E Carts and E Rickshaws freed from permit requirements
31 Wednesday Aug 2016
Posted Current Affairs, INDIA, NATIONAL NEWS
in31 Wednesday Aug 2016
Posted Current Affairs, INDIA, NATIONAL NEWS
in31 Wednesday Aug 2016
Posted Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS
inTags
FDI, Foreign Direct Investment Policy, India Foreign Direct Investment Policy, India Foreign Direct Investment Policy 2016
Cabinet approves simplification and liberalisation of the Foreign Direct Investment Policy, 2016 in various sectors
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has given its ex-post-facto approval for the FDI policy amendments announced by the Government on 20th June, 2016. The FDI policy amendments are meant to liberalise and simplify the FDI policy so as to provide ease of doing business in the country leading to larger FDI inflows contributing to growth of investment, incomes and employment. The details are as follows:
It has now been provided that 100% FDI under government route for trading, including through e-commerce, is permitted in respect of food products manufactured and/or produced in India.
Foreign Investment in Defence Sector up to 100%
Earlier FDI regime permitted 49% FDI participation in the equity of a company under automatic route. FDI above 49% was permitted through Government approval on case to case basis, wherever it is likely to result in access to modern and ‘state-of-art’ technology in the country. In this regard, the following changes have inter-alia been brought in the FDI policy on this sector:
FDI policy on Broadcasting carriage services has also been amended. New sectoral caps and entry routes are as under:
Sector/Activity | New Cap and Route |
5.2.7.1.1
(1)Teleports(setting up of up-linking HUBs/Teleports); (2)Direct to Home (DTH); (3)Cable Networks (Multi System operators (MSOs) operating at National or State or District level and undertaking upgradation of networks towards digitalization and addressability); (4)Mobile TV; (5)Headend-in-the Sky Broadcasting Service(HITS) |
100%
Automatic |
5.2.7.1.2 Cable Networks (Other MSOs not undertaking upgradation of networks towards digitalization and addressability and Local Cable Operators (LCOs)) | |
Infusion of fresh foreign investment, beyond 49% in a company not seeking license/permission from sectoral Ministry, resulting in change in the ownership pattern or transfer of stake by existing investor to new foreign investor, will require FIPB approval |
4.Pharmaceutical
The earlier FDI policy on pharmaceutical sector provides for 100% FDI under automatic route in greenfield pharma and FDI up to 100% under government approval in brownfield pharma. With the objective of promoting the development of this sector, 74% FDI under automatic route has been permitted in brownfield pharmaceuticals. FDI beyond 74% would be permitted through Government approval route.
(i) The earlier FDI policy on Airports permitted 100% FDI under automatic route in Greenfield Projects and 74% FDI in Brownfield Projects under automatic route. FDI beyond 74% for Brownfield Projects is under government route.
(ii) With a view to aid in modernization of the existing airports to establish a high standard and help ease the pressure on the existing airports, 100% FDI under automatic route has now been permitted in Brownfield Airport projects.
(iii) As per the earlier FDI policy, foreign investment up to 49% was allowed under automatic route in Scheduled Air Transport Service/ Domestic Scheduled Passenger Airline and regional Air Transport Service. This limit has now been raised to 100%, with FDI upto 49% permitted under automatic route and FDI beyond 49% through Government approval. For NRIs, 100% FDI will continue to be allowed under automatic route. Foreign airlines would continue to be allowed to invest in capital of Indian companies operating scheduled and non-scheduled air-transport services up to the limit of 49% of their paid up capital.
6.Private Security Agencies
The earlier policy permitted 49% FDI under government approval route in Private Security Agencies. Since Private Security Agencies are already required to get license under PSAR Act 2005, the requirement of putting them through another line of Government approvals through FIPB has now been done away with for FDI up to 49%. Accordingly, FDI up to 49% is now permitted under automatic route in this sector. FDI beyond 49% and upto 74% is permitted through Government approval route.
For establishment of branch office, liaison office or project office or any other place of business in India if the principal business of the applicant is Defence, Telecom, Private Security or Information and Broadcasting, it has provided that approval of Reserve Bank of India would not be required in cases where FIPB approval or license/permission by the concerned Ministry/Regulator has already been granted.
As per FDI Policy 2016, FDI in Animal Husbandry (including breeding of dogs), Pisciculture, Aquaculture and Apiculture is allowed 100% under Automatic Route under controlled conditions. The requirement of ‘controlled conditions’ for FDI in these activities has now been done away with.
Local sourcing norms have been relaxed up to three years, with prior Government approval, for entities undertaking Single Brand Retail Trading of products having ‘state of art’ and ‘cutting edge’ technology. For such entities, sourcing norms will not be applicable up to three years from commencement of the business i.e. opening of the first store for entities undertaking single brand retail trading of products having ‘state-of-art’ and ‘cutting-edge’ technology and where local sourcing is not possible. Thereafter, sourcing norms would be applicable.
Background:
In last two years, Government has brought major FDI policy reforms in a number of sectors viz. Defence, Construction Development, Insurance, Pension Sector, Broadcasting Sector, Tea, Coffee, Rubber, Cardamom, Palm Oil Tree and Olive Oil Tree Plantations, Single Brand Retail Trading, Manufacturing Sector, Limited Liability Partnerships, Civil Aviation, Credit Information Companies, Satellites- establishment/operation and Asset Reconstruction Companies. Measures undertaken by the Government have resulted in increased FDI inflows at US$ 55.46 billion in financial year 2015-16, as against US$ 36.04 billion during the financial year 2013-14. This is the highest ever FDI inflow for a particular financial year. However, it was felt that the country has potential to attract far more foreign investment which can be achieved by further liberalizing and simplifying the FDI regime.
Accordingly, Union Government radically liberalized the FDI regime on 20th June, 2016 with the objective of providing major impetus to employment and job creation in India. This was the second major reform after the last radical changes announced in November, 2015. Changes introduced in the policy included increase in sectoral caps, bringing more activities under automatic route and easing of conditionalities for foreign investment. The amendments were aimed at further simplifying the regulations governing FDI in the country and make India an attractive destination for foreign investors. Most of the sectors with these changes have now been brought under automatic route for FDI, except a small negative list. The amendments have made India the most open economy in the world for FDI.
31 Wednesday Aug 2016
Posted Current Affairs, Education, INDIA
inin programmes aimed at improving the human condition and empowering the citizens: Vice President
Inaugurates 2nd phase of the total e-Literacy programme
The Vice President of India, Shri M. Hamid Ansari has said that Kerala has been a pioneer state in terms of ushering in programmes aimed at improving the human condition and empowering the citizens and the quest for 100% e-literacy is reflective of that drive and spirit. He was addressing the gathering after inaugurating in Thiruvananthapuram, Kerala yesterday the 2nd phase of the total e-Literacy and commencement of the Digital Libraries programmes in the State. The Governor of Kerala, Justice (Retd.) P. Sathasivam, Chief Minister Shri Pinarayi Vijayan and the Deputy Chairman, Rajya Sabha, Prof. P.J. Kurien were present on the occasion.
The Vice President said that poor and marginalized communities face tremendous challenges in overcoming the “digital divide” and in using Information Communication Technology or ICTs as a tool for economic and social development and for improving their living conditions. This, in turn, makes e-literacy a crucial skill to possess, he added.
The Vice President said that the penetration of internet, both conventional and mobile, in India has been growing at an increasing rate and the global system for mobile (GSM) communication occasioned the preponderant use of cellular phones in India which has allowed us to leap-frog the infrastructural constraints of traditional access to internet and ICT and ICT enabled services. He further said that mandatory use of e-skills has been imposed on our citizens in the form of e-government, e-learning, e-health etc. Thus, the lack of e-literacy skills seems more debilitating than basic literacy skills because of the ubiquitous applications of ICT in civic, work and personal situations and with improved e-literacy skills, more individuals can access ICT based skill-development and vocational training programmes, he added.
The Vice President said that e-literacy skills are also very useful in effective participation in e-government, e-commerce, e-health and use of personal electronic gadgets. E-literacy skills and access to Internet provide the citizen with an almost unlimited amount of knowledge and information which is the key to empowering the citizen and for the making of a successful democracy, he added.
The Vice President commended the government of Kerala for setting up this institution in the memory of Shri P N Panicker and appreciated that the PN Panicker Vigyan Vikas Kendra has taken the lead towards realizing the aim of making Kerala the first e-literate state of the country, within a timeframe of 33 months. The Vice President formally launched the second phase of the total e-literacy programme in Kerala.
Following is the text of Vice President’s message:
“The internet has been described as one of the most important technological innovations of the last century. This is exceptional for a century which, among other scientific and technical advances, also gave us aeroplanes, rockets, jet engines, understanding of genetics, radio, television, anti-biotics and digital computers.
The Internet is a powerful tool to improve livelihoods and to provide new economic and social opportunities, particularly for young people in poor communities as they connect with the rest of the world. It is a means of overcoming social exclusion providing a “digital bridge” out of poverty. In rural areas, the Internet can provide a powerful equalizing tool allowing people to receive access to key information and to connect with each other, overcoming social and geographical boundaries.
At the same time, evidence shows that poor and marginalized communities face tremendous challenges in overcoming the “digital divide” and in using Information Communication Technology or ICT as a tool for economic and social development and for improving their living conditions. There is a risk that ICTs may reinforce existing social and economic inequalities and that people who are being left behind, may be excluded even further. This highlights the importance of integrating the use of ICTs into economic and social development projects of the government. In particular, it will be important to integrate IT capacity-building programmes into rural development, sustainable livelihoods and education projects. This, in turn, makes e-literacy a crucial skill to possess.
E-literacy has been defined in a variety of ways but it generally relates to the skill set required to make efficient use of all the services, materials, tools, information and resources that are available to an individual through the internet.
The penetration of internet, both conventional and mobile, in India has been growing at an increasing rate since the year 2000. Between 2014 and 2015, the number of users grew at a phenomenal 51%. Most of this growth came in the rural mobile internet use, where the number of mobile internet users increased by 93%. According to the Internet Live website, which measures internet users across the word in almost real time, on 15 August this year, India had 46.3 crore internet users. That is a substantial number, however, given our large population, it represents only 34.8% of our total population. It means that a significant number is still digitally in the dark.
The global system for mobile (GSM) communication occasioned the preponderant use of cellular phones in India. It has allowed us to leap-frog the infrastructural constraints of traditional access to internet and ICT and ICT enabled services, and make it available to an ever growing number of our people. The mobile revolution, as well as migration of a number of citizen oriented services to the ICT platform has intensified the need to provide e-literacy to the citizenry. E-literacy in this context will relate to skills, knowledge, attitude entailed in the use of electronic devices such as mobile phone, computer, hand held and other ICT gadgets in personal, civic and occupational situations. Specific e-literacy skills would include electronic data/information entry, storage, retrieval, appreciation and interpretation.
Mandatory use of these skills has been imposed on our citizens in the form of e-government, e-learning, e-health etc. Thus, the lack of e-literacy skills seems more debilitating than basic literacy skills because of the ubiquitous applications of ICT in civic, work and personal situations. Furthermore, ICT has made mobile education, learning for all, open learning, and vocational training more feasible than was previously possible.
With improved e-literacy skills, more individuals can access ICT based skill-development and vocational training programmes. Acquired e-literacy skills will be very useful in data entry and result interpretation of the ubiquitous diagnostic equipment found in all trade occupations. Furthermore, these e-literacy skills are also very useful in effective participation in e-government, e-commerce, e-health and use of personal electronic gadgets.
But above all, e-literacy skills and access to Internet provide the citizen with an almost unlimited amount of knowledge and information. This information is the key to empowering the citizen and for the making of a successful democracy. It is therefore befitting that a network of library should be the hub of the efforts to bring about total e-literacy in the state.
I commend the government of Kerala for setting up this institution in the memory of Shri P N Panicker, who has left an indelible mark in the state and the rest of the country by his contributions to furthering the cause of literacy.
I also appreciate that the PN Panicker Vigyan Vikas Kendra has taken the lead towards realizing the aim of making Kerala the first e-literate state of the country, within a timeframe of 33 months, in collaboration with various organizations from state and the central government, and with active participation of the civil society. I have been informed that the first phase of the e-literacy programme has proceeded as per the schedule and that e-literacy has been achieved in 19 Panchayats, covering some 3.25 lakh people by March 2016.
I am, therefore, very happy to formally launch the second phase of the total e-literacy programme in Kerala today. I am informed that the second stage of total e-literacy programme would involve establishing 100 digital libraries, which will provide resources and information to over 50 lakh villagers in the state.
Kerala has been a pioneer state in terms of ushering in programmes aimed at improving the human condition and empowering the citizens. The quest for 100% e-literacy is reflective of that drive and spirit. It is an outstanding attempt at empowering the citizens and providing them with e-literacy skills that will make it possible for them to participate productively in the global society and the information age.
I wish the project and those associated with it all the very best for the future.
Jai Hind.”
31 Wednesday Aug 2016
Posted Current Affairs, Gujarat, INDIA, NATIONAL NEWS
inUnder the Government of India’s UnnatJyoti by Affordable LEDs for all (UJALA)scheme, Gujarat has become the first state to distribute 2 crore LED bulbs. Gujarat has reached this milestone in just 96 days andover 42 lakh households have already benefitted from the scheme.Energy Efficiency Services Limited (EESL), under the administration of Ministry of Power, Government of India, is distributing approximately 2 lakh bulbs daily in Gujarat which is again a record in itself.
During his speech in Jamnagar the Prime Minister Shri Narendra Modi said, “There is competition between states to outdo each other in terms of LED distribution. Gujarat, in less than 100 days is now leading in terms of LED distribution across the nation. I congratulate the entire team for implementing the LED Bulb programme. I am confident that every household in Gujarat will adopt LEDs and save on electricity bills. The state will save a lot of energy and will also lead the way in helping protect the environment”
The distribution of 2 crore LED bulbs has led to an annual energy savings of 259 crore kWh which is equivalent to lighting up 5 lakh Indian homes for an entire year. Alongside the savings in units, the state has also benefitted from daily CO2 emission reduction of 5,000 tonnes.The programme has also helped the state to avoid 520MW of peak demand.
In Gujarat, 9W LED bulbs are being distributedunder the UJALA scheme. These energy efficient bulbs come with a free 3 year replacement warranty for any technical defect. To avail the bulbs, consumers have an option of paying upfront amount of Rs. 70 per bulb or they can choose an EMI option. Consumers choosing to pay through EMI will have to pay Rs. 75 in total, where an amount of nearly Rs. 20 per LED bulb will be added to their bi-monthly electricity bill for a period of 4 bill cycles. Consumers stand to save nearly Rs. 336 every year on their electricity bills per LED bulb, making the LED bulbs free to the user in just 3 months. The state government aims to distribute 12 crore LED bulbs across the state. This would lead to energy savings of nearly 650 Crore kWh and cost savings of about Rs. 2,500 crore.
The list of other distribution centres can be viewed on www.ujala.gov.in. For any queries or information regarding UJALA consumers can also call on the Gujarat helpline 0265- 2343678. During the distribution period, replacements can be done through any of the distribution counters that are operating within the city.
Under UJALA, over 15 crore LED bulbs have already been distributed across India. This is leading to annual energy savings of 1948 crore kWh and resulting in avoidance of 3,900 MW of peak demand. Through the programme the estimated cumulative cost reduction of bills of consumers, annually is INR 7990 crores
30 Tuesday Aug 2016
Posted BJP, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Political Parties
inఎం కోటేశ్వరరావు
ఒక ఐఏఎస్ అధికారికి రాత్రి పదిగంటల సమయంలో అదీ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా ఫోన్ చేసి రోడ్డు మరమ్మతుల గురించి మాట్లాడటం ప్రస్తుతం మీడియాలో ఒక పెద్ద వార్తగా మారింది. తొలుత కోరా అనే ఒక వెబ్సైట్లో రాసిన కథనం క్రమంగా జాతీయ వార్తగా మారింది.నిజమే ఒక జిల్లా అధికారికి ప్రధాని స్వయంగా ఫోన్ చేయటం అంటే చిన్న విషయం కాదు. ప్రధాని స్వయంగా జోక్యం చేసుకోవటంతో నాలుగు రోజుల్లో రహదారి మరమ్మతులు పూర్తి చేసి లీటరు పెట్రోలు మూడువందల రూపాయలకు, అదే స్థాయిలో ఇతర నిత్యావసర వస్తువులను కూడా కొనుగోలు చేస్తున్న త్రిపుర పౌరుల దుస్థితిని తప్పించి ఎంతో మహోపకారం చేశారన్నది కధనం సారాంశం. అయితే ఈ కధనాన్ని అనేక మంది అదొక కట్టుకధ అని భావించారు, ఇప్పటికీ భావిస్తున్నారు. కాదు నిజమే అని త్రిపుర వున్నతాధికారులు ధృవీకరించినట్లు అక్కడి ఒక పెద్ద పత్రిక రాసింది కనుక నిజమే అని, అనుమానం వున్నవారు దాన్ని చదవ వచ్చని కూడా కొందరు పేర్కొన్నారు. పెద్ద పత్రికలు అసలు అవాస్తవాలు రాయవు అన్నది వారి గట్టి నమ్మకం.
ఈ వుదంతం వాస్తవమా అవాస్తవమా అన్నది తేల్చటం కష్టం .ప్రధాని ఫోను కధనాన్ని నమ్మేవారు తమకు తాము కూడా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఎవరైనా లేవనెత్తిన వాటికి సమాధానం చెప్పాలి. వున్నత పదవులలో వున్నవారి ప్రతిష్ట పెంచటంలో భాగంగా అలాంటి జిమ్మిక్కులు చేయటం ఈ వుదంతంతో ప్రారంభం కాలేదు, గతంలోనూ జరిగాయి, ఇంతటితో ఆగవు. అయితే దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయ మన్నట్లుగా ఎలాంటి ఆలోచన లేకుండా నమ్మేవారికి ఏ సందేహాలు రావు. జనమంతా అలాగే వుండాలని పాలకులు కోరుకుంటారు. అక్కడే వస్తుంది పేచీ. ప్రభువులు ఒక విధంగా ఆలోచిస్తే జనం ఆలోచన మరో విధంగా వుంటుంది.జన కోణం నుంచి ఈ వుదంతాన్ని పరిశీలిద్దాం.
దాదాపు 93వేల కిలోమీటర్ల దూరం వున్న జాతీయ రహదారులలో ఒక రాష్ట్రానికి కీలకంగా వున్న ఒక రహదారిలో 15 కిలోమీటర్ల మేర తక్షణం మరమ్మతులు చేయాలంటే స్వయంగా ప్రధాని జోక్యం చేసుకుంటే తప్ప పని జరగని పరిస్థితి భారత్లో వుంది అని ప్రపంచానికి తెలిసింది. జాతీయ రహదారి కనుక ఈ రోడ్డు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంటుంది. రోడ్ల శాఖకు నితిన్ గడ్గరీ అనే ఒక పెద్దాయన మంత్రిగా వున్నారు. ఆయన కింద పెద్ద యంత్రాంగం వుంటుందని వేరే చెప్పనవసరం లేదు. ప్రధాన మంత్రి రాత్రి పది గంటలకు (ఈశాన్య ప్రాంతంలో ఒక గంట మనకంటే ముందే సూర్యుడు అస్తమిస్తాడు కనుక స్థానిక సమయం పదకొండు గంటలనుకోవాలి.) ఒక జిల్లాలోని ఐఏఎస్ అధికారిని లేపి ఆ సమయంలో అంతరాయం కలిగించినందుకు క్షమాపణ కూడా చెప్పి ప్రధాని మాట్లాడారంటే అప్పటి వరకు కేంద్ర మంత్రి ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నట్లు ?
ప్రధాన మంత్రి అంటే వున్నత స్ధాయిలో జరగాల్సిన దౌత్య నిర్ణయాలు, ఆర్ధిక, రాజకీయ విధానాల వంటి ముఖ్యమైన అంశాలపై కేంద్రీకరిస్తారని మాత్రమే ఇప్పటి వరకు అనుకుంటున్నాము. మరమ్మతులు చేయాల్సిన రోడ్ల వంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా వదలటం లేదంటే మన దేశానికి మంచి రోజులు వచ్చినట్లే. మన వీధిలో మున్సిపాలిటీ, పంచాయతీ వారు చెత్త కుప్పలను ఎత్తివేయకపోయినా, రోడ్ల మీద తిరిగే వట్టి పోయిన ఆవులు పేడవేసినా అవి ప్రధాని దృష్టిలో వుంటాయని, ఏదో ఒక రోజు ప్రతి పారిశుధ్య కార్మికుడికి ఫోన్ వస్తుందని ఆశించటం తప్పుకాదు. కేంద్ర మంత్రులు, అధికారులు పెద్దగా పని చేయనవసరం లేదు, ఎందుకంటే అన్నీ ప్రధాని పట్టించుకుంటారు కదా !
మరమ్మతు చేయాల్సిన రోడ్డు అసోంలో వుంది. ముందే చెప్పుకున్నట్లు జాతీయ రహదారుల నిర్వహణకు ఒక సంస్ధ, దానికి ఒక పెద్ద యంత్రాంగం వుండగా ప్రధాని సంబంధిత అధికారికి ,లేదా అసోం అధికారికి ఫోన్ చేయకుండా త్రిపుర ఛీఫ్ సెక్రటరీని వదలి ఒక జిల్లా అధికారికి ఎందుకు చేశారు? ఇక్కడ ఏం జరిగి వుండాలి. ప్రధాన మంత్రి కార్యాలయంలో లేదా ఇంటి వద్ద పని చేసే అధికార యంత్రాంగానికి రోడ్ల నిర్వహణ అధికార వ్యవస్ధ గురించి తెలిసి వుండకపోవటం, లేదా పని వత్తిడిలో ఆపరేటర్కు రాంగ్ నంబరు ఇచ్చి వుండాలి లేదా విసిగిపోయిన ఆపరేటర్ కనపడిన నంబర్కు కలిపి వుండాలి లేదా నానా ఇక్కట్లు పడుతున్నది త్రిపుర జనం కనుక ఆ రాష్ట్ర అధికారికి కలిపారా అన్నది అది బుర్రవున్నవారు అడగ కూడని ప్రశ్న. లేదా ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే అసోంలో ఇప్పటికే బిజెపి అధికారంలో వుంది కనుక మరో మరో నాలుగున్నర సంవత్సరాల వరకు పట్టించుకోనవసరం లేదు. త్రిపురలో పాగా వేయాలని చూస్తున్న బిజెపికి ఏదైనా మేలు చేయాలంటే ఇబ్బందులు పడుతున్న త్రిపుర జనానికి పాలక సిపిఎం పై ఆగ్రహం కలగాలి. రాష్ట్రం పట్ల ప్రధాని ఎంత శ్రద్ధ చూపుతున్నారో చూడండి, ఆయన స్వయంగా పట్టించుకున్న తరువాతనే రోడ్డు బాగుపడింది, అధికారంలో వున్న సిపిఎం నాయకత్వంలోని వామపక్ష సంఘటన ప్రభుత్వం ఏమీ చేయించలేకపోయింది, బిజెపి ఆ పని చేసిందనే సానుభూతి అక్కడి జనానికి కలగాలని ఆ పని చేశారా ? ఏమో ?
మన అధికార వ్యవస్ధలో ఒక వూరి ముససబు మరోవూరిలో వెట్టి కంటే హీనం అన్న సామెత గురించి తెలిసిందే. ఒకే ప్రభుత్వంలో ఒక శాఖకు సంబంధించి మరో శాఖ జోక్యం చేసుకుంటే దిగువ స్ధాయి గుమస్తా కూడా ఎందుకు చేయాలని ప్రశ్నించే పరిస్ధితి వుంది. అటువంటిది ప్రధాని ఒక జిల్లా అధికారికి ఫోన్ చేసి మరో రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన అధికారులతో పని చేయించి రోడ్డు మరమ్మతుల పని పురమాయించటం ఏమిటి ? అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోడీకి ఈ చిన్న విషయం కూడా తెలియదా ? రంజుగా చెబుతున్న కథను వినాలే తప్పరామాయణంలో పిడకల వేటలా ఇలాంటివి అడగకూడదేమో ?
తాను ఇప్పటికే అసోం, త్రిపుర ప్రభుత్వాలతో మాట్లాడానని కావాల్సిన సాయం అందుబాటులో వుంటుందని ఐఏఎస్ అధికారితో ప్రధాని చెప్పినట్లుగా కధనం వుంది. అంటే ఎవరి చేత పనిచేయించాలో నిర్ణయించేది ప్రధాని కార్యాలయమా? రాష్ట్ర ప్రభుత్వాలా, జాతీయ రహదారుల సంస్ధా ? నిజంగా ప్రధాని కార్యాలయం ఆ రోడ్డు గురించి అంతకు ముందే సంబంధిత రాష్ట్రాల లేదా జాతీయ రహదారుల సంస్ధ అధికారులతో మాట్లాడినపుడే పని చేయించాల్సిన అధికారిని కూడా నిర్ణయిస్తారా ? పోనీ నిర్ణయించిన తరువాత సంబంధిత రాష్ట్ర, సంస్ధ వున్నతాధికారులు తెలియచేసే లోపే ప్రధాని కార్యాలయం సంబంధిత ఐఏఎస్ను కాంట్రాక్టు చేసిందా ? రోజూ ఇలాగే ప్రధాని కార్యాలయం ప్రధానితో అందరితో మాట్లాడిస్తుందా ? తెల్లవారి ఐఏఎస్ అధికారి కార్యాలయానికి వెళ్లే సరికి ఆ సమాచారం అక్కడ వుందట. అదెలా సాధ్యం. అంతకు ముందు రోజు పని వేళల్లో వచ్చి వుంటే తప్ప తపాలాను తెరిచి చూసే వారే వుండరు కదా ? లేదా తెరిచి చూసిన వుద్యోగి అంతటి ముఖ్యమైన సమాచారాన్ని సంబంధిత అధికారికి ఎందుకు చెప్పలేదు ? మరుసటి రోజు సిబ్బందిని తీసుకొని త్రిపుర అధికారి అసోంలో దెబ్బతిన్న రోడ్డు మరమ్మతులు చేయించేందుకు వెళ్లే సరికే అక్కడ అసోం సర్కార్ జెసిబిలను సిద్ధం చేసిందట. కాశీ మజిలీ కధల్లో రాజకుమారులకు, గంధర్వులో ,తపస్సంపన్నమునులో, మారు వేషాలలో వున్న దేవతలు సమకూర్చినపుడు తప్ప ఈ రోజుల్లో అధికార యంత్రాంగానికి ఇలాంటివి సాధ్యమా ?
మొత్తానికి మూడు వందల ట్రక్కుల్లో పరికరాలు, సామాగ్రి వచ్చి నాలుగో రోజుకల్లా రోడ్డు మరమ్మతు పూర్తి అయిందట. కేంద్ర మంత్రి గడ్కరీ ఆ అధికారికి ఫోన్ చేసి ఢిల్లీ వచ్చినపుడు ప్రధాని కార్యాలయానికి రమ్మని ఆహ్వానించారట. ఇదొక ట్విస్టు. పోనీండి సుఖాంతం అయింది. ప్రధాని ఫోన్ చేసింది జూలై 21న అంటే 26వ తేదీ నాటికి రోడ్డు మరమ్మతు పూర్తి అయింది. వెంకయ్య నాయుడికి ఈ సమాచారం తెలిసి వుంటే నరేంద్రమోడీ రెండు సంవత్సరాల పాలనలో సాధించిన విజయాల జాబితాకు దీనిని కూడా జత చేసి సమాచార, ప్రసార శాఖల మంత్రి కనుక వూరూ వాడా టాంటాం చేయించి వుండేవారు.యధాలాపంగా ఈ సమాచారం తెలిసినట్లు దీనిని ఒక నెల రోజుల తరువాత ఒక వెబ్ సైట్ తన కధనంగా రాసింది. అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు ఏం జరిగిందో కూడా చూడకపోతే ఎలా !
దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి అవసరమైన వస్తువులు, ప్రయాణీకుల రవాణాకు కీలకమైన ఈ రహదారికి మరమ్మతులు చేయాలని ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి,అసోం ప్రభుత్వానికి విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని త్రిపుర రవాణాశాఖ మంత్రి మాణికే డే జూన్ 25న విలేకర్ల ముందు వాపోయారు. అంతకు ముందు త్రిపుర గవర్నర్గా వున్న బిజెపి నేత తధాగతరాయ్, త్రిపుర బిజెపి నేతలు కూడా కేంద్ర మంత్రి గడ్కరీ, అసోం ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. కేంద్ర మంత్రి, ప్రభుత్వానికి వందలాది ఇ మెయిల్స్ పంపినా ఒక్కదానికీ సమాధానం రాలేదని డివైఎఫ్ఐ నేత చెప్పారు. పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మూడు నెలలుగా రవాణాకు పనికి రాకుండా రోడ్డు చెడి పోయిందని త్రిపుర పిడబ్ల్యుడి శాఖ మంత్రి బాదల్ సరోజ్ చెప్పారు. ఇంకా అనేక సంస్ధలు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి.పెట్రోలు, డీజిలు, ఇతర నిత్యావసర వస్తువుల కొరతతో పాటు రోజుల తరబడి వందలాది వాహనాలు నిలిపోవటం గురించి మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.
సరైన రోడ్డు సౌకర్యం లేక కొల్కతా రేవు నుంచి బంగ్లాదేశ్కు సరకులను రవాణా చేసి అక్కడి నుంచి త్రిపురకు చేర్చిన వుదంతాలు అనేక వున్నాయి. ఇంతటి కీలకమైన రోడ్డు మరమ్మతు గురించి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై త్రిపుర ప్రజలలో తీవ్ర నిరసన వ్యక్తమైన తరువాతే రోడ్డు మరమ్మతు పూర్తయింది.
ప్రధాని ఫోను కధనాన్ని నమ్మేవారు అంతకంటే తీవ్రమైన విషయాల మీద అధికార యంత్రాంగాన్ని కదిలించాలని కోరుతూ ప్రధాని కార్యాలయానికి లేఖలు రాస్తే వుపయోగం, అది ఎలా స్పందిస్తుందో, పనులు ఎంత త్వరగా తెలుస్తాయో స్వానుభవం పొందవచ్చు.
30 Tuesday Aug 2016
Posted AP NEWS, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics
inTags
ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, ap special status, BJP, jana sena party, Pawan kalyan, tdp
విశ్వసనీయత సమస్య ఎదుర్కొంటున్న పవర్ స్టార్
ఎంకెఆర్
సినిమా వాళ్లు ఏది చేసినా నాటకీయంగా వుంటుంది.అది లేకపోతే జనానికి కిక్కు వుండదు. ప్రేక్షకులకు కిక్కు ఎక్కితేనే పోనీలెమ్మని సినిమాలు చూసిపెట్టి నాలుగు డబ్బులు నిర్మాతల మొహాన వేస్తారు. సినిమా కధ వూహించని మలుపులు తిరిగి వీక్షకులకు వుత్కంఠ కలగ చేసినట్లుగా ఆంద్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనే డాక్యుమెంటరీ కూడా ఆసక్తికలిగిస్తోంది. దీనిలో నటులు, పాత్రలు కాకుండా నిజమైన వ్యక్తులే నటిస్తున్నారు గనుక డాక్యుమెంటరీ అనాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆకస్మికంగా పవర్ స్టార్ పవర్ కల్యాణ్ తిరుపతిలో ఒక సభ జరిపి ఏకపాత్రాభినయంతో ప్రత్యేక హోదా గురించి పోరు ప్రకటన చేశారు. అనేక మందికి ముఖ్యంగా అధికారంలో వున్న తెలుగుదేశం-బిజెపి కూటమికి ఇష్టం లేని మాటలలో ప్రత్యేక హోదా ఒకటి.ఎందుకంటే అది గుర్తుకు వచ్చినపుడల్లా ఆంధ్రప్రదేశ్ జనం ఇంకా దాని కోసం ఎదురు చూస్తున్నారేమో అనే చిన్న అనుమానంతో కొద్ది క్షణాలే అయినా వారి మనసంతా వికలం అవుతుంటుంది.
అన్నట్లు నాటకీయం అంటే తిరుపతి సభకు వారం రోజుల ముందు హైదరాబాదులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమార స్వామి ప్రత్యేకంగా వచ్చి పవన్ కల్యాణ్ను కలిశారు. ఆ సమయంలో వారు మీడియా ముందుకు వచ్చారు. తన కుమారుడి సినిమా విడుదల సందర్భంగా పవన్ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చానని కుమారస్వామి చెప్పారు. కానీ అంతకు ముందే రాబోయే ఎన్నికలలో పవన్ కల్యాణ్ మద్దతును కుమారస్వామి కోరుతున్నట్లు దాని గురించి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అటు న్యూఢిల్లీలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రత్యేక హోదా గురించి తీవ్ర చర్చ, బంద్ జరిగిన సమయంలో పవన్ కల్యాణ్ మౌనంగా వున్నారు. ఈ పూర్వరంగంలో కుమార స్వామితో కలసి మీడియా ముందుకు వచ్చినపుడు పవర్ స్టార్ ఎంతో ప్రశాంతంగా, స్ధిత ప్రజ్ఞుడి మాదిరి ప్రత్యేక హోదా ఇవ్వను అని ఇంకా కేంద్రం స్పష్టంగా చెప్పలేదు, అయినా ఇది సున్నితమయిన అంశం కనుక ఇపుడే మీ మాట్లాడను తగు సమయంలో స్పందిస్తా అని చెప్పి ఎంతో సంయమనం పాటించారంటూ కొందరు విలేకర్లు వ్యాఖ్యానించారు.మరి అలాంటి వ్యక్తికి వారం రోజుల్లో ఏం మార్పులు కనిపించాయి, అదనంగా వచ్చిన స్పష్టత ఏమిటి, సున్నితాంశం కాస్తా తక్షణాంశంగా దాని స్వభావం ఎలా మార్చుకుంది, అసలు ప్రత్యేక హోదా గురించి రాజకీయ పార్టీలు, జనం కూడా మరిచి పోతున్న తరుణంలో పవన్ కల్యాణ్కు గుర్తుకు వచ్చి ఎందుకు ఆగ్రహం వచ్చింది అని అనేక మంది పరిపరి విధాలా ఆలోచిస్తున్నారు. చీకట్లో ఏదైనా చెట్టు తొక్కాడా లేక తెలియకుండా ఎక్కడైనా బోధి వృక్షం కింద కూర్చొని వచ్చారా ? పవన్ కల్యాణే స్వయంగా చెబితే తప్ప తెలియదు, అప్పటి వరకు పది మంది నానా రకాలుగా అనుకుంటూనే వుంటారు.
పుష్కరాల సందర్బంగా తాను స్వయంగా మునిగి జనాన్ని కృష్ణ నీటిలో మునకలు వేయించి ఎంతో పుణ్యం జనం ఖాతాలలో ఎంతో పుణ్యం జమ చేయించిన చంద్రబాబు, ఆయన పరివారం తమకు వచ్చిన ప్రచార కండూతి, ఇతర పుష్కర లాభాల గురించి లెక్కించుకుంటుండగా పవన్ కల్యాణ్ తెలుగుదేశం, బిజెపి పార్టీని కూడా విమర్శించి కాస్త ఇబ్బంది పెట్టారనే చెప్పాలి. ప్రత్యేక హోదా లేదా ప్యాకేజి వస్తుందనీ చెప్పలేరు, రాదనీ చెప్పలేని స్ధితిలో వారు వున్నారు. పవన్ కల్యాణ్ మాటల్లో చెప్పాలంటే మేడమ్ ఎలాగూ లేరు కనుక బిజెపి వారు సార్తో భైంటక్( సమావేశం) ఏర్పాటు చేయిస్తామని మాత్రమే చెప్పగలరు. వారి దగ్గర అంతకంటే మాటలు లేవు.
రాజకీయాల్లోకి రావాలని, చక్రం తిప్పాలని, నాలుగు డబ్బులు చేసుకోవాలని అనేక మంది కోరుకుంటున్నపుడు పవన్ కల్యాణ్ కోరుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఎన్టి రామారావు జనం కోసం సినిమాలను వదులుకొని ఎంతో త్యాగం చేశానని చెప్పుకున్నారు, కానీ ముందు జాగ్రత్తగా వవన్ కల్యాణ్ రాజకీయ, సినిమా నటన రెండూ చేస్తానని చెప్పారు. ఎందుకంటే పెద్ద కుటుంబం కదా ! గత ఎన్నికలలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా రంగంలోకి వచ్చి చివరిదాకా నిలబడినట్లుగా తిరుపతి సభలో ఆ జాబితాలో బిజెపి, తెలుగుదేశం పార్టీలను కూడా జమ చేశారు, ఆ పార్టీలను ఎంత గట్టిగా విమర్శించారు, ఏకి పారేశారు అని కాదు, వాటికి అనుగుణంగా కట్టుబడి వుంటారా లేదా ఆ డైలాగులను పెట్టుబడిగా పెట్టి లబ్ది పొందుతారా అన్నదే సమస్య. రాజకీయాలలో విస్వసనీయతను ఏడు నిలువుల లోతున పాతరేసిన పార్టీలలో బిజెపి, తెలుగుదేశం తక్కువేమీ తినలేదు. వాటినేమీ పట్టించుకోకుండా, తెలిసినా తెలియనట్లు గా గత ఎన్నికలలో వాటి కొమ్ముకాశారు. ఎందుకైనా మంచిది అన్నట్లు స్వంతంగా జనసేన అనే స్వంత పార్టీని ఏర్పాటు చేశారు. మధ్య మధ్యలో కొన్ని డైలాగులు తప్ప ఇంతవరకు తెలుగుదేశం, బిజెపిలను విమర్శించలేదు. అవి చెప్పిన మాటలను ఇంతకాలం గాఢంగా నమ్మటానికి దారితీసిన పరిస్థితులేమిటి ? ఇప్పుడు జ్ఞానోదయం కావటానికి కారణాలేమిటి అన్నది జనానికి సూటిగా చెప్పాలి. అప్పుడే తాను ప్రారంభిస్తానంటున్న ప్రత్యేక హోదా ఆందోళన వెనుక జనం చేరే అవకాశం వుంటుంది. గత ఎన్నికల నాటికీ ఇప్పటికీ వచ్చిన తేడా ఏమిటంటే విస్వసనీయతలేని రాజకీయ నాయకుల సరసన పవన్ కల్యాణ్ కూడా చోటు సంపాదించుకున్నారు. గత ఎన్నికల సందర్భంగా పాకేజి కుదుర్చుకున్నారని విమర్శలు ఎదుర్కొన్న పవన్ కల్యాణ్ మరోసారి అలాంటిదానికి పూనుకోరన్న గ్యారంటీ ఏమిటన్న ప్రశ్న వుండనే వుంది.
రాజకీయాలలో ముందురోజు పొద్దు పోయే వరకు ఎదుటి పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన వారు తెల్లవారే సరికి అదే పార్టీలోకి ఫిరాయిస్తున్నారు, అంతకు ముందు వరకు తాను వున్న పార్టీని అంతకంటే ఎక్కువగా వుతికి పారేస్తున్నారు. ఏమిటీ ఈ విపరీతం అంటే ఈ రోజుల్లో మీకు తెలియందేముంది మాకు ఇష్టం వున్నా లేకపోయినా అధినాయత్వ చెప్పినట్లు చేయాలి కదా అని ఎలాంటి సిగ్గు ఎగ్గూ లేకుండా సమర్ధించుకుంటున్నారు. ఇటువంటి స్ధితిలో గత ఎన్నికల తరువాత ఏడాదికి ఒకసారి వచ్చే సైబీరియా పక్షుల మాదిరి ఇలా వచ్చి అలా ఒక ప్రకటన చేసి పోతున్నారని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ సారి కూడా అలాగే చేస్తారా అని అనుమానిస్తున్నవారు లేకపోలేదు. ఆర్ధికంగా ఇబ్బందులలో వున్న పవన్ కల్యాణ్ ఈమధ్య తాను ఎంతో అభిమానించే ఒక వాహనాన్ని కూడా అమ్ముకున్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి.అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో ఒక పార్టీని స్ధాపించటం అంటే వందల కోట్ల రూపాయలు అప్పనంగా వచ్చిన సొమ్మయినా వుండాలి లేదా ఎన్నికలలో అభ్యర్ధిగా నిలబెడతానని చెప్పి సీట్లు అమ్ముకొని అయినా ఆమేరకు పోగెయ్యాలి. పవన్ కల్యాణ్ దగ్గర అంత సొమ్ము వుందని ఎవరూ అనుకోరు, పోనీ సీట్లు అమ్ముకోవటానికి ఇంతవరకు పార్టీ లేదు, కార్యకలాపాలు లేవు, అన్నింటికీ మించి అప్పుడే ఎన్నికలు లేవు, అధికారానికి వస్తారనే వాతావరణమూ లేదు. బద్దశత్రువులు అనుకుంటున్నవారే జనం కోసం అనే పేరుతో చేతులు కలిపిన విపరీత పోకడల మన కళ్ల ముందే వున్నాయి. పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే తెలుగుదేశం అధికారానికి వస్తే, అధికారానికి వచ్చిన తరువాత జనతా పార్టీ ఏర్పడిన చరిత్రా మన దేశంలో వుంది. అందువలన జనం తలచుకుంటే ఎప్పుడు ఏమైనా జరుగుతుంది. సినిమాలు మారినపుడు డైలాగులు కూడా మారతాయి, ఒక నటుడు ఒకే డైలాగులతో రెండు సినిమాలలో నటిస్తే జనం చూడరని తెలిసిందే. అందువలన బిజెపి, తెలుగుదేశం పార్టీలను విమర్శించినప్పటికీ రాజకీయ చాణక్యంలో భాగంగా పవన్ కల్యాణ్ను ఆకస్మికంగా వారే ప్రయోగించారన్న ప్రచారాలు వున్నాయి.
ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు కల్పిస్తే ఏ ఏ రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయో వెంకయ్య నాయుడు వంటి వారు వారికి పదే పదే గుర్తు చేస్తారు. ఏపికి కల్పిస్తే మోడీని మరో పదకొండు రాష్ట్రాలు అడుగుతాయని మరో మంత్రి చెబుతారు.తాను 21 సార్లు ప్రధానిని కలిశానని, 31 సార్లు కలిశానని మరోసారి అవసరమైతే ఇంకా ఎన్నిసార్లయినా కలుస్తానని, వత్తిడి పెంచుతానని చంద్రబాబు చెబుతూనే వుంటారు. పాకేజీల ప్రహసనమూ తెలిసిందే. బీహార్ ఎన్నికల సమయంలో స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ వేల కోట్ల రూపాయల పాకేజీ ప్రకటించారు. దానిని అమలు జరిపిందీ లేనిదీ తెలియదు.టీ కప్పులో తుఫాను మాదిరి కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు బిల్లుపై చర్చ తరువాత దానిని శీతల గిడ్డంగిలో పెట్టారు. ఒక రోజు బంద్ చేసి జనం కూడా తరువాత మౌనంగా వున్నారు. దీనికి విశ్లేషకులు కొందరు రెండు కారణాలు చెబుతున్నారు. ఒకటి ప్రత్యేక హోదా వస్తే పెద్దగా ఒరిగేదేమీ వుండదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా చెప్పారు. దాని కంటే భారీ పాకేజ్ మెరుగు అని వారితో పాటు వారికి నిత్యం సలహాలు చెప్పే జిగిని లేదా జిగురు జర్నలిస్టులు కూడా సందర్భం వచ్చినపుడు జనం బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
జనంలో ఇంకా ఏదో మూలన ప్రత్యేక హోదా గురించి మోజు వుందని, దాన్ని తాము తీర్చని కారణంగా ప్రతిపక్ష వైసిపి, కాంగ్రెస్ వుపయోగించుకుంటాయామో, దాన్ని అడ్డుకోవాలంటే రాణీగారి అధికారపక్షం మాదిరి రాణీగారి ప్రతిపక్షాన్ని కూడా తామే ఏర్పాటు చేసుకోవాలనే ఎత్తుగడలో భాగంగా తెలుగుదేశం స్క్రిప్టు రాసి, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిందన్నది ప్రచారంలో వున్న ఒక విశ్లేషణ. అయితే తెలుగుదేశం వారు కొందరు పవన్ కల్యాణ్ విమర్శలపై ఘాటుగా ఎందుకు స్పందిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఒక బాణాన్ని వదిలిన తరువాత అది తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుతుందో లేదో తెలియదు. కనుక ఒక జేబులో అనుకూల మరో జేబులో ప్రతికూల ప్రకటనలు, వివిధ పార్టీల జండాలు బొడ్డు చుట్టూ కట్టుకొని తిరుగుతూ ఏది వాటంగా వుంటే దాన్ని బయటకు తీసే రోజులివి. అందువలన కొందరు నేతలు పవన్ ప్రకటనను ఆహ్వానిస్తే ఎంతైనా వ్యాపార వేత్త గనుక దేనికి మార్కెట్లో డిమాండ్ వుంటుందో తెలిసిన వ్యక్తి కనుక టిజి వెంకటేష్ వంటి వారు కాస్త మసాలా దట్టించి డైలాగులు వదులుతున్నారు. గడ్డం పెంచి గడ్డం గీసుకున్నంత సులభం కాదు రాజకీయాలంటే అన్న గడ్డం భాష ఒకటి. దానికి కొద్ది నెలల క్రితం రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఎంత ఖర్చు చేసిందీ బహుశా గుర్తుకు వచ్చి వుంటుంది.
తెలుగుదేశం అనే మర్రి చెట్టు నీడలో తాము ఎదగటం కష్టమనే విషయం బిజెపి నాయకత్వంలో మొదలైందని, తగినంత మెజారిటీ రాదనే కారణంతో ఎన్నికలకు ముందు కలసి నప్పటికీ ఇప్పుడు స్వంతంగా ఎదగాల్సిన అవసరం ఏర్పడిందన్నది ఆ పార్టీలో బహిరంగ చర్చ. అయితే ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ మాదిరే బిజెపి కూడా మోసం చేసిందనే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కారణంగా గతంలో వున్న మోజు చాలా మందికి తీరింది. తాము నేరుగా రంగంలోకి దిగే అవకాశం లేనందున పవన్ కల్యాణ్ అనే బాణాన్ని బిజెపి వారే ప్రయోగించారన్న అభిప్రాయమూ వుంది. దీని వలన తెలుగుదేశాన్ని దెబ్బతీయటం, వైసిపి, కాంగ్రెస్లకు నోరు లేకుండా చేయవచ్చన్న ఎత్తుగడవుంది.రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు ఏదో విధంగా ప్రత్యేక హోదా సమస్యను సాగదీసి చంద్రబాబు వలన దాన్ని సాధించటం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని కలగచేయటం ద్వారా తెలుగుదేశాన్ని దెబ్బతీయటం ఒకటి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా వుత్తుత్తి పాకేజ్లు ప్రకటించి ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన విధంగా అజాగళ స్ధనం మాదిరి పేరుకు ఏదో ఒక హోదా ప్రకటన చేసి దాన్ని పవన్ కల్యాణ్ ఖాతాలో వేసి ఇచ్చింది బిజెపి, తెచ్చింది జనసేన అనే పేరుతో మిగతావారిని పక్కకు పెట్టి తాము రాజకీయ లబ్ది పొందటంగా బిజెపి ఎత్తుగడ వుందన్నది ఒక అభిప్రాయం. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ సంస్ధలను ఏర్పాటు చేయటంలో ఆర్ఎస్ఎస్ అందెవేసిన చేయి. వాటిలో తమ అదుపులో వుండేవారిని ప్రవేశపెట్టి అవసరమైన సందర్భాలలో వుపయోగించుకుంటుంది. తిరుపతి సభలో విమర్శలు చేసినప్పటికీ బిజెపి, తెలుగుదేశం పార్టీలపై గతంలో కాంగ్రెస్ మాదిరి విరుచుకుపడలేదు. ఒకవేళ రానున్న రోజుల్లో విరుచుకుపడినా అది లాలూచీ కుస్తీ మాత్రమే అనే అభిప్రాయమూ వుంది. పవన్ కల్యాణ్కు కుల తత్వం వుందా లేదా అన్నది సమస్య కాదు, ఆయన చేసుకున్న వివాహాలను బట్టి కులతత్వాన్ని అంటకట్టలేరు. కానీ ఆయన వెనుక చేరుతున్న వారిలో కులశక్తులు వున్న వాస్తవాన్ని మాత్రం కాదనలేరు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర రాజకీయాలలో కులం ప్రాధాన్యం వహిస్తున్న కారణంగా అలాంటి విమర్శలు లేదా ఆరోపణలు రావటం సహజం. అధికారం కోసం కులాలు, మతాలను, మూఢనమ్మకాలను పూర్తి స్ధాయిలో వుపయోగించుకుంటున్న రోజులివి.అందువల్లనే అది ఏ రాజకీయ పార్టీ లేదా నేత అయినా ఇప్పుడు విస్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ అందుకు మినహాయింపు కాదు.
నేను సింహం లాంటోడ్ని అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను అదే తేడా మిగతావన్నీ సేమ్ సేమ్టు సేమ్ అన్న డైలాగ్తో జనాన్ని ఆకట్టుకున్న పవన్ కల్యాణ్ తన విశ్వసనీయతను రుజువు చేసుకుంటారా లేక సేమ్ టు సేమ్ అన్నట్లు మిగతా రాజకీయ నేతల మాదిరి తానూ ఒకటే అని నిర్ధారిస్తారా ?ఎటు సాగదీస్తే అటు సాగే మాదిరి గబ్బర్ సింగ్ కాదు రబ్బరు సింగ్ అన్న విమర్శను నిజం చేస్తారా ?
27 Saturday Aug 2016
Posted BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, RELIGION
inTags
ancient science, his government works retrograde, India ancient science, Narendra Modi, narendra modi speaks forward, Science
కార్టూన్ హిందూ పత్రిక సౌజన్యంతో
ప్రధాని కబుర్లు 21వ శతాబ్దానివి, ప్రభుత్వ ఆచరణ వేద కాలానిది
ఎంకెఆర్
పందొమ్మిదవ శతాబ్దపు యంత్రాంగ వ్యవస్ధ ద్వారా మనం 21వ శతాబ్దంలోకి పయనించజాలమని వర్తమాన భారత దార్శనికుడు ప్రధాని నరేంద్రమోడీ నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ‘మారుతున్న భారత్ ‘ వుపన్యాసాల ప్రారంభసభలో చెప్పారు. అందుకు గాను చట్టాలతో పాటు, కాలయాపన పద్దతులను మార్చుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కోరారు. మార్పు విసురుతున్న సవాలును దేశం అధిగమించాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కితే చాలదు, పూర్తి రూపాంతరం చెందాలని కూడా చెప్పారు. దేశం వేగంగా మారాలి, అయితే ఆ అది ప్రభుత్వంలో మార్పు రాకుండా జరగదు, ఆలోచనా ధోరణిలో మార్పు రాకుండా ప్రభుత్వ తీరు మారదు, ఆలోచనా ధోరణిలో మార్పు రావాలంటే పరివర్తన ఆలోచనలు వుండాలని ప్రధాని చెప్పారు. ఇంకా ఇలాంటివే చాలా విషయాలను ప్రధాని తన వుపన్యాసంలో వుద్భోదించారు.
మోడీ సర్కార్పై చేసే విమర్శలన్నీ దేశద్రోహం లేదా జాతి వ్యతిరేకం అని ఆయన భక్తులు ప్రకటించేయకుండా కాస్త నిదానించి వుపన్యాసాలలో ప్రబోధిస్తున్న అంశాలకు అనుగుణంగా ఆయన పాలన నడుస్తున్నదా అన్నది ఆలోచించుకోవాలి. నీతి అయోగ్ ఏర్పాటు చేసిన మారుతున్న భారత్ వుపన్యాస పరంపరలో తొలి వుపన్యాసం చేసిన సింగపూర్ వుప ప్రధాని షణ్ముగం చేసిన వ్యాఖ్యలు వింటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని స్ధితి.ఆయన చేసిన విమర్శలు గత పాలకుల పుణ్యమే అనటంలో ఎలాంటి సందేహం లేదు, కానీ నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలో దానిని మార్చేందుకు చేసిందేమిటి అన్నదే కోటి రూకల లేదా మిలియన్ డాలర్ల ప్రశ్న. అన్నం వుడికిందో లేదో చూడటానికి కుండలోని మెతుకులన్నింటినీ చూడనవసరం లేదు. నరేంద్రమోడీ అట్టహాసంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అమలు ఎంత హాస్యాస్పదంగా మారిందో చూశాము. ఆ పేరుతో వసూలు చేస్తున్న పన్ను ఏమౌతోందో తెలియదు, తొలి రోజుల్లో వీధులూడ్చిన అధికార పార్టీ, వివిధ రంగాల ప్రముఖులు రకరకాల ఫోజులతో తీయించుకున్న ఫొటోలు గోడలకు అలంకార ప్రాయంగా వేలాడటం తప్ప ఎక్కడా కనిపించటం లేదు. సింగపూర్ వుప ప్రధాని మాట్లాడుతూ పాఠశాల విద్య విషయంలో తూర్పు ఆసియా-భారత్ మధ్య చాలా పెద్ద అంతరం వుందని, నిజానికిదొక సంక్షోభం ఇదేమాత్రం సమర్ధనీయం కాదు, సమస్యను నిర్ధారించ వచ్చు, అయితే నిరంతరం బడ్జెట్లు పెంచుకుంటూ పోవటం ద్వారా కాకుండా మెరుగైన వ్యవస్ధ, సంస్కృతిని మనస్సులలో పట్టేట్లు చేయటం ద్వారా పరిష్కరించవచ్చన్నారు. ఇలాంటి విషయాలలో శాస్త్ర పరిజ్ఞానాన్ని ఎంతగానో వుపయోగించుకోవచ్చు. మన దౌర్భాగ్యం ఏమంటే ఘనత వహించిన నరేంద్రమోడీగారి పాలనలో రెండు సంవత్సరాలుగా శాస్త్రీయ సలహా మండలి మూత పడిందంటే ఎన్ని కబుర్లు చెబితే మాత్రం వుపయోగం ఏముంది? దేశ ప్రగతి గురించి ఒంటరిగా తన నివాసంలో ప్రధాని ఒక్కరే కలలు కంటే సరిపోదు. మన ప్రధాని మంచి శాస్త్రీయ సలహాదారులను నియమించుకోవాలని ఈ ఏడాది జనవరిలో ప్రముఖ శాస్త్రవేత్త, భారత రత్న సిఎన్ఆర్ రావు సూచించారు. నరేంద్రమోడీకి ముందు మన్మోహన్ సింగ్ ప్రధానిగా వుండగా శాస్త్రీయ సలహా మండలి అధిపతిగా ఆయన పని చేశారు.http://indianexpress.com/article/india/india-news-india/pm-modi-needs-good-scientific-advisers-cnr-rao/ మన జిడిపిలో కనీసం రెండు శాతం మొత్తాలను శాస్త్ర పరిశోధనలకు కేటాయించాలని ప్రధానులు సైన్స్ కాంగ్రెస్లలో చెప్పటం తప్ప 0.8 లేదా 0.9శాతానికి మించి కేటాయింపులు వుండటం లేదని రావు వేరే సందర్భంగా విమర్శించారు. నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ద్రవ్యోల్బణ రేటుకంటే తక్కువగానే కేటాయింపులను పెంచారు. ఆంటే నిజ విలువలో అంతకు ముందు కేటాయించిన మొత్తాలకంటే తగ్గిపోయాయి.
పందొమ్మిదవ శతాబ్ది వ్యవస్ధ ద్వారా 21వ శతాబ్దంలోకి పయనించజాలమని మోడీ ఎంతో సముచితంగా చెప్పారు. అన్నీ వేదాల్లోనే వున్నాయష అనే కాలానికి చెందిన భావజాలానికి ప్రధానిగా మోడీ తొలిసారి మద్దతు ఇచ్చారు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా గణేషుడికి ఏనుగు తలను అతికించారని, తల్లి గర్బంతో నిమిత్తం లేకుండా కర్ణుడు పుట్టటాన్ని బట్టి వైద్యశాస్త్రం ఆ కాలంలోనే అంతగా అభివృద్ధి చెందినందుకు మనం గర్వపడాలని మోడీ చెప్పారు. అంతకు ముందు ముఖ్యమంత్రిగా వుండగా రాముడు తొలి విమానంలో ప్రయాణించాడని, మనకు పురాతన కాలంలోనే కణ శాస్త్రం తెలుసని స్కూలు పుస్తకాలకు రాసిన ముందుమాటలో రాశారు.
ముంబైలో జరిగిన సైన్సు కాంగ్రెస్లో సంస్కృతంలో పురాతన శాస్త్ర విజ్ఞానం పేరుతో ఒక పూట మహారుషి భరద్వాజ వైమానిక శాస్త్రం గురించి, రైట్ సోదరుల కంటే ముందే మన పూర్వీకులు దేశ సరిహద్దులకు, ఖండాంతరాలకు ఎలా విమానాలు నడిపారు అనేదాని గురించి చర్చలు జరిపి కొంత మంది తమ జబ్బలను తామే చరుచుకున్నారు. పూర్వకాలంలో 40 ఇంజన్లున్న ఖండాంతర విమానాలను మన వారు నడిపారని, వేద కాలంలోనే వుపగ్రహాన్ని మన దేశం నుంచి నడిపారని, ఆ సమయంలో అక్కడ వదలి వచ్చిన ఒక హెల్మెట్ ఇప్పటికీ అక్కడే వున్నదని, అమెరికాలోని నాసా పరిశోధనలు కూడా దీనిని నిర్ధారించాయని, స్టార్ వార్స్ మన దేశంలో ఎప్పుడో జరిగాయని, శవాలు నీటిలో రోజుల తరబడి తేలియాడేవని, అవి వుబ్బిన తీరును బట్టి మరణించిన వారికి ఏం జరిగిందో కచ్చితంగా పూర్వీకులు చెప్పగలిగారని, అగస్త్య సంహితలో ఎలక్ట్రిక్ బ్యాటరీలను ఎలా తయారు చేసేవారో ప్రస్తావించారని వాటిని వేద బ్యాటరీలుగా పిలిచారని, ఆవు మూత్రంలో కొన్ని గింజలు, వేర్లను కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని కాళ్లకు రాసుకొని తిరిగితే భూ గర్బ జలాలు ఎక్కడున్నాయో తెలిసేవని, రూపార్కాన రహస్య పేరుతో వున్న పరిజ్ఞానంతో రాడార్లు తయారు చేసేవారని, ఆహారాన్ని బంగారంగా మార్చే బాక్టీరియా గురించి తెలుసని, గణేషుడికి ఏనుగు తలను కుట్టటానికి బదులు పంచదార చల్లి అతికించారని ఇలాంటి అంశాలన్నింటినీ సైన్సు పేరుతో ముంబై సమావేశంలో నమ్మింప చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. దాని కొనసాగింపుగా ఈ ఏడాది మైసూరులో జరిగిన సైన్సు కాంగ్రెస్లో మఢ్య ప్రదేశ్లో ప్రయివేటు విశ్వవిద్యాలయాల నియంత్రణ కమిషన్ అధ్యక్షుడు అఖిలేష్ కె పాండే కైలాస పర్వతం మీద నుంచి శివుడు తన శక్తితో మానవాళికి స్వచ్ఛమైన నీటిని ఎలా సరఫరా చేస్తున్నారో చెబుతూ ఒక పత్రాన్ని సమర్పించారు. పర్యావరణ పరిరక్షణకు మన పూర్వీకులు ఎంతో కృషి చేశారని, దేవుడు శివుడి కుటుంబ సభ్యులు నెమలి, ఎలుక, ఎద్దులను ఎలా వాహనాలుగా వుపయోగించారో, వాటితో ఎలా సహజీవనం చేశారో నేటి తరాలకు వివరించే పయత్నం చేశారు.
ఇదే సభలో కాన్పూరుకు చెందిన రాజీవ్ శర్మ ఒక పత్రం సమర్పించి శంఖువు వూదటం ద్వారా మానసిక, శారీరక రుగ్మతలను ఎలా నివారించ వచ్చో చూడండని చెప్పారు. ఇలాంటి పత్రాలన్నింటినీ సైన్సు కాంగ్రెస్ నిర్వాహకులు చర్చకు ఆమోదించటాన్ని బట్టి యథారాజా తధా అధికారగణ అన్నట్లుగా తయారైందని వేరే చెప్పనవసరం లేదు. సైన్సు కాంగ్రెస్ల ప్రహసనాన్ని చూసిన తరువాత నోబెల్ బహుమతి గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ మాట్లాడుతూ గతంలో జరిగిన సభలో ఒక రోజు నేను పాల్గొన్నాను, సైన్సు గురించి చాలా తక్కువగా మాట్లాడారు, అదంతా ఒక సర్కస్లా వుంది, మరోసారి నేను సైన్సు సభలకు రాను అని చెప్పారంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత సైన్సుకు పట్టిన గతేమిటో సుస్పష్టం. ఈ పూర్వరంగంలో శాస్త్ర పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించటం అనూహ్యం.
గతంలోనే జ్యోతిష్యాన్ని ఒక కోర్సుగా ప్రవేశపెట్టారు, ఇప్పుడు వేదకాలంలో సైన్సు పేరుతో జనాన్ని నమ్మింప చూసే వారికి పెద్ద పీట వేస్తూ సంస్కృతంలో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికి తీసేందుకు నరేంద్రమోడీ సర్కార్ విశ్వవిద్యాలయాలను ముందుకు నడుపుతోంది. సంస్కృత గ్రంధాలు, పురాణాలలో పేర్కొన్న అంశాల ఆధారంగా చరిత్రను తయారు చేసేందుకు సంఘపరివార్ కార్యకర్త యల్లా ప్రగడ సుదర్శనరావు నేతృత్వంలోని భారతీయ చరిత్ర పరిశోధన మండలి నిర్ణయించింది.ఒకవైపు ఇలాంటి తిరోగమన చర్యలకు శ్రీకారం చుట్టి మరోవైపు భవిష్యత్ గురించి మాట్లాడటం ఆత్మవంచన, పరవంచన తప్ప మరొకటి కాదు. అన్నీ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో వుంటే ఇతర దేశాలతో సాంకేతిక పరిజ్ఞానం గురించి ఒప్పందాలు చేసుకోవటమెందుకు ? ఆ టెక్నాలజీ వుపయోగించి పెద్ద ఎత్తున మేకిన్ ఇండియా కార్యక్రమం కింద తయారు చేసి అలా కనుమూసి ఇలా కనుతెరిచే లోపల పెట్రోలు, పైలెట్లు అవసరం లేని, ఎంత సరకు వేసి మరో టన్నుకు ఖాళీ వుండే వేద విమానాలలో ఖండాంతర దేశాలకు , పట్టణాలకు ఎక్కడకు కావాలంటే అక్కడకు వుచిత రవాణా చేసి మొత్తం ప్రపంచ మార్కెట్ను కొల్ల గొట్టకుండా ప్రధాని విదేశాలు తిరిగి పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టండి,ఎగుమతులు చేసుకోండి అని విదేశీయులను దేబిరించటమెందుకు ? ఇలా చేయటం మన ప్రాచీన భారత చరిత్ర, ఘనతకు అవమానమేమో ?
26 Friday Aug 2016
ఎం కోటేశ్వరరావు
మన దేశంలో అతివలపై అత్యాచారాలు జరగటానికి పశ్చిమ దేశాల వస్త్రధారణే కారణమని అందువల్లనే పట్టణాలలోనే ఎక్కువగా జరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాలలో లేవని ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ ఢిల్లీ నిర్భయ అత్యాచార వుదంతం సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఫాసిస్టు గోబెల్స్ను ఆదర్శంగా తీసుకొని సంఘపరివార్ నేతలు పనిగట్టుకొని ప్రచారం చేసే అసంఖ్యాక పచ్చి అబద్దాలలో ఇదొకటి. అసలు వెలుగులోకి రాని వుదంతాలే అత్యధికం కాగా పోలీసు రికార్డులకు ఎక్కిన వాటిలో 75శాతం గ్రామీణ ప్రాంతాలలో జరిగినవే అని ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి చెందిన మృణాల్ సతీష్ అధికారిక లెక్కలను విశ్లేషించి తేల్చారు. మోహన్ భగవత్ వంటి వారు చెప్పే పాశ్చాత్య వస్త్రధారణకు పెట్టింది పేరు ఫ్రాన్స్. అలాంటి దేశంలో ముఖం తప్ప ఒంటి నిండా బురిఖిని వేసుకొని సముద్ర తీరాలకు వచ్చే ముస్లిం మహిళల చేత బలవంతంగా వందలాది మంది ముందు విప్పించిన ఫ్రెంచి పోలీసుల నిర్వాకం తాజాగా చర్చనీయాంశం అయింది.దీని గురించి నిక్కర్ వాలాలేమంటారో తెలియదు.
Today’s @thetimes cartoon. #burkini #France
ప్రపంచంలో తాలిబాన్లను, తాజాగా రంగంలోకి వచ్చిన ఐఎస్ తీవ్రవాదులను పెంచి పోషించటంలో అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రెంచి పాలకుల వాటా ఎక్కువన్నది అందరికీ తెలిసిందే. పాముకు పాలుపోసి పెంచి నంత మాత్రాన కాటు వేసే దాని సహజలక్షణం ఎక్కడికి పోతుంది. వుగ్రవాదం కూడా అలాంటిదే. పెంచి పోషించిన వారిపైనే తిరగబడుతుందని చరిత్రలో అనేక వుదంతాలు నిరూపించాయి. అదే విధంగా ఇప్పుడు ఈ ధనిక దేశాలు కూడా అనుభవిస్తున్నాయి.కొద్ది మంది వుగ్రవాదులను పట్టుకోవటం చేతగాని పాలకులు మొత్తం ముస్లింలందరూ వుగ్రవాదులే అని తప్పుడు ప్రచారం, వ్యతిరేక వున్మాదాన్ని రెచ్చగొట్టటంతో పాటు వుగ్రవాదంపై పోరులో భాగంగా బురిఖీ, బురఖాలపై దాడులకు దిగారు. (ముస్లిం మహిళలు విధిగా బురఖా వేసుకోవాలనే ఛాందస వాదాన్ని నేను బలపరచను, సామాజిక చైతన్యం, వ్యక్తిగత ఇష్టంపై వేషధారణ అధారపడి వుంటుందని, సంస్కృతి, సాంప్రదాయాల పేరుతో దేనిని బలవంతంగా రుద్ద కూడదు అని భావించేవ్యక్తిని. అలా రుద్దితే ఈ దేశంలోని బ్రాహ్మలెవరూ షర్టూ పాంట్లూ వేసుకోకూడదు, వుద్యోగాలు చేయకూడదు, బిచ్చమెత్తుకొని జీవించాలి.మనువు నిర్ధేశించిన విధంగా మిగతా కులాల వారు కూడా ఇక్ష్వాకుల ముందు కాలం నాటికి పోవాల్సి వుంటుంది. అందువలన అలాంటి వాటికి వ్యతిరేకం అని ముందుగా స్పష్టం చేయదలచుకున్నాను.)
ఇటీవలనే ముగిసిన రియో ఒలింపిక్స్లో దుస్తుల నిబంధనలను పక్కప పెట్టి బీచ్ వాలీబాల్ పోటీలో బురఖాతో పాల్గొన్న ఈజిప్టు క్రీడాకారిణి దోవా ఎలఘోబాషి
ఫ్రాన్స్ విషయానికి వస్తే బురిఖినిలపై నిషేధాన్ని సమర్ధించుకొనేందుకు నానా పాట్లు పడుతోంది. అక్కడి న్యాయవ్యవస్ధ కూడా పాలకవర్గానికి వంతపాడుతోంది. గతవారంలో ఒక బీచ్కు తన పిల్లలతో వచ్చిన ఒక ముస్లిం యువతిని ఆకస్మికంగా నలుగురు పోలీసులు చుట్టుముట్టారు. ఇసుకలో కూర్చుని వున్న ఆమెకు ఏం జరుగుతోందో తెలియలేదు.పోలీసులను చూడగానే భయంతో పిల్లలు ఏడవటం మొదలు పెట్టారు. నాలుగు వైపులా పోలీసులు నిల్చోవటంతో ఆమె ఎటూ తప్పుకొనే అవకాశం కూడా లేదు. తాను చేసిన తప్పేమిటో కూడా ఆమెకు తెలియలేదు. పోలీసులు ఎక్కడైనా ఒకటే కనుక లే ముందు బట్టలు విప్పు అన్నారు. నివ్వెర పోయింది, అదే వేసుకున్న బుర్ఖినీ విప్పు అన్నారు. (బికినీ,బుర్కాను కలిపి సముద్ర స్నానాలు చేసే సమయంలో ఒంటిని పూర్తిగా ప్పుతూ ధరించేందుకు రూపొందించిన ఈత వస్త్రం) చుట్టుపక్కల వారు పోలీసుల ఆదేశాలకు హర్షం వెలిబుచ్చుతూ చప్పట్లతో మరింతగా ప్రోత్సహిస్తున్నారు. అవమాన భారంతో బుర్కినీ విప్పటంతో పాటు అది వేసుకున్నందుకు జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది. ఐరోపా అంటే స్వేచ్ఛా ప్రపంచం అనుకొనే వారికి దిమ్మదిరిగే వుదంతమిది. సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి తాలిబాన్ల దేశంలో బుర్ఖాలు వేసుకోకపోతే శిక్షిస్తారు, దాన్ని విమర్శించే ఫ్రాన్స్లో వేసుకున్నందుకు శిక్షిస్తారు.అంటే రెండు చోట్లా మహిళకు స్వాతంత్య్రం పూజ్యం అన్నమాట. ఒక వేళ నిషేధాన్ని వుల్లంఘిస్తే జరిమానా, హెచ్చరికతో సరిపెట్టవచ్చు, లేదా ఆ ప్రాంతం నుంచి పంపి వేయవచ్చు, అందుకు భిన్నంగా దుస్తులు విప్పించి, జరిమానా వేయటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఫ్రాన్స్లో బుర్ఖినీ వేసుకోవటంపై ఇటీవల నిషేధం విధించారు. దానికి చూపుతున్న కారణాలు హాస్యాస్పదంగా వున్నాయి. బలవంతంగా బుర్ఖినీ విప్పించిన వుదంతం నైస్ పట్టణంలో జరిగింది.మరో 30 పట్టణాలలో ఇలాంటి నిషేధం విధించారు, దానిని కోర్టులు సమర్ధించాయి.తాజా వుదంతంపై తీవ్ర విమర్శలు చెలరేగటం, హక్కుల సంఘాలు ఫిర్యాదు చేయటంతో వున్నత న్యాయ స్థానం నిషేధంపై సమీక్ష జరపాలని నిర్ణయించింది. ఫ్రెంచి చట్టాల ప్రకారం మహిళలు ధరించకూడని వాటిలో బుర్ఖినీ లేదు. గౌరవ ప్రదం కాని దుస్తులపై ఫ్రాన్స్లో నిషేధాలేమీ లేవు. నిబంధనలు స్పష్టంగా లేకపోవటాన్ని అవకాశంగా తీసుకొని ముస్లిం మహిళలను వేధించేందుకు ఫ్రెంచి పోలీసులు ఈ చర్యలకు పాల్పడ్డారనే విమర్శలు వచ్చాయి. బుర్ఖినీ ధరించకపోయినా ఒంటి నిండా దుస్తులు, తలకు స్కార్ఫ్ చుట్టుకున్నందుకు పోలీసులు తనను అడ్డుకున్నారని మరో మహిళ తెలిపింది. దేశ ‘లౌకికత్వాన్ని’ కాపాడటంలో భాగంగా ఈ నిషేధం అన్నది ప్రభుత్వం చెప్పిన కారణాలలో ఒకటి. బుర్ఖినీ ధరించటం బానిసత్వానికి చిహ్నమని ప్రధాని మాన్యువల్ వాల్స్ వర్ణించారు. దేశం ‘సంస్కృతుల యుద్ధం’ (బ్యాటిల్ ఆఫ్ కల్చర్స్)లో చిక్కుకు పోయిందన్నారు.ఐఫోప్ అనే సంస్ధ నిర్వహించిన ఒక సర్వేలో 64శాతం మంది నిషేధాన్ని సమర్ధించారు. శరీరాన్ని పూర్తిగా కప్పి వేసే ఈత దుస్తులు ధరించటమంటే తీవ్రవాద ఇస్లామ్కు మద్దతు ఇచ్చే రెచ్చగొట్టుడు చర్యగా మాజీ అధ్యక్షుడు నికొలస్ సర్కోజీ వర్ణించాడు. కొన్ని పట్టణాలు పరిశుభ్రతా కారణంతో నిషేధించినట్లు పేర్కొన్నాయి. కోర్టులకు వివిధ నగరాలు సమర్పించిన సమర్ధింపు వాదనలలో బుర్ఖినీ ఈత దుస్తులు ప్రజా భద్రతకు ముప్పుగా పరిణమించినట్లు పేర్కొన్నాయి. అయితే అందుకు తగిన ఆధారాలను చూపకుండా భయాన్ని, అనుమానాలను వ్యక్తం చేశాయి.పూర్తిగా శరీరాన్ని కప్పే ఈత దుస్తులు ప్రజా భద్రతకు భంగం కలిగించినపుడు క్రైస్తవ సన్యాసినులు, సన్యాసులు పూర్తి శరీరాన్ని కప్పుతూ ధరించే దుస్తులతో ముప్పు రాదా అన్న ప్రశ్నకు సమాధానం లేదు.
వేషధారణపై ఆంక్షలు, నిషేధాలు ఒక్క ఫ్రాన్స్కే పరిమితం కాదు. స్కూళ్లు, కాలేజీలలో, వాహనాలు నడిపేటపుడు ముఖాలకు మేలిముసుగులు ధరించటాన్ని జర్మనీ ప్రభుత్వం నిషేధించింది. కెనడాలో బురఖాల నిషేధం ఎన్నికల ప్రచార సమస్యగా ముందుకు వచ్చింది. లిబరల్ పార్టీ గెలవటంతో ఆప్రతిపాదనకు స్వస్తి పలికారు. జర్మనీ, ఫ్రాన్స్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండటంతో అక్కడి మితవాద పార్టీలు ముస్లిం,బురఖా వ్యతిరేకతను రెచ్చగొడుతున్న పూర్వరంగంలో అధికారంలో వున్న పార్టీలు తాము కూడా అలాంటి చర్యలే తీసుకుంటున్నట్లు ఓటర్లను సంతుష్టపరిచేందుకు ఇలాంటి తిరోగామి చర్యలకు పాల్పడుతున్నాయి.
24 Wednesday Aug 2016
Posted BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Political Parties
inఎం కోటేశ్వరరావు
మీడియా అంటే జనాలకు నమ్మకం పోతోంది. రాబోయే రోజుల్లో అదింకా వేగం పుంజుకోనుంది. ఎందుకంటే ఎవరి అజెండాను వారు అమలు జరుపుతూ నిజాలను ఏడు నిలువుల లోతున పాతరేస్తున్నారు. కత్తిపీటను కనుగొన్న వారి లక్ష్యం గొంతులు కోయటం కాదు. వంటగదిలో మహిళల పనిని సులభం చేయటానికో, ఇతర అలాంటి వుపయోగం కోసమో వాటిని రూపొందించారు. కానీ కొందరు గొంతులు కోయటానికి వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్, దానిలో సామాజిక మాధ్యమంగా పరిగణించబడే ఫేస్బుక్ వంటి వాటిని కూడా అలాగే దుర్వినియోగం చేస్తున్నారు. తాజా వుదంతం విషయానికి వస్తే కేరళకు చెందిన మళయాల సినీ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ ఒలింపిక్ రజత పతక గ్రహీత పివి సింధుపై చేసిన ఒక వ్యంగ్య వ్యాఖ్యపై చెలరేగిన దుమారం.http://www.opindia.com/ ఈ వెబ్సైట్లో వచ్చే సమాచారం అంతా కమ్యూనిస్టు, వామపక్ష వ్యతిరేకత, బురద చల్లుడు, బిజెపి,ఆర్ఎస్ఎస్ సంఘపరివార్కు అనుకూలమైన రాతలు రాసి జనానికి వడ్డించటం. ఇటీవలి కాలంలో ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేయించిన అనేక వెబ్సైట్లలో ఇదొకటి. దీనిలో సనల్ కుమార్ శశిధరన్ వ్యాఖ్యపై వెబ్సైట్ సిబ్బంది వండి వార్చిన ఒక వంటకానికి Left leaning filmmaker says he will like to spit on PV Sindhu అని పేరు పెట్టారు. దీని అర్ధం ఏమంటే ‘ పివి సింధుపై వుమ్మటాన్ని తాను ఇష్టపడతానని వామపక్ష భావజాలం వున్న సినిమా దర్శకుడు చెబుతున్నాడు ‘. కాళిదాసు కవిత్వానికి తమ వామపక్ష వ్యతిరేక పైత్యం జోడించి మొత్తం వామపక్షంపై తప్పుడు అభిప్రాయం కలిగించటానికి, రాళ్లేయటానికి చేస్తున్న నిరంతర యత్నాలలో ఇదొకటి. ఇంకే ముంది కాషాయ దురద అంటించుకున్నవారు దీన్ని చూసి మరింతగా గోక్కోవటం మొదలు పెట్టి వామపక్ష భావజాలం, వామపక్ష వాదులపై రాళ్లు వేయటం ప్రారంభించారు. ఇలాంటి బాపతుకు వాస్తవం తెలుసుకొనే శ్రద్ధ వుండదు, ఒక వ్యాఖ్య, విమర్శ చేయబోయే ముందు తమకూ ఒక బాధ్యత వుంటుందని భావించరు. వాస్తవం తెలిసిన తరువాత పోనీ దానిని సవరించుకుంటారా అంటే అదీ వుండదు. వారి సాఫ్ట్వేర్ అలాంటిది.
సనల్ కుమార్ శశిధరన్ తాను వామపక్ష వాదిని అని చెప్పుకున్నట్లు ఎక్కడా మనకు గూగులమ్మ దేవత వెతుకులాటలో కనిపించదు. అతనొక సినిమా దర్శకుడు మాత్రమే. ఆ పెద్ద మనిషి చేసిన వ్యాఖ్యపై దుమారం చెలరేగటంతో తట్టుకోలేక తన ముఖపుస్తకం (ఫేస్బుక్ ఖాతాలో పెద్ద వివరణ ఇచ్చుకున్నాడు. సంఘపరివార్ను నిత్యం మోసే జీ న్యూస్ కూడా చివరికి దాని పూర్తి పాఠం ప్రచురించి అసలు శశిధరన్ ఏమి వ్యాఖ్యానించాడు అంటూ ఒక వార్తను ఇచ్చింది. దాని లింక్http://zeenews.india.com/sports/rio-olympics-2016/did-sanal-sasidharan-actually-try-to-humiliate-pv-sindhu-with-spit-remark-heres-the-truth_1921757.html దాని పూర్తి పాఠం ఇలా వుంది.’ మనం చాలా కష్టకాలంలో జీవిస్తున్నాం. వ్యంగ్యాన్ని, హాస్యాన్ని కనీసంగా కూడా అర్ధం చేసుకోలేని జనం మీడియాను ఏలుతున్నారు. సంచలనాత్మక వార్తల కోసం వారు మొహం వాచిపోయి వున్నారు. ఒలింపిక్స్లో పివి సింధు విజయాన్ని న్యూనత పరచాలని ఎవరైతే చూస్తున్నారో ఆ నకిలీ మేథావులు నేను చేసిన వ్యాఖ్యను విమర్శించటాన్ని చూడటం భయం కొల్పేదిగా వుంది. కొన్ని జాతీయ మీడియాలు కూడా నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకోవటం, తప్పుడు వ్యాఖ్యానాలు చెప్పి నాకు వ్యతిరేకంగా వుపయోగిస్తున్నాయి. ఇదంతా కైరాలీ జనం టీవీ ఒక అవాంఛనీయ స్క్రోలింగ్ వేయటంతో ప్రారంభం కావటం విచారకరం. దాన్నొక వామపక్ష మీడియా అని పిలుస్తారు. ఇప్పుడు సంచలనాత్మక మీడియా నన్నొక వామపక్ష భావజాల సినిమా దర్శకుడిగా చెబుతూ ఈ వార్తను నాకు వ్యతిరేకంగా వినియోగిస్తున్నది.నేను చేసిన వ్యాఖ్య ఏమిటో స్పష్టత కలిగి వుండటం, దానికి కట్టుబడి వున్న కారణంగా నా వైఖరిని స్పష్టం చేయాలని నేను అనుకోలేదు. నేనేమి చెప్పానో, దాని అర్ధం ఏమిటో నన్ను అనుసరించే వారికి బాగా అర్ధం అవుతుంది. ఇప్పుడు కొంత మంది స్నేహితులు కూడా నా వ్యాఖ్యలను దుర్వినియోగం చేసిన వారి పాటనే పాడటం విచారకరం.ఇది భయానకమైన పరిస్థితి. వాస్తవంగా నేను ఏం చెప్పానో అర్ధం చేసుకోవటానికి కొన్ని క్షణాలు కూడా ఖర్చు చేయకుండా కేవలం నామీద దాడి చేయటానికి, దుర్వినియోగం చేయటం మాత్రమే కోరుకుంటున్న పిచ్చి గుంపుకు వివరించటం వలన ప్రయోజనం లేదు.నేను ఒకటే విషయం చెప్పదలచుకున్నాను, అదేమిటంటే మన పితృస్వామ్య దేశంలో మొత్తం మహిళా సమాజంలో పోరాడి పతకం సాధించిన మహిళను న్యూనత పరిచే వున్మాదిని కాదు నేను. శతాబ్దాల తరబడి మహిళల అణచివేతతో బాధపడుతున్న ఒక దేశం నుంచి ఆమె పోరాడి ఒలింపిక్స్లో గొప్ప విజయం సాధించటం ఒక గొప్ప విషయం.అత్యాచారాలు, అవమానాలకు గురయ్యే యువతుల వేషధారణ గురించి చర్చించటానికి తొలి ప్రాధాన్యత ఇచ్చే దేశం మనది. గర్భంలోనే ఆడశిశువుల ప్రాణాలు తీస్తున్న సిగ్గుమాలిన వుదంతాలు ఇప్పటికీ జరుగుతున్న దేశం మనది. తోటి పౌరులారా నేను ఇలా చెబుతున్నందుకు మీరు నన్ను దేశ ద్రోహి అని పిలవటం ప్రారంభిస్తారని నాకు తెలుసు, నేను దానికి సిద్ధమే, ఎందుకంటే నా దేశభక్తిని ఎవరి ముందూ నిరూపించుకోవటానికి సిద్దంగా లేను. కానీ నేను పివి సింధు గురించి మాట్లాడిన దానిని పూర్తిగా దుర్వినియోగ పరచిన వార్తలను వ్యాపింప చేయవద్దు. ఇది నిరాధారమైన, పూర్తిగా వాస్తవ విరుద్ధమైది.’
ఈ వివరణ చదివిన తరువాత ఈ దేశంలోని వామపక్షాలు పివి సింధు విజయాన్ని కించపరుస్తాయని మెదడు అరికాల్లో వుంటే తప్ప తలమీద వున్నవారెవరూ అనుకోరు. శశిధరన్ రాజకీయ భావాలేమిటి అన్నదికాదు, ఆయన వ్యాఖ్యలను ఆధారం చేసుకొని వామపక్ష భావజాలంపై దాడి చేయటం గర్హనీయం. వామపక్ష సిద్దాంతాలు, రాజకీయాలను విమర్శించదలచుకుంటే అందుకు వేదికలు వున్నాయి, వాటిపై ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపని చేయవచ్చు. ఇలాంటి సందర్బాలను దాడికి వుపయోగించుకోవటం నీచాతి నీచం.
కొన్ని సందర్భాలలో అమ్మా అన్నా కూడా బూతుగా చిత్రించే దౌర్భాగ్య స్ధితిలో మనం వున్నామన్నది నగ్నసత్యం. హ్యాస్యం, వ్యంగ్యాన్ని భరించే, సహించగలిగే స్ధితికి, అర్దం చేసుకోగల స్ధాయికి మన సమాజం ఎదగలేదు. అసలు అలాంటి ప్రయోగాలు వున్నవనే విషయమే చాలా మందికి తెలియదు. శశిధరన్ చెప్పినట్లు కైరాలీ టీవీ తొలుత ఆయనను తప్పు పట్టింది. దానిని ప్రసారం చేసిన బాధ్యుడికి సైతం ఆ వ్యంగ్యం, హాస్యం తెలిసి వుండకపోవచ్చు. దానిని ఒక వామపక్ష వాది విమర్శగా ప్రసారం చేసే అవకాశమే లేదు. అంతేకాదు శశిధరన్ నిజంగా వామపక్ష వాది అయి వుంటే దానిని ప్రసారం చేయబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి వుండేవారన్నది గ్రహించాలి. శశిధరన్ తన సినిమాలలో మహిళల పట్ల పురోగామి వైఖరిని వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. బహుశా ఆ కారణంగా ఆయను వామపక్ష శిబిరంవైపు నెట్టి దాడికి ఆయుధంగా చేసుకున్నారా ? పురోగామి భావాలు వామపక్షాల సొత్తేమీ కాదు, మానవత్వం వున్నవారెవరైనా కలిగి వుంటారు. మొరటోడికి మల్లె పూవు ఇస్తే ఏం జరుగుతుందో తెలిసిందే కదా ! అందువలన శశిధరన్ చెప్పినట్లు ఆయన గురించి తెలిసిన స్నేహితులే అపార్ధం చేసుకున్నారు కనుక సమాజం, తోటి వారు అర్ధం చేసుకోగలిగిన వ్యంగ్యం, హాస్యం మాత్రమే వుపయోగించాలని కూడా తెలుసుకోవటం అవసరం.
ఇక సామాజిక మాధ్యమంలో ఇష్టపడటాలు(లైకులు) పంచుకోవటాలు(షేర్) వ్యాఖ్యలు చేయటానికి http://www.opindia.com/ వ్యాఖ్యానం అటూ ఇటూ తిరుగుతున్నది. ఇంకా ఇతర వార్తలున్నాయోమో నా దృష్టికి రాలేదు. ఈ వెబ్ సైట్ను ఏర్పాటు చేసింది ఒక సంఘపరివార్ భక్తుడు. కిరాయి రాతగాడు కూడా అయి వుండాలి.అతగాడి పేరు రాహుల్ రాజ్. సంఘపరివార్ను కాపు కాసే, తాను మితవాద స్వరాన్ని అని కాలర్ ఎగరేసి చెప్పుకొనే స్వరాజ్య అనే పత్రికhttp://swarajyamag.com/culture/interview-rahul-raj-co-founder-of-opindia-com సరిగ్గా ఏడాది క్రితం ఇంటర్వూ చేసింది. దానిలో రాహుల్ రాజ్ చెప్పిన ఒక ఆణిముత్యం ఎలా వుందో చూడండి.’ 2013లో ఢిల్లీలో అన్నా హజారే ఆందోళన జరిగిన సమయంలో దానిలో భాగస్వామిని, ఆమ్ ఆద్మీ పార్టీతో వుండాలని నేను అనుకున్నాను.ఆ తరువాత నేను రాజకీయాల గురించి రాయటం ప్రారంభించాను. కానీ కొంత కాలం గడిచాక అరె నేను వుండాల్సింది వారితో కాదని అర్ధం చేసుకున్నాను, అప్పటి నుంచి బిజెపి అనుకూల రాతలు రాయటం ప్రారంభించాను.’ అలాంటి పెద్ద మనిషి సారధ్యంలో నడిచే వెబ్ సైట్లో వామపక్ష భావజాలంపై రాళ్లు వేయించటం, నాలుగు రాళ్లు సంపాదించుకోవటం అతని వృత్తి. అలాంటి వారి వెబ్ సైట్ నుంచి వార్తలను చదివి బుర్రను వుపయోగించుకుండా తప్పుడు వ్యాఖ్యలు చేసే వారిని ఏమనాలి ?
19 Friday Aug 2016
Posted Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Prices
inGlobal Crude oil price of Indian Basket was US$ 47.75 per bbl on 18.08.2016
The international crude oil price of Indian Basket as computed/published today by Petroleum Planning and Analysis Cell (PPAC) under the Ministry of Petroleum and Natural Gas was US$ 47.75 per barrel (bbl) on 18.08.2016. This was higher than the price of US$ 46.74 per bbl on previous publishing day of 17.08.2016.
In rupee terms, the price of Indian Basket increased to Rs. 3189.36 per bbl on 18.08.2016 as compared to Rs. 3126.79 per bbl on 17.08.2016. Rupee closed stronger at Rs. 66.79 per US$ on 18.08.2016 as against Rs. 66.90 per US$ on 17.08.2016. The table below gives details in this regard:
Particulars | Unit | Price on August 18, 2016 (Previous trading day i.e. 17.08.2016) | Pricing Fortnight for 16.08.2016
(July 28, 2016 to Aug 10, 2016) |
Crude Oil (Indian Basket) | ($/bbl) | 47.75 (46.74) | 40.73 |
(Rs/bbl | 3189.36 (3126.79) | 2723.62 | |
Exchange Rate | (Rs/$) | 66.79 (66.90) | 66.87 |