing Pioglitazone for human use was initially suspended w.e.f. 18.06.2013. Subsequently, DTAB, after examination, recommended for revocation of the suspension of the manufacture and sale of the drug subject to certain conditions and accordingly, the suspension was revoked subject to the condition that the manufacturer shall mention on the package insert and promotional literature of the drug the following:-

a) The drug should not be used as first line of therapy for diabetes.

b) The manufacturer should clearly mention the following box warning in bold red.

“Advice for healthcare professionals:

I. Patients with active bladder cancer or with a history of bladder cancer, and those with uninvestigated haematuria, should not receive pioglitazone.

II. Prescribers should review the safety and efficacy of pioglitazone in individuals after 3–6 months of treatment to ensure that only patients who are deriving benefit continue to be treated. Pioglitazone should be stopped in patients who do not respond adequately to treatment (e.g. reduction in glycosylated haemoglobin, HbA1c).

III. Before starting pioglitazone, the following known risk factors for development of bladder cancer should be assessed in individuals: age; current or past history of smoking; exposure to some occupational or chemotherapy agents such as cyclophosphamide; or previous irradiation of the pelvic region.

IV. Use in elderly patients should be considered carefully before and during treatment because the risk of bladder cancer increases with age. Elderly patients should start on the lowest possible dose and be regularly monitored because of the risks of bladder cancer and heart failure associated with pioglitazone.”

V. The Central Government has banned 344 Fixed Dose Combinations on 10.03.2016, as these combinations lacked therapeutic rationality/ justification.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Draft Guidelines for Organ Donation

26 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, Health, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

NOTTO, Organ, Organ Donation

 

Draft guidelines for kidney had been placed in public domain for seeking comments and suggestions from the general public. Based on the comments received, the Government has since finalized the said guidelines and issued Allocation Criteria for deceased donor kidney transplant which have been uploaded on the website of National Organ and Tissue Transplant Organization (NOTTO) namely http://www.notto.gov.in.  The allocation policy for organs has been developed keeping in view the ethical, legal and scientific rationale. Further, these guidelines provide for allocation of kidney in a transparent manner. Draft guidelines for Liver and Heart have been prepared/placed on the NOTTO website for seeking comments from public and stakeholders.

These guidelines concern allocation criteria of organs from cadaver donors and not the illegal trading of organs. The illegal trading and transplantation of organs is regulated in terms of the Transplantation of Human Organs and Tissues Act, 1994 and Transplantation of Human Organs and Tissues Rules 2014, which are available on the NOTTO website namely www.notto.gov.in .

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: