• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: October 2020

బీహార్‌ ఎన్నికల సమరం : నితీష్‌ కుమార్‌ను -మాయం – చేసిన బిజెపి !

29 Thursday Oct 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

Bihar Elections 2020, BJP, JDU, LJP, Nithish Kumar, RJD


ఎం కోటేశ్వరరావు


చాణక్య భూమి బీహార్‌. అన్ని ప్రధాన పార్టీలు అపరచాణక్య ఎత్తులు, జిత్తులతో తలపడుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ముగిసింది. ఏకపక్షం అనుకున్న ఎన్నికలు ఎన్‌డిఏ కూటమికి వణుకుపుట్టిస్తున్నాయి. అక్టోబరు 28న జరిగిన తొలిదశ 71 స్ధానాల ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమి వెనుకబడిందని వార్తలు వచ్చాయి. కరోనాను లెక్క చేయకుండా గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కంటే ఎక్కువగా 55.69శాతం పోలింగ్‌ జరిగింది. నితీష్‌ కుమార్‌ను వదిలించుకోవాలనే ఓటర్ల వాంఛకు ఇది నిదర్శనమా ? నితీష్‌ కుమార్‌-నరేంద్రమోడీ కూటమిని గెలిపించాలనే ఉత్సాహం ఎక్కడా కనిపించటం లేదని పోలింగ్‌కు ముందు వచ్చిన వార్తల నేపధ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.


బిజెపి అంతర్గత సర్వేలలో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పట్ల ఓటర్లలో వ్యతిరేక భావం ఉందని వెల్లడి కావటం, మరికొన్ని సర్వేలలో కూడా అదే ప్రతిబింబించటంతో తొలి దశ ఓటింగ్‌కు రెండు రోజుల ముందు దర్శనమిచ్చిన బిజెపి పోస్టర్లలో నితీష్‌ కుమార్‌ మాయం అయ్యారు. నరేంద్రమోడీ చిత్రమే దర్శనమిచ్చింది. ఇది జెడియు శ్రేణులకు ఆగ్రహం తెప్పించిందని, అయితే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో మౌనంగా ఉన్నారని వార్తలు వెలువడ్డాయి. బిజెపి అభ్యర్ధుల మీద జెడియు కార్యకర్తలు ప్రతీకారం తీర్చుకుంటారా ? చాణక్య భూమిగా పేరు గాంచిన బీహార్‌ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.


కరోనా లాక్‌ డౌన్‌ ముగిసినా ఇంకా కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి. దాని ప్రతికూల ప్రభావాలను జనం ఇంకా మరచి పోలేదు. ఎన్నికల ప్రకటన సమయంలో జెడియు నేత నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని ఎన్‌డిఏ కూటమి విజయం సాధించనుందంటూ సర్వేల పేరుతో తొలి ప్రచారబాణం వదిలారు. మూడు దశల్లో జరిగే ఎన్నికల్లో అక్టోబరు 28న తొలి దశ, నవంబరు మూడున మలి, ఏడున మూడవ చివరి పోలింగ్‌ ముగిసి పదవ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అమెరికాలోనే సర్వేలు గాడి తప్పాయి. మన దేశం సంగతి, ప్రత్యేకించి బీహార్‌ సంగతి సరేసరి. గత సర్వేలన్నీ నిజం కాలేదు. అంధులు ఏనుగును వర్ణించిన మాదిరి తొలి దశ ప్రచార ముగింపులో కూడా కొన్ని సంస్ధలు సర్వేల వివరాలను వెలువరించాయి. చివరి క్షణం వరకు ఎటూ తేల్చుకోని ఓటర్లు కొందరు ఉంటారు. వారిని ఆకర్షించటం కోసం ఇలాంటి జిమ్మిక్కులను పార్టీలు ప్రయోగిస్తుంటాయి.


ఎన్నికల ప్రకటన నాటికి-తొలి దశ నాటికీ పోలికే లేదన్నది స్పష్టం. నితీష్‌ కుమార్‌తో అధిక సీట్ల కోసం బేరం పెట్టిన లోక్‌జనశక్తి పార్టీ అది వీలుగాకపోవటంతో అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు తిరుగుబాటు జెండా ఎగురవేసి జెడియు పోటీ చేస్తున్న అన్ని స్ధానాల్లో అభ్యర్ధులను నిలిపింది. మిగిలిన చోట్ల బిజెపి అభ్యర్ధులను బలపరుస్తానని, తరువాత ఇద్దరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మరోవైపు ఆర్‌జెడి-కాంగ్రెస్‌ కూటమితో వామపక్షాలు సర్దుబాటు చేసుకుంటాయా లేదా అన్న సందేహాలు కూడా తొలగిపోయి సజావుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలకు పైగా పదవిలో ఉన్న నితీష్‌ కుమార్‌ కుల రాజకీయాలతో పాటు, తాను లౌకిక వాదిని అని చెప్పుకొనేందుకు కొన్ని అంశాలతో విబేధించినా బిజెపితో కలసి అధికారాన్ని పంచుకొని మతవాసనలను కూడా అంటించుకున్నారని, అవినీతి పాలనకు తెరతీశారనే తీవ్ర విమర్శలు ఉన్నాయి.


బిజెపి ఆశలు పెట్టుకున్నట్లు ఈ ఎన్నికల్లో మోడీ గాలితో ఓట్లు వస్తాయా ? బీహార్‌ విషయానికి వస్తే మోడీ అధికారానికి వచ్చిన ఏడాది తరువాత జరిగిన 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిపోయింది. ఆ పార్టీ దీర్ఘకాలం అధికారంలో ఉన్న రాజస్దాన్‌, చత్తీస్‌ఘర్‌,మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ పలుకుబడి పని చేయలేదు. రెండోసారి పెద్ద సంఖ్యలో సీట్లతో గెలిచిన తరువాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ వలన బిజెపి సాధించిందేమీ లేదు. బీహార్‌లో దానికి భిన్నంగా ఎలా ఉంటుందన్న ప్రశ్నలకు బిజెపి వద్ద సమాధానం లేదు. నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎన్నికల ప్రకటన తరువాత మరింతగా కనిపిస్తోంది. చాణక్యుడిగా భావించే అరవై తొమ్మిది సంవత్సరాల నితీష్‌ కుమార్‌ రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు.

లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) విషయానికి వస్తే తాము ఎన్‌డిఏ, బిజెపి నుంచి విడిపోలేదని, నితీష్‌ కుమార్‌ను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని పదే చెబుతోంది. తాను గతం కంటే బలపడ్డాననే అంచనాకు వచ్చిన బిజెపి నితీష్‌ కుమార్‌ను వదిలించుకొనే ఎత్తుగడలో భాగంగానే ఎల్‌జెపిని రంగంలోకి దింపిందని, నితీష్‌ కుమార్‌ పార్టీతో నిమిత్తం లేకుండానే ఎల్‌జెపితో కలసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనే అంచనాలో ఉందన్నది ఒక అభిప్రాయం. ఎన్నికల ప్రకటన వరకు కలసి ఉండి విడిపోతే ఇద్దరం నష్టపోతామనే భయంతో నితీష్‌ను ఎన్నికల వరకు ఒక ముసుగుగా బిజెపి ఉపయోగించుకుంటోందని, ఫలితాలను బట్టి చూసుకోవచ్చు లెమ్మని భావిస్తున్నదని చెప్పేవారూ లేకపోలేదు.రాముడికి హనుమంతుడు ఎలానో తాను నరేంద్రమోడీకి అలాంటి వాడినని తన గుండెను చీలిస్తే మోడీయే ఉంటారని ఎల్‌జెపి నేత చిరాగ్‌ పాశ్వాన్‌ తన ప్రభు భక్తిని ప్రదర్శించుకున్నాడు.

రంగంలోకి దిగిన తరువాత నితీష్‌కు పరిస్ధితి గడ్డుగా ఉందని అర్ధమైందని అందుకే స్ధిమితం కోల్పోయి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని భావిస్తున్నారు. ఒక సభలో మీరు ఓట్లు వేస్తే వేయండి లేకపోతే లేదు, అల్లరి చేయవద్దని విసుక్కున్నారు.కొడుకు కోసం ఏడెనిమది మందిని కన్నారు అంటూ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గురించి పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఆర్‌జెడి నేత, లాలూ కుమారుడైన తేజస్వి యాదవ్‌ తిప్పి కొడుతూ ప్రధాని నరేంద్రమోడీకి కూడా తోడబుట్టిన వారు ఎక్కువగానే ఉన్నారని,నితీష్‌ వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించి అయి ఉండవచ్చన్నారు.


బీహార్‌లో ఉన్న సంక్లిష్ట రాజకీయ పరిస్దితుల్లో రాష్ట్ర మంతటా పార్టీ విస్తరించకపోయినా 20శాతానికి లోబడి ఓట్లు ఉన్న నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా అంతకాలం పదవిలో ఉండటం సాధ్యమైంది. ఆర్‌జెడి-బిజెపి మధ్య పోరులో నితీష్‌కు అవకాశం వచ్చింది. కొందరు ఇది నితీష్‌ చాణక్య నీతి అంటారు. బీహార్‌లో లాలూ, నితీష్‌, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ముగ్గురూ మండల రాజకీయాల నుంచి ఎదిగినవారే.
సర్వేలను పూర్తిగా నమ్మనవసరం లేదు గానీ కొన్ని సర్వేల తీరు ఆసక్తికరం.2010లో నితీష్‌ కుమార్‌కు మద్దతు పలికిన వారు 77శాతం, 2015లో 80శాతం ఉన్నట్లు అప్పటి సర్వేలు తెలిపాయి. ప్రస్తుతం 52శాతానికి పడిపోయింది.లోక్‌నీతి-సిఎస్‌డిఎస్‌ సర్వే తిరిగి నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నవారు 38శాతమే అని వద్దంటున్నవారు 43శాతమని పేర్కొన్నది. సిఓటర్‌ సర్వే ప్రభుత్వ పనితీరుతో సంతోషంగా ఉన్నామని చెప్పింది 25శాతం, ఆశాభంగం చెందామన్నవారు 46శాతం అని పేర్కొన్నది ఈ కారణంగానే నితీష్‌తో ఇంక ప్రయోజనం లేదని బిజెపి ఎన్నికల గోదాలోకి దిగిన తరువాత భావిస్తున్నట్లు చెబుతున్నారు.


బీహార్‌లో మండల్‌- కమండల్‌ రాజకీయాలు పెద్ద ఎత్తున నడిచాయి. మండల్‌ త్రయంలోని నితీష్‌, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కమండలం పంచన చేరారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఒక్కరే మిగిలారు. బీహార్‌లో అరాజక శక్తులు చెలరేగిన మాట వాస్తవం. దానికి లాలూ కారకుడని చెప్పినప్పటికీ మిగిలిన నేతలు తప్పించుకోలేరు. ఉత్తర ప్రదేశ్‌ ఏమీ దానికి తక్కువ కాదు. రెండు చోట్లా భూస్వామిక శక్తులు బలంగా ఉన్నాయి. వాటిని ప్రతిఘటించటాన్ని కూడా అరాచకంగానే చిత్రించారు. పేదల పోరాటాలను అణచేందుకు భూస్వామిక శక్తులు కులాల వారీ బీహార్‌లో ప్రయివేటు సాయుధ ముఠాలను పెంచిపోషించాయి. దాడులకు పాల్పడ్డాయి. ప్రతిఘటించిన వారిని అరాజక శక్తులుగా వర్ణించారు. ప్రయివేటు సాయుధ ముఠాలను సమర్ధించిన వారిలో నితీష్‌ తక్కువ తినలేదు, బిజెపి నేతలుగా ఉన్న వారూ దూరంగా లేరు. ఇప్పుడు అలాంటి ముఠాలన్నీ దారి మార్చి ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేసి మామూళ్లు వసూలు చేస్తున్నాయని ఈ ఎన్నికల సందర్భంగా జనం చెబుతున్నారు. నితీష్‌-బిజెపి కూటమి పాలన మీద పెరిగిన వ్యతిరేకతకు ఇది కూడా ఒక కారణమే.
బీహార్‌ కుల సమీకరణలకు పెట్టింది పేరు. వామపక్షాలు మినహా మిగిలిన పార్టీలేవీ వాటికి అతీతంగా లేవు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్ధితుల్లో ఏ కులం అభ్యర్ది అయినా నితీష్‌ కుమార్‌ నిలబెట్టిన వారిని ఓడిస్తారా లేదా అన్నదే ప్రధానంగా చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి.లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ నిరంతరం నితీష్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కారణంగా ఆ పార్టీ పోటీ చేస్తున్న చోట కూడా ఓటర్లు జెడియును ఓడించే అభ్యర్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు బహిరంగంగానే చెబుతున్నారని బీహార్‌లో పర్యటించిన జర్నలిస్టులు రాస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిగానూ, ఎన్‌డిఏ సారధిగా నితీష్‌ కుమారే అని ప్రకటించిన కారణంగా బిజెపి పోటీ చేస్తున్న చోటకూడా అసంతృప్తి చెందిన సాధారణ ఓటర్లకు నితీషే కనిపిస్తారు.

ఖండించినప్పటికీ బిజెపి-ఎల్‌జెపి మధ్య రహస్య ఒప్పందం ఉందనే ఊహాగానాలు మరింతగా పెరుగుతున్నాయని బిజెపి పక్కా మద్దతుదారు అయిన స్వరాజ్య పత్రిక ఒక విశ్లేషణకు శీర్షికగా పెట్టింది. పది రోజుల వ్యవధిలో రెండు సార్లు ఇదే అంశం గురించి ఆ పత్రిక రాసింది. తాజా విశ్లేషణలో వ్యాఖ్యాత పేర్కొన్న అంశాల సారం ఇలా ఉంది. తొలుత ప్రచారంలో భాగంగా బిజెపి ఏర్పాటు చేసిన బ్యానర్లు, ముద్రించిన పోస్టర్లు, మీడియా వాణిజ్య ప్రకటనలలో నరేంద్రమోడీతో పాటు నితీష్‌ కుమార్‌ చిత్రానికి సమాన ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి దశ ఎన్నికలు దగ్గరపడే ముందు ప్రచురించిన వాటిలో కేవలం నరేంద్రమోడీ చిత్రమే ఉంది. వీటిని చూసి జెడియు నేతలు హతాశులయ్యారు గానీ మౌనం వహించారు. తొలి దశ ఎన్నికలకు ముందు ఇలాంటి వాటి మీద వ్యాఖ్యానించటం సరైంది కాదని, ఈ చర్య తమను గాయపరించిందని, బిజెపి-ఎల్‌జెపి మధ్య రహస్య ఒప్పందం ఉందన్న అభిప్రాయం బలపడేందుకే ఇది దోహదం చేస్తుందని జెడియు అగ్రనేత ఒకరు చెప్పారు.కేవలం మోడీ బొమ్మలతో ప్రచారం చేయటం తనకు సంతోషం కలిగిస్తున్నదని, మా బిజెపి మిత్రులు నితీష్‌ కుమార్‌ నష్టదాయకం అని గ్రహించారని ఎల్‌జెపి నేత చిరాగ్‌ పాశ్వాన్‌ వ్యాఖ్యానించారు. బీహార్‌లో ఎన్‌డిఏ నుంచి ఎల్‌జెపి బయటకు పోయిన తరువాత కేంద్రంలో కూడా ఆ పార్టీని బహిష్కరించాలని నితీష్‌ కుమార్‌ డిమాండ్‌ చేసినా బిజెపి తిరస్కరించటంతో పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది. ఎన్నికల తరువాత బిజెపి-ఎల్‌జెపి ప్రభుత్వం ఏర్పడుతుందన్న ప్రకటనలు ఖండించదగ్గ పెద్దవి కాదని బిజెపి కొట్టిపారవేస్తోంది. చిరాగ్‌ పాశ్వాన్‌ గురించి నరేంద్రమోడీ ఎలాంటి ప్రస్తావనలు చేయకపోవటంతో జెడియు నేతలు ఆశాభంగం చెందారు. ఇరవై ఒక్క మంది బిజెపి తిరుగుబాటుదార్లకు చిరాగ్‌ సీట్లు ఇచ్చారు. ఊహాగానాలను బిజెపి నేతలు గట్టిగా ఖండించలేదని జెడియు నేతలు చెప్పారు. ఎల్‌జెపి నేతలు తాము పోటీ చేస్తున్న చోట్ల ఎన్నికల తరువాత తాము బిజెపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అందువలన మోడీ మద్దతుదారులు తమకు ఓటు వేయాలని కోరుతున్నారు.


బిజెపి వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకుంటుంది. అయితే బీహార్‌ ఎన్నికల్లో అది పోటీ చేస్తున్న 110 స్దానాల్లో 51 మంది అగ్రవర్ణాలుగా పరిగణించబడుతున్నవారికే ఇచ్చింది. జనాభాలో వారు కేవలం 16శాతమే. ఇరవై రెండు మంది రాజపుత్రులు,15 భూమిహార్లు, 11 మంది బ్రాహ్మలు, ముగ్గురు కాయస్ధులు ఉన్నారు. 2015 ఎన్నికల్లో 157 స్ధానాలకు పోటీ చేసిన ఆ పార్టీ 65 మంది ఈ సామాజిక తరగతుల వారికే సీట్లు ఇచ్చింది. గత మూడు దశాబ్దాలుగా లాలూ ప్రసాద్‌ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడింది వారే గనుక మిగతావారి కంటే వారికే ప్రాధాన్యత ఇవ్వటం సహజమే అని బిజెపి నేతలు సమర్ధించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న బీహార్‌కు చెందిన సినిమా నటుడు సుశాంత సింగ్‌ రాజపుత్‌ ఉదంతాన్ని పెద్ద ఎత్తున వివాదాస్పదం చేసి లబ్ది పొందేందుకు బిజెపి ప్రయత్నించిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బిజెపి మిత్రపక్షమైన జెడియు పోటీ చేస్తున్న 115 స్ధానాలలో ఈ సామాజిక తరగతులకు కేవలం 19 మాత్రమే ఇచ్చారు.


దేశంలో తొలిసారిగా సంఘపరివార్‌ శక్తులకు లోక్‌సభలో తిరుగులేని మెజారిటీ వచ్చింది. నాలుగు ఉన్నత రాజ్యాంగ పదవుల్లో వారే ఉన్నారు. బలం లేని స్ధితిలో బిజెపి నేతలుగా ఉన్న అతల్‌-వాజ్‌పేయి ద్వయానికి ప్రస్తుత మోడీ-షా ద్వయం పని తీరు, ఎత్తుగడల్లో ఎంతో తేడా ఉంది. సంఘపరివార్‌ అసలు రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎవరినైనా ఉపయోగించుకోవటం, అవసరం తీరిన తరువాత పక్కన పడేయటాన్ని చూస్తున్నాము. బీహార్‌లో బిజెపి పెరుగుదల లేదా స్ధిరపడటానికి నితీష్‌ ఎంతగానో సహకరించారన్నది స్పష్టం. అంతర్గతంగా బిజెపి చేయించిన సర్వేలలో పరిస్ధితి క్లిష్టంగా ఉన్నట్లు తేలిందనే వార్తలు వచ్చాయి. మూడింట రెండువంతుల మెజారిటీ తమ కూటమికి వస్తుందని, ఏ పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చినా నితీష్‌ కుమారే తిరిగి సిఎం అని పార్టీ అగ్రనేతలు చెప్పినప్పటికీ వారి అనుమానాలు వారికి ఉన్నాయి. అందుకే నితీష్‌ కుమార్‌ గురించి చిరాగ్‌ పాశ్వాన్‌ ఎన్ని మాట్లాడుతున్నా నోరు మెదపటం లేదు. ఎన్నికల తరువాత తమను వదిలించుకొని ఆర్‌జెడి నాయకత్వంలోని కూటమితో నితీష్‌ కుమార్‌ చేరితే ఏమిటనే ఆందోళన కూడా బిజెపిలో లేకపోలేదు. గత ఎన్నికల్లో ఆర్‌జెడితో కలసి పోటీ చేసి బిజెపితో చేతులు కలిపిన పెద్దమనిషి మరోమారు అదే పని చేయరని ఎవరు చెప్పగలరు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భారత్‌ బెకా ఒప్పందం – అమెరికా కూటమికి గ్జీ జింపింగ్‌ హెచ్చరిక !

27 Tuesday Oct 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

BECA, BECA agreement, Quad, Quadrilateral Security Dialogue, Xi Jinping warning to US and its allies


ఎం కోటేశ్వరరావు


ఉపగ్రహాల ద్వారా సేకరించే భౌగోళిక, ఇతర సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకొనేందుకు ఉద్దేశించిన -బెకా- ఒప్పందం మీద భారత్‌- అమెరికాలు సంతకాలు చేశాయి. రెండు దేశాల మిలిటరీ, ఇతర సంబంధాలలో దీన్నొక మలుపుగా పరిగణిస్తున్నారు. సులభ భాషలో చెప్పాలంటే ఇప్పటి వరకు అమెరికా మనకు అనధికారికంగా అందచేస్తున్న సమాచారాన్ని మరింత వివరంగా అధికారికంగా అంద చేయనుంది. లడఖ్‌ సరిహద్దుల్లో చైనా కదలికల గురించి ఇప్పటి వరకు మీడియాకు అందచేసిన సమాచారం, చిత్రాలు, భాష్యాలు అన్నీ కూడా అమెరికా సంస్ధలు అందచేసినవే అన్నది తెలిసిందే. ఏదీ ఊరికే రాదు అన్నట్లుగా అమెరికా నుంచి పొందే సమాచారానికి మనం ఏ రూపంలో ప్రతిఫలం లేదా మూల్యం చెల్లించాల్సి ఉంటుందో వెల్లడికావాల్సి ఉంది. బెకా ఒప్పందం గురించి చాలా కాలంగా రెండు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. దీంతో అమెరికాతో మన మిలిటరీ బంధానికి మరో ముడి పడుతుంది.

మాతో పెట్టుకుంటే కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ తీస్తాం జాగ్రత్త. ఇదీ చైనా అధినేత గ్జీ జింపింగ్‌ చేసిన తాజా హెచ్చరిక. పరస్పర ప్రయోజనాలు ఇమిడి ఉన్న నౌకా సంబంధ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యల సమన్వయం, సజావుగా సాగే సరఫరా వ్యవస్ధలు, మానవతా పూర్వక మరియు ప్రళయాలు సంభవించినపుడు సాయం కోసం అనే పేరుతో అమెరికా, జపాన్‌,ఆస్ట్రేలియా, భారత్‌ ఒక చతుష్టయ లేదా చతుర్భుజ (క్వాడ్‌) కూటమిగా మరింత ముందుకు పోయేందుకు నిర్ణయించుకున్న నేపధ్యంలో గ్జీ ఈ హెచ్చరిక చేశారు. ఒక దేశం పేరు పెట్టి అనకపోయినా నాలుగుదేశాలు, ప్రత్యేకించి అందరినీ కూడగడుతున్న, రెచ్చగొడుతున్న అమెరికా గురించి అన్నది స్పష్టం.


ఏదో ఒక సాకుతో చైనాను రెచ్చగొడుతున్న అమెరికా దక్షిణ చైనా సముద్రంలో తన యుద్ద నౌకల విన్యాసాలు జరుపుతున్నది. ఇటీవలి కాలంలో చైనా మీద నెపం మోపేందుకు లడఖ్‌లో జరిగిన పరిణామాలను పదే పదే ఉదహరించటం తప్ప మరొకటి లేదు. మీరు చైనా మీదకు దూకండి మీ వెనుక మేము ఉన్నాం అంటూ మన దేశాన్ని పురికొల్పుతున్నది. నాలుగుదేశాల కూటమిని మిత్ర చతుష్టయంగా పిలుస్తున్నారు. అయితే ఇది దుష్ట చతుష్టయం అని చైనా పరిగణిస్తున్నది. బహుశా ఆప్రచార ప్రభావం లేదా అంతర్గతంగా జరుగుతున్న చర్చల సారం కావచ్చు ఉత్తర ప్రదేశ్‌ బిజెపి అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ పాకిస్ధాన్‌, చైనాలతో యుద్దానికి ప్రధాని నరేంద్రమోడీ తేదీని కూడా ఖరారు చేశారని చెప్పినట్లు సాక్షాత్తూ ఆర్నాబ్‌ గోస్వామి రిపబ్లికన్‌ టీవీ పేర్కొన్నది. అతగాడేమీ గల్లీ నేత కాదు, ఆ వార్తను ప్రసారం చేసిన టీవీ బిజెపి అనధికారవాణి తప్ప మరొకటి కాదు. సామాజిక మాధ్యమంలో కాషాయ దళాల యుద్ద ప్రేలాపనల గురించి చెప్పనవసరం లేదు.

కొరియా ఆక్రమణకు పూనుకున్న అమెరికన్లను ఎదిరించి చైనా సాధించిన విజయానికి 70 ఏండ్లు నిండిన సందర్భంగా అక్టోబరు 23వ తేదీన బీజింగ్‌ గ్రేట్‌ హాల్‌ సభలో సుత్తి లేకుండా సూటిగానే పరోక్షంగా అమెరికా కూటమిని గ్జీ హెచ్చరించాడు. సరిగ్గా అదే సమయంలో తమ భూ భాగమైన తైవాన్‌ గగన తలం మీద అమెరికా గూఢచార విమానం సంచరించినట్లు రుజువైతే తమ మిలిటరీ జట్లను పంపుతామని చైనా హెచ్చరిక చేసింది. అబ్బే ఆ వార్తల్లో నిజం లేదని 24వ తేదీన అమెరికా పసిఫిక్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ప్రజా సంబంధాల అధికారి లెప్టినెంట్‌ కల్నల్‌ టోనీ విక్‌మాన్‌ ప్రకటన చేశాడు.


ఏ చిన్న ఉదంతం జరిగినా పరిణామాలు ఏ విధంగా మారతాయో తెలియని స్ధితి ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్నదని చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలు. ఒక వేళ ఆ ఉదంతం జరిగితే ఎంత తీవ్ర పరిణామాలు జరుగుతాయో అమెరికా, దానితో చేతులు కలిపిన తైవాన్‌ యంత్రాంగం గ్రహించిదనేందుకు చిహ్నం అమెరికా ప్రకటన. ప్రధాన భూభాగంలో తైవాన్‌ విలీనం శాంతియుతంగా జరగాలితప్ప సైనిక బలంతో కాదని, తొలి తూటా పేలుడు తమ వైపు నుంచి ఉండదన్నది ఏడు దశాబ్దాలుగా చైనా ప్రభుత్వ వైఖరి. అయితే అమెరికన్లు తైవాన్‌లో తిష్టవేసి రచ్చ చేస్తే అవసరమైతే సైనిక చర్య తప్పదని చైనా హెచ్చరిస్తున్నది. అమెరికా విమానం తైవాన్‌ గగన తలం మీదుగా ఎగిరిందా లేదా ఆ వార్త కల్పితమా నిజమా అన్నది నిర్దారణ కాలేదు. ఒక వేళ ఎగిరితే అది చైనా సార్వభౌమత్వాన్ని ధిక్కరించటమే. అదే జరిగితే అమెరికా విమానాలను తరిమేందుకు చైనా మిలిటరీ జట్లు సిద్దంగా ఉంటాయి. తైవాన్‌ దీవి చైనా ప్రధాన భూ భాగానికి తూర్పున 161కిలోమీటర్ల దూరంలో దక్షిణ చైనా సముద్రంలో ఉంది. కొద్ది వారాల క్రితం చైనా ఆ ప్రాంతంలో నౌకా విన్యాసాలు జరపటంతో పాటు తూర్పు తీరంలో తైవాన్‌ వైపు గురిపెట్టి అనేక ఆధునిక క్షిపణులను చైనా మిలిటరీ మోహరించింది.


కొరియా యుద్దంలో చైనా విజయానికి 70 ఏండ్లు నిండిన సందర్భంగా గ్జీ చేసిన హెచ్చరిక ఒక్క అమెరికాకు మాత్రమే కాదు, తమకు వ్యతిరేకంగా కూటమి కడుతున్న దేశాలన్నింటికీ అన్నది స్పష్టం. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో కొరియాను జపాన్‌ సామ్రాజ్యవాదులు ఆక్రమించారు. దాన్ని విముక్తం చేసేందుకు నాటి సోవియట్‌ సేనలు ఒక వైపు నుంచి మరో వైపు నుంచి అమెరికన్‌ సేనలు కదిలాయి.38వ అక్షాంశరేఖకు ఉత్తర వైపున ఉన్న కొరియా ప్రాంతం సోవియట్‌, దక్షిణ ప్రాంతం అమెరికా ఆధీనంలోకి వచ్చాయి. యుద్దం ముగిసిన తరువాత రెండు ప్రాంతాలను ఐక్యం చేయాలన్నది ఒప్పందం. ఉత్తర కొరియా కమ్యూనిస్టుల పాలనలోకి, దక్షిణ కొరియా మిలిటరీ పాలనలోకి వెళ్లాయి. అయితే దక్షిణ కొరియాలోనే తిష్టవేసి చైనాకు, అదే విధంగా ఇండోచైనా ప్రాంతంలోని వియత్నాం తదితర దేశాలను అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా తన సైన్యాన్ని అక్కడే ఉంచింది.1950లో ఉత్తర కొరియాను ఆక్రమించుకొనేందుకు ఐక్యరాజ్యసమితి శాంతిసేనల ముసుగులో ఉన్న అమెరికా మిలిటరీ ప్రయత్నించటంతో పక్కనే ఉన్న చైనా జోక్యం చేసుకొని తన వలంటీర్ల సైన్యాన్ని పంపింది.1953 జూలైలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దాని మీద నాటి దక్షిణ కొరియా పాలకులు సంతకాలు చేయలేదు. విలీన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా అమెరికా ఇప్పటికీ తన సైన్యాన్ని అక్కడే ఉంచి అడ్డుపడుతోంది.

1950 నాటికి చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అనేక చోట్ల ప్రతిఘటనను ఎదుర్కొంటూ కుదుట పడలేదు. అయితే సరిహద్దులోకి అమెరికా సేనల ప్రవేశం చేసిన తరువాత అక్కడికే పరిమితం గావు చాంగ్‌కై షేక్‌కు మద్దతుగా చైనాలో ప్రవేశించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన మావో నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆ పరిస్ధితిని ఎదుర్కొనేందుకు సిద్దమైంది. ఇదే సమయంలో దక్షిణ కొరియా మిలిటరీ, అమెరికన్ల దురాక్రమణను ఎదుర్కొనేందుకు సాయపడవలసిందిగా ఉత్తర కొరియా ప్రభుత్వం 1950 అక్టోబరు 19న చైనా ప్రభుత్వాన్ని కోరింది. వెంటనే లక్షలాది మంది స్వచ్చంద సైనికులు యాలూ నదిని దాటి కొరియాలో ప్రవేశించారు. 1951అక్టోబరు 25న చైనా సైనికులు దక్షిణ కొరియా మిలిటరీపై తొలి విజయం సాధించారు. ఆ యుద్దంలో రెండు లక్షల మంది చైనా సైనికులు మరణించారు. యుద్దం ముగిసిన తరువాత ప్రతి ఏటా అక్టోబరు 25ను విజయోత్సవంగా జరపాలని చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం త్యాగం పేరుతో ఒక సినిమాను కూడా నిర్మించి విడుదల చేశారు.1950 అయినా 2020 అయినా చైనా విషయాల్లో ట్రంప్‌ లేదా భవిష్యత్‌లో మరొక నేత అయినా పెత్తందారీ పోకడలకు పోతే తగిన జవాబు ఇస్తామని గ్జీ స్పష్టం చేశారు. పశ్చిమ పసిఫిక్‌, ఆసియాలో ప్రస్తుత పరిస్ధితి 1950లో యుద్దానికి ముందున్నట్లుగా ఉందని చైనా విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌ లేదా జో బిడెన్‌ ఎవరు అధికారానికి వచ్చినా చైనా వ్యతిరేకులకు విధాన నిర్ణయాన్ని అప్పగిస్తే అమెరికా తీవ్రంగా నష్టపోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
చైనా పౌరులు నేడు సంఘటితంగా ఉన్నారని, వారిని తక్కువగా చూడవద్దని గతంలో మావో చెప్పిన అంశాన్ని గ్జీ పునరుద్ఘాటించారు. బెదిరింపులు, అడ్డుకోవటం వంటి వత్తిళ్లు పని చేయవని స్పష్టం చేశారు. గతంలో సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా ఐరోపాలో నాటో కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనాను అడ్డుకునేందుకు ఆసియాలో క్వాడ్‌ పేరుతో అలాంటి కూటమి ఏర్పాటుకు పూనుకున్నారు. దానిలో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ ఉన్నాయి. ఆసియా ముఖ్యంగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని దేశాలతో వాటిని విస్తరించాలనే యత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే చైనాతో ఎలా వ్యవహరించాలనే అంశంపై ఈ నాలుగు దేశాల్లో అన్ని అంశాలపైనా ఏకీభావం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. చతుష్టయంలో అమెరికా, భారత్‌తో చైనా వాణిజ్యం మిగుల్లో ఉండగా జపాన్‌,ఆస్ట్రేలియాలతో తరుగులో ఉంది. అంటే చైనాతో లడాయి కొని తెచ్చుకోవటం అంటే ఇవి తమ వాణిజ్య అవకాశాలను ఫణంగా పెట్టాల్సి ఉంది. అందువలన అమెరికా వత్తిడికి తట్టుకోలేక చైనాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ జపాన్‌, ఆస్ట్రేలియా దూకుడును ప్రదర్శించటం లేదన్నది ఒక అభిప్రాయం. చైనాకు ఎన్నిహెచ్చరికలు చేసినా మన ప్రధాని నరేంద్రమోడీ అధికారికంగా చేసిన ప్రకటనలో మన భూభాగంలోకి చైనా కొత్తగా ప్రవేశించలేదని అఖిలపక్ష సమావేశంలో చెప్పటం చైనాతో తెగేదాకా లాగేందుకు ఇంకా నిర్ణయించుకోలేదనేందుకు నిదర్శనంగా భావిస్తున్నారు.


అమెరికాతో జతకడితే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని స్వతంత్రంగా ఎదగాలని చూస్తున్న మన దేశ కార్పొరేట్‌ శక్తులు వత్తిడి చేస్తున్నాయి. గతంలో అమెరికా-సోవియట్‌ మధ్య సాగిన ప్రచ్చన్న యుద్దకాలంలో మన కార్పొరేట్‌ శక్తులు ఆ విబేధాన్ని వినియోగించుకొని లబ్దిపొందేందుకు, తామే స్వతంత్ర శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నించాయి. గతంతో పోల్చితే ఇప్పుడు మన కార్పొరేట్‌ శక్తులు మరింతగా బలపడ్డాయి. వివిధ కారణాలతో అమెరికా మునుపటి స్ధాయిలో లేదు. కొనుగోలు శక్తి పద్దతి(పిపిపి)లో లెక్కించినపుడు చైనా నేడు ప్రపంచంలో ఆర్ధిక అగ్రరాజ్యం, అమెరికా ద్వితీయ స్ధానంలో ఉంది. సాధారణ పద్దతిలో చూస్తే ప్రధమ స్దానంలో ఉన్న అమెరికాను త్వరలో చైనా అధిగమించనుందనే అంచనాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య అంతరం ప్రతి ఏటా తగ్గుతున్నది. ఈ నేపధ్యంలో అమెరికా పాటలకు మన కార్పొరేట్‌ శక్తులు నృత్యాలు చేస్తాయా అన్నది సమస్య.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దంలో భాగంగా ఐరోపాలోని అనేక దేశాలకు సోవియట్‌ నుంచి ముప్పు, కమ్యూనిజాన్ని వ్యాపింప చేస్తారనేే భయాన్ని రేపి నాటో కూటమిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు చైనా నుంచి అలాంటి ముప్పు ఏదేశానికీ లేదు. మన దేశంతో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ అది మరోసారి యుద్దానికి దారితీసే అవకాశం లేదు.1962 యుద్దం నాటికి సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు తీవ్రమయ్యాయి. యుద్దంలో మనదేశానికి సోవియట్‌ యూనియన్‌ అండవుంటుందనే ఒక పొరపాటు అంచనాకు నాటి మన నాయకత్వం వచ్చిందని చెబుతారు. ఇప్పుడు ఆ సోవియట్‌ లేదు. సిరియా రష్యా నేతలు చైనాతో వివాదపడకపోగా స్నేహబంధాన్ని మరింతగా పెంచుకొనేందుకు నిర్ణయించినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఒక వేళ మన దేశం-చైనా మధ్య యుద్దమంటూ వస్తే వారూ మనం చావో రేవో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇద్దరి మధ్య తగాదా పెట్టి మనకు ఆయుధాలు అమ్ముకొని అమెరికా లబ్ది పొందుతుంది తప్ప మనకు ఒరిగేదేమీ ఉండదు. జపాన్‌, ఆస్ట్రేలియాల పరిస్ధితీ అదే. జపాన్‌ కొన్ని దీవుల విషయంలో చైనాతో వివాద పడుతోంది. అయితే వాటికోసం యుద్దానికి దిగేస్థితి లేదు. మరోవైపు అమెరికా ప్రభావం నుంచి బయటపడి స్వతంత్రశక్తిగా ఎదిగేందుకు, మిలిటరీశక్తిగా మారాలని చూస్తోంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే అలాంటి సమస్య లేదు. అయితే అమెరికా అనుంగు దేశంగా వ్యతిరేకించటం తప్ప మరొక కారణం లేదు.


దక్షిణ చైనా సముద్రంలో కొన్ని దీవుల గురించి చైనా – ఆప్రాంత దేశాల మధ్య వివాదం ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ దేశానికి చెందిన నౌకలనూ అడ్డుకోలేదు, అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఇక క్వాడ్‌ను ఆసియా నాటోగా మార్చి పెత్తనం చేయాలని అమెరికా చూస్తోంది. ఇదే సమయంలో జపాన్‌ రాజ్యాంగాన్ని మార్చాలని అక్కడి కార్పొరేట్‌ శక్తులు ఎప్పటి నుంచో వత్తిడి తెస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ తొమ్మిది ప్రకారం అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి మిలిటరీని వినియోగించటం నిషేధం, అంతే కాదు త్రివిధ దళాలను నిర్వహణను కూడా అనుమతించదు. ఈ కారణంగానే ఆత్మరక్షణ పేరుతో జపాన్‌ పరిమితంగా తన దళాలను నిర్వహిస్తున్నది. ఈ స్ధితి నుంచి బయట పడేందుకు అమెరికా అంగీకరిస్తుందా ? ఆసియా ప్రాంతీయ మిలిటరీ శక్తిగా తిరిగి ఎదగటాన్ని అనుమతిస్తుందా ?


ఆసియా నాటో కూటమిని ఏర్పాటు చేసి దానిలో మన దేశం చేరాలంటే దానికోసం మనం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దున్న-ఎద్దు వ్యవసాయం ఎలాంటి సమస్యలను తెస్తుందో తెలిసిందే. ప్రస్తుతం మనం అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ రష్యన్‌ ఆయుధాలదే అగ్రస్ధానం. అందువలన సగం రష్యా, సగం అమెరికా ఆయుధాల నిర్వహణ కుదరదు. అన్నింటికీ మించి తన ఆయుధాల కొనుగోలును మనం నిలిపివేస్తే రష్యా చూస్తూ ఊరుకోదు. అమెరికా ఉచితంగా ఆయుధాలు ఇవ్వదు. ఐరోపాలో నాటో నిర్వహణ తమకు కష్టంగా మారిందని, నిర్వహణ ఖర్చును ఐరోపా దేశాలు మరింతగా భరించాలని అమెరికా వత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. అలాంటి స్దితిలో అమెరికా కోసం మనం చేతి చమురు వదిలించుకోవాల్సిన అవసరం ఏముంది ?
అధ్యక్ష ఎన్నికల నేపధ్యం, చైనా నుంచి మరిన్ని రాయితీలు పొందేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ ముందుకు తెచ్చిన చతుష్టయంతో తెల్లవారేసరికి అద్బుతాలు జరుగుతాయని అనుకుంటే పొరపాటు. నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగా అన్నట్లుగా ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయి. నిజానికి ఈ ప్రతిపాదన 2004లో ప్రారంభమైంది. మధ్యలో మూలనపడి 2017లో మరోసారి కదలిక ప్రారంభమైంది. ట్రంప్‌ ఓడిపోతే కొంతకాలం పాటు దూకుడు తగ్గవచ్చు. ఒక వేళ గెలిచినా మన వంటి దేశాలను ముందుకు నెట్టటం తప్ప తన ఆర్దిక పరిస్ధితి మెరుగుపడేంతవరకు ట్రంప్‌ కూడా ఏదో ఒక పేరుతో కాలక్షేపం చేయవచ్చు.


అమెరికా, ఐరోపాలోని కొన్ని దేశాలు నాటో కూటమిని రష్యా ముంగిటికి తీసుకు వస్తున్నాయి. దాన్ని ఎదుర్కొనేందుకు రష్యా తనవంతు సన్నాహాలు చేస్తున్నది. మరోవైపు క్వాడ్‌ పేరుతో ఆసియా నాటో ఉనికిలోకి వస్తే అది చైనాకే కాదు రష్యాకూ సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈ నేపధ్యంలోనే చైనాతో కూటమి ఏర్పాటు గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సూచన ప్రాయంగా ప్రస్తావించాడు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఇప్పటి వరకు చైనా మరో దేశానికి వ్యతిరేకంగా మూడో దేశంతో ఎలాంటి సైనిక కూటమిని ఏర్పాటు చేయలేదు. అమెరికాకు మరింత దగ్గరగా భారత్‌ వెళుతున్నప్పటికీ దాయాదిగా ఉన్న పాకిస్ధాన్‌తో, మిత్రదేశంగా ఉన్న నేపాల్‌తో చైనా మిలిటరీ ఒప్పందాలు చేసుకోలేదని అంతర్జాతీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అయితే దేనికైనా కొన్ని పరిమితులుంటాయని గమనించాలి. అమెరికా మరింత దూకుడుగా చైనా వ్యతిరేక అజెండాను ముందుకు తీసుకువస్తే చైనా తన వైఖరిని పున:పరిశీలించుకోవచ్చు. తన ఆర్దికశక్తితో చైనా చిన్న దేశాలను నియంత్రిస్తున్నదని విమర్శించే వారు ఇరాన్‌ పట్ల అమెరికా, మోడీ అనుసరించిన వైఖరి ఆర్ధికపరమైనదిగాక మరేమిటో చెప్పాలి. అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఆర్ధికపరమైనవి కావా, దానిలో భాగంగానే కదా ఇరాన్‌ నుంచి మనం చమురు కొనుగోలు నిలిపివేసి ఆమేరకు అమెరికా నుంచి తెచ్చుకుంటున్నది. అమెరికా పుణ్యమా అంటూ ప్రధాని నరేంద్రమోడీ మన మిత్రదేశంగా ఉన్న ఇరాన్‌ను తీసుకు వెళ్లి చైనాకు అప్పగించారు.ఈ చర్యతో మనకు ఒరిగిందేమీ లేకపోగా మిత్ర దేశంగా ఉన్న ఇరాన్‌ను తీసుకు వెళ్లి చైనాకు అప్పగించాము. అమెరికా బెదిరింపులు, అదిరింపులతో మన చుట్టూ ఉన్న అనేక దేశాలు చైనా అందిస్తున ఆర్దిక స్నేహ హస్తాన్ని అందుకుంటున్నాయి. మన పాలకులకు అమెరికా కౌగిలింతలు తప్ప చుట్టుపట్ల ఏమి జరుగుతోందో పట్టటం లేదు. ఇది తెలివి తక్కువ వ్యవహారమా తెలివిగలదా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బొలీవియా మాస్‌ విజయం 2.0 – ప్రభుత్వం ముందు పెను సవాళ్లు !

25 Sunday Oct 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Bolivia’s 2020 election, Evo Morales, Luis Arce, MAS-Bolivia


ఎం కోటేశ్వరరావు


అనేక అనుమానాలు, సందేహాలకు తెరదించుతూ శుక్రవారం(అక్టోబరు 23వ తేదీ) రాత్రి లాటిన్‌ అమెరికా దేశమైన బొలీవియా ఎన్నికల సంఘం అధ్యక్ష, పార్లమెంట్‌ ఉభయ సభల ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. దీంతో అక్కడి రాజకీయ పరిణామాలు మరోమలుపు తిరిగాయి. సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పార్టీనేత ఇవోమొరేల్స్‌ గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని నిర్ధారణ అయింది. అమెరికా పన్నిన కుట్రలో భాగంగా నానా యాగీ, ఆరోపణలు చేసిన అమెరికా దేశాల సంస్ధ(ఓఏఎస్‌) పరువుపోయింది. దాని ప్రధాన కార్యదర్శి ఆల్‌మాగ్రో రాజీనామా చేయాలనే వత్తిడి పెరిగింది. తమ మద్దతుదార్లను అడుగడుగునా రెచ్చగొట్టేందుకు అమెరికా పన్నిన వలలో చిక్కకుండా మాస్‌ పార్టీ నాయకత్వం సమర్ధవంతంగా తిప్పికొట్టింది. అనేక చోట్ల కార్యకర్తలు, నేతలపై దాడులు, తప్పుడు కేసులతో వేధించటం, ఆ పార్టీకి తిరుగులేని పట్టు ఉన్న ప్రాంతాలకు పెట్రోలియం ఉత్పత్తుల వంటి వాటిని సరిగా సరఫరా చేయకపోవటం వంటి అనేక అక్రమాలకు తాత్కాలిక ప్రభుత్వం పాల్పడింది.


మాస్‌ పట్ల జనంలో తిరుగులేని విశ్వాసం వ్యక్తం కావటం ప్రపంచంలోని యావత్‌ వామపక్ష శక్తులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది, బాధ్యతను మరింతగా పెంచింది. మాస్‌ పార్టీ అభ్యర్ధి లూయీస్‌ ఆర్‌సికి పోలైన ఓట్లలో 55.1శాతం, ప్రత్యర్ధి కార్లోస్‌ మెసాకు 28.83, మూడవ అభ్యర్ధి ఫెర్నాండో కామ్చోకు 14శాతం వచ్చాయి. పార్లమెంట్‌ దిగువ సభలోని 130 స్ధానాల్లో మాస్‌ పార్టీకి 73, మిగతా రెండు పార్టీలకు 41,16 చొప్పున వచ్చాయి. ఎగువ సభలోని 36 స్ధానాలలో మాస్‌కు 21, రెండు, మూడు స్ధానాల్లో ఉన్న పార్టీలకు 11,4 చొప్పున వచ్చాయి. కొత్త ప్రభుత్వం వచ్చేనెల మధ్యలో ప్రమాణస్వీకారం చేయనుంది. దేశంలో 73లక్షల మంది ఓటర్లలో 60ఏండ్ల లోపు వారు విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది, ఈసారి 88శాతం పోలింగ్‌ జరిగింది.


గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మితవాదశక్తులు హింసాకాండకు పాల్పడ్డాయి. అసలు గత ఏడాది ఎన్నికలు జరగ ముందే బొలీవియా ఎన్నికలను తాము గుర్తించబోమని, అవి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించటం లేదని అమెరికా, బ్రెజిల్‌, కొలంబియా మరికొన్ని దేశాల మితవాద పాలకులు ప్రచారం ప్రారంభించారు. అనివార్యమై జరిపిన ఈ ఎన్నికల్లో మితవాద శక్తులు ఒకే అభ్యర్ధిని నిలిపేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. అయితే వాటి మధ్య ఉన్న అధికార యావ కారణంగా సాధ్యం కాలేదు. మాస్‌ పార్టీ మెజారిటీ ఓట్లు సాధించనుందని సర్వేలు వెల్లడించినా తగినన్ని ఓట్లు రాక రెండవదఫా ఎన్నికల్లో పోటీలో నిలిచే మితవాద అభ్యర్ధి విజయం సాధిస్తాడనే అంచనాతో ఈ సారి ఆశక్తులు ఉన్నాయి. మరొక ప్రధాన కారణం తటస్ధ ఓటర్లకు ఆగ్రహం తెప్పించకుండా వారి ఓట్లను ఆకర్షించాలనే ఎత్తుగడ కూడా దాడులకు పాల్పడకుండా నిలువరించిందని చెబుతున్నారు. గత ఏడాది కుట్రదారులు గద్దెనెక్కిన తరువాత తమకు ప్రత్యర్ధులు అనుకున్నవారి మీద పెద్ద ఎత్తున దాడులు చేయటంతో భయవాతావరణం ఏర్పడి ఎన్నికల ముందు 20శాతం ఓటర్లు తామెవరికి ఓటు వేసేది నిర్ణయించుకోలేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దాడులను తప్పించుకొనేందుకే వారలా చెప్పారని, చడీచప్పుడు లేకుండా పోలింగ్‌లో తమ నిర్ణయాన్ని మాస్‌కు అనుకూలంగా తీసుకున్నారని నిర్ధారణ అయింది. ఎన్నికల్లో అనూహ్యంగా ఫలితాలు ఎదురుకావటంతో కొన్ని చోట్ల ఈ శక్తులు విధ్వంసకాండ సృష్టించేందుకు అక్రమాలు జరిగాయంటూ ప్రదర్శనలు చేశాయి. అయితే అమెరికా దేశాల సంస్ధ, ఇతర పరిశీలకులు అలాంటివేమీ లేవని ప్రకటించటంతో వెనక్కు తగ్గాయి. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఇవో మొరేల్స్‌ విజయం సాధించినట్లు ప్రకటించగానే పోలీసు, మిలిటరీ కుట్రచేసి అక్రమాలు జరిగాయని జనాన్ని నమ్మించేందుకు అనేక చోట్ల బ్యాలట్‌ బాక్సులు, ఎన్నికల కార్యాలయాలను దగ్దం చేసి ఇవో మొరేల్స్‌ మీద అనుమానాలు రేకెత్తించేందుకు ప్రయత్నించారు. అది కుట్ర అని, మాస్‌ పార్టీకి జనంలో మద్దతు ఉందని ఈ ఎన్నికలు నిర్ధారించాయి. మితవాదులు వెనక్కు తగ్గటానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.


దిగజారిన ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరుస్తామని మాస్‌ వాగ్దానం చేసింది. అయితే దాని ప్రత్యర్ధి పార్టీలు మెజారిటీగా ఉన్న రెడ్‌ ఇండియన్‌ తెగల పట్ల అనుసరించే దురహంకార ధోరణులు, ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలను ప్రకటించలేకపోవటం, శ్వేత జాతి, మిశ్రమ రంగు జాతీయుల ఓట్లకోసం వెంపర్లాడటం తప్ప మెజారిటీ జనాన్ని పట్టించుకోకపోవటం మితవాద శక్తుల ఓటమికి దోహదం చేసిన కారణాలలో కొన్ని. మితవాద పార్టీలు రెండూ అమెరికా అనుకూలశక్తులుగా జనం గుర్తించటం, అమెరికా,ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు పొందటం, ఇవోమొరేల్స్‌ ప్రభుత్వ కూల్చివేత కుట్ర వెనుక వారి హస్తం ఉందన్న అంశాలు కూడా మాస్‌ విజయానికి దోహదం చేశాయి. కరోనా కేసులు విపరీతంగా ఉండటం, ఆరోగ్యశాఖ మంత్రి మెర్సిలో వెంటిలేటర్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిదొరికిపోయి అరెస్టు కావటం వంటి పరిణామాలు కుట్రదారుల ప్రభుత్వం అంటే ఏమిటో జనానికి స్పష్టమైంది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించటం తప్ప ఉపాధి కోల్పోయిన వారికి ఎలాంటి సాయం అందించకపోవటంతో కార్మికులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. బొలీవియా ఎదుర్కొంటున్న సమస్యలకు పెట్టుబడిదారీ, మితవాద శక్తుల దగ్గర ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని, వారు అధికారానికి వస్తే ఉన్న సంక్షేమ చర్యలను కూడా తిరగదోడతారనే విషయం ఓటర్లకు స్పష్టమైంది.


కొత్త ప్రభుత్వం ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. కరోనాను అదుపు చేయటం వాటిలో ఒకటి. ఈ ఏడాది జిడిపి 6.2శాతం తిరోగమనంలో ఉంటుందని అంచనా. అందువలన దిగజారిన ఆర్దిక వ్యవస్ధను తిరిగి గాడిలో పెట్టటం, సామాన్యులకు ఉపశమనం కలిగించటం, జాత్యహంకార శ్వేతజాతి, పచ్చి మితవాద శక్తులను అదుపు చేయటం, అన్నింటికీ మించి అమెరికా కుట్రలను ఎదుర్కోవటం వంటి అంశాలున్నాయి. పద్నాలుగు సంవత్సరాల ఇవో మొరేల్స్‌ పాలనలో గ్యాస్‌, పెట్రోలియం, టెలికమ్యూనికేషన్స్‌, గనులను జాతీయం చేయటం వంటి చర్యలు చేపట్టినప్పటికీ ప్రయివేటు రంగానికి లోబడే చేశారు. ఈ పరిమిత చర్యల కారణంగా కూడా దేశ ఆదాయం పెరిగింది. ఇవో మొరేల్స్‌ అధికారానికి రాక ముందు ప్రయివేటు రంగంలోని పెట్రోలియం, గ్యాస్‌ క్షేత్రాల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన వార్షిక ఆదాయం 73 కోట్ల డాలర్లు కాగా వాటిని జాతీయం చేసిన తరువాత 495 కోట్లకు పెరిగింది.దాంతో చేపట్టిన సంక్షేమ చర్యల కారణంగా 60శాతంగా ఉన్న పేదరికం 35కు తగ్గిపోయింది. ఇప్పుడు కరోనా కారణంగా తిరిగి పెరిగినట్లు వార్తలు వచ్చాయి. స్దానిక తెగల భాషలతో స్కూళ్లలో బోధన ప్రారంభించారు. బొలీవియాలో పండించే కోకాతో ఔషధాలతో పాటు కొకెయిన్‌ అనే మాదక ద్రవ్యాన్ని కూడా తయారు చేయవచ్చు. అయితే మాస్‌ ప్రభుత్వం రాక ముందు మాదక ద్రవ్యాల నిరోధం పేరుతో యంత్రాంగం కోకా రైతుల జీవితాలను నాశనం చేసింది. మొరేల్స్‌ అధికారానికి వచ్చాక కోకా సాగును చట్టబద్దం చేశాడు.మాదక ద్రవ్యాల నిరోధానికి తగుచర్యలు తీసుకున్నారు.


గత పదకొండు నెలల తాత్కాలిక ప్రభుత్వ పాలనలో ఆర్ధికరంగం దిగజారింది. నిరుద్యోగం 4.2 నుంచి 12శాతానికి చేరింది, నిర్మాణ రంగం వంటి వాటిలో 30శాతం ఉంది. ఉత్పత్తి 16శాతం పడిపోయింది. ద్రవ్యలోటు ఆరు నుంచి తొమ్మిది శాతానికి పెరిగింది. దారిద్య్రం, సంపద కేంద్రీకరణ పెరిగింది.ఇవో మొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూలదోయటం వెనుకు బహుళజాతి కంపెనీల హస్తం ఉంది. మోటారు వాహనాలు, సెల్‌ఫోన్లలో వినియోగించే బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియం నిల్వలకు బొలీవియా కేంద్రం. ప్రపంచ మొత్తం నిల్వల్లో అక్కడ 25 నుంచి 45శాతం వరకు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ముడి ఖనిజాన్ని ఎగుమతి చేయటం కంటే బ్యాటరీలు తయారు చేసి ఎగుమతి చేయటం మరింత లాభసాటిగా ఉంటుందని, ఆ వచ్చే సొమ్ముతో దారిద్య్రనిర్మూలనతో పాటు సంక్షేమ చర్యలను అమలు జరపవచ్చని మొరేల్స్‌ ప్రభుత్వం తలపెట్టింది. అక్కడ ఉన్న ఖనిజంతో ఏడాదికి నాలుగు లక్షల బ్యాటరీలను తయారు చేయవచ్చని అంచనా వేశారు. ఆమేరకు ప్రభుత్వ రంగ సంస్ధ ఒక ప్రకటన చేసిన తరువాత ఎన్నికలు జరగటం, ఇవోమొరేల్స్‌ ఘనవిజయం సాధించటం, కుట్ర చేసి తొలగించటం తెలిసిందే. అధికారానికి వచ్చిన అమెరికా అనుకూల కుట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలలో లిథియం శుద్దికి మొరేల్స్‌ సర్కార్‌ జర్మనీతో కుదుర్చుకున్న సంయుక్త పధకాన్ని రద్దుచేయటం ఒకటి.
లూయీస్‌ ఆర్‌సి నూతన ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆచితూచి ప్రకటన చేశారు. అయితే గత ఏడాది కాలంలో జరిగిన హింసాకాండ, హత్యలకు బాధ్యులైన వారి మీద ఏ చర్యలు తీసుకుంటారు? 36 మంది మరణించగా 800మందికి పైగా గాయపడ్డారు. మంత్రుల మీద వచ్చిన అవినీతి ఆరోపణలను నిగ్గుతేలుస్తారా ? ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే మితవాదశక్తులు మరోసారి రెచ్చిపోయే అవకాశం ఉంది. దాన్నెలా ఎదుర్కొంటారు ? ఇవో మొరేల్స్‌ అర్జెంటీనా ప్రవాసం నుంచి ఎప్పుడు తిరిగి వస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.కుట్రదారులు మోపిన కేసులు ఇంకా పరిష్కారం కాలేదు. కొత్త ప్రభుత్వం వాటిని రద్దు చేస్తుందా లేక విచారణ కొనసాగించి నిజం లేదని నిగ్గుతేలుస్తుందా అన్నది స్పష్టం కాలేదు.


ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులకు తాజా ఎన్నికల్లో విజయం లభించినప్పటికీ రాబోయే ఐదు సంవత్సరాలలో మాస్‌ ప్రభుత్వ నడక నల్లేరు మీద బండిలా ఉండే అవకాశం ఉంటుందని చెప్పలేము. పద్నాలుగు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న మాస్‌ పార్టీ ఆర్ధిక రంగంలో లాటిన్‌ అమెరికాలోని మిగతా వామపక్ష పాలిత దేశాలలో మాదిరి నయాఉదారవాద పునాదులను కదిలించలేదు. కొన్ని సంక్షేమ చర్యలు తీసుకొని ఉపశమనం కలిగించటం తప్ప పెట్టుబడిదారీ వ్యవస్ధ ముందుకు తెచ్చిన అసమానత, దోపిడీలను అవి నివారించలేవు. వాటికి ఉన్న పరిమితులు కూడా ఏమిటో గత రెండు దశాబ్దాల అనుభవం వెల్లడించింది. అమెరికాతో కుమ్మక్కయిన పోలీసు, మిలిటరీ, మితవాద శక్తుల కుట్రలకు బొలీవియాలో తాత్కాలికంగా తెరపడింది. అవి తిరిగి మరోమారు తలెత్తలేవని చెప్పలేము. దానికి గాను పలు ఆటంకాలను అధిగమించాల్సి ఉంది.అయితే ఈ విజయంతో సంతృప్తి చెంది ఆదమరవకుండా అమెరికా కుట్రలను నిరంతరం కనిపెట్టటంతో పాటు విధానపరమైన మార్పులను చేపట్టి పురోగమించటం ఎలా అనే అతిపెద్ద సవాలు ఆ పార్టీ ముందు ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఉల్లి ధరలు : మరోసారి పెరుగుదలకు కారణం ఏమిటి ?

23 Friday Oct 2020

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

indian farmers, Onion prices, Onion prices in India


ఎం కోటేశ్వరరావు


గత ఏడాది చలికాలంలో ఉల్లి ధరలు కొన్ని చోట్ల కిలో రూ.160 నుంచి 180వరకు పలికాయి. తిరిగి ఈ ఏడాది అదే పునరావృతం కానుందా ? ధరల పెరుగుదల తీరు అదే ధోరణిలో ఉంది. ఉల్లి ధరల గురించి గత ఏడాది డిసెంబరులో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యల మీద పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ సభ్యురాలు సుప్రియా సూలే పెరిగిన ఉల్లి ధరల గురించి ఒక ప్రశ్న అడిగారు. సమాధానం పూర్తయిన తరువాత ఒక సభ్యుడు మీరు ఈజిప్షియన్‌ ఉల్లిపాయలు తింటారా అని అడిగారు. దానికి ఆమె నేను పెద్దగా ఉల్లి, వెల్లుల్లి తినని కుటుంబం నుంచి వచ్చాను కనుక మీరు ఆందోళన చెందవద్దు అని చెప్పారు. ఈ మాటలను వేరే విధంగా వక్రీకరించారని బిజెపి ఉడుక్కుంది. నేను పెద్దగా తినను గనుక ధరలు పెరుగుతాయని మీరు ఆందోళన పడవద్దు అన్న అర్ధం ఆమె మాటల్లో స్పురించింది. ఈజిప్షియన్‌ ఉల్లి రకాలను తినేందుకు మన జిహ్వలు అంగీకరించవు, బహుశా అలాంటివి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు అనే ఉద్దేశ్యంతో కూడా ఆ సభ్యుడు అడిగి ఉండవచ్చు.


కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు ప్రకటించిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఆగస్టు నుంచి ఉల్లిధరలు పెరుగుతున్నాయి.అయినప్పటికీ అక్టోబరు 18వరకు గత ఏడాది కంటే తక్కువే ఉన్నాయి. గతేడాది దేశవ్యాపిత సగటు ధర కిలో రూ.46.33 కాగా పదిరోజుల్లో కిలోకు రూ.11.56 పెరిగి చిల్లర ధర 51.95కు పెరిగింది(ట).(అదెంత వరకు వాస్తవమో వినియోగదారులకు తెలుసు కనుక వారికే వదలి వేద్దాం. ఉల్లి నాణ్యతను బట్టి ధరలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కిలో ఉల్లి కొంటే సగం పనికిరాని వాటి గురించి చెబుతున్నదేమో తెలియదు.) ముందస్తు చర్యగా సెప్టెంబరు 14న కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిల్వచేసిన ఉల్లిని విడుదల చేస్తున్నది. రాబోయే రోజుల్లో మరింతగా విడుదల ఉంటుంది.డిసెంబరు 15వరకు దిగుమతులను సులభతరం చేస్తూ 2003 నాటి ఉత్తరువులను కేంద్ర ప్రభుత్వం సడలించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే సరకుతో వచ్చే తెగులు, ఇతర వాటి నివారణకు దిగుమతి చేసుకొనే ఉల్లిని శుభ్రం చేసేందుకు అవసరమైన చర్యలను (ఫ్యూమిగేషన్‌ ) ఓడలకు ఎక్కించే చోట గాకుండా మన దేశంలో దిగుమతి చేసే చోట చేపట్టేందుకు కూడా సవరణలు చేసింది. దిగుమతులు ఆలస్యం కాకుండా చూసేందుకు ఈ చర్య అని చెబుతున్నారు. ఇది సక్రమంగా జరగకపోతే కొత్త సమస్యలు తలెత్తవచ్చు.
గత ఏడాది అక్టోబరు 20వ తేదీన ఉల్లి ధరలతో పోలిస్తే అదే రోజున ఈ ఏడాది 12.13శాతం పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన నిత్యావసర వస్తువుల చట్టం చెప్పినదాన్ని బట్టి ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నది ప్రభుత్వ ప్రకటన సారంగా చెప్పుకోవాలి. ఉల్లి, పప్పుధాన్యాలు, ఖాద్యతైలాలు, నూనె గింజలు, తృణధాన్యాలు, బంగాళాదుంపల నిల్వలకు సంబంధించి ఇప్పుడు ఎలాంటి పరిమితులు ఉండవు, ఎన్నయినా చేసుకోవచ్చని తాజా చట్ట సవరణ తెలిపింది. అయితే మరి నియంత్రణ ఎప్పుడు అంటే నిల్వ ఉండని తోట పంటల ఉత్పత్తుల (ఉల్లి, బంగాళాదుంప) ధరలు వందశాతం, ఇతర నిల్వ ఉండే ఆహారవస్తువుల ధరలు యాభై శాతం పెరిగినపుడు మాత్రమే ప్రభుత్వాలు నియంత్రణలను అమల్లోకి తెస్తాయి. మరి ధరల పెరుగులను ఎలా లెక్కిస్తారు.


గత పన్నెండు నెలలు లేదా గత ఐదు సంవత్సరాల మార్కెట్‌ సగటు ధరలను తీసుకొని వాటిలో ఏవి తక్కువగా ఉంటే వాటితో ఇప్పుడు మార్కెట్లో ఉన్న ధరలతో పోల్చి ధరల పెరుగుదల ఎంత ఉందో నిర్ణయించి దాన్ని బట్టి చర్యలు తీసుకుంటారు. ఉల్లి ధరలు గత పన్నెండు నెలల్లో కిలో సగటున రూ.40, ఐదేండ్ల సగటు రూ.35 అనుకుందాం. తక్కువ 35 రూపాయలు కనుక వందశాతం అంటే 70రూపాయలు దాటినపుడు మాత్రమే ప్రభుత్వం నిల్వల మీద నియంత్రణలు విధిస్తుంది. గత ఏడాది 40 నుంచి ఇప్పుడు 65కు పెరిగినా ప్రభుత్వాలు కదలాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం పైన చెప్పిన విధంగా గత ఏడాదితో పోలిస్తే పెరుగుదల 12.13శాతమే, గత ఐదేండ్ల సగటు ఇంకా తక్కువ ఉంటుంది. కనుక ఇప్పట్లో ఉల్లిధరల నియంత్రణకు ఎలాంటి చర్యలూ తీసుకోదన్నది స్పష్టం. ఈ లెక్కలు వ్యాపారుల జేబులు నింపటానికా వినియోగదారుల పర్సులను కొల్లగొట్టటానికా ?


మన దేశంలో ఏడాదికి ఉల్లి మూడు పంటలు పండుతుంది. వేసవి పంట ఏప్రిల్‌లో, ఖరీఫ్‌ తొలి పంట సెప్టెంబరు, ఖరీఫ్‌ రెండవ పంట నవంబరు తరువాత మార్కెట్‌కు వస్తుంది. వర్షాలు, వాటితో వచ్చే తెగుళ్ల కారణంగా కొంత పంటనష్టం జరిగిందని, పదిశాతం ఉల్లివిత్తనాల కొరత, రబీ పంటలో నిల్వచేసినదానిలో 35శాతం పాడైపోవటం ప్రస్తుత ఉల్లిధరల పెరుగుదలకు కారణాలుగా చెబుతున్నారు. ఉల్లి వ్యాపారం మొత్తం ప్రయివేటు వ్యాపారుల చేతుల్లోనే ఉంది. గత ఏడాది ధరలు పెరిగి సొమ్ము చేసుకున్న వ్యాపారులు మూడోవంతు పంట పాడైపోయేంత అసమర్ధంగా నిల్వలు చేసుకుంటారంటే నమ్మేదెలా ? వీటి కంటే అసలు కారణం ఈ ఏడాది జూన్‌లోనే ఆర్డినెన్స్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిల్వలపై నియంత్రణలు ఎత్తివేసిన వాటి జాబితాలో ఉల్లి ఉండటం, రాబోయే రోజుల్లో కొరత ఏర్పడనుందని వ్యాపారులు ఊహించటం లేదా నియంత్రణ నిబంధనలు లేవు కనుక కృత్రిమ కొరత సృష్టించటం ప్రధాన కారణం అన్నది స్పష్టం.


ప్రపంచంలో ఉల్లి సాగు విస్తీర్ణం మన దేశంలో ఎక్కువగా ఉన్నప్పటికీ దిగుబడి ఎక్కువ కారణంగా చైనా తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ ఉత్పత్తి చేస్తూ మొదటి స్ధానం ఆక్రమించింది. మూడవ స్ధానంలో ఒక ఏడాది అమెరికా ఉంటే మరో ఏడాది ఈజిప్టు ఉంటోంది. భారత్‌, చైనా రెండూ కూడా సాధారణ పరిస్ధితిలో అవసరానికి మించి ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయి. మనం పదిశాతం ఎగుమతులు చేస్తున్నాము.ధరలు పెరిగినపుడు నిషేధిస్తున్నాము. విధానాల మీద చర్చను వెనక్కు నెట్టే క్రమంలో అనేక అంశాలను రాజకీయ పార్టీలు ముందుకు తెచ్చాయి. వాటిలో ఉల్లి ఒకటి. గత నాలుగు దశాబ్దాలుగా తరచూ ఉల్లి రాజకీయాలు ముందుకు వస్తున్నాయి.1980లోక్‌ సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ నేత ఇందిరా గాంధీ ఉల్లిని ఎన్నికల సమస్యగా ముందుకు తెచ్చారు. తరువాత కూడా ఎన్నికల సమయంలోనూ తరువాత ప్రతిపక్షాల అస్త్రంగా మారింది.1998లో ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఉల్లి ధరల కారణంగానే ఓడిపోయిందని విశ్లేషించారు. తరువాత కాలంలో ఎవరు అధికారంలో ఉన్నా సత్పరిపాలనకు ఉల్లి ధరలు ఒక గీటురాయిగా మారాయంటే అతిశయోక్తి కాదు.


2015లో కేంద్ర ప్రభుత్వం ధరల స్ధిరీకరణ నిధిగా 500 కోట్లను ఏర్పాటు చేసింది. ఆ నిధితో దిగుమతి చేసుకున్న లేదా స్ధానికంగా సేకరించిన సరకు ధరలో రాష్ట్రాలు సగం మొత్తాన్ని కేంద్రానికి చెల్లించి ఉల్లిపాయలను కొనుగోలు చేసి మార్కెట్‌ ధరలకంటే తక్కువకు విక్రయించే ఏర్పాట్లు చేశారు. అయితే ఇది ధరల మీద పెద్ద ప్రభావం చూపటం లేదు. గతేడాది దిగుమతి చేసుకున్న ఉల్లి సరైన గోదాము సౌకర్యాలు లేక పాడైపోయినట్లు వార్తలు వచ్చాయి. దాంతో అయినకాడికి తెగనమ్మి ప్రభుత్వం సొమ్ముచేసుకొనేందుకు ప్రయత్నించింది. దిగుమతి చేసుకున్న ఉల్లి ధర 45-50 రూపాయలు పడితే దాన్ని పది-పదిహేను రూపాయలకే అమ్మాల్సి వచ్చింది.
ధరల స్ధిరీకరణ చర్యల్లో భాగంగా గతేడాది నాఫెడ్‌ 52వేల టన్నుల ఉల్లిని మహారాష్ట్ర, గుజరాత్‌లో కొని నిల్వచేసింది. ఆగస్టులో బహిరంగ మార్కెట్‌లో కిలో 40 రూపాయలు దాటినపుడు దానిలో సగాన్ని రాష్ట్రాలకు విక్రయించింది. వర్షాలకు గోదాముల్లో నీరు చేరటంతో మిగిలిన సగం సరకు పాడైపోతున్నట్లు గుర్తించి బహిరంగ మార్కెట్లో ఎంతవస్తే అంత అన్న ప్రాతిపదికన విక్రయించింది. సరైన నిల్వ ఏర్పాట్లు కూడా చేయలేని నిర్లక్ష్యాన్ని ఈ ఉదంతం వెల్లడించింది.


గత ఏడాది కూడా సెప్టెంబరు చివరి వారంలో ఎగుమతులపై నిషేధం విధించింది.నిల్వ పరిమితులను చిల్లర వ్యాపారులకు వంద నుంచి ఇరవై క్వింటాళ్లు, హౌల్‌సేలర్స్‌కు 500 నుంచి 250కి తగ్గించినప్పటికీ ధరలు తగ్గలేదు, నవంబరు, డిసెంబరు మాసాల్లో 150రు.ల వరకు పలికింది. లక్షా 20వేల టన్నులు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించి,42వేల టన్నులకు టెండర్లు ఖరారు చేసి తరువాత ఐదువేల టన్నులకు రద్దు చేసి చివరికి 37వేల టన్నులు దిగుమతి చేసుకున్నారు. రకరకాల కారణాలు తోడై దిగుమతులు ఆలస్యం కావటంతో లక్ష్యం నీరుగారిపోయింది. అవి వచ్చే సమయానికి స్దానిక మార్కెట్లో ధరలు పడిపోయాయి. దాంతో అంతకు ముందు తమకు 33వేల టన్నులు కావాలన్న రాష్ట్రాలు దిగుమతి సరకు ధరలు ఎక్కువగా ఉండటంతో తమ ఆర్డర్లను సగానికి తగ్గించుకున్నాయి. వాటిని కూడా పూర్తిగా తీసుకుపోలేదని, ముంబై రేవులో కుళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. చిత్రం ఏమంటే ఇదే సమయంలో ప్రయివేటు వ్యాపారులు 75వేల టన్నులను వేగంగా దిగుమతి చేసుకొని వాటి ద్వారా కూడా లబ్దిపొందారు.
దేశాల మధ్య ఉల్లి దౌత్యపరంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సరిహద్దులో విబేధాల కారణంగా చైనా పెట్టుబడులు, దిగుమతుల మీద ఆంక్షలు విధించిన కేంద్రం టర్కీ విషయానికి వస్తే అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చిందనే విమర్శలు వచ్చాయి. ఆర్టికల్‌ 370 రద్దు విషయాన్ని టర్కీ బహిరంగంగానే విమర్శించింది. అయినా గత ఏడాది పదకొండువేల టన్నుల ఉల్లి దిగుమతి చేసుకున్నాము. మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఒక సమావేశంలో మాట్లాడుతూ మన విదేశాంగవిధానంలో వేగంగా మార్పులు వస్తున్నప్పటికీ వస్తువుల విషయానికి వచ్చినపుడు ఆర్ధిక విషయాలే ప్రధాన నిర్ణాయక శక్తిగా ఉంటాయని చెప్పారు.


మన దేశం ఉల్లి ఎగుమతి, దిగుమతి విధానాల్లో తరచూ చేస్తున్న మార్పులు సంప్రదాయంగా మన నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశాలు ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయి. ఒక నిలకడ లేనికారణంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో నిషేధం కారణంగా ప్రధాన దిగుమతిదారైన బంగ్లాదేశ్‌ తీవ్రంగా ప్రభావితమైంది. దాంతో వచ్చే ఏడాది మార్చి వరకు చైనా నుంచి దిగుమతులు చేసుకోవాలని నిర్ణయించింది. ఉల్లి ఎగుమతులపై తాజా నిషేధం తాజాగా నిత్యావసర సరకుల చట్టానికి చేసిన సవరణకు విరుద్దమనే విమర్శలు వ్యాపారుల నుంచి వచ్చాయి.ఎగుమతుల ద్వారా రైతాంగాన్ని ఉద్దరిస్తామని చెప్పిన వారు ఇలా చేయటం ఏమిటని ఇతరులు కూడా విమర్శించారు. ఇది ఉల్లి తరుణం కాదు. త్వరలో మార్కెట్‌కు రానుంది. ఇప్పుడు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్న ధరలు రేపు రైతాంగానికి అదే పని చేస్తాయా ? పాలకులు రైతాంగాన్ని ఆదుకుంటారా ? గత ఏడాది జరిగింది పునరావృతం అవుతుందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా కుట్రలకు చెంపదెబ్బ – బొలీవియా వామపక్ష జయకేతనం !

20 Tuesday Oct 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Opinion, USA

≈ Leave a comment

Tags

Bolivia Election 2020, Evo Morales, Jallalla Bolivia, Luis Arce, Movement toward Socialism-MAS


ఎం కోటేశ్వరరావు


ఈ నెల 18, ఆదివారం నాడు జరిగిన బొలీవియా అధ్యక్ష, పార్లమెంట్‌ ఎన్నికల్లో వామపక్ష ” మాస్‌ ” పార్టీ విజయం సాధించింది. పోలింగ్‌ అనంతర సర్వేలో 53శాతం ఓట్లతో వామపక్ష అభ్యర్ధి లూయిస్‌ ఆర్‌సి విజయం సాధించనున్నట్లు వెల్లడైంది. ఇది రాస్తున్న సమయానికి 40శాతం ఓట్ల లెక్కింపు జరిగినట్లు ఆర్‌సి 45శాతంతో ముందుండగా 35శాతం సాధించిన ప్రత్యర్ధి మాజీ అధ్యక్షుడు కార్లోస్‌ మెసా తన ఓటమిని అంగీకరించినట్లు వాయిస్‌ అమెరికా తెలిపింది. ఎన్నికలలో విజేతను గుర్తిస్తానని, విజయాన్ని గుర్తించటమే ప్రజాస్వామ్యానికి తగినదన్నారు. ఎన్నికలలో లూయీస్‌ ఆర్‌సి విజయాన్ని ఇరాన్‌ అభినందించింది. విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఈ మేరకు ఒక ప్రకటన చేశాడు. బొలీవియాలో సంబంధాలను పునరుద్దరించి పటిష్ట పరుచుకొనేందుకు సిద్దమని చెప్పాడు.


పట్టణ ప్రాంతాల ఓట్లు తొలుత లెక్కించగా ఇద్దరూ పోటా పోటీగా ఉన్నారని, ఇవో మొరేల్స్‌ నాయకత్వంలోని ‘మాస్‌’ (మువ్‌మెంట్‌ ఫర్‌ సోషలిజం-సోషలిజం కోసం ఉద్యమం) పార్టీకి గ్రామీణ ప్రాంతాలలో తిరుగులేని పట్టు ఉన్నందున మెజారిటీ పెరగనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం తొలి దఫాలోనే యాభైశాతంపైగా తెచ్చుకున్నా లేదా నలభైశాతంపైగా తెచ్చుకొని ప్రత్యర్ధికంటే పదిశాతం కంటే మెజారిటీలో ఉన్న అభ్యర్ధిని విజేతగా ప్రకటిస్తారు. లేనట్లయితే తొలి రెండు స్ధానాల్లో ఉన్న అభ్యర్ధుల మధ్య రెండవ దఫా ముఖాముఖీ పోటీ నిర్వహిస్తారు.
అనేక కుట్రలు, కరోనా కారణంగా మూడు సార్లు వాయిదా పడి చివరకు ఆదివారం నాడు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 25నాటికి పూర్తై ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఏడాది క్రితం పోలీసులు, మిలిటరీ, మితవాద రాజకీయశక్తులు కలసి పన్నిన కుట్ర కారణంగా ఎన్నికల్లో విజయం సాధించిన మాస్‌ నేత ఇవోమొరేల్స్‌ పదవికి రాజీనామా చేసి తొలుత మెక్సికోలో తరువాత అర్జెంటీనాలో రాజకీయ ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ఎన్నికలు జరిగే రోజు వరకు కుట్రలు పన్నుతూనే ఉన్నందున అధికారికంగా ప్రకటించే వరకు ఓట్ల లెక్కింపులో అక్రమాలు, ఇతరంగా కుట్రలు జరిపి ఫలితాలను తారు మారు చేసే అవకాశాలను ఇప్పటికీ తోసి పుచ్చలేము. ఎగ్జిట్‌ పోల్స్‌ కార్యరూపం దాల్చితే గతేడాది ఇవో మొరేల్స్‌ కంటే ఎక్కువ ఓట్లతో మాస్‌ పార్టీ విజయం సాధించనుంది.


ఆదివారం నాడు ఎన్నికలు ముగిసిన వెంటనే సర్వే ఫలితాలను వెల్లడించేందుకు పౌర సమాజం, కాథలిక్‌ చర్చి ఏర్పాటు చేసిన స్వతంత్ర సర్వే సంస్ధలు, మీడియాకు అర్ధరాత్రి వరకు అనుమతి ఇవ్వకపోవటం, తొలి లెక్కింపు వివరాలను వెల్లడించకపోవటం అనేక అనుమానాలకు దారితీసింది. అక్రమ పద్దతుల్లో గద్దెనెక్కిన అమెరికా అనుకూల తాత్కాలిక అధ్యక్షురాలు జీనీ అనెజ్‌ బలపరచినట్లు ప్రచారం జరిగిన అభ్యర్ధికి కేవలం 14శాతమే వస్తాయని తేలటంతో ఆమె ఓటమిని అంగీకరించటం, ఇతర ప్రతికూల పరిణామాలేవీ లేకపోవటంతో మాస్‌ తిరిగి అధికారాన్ని చేపట్టటం ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ అమెరికా అనుకూల శక్తుల కుట్రలను ఊహించలేము.


కొన్ని చోట్ల తగిలిన ఎదురు దెబ్బల తరువాత ఈ ఎన్నికల ఫలితాలు మొత్తం లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులకు వచ్చిన అతిపెద్ద విజయం, మితవాద శక్తులకు, దానికి నాయకత్వం వహిస్తున్న అమెరికాకూ పెద్ద ఎదురుదెబ్బ. అంతే కాదు ప్రపంచంలోని మిగతా ప్రాంతాల వామపక్ష శక్తులకు ఎంతో ఉత్తేజమిచ్చే పరిణామం. ఈ ఫలితాలు అమెరికా పెత్తందారీ పోకడలకు చెంపదెబ్బ. నవంబరు మూడవ తేదీన జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ పలుకుబడిని మరింతగా దెబ్బతీస్తాయి. ఎగ్జిట్‌, ఓట్ల లెక్కింపు తొలి ఫలితాలు వెలువడగానే రాజధాని లాపాజ్‌లో మాస్‌ పార్టీ మద్దతుదారులు సంబరాలను ప్రారంభించారు. ప్రజాస్వామ్యాన్ని గమనంలో ఉంచుకొని జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని మాస్‌ అభ్యర్ధి ఆర్‌సి ప్రకటించారు. పార్టీ మద్దతదారులు, ఇతరులు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.


కోటీ పదహారు లక్షల మంది జనాభా ఉన్న బొలీవియాలో స్ధానిక గిరిజన తెగల జనాభా మెజారిటీ ఉన్నప్పటికీ, స్పెయిన్‌ వలస, స్వతంత్ర పాలన ఐదువందల సంవత్సరాలలో 2006లో ఇవోమొరేల్స్‌ విజయం సాధించే వరకు మెజారిటీ సామాజిక తరగతికి చెందిన వారు పాలనా పగ్గాలు చేపట్టలేకపోయారు. మొరేల్స్‌ గత ఏడాది జరిగిన ఎన్నికలలో విజయం సాధించినప్పటికీ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలో కుట్ర చేసి ఎన్నికల ఫలితాలను గుర్తించేందుకు నిరాకరించటంతో పాటు పార్లమెంట్‌ ద్వారా తాత్కాలిక అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. తాను తిరిగి ఎన్నికలను నిర్వహిస్తానని, కొత్త ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటు చేస్తానని మొరేల్స్‌ చెప్పినా అంగీకరించలేదు. రాజీనామా చేయాలని, తదుపరి అధ్యక్ష ఎన్నికలలో పాల్గొనేందుకు వీల్లేదని మిలిటరీ అధికారులు ఆదేశించారు. చివరకు అరెస్టు చేసి జైలు పాలు చేసే కుట్రను గ్రహించి తొలుత మెక్సికోలో తరువాత అర్జెంటీనాలో రాజకీయ ఆశ్రయం పొందారు. మొరేల్స్‌ అధ్యక్ష ఎన్నికల్లోనే కాదు, పార్లమెంట్‌ అభ్యర్ధిగా కూడా పోటీ చేయకూడదని కుట్రదారుల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఈ నేపధ్యంలో ఈ ఎన్నికలలో ఆయన ప్రభుత్వంలో పదేండ్లకు పైగా ఆర్ధిక మంత్రిగా పని చేసిన లూయీస్‌ ఆర్‌సి అభ్యర్ధిగా ఎంపికయ్యాడు. ఎన్నికల ఫలితాల సరళి వెలువడగానే తాను స్వదేశానికి రానున్నట్లు మొరేల్స్‌ ప్రకటించాడు. మొరేల్స్‌ మీద చేసిన ఆరోపణలను జనం విశ్వసించలేదని ఓటింగ్‌ తీరుతెన్నులు స్పష్టం చేశాయి.


వామపక్షాల స్ధానంలో అధికారానికి వచ్చిన మితవాద శక్తులు అంతకు ముందు అమలు జరిపిన సంక్షేమ చర్యలకు ఎలా గండికొడుతున్నారో చూసిన తరువాత బొలీవియన్లు మితవాదుల ప్రచారాన్ని పట్టించుకోలేదన్నది స్పష్టం అవుతోంది. అయితే నయావుదారవాద పునాదులను బద్దలు చేయకుండా వాటి మీద ఆధారపడి తీసుకొనే సంక్షేమ చర్యలకు పరిమితులు ఏర్పడి జనంలో అసంతృప్తి తలెత్తుతున్నట్లు అనేక దేశాల అనుభవాలు వెల్లడించాయి. బొలీవియాలో ఏర్పడనున్న నూతన మాస్‌ ప్రభుత్వం ప్రతిపక్షం, అమెరికా సామ్రాజ్యవాదుల కుట్రల మధ్య ఆ సవాళ్లను ఎలా స్వీకరించనున్నది చూడాల్సి ఉంది.
ఇవో మొరేల్స్‌ను ఆధికారం నుంచి తొలగించటం లాటిన్‌ అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మూలమలుపు అని డోనాల్డ్‌ ట్రంప్‌ వర్ణించిన విషయం తెలిసిందే. కానీ అదే ట్రంప్‌ హయాంలో మాస్‌ ప్రతినిధి తిరిగి అధికారాన్ని చేపట్టబోతున్నాడు. అధికారంలో ఉండి ఓడిపోయిన అధ్యక్షుడిగా అదే ట్రంప్‌ చరిత్ర చెత్తబుట్టకు ఎక్కనున్నారు. ప్రజాస్వామ్యం పేరుతో ఎలాంటి పరిహాస ప్రాయమైన వాదనలతో కుట్రదారులు వ్యవహరిస్తారో బొలివీయా పరిణామం స్పష్టం చేసింది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో లెక్కింపు ప్రారంభంలో ప్రత్యర్ధికంటే ఇవోమొరేల్స్‌ మెజారిటీ 7.87శాతమే ఉందని, తరువాత 10.15శాతంగా ప్రకటించారని, తరువాత దాన్ని 10.52కు పెంచి మొరేల్స్‌ గెలిచినట్లు ప్రకటించారని ఆక్రమాలకారణంగానే ఇలా జరిగిందని అమెరికా కనుసన్నలలో నడిచే అమెరికా దేశాల సంస్ధ (ఓఏఎస్‌) ఆరోపించింది. ఎన్నికలకు ముందే ఈ సంస్ధతో పాటు ఐరోపా దేశాల ప్రతినిధులు అక్రమాల గురించి ప్రచారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరుగులేని మెజారిటీకారణంగానే గత ఎన్నికలలో చివరిలో మోరెల్స్‌ అవసరమైన మెజారిటీ సాధించారు. తాజా ఎన్నికల్లో కూడా అదే ధోరణి వ్యక్తమైనట్లు వచ్చిన వార్తలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది మాస్‌కు మెజారిటీ వస్తున్న సమయంలో వివరాలను వెల్లడించకుండా నిలిపివేసి తరువాత ప్రకటించటంతో పెద్ద తేడా రావటాన్ని కూడా ఎన్నికల అక్రమంగానే కుట్రదారులు ఆరోపించారు. అయితే తరువాత వాటికి ఎలాంటి ఆధారాలను చూపలేకపోయారు.


తాజా ఎన్నికలో మాస్‌ పార్టీ విజయం సాధించనుందని తొలి నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. మితవాద శక్తుల మధ్య ఉన్న వివాదాలను సర్దుబాటు ఒకే అభ్యర్ధిని పోటీకి నిలపాలని ప్రయత్నించారు. అయితే రెండవ అభ్యర్ధి రంగంలోకి దిగాడు. తొలి విడత ఎవరికీ మెజారిటీ వచ్చే అవకాశం లేదనే అంచనాతో దిగిన మితవాద శక్తులకు మలివిడత ఎన్నికలతో పని లేకుండానే బొలీవియన్లు నిర్ణయాత్మక తీర్పునిచ్చారు. ఎన్నికలకు ముందు జరిపిన సర్వేల ప్రకారం ఆర్‌సికి 42.3, మెసాకు 33.1, మూడవ అభ్యర్ధికి 16.7శాతం ఓట్లు వస్తాయని వెల్లడించారు. మెసాకు మద్దతుగా అనెజ్‌ పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గత ఏడాది మొరేల్స్‌కు 47శాతం వచ్చాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల ప్రకారం లూయీస్‌ ఆర్‌సికి 52.4శాతం, కార్లోస్‌ మెసాకు 31.5, మూడవ పార్టీకి 14.1శాతం వస్తాయని వార్తలు వెలువడ్డాయి.
గతంలో తాము నడచిన బాటనే ముందుకు పోవాలని దేశ ప్రజలు ఈ తీర్పు నిచ్చారని ఆర్‌సి వర్ణించారు. ఇవో మొరేల్స్‌ మాదిరి ప్రజా ఉద్యమాల నుంచి నేతగా ఆవిర్భవించనప్పటికీ ఒక మేథావిగా మాస్‌ ఎత్తుగడలు, విధానాలను నిర్ణయించటంలో ఆర్‌సి కీలకపాత్ర వహించారు. అనేక సంస్కరణలకు కీలకవ్యక్తిగా మారటమే కాదు మొరేల్స్‌ తరువాత ప్రజల అభిమానం పొందారు. గత ఏడాది కాలంలో కుట్రదారుల ప్రభుత్వం అనుసరించిన అక్రమాలు, అవినీతి కారణంగా బొలివీయన్లు రెండు ప్రభుత్వాల మధ్య తేడాను గమనించారు. 2002 నుంచి జరిగిన బొలీవియా ఎన్నికలు, అనంతర పరిణామాలను చూసినపుడు రెండు శిబిరాలుగా రాజకీయ సమీకరణలు జరిగాయి. తాము వ్యతిరేకించే శక్తులు అధికారానికి వచ్చినపుడు వారికి సమస్యలు సృష్టించేందుకు మితవాదులు చేయని ప్రయత్నం లేదు. గత ఏడాది ఇవో మొరేల్స్‌ను అడ్డుకోవటం పరాకాష్ట. ఈ కారణంగానే ఈ సారి కూడా అలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చని, ఏదో ఒకసాకుతో మిలిటరీ రంగంలోకి దిగవచ్చని జోశ్యం చెప్పిన వారు కూడా ఉన్నారు.


మాస్‌ పార్టీ నేతగా ఇవో మొరేల్స్‌ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన కొచబాంబా ప్రాంతం ఉన్న చపారే రాష్ట్రంలో, ఇతర చోట్ల పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు గత ఏడాది కాలంలో తాత్కాలిక ప్రభుత్వం పాల్పడని తప్పుడు పని లేదు. సంఘవ్యతిరేక శక్తులను ప్రోత్సహించి మాస్‌ కార్యకర్తల మీద, సామాన్య జనం మీద దాడులు చేయించారు. చమురు ఉత్పత్తుల సరఫరాకు ఆటంకం కలిగించారు. మాదక ద్రవ్యాల నిరోధం పేరుతో పోలీసులతో గ్రామాల మీద దాడులు చేయించారు. మిలిటరీని ప్రయోగించి భయపెట్టారు. మొరేల్స్‌ వ్యతిరేకులకు పెద్ద ఎత్తున నిధులు అందచేసి తప్పుడు ప్రచారం చేయించారు. ఈ ఎన్నికల్లో అనేక మంది మాస్‌ అభ్యర్దులను పోటీకి అనర్హులుగా ప్రకటించారు. పోటీలో ఉన్నవారి మీద పోలీసు దాడులు చేయించారు. అంతెందుకు అధ్యక్ష పదవికి పోటీపడిన ఆర్‌సిని అనేక సార్లు అనర్హునిగా ప్రకటిస్తామని బెదరించారు. మితవాద శక్తులు ఎన్నికల సంఘం మీద వత్తిడి తెస్తూ నిరసన ప్రదర్శనలకు దిగాయి. మీడియా సంగతి చెప్పనవసరం లేదు. మాస్‌ పార్టీకి వ్యతిరేకంగా మితవాదశక్తులకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు. ఉన్నది ఉన్నట్లు రాస్తారు, చూపుతారు అని అనుమానం వచ్చిన స్దానిక, విదేశీ జర్నలిస్టులపై ఆంక్షలు విధించారు. టెలిసుర్‌, ఆర్‌ టీవీ ఛానల్స్‌ ప్రసారాల అనుమతులను రద్దు చేశారు.పదిహేను సామాజిక రేడియోలను మూయించారు. కొందరు జర్నలిస్టుల మీద కుట్ర అనుకూల మూకలను ఉసిగొల్పారు.
అన్నీ సక్రమంగా జరిగితే కొత్తగా తిరిగి ఏర్పడే మాస్‌ ప్రభుత్వ ప్రమాణస్వీకారం పెద్ద ఎత్తున జరిపే అవకాశాలున్నాయి. క్యూబా,వెనెజులా, నిగరాగువా మరికొన్ని దేశాల ఆధినేతలు అతిధులుగా అర్జెంటీనా ప్రవాసం నుంచి తిరిగి వచ్చే ఇవోమోరేల్స్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయవచ్చునని చెబుతున్నారు. అయితే అమెరికా సామ్రాజ్యవాదులు ఈ పరిణమాన్ని సహిస్తారా ? మాస్‌ విజయాన్ని వమ్ము చేయకుండా ఉంటారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా సంగతి తరువాత, ముందు బంగ్లాదేశ్‌ను అధిగమించండి !

18 Sunday Oct 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

Bangladesh Per capita GDP, IMF about India, India per capita GDP


ఎం కోటేశ్వరరావు


ఆగండి ఆగండి శీర్షికను చూసి ఉద్రేకపడకండని కొందరికి సవినయ మనవి. ఇది కమ్యూనిస్టులు ఇచ్చిన సలహా కాదు మహాశయులారా ! మోడినోమిక్స్‌ అంటే తెలుసు కదా ! నరేంద్రమోడీ ప్రావీణ్యత సంపాదించిన ప్రత్యేక ఆర్ధశాస్త్రం. అసలు ఆయనే చదువుకున్నారో మనకు తెలియదు. చదువులతో పనేముంది అంటూ ఆయన ప్రకటించిన విధానాలను చూసి అర్ధశాస్త్ర పండితుడని, ఆ పాండిత్యం అనితర సాధ్యం కనుక ఆయన పేరుతోనే మన మీడియా కితాబిచ్చింది. ఇప్పుడు అదే మీడియాలో ఒక విశ్లేషణ వెలువడింది. చైనా సంగతి తరువాత ముందు బంగ్లాదేశ్‌ను అధిగమించండి అనే శీర్షికతో ఒక విశ్లేషణ వెలువడింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తీరు తెన్నుల గురించి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) వెల్లడించిన తాజా అంచనా-జోశ్యంలో చెప్పిన అంశాలు మోడినోమిక్స్‌ గాలితీస్తున్నాయి. ఆండీ ముఖర్జీ అనే జర్నలిస్టు మోడీకి అలాంటి సలహా ఇచ్చేందుకు చేసిన సాహసాన్ని ముందుగా అభినందించాలి. పైన పేర్కొన్న శీర్షికతో ఆండీ రాసిన దాన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రచురించింది.


ఐఎంఎఫ్‌ నివేదిక అందరికీ అందుబాటులో ఉంది. అదేమీ రహస్య పత్రం కాదు.మరికొందరు విశ్లేషకులు కూడా దాని మీద వ్యాఖ్యలు, వార్తలు రాశారు. ఆండీ ముఖర్జీ శీర్షిక ఎంతో సూటిగా వాస్తవానికి దగ్గరగా ఉంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన తలసరి జిడిపి పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌ కంటే తగ్గనుందని ఐఎంఎఫ్‌ చెప్పింది. ” ఏ వర్ధమాన ఆర్ధిక వ్యవస్ద అయినా బాగా పని చేస్తున్నదనటం శుభవార్త. అయితే ఐదు సంవత్సరాల క్రితం 25శాతం ఆధిక్యతలో ఉన్న భారత్‌ ఇప్పుడు వెనుకపడటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది ” అని ప్రముఖ ఆర్ధికవేత్త కౌశిక్‌ బసు ఐఎంఎఫ్‌ నివేదిక వెలువడిన వెంటనే ట్వీట్‌ చేశారు. మన కేంద్ర పాలకుల స్పందన చూస్తే చీమకుట్టినట్లు కూడా లేదు.


చైనాను అధిగమిస్తామని చెప్పిన వారు చివరకు అత్యంత పేద దేశాల్లో ఒకటైన బంగ్లాదేశ్‌కంటే వెనుకబడిపోవటం విజయనాదాలు తప్ప మరొకటి తెలియని నరేంద్రమోడీ గణానికి జీర్ణించుకోలేని అంశమే. ఒక పెద్ద దేశంగా మన ఆర్ధిక వ్యవస్ధ పెద్దదిగా ఉండవచ్చుగానీ తలసరి విషయంలో ఎంత వెనుకబడి ఉందో ఈ పరిణామం స్పష్టం చేసింది. దీనికి కారణం కరోనా అని ఠకీమని చెప్పవచ్చు. చివరకు దానిలో కూడా మన ప్రధాని అంతర్జాతీయ సమాజంలో తలదించుకోవాల్సిందే. బంగ్లాదేశ్‌ జనాభా కంటే మనం ఎనిమిది రెట్లు ఎక్కువ. అక్టోబరు 18 నాటికి ప్రపంచంలో కరోనా సోకిన వారు నాలుగు కోట్లు దాటారు.మన దేశంలో 75లక్షల మందికి కరోనా సోకితే, 1,114,064 మంది మరణించారు. అదే బంగ్లాదేశ్‌లో 3,87,295 మందికి వైరస్‌ సోకగా 5,646 మంది మరణించారు. అంటే మన దేశంలో 20 రెట్లు మరణాలు ఎక్కువ.


మన జిడిపి 10.3శాతం తిరోగమనంలో ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేయగా బంగ్లాదేశ్‌లో 3.8శాతం పురోగమనంలో ఉంటుందని పేర్కొన్నది.అందుకే కరోనా లేకపోయినా తలసరి జిడిపిలో బంగ్లాదేశ్‌ మనలను మించి పోయి ఉండేదని ఆర్దికవేత్తలు పేర్కొన్నారు. నైపుణ్యం తక్కువగా ఉన్న వారు చేయగలిగిన వస్తు తయారీకి ప్రాధాన్యత ఇచ్చే విధానాలు అనుసరించటమే దీనికి కారణం.తొలి సంవత్సరాల్లో చైనా అనుసరించిన విధానమదే. ఎగుమతులతో పాటు ఉపాధి కల్పించింది. బంగ్లాదేశ్‌లో పని చేయగలిగిన వయస్సులోని ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరు కార్మికులుగా ఉన్నారు. మన దేశం కంటే ఎక్కువ. ప్రస్తుతం చైనా నైపుణ్యం తక్కువ అవసరమైన ఉత్పత్తులకు బదులు అధిక నైపుణ్యం కలిగిన వస్తు తయారీ, సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నందున బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలు చైనా వదలిన ఖాళీని పూర్తి చేసి ఎగుమతుల బాటలో పయనిస్తున్నాయి. మన దేశంలో ప్రతి ఏటా కొత్తగా 80లక్షల మందికి ఉపాధి కల్పించాల్సి ఉంది. కరోనా కారణంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులయ్యారు. ఈ నేపధ్యంలోనే చైనాతో పోల్చుకోవటం పక్కన పెట్టి బంగ్లాదేశ్‌ వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించాలని ఆండీ ముఖర్జీ సూచించారు.


ఐదేండ్ల క్రితం మన తలసరి జిడిపి బంగ్లాదేశ్‌ కంటే 24శాతం ఎక్కువగా ఉంది. కానీ 2020లో మన తలసరి జిడిపి 1,876.53 డాలర్లుగా అంచనా వేస్తే బంగ్లాదేశ్‌లో 1,887.97 డాలర్లుగా పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌ అంచనాలు దిగువ విధంగా ఉన్నాయి. 2021లో మన తలసరి జిడిపి 2,030.62 డాలర్లు ఉంటే బంగ్లాదేశ్‌లో 1,989.85గా ఉంటుంది. అయితే 2024లో రెండు దేశాల్లో దాదాపు సమంగా ఉన్నప్పటికీ 2025నాటికి మన దేశంలో 2,729.24 డాలర్లు, బంగ్లాదేశ్‌లో 2,756.10డాలర్లు ఉంటుంది. ఇక చైనా విషయానికి వస్తే 2020లో తలసరి జిడిపి 10,839.43 డాలర్లు. మన పొరుగునే ఉన్న నేపాల్‌లో 1,115, శ్రీలంకలో 3,697 డాలర్లుగా పేర్కొన్నది. అందువలన మన చైనాతో పోటీ పడటానికి బదులు బంగ్లాదేశ్‌, శ్రీలంకలను అధిగమించేందుకు పూనుకోవటం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.
బంగ్లాదేశ్‌ కంటే మనం వెనుకబడిపోతున్నామనటాన్ని మన అధికార యంత్రాంగం అంగీకరించటం లేదు. కొనుగోలుశక్తి ప్రాతిపదికన లెక్కించే పిపిపి ప్రకారం 2020 మన తలసరి జిడిపి 6,284 డాలర్లుంటుందని అదే బంగ్లాదేశ్‌లో 5,139 డాలర్లని పేర్కొన్నట్లు పిటిఐ తెలిపింది. ఐఎంఎఫ్‌ అంచనాలతో ఇప్పుడు అనేక మంది చైనాను పక్కన పెట్టి బంగ్లాదేశ్‌తో మన దేశాన్ని పోలుస్తున్నారు. ఇది ఎన్‌డిఏకు ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోడీకి ఒక పెద్ద సవాలు విసరటం తప్ప వేరు కాదు. 2004-16 మధ్య మన దేశ జిడిపి పెరుగుదల రేటు బంగ్లాదేశ్‌ కంటే వేగంగా ఉంది. అయితే 2017 నుంచి బంగ్లా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. గత 15 సంవత్సరాలలో మన జనాభా పెరుగుదల 21శాతం పెరగ్గా బంగ్లాదేశ్‌లో 18శాతం మాత్రమే ఉంది. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరని, పిల్లల్ని ఎక్కువగా కని ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్‌ సమాజంగా మారుస్తారని ప్రచారం చేసే వారికి ఇది చెంపపెట్టు.


ప్రపంచ ఆకలి నివేదిక 2019, ప్రపంచ బ్యాంకు సమాచారం మేరకు కొన్ని అంశాలలో రెండు దేశాల మధ్య కొన్ని సూచికల పోలిక దిగువ విధంగా ఉంది.
అంశం బంగ్లాదేశ్‌ ×××××××× భారత్‌
ద్రవ్యోల్బణ శాతం 5.8 ××××××××× 3,8
కరంట్‌ ఖాతాలోటు శాతం జిడిపి -2.4 ××××××××× 0.7
జిడిపిలో నిఖర ఎఫ్‌డిఐశాతం 0.4 ×××××××××× 1.1
జిడిపిలో ద్రవ్యలోటు శాతం -8.8 ×××××××××× -12.4
జిడిపిలో రుణశాతం 49 ×××××××××× 90
మానవాభివృద్ధి సూచిక 135 ×××××××××× 129
ఆయు ప్రమాణం సం. 72.3 ×××××××××× 69.4
మహిళా కార్మికుల భాగస్వామ్యశాతం 36 ×××××××××× 20.335
సులభతర వాణిజ్య సూచిక 168 ×××××××××× 63
ఆర్ధిక స్వేచ్చ సూచిక 122 ×××××××××× 105
బ్యాంకుఖాతాలున్న పెద్దలశాతం 50 ×××××××××× 80
మరుగుదొడ్లు ఉన్నవారి శాతం 48.23 ××××××××× 59.43
అపరిశుభ్రత కారణంగా మరణాలు 11.9 ××××××××× 18.6
సమానత్వ సూచిక 50 ××××××××× 112
ఆకలి సూచిక 75 ××××××××× 94


బంగ్లాదేశ్‌లో జనాభా ఎక్కువగా పరిశ్రమలు, సేవారంగం మీద ఆధారపడుతుండగా మన దేశంలో వ్యవసాయరంగం ప్రధానంగా ఉంది. అనేక రంగాలలో పురోగతి ఉన్నప్పటికీ మన దేశంతో పోల్చితే బంగ్లాదేశ్‌లో దారిద్య్రం ఎక్కువగా ఉంది. ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం 2019-20లో బంగ్లాదేశ్‌లో 21.9శాతం మంది దారిద్య్రంలో ఉండగా మన దేశంలో 8.3శాతం ఉన్నారు. 2021-22 నాటికి బంగ్లాలో 21.4శాతానికి తగ్గుతారని మన దేశంలో పదిశాతానికి పెరుగుతారని అంచనా. చైనా అయినా బంగ్లాదేశ్‌ అయినా ఎదగటానికి దశాబ్దాలు పట్టింది. కానీ మన పాలకులు ముఖ్యంగా గత ఆరు సంవత్సరాలుగా అరచేతిలో స్వర్గాన్ని చూపుతున్నారు. గుజరాత్‌ నమూనాను దేశమంతటా అమలు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు చైనా నుంచి కంపెనీలు వస్తున్నాయని ఊరించారు. వస్తే వచ్చాయి, వస్తాయో రావో తెలియని వాటి గురించి ఊహల్లో లెక్కలు వేసుకుంటూ మంచాలు నేసే సోమరిపోతులను గుర్తుకు తెస్తున్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి తగు చర్యలు తీసుకుంటారా ? మరో కొత్త ఊరింపులతో జనాన్ని మభ్యపెడతారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తనిష్క ”ఏకత్వం”పై హిందూత్వ రంధ్రాన్వేషకుల దాడి !

15 Thursday Oct 2020

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Hindutva cynics trolling, Tanishq Ekatvam ad


ఎం కోటేశ్వరరావు


హిందూ – ముస్లిం ఐక్యత ఇతివృత్తంతో టాటా గ్రూపు ఆభరణాల కంపెనీ తనిష్క రూపొందించిన ఒక వాణిజ్య ప్రకటనను వివాదాస్పదం కావించారు. దాంతో కంపెనీ దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. తొలుత తమ ప్రకటనపై వ్యతిరేక, అనుకూలతలను వ్యక్తం చేసే వ్యాఖ్యలకు అవకాశం లేకుండా చేసింది. తరువాత ఏకంగా ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే భారత ప్రకటనల ప్రమాణాల మండలి(ఎఎస్‌సిఐ) వెంటనే ఒక ప్రకటన చేస్తూ తనిష్క ప్రకటన ఏ ప్రమాణాలనూ ఉల్లంఘించనందున దాని మీద చేస్తున్న ఫిర్యాదులు నిలిచేవి కాదని, కావాలనుకుంటే ప్రకటనదారులు ప్రసారం చేసుకోవచ్చని పేర్కొన్నది. తనిష్క ప్రకటనలో ఎలాంటి అసభ్యత లేదా అసహ్యకరమైనదేమీ లేదని పేర్కొన్నది. ప్రకటనలు, మీడియా రంగంలో ఉన్న అనేక సంస్దలు ఇదే విధమైన మద్దతును ప్రకటించాయి. అయినా హిందూత్వశక్తులు దాడులకు దిగుతాయనే భయంతో ప్రకటనను వెనక్కు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
కొందరి మనోభావాలు దెబ్బతినటాన్ని గమనంలో ఉంచుకొని తమ ఉద్యోగులు, దుకాణ సిబ్బంది, భాగస్వాముల సంక్షేమం దృష్ట్యా ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు తనిష్క తెలిపింది. గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ జిల్లా గాంధీ ధామం పట్టణంలోని తనిష్క దుకాణంలో ఈ మేరకు ఒక ప్రకటనను కంపెనీ అంటించింది. దుకాణంపై కొందరు దాడికి దిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొంత మంది దుకాణం వద్దకు వెళ్లి ప్రశ్నించారు తప్ప దాడి లేదా దుకాణ ధ్వంసం గానీ జరగలేదని, ఫోన్లద్వారా అనేక మంది నిరసన తెలిపారని పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిని పలువురు నెటిజన్లు, ఖండించారు. ఈ ప్రకటనపై వెల్లడైన ధోరణి ఆందోళన కలిగిస్తున్నదని, ప్రకటనను రూపొందించిన వారికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు అడ్వర్టైజింగ్‌ క్లబ్‌ ప్రకటించింది.


ఇటీవలి కాలంలో రంధ్రాన్వేషణ చేసే శక్తులు ప్రతి దానిలో హిందూత్వకు హాని జరుగుతోందంటూ మనోభావాలను రెచ్చగొట్టేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోవటం లేదు. గర్భిణీతో ఉన్న హిందువు అయిన కోడలికి ఒక ముస్లిం కుటుంబం హిందూ సాంప్రదాయ ప్రకారం సీమంతం జరపటం, ఆ సందర్భంగా కోడలికి తనిష్క ఆభరణాన్ని బహుకరించే 44 సెకండ్ల ప్రకటనను తనిష్క కంపెనీ తయారు చేయించి విడుదల చేసింది. ముస్లిం యువకులు కుట్రతో హిందూ యువతులను ప్రలోభ పెట్టి వివాహాలు చేసుకొనటాన్ని -లవ్‌జీహాద్‌- ప్రోత్సహించేదిగా, ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేదిగా ప్రకటన ఉందంటూ కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమంలో దాడికి దిగితే గాంధీ ధామం, ముంబై తనిష్క దుకాణాల వద్ద మతశక్తులు గుమికూడి నిరసన తెలిపినట్లు వార్తలు వచ్చాయి.


అనేక మంది బిజెపి అగ్రనేతల కుమార్తెలు హిందువులను వివాహాలు చేసుకున్నారు. పోనీ వారేమీ చదువు సంధ్యలు లేని లేదా మంచీ చెడ్డలు తెలియని వారు కాదు. అదే విధంగా కొందరు బిజెపి పెద్దలు ముస్లిం మతానికి చెందిన యువతులను తమ కుమారులకు ఇచ్చి వివాహాలు చేసినవారు కూడా ఉన్నారు. హిందూ అమ్మాయిలను ముస్లింలు చేసుకోవటం తప్ప హిందూ అబ్బాయిలు ఎంత మంది ముస్లిం అమ్మాయిలను చేసుకున్నారో చెప్పండి అని కొంత మంది అడ్డు సవాళ్లు విసురుతారు. దీనిలో ఏమన్నా రిజర్వేషన్లు ఉన్నాయా ? వివాహం వ్యక్తిగతం, దానికి మతాన్ని ముడి పెట్టే దుష్ట యత్నంలో భాగమే లవ్‌ జీహాద్‌ ప్రచారం.
మతం ఒకటే అయినా హిందువులలో వేర్వేరు కులాల మధ్య జరుగుతున్న వివాహాలను కులపెద్దలు అంగీకరించకుండా పంచాయతీలతో విడదీయటం, దాడులు, హత్యలకు పాల్పడటాన్ని చూస్తున్నాము. మిర్యాలగూడెంలో అమృత-ప్రణరు, హైదరాబాదులో అవంతిక-హేమంత్‌ ఉదంతాలు అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. రెండు ఉదంతాల్లో హిందూ యువకులను చంపించింది హిందూ మత మామలే కదా ! ముస్లిం కుటుంబం హిందూ యువతికి సీమంతం జరపటానికి బదులు హిందూ కుటుంబం ముస్లిం యువతికి సీమంతం జరిపే విధంగా ఏకత్వ ప్రకటనను ఎందుకు రూపొందించలేదంటూ రంధ్రాన్వేషకులు తనిష్క ప్రకటన మీద అర్దం లేని, వితండ వాదనకు దిగారు. నిజానికి వారికి మతద్వేషం లేకపోతే ఆ ప్రకటనను సమర్ధించి రెండో విధంగా కూడా ప్రకటనలు రూపొందించి రెండు మతాల మధ్య సమదూరం పాటించాలని కంపెనీకి సలహా ఇవ్వవచ్చు, దానికి బదులు ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు, తనిష్క ఆభరణాల కొనుగోలును బహిష్కరించాలని పిలుపు ఇవ్వటాన్ని ఏమనుకోవాలి ?


గతంలో కూడా కొన్ని ప్రకటనలను ఆధారం చేసుకొని హిందూమతోన్మాదాన్ని, ముస్లిం ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాయి. హిందూస్తాన్‌ లీవర్‌ కంపెనీ ఉత్పత్తి సర్ఫ్‌ఎక్సెల్‌ పౌడర్‌ గురించిన ప్రకటనలో స్నేహితులైన హిందూ బాలిక ముస్లిం బాలుడితో హౌలీ సందర్భాన్ని చిత్రించారు. దానిలో నువ్వు నమాజుకు వెళ్లిరా తరువాత రంగు పడుతుంది అని బాలిక అంటుంది. దాన్ని వక్రీకరించి హౌలీ పండుగ కంటే నమాజుకు ప్రాధాన్యత ఇచ్చారంటూ రంధ్రాన్వేషకులు దాడి చేశారు. ఇదే కంపెనీ తన రెడ్‌ లేబుల్‌ టీ పౌడర్‌ ప్రకటనకు కుంభమేళాను ఇతివృత్తంగా ఎంచుకుంది. వృద్దుడైన తన తండ్రితో మేళాకు వెళ్లిన కొడుకు నుంచి జనం రద్దీలో తండ్రి విడిపోతాడు. కొద్ది సేపటి తరువాత కొడుకు దాన్ని గ్రహించి తండ్రిని వెతుక్కుంటూ వెళ్లి ఒక టీ స్టాల్‌ దగ్గర తండ్రిని కలుసుకుంటాడు. ఇద్దరూ టీ తాగుతూ ముసలి వారిని వదిలించుకొనే చోట నాకోసం తిరిగి వచ్చావంటూ కొడుకును తండ్రి అభినందిస్తాడు.


దీని మీద హిందువులు పవిత్రంగా భావించే కుంభమేళాను కించపరుస్తారా బహిష్కరించండి హిందుస్తాన్‌ లీవర్‌ కంపెనీ ఉత్పత్తులను అంటూ సామాజిక మాధ్యమంలో దాడికి దిగారు. దాని మీద ఆ కంపెనీ తన ప్రకటనను సమర్ధించుకుంది. ముసలి వారిని వదిలించుకొనేవాటిలో సకుంభమేళా స్ధలం ఒకటి. మన పెద్దవారి సంరక్షణ పట్టించుకోకపోవట విచారకరం కాదా ? అలాంటి చోట్ల చేతులు పట్టుకొని పెద్దవారిని తీసుకు పోవాలని ప్రోత్సహించే లక్ష్యంతోనే ఆప్రకటనను రూపొందించామని, ఆ ప్రకటన చూడండి ఒక నగసత్యం గురించి కళ్లు తెరిపిస్తుంది అని పేర్కొన్నది. దానికి విపరీత అర్ధం చెబుతూ హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు.


మామూలుగానే వృద్దులను వదిలించుకొనే బాధ్యతా రహితులైన వారు నిత్యం మనకు దర్శనమిస్తుంటారు. ఉత్తరాదిలో కుంభమేళా సందర్భంగా కొందరు కావాలనే ముసలివారిని వదలి వేసి తమదారి తాము చూసుకుంటారన్నది నమ్మలేని నిజం. మేళా ముగిసిన తరువాత అలాంటి వారందరినీ వృద్దాశ్రమాలకు తరలిస్తారు. ఆ దుర్మార్గాన్ని ఖండించి, నిరసించాల్సింది పోయి ఒక సందేశాత్మక అంశంతో రూపొందించిన ప్రకటనకు మతానికి ముడిపెట్టటం దేశంలో మతోన్మాద భావనలను ఎంతగా మెదళ్లకు ఎక్కించారో స్పష్టం చేస్తున్నది.


కుంభమేళాలో ఇలాంటి దురాచారం, కొందరు బిడ్డల బాధ్యతా రాహిత్యం గురించి 2013 ఫిబ్రవరిలో నేషనల్‌ జాగ్రఫిక్‌ న్యూస్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. తమ కుటుంబాల్లోని ముసలి వారిని వదిలించుకొనేందుకు కుంభమేళా కోసం ఎదురు చూసే వారు కూడా ఉంటారని అనుష్‌ మాలవీయ అనే ఒక సామాజిక కార్యకర్త చెప్పిన అంశాన్ని దానిలో పేర్కొన్నారు. వదలివేసినట్లు ఎవరూ అంగీకరించరు గానీ అది వాస్తవం అని అనుష్‌ చెప్పారు. అలా విస్మరణకు గురైన వారిలో తాము ఎక్కడి నుంచి వచ్చామో కూడా తెలియని వారు ఉంటారని, కొందరు వృద్దాశ్రమాల్లో చేరితే మిగిలిన వారు వీధులపాలై యాచకులుగా మారతారని చెప్పారు. వారణాసి, బృందావన్‌ ప్రాంతాల్లో వితంతు మహిళలను వదలివేసే దురాచారం ఇప్పటికీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏ పురాణం లేదా వేదాలు కూడా అనాధలైన వారిని ఇలా విస్మరించమని చెప్పలేదు.


తనిష్క ఏకత్వ ప్రకటనను వెనక్కు తీసుకోవటం గురించి సానుకూల విమర్శలు కూడా వెలువడ్డాయి. ఇలాంటి చర్యలు సామాజిక మాధ్యమంలోని మతోన్మాదులకు మరింత ప్రోత్సాహాన్నిస్తాయని ట్రస్ట్‌ రిసర్చ్‌ ఎడ్వజరీ సంస్ధ సిఇఓ ఎన్‌ చంద్రమౌళి చెప్పారు.భవిష్యత్‌లో మిగిలిన ప్రకటనదారులకు ఇదొక సంప్రదాయంగా మారుతుందన్నారు. ప్రకటన వెనక్కు తీసుకోవటం విచారకరమని, తనిష్క మీద ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. ప్రకటనను వెనక్కు తీసుకోవటం వలన మంచి కంటే మరింత నష్టం జరుగుతుందని మరో మీడియా అధిపతి సందీప్‌ గోయల్‌ అన్నారు. ఒక బ్రాండ్‌గా నమ్మిన దానికి నూటికి నూరుశాతం కట్టుబడి ఉండాలి, లేనట్లయితే అది తెచ్చిపెట్టుకున్నదని, వెన్నుముక లేదని అనుకోవాల్సి ఉంటుందన్నారు. తనిష్క తన ప్రకటనకు కట్టుబడి ఉండాల్సిందని ఎక్కువ మంది ప్రకటనల రంగంలోని వారు అభిప్రాయపడ్డారు.


హిందువులను కించపరిచే ప్రకటనల పేరుతో ఆయా కంపెనీల వస్తువులను బహిష్కరించాలని సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్న పిలుపులను వినియోగదారులు పట్టించుకుంటారా ? దానికి ఎలాంటి ఆధారాలు లేవు. పట్టించుకొనేట్లయితే చైనా వస్తువులను బహిష్కరించాలని కాషాయ తాలిబాన్లు నిత్యం పారాయణం చేస్తుంటారు. ఎందరు పట్టించుకున్నారు ? నరేంద్రమోడీ హయాంలో వాటి దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. అలాంటి పిలుపు ఇచ్చే వారు వాడే సెల్‌ఫోన్‌ లేదా కంప్యూటర్లలో చైనావే ఎక్కువగా ఉంటున్నాయి లేదా చైనా విడిభాగాలు లేని పరికరాలు దాదాపుగా లేవు. అయితే అలాంటి ప్రచారం మెదడు ఉపయోగించని లేదా సరిగా ఎదగని వారి బుర్రలను ఖరాబు చేసేందుకు పనికి వస్తాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కుష్‌బూతో బిజెపి సినిమా హిట్టా ఫట్టా !

13 Tuesday Oct 2020

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

AIADMK, DMK, Kushboo Sunder, Kushboo Sunder in BJP, Tamilnadu politics


ఎం కోటేశ్వరరావు


సినిమా గోలగా చెప్పాలంటే ఒక హీరో లేదా హీరో తమ తదుపరి చిత్రంలో చేసేందుకు అంగీకరించటమే సగం విజయమన్నట్లుగా కొందరు నిర్మాతలు తమ ఖుషీని ప్రకటిస్తారు. ఒకప్పటి అగ్రశ్రేణి హీరోయిన్‌గా నీరాజనాలందుకున్న ఖుషఉ్బ గతంలో డిఎంకె, కాంగ్రెస్‌ చిత్రాల్లో నటించి ఇప్పుడు బిజెపి సినిమాలో పని చేసేందుకు అంగీకరించారు. ఇల్లలకగానే పండుగ కాదు అన్నట్లుగా ఎంతో గొప్ప తారాగణంతో తీసిన సినిమాలను జనం ఇంటికి పంపిన చరిత్ర కూడా సినిమా రంగంలో నమోదైంది.


ఒక వ్యక్తిగా ఏ పార్టీలో చేరేందుకైనా ఉన్న హక్కును ఎవరికీ కాదనలేము. అయితే జనాలకు సుద్దులు చెబితేనే మండుతుంది.పార్టీలు ఫిరాయించేవారు చెప్పే ఇలాంటి కబుర్లు విని విని జనానికి బోరు కొట్టింది. నేను ఎన్ని పార్టీలైనా మారవచ్చు, మార్పు సహజం, మారాలి అని సెలవిచ్చిన ఆమె తన సిద్దాంతాలు మాత్రం మారలేదని చెప్పారు. హీరోయిన్‌గా ఎన్ని సంవత్సరాలైనా ఫిట్‌నెస్‌ మారలేదు, ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేస్తాను అంటే నిర్మాతలు అంగీకరించవచ్చు, అలా చేస్తే ప్రేక్షకులు ఆదరించవచ్చు. కానీ రాజకీయాలు సినిమాలు కావు. కుష్‌బూ ఏ పార్టీలో చేరితో ఆమె చెప్పిన సిద్దాంతంతో ఆయా పార్టీలు మారిపోతాయా ? ఇంతకీ ఆమె సిద్దాంతం ఏమిటి ?
తన సిద్దాంతాలు లేదా భావజాలం మారలేదు అని చెబుతున్న కుష్‌బూ పెళ్లికి ముందు కన్యలు పవిత్రంగా ఉండాలనే చాదస్తాల నుంచి సమాజం బయటపడాలని, కోరుకున్న పురుషుడితో జీవించే స్త్రీ వివాహంతో నిమిత్తం లేకుండానే పిల్లల్ని కూడా కనవచ్చంటూ గతంలో వెలిబుచ్చిన భావజాలానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు ఆమె బిజెపి వేదికల మీద ప్రకటించగలరా ? గతంలో బిజెపి మీద చేసిన విమర్శలకు కట్టుబడి ఉంటారా ? డిఎంకెతో రాజకీయాలను ప్రారంభించి కాంగ్రెస్‌లో చేరి ఇప్పుడు బిజెపి కండువా కప్పుకున్నారు. రేపు మరొక పార్టీలోకి వెళ్లరనే గ్యారంటీ ఏముంది ? డొల్లు పుచ్చకాయలు, పార్టీలు మారేవారు ఒకే చోట ఉంటారా ? పార్టీ మారటానికి కొద్ది వారాల ముందు నరేంద్రమోడీది జుమ్లా సర్కార్‌ (అవసరానికి అనుగుణంగా మాట్లాడటం) అని చెప్పిన ఆమె ఇప్పుడు మాట మార్చితే అదియును సూనృతమే ఇదియును సూనృతమే అని తలూపేందుకు జనం గొర్రెలా ?


తమిళనాడులో నాలుగు సీట్లు సంపాదించుకోవటం ఎలా అనే యావలో బిజెపి ఉందన్నది బహిరంగ రహస్యం. దానిలో భాగంగానే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తలుపు తట్టింది. లేస్తే మనిషిని కాదు అని దారినపోయే వారిని బెదిరించే కుంటి మల్లయ్య సామెత మాదిరి ఇప్పటి వరకు రజనీ వైఖరి ఉంది. ఇంతవరకు లేచింది లేదు, ఇప్పుడు లేస్తారో లేదో తెలియదు. 1996 నుంచి ఏదో ఒక రూపంలో రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పటమో సూచనలు ఇవ్వటమో చేస్తున్నారు. 2021 ఎన్నికలలో తన సత్తా చూపేందుకు సిద్దం అవుతున్నారని కొన్ని కథనాలు ఎప్పటి నుంచో తిరుగుతున్నాయి. తానే ఒక పార్టీని పెడతానని కూడా 69 ఏండ్ల రజనీ కాంత్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ తీవ్రత తగ్గిన తరువాత ప్రకటిస్తారని చెబుతున్నారు.
సినిమా తారలు బిజెపిలో చేరటం కొత్తేమీ కాదు. గతంలో గౌతమి, నమిత, రాధారవి ఆ పార్టీలో చేరినా ఒరిగిందేమీ లేదు. కుష్‌బూ తమిళనాడులో పరిచయం అవసరం లేని స్టార్‌, మాట్లాడగల చాతుర్యం ఉంది. అందువలన వస్తారో రారో తెలియని రజనీ కోసం వేచి చూడటం కంటే ఆమెతో ప్రచారం చేయించుకోవచ్చని బిజెపి ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తున్నది.కుష్‌బూ డియంకె నుంచి బయటకు వచ్చినపుడు ఆ పార్టీకి పోయింది లేదు, కాంగ్రెస్‌లో చేరినపుడు కొత్తగా ఆ పార్టీకి పెరిగిందేమీ లేదు. ఇప్పుడు బిజెపికి కూడా ప్రచారానికి తప్ప ఓట్ల ప్రయోజనం కలగకపోవచ్చు. నేను ఇప్పుడే పార్టీలో చేరాను, ఆరునెలల తరువాత చూడండి అని విలేకర్లతో చేసిన వ్యాఖ్య బహుశా వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి కావచ్చు.

గతంలో కొన్ని అంశాల మీద ఆమె చేసిన వ్యాఖ్యల మీద బిజెపి లేదా హిందూమత శక్తులు సామాజిక మాధ్యమంలో ఎలా విరుచుకుపడ్డాయో, ఎన్ని కేసులు నమోదు చేశాయో తెలిసిందే. ఇప్పుడు ఆమె బిజెపిలో చేరి సిద్దాంతాల గురించి చెప్పటాన్ని ఆశక్తులు ఎలా జీర్ణించుకుంటాయో చూడాల్సిందే. పచ్చిమితవాదులు ఆమెను అంగీకరిస్తారా ఆమె తన వైఖరిని మార్చుకుంటారా ? గతంలో ఆమె చేసిన బిజెపి వ్యతిరేక వ్యాఖ్యలు ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మారకుండా ఉంటాయా ? గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధిత్వాన్ని ఆశించి భంగపడిన ఆమె ఈ ఏడాది మార్చినెల నుంచి బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కుష్‌బూ పేరు నఖత్‌ ఖాన్‌ అంటూ ఆమె మతం గురించి బిజెపి మరుగుజ్జులు(ట్రోల్స్‌) దాడి చేసినపుడు అవును నేను ముస్లింగానే పుట్టాను, దాని గురించి ఇంత ఆలస్యంగా తెలుసుకున్నారు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో చేరినపుడు ఆ పార్టీ తన భావజాలానికి సరిపడిందని చెప్పారు. మరి బిజెపి గురించి ఏమి చెబుతారు అంటే ఎవరైనా కులం, మతం, జాతి గురించి మాట్లాడితే నా రక్తం సలసల కాగుతుంది. నేను దేశభక్తురాలిని, లౌకికవాదిని కాషాయ, హిందూత్వవాదాలకు వ్యతిరేకం అని చెప్పారు. అలాంటి హిందూత్వవాదులతోనే ఆమె చేతులు కలిపారు.


ద్రవిడ కజగం పార్టీ స్దాపకుడు, హేతువాది, జీవితాంతం బ్రాహ్మణిజానికి, బ్రాహ్మలకు వ్యతిరేకంగా ఉన్న ఇవి రామస్వామి నాయకర్‌ మనవడైన సతీష్‌ కృష్ణన్‌ ఆగస్టు నెలలో అన్నాడిఎంకె నుంచి బిజెపిలో చేరారు. ఇలా కాంగ్రెస్‌, డిఎంకె, అన్నాడిఎంకె మూడు పార్టీలలో అసంతృప్తికి గురైన వారందరనీ చేర్చుకొనేందుకు బిజెపి తాపత్రయపడుతోంది. ఈ క్రమంలోనే గంధం చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ కుమార్తె విద్యను పార్టీ యువజన విభాగ ఉపాధ్యక్షురాలిగా చేసి ఆ పార్టీలోకి చేర్చుకుంది. నా తండ్రిని చూసి కాదు, నేను ఏమిటన్నది చూడాలని ఆమె చెప్పుకుంది. నా తండ్రి మంచివాడని, జనాలకు సాయం చేసేవాడని నాకు చెప్పారని, తండ్రితో స్ఫూర్తి పొందానని విలేకర్లతో చెప్పింది. వచ్చే ఎన్నికల్లో ఎవరైనా ఎంఎల్‌ఏగా ఎన్నికైతే వారికి పార్టీ తరఫున ఒక ఇన్నోవా కారును బహుమతిగా ఇస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ మురుగన్‌ పార్టీ సమావేశంలో ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. కనీసం 25 మంది ఎంఎల్‌ఏలను పార్టీ గెలుచుకుంటే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చని చెప్పారు. పార్టీ గెలుపుకోసం బాగా పనిచేసినట్లు గుర్తించిన వారికి తమిళనాడులో పార్టీలు బంగారు ఉంగరాలు, గొలుసులు బహుమతిగా ఇవ్వటం సాధారణ విషయం. బిజెపి మరొక అడుగు ముందుకు వేసి ఏకంగా ఇన్నోవా కార్లనే ఎరగా చూపింది.


ముఖ్యమంత్రి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ముఠాలు పార్టీలో ఆధిపత్యం మాదంటే మాదని కొట్టుకున్నాయి. అది ముదిరితే ఏదో ఒక వర్గం తమతో వస్తుందన్న ఆశలు ఒక దశలో బిజెపిలో కలిగాయి. అయితే తామిద్దరూ ఒకటేనని పళని స్వామి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పని చేసేందుకు నిర్ణయించినట్లు అన్నాడిఎంకె ప్రకటించింది. అయితే ఆ సయోధ్య ఎన్నికల వరకు నిలుస్తుందా ఏమి జరుగుతుంది అనేది అప్పుడే చెప్పలేము.

2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 234 స్ధానాలకు పోటీ చేసిన బిజెపి 2.86శాతం ఓట్లు తెచ్చుకుంది. అన్నాడిఎంకెకు 40.88శాతం, డిఎంకె కూటమికి 39.1శాతం వచ్చాయి. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డిఎంకె కూటమి 55శాతంపైగా ఓట్లు తెచ్చుకుంది, 39కి గాను 38 సీట్లు గెలుచుకుంది. ఇంతే కాదు 216 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ సంపాదించింది. అన్నా డిఎంకె కూటమి 16 చోట్ల మెజారిటీ తెచ్చుకోగా అన్నాడిఎంకె 12, పట్టలి మక్కలి కచ్చి 3, బిజెపి ఒక చోట ఆధిక్యత ప్రదర్శించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకె కూటమిలో సీట్ల పంపకం పెద్ద సమస్యగాక పోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో తామే నాయకత్వం వహిస్తామని బిజెపి చెప్పుకోవటంపై అన్నాడిఎంకె గుర్రుగా ఉంది. ఎన్నికల నాటికి ఆ పార్టీ నేత శశికళ జైలు నుంచి బయటకు వస్తారని చెబుతున్నారు. ఆమె ఏ వైఖరి తీసుకుంటారో తెలియదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి-అన్నాడిఎంకె విడివిడిగా పోటీ చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్ధానాల్లో పోటీ చేసిన పట్టలి మక్కల్‌ కచ్చి 5.36 శాతం ఓట్లు తెచ్చుకుంది. లోక్‌సభ ఎన్నికల నాటికి పిఎంకె, బిజెపి, తమిళమానిల కాంగ్రెస్‌ అన్నా డిఎంకె కూటమిలో చేరాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకుంటుందో తెలియదు. అన్నాడిఎంకె బలహీనపడిన కారణంగా గత పార్లమెంట్‌ ఎన్నికలలో 20 స్ధానాలకే పరిమితమై పిఎంకెకు 7, బిజెపికి ఐదు, డిఎండికెకు నాలుగు, మరో మూడు పార్టీలకు మూడు సీట్లు కేటాయించింది. ఇదే ప్రాతిపదికన అసెంబ్లీ సీట్ల కేటాయింపు జరుగుతుందా ? అన్నాడిఎంకె తన సీట్లను సగానికి తగ్గించుకుంటుందా ?


మరోవైపు డిఎంకె కూటమిలో 2019 లోక్‌ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ డిఎంకె 138, కాంగ్రెస్‌ 49, సిపిఎం, సిపిఐ పన్నెండు చొప్పున, ముస్లింలీగ్‌ ఐదు చోట్ల ఆధిక్యత ప్రదర్శించింది. ఇంతటి భారీ విజయం సాధించిన కారణంగా డిఎంకెలో సీట్ల కోసం పోటీ పడేవారు సహజంగానే ఉంటారు. అసంతృప్తి చెందిన వారిని పిలిచి పార్టీ కండువాలు కప్పేందుకు అన్నాడిఎంకె, బిజెపి సిద్దంగా ఉన్నాయి. అయితే పార్లమెంట్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల నాటికి బలాల్లో పెను మార్పులు జరిగే పరిణామాలేవీ జరగలేదు. ఈ నేపధ్యంలో ఫలితాలు కూడా లోక్‌సభ మాదిరే ఉంటాయని భావిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన్‌ ఫిర్యాదు-పర్యవసానాలేమిటి ?

11 Sunday Oct 2020

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 2 Comments

Tags

Chief Justice of India S A Bobde, SC judge NV Ramana, YS jagan


ఎం కోటేశ్వరరావు


న్యాయమూర్తుల మీద ఫిర్యాదులు చేయటం కొత్త కాదు. అయితే చేసిన ఫిర్యాదును ఒక ముఖ్యమంత్రి పత్రికలకు విడుదల చేయటం దేశ న్యాయ, రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ద్వితీయ స్ధానంలో ఉండి తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందనున్న జస్టిస్‌ ఎన్‌వి రమణ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిపక్ష తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడికి అనుకూలంగా న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారంటూ ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాసిన లేఖలో పేర్కొన్నారు.


న్యాయమూర్తుల మీద గతంలో కూడా అధికారంలో ఉన్న వారు ఫిర్యాదులు చేసినప్పటికీ ఈ విధంగా వాటిని బహిరంగపరచలేదు. పదోన్నతి వరుసలో ఉన్న న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేయటం ఒక ధోరణిగా మారిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే కొద్ది వారాల క్రితం ఒక కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. దాని తరువాత ఇప్పుడు ఈ పరిణామం చోటు చేసుకుంది. గతంలో న్యాయమూర్తుల వ్యక్తిగత ప్రవర్తన మీద, అధికార దుర్వినియోగం గురించి ఫిర్యాదులు కోర్టు విచారణల వరకు వెళ్లాయి. మధ్య ప్రదేశ్‌కు చెందిన ఒక సీనియర్‌ జిల్లా న్యాయమూర్తి తనను లైంగికంగా వేధించారంటూ ఒక మహిళా జడ్జి చేసిన ఫిర్యాదు విచారణ సమయంలో జస్టిస్‌ బోబ్డే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జస్టిస్‌ ఎన్‌వి రమణ కూడా ప్రమోషన్‌ వరుసలో ఉన్నారు. అయితే ఈ ఫిర్యాదు కోర్టులో లేదా పోలీస్‌ సేష్టన్‌లో దాఖలు కాలేదు. గతంలో న్యాయమూర్తులకు రాసిన లేఖలను, పత్రికా వార్తల మీద స్పందించి విచారణకు ఆదేశించిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా పరిగణిస్తారు అన్నది పెద్ద ప్రశ్న.


మధ్య ప్రదేశ్‌ జిల్లా జడ్జిపై వచ్చిన ఆరోపణల కేసులో ఎవరైనా పదోన్నతి పొందుతారు అనగానే మన వ్యవస్దలో అన్ని రకాల అంశాలు ప్రారంభం అవుతాయి. ఫిర్యాదులు చేస్తారు, పత్రికల్లో వార్తలు కనిపిస్తాయి, అరే ఇతను అంత చెడ్డవాడా అని ఆకస్మికంగా జనాలు గుర్తు చేసుకుంటారు అని జస్టిస్‌ బోబ్డే వ్యాఖ్యానించారు. ఆ జిల్లా జడ్జి ఈ ఏడాది చివరిలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్‌ అవకాశాలున్నాయని అనుకుంటున్న సమయంలో అతని మీద 2018లో పని స్ధలంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఫిర్యాదు చేసింది కూడా మరొక జడ్జి కావటం గమనార్హం. జిల్లా ప్రధాన జడ్జిని మరొక జిల్లాకు బదిలీ చేశారు. అతని మీద వచ్చిన ఫిర్యాదులను విచారించిన అంతర్గత ఫిర్యాదుల విచారణ కమిటీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. తన మీద చర్యను నిలిపివేయించాలని కోరుతూ సదరు న్యాయమూర్తిని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముందు హైకోర్టుకు వెళ్లండి అని సుప్రీం కోర్టు సలహాయిచ్చింది. అయితే హైకోర్టులో ఎలాంటి ఊరట లభించకపోవటంతో తిరిగి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.


న్యాయమూర్తుల మీద ఫిర్యాదులు చేయకూడనే నిబంధనలేవీ లేవు. ఎవరి మీద అయినా ఫిర్యాదులు చేయవచ్చు. అయితే రాజ్యాంగ పదవిలో ఉన్నవారికి వాటి మీద విచారణ జరిపే పరిస్ధితి వస్తే కొన్ని రక్షణలు ఉన్నాయి. బాబరీ మసీదు కూల్చివేత సమయంలో ఉత్తర ప్రదేశ్‌ ముఖ్య మంత్రిగా ఉన్న బిజెపి నేత కల్యాణ్‌ సింగ్‌ మీద సిబిఐ కేసు దాఖలు చేసింది. అయితే 2014లో రాజస్ధాన్‌ గవర్నర్‌గా నియమించటంతో విచారణ నిలిపివేశారు. పదవీ కాలం ముగిసిన తరువాత విచారణకు పిలవ వచ్చని సుప్రీం కోర్టు చెప్పింది.


ఇప్పుడు జస్టిస్‌ ఎన్‌వి రమణ మీద ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి లేఖ ద్వారా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేసింది ఫిర్యాదు మాత్రమే. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ప్రస్తుతానికి ఊహాజనితమైన అంశమే. ప్రతి కేసులో ఒకరు ఓడిపోతారు, రెండవ వారు గెలుస్తారు. ఓడిన వారు న్యాయమూర్తి వల్లనే తనకు అన్యాయం జరిగిందని విమర్శ లేదా ఆరోపణ చేయవచ్చు. అది ఇతర న్యాయమూర్తుల మీద ప్రభావం చూపుతుంది. చివరకు న్యాయవ్యవస్ధ మీదనే విశ్వాసం సన్నగిల్లుతుంది. ఈ నేపధ్యంలోనే న్యాయమూర్తులకు రక్షణ కల్పిస్తూ బ్రిటీష్‌ వారి హయాంలోనే చట్టాలు చేశారు.
న్యాయమూర్తిగా వ్యవహరించే వారు ఇచ్చిన తీర్పులను పై కోర్టులో సవాలు చేయవచ్చు తప్ప వారి మీద చర్యలు తీసుకొనేందుకు వీలు లేకుండా రక్షణ కల్పించారు. అయితే కొన్ని ఉదంతాలలో న్యాయమూర్తులు తప్పు చేసినట్లు ఫిర్యాదులు దాఖలయ్యాయి. అవి వాస్తవమే అని తేలిన సందర్భాలలో వారికి రక్షణ వర్తించదు అన్న తీర్పులు వచ్చాయి. ఒక సబ్‌డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ ఒక వ్యక్తి అరెస్టు మరియు నిర్బంధానికి ఇచ్చిన ఉత్తరువు నిర్లక్ష్యపూరితంగా ఉందని భావించిన సుప్రీం కోర్టు బాధితుడికి నష్టపరిహారంగా ఐదువేల రూపాయలు ఇవ్వాలన్న తీర్పును సమర్ధించింది. మరో కేసులో ఒక మెజిస్ట్రేట్‌ తన బుర్రను ఉపయోగించకుండా ఒక వారంట్‌ మీద సంతకం చేయటం అక్రమం అని బాధితుడు సెషన్స్‌ కోర్టులో వేసిన కేసులో న్యాయమూర్తి తప్పు చేశారని బాధితుడికి ఐదు వందల రూపాయల పరిహారం చెల్లించాలని తీర్పు వచ్చింది. మరో కేసులో ఆరోపణలు చేసిన న్యాయవాది ఒక రౌడీ గూండా, జూదగాడని ఒక మెజిస్ట్రేట్‌ స్వయంగా కోర్టులో చెప్పటం విధి నిర్వహణలో భాగం కాదని అందువలన అతని మీద చర్య తీసుకోవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. మరో కేసులో ఒక మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ విధి నిర్వహణలో ఎల్‌ఎల్‌ఎం పరీక్ష రాస్తూ కాపీ చేస్తూ దొరికి పోయాడు. తాను న్యాయాధికారిని కనుక తనమీద చర్య తీసుకోరాదని వాదించటాన్ని కోర్టు అంగీకరించలేదు.


ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న న్యాయమూర్తులపై చర్యలు తీసుకోవాల్సి వస్తే ముందుగా రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రపతి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు వ్యవహరించాలి. ప్రధాన న్యాయమూర్తి సలహాను రాష్ట్రపతి పాటించాలి. ఇప్పుడు జస్టిస్‌ ఎన్‌వి రమణపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆరోపణలతో లేఖద్వారా ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఉదంతాలు గతంలో లేవు లేదా రహస్యంగా చేసిన ఫిర్యాదుల మీద చర్యలు తీసుకున్న ఉదంతాలు లేవు. ఫిర్యాదుల స్వభావాన్ని బట్టి ప్రధాన న్యాయమూర్తి తోటి న్యాయమూర్తి మీద విచారణకు ఆదేశిస్తారా లేక ఫిర్యాదుల్లో పసలేదని, బహిరంగంగా ప్రకటించి ఒక న్యాయమూర్తి ప్రతిష్టకు భంగం కలిగించారని ఫిర్యాదుదారు మీద చర్య తీసుకుంటారా ?


ఒక వేళ హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల మీద తొలగింపు వంటి చర్యలు తీసుకోవాల్సి రాష్ట్రపతి ఉత్తరువు జారీ చేయాలి. దానికి ముందు పార్లమెంట్‌ ఉభయ సభల్లో మెజారిటీ సభ్యులు చర్యలకు ఆమోదం తెలపాలి. ఓటింగ్‌ సమయంలో మూడింట రెండువంతుల మంది సభ్యులు హాజరు ఉండాలి. న్యాయమూర్తుల తీరుతెన్నులపై చర్చ జరపకూడదు. గతంలో జస్టిస్‌ రామస్వామి మీద చర్యకు పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో మెజారిటీ లేక ప్రతిపాదన వీగిపోయింది. ఒక ప్రధాన న్యాయమూర్తి మీద చర్యను ప్రతిపాదన దశలోనే రాజ్యసభలో తిరస్కరించి అసలు ఓటింగ్‌ వరకే రానివ్వలేదు.


సమాజ సరళి ప్రతి వారి మీద ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ముందుకు వచ్చిన ఈ సమస్య మన వ్యవస్దలో ఇప్పటి వరకు అంతర్గతంగా జరుగుతున్నట్లు భావిస్తున్న, చెవులు కొరుకుతున్న కుమ్ములాటలను బహిర్గతం చేసింది. దీని పర్యవసానాలపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యానాలు అయినా చేయవచ్చు. జరుగుతున్న పరిణామాలు, ప్రచారాలు న్యాయవ్యవస్ధ మీద జనానికి విశ్వాసం మరింత సడలటానికే దోహదం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రతి కేసును కుల, ప్రభావాల ప్రాతిపదికన జనం చూసినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిణామాన్నే పాలకులు కోరుకుంటున్నారా ?

కోర్టుల తీరుతెన్నుల మీద సీనియర్‌ న్యాయవాది నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తుల తీర్పుల తీరుతెన్నులపై చేసిన విమర్శలు వ్యక్తిగతం కానప్పటికీ సుప్రీం కోర్టు నేరంగా పరిగణించింది. ఇప్పుడు ప్రత్యేకించి ఒక న్యాయమూర్తి మీద జగన్‌ ఫిర్యాదు చేశారు. రాసిన లేఖకు ప్రధాన న్యాయమూర్తి నుంచి సమాధానం వచ్చేవరకు ఆగి ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ ప్రభావానికి లోనై తీర్పులు ఇస్తున్నారని ఆరోపించటం ఇప్పుడు విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తులను బ్లాక్‌మెయిల్‌ చేయటమే అంటున్నవారు లేకపోలేదు. తీర్పులను విమర్శించ వచ్చు తప్ప న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించిన వారు దాన్ని నిరూపించుకోవాలి లేకపోతే వారి మీదనే చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ రాసిన లేఖ హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలను ఆపాదించటం ఒకటైతే, వారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ ప్రభావితం చేశారని ఆరోపించటం మరొకటి. ఈ రెండింటికీ తగిన ఆధారాలను చూపాల్సి ఉంటుంది. జస్టిస్‌ రమణ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న కొన్ని ఆస్తుల వివరాలను కూడా ముఖ్యమంత్రి ప్రధాన న్యాయమూర్తికి పంపటమే కాదు, బహిరంగపరిచారు. ఆస్తులు ఉండటం తప్పు కాదు, వాటిని ఎలా సంపాదించారనేది సమస్య. ఆదాయానికి మించి సంపాదిస్తే ఆదాయ వనరులను తెలియచేయాల్సి ఉంటుంది. వీగిపోయిన లేదా గెలిచిన ప్రతి కేసు వెనుక ఎవరో ఒకరు న్యాయమూర్తులను ప్రభావితం చేశారని ఆరోపించితే రాబోయే రోజుల్లో కేసులు నమోదైతే వాటి మీద ప్రభావం పడకుండా ఉంటుందా ? సుప్రీం కోర్టులో కూడా కేసులు వీగిపోతే అక్కడి న్యాయమూర్తుల మీద కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తారా ? వీటికి అంతమెక్కడ ? ఈ వివాదానికి ముగింపు ఎలా ఉంటుంది ? అన్నీ శేష ప్రశ్నలే.


ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో నడుస్తున్న కేసుల మీద, న్యాయమూర్తుల మీద సామాజిక మాధ్యమంలో జరుగుతున్న ప్రచారం ఒకటైతే. పార్టీలు, మీడియా వ్యాఖ్యాతలు చేస్తున్న అంశాలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు కోర్టులను ప్రభావితం చేస్తున్నారని గతంలో విమర్శించిన వైసిపి నేతలు ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ స్వయంగా జోక్యం చేసుకొని ప్రభావితం చేస్తున్నారని రోడ్డెక్కారు. గతంలో 16నెలల పాటు జైల్లో ఉన్న జగన్‌ బెయిలు పొందేందుకు నాటి యుపిఏ ప్రభుత్వ సహకారాన్ని పొందారంటూ ఒక వ్యాఖ్యాత పలికారు. ఇప్పుడు కేసులు తుది విచారణకు వస్తున్నందున తిరిగి కేంద్ర సాయం కావాల్సి వచ్చిందని, మోడీ-షా ద్వయం సహకరిస్తారనే నమ్మకం లేకపోయినా సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా రాశారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు న్యాయమూర్తులను ప్రభావితం చేసి బెయిల్‌ ఇప్పించారని సూటిగానే చెప్పారు. అధికారంలో ఉన్న వారికి అలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందన్నపుడు వైసిపి ఆరోపిస్తున్నట్లుగా చంద్రబాబు సైతం అలా ప్రభావితం చేస్తారనేందుకు ఆస్కారం లేదా ? జస్టిస్‌ రమణ పూర్వాశ్రమంలో న్యాయవాదిగా తెలుగుదేశం పార్టీలో పని చేయలేదా కేసులను చూడలేదా ? ఆ పరిచయంతో చంద్రబాబు ప్రభావితం చేసి ఉండవచ్చని జనం అనుకొనేందుకు ఆస్కారం లేదా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నోబెల్‌ బహుమతులు : డోనాల్డ్‌ ట్రంప్‌ -నరేంద్రమోడీ అర్హత లేమిటి ?

11 Sunday Oct 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

HUNGRIEST COUNTRIES, Ig Nobel Prize, India Hungry, Nobel prize matter


ఎం కోటేశ్వరరావు


నోబెల్‌ బహుమతి కమిటీ ఎంపిక ప్రమాణాలు ఏమిటో ముఖ్యంగా శాంతి బహుమతి విషయంలో ఒక్కోసారి అంతుబట్టవు. కొన్ని బహుమతుల ప్రకటన చూస్తే తెరవెనుక ఏదో జరుగుతోంది అనిపిస్తుంది. అమెరికాలో ఏ పార్టీకి చెందిన వారు అధ్యక్షులుగా ఉన్నా నిత్యం ఎక్కడో ఒక చోట నిప్పురాజేస్తారు, జనాలను చంపటమో, చంపించటమో చేస్తారు. అలాంటి వారికి శాంతి బహుమతి ప్రకటన చేయటాన్ని ఏమనాలి ? బరాక్‌ ఒబామాతో సహా ఇప్పటికి నలుగురికి అలా ప్రకటించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచశాంతి కోసం చేసిన కృషికి ఈ ఏడాది నోబెల్‌ బహుమతి ఇవ్వాలంటూ కొందరు ట్రంప్‌ పేరును ప్రతిపాదించారు. స్వయంగా దరఖాస్తు చేసుకొనే అవకాశం లేకపోబట్టి గానీ ఉంటే తన పేరును తానే ప్రతిపాదించగల సమర్ధుడు ఆ పెద్దమనిషి.


ఈ నేపధ్యంలో ట్రంప్‌కు జిగినీ దోస్తు, ప్రపంచ నేతలుగా భుజం భుజం రాసుకుంటూ తిరుగుతున్న మన ప్రధాని నరేంద్రమోడీ పేరును ప్రతిపాదించకపోవటాన్ని ఎలా చూడాలి. గతంలో కేంద్ర మంత్రిగా మోడీని దేవుడు అని వర్ణించిన నేటి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాదిరి ఒక్కరు కూడా మోడీ పేరును ప్రతిపాదించే సాహసం ఎందుకు చేయలేకపోయినట్లు ? ప్రపంచ నేతగా ఎదిగిన తొలి ప్రధాని అని ఇంతకాలం ఊదరగొట్టిందంతా ఒట్టి గ్యాసేనా ? ప్రపంచ శాంతికి, ఆర్ధిక అభివృద్ధికి గాను నరేంద్రమోడీకి దక్షిణకొరియా అందచేసిన బహుమతి వెనుక మన మార్కెట్‌ మీద దృష్టి ఉందా ?


ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు నెలకు ఐదు కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు, ఒక కిలో పప్పులు ఉచితంగా 80 కోట్ల కార్డులున్న వారికి అందచేస్తున్నట్లు, అందుకోసం 90వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అది నిజంగా అంత గొప్ప చర్యే అయితే ప్రపంచ ఆహార కార్యక్రమానికి ఈ ఏడాది నోబెల్‌ బహుమతి ఎందుకు వచ్చినట్లు ? ప్రతి దానికీ వీరుడు శూరుడు అంటూ పొగుడుతున్న కొన్ని దేశాల వారు ప్రధాని నరేంద్రమోడీని ఎవరూ ఎందుకు పట్టించుకోలేదు ? చౌక దుకాణాల్లో సరకులు కొనుగోలు చేసేందుకు డబ్బు ఉండవచ్చు లేకపోవచ్చు, ఉచితంగా ఇచ్చేవాటితో కనీసం ప్రాణాలు అయినా నిలుపుకుంటారు,సాయం ఎంతని కాదు, ఎన్ని కోట్ల మందికి చేశారు అన్నది ముఖ్యం కదా ! ఇంత అన్యాయమా ? ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్ల్యుఎఫ్‌పి) నోబెల్‌ బహుమతి ప్రకటిస్తారా అని భక్తులు లోలోపల తీవ్ర మనోవేదనకు గురవుతున్నారా ? వచ్చిన ఆపద తీవ్రతతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం లేదా దానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్రమోడీ ప్రచార ఆర్భాటం చేస్తున్నారా ? ఆచరణలో ఆకలి లేదా ఆహార భద్రత, పోషకాహారం అందించే విషయలో జరుగుతున్నదేమిటి ?


నోబెల్‌ బహుమతుల ఎంపికలో జరుగుతున్న లోపాలను చూసిన తరువాత 1991లో కొందరు ఇగో నోబెల్‌ పేరుతో ఎగతాళి బహుమతులను ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో వైద్య రంగంలో సాధించిన అసాధారణ విజయాలకు గాను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్రమోడీ, బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌,రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌, టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయిప్‌ ఎర్డోగన్‌, మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రడార్‌, బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో, తుర్కుమెనిస్దాన్‌ అధ్యక్షుడు బద్రిమహ్మద్‌లకు కలిపి ఉమ్మడి బహుమతిని ప్రకటించారు. కరోనా మహమ్మారి జనజీవితాల మీద చూపే ప్రభావాన్ని శాస్త్రవేత్తలు, వైద్యుల కంటే ముందుగానే రాజకీయవేత్తలుగా వీరు ప్రపంచానికి బోధ చేసినందుకు ఈ అవార్డు ఇచ్చారు. ఈ దేశాల్లో కరోనా కేసులు ఎలా పెరిగిపోయిందీ, జనాన్ని ఎలా ఇబ్బంది పెట్టిందీ ప్రపంచం చూసింది. ప్రపంచ శాంతికి ఇచ్చే ఇగో నోబెల్‌ బహుమతులు భారత్‌-పాకిస్ధాన్‌ దౌత్యవేత్తలకు ప్రకటించారు. అర్ధరాత్రి అపరాత్రి అనికూడా చూడకుండా తలుపు గంటలను మోగించటం, వచ్చి తలుపు తెరిచి సమాధానం ఇచ్చే లోగానే కనపడకుండా పోతున్నందుకు ఇస్తున్నట్లు ప్రకటించారు.(సెప్టెంబరు 18, ది ప్రింట్‌)

నరేంద్రమోడీ సర్కార్‌ ఎన్నో విజయాలు సాధించినట్లు ప్రచారం చేసుకుంటోంది. అదేమిటో గానీ సరైన లెక్కలు తయారు చేయటంలో లేదా తనకు అనుకూలంగా లెక్కలు రాయించటంలో సైతం వైఫల్యం కనిపిస్తోంది. మరోవైపు అన్నీ నెహ్రూయే చేశాడు అని చెప్పుకొనే అవకాశాలు రోజు రోజుకూ నరేంద్రమోడీ దళానికి తగ్గిపోతున్నాయి. 2016-25ను పోషకాహార కార్యాచరణ దశాబ్దంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి 2016ఏప్రిల్‌లో నిర్ణయించింది. 2012లో ప్రపంచ ఆరోగ్య ప్రతినిధుల సమావేశం 2025 నాటికి ఆరుపోషకాహార లక్ష్యాలను సాధించాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. దాన్ని చేరుకోవటంలో విఫలమయ్యే 88 దేశాల్లో మనది ఒకటి అని 2020 ప్రపంచ పోషకహార నివేదిక పేర్కొన్నది. గడచిన ఎనిమిది సంవత్సరాలలో మోడీ గారీ వాటా ఆరు సంవత్సరాలు ఉంది. ప్రభుత్వ పని తీరు చూసి వచ్చే ఐదేండ్లలో లక్ష్యాన్ని చేరే అవకాశం లేదని ప్రకటించేశారు. ఐదేండ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల ఆగిపోవటాన్ని నివారించటం, పిల్లల్ని కనే వయస్సు ఉన్న మహిళల్లో రక్త హీనత నివారణ, పిల్లలో అధికబరువు నివారణ, తల్లిపాలు ఇవ్వటం పెంపు లక్ష్యాలను చేరుకొనే అవకాశాలు లేవని మన సమాచారాన్ని విశ్లేషించిన నివేదిక పేర్కొన్నది.ప్రపంచంలో అధ్వాన్నంగా ఉన్న మూడు దేశాలలో నైజీరియా, ఇండోనేషియాతో పాటు మన దేశాన్ని చేర్చారు. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌లో పరిస్ధితి దారుణంగా ఉందని నివేదిక పేర్కొన్నది. ఇలాంటి కార్యక్రమాలను అమలు జరపాల్సింది రాష్ట్రాలు కదా, వాటి వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేయటం సబబా అని కొంత మంది అతి తెలివి వాదనలు చేస్తున్నారు. మెజారిటీ రాష్ట్రాలలో బిజెపియే అధికారంలో ఉంది అనే వాస్తవాన్ని వారు కావాలనే దాస్తున్నారు. పదిహేనేండ్లకు పైగా పాలనలో ఉన్న రాష్ట్రాలలో పరిస్ధితి మారిందేమీ లేదు.


పిల్లలకు తగినన్ని పండ్లు ఆహారంగా ఇస్తే తరువాతి రోజుల్లో వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు దేశంలో తగినంత ఆహారమే పెట్టలేని స్ధితిలో పండ్లు తినిపించటం సాధ్యమా ? తలిదండ్రుల ఆదాయాలు అందుకు అనుగుణ్యంగా ఉన్నాయా? కరోనా వైరస్‌ వ్యాప్తి నేపధ్యంలో ఈ అంశం మరింతగా ముందుకు వచ్చింది. దేశంలో 80 నుంచి 90శాతం మంది పెద్ద వారికి రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌ డి లోపం ఉంది. కరోనా నిరోధానికి అది అవసరమని కొందరు చెప్పటంతో సూక్ష్మంలో మోక్షానికి అలవాటు పడిన మన జనాలు ఇష్టమొచ్చినట్లు డి విటమిన్‌ టాబ్లెట్‌లు తీసుకొని కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నారు. దీనికి అర్హతలు లేని ప్రబోధ వైద్యులు, వాట్సాప్‌ యూనివర్సిటీ పండితులే ప్రధాన కారణం.


ప్రపంచంలో పలుచోట్ల నెలకొన్న అస్తవ్యస్ధ పరిస్ధితికి సరైన టీకా ఆహారమే అని నోబెల్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెరిట్‌ రెసి అండర్సన్‌ చెప్పారు. ప్రపంచ ఆహార కార్యక్రమానికి నోబెల్‌ బహుమతిని ప్రకటించిన సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. ప్రపంచ ఆకలిని కరోనా మహమ్మారి రెట్టింపు చేయనుందనే అంచనాల నేపధ్యంలో ఈ కార్యక్రమ అవసరం ఎంతో ఉందన్నారు. తమ కుటుంబానికి దక్కిన ఈ గౌరవంగా దీన్ని భావిస్తున్నామని, తొలిసారిగా తనకు మాటలు రావటం లేదని ప్రపంచ ఆహార కార్యక్రమ కార్యనిర్వహణ అధికారి డేవిడ్‌ బియాస్‌లే వ్యాఖ్యానించారు. అనేక దశాబ్దాల పాటు ప్రపంచంలో ఆకలి తగ్గిన తరువాత 2016 నుంచి పెరుగుతోందని, పెద్ద దేశాలు కొన్ని ఆకలిని తీర్చేందుకు సహకరించటం లేదని ఆహార కార్యక్రమ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.


మన దేశానికి సంబంధించి 117 దేశాలలో ఆకలి సూచిక 2019లో 102గా ఉంది. అయితే మన అధికారులు అది పాత సమాచారం మీద ఆధారపడి రూపొందించినది, 2017, 18 సంవత్సరాల వివరాలను తీసుకుంటే 91గా ఉంటుందని చెబుతున్నారు. ఆకలిని కొలిచేందుకు తీసుకుంటున్న ప్రమాణాల్లో మార్పులు చేసిన మాట వాస్తవం. అది ఒక్క మన దేశానికే కాదు అన్ని దేశాలకూ వర్తిస్తుంది.102కు బదులు 91 ఎంతో మెరుగైదని చెప్పుకొనేందుకు తాపత్రయ పడటం తప్ప మనం ఎంతో ఆకలితో ఉన్నామనే విషయాన్ని విస్మరిస్తున్నారు. 2019 సూచికలో ఐదు పాయింట్లు, అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన దేశాలన్నింటినీ ఒకటవ స్ధానంలో ఉన్నట్లుగా పరిగణించారు, అలాంటి దేశాలు 17 ఉన్నాయి. ఐదు-ఆరు పాయింట్ల మధ్య ఐదు దేశాలు ఉన్నాయి. ఆరు -ఏడు పాయింట్ల మధ్య మరో ఐదు దేశాలుండగా వాటిలో 6.5 పాయింట్లతో చైనా 24వ స్ధానంలో ఉంది. పదిపాయిట్ల లోపు ఉన్న దేశాలన్నీ ఆకలి తక్కువగా, 10-19.9 మధ్య వచ్చినవి సాధారణమైనవిగా, 20-34.5 మధ్య తీవ్రంగా, 35-49.9 ఆందోళన కరంగా , 50పాయింట్లు దాటినవి మరింత ఆందోళన కరమైన స్దితిలో ఉన్నట్లు భావిస్తున్నారు. మన దేశం 91 అయినా 102 అయినా ఆందోళనకర స్ధాయిలో ఆకలి ఉన్న దేశాల వర్గీకరణలోనే ఉంటుందని గమనించాలి. ఆహారమే కొనలేని మన దేశవాసులకు పోషకాహారం గురించి మన ప్రధాని మన్‌కీ బాత్‌లో ఉద్బోధ చేశారు.

ఆకలి ఒక అంశమైతే దేశాల్లో ఆహార భద్రత ఏ స్ధాయిలో ఉందన్నది కూడా ముఖ్యమే.2019 సూచికలో 113 దేశాలలో 87.4 పాయింట్లతో సింగపూర్‌ తొలి స్ధానంలో ఉంది.చైనా 71 పాయింట్లతో 35వ స్ధానంలో ఉండగా మన దేశం 58.9 పాయింట్లతో 72వ స్దానంలో ఉంది. పాకిస్ధాన్‌ 78వ స్ధానంలో 56.8పాయింట్లను కలిగి ఉంది.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల ముసుగులో మన రైతాంగానికి కార్పొరేట్‌ బకాసురులకు అప్పగించేందుకు పూనుకోవటాన్ని కొందరు పెద్దలు స్వాగతిస్తున్నారు. కొన్ని అంకెలు చెబుతూ మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో మిగులు సాధించినట్లు చిత్రిస్తున్నారు. వారు చెబుతున్న అంకెలు వాస్తవమే గానీ వాటికి చెబుతున్న భాష్యంతోనే అసలు సమస్య. పండించటం ఒక ఎత్తయితే జనం తింటున్నారా లేదా అన్నది అసలు సమస్య. 2019 సంవత్సరానికి చైనా పండ్ల ఎగుమతులు దిగుమతుల వివరాలను ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. చైనా నుంచి కొన్ని పండ్లను ఎగుమతి చేస్తుండగా కొన్ని రకాలను దిగుమతి చేసుకుంటోంది. గతేడాది 950 కోట్ల డాలర్ల విలువ గల పండ్లను దిగుమతి చేసుకుంటే 550 కోట్ల డాలర్ల విలువగల పండ్లను ఎగుమతి చేసింది. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే దిగుమతుల విలువ 24, ఎగుమతుల విలువ 14శాతం పెరిగింది.


వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంపుదల ద్వారా రైతులకు మేలు చేస్తామనే పేరుతో సంస్కరణలు ప్రారంభించిన నరేంద్రమోడీ సర్కార్‌ సెప్టెంబరు 14న ఉల్లిధరలు పెరగటాన్ని చూపుతూ ఎగుమతులను నిషేధించింది. తరువాత ఉల్లి ధరలు పెద్దగా తగ్గిందేమీ లేదు. విమర్శలు రావటంతో అక్టోబరు మొదటి వారంలో కృష్ణాపురం ఉల్లిరకాన్ని నిషేధం నుంచి మినహాయించింది. ఎప్పుడైతే మన ప్రభుత్వం ఉల్లి ఎగుమతుల నిషేధం అమల్లోకి తెచ్చిందో మన మీద ఆధారపడిన బంగ్లాదేశ్‌ వంటి దేశాలు చైనా నుంచి దిగుమతులకు పూనుకున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఒక ఏడాది తగ్గినా, పెరిగినా ప్రస్తుతం ప్రపంచంలో 9,32,26,400 టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోంది. చైనాలో 2,39,07,509 టన్నులు, భారత్‌ 1,94,15,425 టన్నులు ఉత్పత్తి చేస్తోంది. మన దేశంలో ఉల్లి ధరలు ప్రతి ఏడూ ఏదో ఒక సమస్యను ముందుకు తెస్తున్నాయి. గతేడాది కూడా ధరలు పెరగటంతో నిషేధం విధించారు. దాంతో మన మీద ఆధారపడిన అనేక దేశాలు చైనాతో ఒప్పందాలు చేసుకున్నాయి. 2021వరకు ఉల్లి దిగుమతి పన్ను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. చైనాలో అసాధారణ రీతిలో రైతులకు, అదే మాదిరి వినియోగదారులకు ఉల్లి కన్నీళ్లు తెప్పించే పరిస్ధితి లేదు. అదే మన దేశంలో వ్యాపారులు ఇరువురినీ దోచుకుంటున్నా పట్టించుకొనే వారు లేరు. తాజాగా నిల్వలపై ఆంక్షలను ఎత్తివేయటం, దానికి వర్షాలు తోడు కావటంతో ధరలు గణనీయంగా పెరిగాయి. వాటిని అదుపు చేసేందుకు ఎగుమతిపై ఆంక్షలు.


చైనాలో రెండు నెలలుగా స్ధానికంగా కరోనా కేసులేవీ నమోదు కాకపోవటంతో అక్టోబరు ఒకటి నుంచి వారం రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దాదాపు 63 కోట్ల మంది వినోద, విహార యాత్రలు చేసినట్లు ప్రకటించారు. బంధువులు, స్నేహితులను కలిసిన సందర్భాలలో పండ్లను కానుకగా ఇవ్వటం చైనా సంప్రదాయాలలో ఒకటి.ఈ ఏడాది అసాధారణ డిమాండ్‌ ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. వీటిలో దిగుమతి చేసుకున్న పండ్లకే ఎక్కువ ఆదరణ ఉంది. ద్రాక్ష ఉత్పత్తిలో, వినియోగంలో చైనా అగ్రస్ధానంలో ఉంది. ఈ కారణంగా మిగులు సమయాల్లో ఎగుమతులు, పంట అయిపోయిన తరువాత దిగుమతులు కూడా చేసుకుంటున్నది. ప్రపంచంలో 23 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి జరుగుతుండగా చైనాలో గత ఏడాది 10.8 మి.టన్నులు ఉత్పత్తి అయినట్లు అంచనా. మన దేశంలో మూడు మిలియన్‌ టన్నులకు అటూ ఇటూగా ఉంటోంది. చిలీ ప్రపంచ ప్రధాన ఎగుమతిదారుగా ఉంది.

కూరగాయలు, పండ్లు తగినన్ని తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్ద కొన్ని ప్రమాణాలను నిర్ణయించింది. ఆ మేరకు వినియోగించేందుకు అనువుగా ఉత్పత్తి ఉందా లేదా అన్నది కూడా చూడాలి, కొనుగోలు చేసే వారు లేనపుడు మిగులుగా కనిపించవచ్చు. అది ఆయా దేశాల బలహీనత తప్ప బలంగా చెప్పగలమా ? ప్రపంచ వ్యవసాయ సంస్ధ ప్రకటించిన తాజా సమాచారం (2016) ప్రకారం ప్రపంచ పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో చైనా వాటా 39శాతం ఉంది. మన దేశం పదిశాతం, అమెరికా నాలుగుశాతం కలిగి ఉన్నాయి. చైనాలో 708 మి.టన్నుల ఉత్పత్తి జరిగింది. మన దేశంలో 2015లో పండ్లు, కూరగాయల ఉత్పత్తి 180 మి.టన్నులు. ఉత్పత్తిని బట్టి వినియోగాన్ని అంచనా వేసుకోవచ్చు.


ప్రపంచ ఆకలి సూచిక 2019లో ప్రపంచంలోని 117 దేశాలలో మన దేశం 102వ స్ధానంలో ఉంది. నరేంద్రమోడీ గారి మంచి రోజులు ప్రారంభమైన ఐదు సంవత్సరాల తరువాత ఉన్న పరిస్ధితి ఇది. ఆరు నుంచి 23నెలల వయస్సు ఉన్న పిల్లల్లో కేవలం పదిశాతం మందికి మాత్రమే కనీసంగా పెట్టాల్సిన ఆహారం అందుబాటులో ఉన్నది లేదా మన పౌరుల కొనుగోలు శక్తి అలా ఉంది. 1991లో ఆహార లభ్యత తలకు 186.2 కిలోలు కాగా 2016లో 177.9 కిలోలకు తగ్గింది. 2015లో చైనాలో 450 కిలోలు, బంగ్లాదేశ్‌లో 200కిలోలు, అమెరికాలో 1,100 కిలోలు ఉంది. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్ధ సమాచారం ప్రకారం కూరగాయల వినియోగంలో 2017లో చైనా సగటున ప్రతి ఒక్కరూ 377 కిలోలతో ప్రపంచంలోనే అగ్రస్ధానంలో ఉండగా మన దేశంలో 79.86కిలోలు, శ్రీలంకలో 49.83, బంగ్లాదేశ్‌లో 35, పాకిస్ధాన్‌లో 20.83 కిలోల వినియోగం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ తలకు రోజు ఒక్కింటికి 200-250గ్రాముల కూరగాయలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మన దేశంలో 218 గ్రాములుండగా చైనాలో 1033 గ్రాములు తీసుకుంటున్నారు. మన దేశంలో వారాల తరబడి అసలు కూరగాయల మొఖం ఎరగని కుటుంబాలున్నాయంటే అతిశయోక్తి కాదు.


ఆహార భద్రత, పోషకాహార లేమిని మన కంటే ఎంతో మెరుగ్గా చైనా అధిగమిస్తోందన్నది స్పష్టం. జనం ఆహారం తీసుకుంటున్నారా, పోషకాహారం కలిగి ఉన్నారా లేదా అనేందుకు దారిద్య్రం కొలబద్ద. 1981-2015 మధ్య చైనాలో దారిద్య్రం 0.7 శాతానికి తగ్గింది. మన దేశంలో 1987లో 48.9శాతం ఉంటే 2015 నాటికి 13.4శాతానికి తగ్గింది.1999-2005 మధ్య దారిద్య్ర నిర్మూలనలో చైనా ఆదాయ స్ధితిస్దాపకత 1.51ఉంది. అంటే ఆదాయం ఒకటి పెరిగితే దారిద్య్రం 1.51 తగ్గింది. ఇదే కాలంలో మన దేశంలో స్ధితిస్ధాపకత 0.4శాతం మాత్రమే ఉంది.దారిద్య్రం ఒకటికి 0.4 మాత్రమే తగ్గింది. దీనికి అనుగుణ్యంగానే 2002-04 నుంచి 2015-07 మధ్య ఆకలి, పోషకాహారం లేని వారు చైనాలో 15.9 నుంచి 8.8శాతానికి తగ్గితే ఇదే సమయంలో మన దేశంలో 22.2నుంచి 14.8కి తగ్గింది. ఐదేండ్ల లోపు పిల్లల పెరుగుదల ఆగిపోయిన వారు ప్రపంచ సగటు 23.2శాతం కాగా 2000-13 మధ్య చైనాలో 17.8 నుంచి 8.1శాతానికి పడిపోగా మన దేశంలో 2000-15 మధ్య 54.2 నుంచి 38.4కు తగ్గింది. ఇక అభివృద్ధి విషయానికి వస్తే చైనాలో 1980దశకంలో వ్యవసాయం బాగా అభివృద్ది చెంది జన జీవితాలను మార్చివేయగా మన దేశంలో ఆది జరగలేదు. ఇవన్నీ ఆయా దేశాలలో ఎలాంటి రాజకీయ వ్యవస్ధ ఉందని కాదు, జనం పట్ల జవాబుదారీతనంతో ఉన్నారా లేదా అన్నది ముఖ్యం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: