• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: April 2017

మే డే, పూలే, అంబేద్కర్‌ !

29 Saturday Apr 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

'Bombay Mill Hands Association, b-r-ambedkar, Father of the Trade Union Movement in India, jyothi-rao-pule, may day, narayan meghaji lokhande

Image result

ఎం కోటేశ్వరరావు

మే డే, కార్మికుల దీక్షా దినం. ప్రపంచ వ్యాపితంగా కార్మికవర్గం తన హక్కుల సాధనకోసం పునరంకితమయ్యే అంతర్జాతీయ దినం. అంబేద్కర్‌ అంటే దళితుల నాయకుడని, ( మరీ కొంత మంది అయితే దళితులలో ఒక వుప కులానికే పరిమితం చేసే విచారకర ప్రయత్నం గురించి చెప్పనవసరం లేదు.) మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ఓబిసిల నేతగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది.ఈ ఇద్దరికీ కమ్యూనిస్టులు వ్యతిరేకమనే తప్పుడు ప్రచారం కొందరు చేస్తున్నారు.మరికొందరు వారిని తమ మనువాద, తిరోగామి చట్రంలో బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది తెలిసి చేసినా తెలియక చేసినా చరిత్రలో వారి స్ధానాన్ని తక్కువ చేసి చూపటమే. ఈ ప్రచారానికి ప్రభావితమైన వారు మే డే సందర్భానికి పూలే,అంబేద్కర్‌లకు సంబంధం ఏమిటని ఎవరైనా ప్రశ్నించవచ్చు.

Image result for narayan meghaji lokhande

మన దేశంలో కార్మికోద్యమ పితామహుడు, కార్మిక, సామాజిక సమస్యలపై కేంద్రీకరించిన తొలి పత్రిక ‘దీన బంధు ‘ సంపాదకుడు నారాయణ్‌ మేఘాజీ లోఖండే అని, ఆయన మహాత్మా జ్యోతిబా పూలే ఏర్పాటు చేసిన సత్య శోధక సమాజ కార్యక్రమాల వుత్తేజంతోనే దేశంలోనే తొలి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన 1848లో జన్మించిన నారాయణ్‌ కేవలం 49 సంవత్సరాల కే ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవలందిస్తూ అనారోగ్యంతో మరణించారు. రైల్వే, తపాల శాఖలో పని చేసిన ఆయన 1870లో మాండవీ బట్టల మిల్లులో స్టోరు కీపరుగా చేరారు. ఆ సమయంలో మిల్లు కార్మికుల దయనీయ స్ధితిని ప్రత్యక్షంగా చూశారు. కార్మికుల పని పరిస్థితుల గురించి ఎలాంటి చట్టాలు లేవు. పొద్దు పొడవక ముందే మిల్లు పనిలోకి రావాలి.పొద్దు పోయేంత వరకు పని చేయాలి. ఇంటికి వెళ్లి రావటంలో అలస్యం అయితే యజమానులు అంగీకరించరు కనుక అనేక మంది రాత్రి డ్యూటీ దిగి గేటు దగ్గరే నిద్రపోయి తెల్లవారు ఝామున లేచి తిరిగి పనికి వెళ్లే వారు. మధ్యలో భోజనానికి పావు గంటా ఇరవై నిమిషాలు మాత్రమే అనుమతించేవారు. ఇక ఫ్యాక్టరీలలో కాలకృత్యాలు తీర్చుకొనే సౌకర్యాలు, తగిన గాలి, వెలుతురు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కొన్ని పండుగలకు ఇచ్చే సెలవులు తప్ప 365రోజులూ పని చేయాల్సిందే. దీనికి తోడు దాదాపు రోజంతా యంత్రాలు పని చేసిన కారణంగా వాటి రాపిడికి ఫ్యాక్టరీలో వేడి వాతావరణం వుండేది. దీంతో కార్మికులు అయిదారు సంవత్సరాలకు మించి పని చేయలేకపోయే వారు.1881 లెక్కల ప్రకారం బొంబాయి మిల్లులలో పని చేసే వారిలో 23శాతం మంది 15 ఏండ్ల లోపు బాల కార్మికులు వుండేవారు. రోజు పది నుంచి 14 గంటలు పని చేసేవారు.

వీటన్నింటినీ ప్రత్యక్షంగా చూసి చలించిపోయిన నారాయణ్‌ ఆ పరిస్థితులు మారాలనే ప్రచారానికి పూనుకున్నారు.1877లో ప్రారంభమైన దీన బంధు పత్రిక ఆర్ధిక ఇబ్బందులతో వెంటనే మూత పడింది. దానిని తిరిగి పునరుద్ధరించి 1880లో సంపాదక బాధ్యతలు చేపట్టిన నారాయణ్‌ మరో నాలుగు సంవత్సరాలకే బాంబే మిల్‌ హాండ్స్‌ అసోసియేషన్‌ పేరుతో తొలి కార్మిక సంఘాన్ని 1884లో ఏర్పాటు చేశారు. అమెరికా, తదితర దేశాలలో జరుగుతున్న కార్మికోద్యమాలను చూసిన బ్రిటీష్‌ ప్రభుత్వం 1875లోనే ఒక కమిషన్‌ వేసి 1881లో తొలి ఫ్యాక్టరీ చట్టాన్ని చేసింది. అయితే దానితో కార్మికుల పని పరిస్థితులలో పెద్దగా మార్పేమీ లేదు. అదెంత కంటి తుడుపు వ్యవహారమంటే ఏడు సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టరాదని, 7-12 ఏండ్ల బాల కార్మికులతో తొమ్మిది గంటలకు మించి పని చేయించరాదని, యంత్రాల చుట్టూ కంచెలు వేయించాలనే తరహా నిబంధనలు పెట్టింది. వీటిని కూడా యజమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. కనీసం దానిని కూడా అమలు జరిపే యంత్రాంగం, ఆసక్తి ప్రభుత్వానికి లేదు. నారాయణ్‌ మేఘాజీ తన పత్రిక ద్వారా, ఇతర పద్దతులలో దాని వలన పెద్ద కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేదని ప్రచారం చేయటంతో పాటు, కార్యాచరణకు గాను ముందే చెప్పుకున్నట్లు 1884లో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అదే ఏడాది ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్మికుల సంక్షేమ చర్యలలో భాగంగా ప్రమాదానికి గురైనపుడు సాయం, మరణించినపుడు గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్‌ వంటి వాటిని అమలు జరపాలని కోరుతూ మిల్లు కార్మిక సంఘ అధ్యక్షుడి హోదాలో ఆ కమిషన్‌కు ఒక పిటీషన్‌ అందచేశారు.దానిపై వేలాది మంది కార్మికుల సంతకాలను సేకరించారు. ఒకవైపు వాటితో పాటు 1884 సెప్టెంబరు 23న తొలిసారిగా కార్మికుల సభను ఏర్పాటు చేసి అవే డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ వారానికి ఒక రోజు ఆదివారం సెలవు ఇవ్వాలని, వుదయం ఆరున్నర నుంచి సాయంత్రం పొద్దుగూకే వరకు మాత్రమే పని చేయించాలని, మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి ఇవ్వాలని కూడా సభ ఒక తీర్మానం చేసింది.అయితే వాటిని యజమానులు అంగీకరించలేదు.

1890 నాటికి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఒక సంక్షోభం వచ్చింది. వస్త్రాలకు డిమాండ్‌ లేని కారణంగా మిల్లులను మూసివేస్తున్నామని యజమానులు ఏకపక్ష చర్యలకు పూనుకున్నారు. దానికి నిరసనగా 1890 ఏప్రిల్‌ 24న లోఖండే ఒక పెద్ద కార్మిక సభను నిర్వహించారు. అదే ఏడాది జూన్‌ పదిన యజమానుల సమావేశంలో ఆదివారం రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. దీన్ని రెండు రకాలుగా వ్యాఖ్యానించవచ్చు. సంఘటిత కార్మికవుద్యమానికి లభించిన విజయంగా ఒకటి. మార్కెట్‌లో వున్న మాంద్యం ఎంతకాల కొనసాగుతుందో తెలియదు కనుక ఒక రోజు సెలవు ఇస్తే వచ్చే నష్టం కంటే పని చేస్తే తమపై పడే భారం ఎక్కువ కనుక యజమానులు సెలవుకు అంగీకరించారన్నది మరొకటి.

అంతకు ముందు ఆమోదించిన ఫ్యాక్టరీ చట్టం కార్మికులను సంతృప్తి పరచకపోవటం, ఆందోళనలు పెరిగి పోవటంతో ప్రభుత్వం 1890లో ఫ్యాక్టరీ లేబర్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది.దానిలో లోఖండేను సహ సభ్యునిగా నియమించింది. దాని సిఫార్సుల మేరకు 1891లో ఆమోదం పొంది మరుసటి ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చిన కొత్త చట్టం పది మంది వున్న ఫ్యాక్టరీలన్నింటికీ వర్తించింది. తొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలతో పనిపై నిషేధం, 14 ఏండ్ల లోపు వారికి, మహిళల చేత 9,11 గంటలు మాత్రమే పని చేయించాలని, వారికి నెలకు నాలుగు రోజులు సెలవులు ఇవ్వాలని దానిలో పేర్కొన్నారు.

Image result for jyothi rao pule

జ్యోతిబా పూలే తిరుగులేని అనుచరుడిగా వున్న లోఖాండే కార్మికనేతగా పని చేయటానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి సంస్కర్తగా సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటంతో పాటు అమానుష దోపిడీ, దుర్భర పని పరిస్ధితులలో కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి ప్రతిఘటన పోరాట యోధుడు. నాటి పరిస్థితులలో మహజర్లు సమర్పించటం, సభలు జరపటం వంటి రూపాలనే ఎంచుకోవటం సహజం. తన పత్రికలో రాసిన సంపాదకీయాలను చూస్తే ఈ రెండు అంశాలతో పాటు 1893లో జరిగిన మత ఘర్షణల సందర్భంగా హిందూ-ముస్లిం ఐక్యత అవసరం గురించి ఆయన రాసిన సంపాదకీయాలు మతశక్తుల పట్ల వైఖరిని వెల్లడించాయి. అన్ని మతాల వారితో ఏర్పాటు చేసిన సమ్మేళనానికి 60వేల మంది హాజరయ్యారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాలను ఆయన నిరసించాడు.కార్మిక నేతగా ప్రత్యేకంగా మహిళాకార్మికులను సమీకరించి కూడా సభలు జరిపారు. భర్త మరణించినపుడు స్త్రీల తలలు గొరిగి గుండ్లు చేయటాన్ని ఆయన వ్యతిరేకించారు.1890 మార్చినెలలో దాదాపు ఐదు వందల మంది క్షురకులను సమీకరించి ఏర్పాటు చేసిన సభలో మహిళలకు గుండ్లు చేయబోమని వారిచేత ప్రతిజ్ఞ చేయించటం ఒక అపూర్వ ఘట్టం. పేదలకు సేవ చేసేందుకు ఆయన ఒక ఆసుపత్రిని కూడా ప్రారంభించారు.1886లో బొంబాయి, పరిసరాలలో వ్యాపించిన ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవ చేస్తూనే 1887 ఫిబ్రవరి తొమ్మిదిన ఆయన మరణించారు.

2005లో ఆయన స్మారకార్ధం పోస్టల్‌ స్టాంపును విడుదల చేసిన సందర్భంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ లోంఖడేలో జ్యోతిబా పూలే సామాజిక సంస్కరణ, మహిళాభ్యుదయంతో పాటు కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కార్మిక పక్షపాతం కూడా మిళితమై వుందని చెప్పారు. మొత్తం మీద చూసినపుడు లోఖండేలో సంఘసంస్కర్త పాలు ఎక్కువా లేక కార్మికోద్యమ నేత పాలు ఎక్కువగా అన్నది పక్కన పెడితే బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు రావు బహద్దూర్‌ బిరుదును ప్రకటించటాన్ని బట్టి ఒక సంస్కర్తగానే చూసిందన్నది స్పష్టం. ఒక కార్మిక నేతకు అలాంటి బిరుదులను వూహించలేము. అంతమాత్రాన కార్మికోద్యమానికి ఆయన వేసిన బలమైన పునాదిని విస్మంరించకూడదు.

Image result for ambedkar

భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్‌ అంబేద్కర్‌ జీవితాన్ని పరిశీలించినపుడు ఆయనలో వున్నన్ని భిన్న పార్శ్వాలు మరే నాయకుడిలోనూ లేవంటే అతిశయోక్తి కాదు. అటువంటి మహానుభావుడిని కొందరు నేడు దళితులలో ఒక వుప కుల ప్రతినిధిగా చూస్తూ కొందరు ఆరాధిస్తుంటే అదే కారణంతో మరికొందరు ఆయనను విస్మరిస్తున్నారు. రెండు వైఖరులూ సరైనవి కావు. అంబేద్కర్‌ రాజ్యాంగ పద్దతులలో కార్మికవర్గానికి చేసిన మేలు తక్కువేమీ కాదు. ఆయన ఇండియన్‌ లేబర్‌ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా రైతాంగ సమస్యలపై కూడా పని చేశారు. మొత్తం మీద చూసినపుడు మొగ్గు రాజ్యాంగం, చట్టాలు, దళితుల అభ్యుదయానికి ఆయన మారుపేరుగా మారారు.

Image result for may day

మే డే సందర్భంగా పూలే, అంబేద్కర్‌లను విస్మరించలేము. పూలే, ఆయన సత్యశోధక సమాజం, సంస్కరణలకోసం కృషే నారాయణ మేఘజీ లోఖండేను కార్మిక పక్షపాతిగా కూడా మార్చిందన్నది స్పష్టం.ఈ సందర్భంగా పూలే, లోఖండే, అంబేద్కర్‌లను వామపక్ష వుద్యమం విస్మరించిందనే ఒక విమర్శ వుంది. దాని మంచి చెడ్డల విషయానికి వస్తే అది గత చరిత్ర. నేడు వామపక్షాలు గతం కంటే వారి కృషిని గుర్తించిన మాట వాస్తవం. కార్మిక, కర్షక వుద్యమాలు, సంఘాల నిర్మాణాలతో పాటు దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులు, మహిళల ప్రత్యేక సమస్యలు, హక్కుల గురించి పోరాడేందుకు ఏర్పాటు చేస్తున్న సంఘాలు, వాటి కార్యకలాపాలే అందుకు నిదర్శనం. వాటిని గుర్తించేందుకు కొంతకాలం పట్టవచ్చు. గతంలో పూలే, అంబేద్కర్‌లను వామపక్షాలు సముచిత స్ధానంతో గౌరవించలేదని విమర్శించే వారు తాజా వైఖరిలో వచ్చిన మార్పును గమనించ వచ్చు. లేదూ అది చాలదు అనుకుంటే తమ అభిప్రాయాలను తాము అట్టి పెట్టుకోవచ్చు. ఈ సందర్భంగానే పూలే-అంబేద్కరిస్టులుగా ముద్రపడిన వారి గురించి కూడా కొన్ని విమర్శలున్నాయనే అంశాన్ని మరచి పోకూడదు. కార్మిక, కర్షక సమస్యలకు ఇచ్చిన ప్రాధాన్యతను కమ్యూనిస్టులు కుల వివక్ష సమస్యకు ఇవ్వలేదని ఎలా విమర్శలు వచ్చాయో, పూలే-అంబేద్కరిస్టులు కుల వివక్ష సమస్యకే పరిమితమై కార్మికవర్గ పోరాటాలను విస్మరిస్తున్నారనే ఆ విమర్శ. అందువలన ఇద్దరు మిత్రులూ ఎవరి వైఖరికి వారు కట్టుబడి వున్నప్పటికీ రెండు సమస్యల మీద ఐక్య వుద్యమాలు చేయటానికి అవి ఆటంకం కానవసరం లేదు. అవి మిత్ర వైరుధ్యాలు తప్ప శత్రువైరుధ్యాలు కావు. అందువలన ఇప్పుడు రెండు వైపుల నుంచీ వినిపిస్తున్న లాల్‌ -నీల్‌ ఐక్యతను పెంపొందించేందుకు చిత్తశుద్దితో కృషి చేయటం అవసరం. ఈ మేడే సందర్భంగా రెండు శక్తులూ కర్తవ్యానికి పునరంకితం కావటమే చికాగో అమర జీవులు, పూలే-అంబేద్కర్‌లకు నిజమైన నివాళి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నాడు కమ్యూనిస్టులు ! నేడు వ్యతిరేకుల బెంబేలు !!

28 Friday Apr 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, anti communists, Bernie Sanders, Communists, french communist party, french left party, post communist mafia state, Socialist

Image result for The communists, now anti communists are worrying

ఎం కోటేశ్వరరావు

సోషలిజం, కమ్యూనిజాలకు కాలం చెల్లింది అన్న తీవ్ర ప్రచార దాడికి గురైన అనేక మంది కమ్యూనిస్టులు దానిని తట్టుకోలేక, కోలుకోలేక నిజమే అనుకున్న మాట వాస్తవం. కావమ్మ మొగుడని అందరూ అంటే కామోసని ఇన్నేళ్లూ కాపురం చేశాను, ఇప్పుడు కాదంటున్నారు గనుక నా కర్రా బుర్రా ఇస్తే నా దారి నే చూసుకుంటాను అన్న సామెత తెలిసిందే. అలాగే అంతగా సైద్ధాంతిక అవగాహన లేని వారు, కమ్యూనిస్టు అనుకూల పరిణామాలతో వుత్తేజితులై వచ్చిన వారు అనేక మంది దూరమయ్యారు. కొత్తవారిలో వుత్సాహం తగ్గిపోయింది. అయినా అనేక మంది అచంచల విశ్వాసంతో ఎత్తిన జెండా దించకుండా కొనసాగుతున్నవారున్నారు. పాతికేండ్ల తరువాత యువతలో సోషలిస్టు అనుకూల భావాలపై ఆసక్తి పెరగటాన్ని చూసి పశ్చిమ దేశాలలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు బెంబేలెత్తుతున్నారు.

ఏప్రిల్‌ 23న ఫ్రాన్సు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో ఇంకేముంది కమ్యూనిస్టు అభ్యర్ధి దూసుకు వస్తున్నాడు బహుపరాక్‌ అని కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా, వ్యతిరేక శక్తులు ప్రచారం చేశాయి. తుది విడత పోటీకి అర్హత సంపాదిస్తాడనుకున్న కమ్యూనిస్టులు బలపరిచిన వామపక్ష అభ్యర్ధి మెలెంచన్‌ కొద్ధి శాతం ఓట్ల తేడాతో అవకాశాన్ని కోల్పోయాడు. అధికారానికి దగ్గర దారులు లేవు, పోరాటాన్ని కొనసాగిస్తామంటూ ఈ ఫలితాన్ని కమ్యూనిస్టులు సాధారణంగానే స్వీకరించారు. కమ్యూనిజం అంతరించిందన్న ప్రచారాన్ని నిజంగానే నమ్మిన ఫ్రాన్స్‌లోని కమ్యూనిస్టు వ్యతిరేకులు కొందరికి ఇప్పుడు మనోవ్యాధి పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇది ఒక్క ఫ్రాన్స్‌కే కాదు, అమెరికాలో కూడా తీవ్రంగానే విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. మీడియాలో వస్తున్న వ్యాఖ్యలు, విశ్లేషణలే అందుకు నిదర్శనం. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార దాడి సైనికులు, కమాండర్లు ఇప్పుడు కొట్టబోతే కడుపుతో వుంది, తిట్టబోతే అక్క కూతురు అన్న స్ధితిని ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తోంది.

తొలి విడత ఎన్నికల ఫలితాల వెల్లడి తరువాత ఒక ఫ్రెంచి పత్రికలో వచ్చిన వ్యాఖ్యానం ఇలా సాగింది.’ ఫ్రాంకోయిస్‌ ఫిలన్‌(మితవాద రిపబ్లికన్‌ పార్టీ) దేశాన్ని సంస్కరించేందుకు కట్టుబడి వుంటానని ప్రకటించిన వైఖరి ఎంతో ప్రభావం చూపినప్పటికీ ఆయనకు లభించిన మద్దతు చూసి ఆశాభంగం చెందాను. దానికి నేను చేయగలిగింది లేదు గానీ తుది విడత పోటీలో లీపెన్‌-మెలాంచన్‌ మధ్య పోటీ జరగనందుకు నాకు ఎంతో భారం తీరింది. ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ సోషలిస్టు కాదు, ప్రచారంలో చెప్పినదానికంటే పెద్ద స్వేచ్చా మార్కెట్‌ వాది, అయితే తన అధ్యక్ష పదవితో దేశాన్ని మెరుగుపరిచేందుకేమీ చేయలేడు….. ఎన్నికలలో 55శాతం మంది ఓటర్లు తీవ్రవాద భావాలున్న వారికి ఓటు చేసిన దాని గురించి నేను చెప్పాలి…. దాని కంటే ఎక్కువగా మిలియన్ల మంది మరణాలకు కారణమైంది కమ్యూనిస్టు సిద్ధాంతం అనే అబేధ్యమైన ప్రచారాన్ని బద్దలుకొట్టి కమ్యూనిస్టు మెలంచన్‌కు ఫ్రెంచి జనాలు ఓటు వేయటం నా బుర్రను బద్దలు చేస్తున్న అంశం…. ఫిలన్‌ సంపాదించినన్ని ఓట్లు దాదాపు 20శాతానికి దగ్గరగా మెలంచన్‌ సాధించాడు.ఇదొక వెర్రి. హ్యూగో ఛావెజ్‌ ఇతర కమ్యూనిస్టు నియంతలను మెలంచన్‌ తిరుగులేని విధంగా సమర్ధించాడు. అంతకంటే హీనమైనది ఏమంటే ఒక్క ఫ్రాన్సే కాదు -ఫెడల్‌ కాస్ట్రో ఎట్టకేలకు మరణించాడు. జనం ఏమి ఆలోచిస్తున్నారు ? నేను జీవించి వున్నంత వరకు ఫ్రాన్స్‌లో, వెలుపలా కమ్యూనిజం కళంకానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదో, 2017లో ఈ సిద్ధాంతం ఎందుకు పెరుగుతోందో నేను ఎన్నడూ అర్ధం చేసుకోలేను.’ అని పోయాడు.http://www.nationalreview.com/corner/446992/france-marine-le-pen-presidential-election-normalization-extremes ఇలాంటి వారెందరో కనిపిస్తున్నారు.

Image result for socialists in Present USA

పాతిక సంవత్సరాల క్రితం సోషలిస్టు వ్యవస్ధలు కూలిపోయినందుకు కమ్యూనిస్టులు విచారిస్తే తిరిగి కమ్యూనిజం పట్ల జనం సానుకూలత వ్యక్తం చేయటాన్ని చూసి కమ్యూనిస్టు వ్యతిరేకులలో ఆందోళన ప్రారంభమైందన్నది స్పష్టం. కమ్యూనిస్టు భూతం గురించి ఐరోపాను వెన్నాడుతోందని 1848 నాటి కమ్యూనిస్టు ప్రణాళిక ముందు మాటలోనే మార్క్స్‌-ఎంగెల్స్‌ రాశారు. అంటే అంత కంటే ముందే ఐరోపాలో తత్వవేత్తలు సోషలిజం, కమ్యూనిజాల గురించి చర్చించటం, ఆ భావజాలం తమ దోపిడీ వ్యవస్ధను కూల్చివేస్తుందని పెట్టుబడిదారీ వర్గం అప్పుడే గుర్తించటం, నిరోధించటానికి నాటి నుంచే ప్రయత్నించటం దాస్తే దాగేది కాదు. కమ్యూనిజం గురించి నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక రూపంలో జనాన్ని భయపెడుతూనే వున్నారు. ఏదైనా ఒక వ్యవస్ధ సమాజంలోని మెజారిటీ వర్గం ముందుకు పోవటానికి ఆటంకంగా మారినపుడు దానిని కూల్చివేసి నూతన సామాజిక వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవటమే ప్రపంచ మానవాళి చరిత్ర. దారుణంగా వున్న భూస్వామిక వ్యవస్ధతో పోల్చితే పారిశ్రామిక విప్లవంతో ప్రారంభమైన పెట్టుబడిదారీ వ్యవస్ధ తొలినాళ్లలో జనానికి మెరుగ్గా కనిపించింది.’ అరే ఒరే అన వీల్లేదంటా, వారం వారం బట్వాడంటా ….బస్తీకి పోదాము’ పాటను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. భూస్వామిక వ్యవస్ధ ఆటంకంగా మారింది కనుకే దానికంటే మెరుగైన వ్యవస్ధ కోసం జనం దానిని నాశనం చేసేందుకు పెట్టుబడిదారులకు సహకరించారు. పెనంలోంచి పొయ్యిలో పడ్డట్లు గ్రహించగానే పెట్టుబడిదారీ వ్యవస్ధను నాశనం చేయటం గురించి ఆలోచించటం మొదలు పెట్టారు. కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ పుట్టక ముందే సమసమాజం, సోషలిజం, కమ్యూనిజం గురించి చర్చ ప్రారంభమైందంటే అది ఒక సహజ పరిణామం తప్ప మరొకటి కాదు. వారు గాక పోతే మరొకరు కమ్యూనిస్టు ప్రణాళికను రచించి వుండేవారు.

ఇంటర్నెట్‌ యుగంలో సమాచారాన్ని దాచటం అసాధ్యం. అత్యంత పకడ్బందీగా దాచే అమెరికా రహస్యాలనే అసాంజే లోకానికి అందించిన విషయం తెలిసినదే. పిల్లలకోసం కమ్యూనిజం అనే పుస్తకాన్ని ప్రచురించిన అమెరికా విశ్వవిద్యాలయ ముద్రణ సంస్దపై అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు విరుచుకుపడుతున్నారు. మన దేశంలో జెఎన్‌యు, హైదరాబాదు యూనివర్సిటీల వంటివి బిజెపి సర్కారుకు కంటగింపుగా మారి వాటిని దెబ్బతీయాలని చూస్తున్నట్లే తాజాగా తూర్పు ఐరోపాలోని హంగరీలోని సెంట్రల్‌ యూరోపియన్‌ యూనివర్సిటీ(సిఇయు)ను మూసివేయాలని ప్రజాస్వామ్య ముసుగు వేసుకున్న అక్కడి నిరంకుశ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Image result for post communist mafia state

ఆ విశ్వవిద్యాలయం చేసిన తప్పిదం ఏమిటి ? ‘ కమ్యూనిస్టు అనంతర మాఫియా రాజ్యం-హంగరీ వుదంతం ‘( పోస్ట్‌ కమ్యూనిస్టు మాఫియా స్టేట్‌ – ఏ కేస్‌ ఆఫ్‌ హంగరీ) అనే పేరుతో 2016లో ఒక పుస్తకాన్ని ప్రచురించింది. రచయిత కమ్యూనిస్టు కాదని ముందు తెలుసుకోవాలి. సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత హంగరీ ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణాలను దాచి పెట్టేందుకు అక్కడి నిరంకుశ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా గత రెండు సంవత్సరాలుగా ఐరోపాకు పదిలక్షల మంది వలస రావటానికి జార్జి సోరెస్‌ ప్రధాన కారణమని, అలాంటి వారి కేంద్రంగా విశ్వవిద్యాలయం వుందంటూ ప్రభుత్వ పత్రిక ద్వారా జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. పైన పేర్కొన్న పుస్తకాన్ని సదరు విశ్వవిద్యాలయం ముద్రించిన కారణంగా దానిని మూసివేయాలనే యత్నాలను 63శాతం మంది వ్యతిరేకిస్తున్నారని తేలింది.మాఫియా శక్తులకు ఆశ్రయమిచ్చిన పాలకుల నిజస్వరూపాన్ని ఆ పుస్తకంలో ఎండగట్టటమే అసలు కారణం. సోషలిస్టు వ్యవస్ధ స్ధానంలో ప్రజాస్వామిక సమాజాన్ని ఏర్పాటు చేస్తామని నమ్మబలికిన కమ్యూనిస్టు వ్యతిరేకులు గత పాతిక సంవత్సరాల కాలంలో నిరంకుశ పాలనను రుద్దేందుకు అనుసరిస్తున్న నూతన పద్దతులను దానిలో వివరించారు. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లుగా ఆ పుస్తకాన్నిరాసింది ఒక మాజీ మంత్రి కావటంతో దానికి విశ్వసనీయత పెరిగింది. ప్రజాస్వామ్యం గురించి పంచరంగుల్లో చూపిన వారు దాన్ని ఏడునిలువుల లోతున పాతిపెట్టటాన్ని గమనించిన జనం ఎలా ఆలోచించేది చెప్పనవసరం లేదు. సాంప్రదాయక మాఫియా బహిరంగంగా ఎలా సంపదలను బలవంతంగా లూటీ చేస్తుందో తెలిసిందే. అదే కమ్యూనిస్టు పాలన అనంతర రాజకీయ మాఫియా చట్టాలను అడ్డం పెట్టుకొని ఎలా లూటీ చేస్తుందో ఒక్క హంగరీకే గాక ఎక్కడైతే ఇతర కమ్యూనిస్టు అనంతర రాజ్యాలలో నిరకుశపాలకులు వున్నారో ఆ దేశాల వారందరూ తెలుసుకోవాల్సిన అంశాలున్న ఈ పుస్తకం సమయోచితంగా వెలువడిందని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు.ఈ పుస్తకం గురించి అడిగితే గూగులమ్మ తల్లి ఎంతో సమాచారాన్ని మన ముందు ప్రత్యక్షం చేస్తోంది. అలాంటపుడు మన కంటే ఎక్కువ చదువుకున్న, సమస్యలను ఎదుర్కొంటున్న ఫ్రెంచి యువతరానికి తమ పొరుగునే వున్న తూర్పు రాజ్యాలలోని ఈ మంచి చెడ్డలన్నీ తెలియకుండా వుంటాయా? ప్రజాస్వామ్యం పేరుతో ఇంతకాలం ఇతర పార్టీల ప్రజావ్యతిరేక పాలన చూసిన తరువాత రెండవ ప్రపంచ యుద్ద సమయంలో హిట్లర్‌ వ్యతిరేక పోరాటంలో ఘనమైన గత చరిత్ర వున్న కమ్యూనిస్టులకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనే ఆలోచన ఫ్రెంచి వారిలో కూడా ఏ మూలన అయినా ప్రారంభమైందేమో ? ఏమీ లేకుండా 20శాతం ఓట్లు ఎలా వస్తాయి?

Image result for socialists in Present USA

అమెరికా అంటే ప్రపంచ దోపిడీ పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల, యుద్దోన్మాదుల, కమ్యూనిస్టు వ్యతిరేకుల నిలయంగా అందరికీ తెలిసిందే. మరి అలాంటి రాజ్యంలో ‘ సోషలిజం అంత జనరంజకంగా ఎలా తయారైంది ?’ అనే ప్రశ్నతో ఒక విశ్లేషణ చేశారు.https://www.thetrumpet.com/15721-how-did-socialism-become-so-popular-in-america అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేక, తటస్ధ, సానుకూల ఏదో ఒక రూపంలో మీడియాలో ఇటీవలి కాలంలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గతేడాది ఎన్నికల సమయంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.’ ప్రచ్చన్న యుద్ధ సమయంలో కమ్యూనిజం గురించి అమెరికాలో ఎంతో భయం వుండేది. కమ్యూనిజం వ్యాప్తి గురించి అతిశయోక్తులు చెప్పారని ఇప్పుడు ఎక్కువ మంది అమెరికన్లు నమ్ముతున్నారు. ప్రధాన స్రవంతి సోషలిస్టు భావజాలం గురించి నేడు ఎంత విస్తృతంగా ప్రచారంలో వున్నాయో చూడండి. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దాదాపు ఒక బహిరంగ సోషలిస్టు డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్దిత్వాన్ని గెలుచుకున్నారు. మూడు పదుల లోపు వయసు వారు మాత్రమే ఓటు వేసి వున్నట్లయితే ఆ వ్యక్తి నేడు అమెరికా అధ్యక్షుడు అయి వుండేవాడు. ప్రభుత్వ అధికారం మరియు పాత్రను ఎంతో పెంచాలన్న ఆయన విప్లవాత్మక పధకాలు ఇప్పటికీ బహుళఆదరణ పొందుతున్నాయి. ఆరోగ్య సంరక్షణతో పాటు ఆర్ధిక వ్యవస్ధలోని ప్రధాన రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతున్న వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. మన సమాజం ఆలోచనలో ఇది పెద్ద మార్పు, అది ఎంతో వేగంగా జరుగుతోంది…….ఈ రోజు అమెరికాను కమ్యూనిజం ప్రభావితం చేస్తోంది అన్న రుజువు కోసం మీరు పెద్దగా కష్టపడనవసరం లేదు……..సగటు కాలేజీ ఫ్రొఫెసర్‌ను మీరు సోషలిస్టా లేక మార్క్సిస్టా అని అడిగితే అతడు లేక ఆమె అవును నేను అదే అని చెప్పే అవకాశాలున్నాయి……అమెరికన్లు నేడు మన జాతిపితలు లేదా మన స్వంత తండ్రులు నిర్మించిన దేశంలో నివశించటం లేదు. అనేక మంది గుర్తించిన దానికంటే ఎక్కువ విప్లవ భావాలవైపు మొగ్గుతున్నారు. సోషలిస్టు మరియు కమ్యూనిస్టు ఆలోచనా వివేచనను మనం ఈ క్షణంలో స్వతహాగా గుర్తించటం కాదు. ఒక పధకం ప్రకారం ఆశ్చర్యకరంగా ఈ స్వేచ్చా భూమిని మరియు ధైర్యవంతులకు నిలయమైన దీనిని కూల్చివేసేందుకు విజయవంతంగా అనుసరించిన వ్యూహం ఫలితంగానే ఈ భావ జాలం ఇంతగా జనంలో ప్రచారమైందన్నది వాస్తవం.’ అని జోయెల్‌ హిలికర్‌ అనే రచయిత వాపోయాడు.

చిత్రం ఏమిటంటే సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత కూడా అమెరికన్‌ కమ్యూనిస్టు పార్టీకి సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీ నిధులు అందచేసిందని అలవాటులో భాగంగా చెడరాసి పడేశాడు. సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ అనేక దేశాలలో కమ్యూనిస్టు వుద్యమాలకు తోడ్పాటు అందించేందుకు అనేక రూపాలలో సాయం చేసింది. భావజాల ప్రచారంలో భాగంగా ఎక్కువ భాగం పుస్తకాల రూపంలోనే జరిగిందన్నది బహిరంగ రహస్యం.ఆ మాటకు వస్తే కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేయటానికి అమెరికన్లు ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేశారో, పెట్టుబడులు పెట్టారో లోకవిదితమే. మొదటిది పధకం అయితే రెండవదీ వ్యూహమే, దానికి అనుగుణ్యంగా పధకమే. భావజాల ప్రచారానికి పధకం వేయటం ద్వారా అమెరికాలో వ్యాప్తి చెందిందన్నది పెట్టుబడిదారీ వ్యవస్ధ, తమ కమ్యూనిస్టు వ్యతిరేక పధకాల, వ్యూహాల వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనే కుంటి సాకు తప్ప మరొకటి కాదు. కమ్యూనిస్టు భావజాల ప్రచారాన్ని అడ్డుకొనేందుకు ఇంతకాలం అమెరికన్లు చేయని ప్రయత్నం లేదు. అరచేతిని సూర్యకాంతిని ఆపే విఫలయత్నం చేసినట్లుగానే కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అడ్డుకొనేందుకు అమెరికన్లు అసహజ చర్యలకు పాల్పడ్డారు. అందుకు తగిన మూల్యం కూడా చెల్లించారు. దాన్ని సామాన్య జనంపై మోపిన కారణంగానే అమెరికాతో పాటు ఇతర ధనిక దేశాలలో సంక్షోభం తలెత్తింది. ఇండో చైనా దేశాలపై దశాబ్దాల పాటు చేసిన యుద్దం ఒకటైతే ఆప్ఘనిస్తాన్‌లో కమ్యూనిస్టు ప్రభావాన్ని అరికట్టే పేరుతో అమెరికన్లు చేసిన ప్రయోగం అమెరికా సైనికులను ఫణంగా పెట్టటం ఒకటైతే అంతకు మించి ఒక్క కమ్యూనిస్టులకే గాక యావత్‌ స్వయంగా తనతో పాటు యావత్‌ ప్రపంచానికి ముప్పుగా తాలిబాన్లు అనే వుగ్రవాదులను తయారు చేసింది. అక్కడ 16లక్షలకు పైగా తన సైన్యాన్ని మోహరించి కూడా తాలిబాన్లను అణచలేక చేతులెత్తేసింది.

ఇలాంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి? పెట్టుబడిదారీ వ్యవస్ధలో అనేక సంక్షోభాలు ఎందుకు వస్తున్నాయి? 2008లో అన్ని పెట్టుబడిదారీ ధనిక దేశాలలో ప్రారంభమైన మాంద్యం ఎప్పుడు అంతరిస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అమెరికా సమాజంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక అసమానతలు పెరిగిపోయాయని, అది మంచిది కాదని పెట్టుబడిదారీ ఆర్ధిక నిపుణుడు పికెటీ చేసిన విశ్లేషణను ఇంతవరకు ఎవరూ సవాలు చేయలేదు. వీటన్నింటి గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నపుడు అమెరికా, ఫ్రాన్స్‌ ఇలా ఏ దేశ యువత అయినా మెదళ్లకు పదును పెట్టకుండా, ఎందుకు అని ప్రశ్నించకుండా ఎలా వుంటుంది?

కమ్యూనిస్టు బూచిని ఎంతకాలం మమ్మల్ని మభ్యపెడతారు, భయపెడతారు రాబోయే కమ్యూనిజంతో వచ్చే ప్రమాదం ఏమిటో తెలియటం లేదుగానీ పెట్టుబడిదారీ విధానం తమ జీవితాలను నాశనం చేస్తోందని పశ్చిమ దేశాల వారు భావిస్తున్నారు. సోషలిస్టు వ్యవస్ధలను కాలదన్నుకున్న పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌లు, తూర్పు ఐరోపా దేశాలు ప్రజాస్వామ్యం పేరుతో ప్రజల సంపదలను లూటీ చేసే వారి చేతులలోకి పోయాయి. ప్రజాస్వామ్యం అంటే నేతి బీరలోని నెయ్యి మాదిరి అని తేలిపోయింది. దాదాపు అన్ని దేశాలలో నిరంకుశ పాలకులదే పెత్తనం. అక్కడ అంతకు ముందులేని దారిద్య్రం, నిరుద్యోగం, సకల అవలక్షణాలు వచ్చాయి. వాటిని చూసిన ప్రపంచంలోని ఇతర దేశాల యువత సోషలిజం గురించి పునరాలోచనలో పడదా ? గత నాలుగు దశాబ్దాలుగా సోషలిస్టు చైనా అప్రతిహత విజయాలు సాధిస్తున్నది. అక్కడ పేదరికాన్ని చాలా వరకు నిర్మూలించినట్లు పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే ప్రపంచ బ్యాంకు,ఐఎంఎఫ్‌ స్వయంగా అనేక సార్లు స్పష్టం చేశాయి. మరోవైపు ధనిక దేశాలలో పేదరికం, నిరుద్యోగం,అసమానతలు పెరుగుతున్నాయని అవే సంస్ధలు ఇష్టం లేకపోయినా చెప్పక తప్పటం లేదు.

Image result for bernie sanders i am socialist

అటువంటపుడు అమెరికాలోగాని మరొక ధనిక దేశంలో గాని పేదలు,యువత తమకూ సోషలిస్టు వ్యవస్తే మంచిదేమో అన్న ఆలోచన వైపు మళ్లకుండా ఎలా వుంటారు. పెట్టుబడిదారీ విధాన అమానుష స్వభావం కారణంగా దానికి వ్యతిరేకత పెరుగుతుండటంతో కొంత మంది బయలు దేరి తోడేలుకు ఆవు వేషం వేసినట్లుగా దానిని మానవతా ముఖంతో వుండే విధంగా మార్చుతామని చెప్పిన వారు ఎక్కడ వున్నారు. మరింత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. సంస్కరణల పేరుతో సామాన్య జనం అనుభవిస్తున్న వాటికి కోతపెడుతున్నారు తప్ప పెట్టుబడిదారులకు ఇచ్చే రాయితీలు ఏమాత్రం తగ్గకపోగా పోటీని ఎదుర్కొనే పేరుతో మరింతగా పెంచుతున్నారు. దానికి దేశ భక్తి, జాతీయవాదం అని ముద్దు పేర్లు పెడుతున్నారు, పెంచుతున్నారు.http://www.theepochtimes.com/n3/2237411-why-a-gospel-of-envy-is-gaining-traction-in-america/  అమెరికాలో సోషలిజం ఎందుకు వ్యాపిస్తున్నది అన్నదే ఈ వ్యాసకర్త ప్రశ్న.

Image result for bernie sanders i am socialist

అమెరికాలోని పెద్ద వారిలో 37శాతం మంది పెట్టుబడిదారీ విధానానికి బదులు సోషలిజానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అమెరికన్‌ ఫెయిత్‌ అండ్‌ కల్చర్‌ అనే సంస్ధ ఫిబ్రవరిలో జరిపిన ఒక సర్వేలో వెలుగు చూడటమే సదరు వ్యాసకర్తను పురికొల్పింది. ఇది మేలుకొలుపు పిలుపు అని వ్యాఖ్యానించాడు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బెర్నీ శాండర్స్‌ చేసి ప్రచారం ద్వారా సోషలిజం ప్రజాదరణ పొందటం ఆశ్చర్యార్ధకమైంది…..అమెరికాలో ఎందుకు అనేక మంది సోషలిజం పట్ల సానుకూల వైఖరిని కలిగి వున్నారు.’ అని ప్రశ్నించుకొని వ్యాసకర్త తన అభిప్రాయాలను వెల్లడించాడనుకోండి. వాటితో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడదాం. అవే ఎత్తుగడలు లేదా కారణాలతో గతంలో అమెరికన్లు సోషలిజం గురించి దురభిప్రాయం ఏర్పరుచుకున్నారని కూడా భాష్యం చెప్పవచ్చు. దీనిని అంగీకరిస్తే రచయిత అభిప్రాయపడినట్లు అవే కారణాలతో అమెరికన్‌ యువత సోషలిజం గురించి ఆసక్తి , పెట్టుబడిదారీ విధానంపై వ్యతిరేకత పెంచుకుంటున్నారు అన్న తర్కాన్ని కూడా అంగీకరించవచ్చు. ‘కాలేజీలు, విశ్వవిద్యాలయాలు సైద్ధాంతిక యుద్ధ భూములుగా మారటం విచారకరమని’ అంటూ ‘లెనిన్‌ ఏం చెప్పారో విందాం ‘పిల్లలకు బోధించటానికి నాకు నాలుగు సంవత్సరాల వ్యవధి ఇవ్వండి, ఎన్నటికీ పెకలించలేని విధంగా విత్తనాలు నాటతాను ‘ అని చెప్పారని సదరు వ్యాసకర్త వుక్రోషం వెలిబుచ్చటాన్ని చూస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివారం ఎందుకు చిన్న పిల్లల విద్యాలయాలను ఏర్పాటు చేస్తోందో అక్కడేమి బోధిస్తున్నారో, జెఎన్‌యు వంటి విశ్వవిద్యాలయాల గురించి ఎందుకు నానా యాగీ, దాడులు చేస్తున్నారో అర్ధం చేసుకోవటం కష్టం కాదు. ఇది భావజాల పోరు. ఒకరు విషబీజాలు నాటితో మరొకరు ప్రయోజనకరమైన వాటిని విత్తేందుకు ప్రయత్నం. ఎవరిది పై చేయి అయితే అవే ఫలితాలు వస్తాయి.విద్యా సంస్ధలలో ఒక పద్దతి ప్రకారం సోషలిస్టు భావజాలాన్ని ఎలా అభ్యాసం చేయిస్తున్నారో ‘ నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్కాలర్స్‌(ఎన్‌ఏఎస్‌) జనవరి నివేదిక వెల్లడించిందని, వున్నత విద్యా సంస్ధలలో ఒక వుద్యమంగా 1960 దశకపు విప్లవాత్మక కార్యక్రమంతతో ఒక పురోగామి రాజకీయ చురుకుదనంతో ‘నూతన పౌర శాస్త్రాన్ని ‘ బోధిస్తున్నారని’ కూడా సదరు రచయిత ఆరోపించారు. మన పిల్లలు ఏమై పోతున్నారో చూడండి అంటూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. అంటే రెండు రెళ్లు నాలుగు, భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, అసమాన సమాజాలు ఎలా ఏర్పడ్డాయి అని చెప్పటం కూడా సోషలిస్టు భావజాల ప్రచారంగానే కమ్యూనిస్టు వ్యతిరేకులు చూస్తున్నారు. ఈ ఆరోపణ చేసేవారిని ఒక ప్రశ్న అడగాలి. పడకగదుల్లో సైతం ఎప్పుడేం జరుగుతోందో ప్రత్యక్ష ప్రసారం చేయగల నిఘా వ్యవస్ధ వున్న అమెరికా భద్రతా సంస్ధలు ఒక వుద్యమంగా అమెరికా విద్యా సంస్ధలలో జరుగుతున్న ఈ బోధనను చూడకుండా ఎలా వున్నాయి ? ఒక వేళ అదే నిజమైతే అమెరికాకే కాదు ప్రపంచానికే మంచి రోజులు వస్తాయి. యుద్దోన్మాదులు, తాలిబాన్లను సృష్టించే నేతలకు బదులు వాటికి దూరంగా వుండే సమాజాన్ని నెలకొల్పే నేతలు అమెరికాలో అధికారానికి వస్తారు. ఇవన్నీ చూస్తుంటే కమ్యూనిస్టు వ్యతిరేకుల విశ్వాసం సడలుతున్నట్లు, వారు కోరుకున్న విధంగా సమాజం నడవటం లేదని అర్ధం కావటం లేదూ ! ఆలోచించండి !!

పశ్చిమ దేశాలలో అలా వుందేమో గానీ భారత్‌లో తిరిగి కమ్యూనిస్టులు కోలుకోలేరు అని ఎవరైనా అన వచ్చు. ఎవరి నమ్మకం వారిది. ప్రకృతి ధర్మం ప్రకారం ప్రపంచ వ్యాపితంగా అన్ని ప్రాంతాలలో ఒకేసారి వేసవి, వర్షాలు, ఆకురాల్చి మొగ్గతొడగటం జరగదు. చక్రభ్రమణంలో ఇప్పుడు కింద వున్న వారు కొద్ది సేపటి తరువాత పైకి వస్తారు. కమ్యూనిస్టులూ అంతే. ఒక దగ్గర ప్రారంభమై అన్ని ప్రాంతాలకూ విస్తరించినట్లే తిరిగి కోలుకోవటం కూడా అదే మాదిరి జరుగుతుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఫ్రెంచి తొలి విడత ఎన్నికలు-సంప్రదాయ పార్టీలకు చెంప దెబ్బ

25 Tuesday Apr 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

emmanuel macron, french communist party, french left party, french national front, French presidential election, French presidential election results round 1, jean luc melenchon, marine le pen, pcf, traditional parties

Image result for emmanuel macron epouse

తనకంటే 25 ఏండ్ల పెద్ద అయిన  భార్య బ్రిగిట్టితో 39 ఏండ్ల ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌

ఎం కోటేశ్వరరావు

ఆదివారం నాడు ఫ్రాన్స్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఓటర్లు ఆ పదవికి ఎవరినీ ఎన్నుకోలేదు గానీ గత యాభై సంవత్సరాలుగా అధికారంలో వుంటున్న రెండు పార్టీలను తుది విడత పోటీకి కూడా అనర్హులను గావించి తొలిసారిగా కొత్త వారిని ఎన్నుకొనేందుకు రంగం సిద్ధం చేశారు. పోటీ చేసిన పది మంది అభ్యర్దులలో ఏ ఒక్కరికీ మెజారిటీ ఓట్లు రాకపోవటంతో తొలిరెండు స్ధానాలలో వున్న ఇద్దరు అభ్యర్ధుల మధ్య మే నెల ఏడవ తేదీన మరోసారి ఓటింగ్‌ జరగనుంది. ఈ ఫలితాలు వెలువడిన తరువాత ఫ్రెంచి, ఐరోపా స్టాక్‌ మార్కెట్ల సూచీలు పెరగటం, అనేక మంది విశ్లేషకులు హర్షం వెలిబుచ్చటాన్ని బట్టి , ప్రత్యర్ధిగా పచ్చి మితవాది వున్న కారణంగా మొదటి స్ధానంలో వుండి, మధ్యేవాదిగా వర్ణితమైన ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ తుది విడత ఓటింగ్‌లో విజేతగా నిలవటం ఖాయంగా కనిపిస్తోంది. ఐరోపా కమిషన్‌ పదవులలో వున్న వారు ఎన్నికల సమయంలో ఒక అభ్యర్ధికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా బహిరంగ ప్రచారం చేయటం, వ్యాఖ్యానించటం వుండదు. ఈ సారి దీనికి విరుద్ధంగా ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ ప్రధమ స్ధానంలో వున్నందుకు అభినందించటమే గాక తుది విడత కూడా విజయం సాధించాలని, మారీ లీపెన్‌ గెలిస్తే ఐరోపా యూనియన్‌ను నాశనం చేస్తారని ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జంకర్‌ ప్రకటించారు. పోటీకి అర్హత సాధించటంలో విఫలమైన మితవాద రిపబ్లికన్‌, సోషలిస్టు పార్టీ కూడా మే ఏడవ తేదీ ఎన్నికలలో బలపరుస్తామని ప్రకటించాయి. అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప మితవాది లీపెన్‌ గెలిచే అవకాశాలు లేవు.ఈ ఎన్నికలలో వామపక్ష సంఘటన అభ్యర్ధి జీన్‌లక్‌ మెలంచన్‌ తుది విడత అధ్యక్ష పదవి పోటీలో వుంటారని భావించిన వామపక్ష అభిమానులు ఆశించిన విధంగా ఓటింగ్‌ లేకపోవటంతో ఒకింత ఆశాభంగానికి గురికావటం సహజం. ఫలితాల సరళిపై కమ్యూనిస్టు పార్టీ నేత పిరే లారెంట్‌ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఓటింగ్‌ శాతాన్ని గణనీయంగా పెంచుకోవటం ఫ్రాన్స్‌లోనే కాదు, ప్రపంచ వ్యాపితంగా వామపక్ష అభిమానులలో ఆశలు పెంచే అంశం.రెండు, మూడు, నాలుగు స్ధానాలలో నిలిచిన అభ్యర్ధుల మధ్య వ్యత్యాసం రెండుశాతం కంటే తక్కువగా వుండటాన్ని బట్టి పోటీ ఎంత తీవ్రంగా జరిగిందో వూహించవచ్చు. వివిధ పార్టీల అభ్యర్ధులకు వచ్చిన ఓట్ల వివరాలు ఇలా వున్నాయి. ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌( ఇఎంఎ) 24.01, లీపెన్‌(ఎఫ్‌ఎన్‌) 21.3, ఫిలన్‌(ఎల్‌ఆర్‌) 20.01,మెలంచన్‌ (ఎల్‌ఎఫ్‌) 19.58, హమన్‌ ( పిఎస్‌) 6.36, డ్యూపాంట్‌ ఇగ్నన్‌(డిఎల్‌ఎఫ్‌) 4.7,లాసాలే (ఆర్‌) 1.21,పౌటు (ఎన్‌పిఏ) 1.09 మరో ముగ్గురికి 0.92,0.64,0.18 శాతం చొప్పున ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల ప్రాధాన్యత, విశేషాలను క్లుప్తంగా చూద్దాం.

Image result for marine le pen

మితవాద పార్టీ నేషనల్‌ ఫ్రంట్‌  మారినే లీపెన్‌

1965 నుంచి 2012 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికలలో సోషలిస్టు పార్టీ మూడు సార్లు, పలు పేర్లు మార్చుకున్న మితవాద పార్టీ ఆరుసార్లు అధికారానికి వచ్చింది. ఈ సారి ఆ రెండు పార్టీలకు చెందిన అభ్యర్ధులలో ఒక్కరు కూడా పోటీకి అర్హమైన సంఖ్యలో ఓట్లను సంపాదించుకోలేకపోయారు.అధికారానికి వచ్చి రెండవ సారి కూడా అధికారాన్ని కోరకుండా పోటీకి దూరంగా వున్న వ్యక్తిగా ప్రస్తుత అధ్యక్షుడు హోలాండే చరిత్రకెక్కారు. ఆయన బదులు పోటీ చేసిన సోషలిస్టు పార్టీ (పిఎస్‌) అభ్యర్ధి హమన్‌ ఐదవ స్ధానంలో నిలిచారు. గత ఎన్నికలలో ప్రస్తుతం అధ్యక్షుడిగా వున్న ఫ్రాంకోయిస్‌ హాలాండే తొలి విడత 28.63 శాతం ఓట్లతో ప్రధమ స్ధానంలో నిలిచారు. అంతకు ముందు ఎన్నికలలో 25.87శాతంతో రెండవ స్ధానంలో వున్నారు. ఐరోపాలో సోషలిస్టు పార్టీలుగా వున్న శక్తులు మితవాద శక్తులకు భిన్నంగా వ్యవహరించకపోవటం, నయా వుదారవాద విధానాలలో భాగంగా అంతకు ముందు అమలులో వున్న సంక్షేమ పధకాలకు కోతలు పెట్టటంలో మితవాద శక్తులకు భిన్నంగా సోషలిస్టులు వ్యవహరించకపోవటంతో కార్మికవర్గం ఆ పార్టీలకు క్రమంగా దూరం అవుతోంది.ఇదే సమయంలో ప్రత్యామ్నాయశక్తులు రూపొందలేదు.

ఇక సాంప్రదాయక మితవాద శక్తులకు ప్రాతినిధ్యం వహించే యుఎంపి ఈ ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ(ఎల్‌ఆర్‌)గా పేరు మార్చుకొని పోటీ చేసి 19.9శాతం ఓట్లతో మూడవ స్ధానంలో నిలిచింది. గత ఎన్నికలలో 27.18శాతం ఓట్లతో రెండవ స్ధానం, 2007లో 31.18శాతంతో ప్రధమ స్ధానంలో నిలిచింది.

ఫ్రెంచి రాజకీయ రంగంలో మితవాదులు, అతివాదులిద్దరినీ ఏకం చేస్తాను నేను ఏ భావజాలానికి చెందిన వాడిని కాదు, తనది మూడవ మార్గం అంటూ ఏడాది క్రితం ‘ముందుకు పోదాం’ పేరుతో ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేసిన మాజీ ప్రభుత్వ వుద్యోగి, మాజీ విత్త మంత్రి, ఐరోపా యూనియను కొనసాగాలని కోరుకొనే బ్యాంకరు అయిన ఇమ్మాన్యుయెల్‌ మక్రానన ప్రజారంజక నినాదాలతో, ప్రభుత్వ వ్యతిరేక వుపన్యాసాలతో ఓటర్ల ముందుకు వచ్చాడు. సోషలిస్టు పార్టీ సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభిన ఇతగాడు హోలాండు ప్రభుత్వంలో విత్త మంత్రిగా కూడా పని చేశాడు. హోలాండే ప్రభుత్వం ప్రజల నుంచి దూరం కావటాన్ని గమనించి గతేడాది ఆగస్టులో రాజీనామా చేసి అంతకు ముందే తాను ఏర్పాటు చేసిన ‘ముందుకు పోదాం’ పేరుతో రంగంలోకి దిగాడు. ఏడాది కూడా గడవక ముందే అధికార పీఠాన్ని అధిష్టించేందుకు సిద్దమయ్యాడు. కొంత మంది విశ్లేషకులు ఇతడిని వుదారవాది అని పిలిస్తే మరి కొందరు సోషల్‌ డెమాక్రాట్‌ అన్నారు. సోషలిస్టు పార్టీలో వున్న సమయంలో దాని లోని మితవాదులను బలపరిచాడు.

గతేడాది సోషలిస్టు పార్టీ నుంచి రాజీనామా చేసిన సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ నేను సోషలిస్టును కాదు అని చెప్పాల్సిందిగా నా నిజాయితీ నన్ను వత్తిడి చేసింది, వామపక్ష(సోషలిస్టు పార్టీని కూడా వామపక్షం అని పిలుస్తారు) ప్రభుత్వంలో మంత్రిగా ఎందుకున్నానంటే ఇతరుల మాదిరి ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలనుకున్నాను ‘ అన్నాడు. ఫ్రాన్స్‌లో యూరో అనుకూల ఏకైక రాజకీయ పార్టీ తమదే అని స్పష్టీకరించాడు. ఆర్ధికంగా నయా వుదారవాద విధానాలను కొనసాగించాలని కోరే ఇతగాడు రాజకీయంగా అమెరికా అనుకూల వైఖరిని వివిధ సందర్భాలలో వెల్లడించాడు. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించేందుకు వ్యతిరేకి. సిరియా విషయంలో అమెరికాను అనుసరిస్తాడు. ఈ కారణంగానే అతను ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్ధిగా ముందు వరుసలో వుండటంతో ఫ్రెంచి, ఐరోపా, ప్రపంచ పెట్టుబడిదారులందరూ హర్షం వెలిబుచ్చారు. స్టాక్‌ మార్కెట్లు పరుగులు తీశాయి. రెండవ విడత ఎన్నికలలో తమ ఓట్లు మాక్రాన్‌కే వేస్తామని వెంటనే రిపబ్లికన్‌ పార్టీ, సోషలిస్టు పార్టీల అభ్యర్ధులిద్దరూ ప్రకటించారు. వామపక్ష సంఘటన ఇంకా ప్రకటించలేదు. వామపక్ష, కమ్యూనిస్టు మద్దతుదారులు పచ్చి మితవాది మారినే లీపెన్‌కు ఓటు వేసే అవకాశం లేదు కనుక ప్రపంచ మీడియా మొత్తం ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ కాబోయే ఫ్రెంచి అధ్యక్షుడు అన్న రీతిలో వార్తలు ఇచ్చాయి. కొందరు విశ్లేషకులు లీ పెన్‌ గెలుపు అవకాశాల గురించి కూడా చర్చించారు.

ఫ్రెంచి రాజకీయాలలో పచ్చి మితవాద పార్టీ నేషనల్‌ ఫ్రంట్‌ ఎదుగుదల ఒక ముఖ్యాంశం.అల్జీరియాకు స్వాతంత్య్రం ఇవ్వటం, దానిపై ఆధిపత్యాన్ని వదులుకోవటం ఇష్టం లేని పచ్చి మితవాదుల బృందానికి చెందిన వ్యక్తి మారీ లీపెన్‌. అల్జీరియా ఫ్రాన్స్‌లో భాగమే అనే అవగాహనను వదులుకుంటున్నట్లు ఫ్రెంచి మితవాద పార్టీ అధ్యక్షుడు డీగాల్‌ ప్రకటించిన పూర్వరంగలో లీపెన్‌ తదితరులు 1972లో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. దానికి లీ పెన్‌ నాయకుడయ్యాడు. 1973 పార్లమెంట్‌ ఎన్నికలలో పోటీ చేసిన ఈ పార్టీకి దేశం మొత్తం మీద కేవలం 0.5శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. పారిస్‌లోని లీపెన్‌ నియోజకవర్గంలో ఐదుశాతం వచ్చాయి. ఇటువంటి పార్టీ 1981 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయటానికి తగిన అర్హతను కూడా సంపాదించలేకపోయింది. 1984 ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికలలో 11శాతం ఓట్లు పది సీట్లు సంపాదించి ఫ్రెంచి రాజకీయాలలో సంచలనం సృష్టించింది.1988 అధ్యక్ష ఎన్నికలలో లీ పెన్‌ ఫ్రెంచి ప్రయోజనాలు ముందు అనే ప్రచారంతో పోటీ చేసి 14.4 శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. మూడవ ప్రధాన పార్టీగా అవతరించింది. 2002 అధ్యక్ష ఎన్నికలలో అనూహ్యంగా 16.86 శాతం ఓట్లు తెచ్చుకొని రెండవ స్ధానంతో తొలిసారిగా లీపెన్‌ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.2007 ఎన్నికలలో 10.44 శాతం ఓట్లతో నాలుగవ స్ధానంలో, 2012లో 17.9 శాతంతో మూడవ స్ధానంలో తాజా ఎన్నికలలో 21.3 శాతంతో రెండవ స్ధానంలోకి నేషనల్‌ ఫ్రంట్‌ అవతరించింది. మారి లీపెన్‌ కుమార్తె మారినే లీపెన్‌ 2012 ఎన్నికలలో తొలిసారిగా పోటీ చేశారు. మారీ లీపెన్‌ వివాదాస్పద, నేర చరిత్ర, వదరుబోతు తనం కారణంగా నేషనల్‌ ఫ్రంట్‌ను అభిమానించేవారికంటే వ్యతిరేకించే వారు ఎక్కువయ్యారు. ఈ పూర్వరంగంలో 2015లో ఒక ప్రత్యేక సమావేశంలో లీ పెన్‌ను ఆయన కుమార్తె స్వయంగా పార్టీ నుంచి బహిష్కరించింది. ఐరోపా యూనియన్‌ నుంచి ఫ్రాన్స్‌కు విముక్తి కలిగించటమే తన లక్ష్యమని ఆమె తన ప్రచార అస్త్రంగా చేసుకుంది.

Image result for jean luc melenchon

వామపక్షపార్టీలు, కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన  మెలెంచన్‌

ఈ ఎన్నికలలో మూడవ స్ధానంలో రిపబ్లికన్‌ పార్టీ వుండగా స్వల్ప తేడాతో నాలుగవ స్ధానంలో వామపక్షపార్టీలు, కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన జీన్‌ లూ మెలెంచన్‌ వున్నారు. ఆయన 19.58శాతం ఓట్లు సాధించటం ఈ ఎన్నికల ప్రత్యేకతలలో ఒకటి. ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ విషయానికి వస్తే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు పార్లమెంట్‌ ఎన్నికలలో గరిష్టంగా 28శాతం సంపాదించగా అధ్యక్ష ఎన్నికలలో 1969 ఎన్నికలలో ఆ పార్టీ గరిష్టంగా 21.7శాతం ఓట్లు సాధించింది. ఆ దశకంలో అక్కడ జరిగిన యువజన-విద్యార్ధి వుద్యమాల పూర్వరంగంలో ఈ ఫలితం వచ్చింది. తరువాత 1981ఎన్నికలలో 15.35 శాతం వచ్చాయి తరువాత క్రమంగా తగ్గుతూ 2007 ఎన్నికలలో 1.93శాతానికి పడిపోయాయి. ఐరోపా యూనియన్‌ ఎన్నికలలో 1989-2014 మధ్య 7.7-5.9 శాతం మధ్య ఓట్లు వచ్చాయి. ఫ్రెంచి పార్లమెంట్‌ ఎన్నికలలో కూడా దాదాపు అదే ప్రతిబింబించింది. 2012 ఎన్నికలలో మెలెంచన్‌ వామపక్ష ఫ్రంట్‌ అభ్యర్ధిగా పోటీ చేసి 11 శాతం తెచ్చుకున్నారు. తాజా ఎన్నికలలో ఒక దశలో మొదటి రెండు స్ధానాలలో వుంటారా అన్నట్లుగా ప్రచారం జరిగింది. అభిప్రాయ సేకరణలో తొలి నలుగురు అభ్యర్ధుల మధ్య ఓట్ల తేడా పెద్దగా లేకపోవటంతో తొలిసారిగా ప్రాన్స్‌లో తీవ్ర మితవాద, సమరశీల వామపక్ష అభ్యర్ధి మధ్య పోటీ వుంటుందా అన్న వాతావరణం వచ్చింది. ఆ కారణంగానే మెలెంచన్‌ గనుక అధ్యక్షుడిగా ఎన్నికైతే తాము ఫ్రాన్స్‌ నుంచి పెట్టుబడులతో సహా వెళ్లిపోతామని కొందరు పెట్టుబడిదారులు ఎన్నికల ముందు బెదిరింపులకు దిగారు. సోషలిస్టు పార్టీలో తీవ్ర వామపక్ష వాదిగా వున్న మెలెంచన్‌ ఆ పార్టీ విధానాలతో విబేధించి 2008లో దాన్నుంచి విడివడి వామపక్ష పార్టీని ఏర్పాటు చేశారు. తరువాత ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ కూడా భాగస్వామిగా వున్న వామపక్ష సంఘటన అభ్యర్ధిగా గత రెండు ఎన్నికలలో పోటీ చేశారు. అయితే మీడియా ఆయనను కమ్యూనిస్టుగా వర్ణించింది తప్ప ఆయనేనాడూ కమ్యూనిస్టుపార్టీలో పని చేయలేదు. కార్మికుల పని గంటలను వారానికి 35 నుంచి 32కు తగ్గించాలని,నెలకు 33వేల యూరోలు దాటిన వారి ఆదాయాన్ని బట్టి పన్ను రేటును 100శాతానికి పెంచాలని, వుద్యోగ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు తగ్గించాలని, ప్రభుత్వ ఖర్చును పెంచాలని, మెలెంచన్‌ తన ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నాటో నుంచి ఫ్రాన్స్‌ వైదొలగాలని, రష్యాతో సఖ్యతగా వుండాలని,మితవాదులు, పెట్టుబడిదారులకు అనుకూలంగా వున్న విధానాలను ఐరోపా యూనియన్‌ సంస్కరించని పక్షంలో యూనియన్‌ నుంచి వైదొలగాలని అన్నారు. ఆయన ప్రచార తీరును చూసి మితవాద పత్రిక లీ ఫిగారో ‘ఫ్రెంచి ఛావెజ్‌ ‘ అంటూ ఓటర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. ఫ్రాన్స్‌లోని అతిపెద్ద పారిశ్రామిక సంస్ధ మెడెఫ్‌ ప్రతినిధి పిరే గాటెజ్‌ మాట్లాడుతూ ఆర్ధిక విధ్వంసం-ఆర్ధిక గందరగోళం మధ్య ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి వుంటుందని, లీపెన్‌-మెలెంచన్‌ మధ్య పోటీ పరిస్ధితి గురించి వ్యాఖ్యానించారు.

ఎన్నికల ఫలితాల గురించి కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రకటనలో చేసిన వ్యాఖ్యలలోని కొన్ని అంశాలు ఇలా వున్నాయి.’ తొలి విడద ఎన్నికల ఫలితాలు దేశంలోని తీవ్ర పరిస్ధితికి నిదర్శనం. జీన్‌ లక్‌ మెలాంచన్‌ దాదాపు 20శాతం ఓట్లు తెచ్చుకోవటం భవిష్యత్‌పై నూతన ఆశలను రేకెత్తిస్తోంది. నూతన సమాజం కోసం గొంతెత్తిన లక్షల మంది పోరాటం కొనసాగుతుంది. వారి ఆకాంక్ష ఇంకా పెరగనుంది.పట్టణాలలో మంచి ఫలితాలు వచ్చాయి. ఫ్రెంచి రాజకీయాలలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.మానవాళి విముక్తి అనే లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ పని చేస్తున్నది.తక్షణ కర్తవ్యంగా మే ఏడున జరగనున్న ఎన్నికలలో అధ్యక్ష పదవికి మారినె లీపెన్‌ ఎన్నిక కాకుండా అడ్డుకోవటం. అంటే దీని అర్ధం ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ మంత్రిగా వున్నపుడు ఆయన అమలు జరిపిన వుదారవాద, సామాజిక వ్యతిరేక కార్యక్రమానికి మద్దతు పలికినట్లు కాదు, వాటికి వ్యతిరేకంగా రేపు కూడా పోరాడుతాము.అధ్యక్ష ఎన్నికలలో రెండవ దఫా ఎన్నికలతో ఎదురైన పరిస్ధితులలో జూన్‌ 11,18 తేదీలలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. తొలి విడత ఎన్నికలలో సాధించిన ఓట్లను బట్టి ప్రజా ప్రయోజనాలకు బద్దులై వుండే కమ్యూనిస్టుపార్టీ, వామపక్ష సంఘటనలోని ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఎంపీలను గెలిపించుకోవాల్సి వుంది.’ అని పేర్కొన్నది.

ఫ్రెంచి రాజకీయాలలో మఖలో పుట్టి పుబ్బలో అంతరించింది అన్నట్లుగా అనేక పార్టీలు పుట్టి ఒకటి రెండు ఎన్నికలలో పోటీ చేసి తరువాత కనుమరుగు కావటం ఒక ధోరణిగా వుంది. అలాంటి కోవకే చెందిన ముందుకు పోదాం (ఎన్‌ మార్చ్‌) అనే పార్టీ సాంప్రదాయ పార్టీలను తోసి రాజని తొలిసారిగా ఏకంగా అధికారానికి వచ్చే బలాన్ని సంపాదించుకోవటం ఒక నూతన పరిణామం. ఐరోపాలోని అనేక దేశాలలో నెలకొన్న రెండు పార్టీల వ్యవస్ధలకు కాలం చెల్లనుందా అనేందుకు ఇది సూచన. అదే జరిగితే సైద్ధాంతిక ప్రాతిపదికన రాజకీయ సమీకరణలు వేగవంతమౌతాయి. ఫ్రాన్స్‌లో మితవాద నినాదాలు, రాజకీయాలతో నేషనల్‌ ఫ్రంట్‌ బలం పుంజుకోవటంతో పాటు వామపక్ష పార్టీ క్రమంగా బలం పెంచుకోవటం కూడా ఒక ముఖ్య పరిణామమే.

2008 నుంచి ధనిక దేశాలలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభ పూర్వరంగంలో మితవాద శక్తులు జాతీయవాదం ముసుగులో ప్రపంచీకరణను వ్యతిరేకించటం, దేశీయ పెట్టుబడిదారులు, వ్యాపారులకు రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని కోరటం, ప్రజలపై భారాలు మోపే విధానాలకు మద్దతు పలకటం అనేక దేశాలలో వెల్లడౌతున్న కొత్త పరిణామం. ఐరోపా యూనియన్‌ నుంచి విడివడి తన పలుకుబడి, పూర్వపు సంబంధాలతో తమ దేశ పెట్టుబడిదారులకు మేలు చేయగలమనే ధీమాతో బ్రిటన్‌ పాలకవర్గం ఐరోపా యూనియన్‌ నుంచి వైదొలగేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐరోపా యూనియన్‌లో ప్రస్తుతం జర్మనీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. తన ఆర్ధిక బలంతో మిగతాసభ్య దేశాలతో వాణిజ్య మిగులు సాధించిన జర్మన్లపై మిగతా దేశాలలో వ్యతిరేకత పెరుగుతోంది. మే ఏడున జరిగే ఎన్నికలలో అందరూ వూహిస్తున్నట్లు కొత్త పార్టీ నేత ఇమ్మాన్యుయేల్‌ మక్రాన్‌ ఎన్నికై తన విధానాలను ప్రకటించిన తరువాత మరింత స్పష్టత వస్తుంది. అయితే స్టాక్‌ మార్కెట్‌ సంబరాలను బట్టి కార్పొరేట్‌ శక్తులకు అనుకూల వైఖరి తీసుకుంటారని, పెను మార్పులేమీ వుండవని కొందరు విశ్లేషకుల అంచనాలు వాస్తవానికి దగ్గరగా వున్నాయి. అదే జరిగితే ఆగ్రహం, నిరాశా నిస్పృలతో వున్న ఫ్రెంచి యువత ఎలా స్పందిస్తుందో చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వివాదాస్పద కార్టూన్‌పై తెలుగుదేశం వివేచనతో వ్యవహరిస్తుందా ?

22 Saturday Apr 2017

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

cartoonist, cartoons, CHANDRABABU, derogatory jokes, Nara lokesh, social media, tdp

Image result for controversial cartoon, inturi ravikiran

ఎం కోటేశ్వరరావు

పెద్దలకు మాత్రమే అనే కాప్షన్‌తో ఒక ‘ముదురు’ సినిమా పోస్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి భవనపు ముందుభాగం ఫొటో, నాన్నారూ నేను పెద్దల సభకే వెళతా అనే కాష్షన్‌తో నారా లోకేష్‌, ఆయన తండ్రి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడి ఫొటోలతో కూడిన ఒక చిత్రం సామాజిక మాధ్యమంలో పెద్ద ప్రాచుర్యం పొందింది. ఇదెలాంటి ప్రభావం చూపిందంటే వంద మంది వంది మాగధుల కొలువు మధ్య ఒక్క విమర్శకుడు నోరు విప్పితే రాజో, యువరాజో, యువరాణికో ఎలా వుంటుంది ? నూరు కాకుల కావ్‌ కావ్‌లే మధురగీతాలుగా తన్మయత్వంతో అప్పటికే వూగిపోతున్న వారి మధ్యలో ఒక్క కోయిల చేరి పాడితే ఎలా కర్ణకఠోరంగా వుంటుందో అలా !

కొన్ని మినహా అన్ని అగ్రశ్రేణి సాంప్రదాయక మాధ్యమాలన్నీ ఆహా ఓహో అంటూ పొగుడుతుంటే సామాజిక మాధ్యమంలో వచ్చిన పై చిత్రం కొంతమందికి అభ్యంతరగా కనిపించటంతో వివాదాస్పదమై, చట్టపరమైన చర్యలకు దారి తీసింది. ఇంటూరి రవికిరణ్‌ వేసిన కార్టూన్‌ ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి భవనాన్ని కించపరిచేదిగా వుందంటూ వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి, బెయిలుపై విడుదల చేయటం రెండు తెలుగు రాష్ట్రాలు, జాతీయ మీడియాలో కూడా ఒక సంచలన వార్తగా మారింది. మీడియాలో వచ్చిన ఏదైనా అంశంపై ఎవరికైనా అభ్యంతరం అనిపించినపుడు ఇప్పుడేం జరుగుతోంది. సంబంధిత చట్టపరమైన సంస్ధలకు ఫిర్యాదు చేయటం అవి తీసుకొనే చర్యల కోసం కాలయాపన చేయటం కంటే అసలు చట్టాన్నే తమ చేతుల్లోకి తీసుకుంటే పోలా అన్నట్లు అనేక సందర్భాలలో ప్రత్యక్షంగా తేల్చుకొనేందుకు సిద్ధపడుతున్నారు.

రవికిరణ్‌ తయారు చేసిన చిత్రం విషయంలో ముందుగా చేయాల్సింది. ఏ సామాజిక మాధ్యమంలో అయితే అది తిరుగాడుతోందో దాని యజమానులకు ఫిర్యాదు చేసి దానిని ముందుగా వుపసంహరింప చేయించాలి. అదేమీ జరిగినట్లు లేదు. ఎందుకంటే రవికిరణ్‌ అరెస్టు, విడుదల తరువాత కూడా ఆ చిత్రాన్ని చూపమ్మా అని గూగులమ్మ తల్లిని ప్రార్ధిస్తే అంతకంటేనా నీ కోరిక తీరుతుంది భక్తా అన్నట్లు శనివారం సాయంత్రం మూడు గంటల సమయంలో చూపింది. దానిని పాఠకుల సౌకర్యార్ధం  ఇస్తున్నాం.

మీడియాలో సంచలనాన్ని చూసిన తరువాత ఈ చిత్రం ఇంకా అనేక మందిలో ఆసక్తిని రేకెత్తించి సామాజిక మాధ్యమానికి దూరంగా వున్న వారిలో కూడా ఆసక్తిని రేపి మరింత ప్రాచుర్యం పొందింది. ఆ విధంగా నారా లోకేష్‌, నారా చంద్రబాబు నాయుడి ప్రచార గ్రాఫ్‌లు పెరిగాయంటే అతిశయోక్తి కాదు. పైసా ఖర్చు లేకుండా వచ్చిన ఈ ప్రచారానికి ముందుగా ఆ చిత్రం అభ్యంతరంగా వుందని అనిపించిన పెద్దలకు, , రవి కిరణ్‌ను హైదరాబాదులో అరెస్టు చేసి తుళ్లూరుకు తీసుకురావటంలో ఆలశ్యం చేసి ఆసక్తి పెంచిన పోలీసులకు, దీన్నొక సమస్యగా చేసి సామాజిక మాధ్యమంలో చినబాబు, పెదబాబులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారికి ఒక గుణపాఠం చెప్పాలన్న ఆలోచన ముందుగా వచ్చిన వారికి, మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసి కిసుక్కున నవ్వినందుకు అన్నట్లుగా మా బాబులపై వ్యంగ్యాస్త్రం వేసినందుకు కాదు, శాసనమండలిని కించపరిచినందుకు అన్న ఒక తెలివైన పాయింటును ముందుకు తెచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయించిన, చేసిన వారికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వుదంతంతో ప్రమేయం వున్నవారందరికీ ఎవరెన్ని అభ్యంతరాలు పెట్టినా అభినందనలు చెప్పక తప్పదు.

ఇదే జరిగి వుండకపోతే ప్రపంచానికి అనేక విషయాలు మరుగునపడి తెలియకుండా వుండేవి.భావ ప్రకటనా స్వేచ్చ గురించి అన్ని రకాల మీడియాల్లో నలుగురి నోళ్లలో నాని వుండేది కాదు. కొంత మంది గురించి కొందరు చేసిన పప్పు, సుద్ద పప్పు అన్న వ్యాఖ్యలు వారికి తగవు, పప్పులాగా వున్నా వుప్పు, నిప్పుగా నిరూపించుకొనే సందర్భాలు వస్తాయి అని రుజువైంది. ఏ మీడియా అయినా తమ రేటింగ్‌ను పెంచాలి తప్ప మరొక విధంగా చేయకూడదని రాజకీయ నేతలు కోరుకుంటారు తప్ప విమర్శిస్తే వూరుకోరని గతంలోనే మమతా బెనర్జీతో అనేక మంది నిరూపించారు. తెలుగు దేశం పార్టీ కూడా అందుకు మినహాయింపు కాదని రుజువైంది. సరే ఒక పార్టీకి చెందిన మరుగుజ్జు సేన(ట్రోల్స్‌) తమ నేతలపై విమర్శలు చేసిన వారి పట్ల ఎంత ఘోరంగా ప్రవర్తిస్తుందో సామాజిక మీడియాలో విమర్శనాత్మకంగా పరిశీలించే వారందరికీ తెలిసిందే.

చట్టపరంగా రవి కిరణ్‌ రూపొందించిన చిత్రం శిక్షార్హమైనదా, కాదా, ఆ చిత్రాన్ని ఎవరు ఎవరికోసం వేయించారు, ఎందుకు వేశారు, జరిగిన నష్టం ఏమిటి, అందుకు శిక్ష వుంటుందా, తప్పేమీ లేదని కొట్టి వేస్తారా అన్న అంశాలలో కొన్ని వూహా జనితమైనవి. కేసు దాఖలు చేశారు గనుక చట్టం తనపని తాను చేసుకుపోతుంది. ఆయేషా మీరా హత్య కేసులో పోలీసులు ప్రవేశపెట్టిన సత్యం బాబు నేరం చేయలేదని స్వయంగా ఆయేషా తల్లితండ్రులు కేసు విచారణ రోజు నుంచి ఎంత మొత్తుకున్నప్పటికీ పట్టించుకోకుండా చట్టం తనపని తాను చేసి నిర్దోషి అయిన సత్యంబాబును అన్యాయంగా జైలుపాలు చేసిందని తాజా కోర్టు తీర్పుతో వెల్లడైన విషయం తెలిసిందే. అందువలన కొన్ని సందర్భాలలో చట్టం తనపనే గాక అధికారంలో వున్నవారికి చుట్టంగా కూడా పని చేస్తుందని స్పష్టమైంది. సరే తాజా చిత్రం కేసులో ఏమౌతుందో తెలియదు.

ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో ప్రస్తావనకు వస్తున్న అంశాలేమిటంటే పేరుకు శాసన మండలిని కించపరిచారనేది సాంకేతికంగా కేసు బనాయించటానికి తప్ప వాస్తవానికి ఇద్దరు బాబుల ప్రస్తావన వున్నందుకు ఇది ప్రతీకారం అని ప్రజాభిప్రాయంగా వుంది. అనేక మంది రాజకీయ నాయకులు ఈ రోజుల్లో దేవతా వస్త్రాలు ధరించి రాజకీయాలు చేస్తున్నారు. పుణ్యం చేసుకున్న వారికే దేవతా వస్త్రాలు కనిపిస్తాయి అన్నట్లుగా వారి తీరు అందరికీ కనిపించదు. కొన్ని సందర్భాలలో ప్రజాభిప్రాయం కూడా తప్పు కావచ్చు. హిట్లర్‌ మంచివాడే, అతగాడిని బలపరచాలన్న అభిప్రాయం ప్రజలలో కలిగిన అంశం చరిత్రలో తెలిసిందే. అలాగే మన దేశంలో బాబరీ మసీదు కూల్చివేత కూడా ప్రజాభిప్రాయం, అభిష్టం మేరకే బహిరంగంగానే జరిగింది తప్ప దానిలో కుట్రేమీ లేదని చెబుతున్న విషయం తెలిసిందే. తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని ఎలా కావాలంటే అలా వినియోగపడతానని రామకృష్ణ కవిచేత చెప్పించారు. చట్టపరంగా ఓటింగ్‌ జరిపి తేలింది తప్ప మిగిలిన ప్రజాభిప్రాయాలన్నీ ఎలా కావాలంటే అలా వినియోగపడేవే.

ఒక చట్ట సభను కించపరచవచ్చా అంటే ఎవరూ సమర్ధించరు. కానీ చట్ట సభలలో జరుగుతున్న విషయాలను చూస్తే నేడు వాటి పట్ల ఎందరిలో సానుకూల వైఖరి వుంది. అనేక అవాంఛనీయ విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి, వుదంతాలు జరుగుతున్నాయి. సభాధ్యక్షుల నిర్ణయం మేరకు అనేక అంశాలు రికార్డుల నుంచి తొలగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతున్న కారణంగా అవన్నీ సమాజ రికార్డులలో నమోదు అవుతున్నాయి. వాటిని తొలగించే అవకాశం లేదు. అధికారాన్ని వుపయోగించలేరు. కర్ణాటక, గుజరాత్‌ అసెంబ్లీలలో ప్రజా ప్రతినిధులు, మంత్రులు సైతం తమ సెల్‌ఫోన్లలో బూతు చిత్రాలు చూస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వారిని అరెస్టు చేసి శిక్షించినట్లు వార్తలు లేవు. ఒక వీధిలో ఎ ఇద్దరు కొట్లాడుకున్నా చట్టపరంగా వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవచ్చు. మన దేశంతో సహా అనేక దేశాలలో చట్ట సభలలో కొట్టుకున్న ప్రజాప్రతినిధులపై ఎక్కడా కేసులు నమోదు చేసినట్లు మనకు తెలియదు. తాజాగా తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విషయాలు తెలిసిందే. అందుకనే ఒక గూండా బొమ్మ గీసి నా అడ్డా అసెంబ్లీలో వేయాలని వుంది అంటే అది అసెంబ్లీని కించపరిచినట్లు అవుతుందా ? అవదు, అయితే రవి కిరణ్‌ చిత్రంలో ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి అనే బోర్డుతో వున్న భవనపు బొమ్మ వుంది కనుకనే చట్టపరమైన సమస్యలు వచ్చాయి. ఐరోపాలోని ఐర్లండ్‌ పార్లమెంట్‌ భవనపు బొమ్మపై మార్ఫింగ్‌తో సర్కస్‌ టెంటు వేసి సర్కస్‌, ప్రవేశం అని రాశిన బొమ్మను ఎవరైనా చూడవచ్చు. పార్లమెంట్‌ను ఒక సర్కస్‌గా వర్ణించిన ఆ విమర్శకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ బొమ్మను దిగువ చూడండి.

Image result for derogatory jokes,cartoons on legislative buildings, ireland

ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్‌ నిర్మించిన ఒక సినిమాలో ఒక పాత్రను మరో పాత్ర దద్దోజనం అని హేళన చేస్తుంది. అలాగే మరో సినిమాలో పండూ అని పిలిస్తే హీరోయిన్‌ ఎంతలా రెచ్చి పోతుందో తెలిసిందే. ఇండ్లలో వున్నంత వరకు కుటుంబ సభ్యులు, బాగా సన్నిహితులైన ఇరుగుపొరుగు పిల్లలకు చిన్నతనంలో పెట్టిన కొన్ని ముద్దు పేర్లు పెద్దయిన తరువాత కూడా వారిని వదలి పెట్టవు. ఎండ పెరిగే కొద్దీ దున్నలు రెచ్చిపోయి పొలందున్నుతుంటాయి, అదే ఎద్దులు ఎండ పెరిగే కొద్దీ నీడలోకి జారుకొనేందుకు లాగుతాయి. రాజకీయాలలోకి అంటే బహిరంగ జీవనంలోకి వచ్చిన తరువాత ప్రత్యర్ధులు కొన్ని పేర్లు పెడుతూ వుంటారు. అలాంటపుడు ఎంత ప్రతికూల వాతావరణం వున్నా పోలిక కాస్త ఇబ్బంది పెట్టినా దున్నపోతుల మాదిరి వాటన్నింటినీ భరించే విధంగా తయారు కావాలి తప్ప ఎద్దుల్లా సున్నితంగా వ్యవహరించకూడదు. లేదంటే రాజకీయాలకు దూరంగా వుండాలి. అనేక దేశాలలో ప్రత్యర్ధుల మీద ఎన్నో జోకులు వేస్తుంటారు. సందర్భం వచ్చినపుడు ప్రత్యర్ధులు కూడా అదే ప్రయోగం చేస్తుంటారు. వాటిని తేలికగా తీసుకోవాలి తప్ప అంతకు మించి పోకూడదు. కెనడా పార్లమెంట్‌ బొమ్మ వేసి ఎంపీలు, స్పీకర్‌పై వేసిన జోకును చూడండి.

Image result for derogatory jokes,cartoons on legislative buildings

క్షమించాలి స్పీకర్‌ గారూ పరస్పరం గౌరవించుకొనే మన యత్నాలలో భాగంగా దానిని మరో రూపంలో నన్ను చెప్పనివ్వండి !

గౌరవ నీయులైన ప్రతిపక్ష సభ్యుడు దయచేసి సున్నితమైన నోటిలో వున్న వాటిని బయటకు రాకుండా మూస్తారా !

చట్ట సభలలో వుపయోగించే భాషపై వేసిన జోక్‌ ఇది. అంటే దాని అర్ధం మొత్తం సభ్యులందరూ అలా వున్నారంటూ మా మనోభావాలను కించపరిచారని ఎవరూ ఆ కార్టూనిస్టు మీద చర్య తీసుకోలేదు. తొలి ప్రధాని నెహ్రూ ప్రభుత్వం, మంత్రుల వ్యవహారశైలి గురించి ప్రముఖ కార్టూనిస్టు శంకర్‌ తన చిత్రాల ద్వారా ఏకి వదలి పెట్టేవారు. ఒక సందర్భంలో నెహ్రూ నన్ను కూడా వదలి పెట్టవద్దని శంకర్‌తో అన్నారని అందరం చదువుకున్నాం.పూటకో పార్టీ మారుతున్న, అలాంటి వారిని నిస్సంకోచంగా పార్టీలలో చేర్చుకుంటున్న నేటి రాజకీయ నాయకులు కూడా చదువుకోవటం అవసరం.

గీతలతో తమ భావాలను స్వేచ్చగా వెలిబుచ్చే వారికి చట్టపరమైన అవగాహన కూడా అవసరం అని గతంలో కూడా అనేక అనుభవాలు రుజువు చేశాయి. ఐరోపాలోనో మరొకచోటో అలాంటి కార్టూన్లు వేస్తే సహించారు కదా ఇక్కడెందుకు చేయరు అని వాదిస్తే లాభం లేదు. అక్కడా చట్టాలున్నాయి.మనం బూతు అనుకొనే పదాలతో మరింత పచ్చిగా విమర్శలు, వ్యాఖ్యలు చేయటాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకొనే దశను వారు దాటిపోయారు. పార్టీ మారిన వారు పూర్వపు పార్టీ పదవులకు రాజీనామా చేయాలన్నది ఒక నాటి నీతి. అలాంటిదేమీ లేదు ఏ పార్టీ గుర్తు మీద గెలిచినా చివరకు మంత్రి పదవులు కూడా పుచ్చుకోవచ్చన్నది నేటి ఆచరణ. అంటే సిగ్గుపడే దశను దాటి ముందుకు పోయాం. అలాంటి వారిపై గౌరవనీయ చట్ట సభలు, వాటి అధిపతులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. రక్షిస్తున్నారనే ఫిర్యాదులు, విమర్శలున్నాయి. రాజ్యాంగాన్ని అమలు జరిపే గవర్నర్లు సైతం అలాంటి వారి చేత ప్రమాణ స్వీకారాలు చేయిస్తున్నారు. మన రాజ్యాంగం, చట్టాలు, నిబంధనలలో వున్న లొసుగుల కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. గతంలో దిగంబర కవులుగా పేరు పెట్టుకున్న వారు పార్లమెంటు, అసెంబ్లీలను ఎలా తిట్టిపోశారో తెలిసిందే. ఇప్పుడు చట్ట సభలు, వాటిలో జరుగుతున్న వాటి గురించి నైతికంగా ఆలోచించే వారందరూ దిగంబరు కవులు కాకుండానే వాటిని ఏవగించుకుంటున్నారు. ఈ పూర్వరంగంలో సాంకేతికపరమైన, చట్టపర అంశాలకు అతీతంగా ఆలోచించి మందలింపుతోనో మరొక చర్యతోనో సరిపెట్టి కార్టూనిస్టు రవి కిరణ్‌పై క్రిమినల్‌ చర్యలను వుపసంహరిస్తే తెలుగు దేశం పార్టీకి సామాజిక మాధ్యమంలో జరిగిన నష్టం నివారించబడుతుంది. అటువంటి విశాల వైఖరిని వారు ప్రదర్శిస్తారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

లండన్‌లో ప్రయోగాత్మక నాటకం ‘ యువ మార్క్స్‌’

20 Thursday Apr 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Literature.

≈ Leave a comment

Tags

Karl Marx, Karl Marx and Friedrich Engels, Karl Marx comedy, London's new Bridge theatre, Young Marx

నాటికలో యువ మార్క్స్‌ పాత్రధారి రోరీ కిన్నియర్‌

ఎం కోటేశ్వరరావు

కారల్‌ మార్క్స్‌ ! 1848లో స్నేహితుడు ఫెడరిక్‌ ఎంగెల్స్‌తో కలసి కమ్యూనిస్టు ప్రణాళికను రచించి, విడుదల చేసిన నాటి నుంచి ప్రపంచంలో ప్రతి మూలా ప్రతి రోజూ వ్యతిరేకులో, సమర్ధకులో వారి పేర్లు, వాటితో విడదీయరాని కమ్యూనిస్టు భావజాలం గురించి చర్చించని, ప్రస్తావించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. మానవ జాతి చరిత్రలో ఒక పెద్ద మలుపుకు కారణమైన ‘యువ కారల్‌ మార్క్స్‌ ‘ లండన్‌లో గడిపిన జీవితం గురించి ఒక నాటికను అక్టోబరు నుంచి ప్రదర్శించనున్నారనేది తాజా వార్త. నూతనంగా ప్రారంభమైన బ్రిడ్జి ధియేటర్‌ నుంచి వెలువడుతున్న తొలి ప్రదర్శన ఇది. థేమ్స్‌ నదిపై వున్న న్యూ బ్రిడ్జి ప్రాంతంలో 900 సీట్లతో కొత్తగా నిర్మించిన వాణిజ్య ప్రదర్శనశాల ఇది. గత పదిహేను సంవత్సరాలలో లండన్‌లో ధియేటర్లకు వచ్చి నాటకాలు చూసే ప్రేక్షకులు 25శాతం పెరిగినట్లు ఒక సర్వేలో తేలింది.

Nick Starr and Nicholas Hytner.

బ్రిడ్జి ధియేటర్‌ వ్యవస్ధాపకులు నిక్‌స్టార్‌, నికొలస్‌ హిట్నర్‌

నాటిక, నాటక, సినిమా తదితర కళారూపాల నిర్మాణానికి వృత్తాంతంగా మార్క్సు-ఎంగెల్స్‌లను ఎంచుకోవటమే ఒక ప్రత్యేకత. వారి గంభీర జీవితాలను, రచనల ద్వారా ప్రపంచానికి అందచేసిన సందేశాన్ని టిక్కెట్లు కొని చూసే వీక్షకుల ముందు రక్తి కట్టించటం సాహసం, పెద్ద ప్రయోగమే. లండన్‌లో మార్క్సు కుటుంబం అష్టకష్టాలు పడిందన్నది లోకవిదితం. అలాంటి జీవితం 1850 తొలిరోజుల గురించి ప్రేక్షకులను ఎలా మెప్పించనున్నారన్నదే ఆసక్తికరం. కుటుంబ జీవనం ఇబ్బందుల్లో పడింది, అప్పటికే జర్మనీ నుంచి అనేక ప్రాంతాలు తిరిగి అలసిపోయి కాళ్లు, చేతులు కాయలు కాచిన విప్లవకారుడు.నాటి పాలకవర్గాలు అత్యంత భయంకరమైన తీవ్రవాదిగా పరిగణించిన మార్క్స్‌ పశ్చిమ లండన్‌లోని సోహో ప్రాంతంలోని డీన్‌ వీధిలో ఎవరికీ తెలియకుండా జీవించిన రైల్వేలో వుద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు, తదితర అంశాలను ఈ నాటికలో ప్రదర్శించనున్నారు. వ్యంగ్య, హాస్య రచనలు చేసే రిచర్డ్‌ బీన్‌, క్లైవ్‌ కోల్‌మెన్‌ ద్వయం గంభీరమైన కారల్‌మార్క్సు జీవితంలో వాటిని ఎలా చొప్పించారో చూడాల్సి వుంది. లండన్‌లోని ప్రఖ్యాత నేషనల్‌ ధియేటర్‌లో మాజీ డైరెక్టర్‌గా వున్న సర్‌ నికోలస్‌ హిట్నర్‌ ఈ నాటిక దర్శకుడు, బ్రిడ్జి ధియేటర్‌ సహ వ్యవస్దాపకుడు. రోరీ కిన్నియర్‌ మార్క్స్‌గా ఎంగెల్స్‌గా ఆలివర్‌ క్రిస్‌ నటిస్తున్నారు.

The Bridge theatre will open in October 2017

ప్రారంభానికి సిద్ధమైన బ్రిడ్జి ధియేటర్‌

ఏడాదికి కనీసంగా నాటకాలను ప్రదర్శించటం తమ లక్ష్యమని ‘యువ మార్క్స్‌’ తరువాత ప్రదర్శనకు సిద్దం చేస్తున్న ఎనిమిది నాటకాల పేర్లను కూడా నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. వీటిలో షేక్సిపియర్‌ రచన జూలియస్‌ సీజర్‌ తప్ప మిగిలిన వన్నీ కొత్త రచనలే. వాటిలో నాలుగింటిలో మహిళలే నటిస్తున్నారు. లండన్‌కు కొత్త నాటక సంస్ధల అవసరం వుందని, తాము ప్రజాకర్షకమైన,సాహసవంతమైన ఇతివృత్తాలతో వీక్షకులను వుద్వేగ భరితులను చేసే విధంగా, నిజంగా ఒక రాత్రిని మంచిగా గడిపామనుకొనే విధంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం లండన్‌లో వాణిజ్య తరహా నాటక ధియేటర్లు తొమ్మిది వున్నాయి. కొత్త ధియేటర్‌ కొత్త ప్రాంతంలో రాకతో వాటి మధ్య పోటీ పెరగవచ్చని భావిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

బాబరీ విధ్వంస కుట్ర కేసు విచారణ మధ్యంతర ఎన్నికలకు బాట వేయనుందా ?

19 Wednesday Apr 2017

Posted by raomk in AP, BJP, Communalism, Congress, Current Affairs, Gujarat, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Telangana

≈ Leave a comment

Tags

Guajarat., LOK SABHA, lok sabha midterm poles, Narendra Modi, Trial in Babri Masjid Case

Image result for babri masjid demolition

ఎం కోటేశ్వరరావు

గడువు ప్రకారం 2019లో జరగాల్సిన మన లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముందే జరుగుతాయా ? అన్న వూహాగానాలు చెలరేగుతున్న తరుణంలో బాబరీ మసీదు కూల్చివేత కుట్రకేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన కీలకమమైన తీర్పు మధ్యంతర ఎన్నికలను మరింత వేగిరం చేయనున్నాయా ? దీనికి తోడు బాబరీ మసీదు కూల్చివేత లో కుట్రపూరిత నేరారోపణ నుంచి ఎవరికీ మినహాయింపు ఇవ్వనవసరం లేదని, రెండు సంవత్సరాలలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అందువలన దాన్నింక వాయిదా వేయటానికి వీలులేదు. ఇప్పుడున్న స్ధితిలో ఆ కేసులో వచ్చే తీర్పు ఎలా వుంటుందనేదాని కంటే బిజెపి అగ్రనాయకులపై విచారణ జరపాలని కోర్టు చెప్పటమే రాజకీయంగా బిజెపికి తొలి చెంపపెట్టు. కరసేవపేరుతో బాబరీ మసీదు కూల్చివేత వాస్తవం. అందుకు పధకం రూపొందించిన వారి బండారాన్ని బయట పెట్టటం, కూల్చివేసిన వారిని శిక్షించటం రాజ్యధర్మం. వీటన్నింటి పూర్వరంగంలో తమ విధానాలను మరింత గట్టిగా అమలు జరపాలంటే మరింత బలం కావాలని, స్పష్టమైన తీర్పు ఇవ్వాలనో మరొక సాకుతోనో కమల దళపతులు కొత్త పల్లవి అందుకోనున్నారా ?

1971 పార్లమెంట్‌ ఎన్నికలలో అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావటంతో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని, ఆమె ఆరు సంవత్సరాల పాటు పోటీ చేయాటానికి అనర్హురాలని 1975 జూన్‌ 12న అలహాబాద్‌ కోర్టు తీర్పు అదే నెల 26న దేశంలో అత్యవసర పరిస్ధితి విధింపునకు దారి తీసిన విషయం తెలిసిందే. బాబరీ మసీదు కూల్చివేత కుట్ర కేసు అలాంటి పరిణామానికి దారితీసే అవకాశం లేదు. అయితే సరిగ్గా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు గనుక కోర్టు తీర్పు వెలువడితే, అది బిజెపి నేతలను నిందితులుగా నిర్దారిస్తే పరిణామాలు ఎలా వుంటుంది అన్నది ఆసక్తికరం. దాని కంటే ముందు ప్రజాస్వామ్య విలువలకు పెద్ద పీట వేస్తానని చెప్పే నరేంద్రమోడీ తన రాజధర్మాన్ని ఎలా పాటిస్తారు అన్నది తేల నుంది. ఒక కేసులో నిందితులుగా విచారణ ఎదుర్కొనేవారు అధికార పదవులలో కొనసాగవచ్చా ? కేంద్ర మంత్రి వుమా భారతిని మంత్రిగా వుంచుతారా లేక తొలగిస్తారా ? ఒక వేళ కొనసాగిస్తే అలాంటి ఇతరుల గురించి బిజెపి నోరు మూతపడాల్సి వుంటుంది. రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రచారంలోకి వచ్చిన లేదా తెచ్చిన అద్వానీకి కోర్టు నిర్ణయం పిడుగువంటిదే. బాబరీ మసీదు కూల్చివేత ఘటనతో తాత్కాలికంగా అయినా మధ్యతరగతిలో అనేక మంది బిజెపికి దూరమయ్యారు. పాతిక సంవత్సరాల తరువాత కేసు తీర్పు కుట్రను నిర్ధారిస్తే అదే పునరావృతం అవుతుందా అన్నది ప్రశ్న. అదే మధ్యతరగతి ఇటీవలి కాలంలో మోడీ మోజుతో తిరిగి బిజెపి వైపు చేరింది. కుట్ర నిజమే అని ఒక వేళ కోర్టు నిర్ధారిస్తే ఇప్పుడున్న స్ధితిలో హిందూత్వ శక్తులు మరింతగా రెచ్చిపోవచ్చు. లేదని వస్తే చూశారా మేము ఎలాంటి కుట్ర చేయలేదు, ప్రజలే కూల్చి వేశారని అమాయకపు ఫోజు పెట్టవచ్చు. కాంగ్రెస్‌తో సహా అన్ని పాలకవర్గ పార్టీలు ఓట్ల కోసం మతోన్మాదంపై అంత కరకుగా వుండటం లేదు. బిజెపి మాదిరి మెజారిటీ, మైనారిటీ మత ప్రభావిత ఓట్ల కోసం సంతుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నాయి. బిజెపికి బీ టీములుగా తయారవుతున్నాయి.అయితే దేశ వ్యాపితంగా తమ పాలన సాగాలని కోరుకుంటున్న బిజెపి కోర్టు తీర్పు ఎలా వచ్చినా నిండా మునిగిన తమకు ఇంకా చలేమిటనే వైఖరితో రిస్కు తీసుకుంటుందా ? అది చెప్పే హిందూత్వలో ఇమడలేని వారు మన దేశంలో మైనారిటీలు, దళితులు, గిరిజనులు 40 కోట్ల మంది వరకు వున్నారు. అంత మంది ఓట్లు లేకుండా ఏ పార్టీ అయినా దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాలలో అధికారాన్ని ఎలా సాధించగలుగుతుంది.

రాజకీయ నాయకుల మాటలకు అరా&థలే వేరులే అని బ్రిటన్‌ ప్రధాని థెరేసా మే రుజువు చేశారు. 2020 వరకు గడువున్న తమ పార్లమెంట్‌ను రద్దు చేయాల్సిన అగత్యం లేదంటూ నమ్మబలికిన థెరెస్సా మే ఆకస్మికంగా జూన్‌ ఎనిమిదిన ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం నిర్ణీత గడువులోపల పార్లమెంట్‌ను రద్దు చేయటానికి వీలులేదు. ఏదో ఒక ప్రభుత్వం కొనసాగాల్సిందే. అయితేనేం చట్టమన్నతరువాత లొసుగు లేకుండా వుండదన్నట్లు మూడింట రెండు వంతుల మంది ఎంపీల మద్దతు వుంటే రద్దు చేయవచ్చన్న అవకాశాన్ని వుపయోగించుకొని ఆమేరకు పార్లమెంట్‌లో ఒక తీర్మానం చేయనున్నారు. పోయేదేముంది అవకాశం వుస్తుందేమో అని ఎదురు చూసే ప్రతిపక్షం లేబర్‌ పార్టీ కూడా అందుకు సై అంది. అందువలన లాంఛనంగా పార్లమెంట్‌ రద్దు, ఎన్నికలు జరగాల్సి వుంది. నిజానికి బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ ప్రభుత్వానికి ఆకస్మికంగా వచ్చిన ముప్పేమీ లేదు, నాయకత్వాన్ని సవాలు చేసే వారు కూడా లేరు. బ్రెక్సిట్‌ కారణంగా తన విధానాలను పక్కాగా అమలు జరపాలంటే తాజా ప్రజాతీర్పు కోరటం అవసరమని ప్రధాని థెరెస్సా ప్రకటించారు. ఏ వంకా లేకపోతే డొంకట్టుకు ఏడ్చారన్న సామెత వూరికే పుట్టలేదు. బ్రిటన్‌ ఆర్ధిక వ్యవస్ధ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్ధితినుంచి తప్పించుకొనేందుకు ఇదొక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఆమె ఏ విధానాలను అమలు జరిపినా మద్దతు ఇచ్చే పాలక పార్టీకి సంపూర్ణ మద్దతు వున్నప్పటికీ ఎన్నికలకు తెరతీశారు.

మన దేశంలో కూడా గడువు ప్రకారమే ఎన్నికలంటూ గంభీరంగా నేతలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా అధికారంలో వున్న పార్టీలలో కనిపిస్తున్న పరిణామాలు, ఇతర అంశాలను చూస్తే జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏ అంశాలు ఇటువంటి వూహాగానాలకు తావిస్తున్నాయో చూద్దాం. తెలంగాణాలో చంద్రశేఖర రావు వివిధ కార్పొరేషన్లకు, ఇతర పదవులను తన పార్టీవారితో నింపటం, వివిధ కులాల వారిని బుజ్జగించేందుకు తాయిలాలు ప్రకటించటం, రిజర్వేషన్ల పెంపుదలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశ నిర్వహణ, ప్రత్యర్ధి రాజకీయపార్టీలపై అధికారపక్ష దాడి తీవ్రతరం వంటి వన్నీ కొన్ని సూచనలు. అటు ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది దెప్పి పొడుస్తున్నట్లుగా జయంతికి, వర్ధంతికి కూడా ఇంకా తేడా తెలియని కుమారుడికి చంద్రబాబు నాయుడు అమాత్యపదవి కట్టబెట్టటం, మంత్రివర్గ విస్తరణ ఎన్నికల కోసమే అన్నది విశ్లేషకుల అభిప్రాయం.

ఇటీవలనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి.వాటిలో బిజెపి, దాని మిత్రపక్షం అకాలీదళ్‌ పంజాబ్‌లో ఘోరపరాజయాన్ని చవిచూశాయి. గోవాలో అధికారంలో వున్న బిజెపి ఓడిపోయింది. వుత్తరాఖండ్‌లో మాత్రమే బిజెపి విజయం సాధించింది. వుత్తర ప్రదేశ్‌లో విజయం సాధించింది, మణిపూర్‌లో ఓడిపోయింది. సాంకేతికంగా 2017లో గడువు ముగిసే అసెంబ్లీలు లేనప్పటికీ 2018లో ఏడు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడాల్సి వుంది. వాటిలో హిమచల్‌ ప్రదేశ్‌లో జనవరి ఏడు, గుజరాత్‌లో జనవరి 22, మేఘాలయలో మార్చి ఆరు, నాగాలాండ్‌లో మార్చి 13, త్రిపురలో మార్చి 14, మిజోరంలో మార్చి 15, కర్ణాటకలో మే 28వ తేదీతో అసెంబ్లీల గడువు ముగుస్తుంది కనుక ముందుగానే ఎన్నికలు జరగాలి. మరుసటి ఏడాది లోక్‌సభ ఎన్నికలు, మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి వుంది. ఈ పూర్వరంగంలో అన్ని రాష్ట్రాల అధికారంలో పాగావేయాలన్నది బిజెపి ఎత్తుగడ. అయితే గత ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలను చూసినపుడు బిజెపి పరిస్థితి నల్లేరు మీద బండిలా సాగుతుందా అన్నది చూడాల్సి వుంది.

దేశ ఆర్ధిక స్ధితిని చూస్తే మోడీ సర్కార్‌ మూడు సంవత్సరాలలో సాధించినదాని గురించి అధికార, ప్రయివేటు మీడియా దన్నుతో సంబరాలు చేసుకోవచ్చుగాని సామాన్యుల జీవితాలను ప్రభావితం చేసిన ఒక్క అంశం కూడా లేదన్నది విశ్లేకుల అభిప్రాయం. ధరల పెరుగుదలలో మార్పు లేదు, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో పురోగతి లేదు, ఎగుమతులు పడిపోయాయి, దిగుమతులు పెరిగాయి. సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లు గత మూడు సంవత్సరాలుగా కేంద్రీకరించిన వస్తు, సేవల పన్ను చట్టం జూలై నుంచి అమలులోకి రానుంది. దాంతో మొదట ధరలు పెరుగుతాయని, తరువాత జనానికి ఫలితాలు అందుతాయని పాలకపార్టీతో పాటు, దాని సమర్ధకులు వూదరగొడుతున్నారు. అంటే మొరటుగా చెప్పాలంటే ముందు నీ గోచి పాతను కూడా పోగొట్టుకుంటావు తరువాత పట్టుపంచలు పొందుతావు అన్నట్లుగా వుంది. ముందు ధరలు పెరగటం ఏమిటో తరువాత తగ్గటం ఏమిటో, ఇది ఏ పాఠశాల ఆర్ధశాస్త్రపాఠమో ఎవరూ చెప్పరు. ఒకసారి పెరగటం ఎందుకు తరువాత తగ్గటం ఎందుకు ? మానవ జాతి చరిత్రలో ఏ దేశంలో అయినా ఒకసారి పెరిగిన ధరలు తగ్గిన వుదాహరణ వుందా ? అందువలన అధికారం తప్ప మరొకటి పట్టని బిజెపి పెరిగిన ధరల మధ్య మోడీ పాలనలో దేశం వెలిగిపోతోంది అని చెప్పుకోజాలదు. కనుక ధరల సెగ జనానికి పూర్తిగా సోకక ముందే మరోసారి నాకు ఓటేస్తే ఇంకా మంచి రోజులు తెస్తానని గడువుకు ముందే ఎన్నికల ప్రకటన చేసి నరేంద్రమోడీ జనం ముందుకు వెళతారన్నది ఒక విశ్లేషణ.

పూర్వసామెత ప్రకారం ఆరునెలలు సాము గరిడీలు చేసి కనీసం ఓటి కుండలు పగలగొట్టిన ‘ప్రతిభావంతుల’ గురించి మాత్రమే విన్నాం. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికి తీస్తానని చెప్పిన నరేంద్రమోడీ ఆరునెలలు గడిచిపోతున్నా రద్దు చేసిన పెద్ద నోట్లలో ఎంత మొత్తం తిరిగి వచ్చిందీ, ఎంత డబ్బు రాలేదు, ప్రభుత్వానికి ఎంత లబ్ది కలిగిందీ అన్న విషయాలేవీ ఇంతవరకు చెప్పలేదు. నరేంద్రమోడీకి నల్లధనం తేలు కుట్టింది కనుక మిన్నకున్నారా ? పెద్ద నోట్ల రద్దుతో కాశ్మీరుతో సహా దేశమంతటా తీవ్రవాద వెన్ను విరిచామని చెప్పారు. రాళ్లు విసురుతున్న ఘటనలు ఆ కారణంగానే తగ్గాయన్నారు. అన్ని చెప్పిన ఐదు నెలల తరువాత తమ రక్షణ వలయంగా ఒక యువకుడిని జీపుకు కట్టి వీధులలో రక్షణ పొందిన మిలిటరీ వుదంతం గతంలో ఎన్నడూ లేదంటే బిజెపి విధానాలు విజయవంతమైనట్లా కాశ్మీరులో పరిస్థితులను మరింత దిగజార్చి నట్లా ? ఎన్నికలలో చెప్పిన గుజరాతు నమూనా పాలన, ప్రగతి ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో వున్నాయి. ఇవి జనంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీయక ముందే ఓట్లను కొల్లగొట్టే పని పూర్తి చేసుకోబోతున్నారా ?

పార్లమెంటు ఎన్నికల తరువాత ఢిల్లీ, బీహారులో సంభవించిన పరాభవం తరువాత జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి బిజెపి ఎన్నో గొప్పలు చెప్పుకోవచ్చు. 2012 పంజాబు అసెంబ్లీ ఎన్నికలలో అకాలీదళ్‌-బిజెపి కూటమికి 34.59,7.15 చొప్పున మొత్తం 41.64 శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెసుకు 39.92 శాతం వచ్చాయి. 2014 పార్లమెంటు ఎన్నికలలో అకాలీ-బిజెపి కూటమికి 26.3, కాంగ్రెసుకు 33.1, కొత్తగా వచ్చిన ఆమాద్మీ పార్టీకి 24.4 శాతం వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీలకు వరుసగా 25.2, 38.5, 23.7 శాతం చొప్పున వచ్చాయి. మోడీ మాయలు, మంత్రాలు ఇక్కడ పని చేయలేదు.

ఘనవిజయం సాధించామని చెప్పుకుంటున్న వుత్తర ప్రదేశ్‌ వివరాలు చూద్దాము. 2012 ఎన్నికలలో అధికారానికి వచ్చిన సమాజవాది పార్టీకి 29.15, రెండో స్ధానంలో వున్న బిఎస్‌పికి 25.91, బిజెపికి 15, కాంగ్రెస్‌కు 11.63 శాతం ఓట్లు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికలలో వరుసగా ఈ పార్టీలకు 22.2, 19.6, 42.3, 7.5 చొప్పున వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిపి ఎస్‌పి కూటమికి 28, బిఎస్‌పి 22.2, బిజెపి కూటమికి 41.4శాతం వచ్చాయి. ప్రతిపక్ష ఓట్ల చీలిక కారణంగా పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. నిజంగా దేశంలో మోడీ గాలి వీస్తుంటే పెద్ద నోట్ల రద్దు వంటి ప్రయోగం అంతగా విజయవంతమైతే బిజెపి ఓట్లెందుకు తగ్గినట్లు ? గోవాలో బిజెపి అధికారంలో వుండి ఓడిపోయింది. తనపై గెలిచిన కొందరు ఎంఎల్‌ఏలకు ఎర చూపి తిరిగి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటం వేరే విషయం. అక్కడ ఎంజిపితో కలసి 2012లో పోటీ చేసిన బిజెపి కూటమికి 41.7 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 30.78 శాతం ఓట్లు వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓట్ల శాతం 32.5, కాంగ్రెస్‌ ఓట్లు 28.4 శాతానికి తగ్గినా బిజెపి సీట్లు కోల్పోగా కాంగ్రెస్‌ పెంచుకుంది. విడిగా పోటీ చేసి పదకొండుశాతం ఓట్లు తెచ్చుకున్న ఎంజిపికి మూడు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ఎంఎల్‌ఏలను ఫిరాయింప చేసి మిగిలిన చిన్న పార్టీలన్నింటినీ కూడగట్టి బిజెపి అడ్డదారిలో అధికారాన్ని పొందింది.

అందువలన పైకి ఎంత గంభీరంగా మాట్లాడినా ఓట్ల లెక్కలు బిజెపికి అనుకూలంగా లేవన్నది స్పష్టం. ఈ ఏడాది చివరిలో జరగాల్సిన గుజరాత్‌ ఎన్నికలు బిజెపికి ఒక పరీక్ష వంటివి. ఎందుకంటే అక్కడ ఓట్లు చీలే అవకాశం లేదు. మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరువాత అక్కడ జరిగిన స్ధానిక సంస్ధ ఎన్నికలలో పట్టణాలలో బిజెపి గెలిచినా గ్రామీణ జిల్లా పంచాయతీలలో బోర్లా పడింది. కాంగ్రెస్‌ అనేక విజయాలు సాధించింది. అందువలన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓడిపోయినా లేక ఇప్పుడున్నదాని కంటే సీట్లు తగ్గినా నరేంద్రమోడీ గాలి తుస్సుమనటం ఖాయం. అందువలన గుజరాత్‌తో పాటే లోక్‌సభ ఎన్నికలను రుద్దే అవకాశాలే ఎక్కువగా వున్నాయి.

బిజెపి సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మేకిన్‌ ఇండియా, ఐదు సంవత్సరాలలో రైతుల ఆదాయాల రెట్టింపు వంటివి నినాదాలుగానే మిగిలిపోయాయి. ఇలా ఏ రంగంలో చూసినా ఎదురు దెబ్బలు తప్ప సానుకూల పరిణామాలు లేని స్ధితిలో ఐదేండ్లూ కొనసాగితే ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత పెరగటం అని వార్యం. అందుకే ఏదో ఒకసాకుతో మధ్యంతర ఎన్నికలను దేశం మీద రుద్దనున్నారనే అభిప్రాయం కలుగుతోంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కమ్యూనిస్టు వ్యతిరేక పెద్దలను వణికిస్తున్న ‘పిల్లల కోసం కమ్యూనిజం’

17 Monday Apr 2017

Posted by raomk in Current Affairs, Economics, Education, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

Bini Adamczak, CAPITALISM, communism, Communism for Kids

Image result for Bini Adamczak

ఎం కోటేశ్వరరావు

యాభై సంవత్సరాల తరువాత ఇటీవల జపాన్‌లోని కొయోటో పట్టణంలో ఒక ప్రాంతాన్ని సందర్శించిన ఒక అమెరికన్‌ అక్కడి కమ్యూనిస్టులను చూసి రాసిన ఒక వ్యాఖ్యను ఇలా ముగించాడు.’ కమ్యూనిజం చావటానికి తిరస్కరించే ఒక వైరస్‌ వంటిది- చివరికది దారిద్య్రం నుంచి సంపదలవైపు పయనించిన దేశంలో కూడా వుందంటే మార్కెట్ల శక్తికి కృతజ్ఞతలు ‘ అన్నాడు. అంటే ప్రపంచంలో ఇటీవలి వరకు అమెరికా తరువాత అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా వున్న జపాన్‌లో కూడా మ్యూనిస్టులు వుండటాన్ని జీర్ణించుకోలేక వెల్లడించిన వుక్రోషం అనుకోవాలి. వదిలేద్దాం ! గోడకు బంతిని ఎంత వేగంతో అంతే వేగంతో తిరిగి వస్తుందని తెలియని ఎందరో కమ్యూనిస్టు వ్యతిరేక మహానుభావులు. ప్రతి తరంలో పుట్టి కమ్యూనిజాన్ని నిలబెడుతున్నందుకు వారందరికీ వందనాలు. ఒక సారి పుట్టిన వ్యక్తి మరోసారి తల్లి గర్భంలోకి ప్రవేశించాలని కోరుకోవటమే ప్రకృతి విరుద్దం. అలాంటి కోరికలు వున్నవారికి అది ఎలా సాధ్యం కాదో కాలగతిని, చరిత్రను వెనక్కు తిప్పాలని చూసే వారికి కూడా అదే జరుగుతుంది. ప్రపంచంలో కమ్యూనిస్టు వ్యతిరేకులు అలాంటి కోవకు చెందిన వారే. హిరణ్యకశ్యపుడి కడుపులో ప్రహ్లాదుడు వుట్టినట్లే ప్రపంచవ్యాపితంగా సోషలిజాన్ని నాశనం చేశామని చెప్పుకున్న అమెరికా సామ్రాజ్యవాదులు తమ ఏలుబడిలో సోషలిజాన్ని అభిమానించేవారు పెరుగుతున్నట్లు గ్రహించలేకపోయారు.

గతేడాది నిర్వహించిన ఒక సర్వేలో 18-29 సంవత్సరాల మధ్య వయస్సు యువకులు 51శాతం మంది పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పగా 42శాతం అనుకూలతను వ్యక్తం చేశారు, 33శాతం సోషలిజానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. బ్రిటన్‌లో వీరిశాతం 36వరకు వుండగా సోషలిజాన్ని వ్యతిరేకించే వారు 32శాతం వున్నారని, కాపిటలిజాన్ని వ్యతిరేకించే వారు 39శాతం కాగా అనుకూలించే వారు 33 శాతమే వున్నారు. దీనంతటికీ కారణం పెట్టుబడిదారీ వైఫల్యాలను గ్రహిస్తున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరగటమే. ఒకసారి పెట్టుబడిదారీ విధానం పనికిరాదనుకున్న తరువాత దానికి ప్రత్యామ్నాయం వైపు చూడటం అవసరం. కమ్యూనిస్టులు గతంలో ఏవైనా పొరపాటు చేశారని భావిస్తే అలాంటివి జరగకుండా నూతన తరాలు జాగ్రత్తపడతాయని వేరే చెప్పనవసరం లేదు. లేదూ పెట్టుబడిదారీ విధానాన్ని నాశనం చేసి సమ సమాజాన్ని స్ధాపింపచేసే మరొక ప్రత్యామ్నాయం ఏదైనా వుంటే దాని వైపు మొగ్గుతారు తప్ప తిరిగి వెనక్కు పోరు.గత రెండువందల సంవత్సరాలలో పెట్టుబడిదారీ విధానం అనేక విజయాలు సాధించటంతో పాటు ఇంతకాలం తరువాత సమాజంలో అంతులేని అసమానతలను కూడా అదే తెచ్చిందన్న వాస్తవాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. ప్రతివారూ దానిని సరిచేస్తామని చెప్పటమే తప్ప కమ్యూనిస్టులు తప్ప ఇతర పార్టీలేవీ చిత్తశుద్ధిని ప్రదర్శించటం లేదు.

చరిత్రలో పెట్టుబడిదారీ విధానానికి అనేక తీవ్ర ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ విధానాన్ని అవలంభిస్తున్న వారి మధ్య దోపిడీలో వాటాలు కుదరకనే ఇప్పటికీ రెండు ప్రపంచ యుద్ధాలు తెచ్చారు. వియత్నాం నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ వరకు ప్రపంచ అగ్రరాజ్యాలన్నీ ఏకమై దాడులు, దురాక్రమణలకు పాల్పడినా అవి చావు దెబ్బలు తిని తోకముడుస్తున్నాయి తప్ప మరొకటి కాదు. పెట్టుబడిదారీ విధానం పాఠాలు నేర్చుకున్నట్లే దాని కంటే వయసులో చిన్నది, అనుభవం కూడా పరిమితమే అయిన సోషలిస్టు వ్యవస్ధ, కమ్యూనిస్టు పార్టీలు కూడా పాఠాలు నేర్చుకొని దోపిడీ వ్యవస్ధను నిర్మూలించి సమసమాజాన్ని స్ధాపించేందుకు ముందుకు పోవటం అనివార్యం.

Image result for Bini Adamczak

బినీ ఆదామ్‌ జెక్‌

తన రాజ్యంలో హరి నామ స్మరణ వినిపించరాదని ప్రహ్లాదుడిని తండ్రి ఆజ్ఞాపించినట్లే తమ దేశంలో కమ్యూనిజం, సోషలిజం అనే పదాలకు తావు లేదని అమెరికా హిరణ్యకశ్యపులు చెబుతున్నారు. అలాంటి చోట బాలలకు సోషలిజం, కమ్యూనిజం పాఠాలు చెబుతుంటే కమ్యూనిస్టు వ్యతిరేకులు మిన్నకుంటారా ? కొద్ది వారాల క్రితం అమెరికాలోని ‘మిట్‌ ప్రెస్‌’ అనే ఒక ప్రముఖ ప్రచురణ సంస్ధ ‘కమ్యూనిజం ఫర్‌ కిడ్స్‌ ‘ పిల్లలకోసం కమ్యూనిజం అనే పుస్తకాన్ని ప్రచురించి మార్కెట్లో పెట్టింది. ఒకసారి ఏమైందంటే పెట్టుబడిదారీ విధాన దురవస్ధల నుంచి బయపడాలని జనం కోరుకున్నారు. మరి దాన్ని ఎలాసాధించారో తెలుసుకోవాలనుందా పిల్లలూ అన్నట్లుగా ఆ పుస్తకం మొదలౌతుంది. పిడుగులు మరి పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటి అని అడుగుతారు కదా ! రాజకుమారి వంటి సోషలిజాన్ని సాధించటానికి ప్రయత్నించిన రాజకుమారుడిని దుష్ట పెట్టుబడిదారులు ఎన్నో కష్టాలు పెట్టటం, చివరికి ఎలా విజయం సాధించిందీ దానిలో వివరించిన తరువాత పిల్లలు ఆకర్షితులు కాకుండా వుంటారా ? వారికి అర్ధమయ్యే రీతిలో, భాషలో జర్మన్‌ భాషలో బినీ ఆదామ్‌ జెక్‌ అనే సామాజిక సిద్ధాంతవేత్త, చిత్రకారిణి కార్టూన్లతో సహా వివరిస్తూ రాసిన పుస్తకాన్ని అమెరికా సంస్ధ అనువాదం చేసి ఆంగ్లంలో ప్రచురించింది. దానిని అమెజాన్‌ సంస్ధ ద్వారా మార్కెటింగ్‌ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు గుండెలు బాదుకుంటూ పిల్లలకు కమ్యూనిజం పాఠాలు బోధించటమా అంటూ నానా యాగీ చేస్తున్నారు.

పెట్టుబడిదారీ విధానం మీద అసంతృప్తిని పెంచుకుంటున్న యువత సోషలిజం పట్ల సానుకూలత పెంచుకుంటూ చివరికి ఏ దారి పడుతుందో అని ఆందోళన పడుతున్న పాలకవర్గ శక్తులకు, కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఇటువంటి పుస్తకాలు ఎక్కడ మండాలో అక్కడ మండేట్లు చేస్తాయని వేరే చెప్పనవసరం లేదు. కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌లు కమ్యూనిస్టు ప్రణాళికను రచించేంత వరకు విజేతలే చరిత్రను రచించారు, వ్యాఖ్యానించారన్నది ఒక వాస్తవం. ఆ తరువాత చరిత్రను ప్రజాస్వామ్యీకరించటం, శాస్త్రీయ వ్యాఖ్యానం చేయటం ప్రారంభమైంది. ఇది పాలకవర్గానికి మింగుడు పడని వ్యవహారం. పెట్టుబడిదారీ విధాన సమర్ధకులు ఒక వ్యక్తి పెద్ద పెట్టుబడిదారు, గుత్త పెట్టుబడిదారుగా మారే క్రమంలో ఎన్నికష్టాలు పడిందీ చివరికి ఎంత పెద్ద ఆర్ధిక సామ్రాజ్యాన్ని స్ధాపించిందీ లొట్టలు వేసుకుంటూ చదివే విధంగా అనేక విజయ గాధలు రచించిన విషయం తెలిసిందే. కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడిదానా బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజానిజాలు అన్నట్లుగా పెట్టుబడిదారు విజయ గాధ వెనుక వున్న ఎందరివో కష్ట గాధలను ఈ పుస్తకంలో వివరించారని సమీక్షలను బట్టి వెల్లడైంది.

ఈ పుస్తక సమీక్షలలో ఒకదానికి పెట్టిన పెట్టిన పేరు ‘బ్రెయిన్‌ వాషింగ్‌ షాకర్‌’ అంటే బుద్ధి శుద్ధి చేసే ఘాతము అని అర్ధం. ఎవరైతే గతాన్ని గుర్తు పెట్టుకోలేరో అది పునరావృతం కావటానికి వారు దండనార్హులు అన్న అమెరికన్‌ రచయిత జార్జి శాంతాయన మాటల మాదిరి గత పొరపాట్లను ఎవరైతే ప్రేమిస్తారో అవి పునరావృతం కావటానికి వారు దండనార్హులు అని ఆ సమీక్షకుడు వ్యాఖ్యానించారు. మరొక సమీక్షకుడు ‘ఈ పిల్లల పుస్తక సిద్ధాంతమైన కమ్యూనిజం ఏదైతే వుందో అది అంత కఠినమైనది కాదు, కాకపోతే దానిని సరైన దారిలో అమలు జరపలేదు ‘ అని ఈ పుస్తకం చెబుతుంది. వావ్‌ ఇలాంటి మాటలను నేను గతంలో వినలేదు, అంటే మీరు చెప్పిన దానికర్ధం ఏమంటే వేడిగా వున్న స్టౌను నేను మరోసారి ముట్టుకుంటే నా చేతిని కాల్చకపోవచ్చు అనే కదా ? అని వుక్రోషం వెలిబుచ్చాడు. మరొక సమీక్షకుడు ఈ పుస్తకం ఆలోచనను నాశనం చేస్తుంది. ఇదొక కథల పుస్తకం దీనిలో మరోసారి ఈర్షాపరులైన రాజకుమార్తెలు, కత్తులు, భూముల నుంచి గెంటివేతకు గురైన రైతులు, దుష్ట యజమానులు, అలసిపోయిన కార్మికులు, వారి గురించి మాట్లాడే ఒక కుర్చీ, కుండ అనే రాజ్యం అన్నీ వున్నాయిందులో. పెట్టుబడిదారుల గురించి చెప్పాల్సి వస్తే లాభాల కోసం కార్యకలాపాలు నిర్వహించే సంస్ధ మిట్‌ ప్రెస్‌ దీనిని ప్రచురించింది.పోనీ ఈ పుస్తకాన్నేమైనా తక్కువ ధరకు అందించారా అంటే అదీ లేదు, అది మామూలుగా వసూలు చేసే 12.95 డాలర్ల కంటే తక్కువేమీ కాదు. ఇలా సాగుతూ తన పాండిత్యాన్ని ప్రదర్శించారనుకోండి. పుస్తకాన్ని ప్రచురించిన మిట్‌ ప్రెస్‌కు వుచిత సలహా కూడా ఇచ్చారు. పిల్లలకోసం కమ్యూనిజం అన్న పుస్తకం ప్రచురించి సొమ్ము చేసుకుంటున్న మీరు పిల్లల కోసం నాజీజం, 9-12 సంవత్సరాల వయస్సు వారిని సులభంగా వూచకోయట ఎలా ? వంటి పుస్తకాలనుకూడా ప్రచురించి సొమ్ము చేసుకోవచ్చు అని దెప్పిపొడిచారు. మరొక వ్యాఖ్యాత ఏమన్నాడో చూడండి. ‘కమ్యూనిస్టు మూల సూత్రాల గురించి ఏదైనా ఒక సినిమాలో ప్రస్తావించటంగానీ లేదా పాఠశాల సిలబస్‌లో చేర్చటంగానీ మనం ఎన్నడైనా చూశామా ఈ సైద్ధాంతిక పోరులో విజేతలం మనమే అని నిజంగా చెప్పుకోగలమా’ అంటూ మితవాదులకు ప్రశ్న వేశాడు. ఒక పుస్తకాన్ని కమ్యూనిస్టు వ్యతిరేకులు తిడుతున్నారంటే అది తప్పకుండా చదవాల్సిన పుస్తకమే అని అర్ధం చేసుకోవాలి. మరొక వ్యాఖ్యాత పుస్తక ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు అది అమెజాన్‌ కంపెనీ అగ్రశ్రేణి వంద పుస్తకాలలో స్ధానం సంపాదించటంలో విఫలమైంది అన్నాడు. కమ్యూనిజం మరియు సోషలిజం గురించి వెలువడిన నూతన పుస్తకాల విభాగంలో అదే అమెజాన్‌ కంపెనీలో ఈ పుస్తకం ప్రధమ స్ధానంలో వుంది. ఈ పుస్తక సమీక్ష పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేక పండితులు మరోసారి పాతపడిప పాచిపాటలనే పాడి బోరు కొట్టించారు తప్ప తాము సమర్ధించే పెట్టుబడిదారీ విధానం ఎలా గొప్పదో, ప్రస్తుతం అది ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి అదెప్పుడు బయటపడుతుందో ఒక్క ముక్కా చెప్పలేదు. మెరుగైన ప్రపంచం కోసం ఇప్పటికీ మనల్ని ముందుకు నడిపించేది వర్గపోరాటమే అనే సందేశంతో ఈ పుస్తకం ముగుస్తుంది.

ప్రపంచం నాశనమౌతున్న వర్తమానంలో ఆశించటానికి మరొక నూతన ప్రపంచమేదీ కనిపించని, నమ్మకంలేని స్ధితిలో ఈ పుస్తకం ఎంతో ప్రయోజనకారి, అవసరం అని మరికొన్ని సమీక్షలు వెలువడ్డాయి. రెండు వందల సంవత్సరాల పెట్టుబడిదారీ విధానం మనకు స్వేచ్చను తెచ్చిందా లేక భూమిపై మానవులు ఎన్నడూ ఎరగని అసమానతలను తెచ్చిందా అని కషనర్‌ అనే సమీక్షకుడు అమెరికా సమాజాన్ని ప్రశ్నించారు. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ మానవుల విధిరాత కాదు, ఆడమ్‌చెక్‌ సాయంతో దానికి మించి ఆలోచించేందుకు ఈ పుస్తకం వుపకరిస్తుంది.స్వేచ్చకోసం మొదటి అడుగు వేసేందుకు ప్రాధమికంగా తోడ్పడుతుంది. కనీసం ఇతర ప్రపంచాల గురించి వూహించుకొనే స్వేచ్చ వైపు అడుగువేయిస్తుంది అని కూడా కషనర్‌ చెప్పారు. డ్యూక్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఫ్రెడరిక్‌ ఆర్‌ జేమ్సన్‌ తన సమీక్షలో ఈ పుస్తకాన్ని ఎంతగానో పొగిడారు. ‘మనోజ్ఞమైన ఈ చిన్ని పుస్తకం ఇప్పుడు మనం అనుభవిస్తున్న దాని కంటే జీవితం,జీవనంలో ఇతర పద్దతులు వున్నాయని చిన్నారులకు చూపటంలో తోడ్పడుతుంది. కొంత మంది పెద్దవారూ దీన్నుంచి నేర్చు కోవచ్చు. మన యువతరం కేవలం అసంతృప్తి చెందటమే కాదు, తమవైన నూతన ఆలోచనలతో నిజంగా పనిచేసే మంచి ప్రత్యామ్నాయం, రాజకీయ విద్య కోసం చురుకుగా అన్ని వైపులా చూస్తున్న తరుణమిది. ఈ పుస్తకం ద్వారా నూతన మార్గాలను తిరిగి కనుగొనవచ్చు.’ అన్నారు. నూటొక్క పేజీలున్న ఈ పుస్తకంలో పిల్లలకు అర్ధమయ్యే భాషలో కమ్యూనిజం అంటే ఏమిటి ? పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటి ? పెట్టుబడిదారీ విధానం ఎలా వునికిలోకి వచ్చింది? పని అంటే ఏమిటి ? మార్కెట్‌ అంటే ఏమిటి ? సంక్షోభం అంటే ఏమిటి? ఏం చేయాలి అనే శీర్షికల కింద వివరణలు ఇచ్చారు. ఎరుపంటే భయం వున్న వారు ఈ పిల్లల పుస్తకం చదివైనా దానిని పొగొట్టుకుంటారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మేడే ప్రాధాన్యత-వుద్యోగుల, కార్మికుల కర్తవ్యం

14 Friday Apr 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Others

≈ Leave a comment

Tags

7th Pay Commission Recommendations, BJP, Central Government Employees, cps, EMPLOYEES, Government employees, heymarket, mayday, NDA, NPS, workers

Image result for mayday-haymarket

ఎం కోటేశ్వరరావు

మే డే ! కొంత మంది ఆ రోజును దినోత్సవంగా జరుపుతారు, మరి కొందరు దీక్షా దినంగా పాటిస్తారు. పశ్చిమార్ధ గోళంలో అనేక దేశాలలో, సమాజాలలో అది వసంత రుతు ఆగమన పండుగ రోజు. మే ఒకటవ తేదీని కార్మికులు వుత్సవంగా జరుపుకుంటే యజమానులకు పండుగ, వారు కూడా దానికి అవసరమైన నగదు మొత్తాలను సంతోషంతో సమకూర్చుతారు. అదే దీక్షా దినంగా పాటించే చోట సదరు కార్మిక సంఘాన్నే మొత్తంగా లేపేయటానికి, కార్మికులను భయపెట్టటానికి కూడా వెనుకాడరు. మే ఒకటవ తేదీ ప్రాధాన్యతను కార్మికవర్గం తెలుసుకోకుండా చేసేందుకు ఆ రోజుకు బదులు మరొక రోజును కార్మికదినంగా మార్చేందుకు మరోవైపున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక సంప్రదాయ వసంత రుతు వుత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. కార్మికుల బతుకులు మాడిపోతున్నా, యజమానులు, వారి అడుగులకు మడుగులొత్తే పాలకులు అణచివేస్తున్నా అవేమీ పట్టకుండా ప్రకృతి పరంగా చెట్లు చేమలు వికసిస్తాయి. కానీ మేడే వస్తే కార్మికుల బతుకులు వాటంతట అవే వికసించవని గుర్తించాలి. ఈ పూర్వరంగంలో కార్మికులు, ఇతర కష్ట జీవులు మే ఒకటవ తేదీని ఎలా జరుపుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. అది వారి చైతన్యానికి గీటురాయి.

ముందుగా మే డే చరిత్ర గురించి తెలుసుకుందాం. అబ్బో దీని గురించి మాకు తెలియందేముంది, ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో ఎన్నోసార్లు విన్నది, చదువుకున్నదేగా అని పెద్దలు అనుకుంటారు. ప్రపంచ పువ్వుల రోజు, లవ్వుల రోజు, నవ్వుల రోజుల మాదిరిగా ఇది కూడా 365రోజుల్లో ఇదొక రోజేగా అని యువత భావించవచ్చు. అనేక దేశాలలో చాలా మందికి ఇప్పటికీ , చివరికి దీనికి నాంది పలికిన అమెరికాలో సైతం మే డే గురించి తెలియదంటే అతిశయోక్తి కాదు. ప్రతిమనిషీ యాదృచ్చికంగానో లేదా కొంత మంది అన్నట్లు ప్రమాదవశాత్తో ఏదో ఒక మతాన్ని అవలంభించే కుటుంబంలో పుట్టటం తెలిసిందే. ఆయా మతాల దేవుళ్ల లేదా దేవ దూతలు లేదా ఇతర ప్రతినిధుల ప్రవచనాలు అనేకసార్లు విన్నప్పటికీ కుటుంబ, సామాజిక వుత్సవాల సందర్భాలలో మరోసారి వినేందుకు డబ్చిచ్చి మరీ ఏర్పాట్లు చేసుకుంటారు. అలాగే ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని పని చేసే ఐటి ఇంజనీరు, కార్యాలయ బంట్రోతు, ప్రభుత్వ వుద్యోగి, కార్మికుడు, గుమస్తా ఇలా ఎవరైనా తెల్ల చొక్కా లేక యూనిఫాం వేసుకున్నా అందరూ కార్మికులే. అందువలన ప్రతి ఒక్కరూ తమ వర్గానికి చెందిన అంతర్జాతీయ రోజు గురించి మంత్ర తంత్రాలు, ప్రవచనాల క్రతువు మాదిరి అయినా తెలుసుకోవాల్సిన అవసరం వుందా లేదా ?

Image result for mayday-haymarket

చాలా మంది మే డే అంటే ఎర్రజెండాల పార్టీల రోజు, కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. నిజానికి దీనికీ కమ్యూనిస్టుపార్టీకి సంబంధం లేదు. రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి.వాటి కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.ప్రభుత్వం సమ్మెను అణచివేసేందుకు పూనుకుంది.దాంతో చికాగో నగరంలో మే మూడవ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు నాలుగవ తేదీన హే మార్కెట్‌ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. రక్తం ఏరులై పారింది. అయినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మికులను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో అప్పీలులో శిక్షలను ఖరారు చేశారు. 1987 నవంబరు పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని వురితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు.

Image result for mayday-haymarket

1889 జూలైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు(రెండవ ఇంటర్నేషనల్‌) చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని ప్రతిపాదించి ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ఖరారు చేస్తూ ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది. ఇది జరిగిన మూడు దశాబ్దాల తరువాత అమెరికాలో 1919లో, తరువాత మన దేశంలో, ఇంకా అనేక దేశాలలో కమ్యూనిస్టుపార్టీలు ఏర్పడ్డాయి. అందువలన ఎవరైనా మే డేను కమ్యూనిస్టుపార్టీలకు చెందినదిగా చిత్రిస్తే అది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు. అది కార్మికవర్గ వుద్యమం నుంచి ఆవిర్భవించింది. కమ్యూనిస్టు పార్టీలు కార్మిక, కర్షక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి కనుక మేడేను విధిగా పాటించటంతో చివరికి అది కమ్యూనిస్టుల కార్యక్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

కార్మికవర్గం కంటే పెట్టుబడిదారీ వర్గానికే ముందు చూపు ఎక్కువని అనేక సందరా&భలలో రుజువైంది. తన చావు గోపబాలుడి చేతిలోనే వుందని గ్రహించిన కంసుడు చంపటానికి పుట్టుక నుంచి ఎలా ప్రయత్నించాడో అలాగే తనకు సమాధికట్టేది కార్మికవర్గం అని గ్రహించిన పెట్టుబడిదారీ వర్గం కూడా అదే చేసింది. చికాగో అమరజీవుల త్యాగం ప్రపంచ కార్మికవర్గానికి వుత్తేజం కలిగించేందు మే ఒకటవ తేదీని అంతర్జాతీయ కార్మికదినంగా పాటించాలని రెండవ ఇంటర్నేషనలన చేసిన నిర&ణయం తమ దేశ కార్మికవర్గాన్ని ప్రభావితం చేయకుండా చూసేందుకు అమెరికా పాలకవర్గం ప్రారంభం నుంచీ ప్రయత్నించింది. అమెరికా కార్మికోద్యమంలో సోషలిస్టు భావాలున్న శక్తులు చురుకుగా వుండటాన్ని గమనించిన పెట్టుబడిదారీ వర్గం తమ చెప్పుచేతలలో వుండే వారిని కార్మికనేతలుగా ముందుకు తెచ్చేందుకు ప్రయత్నించింది. సోషలిజాన్ని వ్యతిరేకించే నైట్స ఆఫ్‌ లేబరన పేరుతో వ్యవహరించేవారితో 1869లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయించారు. వారి ప్రతిపాదనలలో సెప్టెంబరులో కార్మికులకు ఒక రోజు సెలవు ఇవ్వాలనే ఒక డిమాండు వుంది. దానిని ఆసరా చేసుకొని మే డే వైపు తమ కార్మికవర్గం మొగ్గకుండా చూసేందుకు 1887లో ఓరేగాన్లో, తరువాత 1894 నుంచీ దేశ వ్యాపితంగా సెప్టెంబరులో మొదటి సోమవారాన్ని కార్మికదిన సెలవుగా, కార్మికదినోత్సవంగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. మే ఒకటవ తేదీని కార్మికదినంగా చేస్తే చికాగోలో హేమార్కెటన మాదిరి కార్మికులు కొట్లాటలకు దిగుతారని పాలకవర్గం ప్రచారం చేసింది. అయినప్పటికీ అక్కడి కార్మికులు మే డేను పాటించారు. తరువాత 1958లో కార్మికులను గందరగోళపరిచేందుకు, యజమానులకు విధేయులుగా చేసేందుకు మే ఒకటవ తేదీని అమెరికా విధేయతా దినంగా ప్రకటించింది. దానికి స్వాతంత్య్రవుద్యమ వారసత్వం అనే మనోభావాన్ని జోడించింది. ఇలాంటి ప్రయత్నాలను ప్రపంచంలో అనేక చోట్ల పాలకవర్గం చేసింది, చేస్తోంది.

Image result for mayday-haymarket

మన దేశంలో కార్మికవర్గం సమరశీలంగా తయారు కాకుండా , సోషలిస్టు, కమ్యూనిస్టు భావాలవైపు మళ్లకుండా చూసేందుకు గాను 1953న భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. జాతీయవాదం ముసుగులో మే ఒకటవ తేదీకి బదులు విశ్వకర్మ జయంతి రోజు పేరుతో కార్మికదినాన్ని పాటించాలని ఆ సంస్ధ నిర్ణయించింది. అయితే దాని సభ్యులుగా వున్న కార్మికులు మే డేను పాటిస్తున్నా వద్దని నివారిస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయనే భయంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తుంది. ఇలాంటివే చరిత్రలో అనేకం గురించి చెప్పుకోవచ్చు.

ఇరవయ్యవ శతాబ్దం ప్రపంచ కార్మికవర్గానికి అనేక పాఠాలు నేర్పింది. ప్రపంచంలో తొలి కార్మికరాజ్యాన్ని, తరువాత అనేక దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను వునికిలోకి తేవటంలో కార్మికవర్గం ముందు పీఠీన వుంది. అదే కార్మికవర్గం 1990 దశకంలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేస్తుంటే కళ్లప్పగించి చూడటమే కాదు, ఎండమావుల వంటి పెట్టుబడిదారీ వ్యవస్ద స్వర్గాలను చేరాలనే అత్యాశతో తాను కూడా సోషలిస్టు వ్యతిరేక శక్తులతో చేతులు కలపటం కూడా ఆ శతాబ్దంలోనే జరిగింది. కార్మికవర్గం సోషలిస్టు భావజాలం వైపు మొగ్గకుండా చూసేందుకు పెట్టుబడిదారీ వర్గం రెండవ ప్రపంచ యుద్దం తరువాత తన లాభాలను కాపాడుకొనేందుకు నూతన మార్గాలను వెతుకుతూనే కార్మికవర్గానికి కొన్ని రాయితీలు కల్పించి, సంక్షేమ కార్య క్రమాలను అమలు జరిపింది. సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్దలను కూల్చివేసిన తరువాత కమ్యూనిజం, సోషలిజాలకు కాలం చెల్లిందనే ప్రచారదాడితో పాటు అంతకు ముందు తాను అమలు జరిపిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయటం, కార్మికవర్గంపై కొత్త భారాలను మోపటం గత పాతిక సంవత్సరాలలో ఐరోపా, ఇతర ధనిక దేశాలలో చూశాము. ఇదే సమయంలో సోషలిస్టు వ్యవస్ధలను కాలదన్నుకున్న దేశాల కార్మికవర్గ పరిస్థితులు మరింతగా దిగజారాయి. అనేక సమస్యలున్నప్పటికీ ఇప్పటికీ సోషలిస్టు వ్యవస్దలున్న చైనా, వియత్నాం, క్యూబా వంటి చోట్ల కార్మికవర్గ పరిస్థితులు మెరుగ్గా వున్నాయన్నది దాచినా దాగని సత్యం.

పెట్టుబడిదారీ వర్గం అమలు జరుపుతున్న వుదారవాద విధానాల ప్రభావం, ప్రపంచ సోషలిస్టు శిబిరానికి తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన తరువాత యాజమాన్యవర్గాలదే పై చేయి అయింది. కార్మికవర్గాన్ని మరింతగా దోచుకొనేందుకు కార్మికవర్గంపై అనేక షరతులను రుద్దుతున్నారు. వాటిని వుల్లంఘిస్తే వుద్యోగాల నుంచి వూడగొడతామని బెదిరిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారు. ప్రభుత్వాలు సామాజిక బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాయి. కార్మిక చట్టాలను నీరు గార్చటంతో పాటు వున్న చట్టాలను కూడా అమలు జరపకుండా, కనీసం తనిఖీ చేసే అధికారం కూడా కార్మికశాఖకు లేకుండా వ్యవస్ధను నిర్వీర్యం చేస్తున్నారు. అనేక చట్టాలను పూర్తిగా ఎత్తివేయటానికి పూనుకున్నారు. కార్మిక సంఘాలు కొన్ని వర్గసామరస్య విధానాల వూబిలో కూరుకుపోయాయి. పైరవీల ద్వారా కొన్ని రాయితీలను సాధించుకొనేందుకు పూనుకున్నాయి. భవిష్యత్‌ తరాల ప్రయోజనాలను గాలికి వదలి పెట్టాయంటే అతిశయోక్తి కాదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వుద్యోగులు, కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. వుదాహరణకు కేంద్ర ప్రభుత్వ వుద్యోగుల వేతన సవరణ విషయమే చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తీసుకోవటం తప్ప న్యాయంగా తమకు రావాల్సిందాన్ని సాధించుకొనేందుకు కనీసం అన్ని తరగతుల వుద్యోగులు, కార్మికులు ఒక రోజు సమ్మె చేసేందుకు కూడా అనువైన పరిస్ధితులు నేడు లేకపోవటానికి ప్రపంచవ్యాపితంగా మారిన పరిస్థితులు, వర్గ సామరస్య వైఖరే కారణం. ఇదే ధోరణి కానసాగితే భవిష్యత్‌లో మరింత దారుణ స్ధితిలోకి నెట్టబడతారని గుర్తించాలి. 2004 తరువాత ప్రభుత్వ వుద్యోగాలలో చేరిన వారు నూతన పెన్షన్‌ పధకం పేరుతో తమ పెన్షన్‌కు తామే డబ్బు చెల్లించుకుంటున్నారు. దానిని ప్రారంభం నుంచీ వామపక్ష పార్టీలు, ఆ పార్టీల కార్యకర్తలు పనిచేసే కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.కొంత మంది ఈ స్కీమును బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం వాజ్‌పేయి ప్రధానిగా వుండగా ప్రవేశపెట్టింది కనుక కమ్యూనిస్టులు వ్యతిరేకించారని కొందరు ఆ రోజుల్లో తప్పుడు వ్యాఖ్యానాలు చేసిన వారున్నారు. అసలు ఇప్పుడు చాలా మందికి ఇది బిజెపి సర్కార్‌ పుణ్యమే అని తెలియదు. 1998-2004 మధ్య కాలంలో అధికారంలో వున్న వాజ్‌పేయి సర్కార్‌ 1999లో ‘ఒయాసిస్‌ ‘(ఓల్డ్‌ ఏజ్‌ సోషల్‌ అండ్‌ ఇన్‌కమ్‌ ) పేరుతో ఒక ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. దాని సిఫార్సుల ప్రాతిపదికన నూతన పెన్షన్‌ పధకాన్ని రూపొందించింది. దాన్ని అమలు చేసేందుకు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీని కూడా ఏర్పాటు చేశారు. 2003 డిసెంబరు 22న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం 2004 జనవరి ఒకటవ తేదీ తరువాత చేరిన సాయుధ దళాల సిబ్బంది తప్ప ప్రభుత్వ వుద్యోగులందరూ ఈ స్వచ్చంద పెన్షన్‌ స్కీములో విధిగా చేరాల్సి వచ్చింది. ఇది అమెరికాలో అమలులో వున్న 401(కె) పెన్షన్‌ స్కీముకు అనుకరణ తప్ప ‘భారతీయ’ పధకం కాదు. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే బిజెపి అమలులోకి తెచ్చిన ఈ పధకాన్ని తరువాత పది సంవత్సరాలు అధికారంలో వున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కాగా అమలు చేసింది. ఆ నాడు వుద్యోగ సంఘాలు నామ మాత్ర వ్యతిరేకత తప్ప దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు, ప్రతిఘటించలేదు. అప్పటికే వుద్యోగులుగా వున్న వారు అది తమకు వర్తించదు కనుక రాబోయే వుద్యోగులే చూసుకొంటారు మనకెందుకు లెమ్మని వుదాసీనంగా వున్నారు. వారిలో తమ భవిష్యత్‌ కుటుంబ సభ్యులు వుంటారని కూడా ముందు చూపుతో ఆలోచించలేదంటే అతిశయోక్తి కాదు. ఈ రోజు ఆ పెన్షన్‌ స్కీము కింద చేరిన వుద్యోగులు దాని తీరుతెన్నులు చూసి గొల్లు మంటూ రద్దు కోసం ఆందోళనలు చేయాలని కోరుతున్నారు. చిత్రం ఏమిటంటే గతంలో వుద్యోగ సంఘాల నేతలుగా వుండి ఏ మాత్రం పట్టించుకోని నేతలు తగుదునమ్మా అంటూ ఇప్పుడు నూతన పెన్షన్‌ వ్యతిరేక ప్రకటనలు చేయటం గమనించాల్సిన అంశం. తెలంగాణా వంటి చోట్ల వుద్యోగ సంఘాల నేతలుగా పని చేసిన వారు ప్రభుత్వంలో కూడా భాగస్వాములుగా వున్నారు. అయినా ఆ ప్రభుత్వం నూతన పెన్షన్‌ స్కీమును అమలు చేస్తోంది తప్ప రద్దు చేసే విషయాన్ని కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోలేదు.

ఇక ఏడవ వేతన కమిషన్‌ చేసిన దారుణమైన సిఫార్సులు, వాటిని అమలు జరిపేందుకు మోడీ సర్కార్‌ వుద్యోగుల మెడలు వంచిన తీరు గురించి తెలిసిందే. వాటి మంచి చెడ్డల గురించి ఇక్కడ చర్చించనవసరం లేదు. సాధ్యమైన మేరకు తాము ఇవ్వదలచుకున్నదానికే వుద్యోగుల చేత ఆమోదింపచేయించేందుకు చేయాల్సిందంతా చేశారు, చేస్తున్నారు. కేంద్ర వుద్యోగులకు ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి వర్తింప చేసే అలవెన్సుల గురించి ప్రకటన వెలువడుతుందని ఎంతో ఆశించి ఫూల్స్‌ అయ్యారు.అసలు ఎప్పుడు వాటిని ఖరారు చేస్తారో కూడా తెలియని స్ధితి ఇప్పుడు నెలకొందంటే అతిశయోక్తి కాదు. ఆర్ధికశాఖ కార్యదర్శి అశోక్‌ లావాస నాయకత్వంలోని అలవెన్సుల కమిటీ నివేదిక గతేడాది నవంబరునెలలోనే వెలువడాల్సి వుంది. ప్రభుత్వం దాని గడువును మూడు నెలలు పొడిగించింది. ఫిబ్రవరిలో వెలువడాల్సిస సిఫార్సుల నివేదికకు ఐదు రాష్ట్రాల ఎన్నికల కోడ్‌ అడ్డం వచ్చిందని చెప్పారు. ఎన్నికలైపోయాయి. ఏర్పడిన కొత్త ప్రభుత్వాలు పాతపడుతున్నాయి. ఇంతవరకు నివేదికను సమర్పించలేదు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. దానిని ప్రభుత్వం పరిశీలించేది ఎప్పుడు ఖరారు చేసేది ఎన్నడో చెప్పనవసరం లేదు. కాలం గడిచే కొద్దీ గతేడాది జనవరి నుంచి అమలు కావాల్సిన అలవెన్సుల బకాయిల గురించి వుద్యోగులు ఆశలు వదులుకొని ఏదో ఒకటి అసలు అలవెన్సులు ప్రకటిస్తే చాలనే విధంగా పరిస్ధితిని తెచ్చేందుకు చూస్తున్నారన్నది స్పష్టం. తాజాగా మూడు శాతం డిఎ వస్తుందని చూసిన వుద్యోగులు రెండుశాతం ప్రకటనతో కంగుతిన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి వస్తే వేతన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని స్ధితి. మరో వేతన సవరణ నాటి వరకు వాయిదా వేస్తారని చెప్పినా అతిశయోక్తి కాదు.

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం వలన ఆశాభంగమే తప్ప జరిగేదేమీ వుండదు. సంఘాలలో చేరటమే కాదు, వాటి నాయకత్వాలు అనుసరిస్తున్న రాజీపద్దతుల గురించి నిలదీయాలి. న్యాయమైన డిమాండ్లపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. వుద్యోగులు తమకు న్యాయంగా రావాల్సిందానిని కోరుతున్నారు తప్ప గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. నేడు, నా సంగతి నేను చూసుకుంటే చాలు అని గాక రేపు, మన సంగతేమిటి అని కూడా విశాల దృక్పధంతో ఆలోచించటం అవసరం.

గమనిక:ఈ వ్యాసం ‘ ఎంప్లాయీస్‌ వాయిస్‌ ‘ పత్రిక కోసం రాసినది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దక్షిణాఫ్రికా పాలక కూటమిలో తీవ్రమౌతున్న విబేధాలు

07 Friday Apr 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

ANC, Jacob Zuma, SACP, south african ruling tripartite alliance

View image on Twitter

ఎం కోటేశ్వరరావు

ఇటీవల దక్షిణాఫ్రికా పాలక కూటమిలో సంభవిస్తున్న పరిణామాలు రానున్న రోజులలో నూతన రాజకీయ సమీకరణలకు సూచనలా ? గత కొద్ది రోజులుగా వేగంగా మారుతున్న పరిణామాలు, అక్కడ జరుగుతున్న ఘటనలు ప్రపంచ అభ్యుదయశక్తులకు ఒకింత ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ పాలక కూటమిలో విబేధాలు తీవ్రం కావటాన్ని సూచిస్తున్నాయి. అవి ఎలా పరిణమించనున్నాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. జాత్యహంకార పాలన అంతమై 23 సంవత్సరాల క్రితం ప్రజాస్వామిక పాలన ఏర్పడిన తరువాత పాలక ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(ఎన్‌ఎన్‌సి)లో భాగస్వాములైన దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీ(ఎస్‌ఏసిపి), దక్షిణాఫ్రికా కార్మిక సంఘాల సమాఖ్య(కొసాటు) మధ్య సంబంధాలలో తొలిసారిగా తీవ్ర పొరపొచ్చాలు తలెత్తాయి.

ఆర్ధిక మంత్రి ప్రవీన్‌ గోర్ధన్‌ను తొలగించిన దేశాధ్యక్షుడు జాకబ్‌ జుమా చర్యను కమ్యూనిస్టుపార్టీ వ్యతిరేకించటమేగాక, జుమా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. పదవీకాల ప్రారంభం నుంచి అనేక వివాదాలకు, ఆరోపణలకు, విమర్శలకు కారణమౌతున్న జుమా వ్యవహార శైలి ప్రస్తుత వివాదానికి తక్షణ కారణంగా కనిపిస్తున్నప్పటికీ కూటమిలో అంతర్గతంగా అంతకు మించిన తీవ్ర రాజకీయ, విధానపరమైన విబేధాలు వున్నట్లుగా కనిపిస్తోంది. అనేక వార్తా వ్యాఖ్యలను పరిశీలించినపుడు 2019లో జరగనున్న ఎన్నికలలో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు విడివిడిగా తలపడనున్నాయా అన్నంత వరకు ఆలోచనలు పోతున్నాయి.అదే జరిగితే దక్షిణాఫ్రికా రాజకీయ రంగంలో మరొక కొత్త అధ్యాయానికి నాంది అవుతుంది.

మార్చి 31న అధ్యక్షుడు జాకబ్‌ జుమా ఆర్ధిక మంత్రి ప్రవీన్‌ గోర్ధన్‌, వుప ఆర్ధిక మంత్రి మెకిబిసీ జోన్స్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయటమేగాక అనేక మంది శాఖలను మార్చారు.ఈ చర్యను కమ్యూనిస్టుపార్టీతో పాటు దేశ వుపాధ్యక్షుడు, ఎఎన్‌సి నాయకుడు సిరిల్‌ రాంఫొసా, కొసాటు, తదితర సంస్ధలు, ప్రముఖులు విమర్శించారు. దేశ ప్రయోజనాలరీత్యా జుమా రాజీనామా చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. గోర్దన్‌ను తొలిగించిన తరువాత దేశ రుణ స్థితిపై స్టాండర్డ్‌ అండ్‌పూర్‌ సంస్ధ రేటింగ్‌ను తగ్గించింది. అధ్యక్షుడిని అభిశంసించాలని , ఆమేరకు తాము తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్ష డెమాక్రటిక్‌ అలయన్స్‌ ప్రకటించింది. ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సభ్యులే అధ్యక్షుడిపై విశ్వాసం లేదని ప్రకటించే తీర్మానం గురించి ఆలోచించాలని కమ్యూనిస్టుపార్టీ సూచించింది. జుమాకు వ్యతిరేకంగా శుక్రవారం నాడు ప్రదర్శనలు చేయాలని అనేక సంస్ధలు పిలుపునిచ్చాయి. కొన్ని చోట్ల అనుమతి నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. కమ్యూనిస్టుపార్టీ శుక్రవారం నాటి ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దక్షిణాఫ్రికాను రక్షించండి అంటూ ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించతలపెట్టిన ప్రదర్శనలను చట్టవిరుద్దమైనవిగా ప్రకటించాలని స్ధానిక అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన కారణంగానే అనుమతి నిరాకరించారని కమ్యూనిస్టుపార్టీ పేర్కొన్నది. అయితే కొన్ని చోట్ల స్ధానిక కోర్టులు ప్రదర్శనలకు అనుమతినిచ్చాయి.దీంతో తాను విడిగా జరపతలపెట్టిన ప్రదర్శనలను వాయిదా వేసుకున్న కమ్యూనిస్టుపార్టీ ఇతర సంస్దలు ఇచ్చిన పిలుపు మేరకు వాటిలో పాల్గొంటున్నట్లు ప్రకటించింది.

జాత్యహంకార వ్యవస్ధ వ్యతిరేక పోరాట యోథుడు అహమ్మద్‌ కత్రాడా స్మారక సభలో మాట్లాడిన కమ్యూనిస్టు నాయకులు దేశం కావాలో, గుప్తా కుటుంబంతో సంబంధాలున్న జాకబ్‌ జుమా కావాలో తేల్చుకోవాలని ఎఎన్‌సి నాయకత్వాన్ని బహిరంగంగా కోరారు.కమ్యూనిస్టుపార్టీ రెండవ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ సోలీ మాపిలా మాట్లాడుతూ ప్రవీన్‌ గోర్దన్‌ను పదవి నుంచి తొలగించటం పోరాడి సాధించుకున్న ప్రజాస్వామిక వ్యవస్ధల విజయాన్ని వమ్ము చేయటం తప్ప మరొకటి కాదన్నారు.

FILE: An SACP protest. Picture: Rahima Essop/EWN.

ఈనెల ఐదున కమ్యూనిస్టు పార్టీ విడుదల చేసిన ప్రకటనలోని అంశాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ‘ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నేషనల్‌ వర్కింగ్‌ కమిటీ ఈ రోజు మీడియా గోష్టిలో చెప్పిన అంశాలను కమ్యూనిస్టు పార్టీ పరిగణనలోకి తీసుకున్నది. అధ్యక్షుడు జుమా రాజీనామా చేసే సమయం ఆసన్నమైందని పార్టీ నిర్ణయం మేరకు అధికారికంగా మొదట ఎఎన్‌సికి తెలియ చేసింది.పార్టీ నిర్ణయాన్ని బహిర్గతం చేయటానికి ముందే ఈ సమస్యపై చర్చించటానికి అందుబాటులో వుంటామని కూడా తెలియచేసింది. భేటీ కావటానికి ఎఎన్‌సి ఆమోదం తెలపటాన్ని కమ్యూనిస్టు పార్టీ స్వాగతించింది.అయితే అధ్యక్షుడు జాకబ్‌ జుమా సంప్రదింపులు జరపకుండా కమ్యూనిస్టుపార్టీని బలిపశువును చేయటాన్ని ఏ మాత్రం అంగీకరించటం లేదు. కూటమి భాగస్వాములనే కాదు చివరికి ఎఎన్‌సిని కూడా సంప్రదించకుండా మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్దీకరించటం, మార్పులు, చేర్పులకు సంబంధించిపేర్లపై నిర్ణయం మరెక్కడో జరిగిందని ఎఎన్‌సి ప్రతినిధుల స్పందనను బట్టే నిర్ధారణ అయింది. గత వారంలో ఎఎన్‌సితో జరిపిన ద్విపక్ష సంప్రదింపులను కమ్యూనిస్టు పార్టీ లీక్‌ చేసి గోప్యంగా వుంచాలన్న అంగీకారానికి తూట్లు పొడిచిందన్న ఆధారం లేని ఆరోపణను కమ్యూనిస్టుపార్టీ తిరస్కరిస్తున్నది. నిజానికి లీకు ఎఎన్‌సి నాయకత్వం వైపు నుంచే జరిగిందన్నది స్పష్టం. మంత్రివర్గ మార్పులలో మాజీ ఆర్ధిక మంత్రి ప్రవీన్‌ గోర్ధన్‌ను తొలగించటానికి కమ్యూనిస్టుపార్టీ అంగీకరించిందని చెప్పటం అవాస్తవం. లీకు వార్తల కారణంగా వాస్తవాలను తెలియ చెప్పేందుకే మార్చి 30 కమ్యూనిస్టు పార్టీ మీడియా గోష్టిని ఏర్పాటు చేసింది. లీకుల ద్వారా కమ్యూనిస్టు పార్టీ సమాచారాన్ని తెలియచేయదు. జుమా రాజీనామా చేయాలని తొలుత పిలుపు ఇచ్చిన కొందరు ఎఎన్‌సి నాయకులు వెనక్కు తగ్గినట్లుగా కనిపిస్తున్నది, అతను రాజీనామా చేయాల్సిందే అన్న వైఖరికి కమ్యూనిస్టు పార్టీ కట్టుబడి వుంది’ అని ప్రకటనలో కమ్యూనిస్టుపార్టీ స్పష్టం చేసింది.

జుమా రాజీనామా చేయాలని కమ్యూనిస్టు పార్టీ గత కొద్ది నెలలుగా కోరుతున్నట్లు గతేడాదే వార్తలు వచ్చాయి. మంత్రులను తొలగించిన తరువాత జుమా రాజీనామా చేయాలని అధికార కూటమిలోని మూడవ పక్షమైన కొసాటు కూడా కోరింది. పాత మంత్రుల తొలగింపు, కొత్త మంత్రు నియామకం కారణాల గురించి జుమా ఇచ్చిన వివరణతో తాము సంతప్తి చెందినట్లు ఎఎన్సీ ప్రకటించింది. జుమా రాజీనామాతో పాటు తాజా పరిణామాల వెనుక కీలకపాత్రధారిగా పరిగణించబడుతున్న ప్రముఖ వ్యాపారవేత్త గుప్తా పౌరసత్వం, నివాస హక్కులను రద్దు చేయాలని తాము డిమాండు చేస్తున్నట్లు కమ్యూనిస్టుపార్టీ ప్రధానకార్యదర్శి జెర్మీ క్రోనిన్‌ వెల్లడించారు. గుప్తా కుటుంబం,జుమా స్నేహితుల ప్రమేయం వున్న సంస్దలు, కంపెనీలన్నింటిపై విచారణ జరపాలని అన్నారు.

దక్షిణాఫ్రికాలో ఎఎన్‌సి నాయకత్వంలోని కూటమి 23 సంవత్సరాల పాలనలో అనేక సంక్షేమ చర్యలు చేపట్టినప్పటికీ ఈ కాలంలో అంతకు ముందు ప్రారంభమైన నయా వుదారవాద విధానాల కొనసాగింపు తప్ప ప్రత్యామ్నాయ మౌలిక విధానాలను అమలు జరపలేదు. పర్యవసానంగా అనేక తరగతులలో ఇటీవలి కాలంలో అసంతృప్తి ప్రారంభమైంది. ప్రభుత్వంలో కమ్యూనిస్టు పార్టీ కూడా ఒక భాగస్వామిగా వున్నప్పటికీ విధానాలలో ఎలాంటి మార్పులేదు. కమ్యూనిస్టు మంత్రులపై ఎలాంటి అవినీతి అక్రమాల ఆరోపణలు లేవు, వారు నిర్వహిస్తున్న శాఖలు కొంత మేరకు మిగతావారితో పోల్చితే మెరుగ్గా వున్నాయి తప్ప మెజారిటీ ఆఫ్రికన్ల ఆకాంక్షలకు అనుగుణంగా లేవు. దీంతో ఎఎన్‌సి నుంచి కమ్యూనిస్టు పార్టీ విడిపోవాలని, ప్రత్యామ్నాయ విధానాలను అమలు జరపాలని అందుకుగాను ఎన్నికలలో విడిగా పోటీ చేయాలనే ప్రతిపాదనలు గత కొంత కాలంగా కమ్యూనిస్టుపార్టీలో ముందుకు వస్తున్నాయి. జుమా పాలనలో అవినీతి, అక్రమాల ఆరోపణలు తీవ్రతరం కావటంతో ఈ అంశానికి ప్రాధాన్యత పెరిగింది. జాత్యహంకార వ్యతిరేక శక్తుల మధ్య ఐక్యతను కొనసాగించాలన్న అవగాహనతో వున్న కమ్యూనిస్టుపార్టీ, కొసాటు గత ఇరవై సంవత్సరాల కాలంలో వ్యవహరించిన తీరును గమనిస్తే అధికార కూటమిలో తలెత్తిన సంక్షోభ తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. మాజీ అధ్యక్షుడు తాబో ఎంబెకీ చర్యలను వ్యతిరేకించిన జాకబ్‌ జుమాను గతంలో బలపరచటమే కాదు, రెండు పర్యాయాలు అధ్య క్షుడిగా కూడా అంగీకరించింది. అదే కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు మరో రెండు సంవత్సరాల పదవీకాలం వున్నప్పటికీ రాజీనామా చేయాలని, జనం కావాలో-జుమా కావాలో తేల్చుకొమ్మని ఎఎన్‌సిని డిమాండ్‌ చేస్తున్నది. జుమా విధానాలను విమర్శించి వ్యతిరేకించిన కారణంగా తన స్వంత ప్రధాన కార్యదర్శి వెలిన్‌ జిమా వావిని కాసాటు పదవి నుంచి తొలగించింది, అతి పెద్ద మెటల్‌ కార్మిక సంఘాన్ని బహిష్కరించింది. అదే కొసాటు ఇప్పుడు జుమా రాజీనామా కోరుతున్నది. గతంలో ఎఎన్‌సి నుంచి వెలివేతకు గురైన వారు, లేదా తామే తప్పుకున్నవారు రాజీనామా కోరటం సరేసరి. అధికార కూటమిలో తలెత్తిన విభేదాలను వుపయోగించుకొనేందుకు ప్రతిపక్ష డెమొక్రటిక్‌ అలయన్స్‌ అభిశంసన అస్త్రంతో తయారైంది.

మరోవైపున జుమా మద్దతుదార్లు కూడా రంగంలోకి దిగారు. వారిలో రెండు రకాలు జుమా అధికారాన్ని ఆసరా చేసుకొని అక్రమలబ్ది పొందిన వాణిజ్య, పారిశ్రామికవేత్తల లాబీతో పాటు సామాజిక మాధ్యమంలో డబ్బుతీసుకొని ఏ ప్రచారం కావాలంటే అది చేసి పెట్టే ట్రోల్స్‌ లేదా మరుగుజ్జు వీరులు కూడా పూర్తి స్ధాయిలో దిగారు. నలుపు-తెలుపు మనో భావాలను రెచ్చగొడుతూ గుప్తా కుటుంబం దేశభక్తి పరులైన జాతీయ బూర్జువా అని, తమ నేత జుమా తెల్లజాతి పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు వ్యతిరేకంగా పని చేస్తున్న కారణంగా ఆ గుత్త సంస్ధలు, నల్లవారి వ్యతిరేకులైన సామ్రాజ్యవాదులు రాజీనామా డిమాండ్‌ వెనుక వున్నారని ప్రచారం చేస్తున్నారు. వీరితో పాటు జుమా వెనుక వున్న గుప్తా కుటుంబానికి చెందిన టీవీ ఛానల్‌, ఇతర మీడియా సంస్దలు కూడా రంగంలోకి దిగాయి. తనకు వ్యతిరేకంగా ప్రవీణ్‌ గోర్దన్‌ కుట్రకు పాల్పడిన కారణంగానే పదవి నుంచి తొలగించినట్లు జుమా చెబుతున్నాడు.

జాత్యహంకార పాలన అంతమైన తరువాత జనంలో ఎన్నో ఆశలు మొలకెత్తాయి. అయితే 1990 దశకం చివరిలో పెట్టుబడిదారీ వ్యవస్ధలున్న దేశాలలో తలెత్తిన ఆర్ధిక సమస్యలు 2008 నాటికి తీవ్ర సంక్షోభ రూపంలో బయటపడిన విషయం తెలిసినదే. దక్షిణాఫ్రికాలో 1994లో అధికార మార్పిడి తప్ప అంతకు ముందు అభివృద్ధి చేసిన పెట్టుబడిదారీ, నయా వుదారవాద వ్యవస్ధలో ఎలాంటి మౌలిక మార్పులు లేవు. అదే నేటి రాజకీయ సంక్షోభానికి నాంది అని చెప్పవచ్చు. గత రెండు దశాబ్దాలలో విధానాల మార్పుకు కమ్యూనిస్టుపార్టీ తన కర్తవ్యాన్ని నిర్వహించటంలో విఫలమైందనే విమర్శలు వున్నాయి. గోర్డన్‌ తొలగింపును వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టుపార్టీ జుమా రాజీనామా డిమాండ్‌ చేసి ప్రదర్శనలకు కూడా పిలుపు ఇచ్చినప్పటికీ ప్రభుత్వంలోని తన మంత్రులను కొనసాగిస్తున్నది. జుమా రాజీనామా ఒక్క కమ్యూనిస్టుపార్టీ వైఖరిపైనే ఆధారపడి లేదు. ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో వున్న జుమా వ్యతిరేకులు ఏం చేస్తారన్నది కూడా చూడాల్సి వుంది. 2019 ఎన్నికలలో కమ్యూనిస్టుపార్టీ ఒంటరిగా బరిలోకి దిగాలా లేక త్రిపక్ష కూటమి ఏకాభిప్రాయంతో ఐక్య అభ్యర్ధిని దించాలా అనే ప్రధాన అంశాలపై కమ్యూనిస్టులు తీసుకొనే నిర్ణయంపై దక్షిణాఫ్రికా పరిణామాలు ఆధారపడి వుంటాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఈక్వెడోర్‌లో వామపక్ష విజయం-ప్రాధాన్యత, సవాళ్లు !

05 Wednesday Apr 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Political Parties

≈ 2 Comments

Tags

Ecuador, ecuador presidential race, leftist moreno wins, Lenín Moreno

Image result for lenín moreno ecuador

నిల్చున్న వ్యక్తి రాఫెల్‌ కొరెయా,  కూర్చున్నది లెనిన్‌ మొరేనో

ఎంకెఆర్‌

లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులకు ఎదురు దెబ్బలు తగులుతూ మితవాదశక్తులు చెలరేగిపోతున్న తరుణంలో వాటికి అడ్డుకట్ట వేసి ఈక్వెడార్‌లో వామపక్ష శక్తులు విజయం సాధించాయి. ఆదివారం నాడు జరిగిన తుది విడత అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష అభ్యర్ధి లెనిన్‌ మొరేనో సాధించిన విజయం ప్రపంచ అభ్యుదయ శక్తులన్నింటికీ కొత్త శక్తి నిస్తుంది. పోలైన ఓట్లలో 99.65శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయనకు 51.16శాతం, ప్రత్యర్ధి గులెర్మో లాసోకు 48.84శాతం వచ్చినట్లు తెలిపిన ఎన్నికల అధికారులు లెనిన్‌ విజయసాధించినట్లు ప్రకటించారు. తాను విజయం సాధించనున్నట్లు మూడు ఎగ్జిట్స్‌ పోల్స్‌లో ప్రకటించారని, తీరా అందుకు భిన్నంగా ఫలితాలు వుండటం అంటే ఎన్నికలలో అక్రమాలు జరగటమే అంటూ తానే అసలైన విజేతనని లాసో ప్రకటించుకోవటమే గాక ఎన్నికల అక్రమాలకు నిరసన తెలపాలని మద్దతుదార్లకు పిలుపు ఇచ్చాడు. న్యాయమూర్తులు కూడా అక్రమాలలో భాగస్వాములయ్యారని ఆరోపిస్తూ తిరిగి ఓట్ల లెక్కింపు జరపాలని డిమాండ్‌ చేశాడు. ఎన్నికలను పర్యవేక్షించిన అమెరికా రాజ్యాల సంస్ధ ప్రతినిధులు తాము తనిఖీ చేసిన 480చోట్ల పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు ఎక్కడా తేడా బయటపడలేదని, అందువలన లాసో చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని ప్రకటించారు. లాసో మద్దతుదార్లు పలుచోట్ల ప్రదర్శనలకు దిగి హింసాకాండకు పాల్పడ్డారు.

Image result for lenín moreno victory marches

ప్రతిపక్ష అభ్యర్ధి చర్య జనాన్ని రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు చేసిన కుట్ర అని ప్రస్తుత అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా విమర్శించారు. బ్యాలట్‌ ద్వారా సాధించలేని దానిని హింసాకాండద్వారా పొందాలని చూస్తున్నారని దేశ ప్రజలను హెచ్చరించారు. ఫిబ్రవరి19న జరిగిన ఎన్నికల ఫలితాలపై సెడాటోస్‌ అనే ఎన్నికల జోశ్యుడు చెప్పిన అంశాలకు అనుగుణంగానే ఫలితాలు వచ్చాయి. విజయం సాధించేందుకు ఎవరికీ అవసరమైన మెజారిటీ రాకపోవటంతో తొలి రెండు స్ధానాలలో వచ్చిన వారు తుది విడత పోటీ పడ్డారు. ఈ పోటీలో ప్రతిపక్ష లాసో ఆరుశాతం మెజారిటీతో విజయం సాధిస్తారని అదే జోశ్యుడు చెప్పాడు. అయితే అందుకు భిన్నంగా ఫలితం వచ్చింది. ప్రతిపక్ష అభ్యర్ధి ఓటమిని అంగీకరించకుండా, అక్రమాలు జరిగాయని, తానే విజయం సాధించానని ప్రకటించి ఆందోళనకు రెచ్చగొట్టిన నేపధ్యంలో ఏర్పడిన గందరగోళానికి మంగళవారం నాడు ఎన్నికల కమిషన్‌ తెరదించింది. కమిషన్‌ అధ్యక్షుడు జువాన్‌ పాబ్లో పోజో అధికారికంగా టీవీలో ఒక ప్రకటన చేస్తూ ‘ఫలితాలకు తిరుగులేదు, అక్రమాల ఆనవాళ్లు లేవు, దేశం తమ అధ్యక్షుడిని స్వేచ్చగా ఎంపిక చేసుకుంది’ అని ప్రకటించారు.

Image result for lenín moreno victory marches

 

రాఫెల్‌ కొరెయా నాయకత్వంలోని వామపక్ష అలయన్స్‌ పాయిస్‌ పార్టీ రాజకీయ వారసుడిగా ఎన్నికైన లెనిన్‌ మొరేనో మేనెల 17న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఓట్ల లెక్కింపులో విజయం ఖరారు అయిన వెంటనే పాలకపార్టీ నేతలందరూ అధ్యక్ష భవనం నుంచి జనానికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా లెనిన్‌ హాపీ బర్తడే అంటూ శుభాకాంక్షలు తెలుపగా పదవీ విరమణ చేయనున్న అధ్యక్షుడు కొరెయా ఈనెల ఆరున జరుపుకోవాల్సిన తన 54వ పుట్టిన రోజును ముందే జరుపుకుంటూ మూడవ తేదీనే కేక్‌ కట్‌ చేశారు. పది సంవత్సరాల కొరెయా పాలన తరువాత మూడవ సారి కూడా వామపక్షం విజయం సాధించటానికి ఎంతో ప్రాధాన్యత వుంది. అర్జెంటీనా, బ్రెజిల్‌ దేశాలలో తలెత్తిన ఆర్ధిక సమస్యలను ఆసరా చేసుకొని అమెరికన్‌ సామ్రాజ్యవాదులు, లాటిన్‌ అమెరికా పెట్టుబడిదారులు, మితవాద, క్రైస్తవ మతవాద శక్తులు, అగ్రశ్రేణి మీడియా కుమ్మక్కుతో వామపక్ష శక్తులు అధికారానికి దూరమయ్యాయి.ఈ నేపథ్యంలో తదుపరి వంతు ఈక్వెడోర్‌ అని వామపక్ష వ్యతిరేక శక్తులు సంబరపడ్డాయి. తొలి విడత ఓటింగ్‌లో కూడా అదే ధోరణి వ్యక్తమైంది.ఫిబ్రవరి 19న అధ్యక్ష ఎన్నికతో పాటు జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో 137 స్థానాలకు గాను వామపక్ష పార్టీ 74 సంపాదించి మెజారిటీ తెచ్చుకుంది. గతం కంటే 26 స్ధానాలు తగ్గాయి. ప్రతిపక్షంలోని ఏడు పార్టీలకు కలిపి 60, స్వతంత్రులకు మూడు స్ధానాలు వచ్చాయి. ఈ ఎన్నికలలో ఎవరికీ ఓటు వేయకుండా ఖాళీ బ్యాలట్‌ పత్రాలను వేసిన వారు 22.1శాతం మంది వున్నారు.

లాటిన్‌ అమెరికాను తమ నయా వుదారవాద విధానాల ప్రయోగశాలగా చేసుకున్న పెట్టుబడిదారీ వర్గం ఆఖండంలోని దేశాల ఆర్ధిక వ్యవస్ధలను వస్తు ఎగుమతి ఆధారితంగా మార్చివేశాయి. కార్మికవర్గ సంక్షేమ చర్యలకు మంగళం పాడటంతో పాటు, రుణవూబిలో ముంచివేశాయి. జనం నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను అణచివేయటానికి సైనిక నియంతలను లేదా వారితో కుమ్మక్కైన మితవాద శక్తులను గద్దెలపై ప్రతిష్ఠించాయి. వారిని భరించలేక జనంలో తిరుగుబాట్లు తలెత్తటంతో వారిని పక్కన పెట్టి తమ అడుగుజాడల్లో నడిచే శక్తులను రంగంలోకి తెచ్చాయి. ఎన్నికలకు కాస్త వెసులుబాటు కల్పించిన పూర్వరంగంలో నయావుదారవాద విధానాలను వ్యతిరేకించే శక్తులు, వామపక్షాలు అనేక చోట్ల అధికారానికి వచ్చి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయి. జనానికి తక్షణం వుపశమనం కలిగించే చర్యలు చేపట్టటంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాయి. అందుకే జనం గత పదిహేను సంవత్సరాలలో వరుసగా అనేక చోట్ల ఆశక్తులకు పట్టం గట్టారు. తమకు రాగల ముప్పును పసిగట్టిన సామ్రాజ్యవాదులు, బహుళజాతి గుత్త సంస్ధలు ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక కుట్రలు చేశాయి. ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలలో 2008 నుంచి కొనసాగుతున్న తీవ్ర ఆర్ధిక మాంద్యం, సంక్షోభాల ప్రభావం వామపక్షాలు అధికారంలో వున్న లాటిన్‌ అమెరికా దేశాలపై కూడా పడటంతో ఆ ప్రభుత్వాలకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. పర్యవసానంగా జనంలోని కొన్ని తరగతులలో వాటిపై అసంతృప్తి మొదలైంది. ఈ తరుణంలో మీడియా ప్రచార ఆయుధాలతో మితవాద శక్తులు విజృంభించి జనంలో అయోమయం, వామపక్ష వ్యతిరేకతను రెచ్చగొట్టటం, అప్పటికే వున్న మితవాద శక్తులను మరింత సంఘటిత పరచటం వంటి చర్యలకు పూనుకున్నాయి. మరోవైపు ఆర్ధిక రంగంలో ప్రపంచ మార్కెట్లో పెట్రోలియంతో సహా వస్తువుల ధరలు పతనం కావటంతో ఎగుమతి ఆధారిత వ్యవస్ధలుగా వున్న దేశాలలో సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. వీటికి ఇతర కారణాలు కూడా తోడు కావటంతో సామ్రాజ్యవాద, మితవాద శక్తుల కుట్రలు ఫలించి అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి చోట్ల వామపక్ష శక్తులకు ఎదురుదెబ్బలు తగిలాయి. దానికి భిన్నంగా ఫలితం రావటమే ఈక్వెడోర్‌ ఎన్నికల ప్రత్యేకత.

Photo by: Reuters

2007లో అధికారానికి వచ్చిన రాఫెల్‌ కొరెయా అంతకు ముందు ప్రభుత్వాలు చేసిన అప్పులను తాము తీర్చాల్సిన అవసరం లేదంటూ మూడువందల కోట్ల డాలర్లను చెల్లించేది లేదని ప్రకటించారు. అయితే అప్పులిచ్చిన వారు అంతర్జాతీయ కోర్టులకు ఎక్కారు. అప్పులలో 60శాతం మేరకు రద్దు కావటంలో కొరెయా ప్రభుత్వం విజయం సాధించింది.దాంతో సంక్షేమ కార్యక్రమాల అమలుకు వీలు కలిగింది. 2006-16 మధ్య కాలంలో దారిద్య్ర రేఖకు దిగువన వున్నవారి సంఖ్య తగ్గింపు చర్యల కారణంగా 36.7 నుంచి 22.5శాతానికి తగ్గిపోయింది. కనీస వేతనాల పెంపుతో పాటు ఇతర జీవన ప్రమాణాల మెరుగుదలకు చర్యలు తీసుకున్నారు. అంతకు ముందు రెండదశాబ్దాల కాలంలో తలసరి జిడిపి పెరుగుదల రేటు 0.6శాతం కాగా కొరెయా పదేళ్ల కాలంలో అది 1.5శాతానికి పెరిగింది. అసమానతలను సూచించే జినీ సూచిక 0.55 నుంచి 0.47కు తగ్గింది. ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ అధ్యయనం ప్రకారం అవినీతి కూడా తగ్గింది. ఇదే సమయంలో చమురు, వస్తువుల ధరలు పతనం కావటంతో ఎగుమతుల ఆదాయం తగ్గిపోయింది. భూకంప బాధితులను ఆదుకొనేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావటం వంటి కారణాలతో 2014 నుంచి ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర వడిదుడుకులకు లోనైంది.వృద్ధి రేటు పడిపోయింది. మాంద్య పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వ ఖర్చు కూడా తగ్గిపోయింది. అనేక పరిశ్రమలు, వ్యాపారాలలో కార్మికులు వుద్వాసనకు గురయ్యారు. పర్యవసానంగా జనంలోని కొన్ని తరగతుల్లో అసంతృప్తి మొదలైంది. దీనిని గోరంతను కొండంతగా చిత్రించటంలో మీడియా ప్రారంభం నుంచి ప్రచారదాడి జరిపింది.

ఈ పూర్వరంగంలో ఫిబ్రవరిలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో అధికార వామపక్ష నేత లెనిన్‌ మొరేనోకు రాజ్యాంగం ప్రకారం రావాల్సిన 40కిగాను 39శాతమే వచ్చాయి. మిగతా వారికి 28,16 చొప్పున వచ్చాయి. దాంతో తొలి ఇద్దరి మధ్య ఎన్నిక ఈనెల రెండున జరిగింది. పదహారుశాతం వచ్చిన మితవాద క్రైస్తవ పార్టీతో సహా వామపక్ష వ్యతిరేకులందరూ పాలకపార్టీకి వ్యతిరేకంగా నిలిచిన మితవాది లాసోకు మద్దతు ప్రకటించారు. అరవై ఒక్కశాతం ఓట్లు అధికారపక్షానికి వ్యతిరేకంగా పడటంతో ప్రతిపక్ష నేత లాసో గెలుపు తధ్యమని ఎన్నికల పండితులు జోశ్యాలు చెప్పారు. అంతిమ ఎన్నికలలో అందుకు విరుద్దంగా పదకొండుశాతానికి పైగా ఓటర్లు వామపక్షం వైపు మొగ్గటం మితవాద శక్తులను కంగు తినిపించింది.

Image result for lenín moreno victory marches

నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లెనిన్‌ మొరేనో ఎలాంటి మచ్చలు లేని స్వచ్చమైన వామపక్ష కార్యకర్త, సార్ధక నామధేయుడిగా మారారు. ఈక్వెడోర్‌ అమెజాన్‌ ప్రాంతంలో మధ్యతరగతికి చెందిన సెర్వియో తులియో మొరేనో లెనిన్‌ రచనలతో ఎంతో ప్రేరణ పొందాడు. ఆ కారణంగానే 1953 మార్చి 19న జన్మించిన తన కుమారుడు బోల్టెయిర్‌ మొరేనో గ్రేసెస్‌కు ముందు లెనిన్‌ అని చేర్చాడు. తండ్రి ఆకాంక్షకు అనుగుణ్యంగానే లెనిన్‌ మొరేనో వామపక్ష భావజాలానికి ప్రతినిధిగా జీవించి ఇపుడు దేశాధ్యక్షుడయ్యాడు. ఇంతకు ముందు 2007-13 సంవత్సరాల మధ్య దేశ వుపాధ్యక్షుడిగా పని చేశారు. వికలాంగుల సంక్షేమానికి ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గాను ఎన్నో ప్రశంసలు పొందారు. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టా పొంది వుత్తమ గ్రాడ్యుయేట్‌గా గౌరవం పొందిన లెనిన్‌ 1976లో ఒక శిక్షణా కేంద్ర డైరెక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించారు.1998 మార్చి మూడవ తేదీన ఒక దుకాణ పార్కింగ్‌లో వున్న సమయంలో వచ్చిన ఇద్దరు యువకులు ఆయనకు తుపాకి చూపి కారు, పర్సు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వెంటనే ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఆయన కారు తాళం చెవి, పర్సు వారికి ఇచ్చారు. వాటిని తీసుకొని వెళ్లిపోతూ వారిలో ఒకడు లెనిన్‌పై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడి పక్షవాతానికి గురయ్యాడు. దాని నుంచి కోలుకోవటం కష్టమని వైద్యులు నిర్ధారించారు. అయితే ధైర్యం కోల్పోకుండా చదివి నవ్వుల చికిత్స ద్వారా స్వస్ధత పొందవచ్చని తాను గతంలో చదివిన దానిని ఆచరణలో పెట్టి నాలుగు సంవత్సరాల తరువాత చక్రాల కుర్చీలో కూర్చొని రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే స్ధితికి చేరారు. అదే స్ధితిలో వుపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడై ఒక చరిత్రను సృష్టించారు. నడవలేని వ్యక్తి ఒక దేశాధ్యక్షుడు కావటం బహుశా ఇదే ప్రధమం కావచ్చు.

ప్రత్యర్ధి లాసో దేశం 1999లో ఎదుర్కొన్న బ్యాంకింగ్‌ సంక్షోభాన్ని సొమ్ము చేసుకొన్న ఒక బ్యాంకరు. రాజకీయాలకు దూరంగా వున్న ఆయనను మితవాదులు ఎన్నికలపుడు మాత్రమే రంగంలోకి తెచ్చారు. ఆ పెద్దమనిషి ఎన్నికైతే ఇప్పటి వరకు తమ ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ కార్యక్రమాలు, కార్మికుల హక్కులకు పూర్తి భంగం కలుగుతుందని, కార్మికవర్గం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని అధ్యక్షుడు కొరెయా పెద్ద ఎత్తున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జనాన్ని కోరారు. దీనికి తోడు గత రెండు నెలల కాలంలో మితవాదుల ఆధ్వర్యాన వున్న అర్జెంటీనా, బ్రెజిల్‌ పాలకుల చర్యలకు నిరసనగా అంతకు ముందు వారికి మద్దతు ఇచ్చిన వారితో సహా కార్మికవర్గం పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకుంది. రెండోవైపు మితవాదులు అధికారంలో వున్న దేశాలన్నింటా ఇదే పరిస్థితి పునరావృతం కావటం తదితర కారణాలతో ఓటర్ల ఆలోచనలో మార్పు వచ్చింది. అంతకు ముందు వామపక్ష అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు చేసిన వారిలో పదకొండుశాతం మంది మనసు మార్చుకొని లెనిన్‌కు ఓటు వేయటంతో మితవాదుల యాత్రకు బ్రేక్‌ పడినట్లయింది.

అమెరికా ప్రభుత్వ, సిఐఏ ఇతర సంస్ధల కుట్రలు, కూహకాలు, బండారాలను బయటపెడుతూ ఇప్పటికీ మిలియన్ల కొలది పత్రాలను బయట పెడుతున్న వికీలీక్స్‌ స్ధాపకుడు, ఆస్ట్రేలియన్‌ అయిన జులియన్‌ అసాంజేను ఎదో ఒక పేరుతో శిక్షించాలని, అంతం చేయాలని చూస్తున్న అమెరికా ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ లండన్‌లోని తమ రాయబార కార్యాలయంలో 2012 నుంచి ఈక్వెడోర్‌ వామపక్ష ప్రభుత్వం ఆశ్రయం కల్పించి రక్షిస్తున్న విషయం తెలిసిందే. తాను అధికారంలోకి వస్తే నెల రోజుల్లో అసాంజేను బయటికి పంపిస్తానని మితవాద అభ్యర్ధి లాసో ప్రకటించగా ఆశ్రయం కొనసాగిస్తానని లెనిన్‌ వాగ్దానం చేశారు. ఇప్పుడు లెనిన్‌ విజయంతో అసాంజేకు ముప్పు తప్పింది. ఫలితాలు స్పష్టమైన తరువాత అసాంజే ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ ‘ పన్నుల స్వర్గాల(అక్రమంగా సంపదలు దాచుకొనే ప్రాంతాలు) లోని మిలియన్ల కొద్దీ దాచుకున్న సంపదలతో గానీ లేకుండా గానీ నెల రోజుల్లో లోపల ఈక్వెడోర్‌ వదలి వెళ్లాలని లాసోకు సవినయంగా మనవి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

అయితే ఈ విజయంతో ఈక్వెడోర్‌ వామపక్షం సంతృప్తి చెందితే అది ఎంతో కాలం నిలవదు.అధికారంలో వున్న లేదా తిరిగి అధికారానికి రావాలని ప్రయత్నిస్తున్న లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులందరి ముందు పెద్ద సవాలు వుంది. నయా వుదారవాద పునాదులను అలాగే వుంచి సంక్షేమ చర్యలు చేపట్టటం ఎల్లకాలం సాధ్యం కాదని అన్ని దేశాల అనుభవాలూ నిరూపించాయి. తమకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న సామ్రాజ్యవాద శక్తులను ఎదుర్కొనేందుకు లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తులు సంఘటితం కావటానికి అధికారికంగా చేసిన కొన్ని ప్రయత్నాలు రాజకీయంగా చైతన్యవంతులైన జనాన్ని వుత్తేజితం చేస్తాయి తప్ప ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నవారిని సంతృప్తి పరచజాలవు. నయా వుదారవాద విధానాల నుంచి క్రమంగా దూరం జరుగుతూ ప్రజాహిత వైపు అడుగులు వేస్తూ అందుకు ఆటంకంగా వుంటూ ఆర్ధిక వ్యవస్ధను అదుపులో వుంచుకున్న శక్తులను, వారికి మద్దతుగా ప్రచారదాడి చేస్తున్న స్వప్రయోజన మీడియాను అదుపు చేయకుండా లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు ముందుకు పోజాలవని గత పదిహేను సంవత్సరాల అనుభవాలు విదితం చేస్తున్నాయి. బొలివర్‌ సోషలిజం, 21వ శతాబ్దపు సోషలిజం, ప్రజాస్వామిక సోషలిజం ఇలా ఏ పేరు పెట్టుకున్నప్పటికీ పెట్టుబడిదారీ వర్గ ఆర్ధిక పునాదులను కదిలించకుండా మరొక అడుగు ముందుకు వేయలేము అనే అంశాన్ని అవి గుర్తించకతప్పదు. ప్రపంచీకరణ పేరుతో సకల దేశాలను ఆక్రమించాలని చూసిన అగ్రగామి పెట్టుబడిదారీ వ్యవస్ధలన్నీ మరొక మారు స్వరక్షణ చర్యలకు పూనుకుంటున్న సమయమిది. ఇది పెట్టుబడిదారీ వ్యవస్ధలోని బలహీనతకు చిహ్నం. ఇలాంటి రక్షణ చర్యలు, మార్కెట్ల ఆక్రమణ క్రమంలోనే రెండు ప్రపంచ యుద్ధాలు సంభవించాయి. అందువలన వర్తమాన పరిస్ధితులలో మార్క్సిజం-లెనినిజాలను ఏ దేశానికి ఆదేశం తమ పరిస్థితులకు సక్రమంగా అన్వయించుకొని తదుపరి పోరాట మార్గం, రూపాలు,ఎత్తుగడలను నిర్ణయించుకోవాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: