• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Social Inclusion

చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !

22 Sunday Jan 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Filims, Gujarat, INDIA, International, INTERNATIONAL NEWS, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion, UK

≈ Leave a comment

Tags

BJP, block out on BBC documentary, Explosive BBC documentary, Gujarat files, Gujarat pogrom, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


మనదని కాదు గానీ, ప్రజాస్వామ్య గొప్పదనం గురించి అనేక మంది ఎంతో అందంగా చెప్పారు. దీన్ని మేడిపండుతో పోల్చిన వారు కూడా ఉన్నారు. ఎవరి అనుభవం, భావం వారిది. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుందాం. ప్రజాస్వామ్య పుట్టిల్లు బ్రిటన్‌ అని చెబుతారు గానీ నిజమైన ప్రజాస్వామ్యం మన దేశంలోనే ఉందని చెప్పేవారి గురించీ తెలిసిందే. బిబిసి ప్రసారం చేసిన ఒక డాక్యుమెంటరీలో పేర్కొన్న అంశాలు ” ప్రేరేపిత ఆరోపణల పత్రం ” అని 302 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీకి మద్దతుగా శనివారం నాడు అందమైన, పొందికైన పదజాలంతో ఒక ప్రకటన చేశారు. దానిలో మాజీ జడ్జీల నుంచి మాజీ పౌర, ఇతర ప్రముఖులు, సగం మంది మాజీ సైనిక అధికారులు ఉన్నారు. కనుక భాషకోసం తడుముకోవాల్సినపని లేదు. ఆ చిత్రంలో పేర్కొన్న అంశాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, దాన్నసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ చెప్పిన మాటలు ఇంకా గింగురు మంటుండగానే వీరు రంగంలోకి దిగారంటే డాక్యుమెంటరీ ఎంత సెగ పుట్టించిందో అర్ధం చేసుకోవచ్చు.


మన పెద్దలు ప్రజాస్వామ్య గొప్పదనంతో పాటు దానికి పొంచి ఉండే ముప్పును గురించి కూడా హెచ్చరించారు. అదేమిటంటే సదరు చిత్రాన్ని ఎవరూ చూడకుండా తొలగించాలని యుట్యూబును, పంచుకోనివ్వకుండా చూడాలని ట్విటర్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన వార్త కూడా శనివారం నాడే జనాలకు తెలిసింది. సదరు బిబిసి డాక్యుమెంటరీలో చెప్పిన దాన్ని అంగీకరించటమా, తిరస్కరించటమా అన్నదాన్ని పక్కనపెడితే అసలు దానిలో ఏం చెప్పారు, ఏం చూపారు అన్న ఆసక్తిని ఈ రెండు పరిణామాలూ తెగ పెంచేశాయి. నిషేధం తీరు తెన్నులలోనూ, నరేంద్రమోడీ ఏలుబడి గురించి చర్చ జరుగుతుంది. గీత దాటొద్దు అన్న మాటను సీత పాటించి ఉంటే అసలు రామాయణం, పాండవులు కోరినట్లుగా ఐదూళ్లిచ్చి ఉంటే మహాభారతమే ఉండేది కాదనట్లుగా చూడొద్దు అంటే చూడాలనే కిక్కే వేరు ! నిషేధించిన పుస్తకాలను, సినిమాలను మనం లేదా పూర్వీకులు చూడకుండా ఉన్నారా ? దేశంలోకి రావద్దని నిషేధిస్తే రాకుండా ఉన్న దేశం ఏదైనా ఉందా ? మన ప్రజాస్వామిక వ్యవస్థలో జనానికి అందుబాటులో లేకుండా చేసినప్పటికీ, ప్రపంచమంతటినీ చూడకుండా ఆపలేరు కదా ! నేను గాంధీని ఎందుకు చంపాను అన్న గాడ్సే ప్రకటనను పుస్తకాలుగా అచ్చువేసి అనధికారికంగా పంచుతున్నవారికి ఇది తెలియదా !


హిందూ-ముస్లిం ఉద్రికత్తలను పునరుజ్జీవింప చేసేందుకు పోలీసు, జడ్జి, తలారీ ఒకరే అన్నట్లుగా భారత్‌లో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదపు పూర్వరూపంగా బిబిసి చిత్రం ఉన్నదని 302 మంది ప్రముఖులు చెప్పారు. నల్లమందు తింటే మన్నుదిన్న పాముల్లా పడి ఉంటారు అని చెబుతారు. కానీ మత మత్తుమందు జనాలను రెచ్చగొట్టి పిచ్చివారిగా మారుస్తుంది. వర్తమానంలో దాని విత్తనాలను చల్లి, దేశమంతటా సాగు చేస్తూ ఎవరు పెంచి పోషిస్తున్నారో, ప్రేరేపిస్తున్నారో అందరికీ తెలిసిందే. అసలు ఆ డాక్యుమెంటరీలో ఉన్న అంశాలే అవి కదా ! అందువలన 302 మంది కాదు ముప్పై రెండువేల మంది ప్రముఖులు రాసినా మన ఘనమైన చరిత్ర పుటల్లోకి ఎక్కించిన చెరగని గుజరాత్‌ మారణకాండ మచ్చను చెరిపివేయలేరు.” తోటి భారతీయుడు మరియు మన నేతకు వ్యతిరేకంగా రూపొందించిన ప్రేరేపిత ఆరోపణల పత్రం అని, విభజించి పాలించు అన్న బ్రిటీష్‌ రాజ్యవిధానానికి అనుగుణంగా ఉందని ” ఆ ప్రముఖులు బిబిసి చిత్రం గురించి తమకున్న భావ ప్రకటనా స్వేచ్చ మేరకు చెప్పారు. బహుశా వారికి 80-20 అంటూ బిజెపి నేతలు చేసిన ” ఐక్యత ” ప్రవచనాలు, ప్రసంగాల సారం అర్ధం కాలేదా లేక వినలేదా ? అదే బ్రిటన్‌కు సేవ చేసుకుంటామని రాసి ఇచ్చిన అపర దేశభక్తుల గురించి వేనోళ్ల పొగుడుతున్న వారసులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఆ బ్రిటన్‌తోనే చెట్టపట్టాలు వేసుకొని ఊరేగుతున్నాం. ఆ ప్రముఖులు తమ ప్రకటనలో పౌరసత్వ చట్టం, ఆర్టికల్‌ 370 రద్దు తదితర అంశాలపై రోజూ బిజెపి పెద్దలు, దాన్ని సమర్ధించేవారు చెబుతున్న అంశాలన్నింటినీ తుచ తప్పకుండా పునశ్చరణ చేశారు. బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీకి ” భారత్‌ : మోడీ వివాదం (ఇండియా : ద మోడీ క్వొశ్చన్‌) అనే శీర్షిక బదులు ” బిబిసి : నైతిక ప్రశ్న (బిబిసి ది ఎథికల్‌ క్వొశ్చన్‌) అని పెట్టి ఉంటే బాగుండేదని ముక్తాయింపు ఇచ్చారు. ఇబ్బందేముంది ? దేనికి దాన్ని పరిగణనలోకి తీసుకొని బిబిసి కథనాలన్నింటిని పరిశీలించి బేరీజు వేద్దాం.


గుజరాత్‌ మారణకాండకు సంబంధించి బిబిసి డాక్యుమెంటరీ లింకులన్నింటినీ తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌, యుట్యూబ్‌లను ఆదేశించింది. దీని అర్ధం దాన్నింక ఎవరూ చూడలేరని కాదు. బిబిసి సైట్‌లో తప్ప వాటిని షేర్‌ చేసే ఇతర వెబ్‌సైట్లలో మాత్రమే అది కనిపించదు. దానిపై ఉన్న 50 ట్వీట్లను తొలగించాలని ట్విటర్‌ను కోరింది. తొలగించినట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, ఎంపి డిరెక్‌ ఓ బ్రియన్‌ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు తామాపని చేసినట్లు ట్విటర్‌ తనకు తెలిపిందని కూడా వెల్లడించారు. సమాచార సాంకేతిక నిబంధనలు-2021 ప్రకారం కేంద్రం తొలగించాలని కోరినందున తాము అనుసరించటం మినహా మరొకమార్గం లేదని ట్విటర్‌ చెప్పినట్లు కొందరు చెప్పారు. ఇప్పటికే ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకొని దాన్ని సామాజిక మాధ్యమంద్వారా ఇతరులకు ఎవరికైనా పంపాలన్నా ఇక కుదరదు. చూడాలని పట్టుదల ఉన్న వారికి వేరే పద్దతుల్లో దొరుకుతుంది. ” భారత తనయ ” (ఇండియాస్‌ డాటర్‌) పేరుతో గతంలో ప్రసారం చేసిన నిర్భయ చిత్రాన్ని తొలగించాలని 2015లో కేంద్ర ప్రభుత్వం బిబిసికి నోటీసు పంపింది. ఆ మేరకు మన దేశంలో ప్రదర్శన నిలిపివేశారు. తాజా చిత్రంపై అలాంటి నోటీసు ఇచ్చింది లేనిదీ తెలియదు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడి జైల్లో ఉన్న నేరగాడు ముకేష్‌ సింగ్‌ను తగిన అనుమతి లేకుండా బిబిసి ఇంటర్వ్యూ చేసిందని, దాన్ని వాణిజ్యం కోసం ఉపయోగించటం, మహిళల గౌరవాన్ని భంగపరిచినందున ప్రదర్శించవద్దని కోరినా వినకుండా ప్రసారం చేయటంతో తొలగించాలని కేంద్రం కోరింది.


గతంలోనే బతకాలని భారత ముస్లింలెవరూ కోరుకోవటం లేదని దాన్నుంచి ముందుకు పోవాలని కోరుకుంటున్నారంటూ బిబిసి చిత్రాన్ని ఉటంకిస్తూ అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ తారిఖ్‌ మన్సూర్‌ ఒక పత్రికలో రాశారు. దాన్ని తప్పుపట్టాల్సినపని లేదు గానీ గతాన్ని విస్మరించాలన్న సందేశం ఇవ్వటం పెద్దలకు తగని పని. గతాన్ని పునరుద్దరించాలని, ఇస్లాం, ముస్లింలు మన దేశానికి రాకముందు ఉన్న పరిశుద్ద హిందూత్వ దేశాన్ని పునరుద్దరించాలని రోజూ ప్రచారం చేస్తుండటం, దానికి పోటీగా కోల్పోయిన తమ పూర్వపాలనను పునరుద్దరిస్తామని కొందరు ముస్లిం ఛాందసులు రంగంలోకి దిగటమే కదా విద్వేషాలకు మూలం. శ్వేతేతరులను ఉద్దరించే బాధ్యత తమదంటూ వారికి వారే ప్రకటించుకున్న శ్వేతజాతీయుల మాదిరే ఇప్పుడు శ్వేత జాతి మీడియా గురించి ఆందోళన చెందాల్సి వస్తున్నదని తారిఖ్‌ మన్సూర్‌ చెప్పిందానితో అంగీకరించటానికి కూడా ఇబ్బంది లేదు.హిందూత్వ ఉద్దారకులమంటూ ఊరేగుతున్నవారి గురించి కూడా పెద్దలు చెబితే బాగుండేది. ఇక బిబిసి డాక్యుమెంటరీ గురించి మోడీ దళాలు చెపుతున్నదానినే పునరుద్ఘాటన చేశారు గనుక వాటి గురించి చెప్పుకోనవసరం లేదు. సదరు అభిప్రాయాలతో అంగీకరించటమా లేదా అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే.


ఇక తారిఖ్‌ మన్సూర్‌తో సహా అనేక మంది సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా బిబిసి ఇలాంటి చిత్రాన్ని తీయటం ఏమిటి, అది సుప్రీం కోర్టుకు అతీతమా అని ప్రశ్నిస్తున్నారు.నిజమే వారికి ఆ హక్కు ఉంది. సుప్రీం కోర్టు గుజరాత్‌ ఉదంతాల మీద తీర్పు ఇచ్చిన మాట నిజం. ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ఈ రచయితతో సహా ఎవరూ దురుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు. తమ ముందుకు వచ్చిన అంశాల ఆధారంగా కోర్టులు తీర్పులు ఇస్తాయి. అంతమాత్రాన వాటి మీద భిన్నాభిప్రాయం వెల్లడించకూడదని ఎక్కడా లేదు. అనేక హత్యకేసులలో నిందితులుగా పేర్కొన్నవారిని కోర్టులు నిర్దోషులని తీర్పు చెప్పాయి. అంత మాత్రాన హత్యలు జరగలేదని, ఎవరో ఒకరు ప్రాణాలు తీయలేదని చెబుతామా ? సాక్ష్యాలను సమర్పించాల్సిన పోలీసులు నిందితులతో కుమ్మక్కు కావచ్చు, అసమర్ధంగా దర్యాప్తు చేసి ఉండవచ్చు, ప్రాసిక్యూటర్లు సమర్ధవంతంగా వాదించలేకపోవచ్చు.
కోర్టులు ఇచ్చిన తీర్పులనే తప్పుపట్టకూడదని వాదిస్తే జర్మనీలో హిట్లర్‌ ఆధ్వర్యంలో జరిగిన మారణకాండలను నాటి జర్మన్‌ కోర్టులు తప్పు పట్టలేదు.యూదులు, వారి ప్రభావం నుంచి జర్మన్‌ సమాజాన్ని ప్రక్షాళన చేయాలన్న జనాల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పిన జడ్జీల సంగతి తెలిసిందే. తరువాత అలాంటివారితో సహా నేరాలకు పాల్పడిన వారిని న్యూరెంబర్గ్‌ కోర్టులో విచారణ జరిపి శిక్షించిన సంగతి తెలిసిందే. తమ తీర్పును పరిగణనలోకి తీసుకోకుండా బిబిసి చిత్రాన్ని నిర్మించి తమను ధిక్కరించిందని సుప్రీం కోర్టు భావిస్తే ఆ మేరకు తనంతట తాను ముందుకు పోవచ్చు.

గుజరాత్‌ ఉదంతాల తరువాత కూడా జనం నరేంద్రమోడీని ఎన్నుకున్నారని, దాన్ని బిబిసి గమనంలోకి తీసుకోవద్దా అని చెబుతున్నారు. ఇదెక్కడి వాదన ? 1975లో అత్యవసర పరిస్థితి ప్రకటించి పౌరహక్కులను పక్కన పెట్టిన ఇందిరా గాంధీని తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడించిన జనం తిరిగి ఆమెకు పట్టం కట్టారు. అంతమాత్రాన ఎమర్జన్సీని అంగీకరించినట్లా ? జర్మనీ, ఇటలీ,తదితర అనేక దేశాల్లో నియంతలనే జనం పదే పదే ఎన్నుకున్నారు. అని చెబితే మా నరేంద్రమోడీని నియంత అంటారా అని ఎవరైనా అడగవచ్చు. మోడీ విధానాలను చూసి ఇదే ప్రజాస్వామ్యం అని అనేక మంది పొగుడుతున్నట్లుగానే వాటిలో నియంతృత్వపోకడలు ఉన్నట్లు అనేక మంది విమర్శిస్తున్నారు తప్ప నియంత అనలేదు.
భారత్‌లో తమ డాక్యుమెంటరీని ప్రదర్శించాలని ప్రస్తుతం తాము అనుకోవటం లేదని, దాన్ని తీసింది తమ దేశం వారికోసమని బిబిసి పేర్కొన్నది. దీని నిర్మాణంలో భారత్‌లో ఉన్న సిబ్బంది ఎవరూ భాగస్వాములు కాలేదని కూడా చెప్పింది. రెండవ భాగాన్ని బ్రిటన్‌లోని బిబిసి ఛానల్‌-2లో జనవరి 24న ప్రసారం చేస్తామని వెల్లడించింది. ప్రపంచంలో ముఖ్యమైన పరిణామాలన్నింటిని చూపేందుకు కట్టుబడి ఉన్నామని, భారత్‌లో మెజారిటీ హిందూ, ముస్లిం మైనారిటీల మధ్య ఉన్న ఉద్రిక్తతలు, వాటి మీద భారత ప్రధాని నరేంద్రమోడీ రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి భారత్‌లోనూ, ప్రపంచంలోనూ ఉన్న ఆసక్తి కారణంగా వాటి మీద నివేదించేందుకు నిర్మించినట్లు బిబిసి చెప్పింది.


డాక్యుమెంటరీని అడ్డుకోవటం పిరికి చర్య అని కాంగ్రెస్‌ పేర్కొన్నది. దీన్లో పేర్కొన్న అంశాలు నిజం గాకపోతే మోడీ రాజీనామా చేయాలని వత్తిడి తెచ్చినట్లు, రాజధర్మం పాటించాలని హితవు చెప్పినట్లు అప్పుడే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బ్రిటన్లో అంతర్గతంగా స్పందన కలిగించింది. బ్రిటన్‌లోని భారత మితవాద స్నేహితుల సంస్థ( కన్సర్వేటివ్‌ ఫ్రండ్స్‌ ఆఫ్‌ ఇండియా ) మాజీ సహ అధ్యక్షుడు, ప్రభువుల సభ( పార్లమెంటు ఎగువ సభ) సభ్యుడు రామీ రాంగర్‌ బిబిసి అధిపతి టిమ్‌ డేవీకి ఒక నిరసన లేఖ రాశాడు. ఈ చెత్త వెనుక పాకిస్తానీ మూలాలున్న మీ సిబ్బంది ఉన్నదీ లేనిదీ స్పష్టం చేయాలని కోరాడు. ఎవరిని సంతుష్టీకరించేందుకు ఇలాంటి లేఖలు అన్నది ప్రశ్న. బ్రిటీష్‌ హిందువులు-ముస్లింల మధ్య ఈ చిత్రం మానిన గాయాలను రేపిందని, తానెంతో దిగులుపడ్డానని దానిలో పేర్కొన్నాడు. గుజరాత్‌ మారణకాండలో అత్యాచారానికి గురై, హత్యాకాండలో బంధువులను కోల్పోయిన బిల్కిస్‌ బానో కేసులు జైలు శిక్ష అనుభవిస్తున్న నేరగాండ్లు సంస్కార వంతులైన బ్రాహ్మలు అని కితాబిచ్చి శిక్షను పూర్తిగా అమలు జరపకుండా గుజరాత్‌ ప్రభుత్వం విడిచిపెట్టిన ఉదంతం,దాన్ని సుప్రీం కోర్టు సమర్ధించిన తీరు కొత్త భయాలను ముందుకు తెచ్చిన అంశం ఆ పెద్దమనిషి దృష్టికి రాలేదా లేక నిద్ర నటిస్తున్నాడా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కూలుతున్న హిందూత్వ గోడలు :ఆర్‌ఎస్‌ఎస్‌ను ఠారెత్తిస్తున్న సిక్కు-ముస్లిం-జాట్‌ల ఐక్యత !

26 Friday Nov 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Prices, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

#Hindutva, BJP, farm acts repeal, farm laws, Farmers agitations, Hindutva groups, Jats, Muslims, Narendra Modi, Narendra Modi Failures, RSS, Sikhs


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొని రైతులకు క్షమాపణలు చెప్పారు. సాధించిన మహత్తర విజయం తో యావత్‌ కష్టజీవులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.దీనిలో భాగస్వాములు కాని వారు కార్పొరేట్‌లు, వారికి మద్దతు ఇస్తున్న స్వదేశీ జాగరణ మంచ్‌ వంటి సంస్ధలను పుట్టించిన సంఘపరివారం, దాని ఇతర ప్రత్యక్ష -పరోక్ష సంతతి, సాగు చట్టాలకు మద్దతు ఇచ్చిన వారు మాత్రమే. ఈ మద్దతుదార్ల పరిస్ధితి మరీ ఘోరం. చట్టాల రద్దు గురించి నోరెత్తలేరు. తప్పు తెలుసుకున్నా సంతోషంలో భాగస్వాములు కాలేరు.ఇంకా సాధించాల్సిన డిమాండ్ల గురించి తదుపరి కార్యాచరణ గురించి రైతులు ఆలోచిస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం-విడవమంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా రైతులు, ఇతర తరగతుల డిమాండ్లకు మద్దతు ఇవ్వకపోతే వారికి దూరం, సంఘీభావం తెలిపితే నరేంద్రమోడీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది కనుక రాజకీయ మేథోమద్దతుదారులు దిక్కుతోచని స్ధితిలో పడ్డారు. ఇక నరేంద్రమోడీ వెనుకడుగుకు కారణాలు ఏమిటి అన్న చర్చ పరిపరివిధాలుగా సాగుతోంది. వాటిలో ఒకటి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లుగా సంఘపరివారం(ఆర్‌ఎస్‌ఎస్‌) మీదకు మళ్లింది. ఒక నాటకం లేదా సినిమాలో మనకు తెర మీద తైతక్కలాడే నటీ నటులు మాత్రమే కనిపిస్తారు.దర్శకత్వం, మాటలు, పాటలు, నేపధó్య నిపుణులు మనకు దర్శనమివ్వరు. బిజెపి నేతలు అగ్ర నటులైతే, ఇతరులు సహాయ, జూనియర్‌ ఆర్టిస్టులు కాగా తెరవెనుక నిపుణులు ఆర్‌ఎస్‌ఎస్‌ వారు అన్నది తెలిసిందే. హిట్‌ అనుకున్న ” సాగు చట్టాలు – నరేంద్రమోడీ క్షమాపణ ” అనే మహా ప్రదర్శన ఫట్‌ మంది.


ఏడాది కాలంలో జరిగిన పరిణామాలు సంఘపరివారానికి చెమటలు పట్టిస్తున్నట్లు చెప్పవచ్చు. అది రైతులు, దేశం గురించి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. పలువురు ముందుకు తెచ్చిన అంశాలను చూస్తే వారికి తమ హిందూత్వ పధకానికి ఎసరు వస్తోందన్నదే అసలైన ఆందోళన కారణంగా చెప్పవచ్చు. ఇండియా టుడే హిందీ పత్రిక మాజీ మేనేజింగ్‌ ఎడిటర్‌ దిలీప్‌ మండల్‌ అభిప్రాయం ప్రకారం సాగు చట్టాల రద్దు ఎందుకు అన్నదానికి సమాధానం ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల కంటే సావర్కర్‌ రాసిన అంశాల్లో దాగుంది. దిలీప్‌ మండల్‌ రాసినదాని సారాంశం ఇలా ఉంది. సాగు చట్టాల రద్దు ప్రకటనకు మోడీ సిక్కులు పవిత్రంగా పరిగణించే గురుపూర్ణిమ రోజును ఎంచుకుంటే అదే రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చత్తీస్‌ఘర్‌ రాజధాని రాయపూర్‌ లోని ఒక గురుద్వారాలో ప్రణమిల్లారు. పంజాబ్‌ ఎన్నడూ ఎన్నికల రంగంలో బిజెపికి ముఖ్యం కాదు, దేశ విభజన సమయంలో ఉత్తర ప్రదేశ్‌లోని తెరాయి, పశ్చిమ ప్రాంతంలోని అరడజను జిల్లాలో భూములు పొందిన సిక్కులు పరిమిత ప్రభావమే చూపుతారు. ఎన్నికల కంటే వి.డి. సావర్కర్‌ ఊహించిన హిందూత్వ భావనే హిందూత్వ దళానికి ముఖ్యం. మిమ్మల్ని మేము(ఆర్‌ఎస్‌ఎస్‌) మరో ముస్లింగా చూడటం లేదని సిక్కులకు చెప్పటమే సాగు చట్టాల రద్దు సందేశం. హిందూత్వలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపికి సిక్కుల అవసరం తప్పనిసరి. ” హిందూత్వ అనివార్యతలు ” అనే తన పుస్తకంలో భారత్‌లో విమర్శకు అతీతులైన సామాజిక తరగతి హిందువుల తరువాత ఏదైనా ఉందంటే వారు పంజాబ్‌లోని మన సిక్కు సోదరులు మాత్రమే. సప్త సింధు ప్రాంతంలోని సింధు లేదా హిందువుల ప్రత్యక్ష వారసులు సిక్కులు మాత్రమే అని రాశారు. నేటి సిక్కులు నిన్నటి హిందువులు, నేటి హిందువులు రేపటి సిక్కులు కావచ్చు. దుస్తులు, సంప్రదాయాలు, రోజువారీ జీవనంలో మార్పులుండవచ్చు తప్ప వారి రక్తం, జన్యువులు మారవని చెప్పారు. తన పుస్తకంలో అరవైసార్లు సిక్కులను సావర్కర్‌ ప్రస్తావించారు.


దిలీప్‌ ఇంకా ఇలా చెప్పారు. ” అన్ని మతాలకు చెందిన రైతులు ఈ ఉద్యమంలో భాగస్వాములు, వారి డిమాండ్లన్నీ ఆర్ధికపరమైనవి, ప్రభుత్వ విధానాలతో సంబంధం కలిగినవే.హిందూ, ముస్లిం నేతలను అన్ని ప్రతినిధి వర్గాలు, పత్రికా సమావేశాలలో భాగస్వాములను చేయటం ద్వారా రైతుల ఆందోళన మతపరమైనదిగా కనిపించకుండా చూసేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక అభిప్రాయాన్ని సృష్టించారు-ఉద్ధేశ్యపూర్వకంగా చేసిన దానిలో భాగం కావచ్చు – అదేమంటే ప్రభుత్వం సిక్కులను అణచివేస్తున్నది. బిజెపి దీన్ని ఎన్నడూ కోరుకోలేదు.ఒక పరిమితిని దాటి సిక్కులు దూరం కావటం హిందుత్వ భావం, ఆర్‌ఎస్‌ఎస్‌కు విరుద్దమైనది కనుక బిజెపి అంతిమంగా సన్నిహితం కావటానికి నిర్ణయించింది.ఈ నిర్ణయం తీసుకొనేందుకు బిజెపి ఎందుకు ఇంత సమయం తీసుకుందని ఎవరైనా అడగవచ్చు. అర్ధిక అజెండా-భావజాలం మధ్య వైరుధ్యం ఉంది కనుకనే బిజెపి నిర్ణయం చేసేందుకు వ్యవధి తీసుకుంది. కచ్చితంగా చెప్పలేము గానీ గురుగ్రామ్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన నిర్ణయాత్మకం గావించి ఉండవచ్చు. అక్కడ శుక్రవారం నాడు బహిరంగ స్ధలంలో నమాజు చేయటం గురించి వివాదం ఉంది. పట్టణంలోని సాదర్‌ బజార్‌ గురుద్వారా కమిటీ తమ ప్రాంగణంలో నమాజ్‌ చేసుకోవచ్చని స్వాగతం పలికింది. ఆ మేరకు నమాజైతే జరగలేదు గానీ సిక్కులు-ముస్లింలు దగ్గర అవుతున్నారనే భావన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ను వణికించి ఉండవచ్చు. 2020 ప్రారంభంలో అలాంటి సౌహార్ధ్రత ఢిల్లీలోని షహీన్‌ బాగ్‌లో జరిగిన సిఎఎ-ఎన్‌ఆర్‌సి వ్యతిరేక నిరసన సందర్భంగా స్పష్టంగా వ్యక్తమైంది. నిరసనకారులకు వండిన ఆహారాన్ని తాజాగా అందించేందుకు సిక్కులు ఒక వంటశాలను అక్కడ ఏర్పాటు చేశారు. రైతు ఉద్యమంలో ప్రధానమైన సిక్కులు తమకు దూరం కావటం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను గడగడలాడించింది.” అని దిలీప్‌ పేర్కొన్నారు.


పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో జాట్‌ – ముస్లిం మతపరమైన విభజన గోడ కూలిపోతుండటాన్ని బిజెపి గమనించటం మోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొనేట్లు చేసిందని మానవహక్కుల కార్యకర్త విద్యాభూషణ్‌ రావత్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. దానిలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. సాగు చట్టాల రద్దుకు సాగిన ఆందోళనతో బిజెపి తన దీర్ఘకాల మిత్రపక్షాలలో ఒకటైన అకాలీదళ్‌ను కోల్పోయింది. రైతుల్లో కనిపించిన రాజకీయ అవగాహన పట్టణాల్లో ఆంగ్లం మాట్లాడే మధ్యతరగతి వారికంటే ఎంతో ఉన్నతంగా ఉంది.2013లో తెచ్చిన భూసేకరణ చట్టంలో సహేతుకమైన పరిహారంతో పాటు, కఠిన నిబంధనలు, రైతుల సమ్మతి వంటి అంశాలు ఆ తరువాత దేశంలో రైతుల నిరసనలు తగ్గటానికి ఒక కారణంగా విశ్లేషణలు వెల్లడించాయి.గత రెండు సంవత్సరాల్లో అనేక జాతీయ సమ్మెలు, రైల్‌, రోడ్డు రోకో, బందులు జరిగాయి. పోలీసులు అణచివేతకు పాల్పడినా కూడా శాంతియుతంగా జరిగాయి.లఖింపూర్‌ ఖేరీలో మోటారు వాహనాలను ఎక్కించి రైతులను చంపిన ఉదంతంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న తరువాతే నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి ఎంత విలువ ఇస్తుందో ఈ ఉదంతం వెల్లడించింది.


సాగు చట్టాల రద్దు ప్రకటన చేసిన తీరు తీవ్ర అభ్యంతరకరం, రాజ్యాంగ వ్యతిరేకం. ప్రధాని లేదా ఏ మంత్రైనా విధానపరమైన అంశాలను పార్లమెంట్‌ వెలుపల ప్రకటించకూడదు.( ప్రధాని ప్రకటన నాటికే పార్లమెంటు సమావేశాల నోటిఫికేషన్‌ వెలువడింది. కాబినెట్‌ ఆమోదమూ లేదు) మోడీ, బిజెపి ప్రతిదాన్నీ తమ రాజకీయ లాభనష్టాల అంకెల మేరకు చేస్తారు. సాగు చట్టాల రద్దు రైతులపై ప్రేమతో తీసుకున్న చర్య కాదని, ఎన్నికలకోసం చేసిందని ఎవరూ మరిచి పోకూడదు.పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ప్రత్యేకించి జాట్లు గత రెండు దశాబ్దాలలో బిజెపి మద్దతుదార్లుగా మారారు. దేశ రాజకీయాలను మండలీకరణ గావించిన తరువాత జాట్లు మరింతగా అగ్రకుల పార్టీల వైపు మొగ్గారు, బిజెపి వారికి సహజమైనదిగా కనిపించింది. 2013 ముజఫర్‌నగర్‌ ఘర్షణల ద్వారా వ్యవసాయ ప్రాంతంలో బిజెపి హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోయింది. ఆ ఉదంతంలో ఆప్రాంతంలో ముస్లింలను వేరు చేశారు, అవాంఛనీయమైన వారిగా చేశారు. ఈ సమీకరణను బిజెపి తన అధికార క్రీడలో ఎల్లవేళలా ఉపయోగించుకుంది. అయితే ఈక్రమంలో జాట్‌లు రాజకీయంగా ఆరోవేలుగా మారిపోయారు.దానికి తోడు జాట్‌లు బిజెపికి ఓటు చేసిన హర్యానాలో ఖత్రి సామాజిక తరగతికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా చేశారు. రైతు ఉద్యమం జాట్‌ల పూర్వపు ఔన్నత్యం, ముస్లింతో మమేకం కావటాన్ని ముందుకు తెచ్చింది.వాస్తవానికి జాట్‌-ముస్లిం ఐక్యత బిజెపి ఆలోచనలో ఆఖరాంశం. అది పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పార్టీకి తీవ్ర విపత్కర పరిస్ధితిని సృష్టిస్తుంది, అక్కడ పార్టీనేతలు తమ నియోజకవర్గాలకు వెళ్లలేనిదిగా మారింది.


మోడీ నిర్ణయం వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ దాగుందని అవుట్‌లుక్‌ పత్రిక విశ్లేషకుడు స్నిగ్దేందు భట్టాచార్య పేర్కొన్నారు. సారాంశం ఇలా ఉంది.” సాగు చట్టాలపై సిక్కు సామాజిక తరగతిలో తలెత్తిన వేదన వారిని ముస్లింలకు సన్నిహితం చేసినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గమనించారు. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలే సాగు చట్టాలు వెనక్కు తీసుకొనేందుకు కారణం అనుకుంటే గురునానక్‌ జయంతి రోజునే ప్రకటనకు ఎందుకు ఎంచుకుంటారు ? బిజెపి సైద్దాంతిక మాతృక ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ లేదా హిందూ సాంస్కృతిక జాతీయవాదంలో సిక్కిజం అంతర్భాగం కనుక ఈ పని చేశారని ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సిద్దాంతవేత్త ఒకరు తన గుర్తింపును వెల్లడించవద్దనే షరతుతో అవుట్‌లుక్‌ ప్రతినిధికి చెప్పారు. సాగు చట్టాలపై సిక్కుల వేదన వారిని ముస్లింలకు సన్నిహితులను చేస్తోంది.పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వ్యతిరేకించే ఆందోళన నిర్వాహకులు సాగు చట్టాల నిరసనకారులకు ఎలా దగ్గర అవుతున్నారనే అంశంపై మాకు నిర్దిష్ట సమాచారం ఉంది. గురుగ్రామ్‌లోని గురుద్వారా నిర్వాహకులు తమ ప్రాంగణంలో నమాజు చేసుకోవచ్చన్న ఇటీవలి ఉదంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాము.దేశంలో ఉద్భవించిన అన్ని రకాల విశ్వాసులను ఏకం చేయాలన్న మా దీర్ఘకాలిక ప్రణాళికకు ఇవి ఆందోళన కలిగించే ధోరణులు ‘ అని సిద్దాంతవేత్త చెప్పారు.

ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ విశ్వహిందూపరిషత్‌తో సహా ఇతర సంస్ధలన్నీ భారత్‌లో జన్మించిన మతాలు అంటే బౌద్దం, జైనం, సిక్కు అన్నీ హిందూ సాంస్కృతిక గుర్తింపులో భాగమే అని, దురాక్రమణదారుల మతమైన ఇస్లాం దానికి విరుద్దమని భావిస్తున్నాయి. బిజెపి సారధ్యంలోని ప్రభుత్వ విధానాలపై తన ప్రభావం ఏమీ ఉండదని లాంఛనంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతుంది. విష్ణుమూర్తి పదవ అవతారమే బుద్దుడని, ముస్లిందురాక్రమణదారుల మీద సిక్కులు తమ శౌర్యాన్ని ప్రదర్శించారన్నట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ సాహిత్యంలో చిత్రించారు. సిక్కులతో వైరానికి ముగింపు పలికేందుకు వెనక్కు తగ్గుతున్నాము, సిక్కులు ముస్లింలతో సన్నిహితం కావటంలో ఆర్ధిక ప్రయోజనం తప్ప మరొకటి లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ రైతు సంఘనేత చెప్పినట్లు అవుట్‌లుక్‌ పేర్కొన్నది.ఆర్‌ఎస్‌ఎస్‌ నేపధ్యం కలిగిన బిజెపి నేత ఒకరు మాట్లాడుతూ రైతు ఉద్యమ సమయంలో ప్రభుత్వ విధానాలను సమర్ధించేవారిలో కొందరు అత్యుత్సాహపరులు నిరసనకారులను ఖలిస్తానీలని చిత్రించారు. అది సిక్కులలో ఒక పెద్ద భాగాన్ని హిందూత్వను ప్రబోధించే వారికి వ్యతిరేకులను చేసింది. మా హిందూ భావజాలంలో సిక్కులు కూడా ఉన్నారు. ప్రతి నిజమైన సిక్కు హృదయంలో చూస్తే హిందువే అని గురూజీ గోల్వాల్కర్‌ చెప్పేవారు. ఈ ఆందోళన హిందువులందరినీ ఏకం చేయాలన్న మా ముఖóó్య అజెండాకు ఈ నిరసన హాని చేసింది. సంస్ధల ఉన్నతనేతలు ఈ అంశాన్ని చూస్తున్నందున తాము బహిరంగంగా అభిప్రాయాలను చెప్పలేమని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నేతలు చెప్పినట్లు ఆవుట్‌లుక్‌ పేర్కొన్నది.


సాగు చట్టాలపై రైతుల ఆగ్రహం కేవలం ఉత్తర ప్రదేశ్‌లో బిజెపికి సవాలు మాత్రమే కాదని ది ఫెడరల్‌ డాట్‌ కామ్‌ ప్రతినిధి పునీత్‌ నికోలస్‌ యాదవ్‌ తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ను వికాస పురుషుడిగా చిత్రిస్తూ ప్రచారం ప్రారంభమైంది. సాగు చట్టాల రద్దుపై మోడీ ప్రకటనకు కొద్ది రోజుల ముందు రెండు భిన్న బృందాలు సర్వేలు నిర్వహించాయి. సిఓటర్‌-ఎబిపి సర్వే ప్రకారం 403 స్ధానాల్లో 2017లో బిజెపి తెచ్చుకున్న 312లో వంద సీట్లు తగ్గుతాయి చెప్పగా పోల్‌స్టార్ట్‌-టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం 213-245 మధ్యవస్తాయని పేర్కొన్నారు.1989 తరువాత ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరోసారి నెగ్గని ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి తిరిగి అధికారంలోకి రావటం పెద్ద అసాధారణ కృత్యమే. ఇప్పటి వరకు మోడీ విధానాలు, రాజకీయాలను ఎవరూ మార్చలేరని అనుకొనే వారు, సాగు చట్టాలను రద్దు చేసిన తరువాత రోడ్ల మీద జనం ఇప్పుడు మోడీ భయపడ్డారని అనుకుంటున్నారు, కొద్ది నెలలో ఎన్నికలు జరగనుండగా ఇది మాకు మంచిది కాదని ఉత్తర ప్రదేశ్‌ మంత్రి ఒకరు చెప్పారు. లోక్‌సభ సభ్యుడు సాక్షి మహరాజ్‌ వంటి మా నోటి తుత్తర నేతలు ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు ముగిసిన తరువాత సాగు చట్టాలను తిరిగి తీసుకువస్తారని బహిరంగంగా ప్రకటించారు, ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కోసమే వెనక్కు తీసుకున్నారని అనుకుంటుండగా మేము రైతుల విశ్వాసాన్ని తిరిగి పొందగలమని మీరెలా అనుకుంటారని ఒక ఎంఎల్‌ఏ ప్రశ్నించినట్లు ఫెడరల్‌ పేర్కొన్నది. . ఈ దిగజారిన పరిస్దితిలో రైతుల మీద కార్లను తోలి నలుగురు రైతులను చంపిన లఖింపూర్‌ ఖేరీ ఉదంతానికి బాధ్యుడిని చేస్తూ కేంద్ర మంత్రి అజయ మిశ్రాను తొలగించాలన్న డిమాండును నెరవేర్చకపోవచ్చు.అదే జరిగితే ఆదిత్యనాధ్‌ ఠాకూర్లకు ప్రాధాన్యత ఇచ్చి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తున్న బ్రాహ్మణులను మరింతగా కలవర పెట్టవచ్చు.(తొలగించకపోతే రైతులు తేల్చుకుంటారు) ఏడాది క్రితం వరకు బిజెపి, యోగి నడక నల్లేరు మీద బండిలా ఉంటుందని మొత్తం మీద అందరూ అనుకున్నారు.రైతుల ఆందోళన, హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం, హత్య,కరోనా రెండవ తరంగం,బిజెపి 2014లో ఏర్పాటు చేసిన కులాల కుంపటిలో కుమ్ములాటలు పరిస్ధితిని మార్చివేశాయని ఫెడరల్‌ పేర్కొన్నది.


సంఘపరివార్‌ బహిరంగంగా ఎన్నడూ సాగు చట్టాలను వ్యతిరేకించటం లేదా చట్టాల రద్దును సమర్ధించటం గానీ చేయ లేదని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో దీప్తిమన్‌ తివారీ పేర్కొన్నారు.హిందువు-సిక్కుల మధ్య గండి ఏర్పడుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ భయపడిందని, సమస్యను పరిష్కరించలేని కేంద్ర అసమర్ధత గురించి హెచ్చరిస్తూ ఇబ్బందికి గురైందని కూడా పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి మాట్లాడుతూ సామాజిక ఐక్యత మీద చూపుతున్న ప్రభావం గురించి ఆందోళన చెందారు. ఇలాంటి చట్టాలను ఏ దేశంలోనూ వెనక్కు తీసుకోలేదని అన్నారు. గతేడాది దసరా ఉపన్యాసంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ సాగు చట్టాలను సమర్ధించారు.


భిన్నమైన సామాజిక తరగతులు ఐక్యంగా ఉద్యమాన్ని విస్తరించేందుకు పూనుకోవటం సర్వాంగీకార స్వభావాన్ని సంతరించుకోవటం ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి కూటమికి మనస్తాపాన్ని కలిగించిందని జర్నలిజం ప్రొఫెసర్‌ నళిన్‌ వర్మ పేర్కొన్నారు. రైతుల నిరసన బిజెపి హిందూత్వ రాజకీయాలకు సవాలుగా మారిందని, నిరసనకారులు ఇతర జీవన్మరణ సమస్యలపై సామాజిక న్యాయం నుంచి పౌరహక్కుల వరకు ఉద్యమాన్ని విస్తరించేందుకు అంగీకరించారని పేర్కొన్నారు. ప్రభుత్వం మీద ఇప్పటికీ రైతుల్లో అనుమానాలు పెద్ద ఎత్తున ఉండగా వాటిని మరింతగా పెంచేరీతిలో రాజస్తాన్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా, ఎంపీ సాక్షి మహరాజ్‌ మాట్లాడుతూ ఈ చట్టాలను తిరిగి చేస్తారని చెప్పారు. రైతులు కోరుతున్న డిమాండ్లను ఆచరణ సాధ్యం కానివని, అరాచకాన్ని పెంచుతాయని ఇప్పుడు అమితాసక్తిగల ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి మద్దతుదారులు చిత్రించుతున్నారు. నిజానికి వారు కొత్తగా జతచేసిన డిమాండ్లేవి లేవు. ఎంఎస్‌పి డిమాండు మూడు చట్టాలకంటే పాతదే, దానికి చట్టబద్దత కల్పించాలన్న కోరిక 2011లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ సంతకం చేసి అందచేసిన మెమోరాండంలో ఉన్న అంశమే. 2014లో ఓట్ల కోసం అనేక సభల్లో మోడీ చెప్పినదే.


1974నాటి జయప్రకాష్‌ నారాయణ సంపూర్ణ విప్లవానికి, ఇప్పుడు రైతు ఉద్యమానికి కొన్ని పోలికలు ఉన్నాయి. గుజరాత్‌లో ఒక హాస్టల్లో ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా తలెత్తిన నిరసన జెపి ఉద్యమానికి నాంది. రైతులు తొలుత పంజాబ్‌లోనే ఆందోళనకు దిగారు. విద్యార్ది ఆందోళన ఉత్తరాదిన అనేక ప్రాంతాలకు విస్తరించినట్లుగానే రైతు ఉద్యమం హర్యానా,హిమచల ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్తాన్‌,మధ్యప్రదేశ్‌లకు విస్తరించి దక్షిణాదిన మద్దతు పొందింది. జెపి ఉద్యమం తొలుత విద్యార్దులతో ఉన్నప్పటికీ తరువాత జనసంఫ్‌ు(బిజెపి పూర్వరూపం) లోక్‌దళ్‌, డిఎంకెపి, ఇతర సోషలిస్టు, మితవాద పార్టీలన్నీ చేరాయి. చివరకు అవన్నీ జనతా పార్టీగా ఏర్పడ్డాయి.


జాగ్రత్తగా రూపొందించిన హిందూత్వ భావజాలానికి తగిన సామాజిక విభజనపై మోడీ-అమిత్‌షా రాజకీయాలు వృద్ది చెందాయి. హర్యానాలో జాట్‌-జాటేతర కులాల ప్రాతిపదికన బిజెపి రాజకీయాలు చేసింది, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కొట్లాటలతో జాట్లకు పోటీగా ముస్లింలను నిలిపారు.ములాయం సింగు యాదవ్‌ కుటుంబాన్ని చీల్చారు. లాలూ యాదవ్‌ ఇంట్లో తగాదాలు పెట్టారు అని రాకేష్‌ తికాయత్‌ దీని గురించి వక్కాణించారు. హిందూత్వ ఆధిపత్య రాజకీయాలకు సవాలుగా జీవన సమస్యలపై చివరికి రాజకీయ పార్టీలు ఏకమౌతాయా అన్నది చూడాల్సి ఉంది. సాగు చట్టాల రద్దు తరువాత నవంబరు 22న గోరఖ్‌పూర్‌లో జరిపిన సభలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌లో మహమ్మదాలీ జిన్నా (పాకిస్తాన్‌) మద్దతుదార్లను వ్యతిరేకించాల్సిన బాధ్యత జాతీయవాదుల మీద ఉందని పిలుపునిచ్చారని నళిన్‌ వర్మ తన విశ్లేషణలో పేర్కొన్నారు.


నరేంద్రమోడీ సర్కార్‌ చర్య పర్యవసానాలు పరిణామాల గురించి వెలువడిన మరికొన్నింటిని స్ధలాభావం వలన సృజించటం లేదు. రానున్న రోజుల్లో మరిన్ని విశ్లేషణలు వెలువడుతాయి. బిజెపి కనుసన్నలలో నడిచే మీడియా వాటికి తగిన చోటు కల్పించినా కల్పించకపోయినా అవి జనంలో ఏదో ఒక రూపంలో వెళతాయి. హిందూత్వ రాజకీయాలు, ఎత్తుగడలను మరింతగా బట్టబయలు చేస్తాయి. నీవు జనాలందరినీ కొంతకాలం వాజమ్మలుగా చేయవచ్చు,కొందరిని ఎల్లకాలం చేయవచ్చు గానీ, అందరినీ అన్ని వేళలా చేయలేవన్న అబ్రహాం లింకన్‌ మాటలను, ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు అన్న లెనిన్‌ బోధను ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా సదా గుర్తుంచుకోవాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మతోన్మాదం దేన్నీ వదలదు : రామాయణ ఎక్స్‌ప్రెస్‌ సిబ్బంది దుస్తులు – శబరిమల హలాల్‌ బెల్లం !

23 Tuesday Nov 2021

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

BJP, halal issue in Kerala, RSS, supremacism, uniform of Ramayan Express staff


ఎం కోటేశ్వరరావు


ఉజ్జయని పీఠాధిపతులకు కోపం వచ్చింది. ఢిల్లీలో రామాయణ ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. వెంటనే రైల్వే అధికారులు వారి డిమాండ్‌కు తలొగ్గారు. రైతులు కూడా మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలనే ముందు కేంద్రాన్ని కోరారు. వినలా, తరువాతే ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. బిజెపి పాలకులు ఏడాది పాటు వారిని నానా ఇబ్బందులకు గురిచేశారు. దేశంలో అనేక మంది పీఠాధిపతులు, లక్షలాది మంది సాధువులున్నారు. కానీ ఉజ్జయని వారికే ఆగ్రహం వచ్చింది. కొద్ది గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది.లక్షలాది మంది రైతులకు లేని బలం, పలుకుబడి కొద్ది మంది పీఠాధిపతులకు ఉందంటే దేశాన్ని నడిపిస్తున్నది మతశక్తులే అన్నది మరోసారి రుజువైంది.


ఇంతకీ వారికి కోపం ఎందుకు వచ్చింది ? రామాయణ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో రైల్వే ఒక ప్రత్యేపాకేజ్‌తో పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైళ్లు నడుపుతున్నది. దానిలో ప్రయాణించే వారికి అవసరమైన భోజన సదుపాయాలను సమకూర్చే సిబ్బందికి సాధువుల మాదిరి కాషాయ రంగు బట్టలు,రుద్రాక్షలతో ఏకరూప దుస్తులను ఇచ్చారు. ఇలా దుస్తులు వేసి సేవలందించటం హిందూమతాన్ని అవమానించటమే అని ఉజ్జయని పీఠాధిపతులకు ఆగ్రహం వచ్చింది. వాటిని విప్పించకపోతే డిసెంబరు 12న ఢిల్లీలో రైలును ఆపివేస్తామని చెప్పారు. రెండురోజుల్లో అధికారులు మార్చివేశారు. సాధువుల మాదిరి ఏకరూప దుస్తులు మతాన్ని, పీఠాధిపతులను అవమానించటమే అని ఉజ్జయని అఖారా పరిషత్‌ మాజీ ప్రధాన కార్యదర్శి అవదేష్‌ పూరీ చెప్పారు.హిందూమతాన్ని రక్షించుకొనేందుకు రైలు మార్గంపై బైఠాయిస్తామన్నారు.


ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఢిల్లీ అధికారపెద్దలకు కాషాయ రంగంటే ప్రీతి కనుక వారి మనసెరిగి రైల్వే అధికారులు సాధువుల మాదిరి సిబ్బందికి దుస్తులను నిర్ణయించారు. కొత్తగా రూపొందిచిన వాటిలో నల్లపాంట్లు, తెల్ల షర్టులతో పాటు కాషాయ రంగు మాస్కులు, చేతులకు అదే రంగు తొడుగులను ఏర్పాటు చేసి సగం హిందూత్వను కాపాడామన్నట్లుగా అధికారులు పెద్దలను సంతుష్టీకరించారు. ఒక సారి ఉన్మాదాన్ని ఎక్కించిన తరువాత అది మెజారిటీ – మైనారిటీ, జాతీయవాదం ఏదైనా సరే ఎక్కించిన వారు కూడా దాన్ని అదుపు చేయలేరు. ఒకసారి వెర్రితలలు వేసిన తరువాత వారు చేసేదేమీ లేదు. అదుపు చేసేందుకు పూనుకుంటే వారు కూడా దానికి బలైనా ఆశ్చర్యం లేదు. వారి చేతిలో ఉండదు.


కేరళలో అధికారానికి అవసరమైన సీట్లను తెచ్చుకుంటామని ప్రగల్భాలు పలికి, మెట్రోమాన్‌ శ్రీధరన్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని కూడా ప్రకటించుకున్న బిజెపి పొందిన పరాభవం తెలిసిందే. అంతకు ముందున్న ఒక్కసీటును, ఓట్లను కూడా గణనీయంగా పోగొట్టుకుంది. గతంలో శబరిమల ఆందోళనపేరుతో శాంతిభద్రతల సమస్యను సృష్టించారు. ఎన్నికల్లో లబ్దిపొందాలని చూశారు, రెచ్చగొట్టారు, విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారు.చివరికి దొంగడబ్బు పంపిణీలో వాటాలు కుదరక దొరికిపోయి కేసులను ఎదుర్కొంటున్నారు. చేసేందుకు పనేమీ లేక ఇప్పుడు కొత్త వివాదంతో జనాల మనోభావాలను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. అదేమంటే శబరిమల ఆలయానికి హలాల్‌ చేసిన బెల్లాన్ని సరఫరా చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మాంసానికి కోసే కోడి,మేక వంటిది కాదు బెల్లం, దానికి హలాల్‌ ఏమిటి ? బోడి గుండుకు మోకాలికి ముడిపెట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టగల సమర్దులు. శబరిమలకు బెల్లం సరఫరా చేసే వ్యాపారికి హలాల్‌ సర్టిఫికెట్‌ ఉన్నట్లు కనుగొన్నారట. మన దేశం నుంచి గల్ఫ్‌దేశాలకు ఎగుమతి చేసే వాటిలో మాంసంతో సహా అనేక ఉత్పత్తులు ఉంటాయి. వాటిని దిగుమతి చేసుకొనే దేశాల వ్యాపారులు హలాల్‌ ధృవీకరణ పత్రం ఉందా లేదా అని అడుగుతారు. ఉంటేనే కొనుగోలు చేస్తారు.


అందువలన అలాంటి లావాదేవీలు నిర్వహించేవారు ముస్లింలైనా మరొక మతం వారైనా హలాల్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సిందే. దాన్ని కూడా రాజకీయం చేసి పోగొట్టుకున్న మద్దతునైనా తిరిగి తెచ్చుకోవాలని బిజెపి పూనుకున్నట్లు కనిపిస్తోంది. హలాల్‌ చేసేందుకు ముస్లిం మతపెద్దలు ఆహారం మీద ఉమ్మివేస్తారంటూ సామాజికమాధ్యమంలో రెచ్చగొడుతున్నారు.శబరిమల ఆలయంలో తయారు చేసే ప్రసాదానికి హలాల్‌ సర్టిఫికెట్‌ ఉన్న బెల్లాన్ని వాడుతున్నారంటూ విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎస్‌జెఆర్‌ కుమార్‌ హైకోర్టులో ఒక పిటీషన్‌ వేశారు.వివరాల్లోకి వెళితే గతేడాది బెల్లం సరఫరా టెండరు పొందిన మహారాష్ట్ర కంపెనీల యజమానులెవరూ అసలు ముస్లింలు కాదు. ప్రస్తుతం ఏప్రిల్‌ నుంచి సరఫరా చేస్తున్న ఎస్‌పి ఆగ్రోప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ డైరెక్టర్లు సమీర్‌ సురేష్‌ పాటిల్‌, సురేష్‌ సాహెబ్‌రావు పాటిల్‌,సరితా సురేష్‌ పాటిల్‌, మతి ఉండి చేసే ఫిర్యాదులేనా ఇవి. ఆ కంపెనీ గల్ఫ్‌ దేశాలకూ బెల్లం ఎగుమతులు చేస్తోంది. వారికి హలాల్‌ సర్టిఫికెట్‌ అవసరం కనుక తీసుకున్నారు. ప్రతి సంచిమీద దాని నంబరు ముద్రించారు. దాన్ని పట్టుకొని బిజెపి రాద్దాంతం చేస్తోంది. ఈ వివాదం ద్వారా దేవస్ధానానికి నష్టం కలిగించే కుట్రవుందని అయ్యప్పతో సహా అనేక దేవాలయాలను పర్యవేక్షించే తిరువాన్కూర్‌ దేవస్ధానం బోర్డు హైకోర్టుకు తెలిపింది.


ఇదిలా ఉండగా కేరళ అంతటా పలుదుకాణాల ముందు హలాల్‌ బోర్డులు కొత్తగా వెలిశాయంటూ వాటిని నిషేధించాలని బిజెపి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు నవంబరు 25న ప్రదర్శనలు జరుపుతామని ప్రకటించింది. ఇదిసాంఘిక దురాచారమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుధీర్‌ వర్ణించారు.హలాల్‌ ఒక మతాచారమని తాము భావించటం లేదని ఇస్లామిక్‌ పండితులు కూడా సమర్ధిస్తారని తాను అనుకోవటం లేదని, ఉగ్రవాద సంస్ధలు కేరళ సమాజంలో మతపరమైన అజెండాను అమలు జరిపేందుకు పూనుకున్నాయని, మతపరంగా చేస్తే పెద్దలు పూనుకొని సరి చేయాలన్నారు. బిజెపి నేతలు మత అజెండా గురించి మాట్లాడటం దొంగేదొంగ అనటమే. సుధీర్‌కు మద్దతుగా రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్‌ మాట్లాడుతూ హలాల్‌ బోర్డులు అమాయకంగా, అనుకోకుండా పెట్టినవి కాదన్నారు. జనాన్ని చీల్చేందుకు చేస్తున్నారన్నారు. హిందూత్వ బిజెపితో కేరళ కాంగ్రెస్‌(ఎం) అనే క్రైస్తవ పార్టీ నేత పిసి జార్జి కూడా గొంతుకలిపారు.హలాల్‌ ఆహారం మతఛాందసంలో భాగమే అన్నారు. ఆహారం మీద ఉమ్మటం ముస్లింలకు ఒక విధి, మూడుసార్లు ఉమ్ముతారని, శబరిమల ప్రసాదానికి హలాల్‌ బెల్లాన్ని వినియోగించరాదని క్రైస్తవమత టీవీ ఛానల్‌ ఒకదానిలో చెప్పారు.

బెల్లానికి హలాల్‌తో ముడిపెట్టటాన్ని బిజెపి అధికార ప్రతినిధి సందీప్‌ వారియర్‌ ఫేస్‌బుక్‌లో రాస్తూ తప్పుపట్టారు. మతాల వారు ఒకరి మీద ఒకరు ఆర్ధికపరమైన ఆంక్షలతో జీవించలేరని పేర్కొన్నారు. కోజికోడ్‌లోని పారగాన్‌ హౌటల్‌ మీద సామాజిక మాధ్యమంలో చేస్తున్న దాడిని తాను ఖండించానని అయితే దానిని మీడియా పార్టీ వ్యతిరేఖ వైఖరిగా వక్రీకరించిందని, దాంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఆదేశం మేరకు పోస్టును వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నిజానికి సందీప్‌ స్పందన తరువాత బిజెపి ఇరకాటంలో పడి అతని మీద వత్తిడి తెచ్చిందన్నది స్పష్టం. ఇతర మతాల మీద విశ్వాసం ఉన్నవారు కూడా హలాల్‌ హౌటళ్లలో తినేందుకు, పని చేసేందుకు వస్తారని, సేవారంగం దెబ్బతింటే ఎన్నోకుటుంబాలు దారిద్య్రంలోకి కూరుకుపోతాయని, ఇలాంటి అంశాలపై చర్చలో ఉండాల్సింది హేతువు తప్ప ఉద్రేకం కాదన్నారు సందీప్‌.


వివిధ సామాజిక తరగతుల మధ్య లౌకిక వారధిగా ఉన్న ఆహారం మీద సంఘపరివార్‌ దాడిని కేంద్రీకరించిందని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయ రాఘవన్‌ విమర్శించారు. సమాజంలోని మత సామరస్యతను దెబ్బతీసేందుకు ఈ వివాదాన్ని ముందుకు తెచ్చారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ, కొడియరి బాలకృష్ణన్‌ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో మత సామరస్యతను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం చేసినా మొత్తం మీద కేరళలో ఫలించలేదని బాలకృష్ణన్‌ అన్నారు.హలాల్‌ చర్చ అనవసరమని తెలిసి కూడా ఇక్కడ వివాదాన్ని సృష్టించేందుకు పూనుకున్నారని అన్నారు.


హలాల్‌ ఆహారంపై విష ప్రచారం చేస్తున్న శక్తుల మీద చర్య తీసుకోవాలని రాష్ట్ర రెస్టారెంట్లు, హౌటల్స్‌ సంఘం ముఖ్యమంత్రి విజయన్ను కోరింది. గుజరాత్‌లో సంఘపరివార్‌ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి విభజన తేవటంలో విజయం సాధించిందని, అక్కడ ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారు నిర్వహించే వాటిని పాకిస్తాన్‌ హౌటల్స్‌ అని పిలుస్తారని ఎంఏ బేబీ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌లోని శక్తులకు పోటీగా ఇతర మతాలకు చెందిన ఛాందసవాదులు కొత్త డిమాండ్లను ముందుకు తేవచ్చని స్వచ్చమైన శాఖాహారం వంటి బోర్డులకు వ్యతిరేకంగా డిమాండ్లు ముందుకు రావచ్చని అన్నారు.నిజానికి ఇలాంటి బోర్డుల వలన వినియోగదారులు తాము కోరుకుంటున్న ఆహారం, పానీయాలు దొరికేదీ లేనిదీ తెలుసుకుంటారని అన్నారు.ఇలాంటి ఛాందసడిమాండ్లకు ప్రభుత్వం లొంగదని స్పష్టం చేశారు. సంఘపరివార్‌ ముందుకు తెచ్చిన హలాల్‌ డిమాండ్‌ సమాజ-జాతీయ-రాజ్యాంగ వ్యతిరేక వైఖరని, కేరళలో అది కుదరదని బేబీ చెప్పారు.
తెలుగునాట ఇప్పటికీ అనేక ప్రాంతాలలో హౌటళ్లు, మెస్‌లకు బ్రాహ్మణ, ఆర్య-వైశ్య, రెడ్డి, క్షత్రియ, చౌదరి అని కులాలు, విజయవాడ, ఏలూరు, గుంటూరు భోజనం అనీ, హైదరాబాద్‌ బిర్యాని, ఉడిపి, కల్కూర ఇలా అనేక రకాల పేర్లను తగిలించటం తెలిసిందే. రంజాన్‌ మాసంలో అనేక పట్టణాలలో ప్రత్యేక వంటకంగా ముస్లింలు నిర్వహించే హౌటళ్లలో విక్రయించే హలీంను కుల,మతాలతో నిమిత్తం లేకుండా అందరూ లొట్టలు వేసుకుంటూ తినే అంశం తెలిసిందే. ఇక బిర్యాని సంగతి చెప్పనవసరం లేదు.అక్కడ హలాల్‌ క్రతువు నిర్వహిస్తారని తెలిసిందే.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ధనికులపై అదుపు – ఉమ్మడి సౌభాగ్యం దిశగా చైనా అడుగులు !

25 Wednesday Aug 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Social Inclusion

≈ Leave a comment

Tags

China’s ‘common prosperity’, common prosperity for all, Xi Jinping


ఎం కోటేశ్వరరావు

చైనా అధినేత గ్జీ జింపింగ్‌ ఆగస్టు 17న చేసిన ప్రసంగంలో పదే పదే ప్రస్తావించిన ” ప్రజల ఉమ్మడి సౌభాగ్యం ” అనే పదం గురించి ప్రపంచంలో అనేక మంది దాని అర్ధం ఏమిటబ్బా అని మల్లగుల్లాలు పడుతున్నారు.ముఖ్యంగా సోషలిస్టు విధానం నుంచి వైదొలిగిన చైనా ”ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాన్ని” అనుసరిస్తున్నదని సంతృప్తి ( సోషలిజం కాదంటున్నారు గనుక పోనీలే ఏదో ఒక పెట్టుబడిదారీ విధానం అని) చెందుతున్నవారికి ఇది మింగుడు పడటం లేదు. కావాలంటే దిగువ వారిని పైకి తీసుకురావచ్చు తప్ప పెరిగేవారిని అదుపు చేసే పితలాటకం ఏమిటి అని చిరచిరలాడుతున్నారు. అచిర కాలంలోనే అద్భుత విజయాలు సాధించిన చైనా ప్రయాణం మరో మలుపు తిరగనుందా ? తన ఎనిమిది సంవత్సరాల పాలనా కాలంలో అడపాతడపా దేశ ఉమ్మడి సౌభాగ్యం గురించి ప్రస్తావన చేస్తున్న అధ్యక్షుడు గ్జీ గింపింగ్‌ ఐదు సంవత్సరాల క్రితం ఒక ప్రసంగంలో క్రీస్తుపూర్వం 571-479 మధ్య కాలంలో జీవించిన చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్‌ తన శిష్యులకు చెప్పిన ఒక లోకోక్తిని ఉటంకించారు.” తెలివైన నేత దారిద్య్రాన్ని గురించి కాదు అసమానతల గురించి ఆందోళన చెందుతాడు.తన జనం తక్కువ మందే ఉన్నారని కాదు వారిలో తీవ్ర విభజన ఉందని ఆందోళన చెందుతాడు.” అని చెప్పాడు.


చైనాలో అసమానతలు పెరుగుతున్నాయన్న విమర్శలు, ఆవేదన, ఆందోళనలు గత కొంత కాలంగా ఇంటా బయటా పెరుగుతున్న విషయం తెలిసిందే. చైనా 2021లో 1,058 మంది బిలియనీర్లతో ప్రపంచంలో అగ్రస్ధానంలో ఉంది, 696మందితో అమెరికా, 177 మందితో మన దేశం మూడవ స్ధానంలో ఉంది. ఈ అంకెలను చూసి చైనాలో ఉన్నది పెట్టుబడిదారీ విధానం తప్ప సోషలిస్టు వ్యవస్ధ కాదని కొంత మంది కమ్యూనిస్టులు కూడా భావించుతున్నారు. గ్జీ లేదా కమ్యూనిస్టు పార్టీ మాటలకు అర్ధం తెల్లవారేసరికి చైనాలోని బిలియనీర్ల సంపదలు మొత్తం స్వాధీనం చేసుకొని అందరికీ సమంగా పంచబోతున్నారని కాదు, కొత్తగా ఎవరినీ ధనవంతులను కానివ్వకుండా అడ్డుకోనున్నారనీ కాదు. పేదలు-ధనికుల మధ్య అంతరాన్ని మరింతగా పెరగటాన్ని అనుమతించకూడదని ఈ ఏడాది జనవరిలో జింపింగ్‌ చెప్పాడు. నిర్దిష్టమైన కార్యక్రమం గురించి ఎలాంటి స్పష్టత ఇంకా లేదు.
ఆగస్టు 17 ప్రసంగంలో గ్జీ పదే పదే ఉమ్మడి సౌభాగ్యం గురించి చెప్పటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది కాలంలో తన ప్రసంగాల్లో 30సార్లు అపదాన్ని వినియోగిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 65సార్లు చెప్పినట్లు అమెరికాలోని జార్జియా విశ్వవిద్యాలయలో చైనా రాజకీయ పదజాల అధ్యయనవేత్త మరియా రెపినికోవా వెల్లండించారు. గ్జీ ఉద్దేశ్య బలాన్ని ఇది సూచిస్తున్నదన్నారు. నేతల నినాదాలు విధాన దిశ లేదా మార్పును సూచిస్తాయని,కొన్ని సందర్భాలలో అసందిగ్గత, భాష్యాల సర్దుబాటుకు అవకాశం కూడా ఇస్తారని చెప్పారు. ఆగస్టు 17వ తేదీన కమ్యూనిస్టు పార్టీ ఆర్ధిక మరియు విత్త వ్యవహారాల కమిటీ సమావేశంలో గ్జింపింగ్‌ ప్రసంగించారు. ఆదాయ పంపిణీ, అక్రమ మరియు సహేతుకంగానీ ఆదాయాల సమస్యలను ఎదుర్కొనేందుకు, అధిక ఆదాయాలను సహేతుకంగా సర్దుబాటు చేసేందుకు గాను అధికపన్నులు, సామాజిక భద్రత, చెల్లింపుల బదలాయింపుల వంటి విధానాలను ఈ సమావేశంలో చర్చించారు.


ఈ సమావేశం జరిగిన మరుసటి రోజు చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌లో ఉమ్మడి సౌభాగ్యం అంటే క్లుప్తంగా ఏమిటి అంటూ ఒక గీతల చిత్రాలతో గ్జిన్హువా వార్తా సంస్ధ విడుదల చేసిన ఒక వివరణ ప్రచురించారు.” మరింత న్యాయమైన పంపిణీ మరియు అత్యంత నాణ్యమైన అభివృద్ది మీద చైనా దృష్టి సారించింది. ఉమ్మడి సౌభాగ్యం అంటే ఏమిటి ? భౌతిక మరియు సాంస్కృతిక పరిభాషలో ప్రతి ఒక్కరూ సంపదను పంచుకోవటాన్ని ఉమ్మడి సౌభాగ్యం అనే మాట చెబుతున్నది.కొంత మంది మాత్రమే భాగ్యవంతులుగా ఉండకూడదు. సమానత్వ రహిత విశ్వాసిగా ఉండకూడదు. ఉమ్మడి సౌభాగ్యానికి ప్రాతిపదిక ఏమిటి ? జనాలు తమ అభివృద్ధి సామర్ధ్యాలను వృద్ది చేసుకొనేందుకు మెరుగైన పరిస్ధితులను కల్పించటం. మరింత ఎక్కువ మంది ధనవంతులు అయ్యేందుకు వీలుకలిగించే పరిసర వాతావరణాన్ని కల్పించటం. ఉమ్మడి సౌభాగ్య సూత్రాలేమిటి ? ప్రతి ఒక్కరూ లబ్ది పొందేలా ఒక సహేతుకమైన పంపిణీ వ్యవస్ధను ఏర్పాటు చేయటం. ప్రజల సంక్షేమానికి సదుపాయాలు కల్పించటం. క్రమబద్ద మరియు పురోగామి పద్దతిలో ఉమ్మడి సౌభాగ్యాన్ని ప్రోత్సహించటం. ఉమ్మడి సౌభాగ్యాన్ని సాధించేందుకు మార్గాలేమిటి ? ఆదాయ పంపిణీకి అవసరమైన ప్రాధమిక వ్యవస్ధాపరమైన సదుపాయాలను కల్పించటం.అధిక ఆదాయాన్ని సర్దుబాటు చేయటం, అక్రమ ఆదాయాన్ని నిషేధించటం. మధ్య ఆదాయ తరగతి పరిమాణాన్ని పెంచటం. తక్కువ ఆదాయ తరగతుల సంపాదన పెంచటం. తదుపరి పనిపై కేంద్రీకరణ ఏమిటి ?అందరికీ సమంగా అందేట్లుగా ప్రజా మౌలిక సదుపాయాలను మరిన్ని నిర్మించటం. మేథోసంపత్తి హక్కులను రక్షించటం, చట్టబద్దమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదనకు అవకాశం ఇవ్వటం, పెట్టుబడి ఆరోగ్యవంతమైన పద్దతుల్లో పెరిగేందుకు వీలు కల్పించటం. గ్రామీణ ప్రాంతాలు, రైతులలో సంపదలు పెరిగేట్లుగా ప్రోత్సహించటం.”


గ్జిన్హువా ప్రభుత్వ అధికార సంస్ద గనుక కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వ ఆలోచనకు ప్రతిబింబంగా తీసుకొని ప్రపంచవ్యాపితంగా మీడియా సంస్దలు ఉమ్మడి సౌభాగ్యం మీద వార్తలు, వ్యాఖ్య, విశ్లేషణలు ఇచ్చాయి. పెద్ద మొత్తాలలో ఆదాయాలున్న కంపెనీల మీద చర్యల గురించి ఊహాగానాలను ప్రచురించారు. ఉమ్మడి సౌభాగ్యం అనే భావనను మావో జెడాంగ్‌ ముందుగా పార్టీలో ప్రవేశపెట్టారని, ముందుగా ఆర్ధిక వృద్ధి మీద కేంద్రీకరించాలని, అది కొంత మంది జనాలు ధనికులు అయ్యేందుకు అనుమతిస్తుందని, ఉమ్మడి సౌభాగ్యం తరువాత వస్తుందని చెప్పిన డెంగ్‌ గ్జియావోపింగ్‌ తన ఉపన్యాసాల్లో ఆ పదాలను ఉపయోగించలేదని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యానించింది. చైనా సంపదల పంపిణీలో అసమానతల గురించి అక్కడి నాయకత్వం దాచిందేమీ లేదు. అయితే అధికారికమైన సమాచారం లేని కారణంగా విదేశీ మీడియాలో వచ్చే అంకెలను పూర్తిగా విశ్వసించలేము అలాగని తోసిపుచ్చలేము. ఒక సంస్ధ లేదా విశ్లేషకులు ఇచ్చిన సమాచారం మరొక దానికి వెళ్లేసరికి పొంతన ఉండదు. ఉదాహరణకు చైనా ఉమ్మడి సౌభాగ్యం గురించి తాజాగా ఇచ్చి బ్లూమ్‌బెర్గ్‌ వార్త ప్రకారం మధ్యతరగతి వారు 40కోట్ల మంది కాగా అమెరికన్‌ పూ సర్వే సంస్ద ఇచ్చిన ప్రకారం 2018లోనే 70.7 కోట్ల మంది ఉన్నారు. అంటే జనాభాలో 50.8శాతం మంది. వీరిలో కూడా ఆదాయ తేడా ఉంటుంది.ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 2000-2018 మధ్య బ్రిక్స్‌ దేశాలలో మధ్య తరగతి జనాభాలో జరిగిన మార్పు వివరాలు ఇలా ఉన్నాయి.(ఆధారం చైనాపవర్‌ డాట్‌ క్రైసిస్‌ డాట్‌ ఓఆర్‌జి)
దేశం××2000లో జనాభాలోశాతం×× 2018లో శాతం×××× మార్పు శాతం
చైనా ×××××× 3.1 ××× 50.8 ×××× 47.7
రష్యా ×××××× 28.2 ××× 71.5 ×××× 43.3
బ్రెజిల్‌ ×××× 30.3 ××× 51.4 ×××× 21.1
ద.ఆఫ్రికా×××× 15.1 ××× 22.5 ×××× 7.4
భారత్‌ ××××× 1.2 ××× 5.7 ×××× 4.5

2035 నాటికి అందరికీ ఉమ్మడి సౌభాగ్యం అన్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఎంతో పురోగతి సాధించాల్సి ఉందని గ్జీ జింపింగ్‌ గతేడాదే చెప్పారు. పైలట్‌ ప్రాజెక్టుగా 2025నాటికి 45శాతం ఆదాయాన్ని పెంచటం ద్వారా అంతరాన్ని తగ్గించేందుకు ఝెజియాంగ్‌ రాష్ట్రాన్ని ఎంచుకున్నారు.అసమానతల తగ్గింపునకు అధిక ఆదాయం ఉన్నవారిపై పన్నులు పెంచాలని ఆమొత్తాలను దిగువ ఆదాయం ఉన్నవారి సంక్షేమానికి ఖర్చు చేయాలన్నది ఒక ఆలోచన. ఎంత ఆదాయం ఉన్నవారి మీద ఎంత పెంచాలి అనే కసరత్తు జరుగుతోంది. అక్రమ ఆదాయం, పన్ను ఎగవేతల మీద ముందుగా దృష్టి పెడతారు. అది ముందుగా పార్టీ కార్యకర్తలతోనే ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఎకానసమిస్టు పత్రిక రాసింది.హాంగ్‌ఝౌ పట్టణంలోని 24,800 మంది కార్యకర్తలు స్ధానికంగా ఉన్న సంస్ధల నుంచి అక్రమంగా రుణాలు తీసుకోవటం లేదా స్వప్రయోజనాలకు పాల్పడిందీ లేనిదీ స్వచ్చందంగా వెల్లడించాలని పార్టీలో అవినీతి నిరోధక విభాగం కోరినట్లు ఆ వార్తలో పేర్కొన్నది. అధిక ఆదాయం కలిగిన వారి నుంచి స్వచ్చందంగా విరాళాల ద్వారా నిధులు సమీకరించాలని కూడా భావిస్తున్నారని, ఆ కారణంగానే ఆగస్టు 17 సమావేశం తరువాత ఇంటర్నెట్‌ బడా కంపెనీ టెన్‌సెంట్‌ 770 కోట్ల డాలర్లను సామాజిక కార్యక్రమాలకు విడుదల చేసిందని పేర్కొన్నది. రూళ్ల కర్ర మాదిరి అన్ని చోట్లా ఒకే రకమైన నిబంధనల అమలు కాకుండా స్దానికంగా ఉన్న పరిస్దితిని బట్టి వర్తింప చేయాలని కోరటంతో ఆమేరకు పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించిన ఝెజియాంగ్‌ రాష్ట్రంలోని పట్టణాలలో కసరత్తు ప్రారంభమైందని, రాష్ట్ర ఆదాయంలో కార్మికుల వాటాను 50శాతానికి పెంచాలన్నది ఒక నిర్ణయమని ఎకానమిస్టు పేర్కొన్నది.


ఉమ్మడి సౌభాగ్య పధకం అమల్లో భాగంగానే ఇటీవల టెక్నాలజీ కంపెనీల మీద నియంత్రణ చర్యల ప్రారంభమని సిఎన్‌బిసి వ్యాఖ్యాత పేర్కొన్నారు.ఆచరణాత్మకంగా అమలు ఉంటుందని ఎకానమిస్ట్‌ పత్రిక ఆర్ధికవేత్త యూ సు వ్యాఖ్యానించారు. అధిక ఆదాయం గలవారు, పెట్టుబడి మీద వచ్చే ఆదాయంపై పన్నులు పెంచుతారని ఈ చర్య పెట్టుబడులు తగ్గేందుకు, బయటకు పోయేందుకు దారితీస్తుందని, ఆర్ధిక వ్యవస్ధ మీద పున:పంపిణీ విధానాల ప్రభావాన్ని చైనా ప్రభుత్వం విస్మరించజాలదని చెప్పారు. ఫ్రెంచి ఆర్ధికవేత్త థామస్‌ పికెటీ బృందం 2019లో తమ విశ్లేషణలో చెప్పినదాని ప్రకారం 1978లో అగ్రభాగంలోని పదిశాతం మందికి 27శాతం ఆదాయం వస్తే 2015 నాటికి అది 41శాతానికి పెరిగింది. తమ దేశంలో దుర్భరదారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించినట్లు గతేడాది చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఆర్ధిక వ్యవస్ధలో మధ్య ఆదాయ తరగతి వాటాను పెంచేందుకు చైనా చర్యలు తీసుకుంటున్నదని మోర్గాన్‌ స్టాన్లే విశ్లేషకులు పేర్కొన్నారు. చైనాలోని బడా టెక్నాలజీ కంపెనీలు చిన్న సంస్ధలను మింగివేస్తున్నాయనే వార్తలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం కొన్ని నియంత్రణ చర్యలు తీసుకుంది. రెండు నెలల కాలంలో ఆలీబాబా, జెడిడాట్‌కామ్‌ కంపెనీల వాటాల ధరలు స్టాక్‌ఎక్సేంజ్‌లో 29శాతం పడిపోయాయి. మరికొన్ని కంపెనీలదీ అదే పరిస్ధితి. ఆర్ధిక విధానంలో వచ్చిన మార్పును విదేశీ మదుపుదార్లు అర్ధం చేసుకొని దానికి అనుగుణ్యంగా మారాల్సి ఉంటుందని షాంఘైలోని ఒక సంస్ధ ప్రొఫెసర్‌ ఝు నింగ్‌ చెప్పాడు. కొంత మందినైనా ముందు ధనవంతులను కానిద్దాం అనే విధానానికి ఇది విరుద్దమని అన్నాడు.

జాక్‌ మా ఆధీనంలోని అలీబాబా కంపెనీని విదేశీ సంస్దల పోటీ నుంచి తట్టుకొనేందుకు ప్రభుత్వం సంవత్సరాల పాటు కాపాడింది. దాని అనుబంధ యాంట్‌ గ్రూపు వాటాల విక్రయాన్ని గతేడాది నవంబరులో నిలిపివేసింది. ఈఏడాది ఏప్రిల్‌లో 18.23 బిలియన్‌ యువాన్ల అపరాధ రుసుం విధించింది. ఆహార పదార్దాలను సరఫరా చేసే జొమాటో, స్విగ్గీవంటి సంస్ధలలో పని చేసే వారికి స్ధానిక కనీస వేతనాలు చెల్లించాలని నియంత్రణ సంస్ద ఆదేశాలు జారీ చేసింది. రోజు వారీ వస్తుసరఫరాలో కొన్ని సంస్దల గుత్తాధిపత్యాన్ని తొలగించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చిన్న వ్యాపారుల స్వాగతిస్తున్నారు. పోటీ లేని కారణంగా పదిహేను నుంచి 25శాతం వరకు తమ నుంచి కమిషన్‌ డిమాండ్‌ చేస్తున్నారని, ఎక్కువ కంపెనీలు రంగంలో ఉంటే తమకు బేరమాడే శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.యాప్‌ల ద్వారా చిన్న దుకాణాల వారు ఆర్డర్లు తీసుకొని తామే సరఫరా చేస్తున్నారు. చైనాలో 14 కోట్ల మంది చిన్న దుకాణాల వారున్నారని అంచనా. ఇప్పటి వరకు పిల్లలకు ట్యూషన్లు చెప్పేందుకు అమెరికా తదితర విదేశీ మదుపుదార్లు పెద్దమొత్తాలను పెట్టుబడులు పెట్టి తలిదండ్రుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. ట్యూషన్లు చెప్పే కంపెనీలను లాభాల ప్రాతిపదికన నడపకూడదని, విదేశీ పెట్టుబడులను అనుమతించరాదని గత నెలలో చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అలాంటి కంపెనీల వాటాల ధరలు పతనమయ్యాయి.


చైనా ప్రభుత్వం అక్కడి టెక్నాలజీ సంస్దలపై నియంత్రణ చర్యలు తీసుకుంటున్న కారణంగా అక్కడి సంస్దల్లో పెట్టుబడులు పెట్టేవారు వేరే దేశాలను చూసుకుంటారని, అందువలన మన దేశంలోని అంకుర సంస్దలు లబ్ది పొందవచ్చని కొందరు చెబుతున్నారు. నిజంగా అలాంటి వారు ముందుకు వస్తే అభ్యంతర పెట్టాల్సినపని లేదు. మనం అభివృద్దిలో చైనాతో పోల్చుకుంటున్నాం, వీలైతే దాన్ని అధిగమించి పోవాలని చెబుతున్నారు. అంతకంటే కావాల్సింది ఏముంది.పైన చెప్పుకున్న వివరాల ప్రకారం కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండే మధ్య తరగతి ఆదాయవర్గాన్ని పెంచకుండా అది సాధ్యం కాదు. అందువలన మన దేశంలో దారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించటం, క్రమంగా మధ్యతరగతి, ధనికులను ఎలా పెంచటమా అన్నదే సమస్య. ఆచరణను చూస్తే ఆ దిశగా ఎలాంటి ఆలోచనా లేదు, చర్యలూ లేవు.

ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమైన తరువాత అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో వేతనాల వాటా పడిపోతోంది. దీనికి సాంకేతికంగా వచ్చిన మార్పులతో ఉత్పత్తి పెరగటం, కార్మికులు తగ్గటం వంటి కారణాలు కూడా ఉన్నప్పటికీ వేతనాల శాతం పడిపోతోంది. ఆ ధోరణికి భిన్నంగా వేతనాల శాతాన్ని పెంచాలని చైనా తలపెట్టింది. ఈ కారణంగానే గతంలో తక్కువ వేతనాలు ఉన్నాయని వచ్చిన అనేక కంపెనీలు ఇప్పుడు చైనా కంటే తక్కువ వేతనాలు దొరికే దేశాలకు మారిపోవాలని చూస్తున్నాయి. అయితే అవి బయటకు పోతే అతి పెద్ద చైనా మార్కెట్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. అందువల్లనే అనేక కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. నూతన పరిస్ధితులకు అనుగుణ్యంగా సర్దుబాటు చేసుకుంటున్నాయి. సేవారంగంలోని తాత్కాలిక కార్మికుల (జోమాటో, స్విగ్గీ వంటివి) వేతనాలు పెంచిన కారణంగా చైనాలో ఆహార సరఫరా చేసే కంపెనీ మెయిటువాన్‌ షేర్‌ ధర 18శాతం పడిపోయింది. ఎక్కడ అయితే తృప్తి, సమ్మతము ఉంటుందో అక్కడ ప్రజల తిరుగుబాట్లు ఉండవు అన్న కన్ఫ్యూషియస్‌ ప్రవచనాన్ని గ్జీ ఉటంకించారు. ఆ దిశగా చైనా చర్యలు ఉన్నాయని చెప్పవచ్చు.చైనా మాదిరి అభివృద్ది చెందాలని చెబుతున్నవారు దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జాతీయ వాదం అంటే నాడు వుత్తేజం, నేడు వున్మాదం !

10 Sunday Mar 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion, Uncategorized

≈ Leave a comment

Tags

370 article, Aricle 370 myths and facts, article 35A, Hindutva nationalism, Kashmir problem, nationalism then and now, nationalism then inspiration now frenzy

Image result for nationalism india

ఎం కోటేశ్వరరావు

అడవారి మాటలకు అర్ధాలే వేరులే అని సినీ కవి చెప్పిన సందర్భం ఏదైనా కావచ్చు, మహిళలకు ఆ లక్షణాన్ని ఆపాదించటం గౌరవం ఇచ్చే వర్ణన కాదు. అయితే అలా అన్నవారి మీద మహిళలు వుడుక్కున్నారేమోగాని ఎక్కడా దాడులు జరిపినట్లు తెలియదు. ఇప్పుడు దేశంలో అనేక పదాలకు అర్దాలనే మార్చివేస్తున్నారు.కాదన్నవారిని వాదనల్లో ఖండించటం ఒక పద్దతి, భౌతిక దాడులకు తెగబడటమే ప్రమాదకరం. యుద్దం వద్దు అనటం, ఇరుగుపొరుగు దేశాలతో సామరస్యం కోరుకోవటం దేశద్రోహం, యుద్ధం కోరుకోవటం, రెచ్చగొట్టటం దేశభక్తి. పరమతం వారి మీద ద్వేషం వెలిబుచ్చటం దేశభక్తి, ప్రేమించకపోతే మానే వారి మానాన వారిని వుండనివ్వమనటం దేశద్రోహం. హిందుత్వమే ఇండియా, ఇండియా అంటే హిందుత్వమే కాదన్నవారి సంగతి చూస్తాం అనే బెదిరింపులు. ఒక నాడు జాతీయ వాది అంటే వుత్తేజానికి మారుపేరు. నేడు జాతీయ వాది అంటే వున్మాదానికి చిరునామా ! 1947ఆగస్టు 15 ముందు, తరువాతకు ఎంత తేడా ! కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించిన ఆర్టికల్‌ 370ని వ్యతిరేకించిన వారు జాతీయవాదులు, సమర్ధించిన వారు దేశద్రోహులు. అంటే ఎప్పటి నుంచో వున్న ప్రత్యేక రక్షణలు, సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు కోరి మన దేశంలో విలీనానికి కారకుడైన షేక్‌ అబ్దుల్లా ఇప్పటి నిర్వచనం ప్రకారం దేశద్రోహి. కాశ్మీర్‌ విలీనాన్ని వ్యతిరేకించి, స్వతంత్రరాజ్యంగా వుంటామని ప్రకటించిన నాటి కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌(తరువాత తప్పనిసరై అంగీకరించటం వేరే విషయం), ఆయనకు మద్దతు తెలిపిన ఆర్‌ఎస్‌ఎస్‌ వారు దేశభక్తులు. చరిత్ర తెలియకపోతే కొత్త తరాలు ఇదే నిజమనుకొనే ప్రమాదం వుంది.

భారత్‌ విభజనకు నిర్ణయం జరిగిపోయింది. ఆ సమయానికి జమ్మూ కాశ్మీర్‌ బ్రిటీష్‌ వారి సార్వభౌమత్వానికి లోబడిన ఒక స్వయంప్రతిపత్తి కలిగిన ఒక సంస్ధానం.షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్సు పార్టీ కాశ్మీర్‌ సంస్ధానం భారత్‌లో విలీనం కావాలని కోరింది. రాజు హరిసింగ్‌ స్వతంత్రంగా వుంటామని ప్రకటించాడు. 1947 నవంబరులో ఏర్పడిన ఆల్‌జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ పార్టీ ( అంతకు ముందు ఆల్‌జమ్ము అండ్‌ కాశ్మీర్‌ రాజ్య హిందూ సభ పేరుతో పని చేశారు) రాజు హరిసింగ్‌ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తాము మద్దతుగా వుంటామని ప్రకటించింది. అంటే కాశ్మీరు వేర్పాటు వాదానికి సై అన్నట్లే కదా ! ఈ పార్టీని ఏర్పాటు చేసిన అపర దేశభక్తులు ఎవరంటే ఇంకెవరు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బలరాజ్‌ మధోక్‌ మహాశయుడే. అదే ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన జనసంఘ్‌తో అది వారే వీరుగా కలసి పని చేసింది, చివరకు 1963లో విలీనమైంది. నాటి కాంగ్రెస్‌ నాయకత్వం మన దేశంలో కాశ్మీర్‌ విలీనానికి అనుకూలంగా వున్న షేక్‌ అబ్దుల్లాతో మాట్లాడటం అంటే అబ్దుల్లా ఆ రాష్ట్రంలో అధికారానికి రావటమే కనుక అది ఆమోదంగాని ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘం మొదటి నుంచి కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్‌ను రాజ్యాంగంలో చేర్చటానికి మొదటి నుంచి వ్యతిరేకించింది తప్ప వేరే ఇతర కారణాలేమీ లేవు. ఆర్‌ఎస్‌ఎస్‌ షేక్‌ అబ్దుల్లాను వ్యతిరేకించటం వెనుక ముస్లిం విద్వేషంతో పాటు అది భూస్వాముల పక్షంలో వుండటం కూడా ఒక కారణం. కాశ్మీర్‌ సంస్ధానంలో భూస్వాములలో అత్యధికులు హిందువులే. షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్సు భూసంస్కరణలు అమలు జరపాలని కూడా కోరింది. అదేగనుక అధికారంలోకి వస్తే తమ భూములు ఎక్కడ పోతాయోనని భూస్వాములకు ప్రాతినిధ్యం వహించే కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ స్వతంత్రరాజ్యంగా వుంటామని చెప్పిన రాజు హరిసింగ్‌కు మద్దతు ఇచ్చింది. పాకిస్దాన్‌ గిరిజనుల ముసుగులో కాశ్మీర్‌ ఆక్రమణకు ఎప్పుడైతే పూనుకుందో అప్పుడు విధిలేని స్ధితిలో రాజు హరిసింగ్‌ కేంద్ర ప్రభుత్వ సాయం కోరాడు. దానికి అనుగుణంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా తన వైఖరి మార్చుకుంది. అయితే భారత్‌లో పూర్తిగా విలీనం కావటానికి మద్దతు ఇస్తాం తప్ప కమ్యూనిస్టులు ఎక్కువగా వున్న షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని డోగ్రా(హిందువులు) వ్యతిరేక ప్రభుత్వానికి తాము వ్యతిరేకమని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బలరాజ్‌ మధోక్‌ అన్నాడు. దానికి అనుగుణ్యంగానే షేక్‌ అబ్దుల్లా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 1949లో కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ ఆందోళనలు చేపట్టింది.ఎలాంటి షరతలు లేకుండా కాశ్మీరును దేశంలో విలీనం చేయాలని కోరింది. 1951లో ఏర్పాటయిన జనసంఘ్‌కు కాశ్మీరులో ప్ర జాపరిషత్‌ అనుబంధం అయింది. దాని డిమాండ్‌ మేరకు జనసంఘం కూడా కాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని ప్రారంభం నుంచీ వ్యతిరేకించింది. దాని వారసురాలు బిజెపి కనుక అదే డిమాండ్‌ను వదలకుండా పట్టుకుంది. 1963వరకు కాశ్మీర్‌లో జనసంఘం శాఖను ఏర్పాటు చేయలేదు. కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ పేరుతోనే కధ నడిపించారు.

కాశ్మీర్‌కు ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తే ఏమౌతుంది అని ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం, దాని ప్రచారాన్ని వెనుకా ముందు ఆలోచించకుండా బుర్రకు ఎక్కించుకున్న అమాయకంగా ప్రశ్నిస్తారు. వారికి ఒకటే సూటి ప్రశ్న వుంటే జరిగే నష్టం ఏమిటి, వున్నందువలన దేశానికి జరిగిన ఇప్పటి వరకు జరిగిన నష్టం ఏమిటి అంటే వారివద్ద కుంటిసాకులు తప్ప సరైన సమాధానం లేదు. రాజ్యాంగంలో కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక ఆర్టికల్స్‌, రక్షణలు కేవలం కాశ్మీర్‌కు మాత్రమే వున్నాయా ?

కాశ్మీర్‌కు వర్తించే ఆర్టికల్‌ 35ఏ అమలును సవాలు చేస్తూ చారు వాలి ఖన్నా అనే మహిళ పిటీషన్‌ దాఖలు చేశారు. తాను రాష్ట్ర నివాసినే అయినప్పటికీ తన పిల్లలు జమ్మూకాశ్మీరులో ఇల్లు కొనుక్కోవటానికి అవకాశం లేదని, ఇది కాశ్మీర్‌ మహిళల పట్ల వివక్ష కాదా అన్నది ఆమె ప్రశ్న. కాశ్మీరీ పండిట్‌ అయిన చారు వాలి ఖన్నా సుప్రీం కోర్టులో న్యాయవాది.కాశ్మీరేతర వ్యక్తిని వివాహం చేసుకొని ఢిల్లీలో స్ధిరపడ్డారు. తాను కాశ్మీరులోనే జన్మించినప్పటికి ఇప్పుడు అక్కడ ఇల్లు కొనుక్కోవటానికి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టిందని ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కు విరుద్దమని వాదిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో అమలులో వున్న ఆర్టికల్‌ 35ఏ ప్రకారం శాశ్వత నివాసుల జాబితాలో వున్నవారే ప్రభుత్వ వుద్యోగాలు చేయటానికి, ప్రభుత్వ లేదా ప్రభుత్వ సాయం పొందే విద్యా సంస్ధలలో చేరటానికి, భూమి, ఇతర ఆస్ధులను కొనుగోలు చేయటానికి అర్హులు. 1954రాష్ట్రపతి వుత్తరువుల ద్వారా ఇతరులకు హక్కులను నిషేధించారు. శాశ్వత నివాసి అయిన కాశ్మీరీ మహిళ వేరే రాష్ట్రానికి చెందిన పురుషుడిని వివాహం చేసుకుంటే ఆమె శాశ్వత నివాస అర్హత రద్దవుతుంది. కాశ్మీరీ పురుషుడిని వేరే రాష్ట్ర మహిళ వివాహం చేసుకుంటే ఆమెకు శాశ్వత నివాసి అర్హత వస్తుంది. మాజీ ముఖ్య మంత్రి ఫరూక్‌ అబ్దులా, ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా కాశ్మీరేతరులను వివాహం చేసుకున్నారు. వారి భార్యలకు శాశ ్వత నివాస అర్హత వచ్చింది. అదే ఫరూక్‌ అబ్దుల్లా కుమార్తె సారా అబ్దుల్లా కాంగ్రెస్‌ నేత రాజస్ధాన్‌కు చెందిన సచిన్‌ పైలట్‌ను వివాహం చేసుకొని అర్హతను కోల్పోయారు.

చారు వాలీ ఖన్నా, మరికొందరు ఇతరులు దాఖలు చేసిన పిటీషన్లను అన్నింటినీ కలిపి సుప్రీం కోర్టు విచారిస్తున్నది. 35ఏ ఆర్టికల్‌ను సమర్ధిస్తున్న వారు మహిళా వ్యతిరేకులని, వివక్షను సమర్ధిస్తున్నారంటూ సంఘపరివార్‌ సంస్ధలకు చెందిన వారు దాడి చేస్తున్నారు. ఈశక్తులకు నిజంగా మహిళా హక్కుల పట్ల అంతశ్రద్దే వుంటే చట్టసభలో మహిళకు మూడోవంతు రిజర్వేషన్ల గురించి గత ఐదు సంవత్సరాలలో ఎందుకు చర్యలు తీసుకోలేదు. అర్టికల్‌ 35ఏ సెక్షన్‌ రద్దు చేస్తామని బిజెపి వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఇలాంటి ఆంక్షలు, రక్షణలు అనేక రాష్ట్రాలలో వున్న అంశాన్ని వీరు విస్మరిస్తున్నారు. ఒక రాజకీయ అజెండాతో కేవలం ఈ అంశాన్నే ముందుకు తెస్తున్నారు. వుదాహరణకు 1-70 చట్టం పేరుతో వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆమోదించినదాని ప్రకారం ప్రస్తుతం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో షెడ్యూలు గిరిజన ప్రాంతాలుగా ప్రకటించిన చోట్ల గిరిజనేతరులు భూములు, ఇతర స్ధిర ఆస్ధులు కొనుగోలు చేయటానికి లేదు. చట్టం రాకముందు వున్న ఆస్ధులను అమ్ముకోవాలంటే గిరిజనులకు మాత్రమే విక్రయించాలి. ఆప్రాంతాలలోని గిరిజన యువతులు బయటి వారిని వివాహం చేసుకుంటే వారికి ఇతరులకు వర్తించే హక్కులు వర్తిస్తాయి. కానీ గిరిజన యువతులను వివాహం చేసుకున్న గిరిజనేతరులకు ఆ ప్రాంతాలలో అలాంటి హక్కులుండవు. ఇలాంటి పరిమితులే హిమచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, నాగాలాండ్‌ వంటి రాష్ట్రాలలో వున్నాయి. వాటి గురించి బిజెపి, సంఘపరివార్‌ మాట్లాడదేం. ఇదే విధంగా ప్రభుత్వ వుద్యోగాలు కూడా రాష్ట్రానికి సంబంధించిన వాటికి స్ధానికులే అర్హులు లేదా వారికి స్ధానికత అర్హత వచ్చిన తరువాతే అర్హులు అవుతారు.

హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేయబోయే ముందు హైదరాబాద్‌ రాష్ట్రానికి చెందిన వారు తమ ప్రాంతానికి రక్షణ కల్పించాలని కోరలేదా, ఆ మేరకు కల్పించిన విషయం తెలిసినదే.తమ ప్రాంతం వారు వెనుకబడి వున్నందున ముందున్న ఆంధ్రప్రాంతం వారు వుద్యోగాలను ఎక్కువగా పొందే అవకాశం వున్నందున రక్షణ కల్పించాలని కోరారు. దానికి అనుగుణంగా ముల్కీ నిబంధనలు వర్తిస్తాయని 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు అయినపుడు చెప్పారు. ముల్కీ నిబంధనల ప్రకారం పన్నెండు సంవత్సరాలు తెలంగాణాలో నివాసం వుంటే వారు స్ధానికులుగా మారిపోతారు. ఆ మేరకు 1968 నాటికి ముల్కీ నిబంధనలు రద్దయ్యే పరిస్ధితి ఏర్పడింది. తమ వారికి జరగాల్సిన న్యాయం జరగలేదని, ముల్కి నిబంధనలు రద్దవుతున్నందున న్యాయం జరగదంటూ తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే ఆందోళన ప్రారంభమైంది. ముల్కీ నిబంధనలు చెల్లుతాయని కోర్టు తీర్పు వచ్చిన తరువాత స్వంత రాష్ట్రంలో పరాయివారిగా వుండటమేమిటి ప్రత్యేక ఆంధ్రను ఏర్పాటు చేయాలంటూ 1972లో జై ఆంధ్ర ఆందోళన ప్రారంభమైంది. ప్రస్తుతం వుపరాష్ట్రపతిగా వున్న వెంకయ్య నాయుడు దాని నాయకులలో ఒకరు, రాజకీయ జీవితం దానితోనే ప్రారంభించారనే విషయం విదితమే. వుమ్మడి రాష్ట్రంలో స్ధానికులకు న్యాయం చేకూర్చేందుకు రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి వుత్తరువులతో ఆర్టికల్‌ 371డి ప్రకారం వుమ్మ డి రాష్ట్రంలో రక్షణ కల్పించి జోనల్‌ వ్యవస్ధను ఏర్పాటు చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత స్ధానికత సమస్య మరో రూపంలో ముందుకు వచ్చింది. జోనల్‌ వ్యవస్ధను రద్దు చేయాలనే ఆలోచన చేశారు. అంతకు ముందు ఆంధ్రప్రాంతం వారు తమ అవకాశాలను కొట్టివేస్తున్నారని చేసిన వాదన తెలంగాణాలో మరో రూపంలో ముందుకు వచ్చింది. అభివృద్ధి చెందిన హైదరాబాదు,వరంగల్‌,నల్లగొండ, ఖమ్మం జిల్లాల వారు వెనుకబడిన ప్రాంతాలలోని వుద్యోగావకాశాలను తన్నుకుపోయే అవకాశం వుందనే వాదనలు బయలు దేరటంతో జోనల్‌ వ్యవస్ధను కొనసాగించక తప్పలేదు.

ముల్కీ నిబంధనలను నైజాం నవాబు 1919లో అమలులోకి తెచ్చారు. దాని ప్రకారం నాటి హైదరాబాదు సంస్ధానంలో స్ధానికులకు రక్షణ కల్పించటమే లక్ష్యం. వుర్దూలో ముల్క్‌ అంటే ఒక దేశం. ఆ దేశ పౌరులు ముల్కీలు అవుతారు. సంస్ధానం వెలుపల నుంచి వచ్చేవారి కారణంగా స్ధానికుల్లో తలెత్తిన అసంతృప్తిని తగ్గించేందుకు నవాబు ఈ ఏర్పాటు చేశాడు. ఎవరైనా హైదరాబాదు సంస్ధానంలో 15సంవత్సరాల ప్రభుత్వ సేవ పూర్తి చేస్తే వారికి జన్మి ంచేవారికి పుట్టుకతోనే సంస్ధాన పౌరసత్వం వస్తుంది. లేదా ఎవరైనా 15సంవత్సరాలు నివశించి వుంటే వారు కూడా స్ధానికులు అవుతారు. ముల్కీ అయిన వ్యక్తిని వివాహం చేసుకొంటే ఆమెకూడా ముల్కీ అవుతుంది. పదిహేను హైదరాబాదులో నివాసం వున్న వారు పర్మనెంటు ముల్కీ కావాలంటే తన స్వస్ధాలకు తిరిగి వెళ్లాలనే వాంఛను వదులు కొంటున్నట్లు అఫిడవిట్‌ కూడా ఇవ్వాల్సి వుంది. అప్పుడే ముల్కీ సర్టిఫికెట్‌ ఇచ్చేవారు. అలాంటి ముల్కీ నిబంధనలు చెల్లుబాటవుతాయని సుప్రీం కోర్టు 1972లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఇదే మాదిరి 1927కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌ స్ధానికులకు రక్షణ కల్పిస్తూ చేసిన చట్టాన్ని కొనసాగింపుగా భారత్‌లో విలీనం అయిన తరువాత కొనసాగించాలన్నది సంప్రదింపుల్లో అంగీకరించారు. నాడు హరిసింగ్‌ ఆస్దానంలో కాశ్మీరీ పండిట్లు, డోగ్రాలదే ఆధిపత్యం. తమకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో పోటీని నివారించేందుకు రాజు చేత 35ఏలో వున్న నిబంధనలను చట్టంగా చేయించారు. అప్పుడు అంగీకరించిన పండిట్లు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు ? నైజాం నవాబు ముల్కీ నిబంధనలను సమర్ధించిన సుప్రీం కోర్టు అదే పద్దతుల్లో కాశ్మీర్‌ రాజు కల్పించిన రక్షణలను ఏ ప్రాతిపదికన రద్దు చేస్తుంది.

ఇలాంటి వాటిని రద్దు చేస్తే పోలా అనే వారికి ఒక ప్రశ్న. చేయాల్సి వస్తే ఒక్క కాశ్మీర్‌ అంశాలనే ఎందుకు రద్దు చేయాలి? వుద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కూడా అలాంటివే. పదేండ్లకోసం చేసిన వాటిని వాటి లక్ష్యం ఇంకానెరవేరలేదనే కారణంగా ఇంకా కొనసాగిస్తున్నాము కదా, వీటిని కూడా అలాగే ఎందుకు పరిగణించకూడదు. చిత్తశుద్ధి వుంటే ఇలాంటి వాటన్నింటినీ కలిపి ఒక చర్చ పెడితే, వాటిమీద ఏకాభిప్రాయం వస్తే రాజ్యాంగ బద్దంగానే చేయవచ్చు. అలా జరగటం లేదే ! ఇప్పుడున్న పరిస్ధితుల్లో అది సాధ్యం అవుతుందా? వుదాహరణకు 1975 మే 16వరకు ప్రస్తుతం మన రాష్ట్రాలలో ఒకటిగా వున్న సిక్కిం ఒక రాజ్యంగా మన రక్షణలో వుంది. అక్కడి జనం రాజరికాన్ని కాదని మన దేశంలో విలీనం కావాలని కోరుకున్నారు. అందుకు అంగీకరించాము. దానికి ఒక షరతు ఏమంటే అప్పటి వరకు సిక్కింలో వున్న ప్రత్యేక రక్షణలను తరువాత కూడా కొనసాగించాలి. వాటిని ఆర్టికల్‌ 371ఎఫ్‌లో చేర్చి రాజ్యాంగాన్ని సవరించారు. ఇప్పుడు కళ్లు తెరిచిన వారు వాటిని అంగీకరించం, రద్దు చేయాలంటే ఎలా? దేశం సమగ్రంగా వుంటుందా ? ఆర్టికల్‌ 370ని సవరించి ఇప్పటికే నీరుగార్చారన్న విమర్శలున్నాయి. దానిని మరింతగా నీరుగార్చటం అంటే కాశ్మీరీల్లో అనుమానాలు, అభద్రతా భావాన్ని మరింత పెంచటమే. దాన్ని రద్దు చేసే అవకాశం లేదని తెలిసి కూడా బిజెపి నిరంతరం వ్యతిరేకంగా ప్రచారం చేయటం రెచ్చగొట్టే వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఈ అర్టికల్‌ను రద్దు చేయాలన్న ఆలోచన తమకు ఇప్పుడు లేదని ఎందుకంటే పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ లేదని రాజ్యసభలో ఒక ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. నిజానికి అంత మెజారిటీ వున్నప్పటికీ ఏ పార్టీ ప్రభుత్వానికి అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని రాజ్యాంగంలో చేర్చాలని చెప్పింది రాజ్యాంగ పరిషత్‌. అది ఇప్పుడు లేదు. అందువల్లనే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది. అందుకోసం అసలు రాజ్యాంగాన్నే రద్దు చేసి కొత్త రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేస్తే అన్న వూహాజనిత ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరు. అటు వంటి పనికి బిజెపితో సహా ఏ పార్టీ పూనుకొనే అవకాశం లేదు.

Image result for nationalism india

కాశ్మీర్‌ గురించి అనేక వక్రీకరణలు ప్రచారంలో వున్నాయి. వాటిలో కొన్నింటి తీరుతెన్నులను చూద్దాం.

ద్వంద్వ పౌరసత్వం: ఇది వాస్తవం కాదు, ముందే చెప్పుకున్నట్లు 35ఏ నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రానికి చెందిన కొన్ని ప్రత్యేక రక్షణల కోసం శాశ్వత నివాసులు అని కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశారు తప్ప అది పౌరసత్వం కాదు.వారు కూడా భారత పాస్‌పోర్టులనే కలిగి వుంటారు.

ప్రత్యేక రాజ్యాంగం: ఇది పాక్షిక సత్యం, ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక చట్టాలు చేసుకోవటానికి ఆర్టికల్‌ 370 అనుమతించింది. అందువలన రక్షణ, విదేశీవ్యవహారాలు, సమాచార రంగాలను వర్తింప చేయటానికి ఆ రాష్ట్ర అనుమతి అవసరం లేదు. మిగిలిన అంశాలను వర్తింప చేయాలంటే రాష్ట్రశాసనసభ అనుమతి అవసరం. మన రాజ్యాంగంలో రాష్ట్రాలు, కేంద్ర అధికారాలతో పాటు వుమ్మడి జాబితా కూడా వున్న విషయం తెలిసిందే. రాష్ట్రాల అధికారాలకు సంబంధించి దేనికది ప్రత్యేక చట్టాలు చేసుకొనేందుకు ఏరాష్ట్రానికి అయినా హక్కుంది. వుమ్మడి అంశాలపై రాష్ట్రాల ఆమోదం అవసరం అన్న విషయం తెలిసిందే.

ప్రత్యేక, రాజ్యాంగం, జెండా : నిజమే, ఆర్టికల్‌ 370 ప్రకారం ప్రత్యేక రాజ్యాంగాన్నే ఏర్పాటు చేసుకొనే హక్కు దానికి వుంది.అది భారత రాజ్యాంగపరిధిలోనే వుంటుంది. ఆ రాష్ట్ర శాసనసభ కాలపరిమితి ఆరు సంవత్సరాలు, 1972లో ప్రత్యేక జండాను అధికారికంగానే ఏర్పాటు చేశారు. దేశంలో అనధికారికంగా సిక్కిం, కర్ణాటలకు ప్రత్యేక జండాలు వున్నాయి. ఒక దేశంలో వుంటూ ప్రత్యేక రాజ్యాంగాలను కలిగి వుండటమంటే అర్ధం స్వతంత్ర దేశాలని కాదు. బ్రిటీష్‌ వారి కౌలు గడువు ముగిసిన తరువాత తిరిగి చైనాలో విలీనమైన హాంకాంగ్‌కు ప్రత్యేక రాజ్యాంగాన్ని అనుమతించారు. అలాగే పోర్చుగీసు కౌలు గడువు ముగిసిన తరువాత చైనాలో విలీనమైన మకావో దీవులకు కూడా ప్రత్యేక పాలనా మండలి వుంది. చైనాలో విలీనమైనా చైనా చట్టాలు అక్కడ వర్తించవు. మన దేశంలో సిక్కిం విలీన సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఏ రాష్ట్రంలోనూ లేని ప్రత్యేక రక్షణలు కల్పించారు. అక్కడ అసెంబ్లీలో 32 స్ధానాలున్నప్పటికీ ప్రాదేశికంగా 32వ నియోజకవర్గం లేదు. సంఘ పేరుతో వున్న దానిలో సిక్కింలోని బౌద్ధ ఆరామాలలో వున్న సాధువులు దాని ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఆర్టికల్‌ 371ఎఫ్‌ ప్రకారం భుటియా, లెపాచా వంటి గిరిజన సామాజిక తరగతులకు అసెంబ్లీలో ప్రత్యేక సీట్లను కేటాయించారు. ఏ తరగతికి కేటాయించిన సీట్లలో వారే పోటీ చేయాల్సి వుంటుంది. మిగతా రాష్ట్రాలలో ఎక్కడా ఫలానా సామాజిక తరగతికి మాత్రమే ఆయా సీట్లలో పోటీకి అర్హత అనేది లేదు. వుదాహరణకు షెడ్యూలు కులాలు, తరగతులకు ఇన్ని సీట్లు, ఏఏ సీట్లు అనేది నిర్ణయం అవుతుంది తప్ప, వాటిలో ఏ కులం వారు పోటీ చేయాలనే అంశం లేదు.

జాతీయ చిహ్నాలను అవమానించటం నేరం కాదు: ఇదొక అవాస్తవం, 1971లో పార్లమెంట్‌ చేసిన చట్ట ప్రకారం జాతీయ చిహ్నాలైన జెండా, జాతీయ గీతం, రాజ్యాంగాన్ని దేశంలో, దేశం వెలుపల భారతీయ పౌరులు అవమానించటం నేరపూరితం. ఏ దైనా ఒక చట్టం కాశ్మీర్‌కు వర్తించనట్లయితే దాని పీఠికలోనే ముందుగా జమ్మూ కాశ్మీర్‌ మినహా అని వుంటుంది. పైన పేర్కొన్న చట్టానికి అలాంటిది లేదు. అలాగే సుప్రీం కోర్టు, కాగ్‌ పరిధి ఆ రాష్ట్రానికి వర్తించదు అనేది కూడా వాస్తవం కాదు.

బయటి వారు భూములు కొనుగోలు చేయకూడదు : ఇంతకు ముందే చెప్పినట్లు దేశంలో అనేక చోట్ల అలాంటి ఆంక్షలు వున్నాయి.1846లో జమ్మూకు చెందిన డోగ్రా రాజు గులాబ్‌ సింగ్‌ బ్రిటీష్‌ వారితో చేసుకున్న అమృతసర్‌ ఒప్పందం ప్రకారం అక్కడి భూమిని బయటి వారెవరూ కొనుగోలు చేయకూడు. భారత్‌లో విలీన సమయంలో అంతకు ముందు ఆ ప్రాంతాలలో వున్న చట్టాలను కొనసాగించాలన్నది షరతు. ఆ మేరకు ఇప్పుడు కూడా బయటి వారెవరూ భూములు కొనుగోలు చేయటానికి లేదు.

బయటి పెట్టుబడులను 370 ఆర్టికల్‌ అడ్డుకుంటున్నది: 1927 ఏప్రిల్‌26న కాశ్మీర్‌ రాజు జారీ చేసిన నోటిఫికేషన్‌లో రాష్ట్రానికి ఆర్ధిక లబ్ది చేకూరేట్లయితే దీనికి మినహాయింపు వుంటుందని పేర్కొనటం పెట్టుబడులకు అవకాశం కల్పించటమే కదా ! భూముల కొనుగోలుకు సంబంధించి అసోంలోని కొండ ప్రాంతాల్లో నిషేధాలు వున్నాయి. నాగాలాండ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చిన ఆర్టికల్‌ 371ఏ, అరుణాచల్‌ ప్రదేశ్‌కు ఇచ్చిన 371హెచ్‌, సిక్కింకు 371ఎఫ్‌, మిజోరాంకు 371జి ప్రకారం ప్రత్యేక హోదా రక్షణలు వున్నాయి. బిజెపి వాటన్నింటినీ ప్రస్తావించకుండా కాశ్మీర్‌నే ఎందుకు ముందుకు తెస్తున్నది. ముస్లింలు మెజారిటీ వున్నారనా ?

పాకీస్తానీని వివాహం చేసుకుంటే : కాశ్మీరీ శాశ్వత నివాసి అయిన ఒక యువతి వేరే రాష్ట్రానికి చెందిన వారిని వివాహం చేసుకుంటే శాశ్వత నివాస హక్కు రద్దవుతుంది, అదే పాకిస్తానీని చేసుకుంటే కాదు అన్నది ఒక తప్పుడు ప్రచారం. భారత రాజ్యాంగం ప్రకారం ద్వంద్వ పౌరసత్వం లేదు. పాక్‌ యువకుడు కాశ్మీర్‌ లేదా ఇతర భారత రాష్ట్రాల యువతులను వివాహం చేసుకుంటే వారికి పాక్‌ సౌత్వం వస్తుంది తప్ప పాక్‌ యువకులకు మన పౌరసత్వం రాదు. చట్టంలో శాశ్వత నివాసి అన్న పదానికి స్త్రీ, పురుష తేడా లేదు. అయితే పాలనాపరమైన నిబంధనల ప్రకారం మహిళలకు వివాహమయ్యేంత వరకు వుంటుంది. కాశ్మీరీనే వివాహం చేసుకుంటే శాశ్వతనివాస హోదా కొనసాగుతుంది.అదే వేరే రాష్ట్రాల వారిని చేసుకుంటే రద్దవుతుంది. అయితే 2004లో అలా రద్దు కావటానికి ఎలాంటి చట్టబద్దత లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. దాన్ని చెల్లకుండా చేసేందుకు కాశ్మీర్‌ అసెంబ్లీ అదే ఏడాది ఒక బిల్లును ఆమోదించింది. అయితే వివిధ కారణాలతో అది ఇంకా చట్ట రూపం దాల్చలేదు.

కాశ్మీర్‌ మహిళలు షరియత్‌ చట్టం కింద వున్నారు: ఇది వాస్తవం కాదు, కాశ్మీరీ ముస్లిం మహిళలే కాదు దేశంలోని యావత్తు మహిళలు ఆయా మతాల వ్యక్తిగత చట్టాల కిందనే వున్నారు.

హిందు, సిక్కు మైనారిటీలకు రిజర్వేషన్‌ లేదు:2011 జనాభా లెక్కల ప్రకారం కాశ్మీర్‌లో 68.31శాతం ముస్లింలు, 28.43శాతం హిందువులు ఇతరులందరూ 3.26శాతం వున్నారు. హిందువులను మైనారిటీలుగా ఎక్కడా గుర్తించలేదు.2005 రాష్ట్ర రిజర్వేషన్‌ చట్టం ప్రకారం వెనుబడిన ప్రాంతాల(తరగతులు కాదు) వారికి 20, షెడ్యూలు తరగతులకు 10, షెడ్యూలు కులాలకు 8, మాజీ సైనికులకు 6, వికలాంగులు 3, వాస్తవాధీన రేఖ సమీపంలో వుండే వారికి 3, వెనుకబడిన తరగతులకు 2 శాతం చొప్పున రిజర్వేషన్లు వున్నాయి. మత ప్రాతికన ముస్లింలకు రిజర్వేషన్లు వద్దంటున్న వారు కాశ్మీర్‌లో హిందువులు, సిక్కులకు మత ప్రాతిపదికన రిజర్వేషన్‌ లేదనటం గమనించాల్సిన అంశం. దేశంలో ఎక్కడా లేని విధంగా వెనుకబడిన ప్రాంతాల వారికి అంటే కుల మత ప్రసక్తి లేకుండా రిజర్వేషన్‌ కలిగించటం ఇక్కడ మాత్రమే వుంది.

మన మాపుల్లో చూపుతున్న ప్రాంతాలన్నీ మన ఆధీనంలో లేవు. కాశ్మీర్‌లోని కొంత భాగం పాకిస్ధాన్‌ ఆక్రమణలో వుంది, మరికొంత ప్రాంతం చైనా కింద వుంది. అరుణాచల్‌ తమదే అని చైనా అంటున్నది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాల్సి వుంది. ఇప్పుడున్న ఆర్టికల్‌ 370ను తొలగిస్తే తలెత్తే చట్టపరమైన సమస్యలు, సంక్లిష్టతల గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాలలో తీవ్ర ఆందోళనలకు కారణమైన విషయం తెలిసిందే. అది అసోం ఒప్పందాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అందువలన గతంలో ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలను విస్మరించి కేవలం ఓట్ల దృష్టితో బిజెపి తన నిర్ణయాన్ని రుద్దేవందుకు పూనుకుంది. వ్యతిరేకతను గమనించి ఆ బిల్లును మురిగిపోయేట్లు చేసింది. అందువలన కాశ్మీర్‌తో సహా ఈ పూర్వరంగంలో ఇప్పటి పీటముడులను విప్పటమే ఒక సమస్యగా మన ముందున్నపుడు వాటిని మరింతగా బిగిసేట్లు, కొత్త ముడులు వేసేందుకు ప్రయత్నించటం నిజమైన దేశభక్తులు, జాతీయ వాదులు చేయాల్సిన పని కాదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కొన్ని ఆలోచనలు-ఒక అవలోకన !

28 Friday Jul 2017

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, Opinion, RELIGION, Social Inclusion, Uncategorized

≈ Leave a comment

Tags

BR Ambedkar, caste discrimination, caste system, cristianity, Hinduism, Hinduthwa, Indian conistitution, manuvadam, RELIGION, Rule of reservations, scheduled castes

ఎం కోటేశ్వరరావు

2017 జూలై 28వ తేదీ ప్రజాశక్తిలో అరుణ గోగులమండ గారు ఆలోచనలు కలిగించటమే నా లక్ష్యం అని ముందే ప్రకటించుకొని కొన్ని ఆలోచనల పేరుతో కొన్ని అంశాలను పాఠకుల ముందుంచారు.http://www.prajasakti.com/Article/Prajagalam/1949493 అసలు బుర్రలకు పని పెట్టటమే మరచిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి ప్రయత్నం చేయటం అభినందనీయం. వాటిపై అవలోకన గురించి కూడా ఆలోచించాలని మనవి.

ప్రపంచంలో అనేక ఆలోచనా విధానాలున్నాయి. నూరు పువ్వులు పూయనివ్వండి వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్న లోకోక్తి తెలిసిందే. దళితుల పట్ల సామాజిక వివక్షను అంతం చేసేందుకు, వారిని దోపిడీ నుంచి విముక్తి చేసేందుకు అంబేద్కర్‌ ఆలోచనా విధానమొక్కటే చాలదు, అందువలన సకల పీడితుల విముక్తికి చెబుతున్న ఇతర ఆలోచనా విధానాలను కూడా ప్రజల్లోకి వీలైనంతగా చేరవెయ్యాలేమో ?

మన విధి(డెస్టినీ)ని మనమే నిర్ణయించుకోవాలి అని చెప్పారు. ఇది సాధారణ అర్ధంలో అయితే అభ్యంతరం, ఇబ్బంది లేదు. దళితుల విధిని దళితులే నిర్ణయించుకోవాలి అనే ఒక పరిధి అర్ధంలో అయితే ఆలోచనలకు అడ్డుకట్ట వేయటమే. సంపదలకు మూలమైన వారిలో దళితులు కూడా ఒక భాగమే తప్ప దళితులే సర్వస్వం కాదు. సామాజికంగా వివక్ష లేకపోవటం లేదా అంత తీవ్రంగా లేకపోవచ్చు గాని దళితేతర కులాల్లోని పేదలందరూ సంపదలకు మూలమైన వారిలో భాగమే. సంఖ్యాపరంగా చూస్తే దోపిడీకి గురవుతున్నవారిలో వారే అధికులు. మెట్ల కుల వ్యవస్ధలో పై మెట్టులో వున్న కులాల్లో కూడా దళితులతో కలసి గని,వని,ఖార్ఖానాలో పని చేసే వారు వున్నారు. వారికి వూరడింపు సామాజిక వివక్ష లేకపోవటం, వూరి మధ్యలో కూడా వుండనివ్వటం తప్ప మిగతా వన్నీ సేమ్‌ టు సేమ్‌. అరుణగారు చెప్పినట్లు ఆధిపత్య కులాల ఫ్యాక్టరీలు, గనులు, పొలాల్లో పని చేసే దళితులే కాదు, ఆధిపత్య కులాల్లోని పేదలు కూడా తమకూ హక్కులున్నాయన్న సంగతే తెలియక బలౌతూనే వున్నారా లేదా ? దళిత కులానికి చెందిన వారు కూడా పెట్టుబడిదారులుగా వున్నారు. వారి సంస్ధలలో దళితుల పరిస్ధితి ఏమైనా మెరుగ్గా వుందా? సామాజిక వివక్ష తప్ప దోపిడీ సేమ్‌ టు సేమ్‌ కాదా ?

ఆధిపత్య వాదులందరికీ కుల గోడలను కూల్చటం సుతరామూ ఇష్టం లేదన్నారు. కులాల హెచ్చు తగ్గుల వల్ల వచ్చే ఆడంబరాలను, ఐశ్వర్యాలను ఎప్పటికీ వారే అనుభవించాలనే దుర్బుద్ధి అందుకు కారణం అని అరుణగారు చెప్పారు. కులాన్ని బట్టి ఐశ్వర్యాలు వచ్చి వుంటే స్వాతంత్య్రానికి ముందు తెలంగాణా, ఆంధ్రా ప్రాంతంలో వేలు, లక్షల యకరాలపై ఆధిపత్యం కలిగిన భూస్వాములు, జాగీర్దార్లు, దేశ ముఖులు, జమిందార్లు కేవలం వేళ్లమీద లెక్కించదగిన వారు మాత్రమే ఎందుకున్నారు.ఆ కులాలో పుట్టిన వారందరికీ అదే మాదిరి సంపదలు ఎందుకు దక్కలేదు. దొరలు, జమిందార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారితో కలసి అదే ఆధిపత్య కులాలకు చెందిన వారు ఎందుకు పోరాడినట్లు ? అలా పోరాడిన వారిలో ఆధిపత్య కులాలని పిలిచే వాటిలో వారి ప్రమేయం లేకుండా పుట్టిన ఎందరో భూస్వామిక కుటుంబాలకు చెందిన వారు కూడా వున్నారు. అలాగే క్రైస్తవం, ఇస్లాం ఇతర మతాలు మెజారిటీగా వున్న దేశాలలో ఆ మతాలలోని కొద్ది మందే దేశాలను సైతం శాసించగలిగిన కార్పొరేట్‌ సంస్ధల అధిపతులుగా వుండగా మెజారిటీ పౌరులు వాటిలో పని చేసే కార్మికులు, లేదా వుద్యోగులుగా ఎందుకున్నారు. రష్యాలో పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఆధిపత్యం వహించింది క్రైస్తవులు, వారిని కూల్చి వేసిందీ క్రైస్తవులే కదా ? అంతెందుకు క్రైస్తవుడైన హిట్లర్‌ ఫాసిస్టుగా మారితే వాడిని సమర్ధించింది ఎవరు, వాడిని, వాడి ముష్కర మూకలను హతమార్చింది ఎవరు ? క్రైస్తవులే కదా ? అందువలన అరుణ గారు, ఆమె మాదిరి అభిప్రాయం కలిగిన వారందరూ కుల, మత పరిధి దాటి ఆలోచించటం అవసరం.

సామాజిక వివక్షకు గురవుతున్న కులాల జాబితాల్లో వున్నవారికి రిజర్వేషన్లు ఇస్తూ వారు మతం మారితే రద్దు చేయటం అన్యాయం అనటంలో ఎలాంటి పేచీ లేదు. ఎందుకంటే మతం మారినా వారి సామాజిక స్ధితిలో మార్పుండటం లేదు. కానీ అరుణగారు క్రైస్తవం పుచ్చుకున్న ఆధిపత్య కులాల వారు కూడా తమ కులం కోల్పోయి దళితులుగా మారిపోవాలి కదా అంటున్నారు. మతం మారినా దళితుల రిజర్వేషన్లు కొనసాగాలి, కుల విభజన గోడలు కూలిపోవాలని ఒకవైపు చెబుతూనే మరోవైపు ఇలాంటి వాదనలు చేయటం గందరగోళ ఆలోచనకు నిదర్శనం. ఇక్కడ క్రైస్తవం దళితుల మతం కాదని గ్రహించటం అవసరం. హిందూమతంలో శైవులు, వైష్ణవులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల వంటి వివిధ తాత్విక విభజనలు వున్నట్లే ఇస్లాం, క్రైస్తవంలో కూడా ప్రబోధకులను బట్టి కొన్ని రకాల విభజనలు వున్నాయి తప్ప కులాల ప్రస్తావన, విభజన లేదు.

దళితుల సాధికారత కోసం, రిజర్వేషన్ల కల్పనలో అంబేద్కర్‌ చేసిన కృషిని ఎవరైనా తక్కువ చేసే చూస్తే అది పాక్షిక దృష్టి తప్ప వేరు కాదు. అనేక మంది రిజర్వేషన్లు అనే భావన అంబేద్కర్‌తోనే ప్రారంభమైందనే అభిప్రాయంతో వున్నారు. ఇది కూడా పాక్షిక దృష్టే. అంబేద్కర్‌ కంటే ముందే కొల్లాపూర్‌ సంస్ధాన అధిపతి సాహు మహరాజ్‌ 1882,1891లోనే బ్రాహ్మణేతరులు, వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టారు. తరువాత కాలంలో అంబేద్కర్‌ మరింత నిర్ధిష్టంగా దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటుతో సహా అనేక ప్రతిపాదనలపై కృషి చేశారు. దళితులు మతం మారితే వెనుకబడిన తరగతిగా పరిగణించబడటానికి కూడా ఆ అంబేద్కర్‌ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగమే వీలు కల్పించిందని గుర్తించటం అవసరం. ఇదొక సంక్లిష్ట సమస్య. అందువలన ఆరుణగారు చెబుతున్నట్లు అది కుట్రే అయితే అందుకు వీలు కల్పించిన అంశాలేమిటి ? రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దమే అయినప్పటికీ అవి శాశ్వతం కాదు, అంబేద్కర్‌ కూడా రిజర్వేషన్లును పది సంవత్సరాలు అమలు చేసిన సమీక్షించి మరో పదిసంవత్సరాలు పొడిగించమని చెప్పారు తప్ప శాశ్వతంగా వుంచాలని అభిప్రాయపడలేదు. అందువలనే ఎంతకాలమనే ప్రశ్న పదే పదే తలెత్తుతున్నది. సామాజిక వివక్ష అంతమయ్యే వరకు వాటిని కొనసాగించాలనటం న్యాయబద్దం. ఎంత త్వరగా దానిని అంతం చేస్తే అంత త్వరగా రిజర్వేషన్లను ముగించ వచ్చు.

ఇక మతం మారిన హిందూ దళితులకు రిజర్వేషన్లు వర్తించపోవటం సమస్య. దీన్ని కుట్రగా అభివర్ణించవచ్చునా ? రాజ్యాంగం అమలులోకి రాకముందే దీనిపై చర్చ జరిగింది. సిక్కు మతంలో కూడా దళితులు వున్నందున వారికి కూడా హిందూ దళితులకు వర్తించే సౌకర్యాలను వర్తింప చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. సిక్కు మతంలోకి మారేందుకు ఎవరూ ఎవనీ బలవంత పెట్టలేదని, సిక్కు మతం అంటరాని తనాన్ని గుర్తించలేదని, అందువలన సిక్కు మతాన్ని అవలంభించాలంటే రిజర్వేషన్లు వదులు కోవాలి, రిజర్వేషన్లు కావాలంటే సిక్కు మతాన్ని వదులుకోవాల్సి వుంటుందన్న వాదనలు వచ్చాయి. క్రైస్తవం, ఇస్లాం కూడా అలాంటివే. అవేవీ అంటరానితనాన్ని గుర్తించలేదు. అందువలన రిజర్వేషన్‌ అవసరం లేదనుకున్న వారు హిందూ మతం నుంచి మారవచ్చు లేదా కావాలనుకున్నవారు అదే మతంలో వుండాలన్నది లాజిక్కు. అయితే మతం మారినా వివక్ష కొనసాగుతున్నందున వారికి కూడా హిందూ దళిత రిజర్వేషన్లే అమలు జరపాలన్న వాదన ముందుకు వచ్చిందని గమనించాలి. అందువలన ఆలోచనకు చర్చ పెట్టే ముందు పూర్వపరాలను కూడా సమగ్రంగా వివరించకపోయినా ప్రస్తావించటం అవసరం? కాదంటారా ?

కుల వివక్ష, అంటరానితనం వంటి మాయని మచ్చలను సహించిందీ, అమలు జరిపిందీ హిందూమతం లేదా దాని పరిరక్షకులమని చెప్పుకొనే వారు. దానికి ప్రాతిపదిక మనువాదం. ఇప్పటికీ దానిలో ఎలాంటి సంస్కరణలు లేవు. అందువలన హిందూమతంలో వుండాలా లేదా అన్నది ఎవరికి వారు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాల్సిన అంశం. మతం అన్నది మత్తు మందు. అది ఏమతానికైనా వర్తించే సాధారణ సూత్రం. మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టాలని చూసేవారు, మత విభజనతో సమాజాన్ని వెనక్కు తిప్పాలని చూసే వారు అది మెజారిటీ అయినా మైనారిటీ అయినా సమాజానికి వ్యతిరేకులే. ప్రతి మతం తన మత్తు మందును తీసుకొనే జనాలు తగ్గకుండా చూసుకోవాలని చూస్తుంది. రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని హిందూమత శక్తులు దళితుల మతమార్పిడికి ఎలా అడ్డంపడుతున్నాయో, మతం మారినా దళితులకు రిజర్వేషన్లు అమలు జరపాలని క్రైస్తవమత శక్తులు తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవటానికి చూస్తున్నాయి.

చివరిగా ఒక్క మాట. దళితుల అభ్యున్నతికి అంబేద్కర్‌ కృషి అమోఘం. ఇదే సమయంలో ఆయన ఆధ్వర్యాన ఏర్పాటయిన రాజ్యాంగం దళితుల సమస్యలకు జిందా తిలిస్మాత్‌ కాదని ఇప్పటికే రుజువైంది. స్వాతంత్య్రవుద్యమ ఆకాంక్షలను ఇంతవరకు అమలు జరపలేదు, అనేకానికి తూట్లు పొడిచారు. అందువలన ఈ రాజ్యాంగం జనానికి, ప్రత్యేకించి దళితులకు కల్పించిన రక్షణలను కాపాడుకొంటూనే వారితో పాటు ఇతర కష్టజీవుల విముక్తికి అవసరమైన ఆలోచనలు చేయటం అవసరం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అంబేద్కర్‌, బుద్ద సబ్బులతో మానసిక బానిసత్వ శుద్ధి !

30 Tuesday May 2017

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., Opinion, RELIGION, Social Inclusion

≈ Leave a comment

Tags

Ambedkar, Buddha, Dalit, manuvadis, mental slavery, soaps, Yogi Adityanath

అంబేద్కర్‌, బుద్ద సబ్బులతో మానసిక బానిసత్వ శుద్ధి !

అసంగ్‌ వాంఖడే

ఇదిగో నా నైవేద్యం

మనువు నన్ను మలినం గావించాడు

మీ అసహ్యబుద్ది

మాకు దుర్గంధం వంటి కులనామాన్నిచ్చి వెలివేసింది

గాయాల వాసనతోనే నేను ప్రకాశించాను

నాపై వున్నది అణచివేత జాడలు తప్ప మీ దుర్గంధం కాదు

మీ దేవుడి ప్రసన్నం కొరకు

ఈ రోజు నాకు షాంపూ, సబ్బులు ఇచ్చారు

మైనారిటీల హింస, మానభంగాలను వల్లించే

మీ కంపునోళ్లను కడిగేందుకు వాటినెప్పుడైనా వాడారా

మనువాదం, వర్ణాశ్రమ ధర్మం అని ప్రవచించే

బుద్ధి శుద్ధికి పుపయోగించారా

మీ కానుకలతో

మీరు నా మాన మర్యాదలను మంటగలిపారు

నా నైవేద్యంతో

మీ అహంభావ, గర్వాలను అసహ్యించుకుంటున్నా

మా బాబా సాహెబ్‌ చర్యలు

నా క్షణభంగురమైన వాసనలను శుద్ధి చేస్తాయి

నా కుల అణచివేత, వెలి గాయాలను సబ్బులు మరింత మండిస్తాయి

నాకు మీ సానుభూతి అవసరం లేదు

నాకు మీపై ద్వేషం కావాలి

నిరసన కేకల మధ్య

నా ఆత్మప్రతిష్ట గానం వినిపిస్తాను

అదే నాకు ఆత్మగౌరం, స్వాతంత్య్రాలను,

రణానికి స్వేచ్చ నిస్తుంది.

రెండు సార్ల తిండి కోసం

నేను నీ మలమూత్రాలను మోస్తాను

లేదంటే ఈ సర్వసత్తాక రాజ్యంలో

నేను ఆకలితో నిద్రపోవాలి

సబ్బులు, షాంపులు మీ అజా&క్షన ఆకలిని తప్ప

మా కడుపులను నింపవు

దేశ వెలుగుల ప్రసరణ కోసమే మీ ప్రభువు ఇక్కడున్నాడు

ఆయన ఆహ్లాదం కోసం మమ్మల్ని శుద్ధి చేశారు

భజనపరుల మాదిరి చిరునవ్వులు చిందించమన్నారు

మా అంతరంగం తన మౌనాన్ని వీడితే ఎలాంటి కంపనలు వస్తాయో తెలుసా ?

ఓ దేవుడా మా ఇంటిని చూసేందుకు దయచేయి

అది మీ కాషాయ అంగవస్త్రం కంటే శుభ్రంగా వుంటుంది

అయితే నీ అంతరంగం పరిశుద్ధంగా వున్నపుడు మాత్రమే మాట్లాడు

మనువును తగులబెట్టిపుడు మాత్రమే నవ్వు

నీ హృదయంలో నృత్యం చెయ్యి

నా నిశ్శబ్దం బద్దలు కాబోతున్నది

ఇప్పటికే వుషోదయమైంది

మీరు వెనుదిరిగి వెళ్లే ముందు ఇదే నా నైవేద్యం

నేను అంబేద్కర్‌, బుద్దుడు అనే సబ్బులను అర్పిస్తున్నాను

వెళ్లి మీ మానసిక బానిసత్వాన్ని శుద్ధి చేసుకోండి

మీ తాత్వికతలో మనువు చొప్పించిన కులాన్ని అంతం చేయండి

మీ కాషాయ అంగవస్త్రాన్ని తెల్లగా చేయండి

మా వైపు ఇద్దరు సూర్యులు వుండ కూడదు

మిమ్మల్ని భస్మం చేసేందుకు మా స్వంత సూర్యుడున్నాడు

కొద్ది రోజుల క్రితం వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధుడు ఒక గ్రామానికి వెళ్లారు. ఆ సందర్భంగా దళితులకు సబ్బులు, షాంపూలు ఇచ్చి యోగి దర్శనానికి శుభ్రంగా స్నానం చేసి రమ్మని ఆదేశించారు. దానిపై న్యాయవాది, కవి అయిన అసంగ్‌ వాంఖడే స్పందనే ఈ కవిత. అనువాదం ఎం కోటేశ్వరరావు. నేను స్వతహాగా కవిని కాదు కనుక అనువాదంలో ఆ ఆవేశం వుండదు కనుక విమర్శకులు మన్నించాలి. అందువలన ఆంగ్ల మూలాన్ని కూడా ఇక్కడ ఇస్తున్నాను.

Here is my offer
Manu made me unclean.
Your prejudiced mind makes me
reek of caste names and exclusion
I glow with the fragrance of sores,
I stink of oppression and not your shit.

To please your lord, you offered me
soap and shampoo today.
Have you ever used them to clean
those foul smelling tongues,
which talk of raping minorities and violence?
Or used them to clean those brains,
that preach Manuvād and varnashramadharma?

With your offer,
you have abused my dignity.
With my offer,
I am abusing your conceit.

Appropriators of my Babasaheb
act as my ephemeral cleansers.
Soap exacerbates my wounds
of caste oppression and exclusion,
I don’t want your sympathy,
I want your detestation.
I play the song of assertion
in the cries of protests;
It gives me dignity and freedom,
a freedom to fight for.

For two meals
I carry your faeces!
If I don’t, I will sleep
hungry in this Republic.
Soap and shampoo only feed your ignorance,
not my stomach.

Your lord is here to capture the nation’s spotlight
We are bleached, to look presentable;
We are told to cheer like minions,
What will tremble when my insides break their silence?

Oh Lord, come see my home!
It is cleaner than your bhagwa drape.
But talk only when your consciousness is clean;
Smile only when you burn the Manu
dancing in your heart.
For my silence is about to break,
It is dawn already.

Before you turn your back
here is my offer.
I offer you my soaps, Ambedkar and Buddha.
Go clean your mental slavery,
Go annihilate caste and the Manu infused in your reason,
bleach your bhagwa to white.
There cannot be two Suns on this side, and
We have our own, to incinerate yours.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జై నీల్‌- జై లాల్‌ నినాదం అర్థం ఏమిటి ?

12 Thursday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Others, Social Inclusion

≈ 1 Comment

Tags

Ambedkarists, Buddha, caste discrimination, caste system, communist manifesto, Communists, jai lal, jai neel, jyothiba phule, karal marx, sc, scheduled castes, st's

ఎం కోటేశ్వరరావు

   సామాజిక మాధ్యమం అయిన ఫేస్‌బుక్‌, వివిధ గ్రూపులలో సభ్యులు ఒక సమాజం అనుకుంటే దానిలోని మంచి చెడులన్నీ ప్రతిబింబిస్తున్నాయి.బుర్ర తక్కువ పోస్టులు పెట్టే వారి గురించి వదలి వేద్దాం. కొంత మంది సమాజంలో వున్న యథాతథ స్థితిని, వాస్తవాలను ప్రస్తావిస్తున్నారు. తమ అనుభవంలోకి వచ్చిన వాటిని ఆవేదనో, కసి, బాధ, మార్పు రావాలనో ఏదో ఒక భావంతో పెడుతున్నారు. మంచిదే. దేన్నీ దాచుకోవాల్సిన అవసరం లేదు. కారల్‌ మార్క్సు ఒక సందర్భంలో ఇలా చెప్పారు. ‘ హేతువు ఎప్పుడూ వునికిలోనే వుంది, కానీ ఎల్లవేళలా యుక్తమైన రీతిలో లేదు( Reason has always existed, but not always in a reasonable form ) బాధితులు చెప్పే దానిలో ఎప్పుడూ హేతువు వుంటుంది, అయితే అది ఎల్లవేళలా సరైన రీతిలో వ్యక్తం కావటం లేదని చర్చలను జాగ్రత్తగా పరిశీలిస్తే అర్ధం అవుతుంది. ఇది కొందరిని వుద్ధేశించి ప్రతికూలంగా వ్యాఖ్యానిస్తున్నది కాదు, సవరించుకోవాల్సిన అవసరం గురించి సూచించేందుకు మాత్రమే. పెద్దదిగా వున్నప్పటికీ చదవండి, చర్చించండి. సూక్ష్మంలో మోక్షాలు, దగ్గరి దారులు, గోసాయి చిట్కాలు మౌలిక సమస్యలను పరిష్కరించలేవన్నది ఏడుపదుల స్వాతంత్య్ర అనుభవం చెబుతోంది. వాటి గురించి పైపైన కాకుండా లోతుగా చర్చిస్తేనే ప్రయోజనం. కావాల్సింది పాలపొంగు కాదు, మరగటం, మధించటం.

  చరిత్రలో కార్మికులు ఒక దశలో యంత్ర విధ్వంసకులుగా వ్యవహరించినట్లు మనం చదువుకున్నాం. దేశాలను ఆక్రమించుకొనే క్రమంలో ఐరోపాలో నెపోలియన్‌ యుద్ధాలతో సహా అనేక యుద్ధాలు జరిగాయి. పర్యవసానంగా అనేక దేశాలలో ఆర్ధిక పరిస్థితులు దిగజారాయి. అదే సమయంలో పారిశ్రామిక విప్లవంలో భాగంగా పారిశ్రామికవేత్తలు తమ లాభాలను కాపాడుకొనేందుకు నూతన యంత్రాలను ప్రవేశపెట్టారు. వాటిలో బ్రిటన్‌ పవర్‌లూమ్స్‌ పెద్ద మార్పునే తెచ్చాయి. అప్పటి వరకు అక్కడి సాంప్రదాయ నేత కార్మికుల జీవితాలు వీటితో అతలాకుతలమయ్యాయి. యుద్ధాలతో మొత్తంగా కార్మికుల బతుకులూ ఛిద్రమయ్యాయి.ఇటు సంప్రదాయ నేత పని కరువై, అటు ఫ్యాక్టరీలలో సరైన పనిలేక మొత్తం మీద ఏం చేయాలో తెలియని స్థితిలో తమకు కష్టాలు రావటానికి పవర్‌లూమ్స్‌ కారణమని భావించి వాటిని నాశనం చేస్తే పరిష్కారం దొరుకుతుందని భావించి అదే పని చేశారు. వారి ఆవేదనలో హేతువు లేదా వుంది, కానీ యంత్రాల ధ్వంసం పరిష్కారం కాదు. దీంతో 1788లోనే బ్రిటీష్‌ పార్లమెంట్‌ పవర్‌లూమ్స్‌ తదితర యంత్రాల పరిరక్షణకు ఒక చట్టాన్ని తీసుకు వచ్చింది. దాని ప్రకారం ఎవరైనా వాటిని కావాలని ధ్వంసం చేసినట్లు లేదా ధ్వంసం చేసేందుకు అక్రమంగా ప్రాంగణాలలో ప్రవేశించినా, ప్రోత్సహించినా ఏడు నుంచి 14 సంవత్సరాల పాటు ఖైదీల సెటిల్మెంట్లకు ప్రవాసం పంపేవారు. తరువాత యంత్రాలు పనిచేయకుండా కొన్ని భాగాలు లేకుండా చేస్తున్నట్లు గ్రహించి దానిని కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణించారు. దాని పర్యవసానమే ఇప్పటికీ కార్మికులు డ్యూటీ దిగి వెళుతుంటే భద్రతా సిబ్బంది తనిఖీ చేయటం. ఆ తరువాత 1788 చట్టాన్ని రద్దు చేసి మరణశిక్షను కూడా చేర్చి 1823లో మరో చట్టం చేశారు. ఈ యంత్ర విధ్వంస కార్మిక తిరుగుబాటును బ్రిటీష్‌ పాలకులు ఎంత తీవ్రంగా అణచివేశారో తెలుసా ? నెపోలియన్‌తో జరిపిన యుద్ధాలలో ఒకటైన లెబెరియన్‌ ద్వీపకల్పాన్ని నిలబెట్టుకొనేందుకు నియోగించిన సైన్యం కంటే ఎక్కువ మందిని దించారు.

  ఆధునిక చరిత్రలో వుగ్రవాద దారి పట్టిన నక్సల్స్‌ ఏ గ్రూపు అన్నది అప్రస్తుతం, అటవీ ప్రాంతాలలో రోడ్లు వేస్తుంటే కాంట్రాక్టర్ల, లేదా ప్రభుత్వ యంత్రాలను విధ్వంసం చేయటం, రోడ్లను, స్కూలు భవనాలను కట్టకుండా చేశారని మీడియాలో అనేక వార్తలను చదివాము. అన్నింటి కంటే ఆధునిక రూపంలో సంఘటిత కార్మికవర్గం కొన్ని సంవత్సరాల క్రిందట కంప్యూటర్ల వినియోగాన్ని అడ్డుకున్నపుడు వారి మీద కూడా అదే విమర్శ వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే కుల వివక్ష రాక్షసికి బలౌతున్న వారు దానికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటం ఎలా కొనసాగించాలన్నదే సమస్య. దీనిపై తీవ్రమైన పోరాటాన్ని కొనసాగించాలనటంలో ఎలాంటి రాజీ లేదు. ఎలా సాగించాలన్నదే చర్చ. ఈ మధ్య జైనీల్‌-జైలాల్‌ అనే నినాదం వినిపిస్తోంది. ఇదొక శుభపరిణామం.

     కార్మికవర్గం సమాజంలో 99 శాతం మెజారిటీ. మన దేశానికి వస్తే దళితులా, గిరిజనులా, ముస్లింలా, హిందువులా, మరో మతం వారా, బ్రాహ్మలా, కమ్మా, రెడ్డి, కాపు, కుమ్మరి, కమ్మరి ఇలా అన్ని రకాల కులాల వారు కార్మికులలో వున్నారు, ఒక శాతంగా వుండే దోపిడీ వర్గంలోనూ వీరందరూ వున్నారు. వర్గరీత్యా ఏ వర్గంలో వుంటే వారు తమ ఆర్ధిక సమస్యల మీద ఐక్యం అవుతున్నారు, కార్మికులతో పోల్చితే పెట్టుబడిదారులలో అది ఎక్కువగా వుంది. నిజానికి కార్మికులకు సమాజంలోని పేద రైతులు, వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారుల వంటి ఇతర తరగతుల మద్దతు అవసరమే.వీరికీ వారి మద్దతు అవసరమే.

       మన దేశంలో కొంత మంది దృష్టిలో వర్గం కంటే కుల సమస్య పెద్దది. దానితో మరికొంత మంది ఏకీభవించ వచ్చు, విబేధించవచ్చు. అంత మాత్రాన అది పరిష్కరించాల్సింది కాదు అని అర్ధం కాదు. ఏ సమస్య పరిష్కారానికి అయినా అందుకు కలసి వచ్చే స్నేహితులను ఎంచుకోవాలి. వర్గ సమస్యలో పెట్టుబడిదారుడు- కార్మికులు ముఖాముఖీ తేల్చుకుంటారు. సమస్య ఎక్కడంటే కుల వివక్ష, కులాంతర, మతాంతర వివాహాల వంటి సామాజిక అంశాల దగ్గర వస్తోంది. పెట్టుబడి దారీ విధాన వయస్సు ఐదు వందల సంవత్సరాలు అనుకుంటే ఏ రీత్యా చూసినా రెండు వేల సంవత్సరాలకు పైబడే వుంది. ఇది గిజిగాడి గూడు కంటే సంక్లిష్టమైనది. ఇక్కడ కూడా మార్క్సు మహనీయుడు చెప్పినది, అంబేద్కర్‌ చెప్పిన అంశాలు ఎన్నో వున్నాయి. ‘ తత్వవేత్తలు వివిధ పద్దతులలో ప్రపంచానికి భాష్యం మాత్రమే చెప్పారు, సమస్య ఏమంటే దానిని మార్చటం ఎలాగన్నదే’ దీనిని మనం మన దేశంలో దళిత సమస్యకు ఎందుకు వర్తింప చేసుకోకూడదు. వర్తమానంలో జ్యోతిబాపూలే, అంబేద్కర్‌ మాదిరి కాకపోయినప్పటికీ అనేక మంది ప్రముఖులు మనువాదాన్ని వ్యతిరేకించారు. పూలే,అంబేద్కర్‌ తాము నమ్మినపద్దతులలో పరిష్కారాన్ని చెప్పారు. వారితో ఎవరూ విబేధించనవసరం లేదు. కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన 1848లోనే జ్యోతిబాపూలే జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన జరగటం, వెంటనే ఆయన తన సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తరువాత అంబేద్కర్‌ కొనసాగించారు. అంటే మన దేశంలో ఒక విధంగా చెప్పాలంటే కుల వివక్ష వ్యతిరేక పోరాట బీజం కమ్యూనిజానికంటే ముందే పడింది. వేదాలను విమర్శిస్తూ పూలే కుల వివక్ష సమస్యను జనం ముందు పెట్టారు. దళిత్‌ అనే మరాఠీ పదాన్ని ఆయనే ముందు వుపయోగించారని చెబుతున్న విషయం తెలిసిందే.

    ‘విద్య లేకపోవటం తెలివి తేటల లేమికి దారి తీస్తుంది, అది నైతిక విలువల లేమికి కారణం అవుతుంది, నైతిక విలువలు లేకపోతే ప్రగతి వుండదు, ప్రగతి లేకపోతే జనం దగ్గర డబ్బు వుండదు, డబ్బలేకపోతే దిగువ కులాలపై అణచివేతకు దారితీస్తుంది, చూడండి విద్యలేకపోవటం ఎన్ని అనర్ధాలకు కారణం అవుతుందో ‘ అన్న పూలే అందుకుగాను విద్యాసంస్ధలను స్థాపించటానికి ప్రాధాన్యత ఇచ్చారు. తరువాత అంబేద్కర్‌ కూడా పూలే బాటలోనే విద్యతో దళితుల అభ్యున్నతి సాధించవచ్చని భావించి ఆమేరకు ‘బహిష్కృత్‌ హితకారిణీ సభ ‘ సంస్ధను స్ధాపించారు.అయితే వెంటనే తన పంధా మార్చుకొని అస్పృస్యతకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. సమీకరించు, పోరాడు, సాధించు అన్నది అంబేద్కర్‌ నినాద సారాంశం. ఇదంతా భారత్‌లో కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా వేళ్లూనుకోక ముందే ప్రారంభమైంది.

    మన దేశంలో కుల వివక్ష, కుల నిర్మూలన సంస్కరణలు, పోరాటానికి పూలేతో అంటే 1848లో నాంది పలికారంటే ఇప్పటికి 168 సంవత్సరాలు, మధ్యలో అంబేద్కర్‌ కలిసి 90 సంవత్సరాలు . ఈ మొత్తం కాలంలో దళిత వుద్యమం సాధించిన విజయాలేమిటి? వైఫల్యాలేమిటి అన్నది బేరీజు వేసుకోవాల్సిన అవసరం లేదా? విజయాలను మరింత పటిష్ట పరుచుకోవటం, వైఫల్యాలను అధిగమించటానికి కొత్తదారులు వెతకాల్సిన అవసరం లేదా ? మన దేశంలో కమ్యూనిస్టు వుద్యమం 1920లో ప్రారంభమైంది. పురాణాల ప్రకారం పుట్టుతోనే శ్రీకృష్ణుడు చెరసాల పాలై తరువాత అజ్ఞాతంలో పెరిగినట్లుగా భారత కమ్యూనిస్టుపార్టీ కూడా నిర్బంధాలు, నాయకుల అరెస్టులు,జైలు జీవితంతోనే ప్రారంభమైంది. పుట్టిన పదిహేను సంవత్సరాల తరువాతే బహిరంగంగా పనిచేయటం సాధ్యమైంది. తరువాత మరోసారి నిర్బంధం, నిషేధం. అంటే దాని వయస్సు కూడా తొమ్మిది పదులు. మ్యూనిస్టులు కూడా పూలే-అంబేద్కరిస్టుల మాదిరి తమ విజయాలు,పరాజయాలను సింహావలోకనం చేసుకొని జనసామాన్యాన్ని ఆకర్షించటంలో ఎదురౌతున్న సమస్య లేమిటో అందుకు అనుసరించాల్సిన మార్గాలేమిటో రూపొందించుకోవాల్సి వుంది. రెండు వుద్యమాలు ఒకదానితో ఒకటి విబేధించే అంశాలు వున్నాయి,అంగీకరించేవి వున్నాయి. ఏవి ఎక్కువ ఏవి తక్కువ అన్న వాటిని చర్చించుకోవచ్చు. అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. అది ఎప్పుడు సాధ్య పడుతుందంటే అంగీకృత అంశాలపై కలసి పనిచేసినపుడే.రెండు వుద్యమాల మధ్య వున్నవి మిత్ర వైరుధ్యాలే తప్ప శతృపూరితమైనవి కాదు.ఒక వేళ ఎవరైనా అలా చిత్రించేందుకు ప్రయత్నిస్తే తెలుసుకోలేనంత అమాయకంగా జనం లేరు. అంబేద్కరిస్టులు చెబుతున్న దళిత సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు వ్యతిరేకం కాదు, లేదా కమ్యూనిస్టులు చెబుతున్న ఆర్ధిక దోపిడీ అంతం కావాలనటాన్ని పూలే-అంబేద్కరిస్టులు వ్యతిరేకించటం లేదు. అయితే సమస్య ఎక్కడ. కమ్యూనిస్టులలో విలీనం కమ్మని పూలే-అంబేద్కరిస్టులను గానీ లేదా తమ రాజకీయ వేదికను రద్దుచేసుకొని సామాజిక వుద్యమాలలో విలీనం కమ్మని కమ్యూనిస్టులను గానీ ఎవరూ కోరటం లేదు. కమ్యూనిస్టు, వామపక్ష శక్తుల మధ్య సైద్ధాంతిక విబేధాలు వున్నాయి కనుకనే ఆ పార్టీలు విడివిడిగా వుంటూ ఐక్యంగా పోరాడుతున్నాయి.కలసి వచ్చిన చోట లౌకిక శక్తులను తోడు చేసుకుంటున్నాయి.దీనికి కూడా దాన్నే ఎందుకు వర్తింప చేయకూడదు. మనకు స్వాతంత్య్ర వుద్యమం అనేక పాఠాలు నేర్పింది. కాంగ్రెస్‌ సంస్థలోనే ఎన్ని భావజాలాలు వున్నవారు కలసి పని చేయలేదు. వారిలో ఎన్ని విబేధాలు లేవు? అయినా వారిని కలిపి వుంచింది తెల్లవాడిని దేశం నుంచి తరిమివేయాలి అన్న ఏకైక లక్ష్యం ఒక్కటే.

   ముందుగా పరిష్కారం కావాల్సింది దళిత సమస్య అన్నది మొత్తంగా ఇప్పటి వరకు పూలే-అంబేద్కరిస్టులు ముందుకు తెచ్చిన వైరుధ్యం. అర్ధిక దోపిడీ అంతమైతే సామాజిక సమస్యలు పరిష్కారం కావటం సులభం కనుక దానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది కమ్యూనిస్టుల వైఖరిగా వుంది. ఇవి ఇలా వుంటే ఇప్పుడు ఈ రెండు శక్తులను దెబ్బతీసి అటు ఆర్ధిక దోపిడీని పెంచే నయా వుదారవాదాన్ని కాంగ్రెస్‌ ప్రారంభిస్తే దానిని మరింత వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు బిజెపి, దానితో చేతులు కలిపిన శక్తులు చూస్తున్నాయి. దీనికి తోడు సామాజిక వివక్షను పెంచి పోషించే మనువాదాన్ని మరింత పటిష్ట పరిచేందుకు కూడా మత శక్తులు మరింత వూపుతో పనిచేస్తున్నాయి. కుల శక్తులు దానికి అనుబంధంగా వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. అందువలన నయావుదారవాదం, మతోన్మాదం అనే జంట ప్రమాదాలను ఎదుర్కోవటం ఎలా అన్నది సమస్య.

     నయా వుదారవాదం ఇంకా వేగంగా, విస్తృతంగా అమలులోకి వస్తే అమలులో వున్న విద్యా, వుద్యోగ రిజర్వేషన్లు మరింతగా తగ్గిపోతాయి. ఇప్పటికే సామాజిక రంగంలో ఎవరు ఎలా వుండాలో, వుండకూడదో నిర్ణయించేందుకు మతశక్తులు ఎలా ముందుకు వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఈ జంట ముప్పును తప్పించకుండా ఈ వుద్యమాలు ముందుకు సాగవు. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు పార్టీల వైఖరిలో ముఖ్యంగా సిపిఎం వైఖరిలో వచ్చిన మార్పును గత పది హేను సంవత్సరాలుగా వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చూస్తున్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాటానికి ప్రాధాన్యత ఇస్తూ పని చేస్తున్నారు. ఇప్పుడు అఖిలభారత స్థాయిలో కూడా అలాంటి సంస్ధ ఏర్పడి రాష్ట్రాల వుద్యమాలను మరింత ముందుకు తీసుకుపోతున్నది. ఇంకా అనేక సంస్ధలు కమ్యూనిస్టులతో సంబంధం లేకుండానే అలాంటి కృషే చేస్తున్నాయి.అయితే అన్ని వుద్యమాలు,వుద్యమ రూపాలు ఒకే విధంగా వుండటం లేదు. అందుకే ముందే చెప్పినట్లు సామాజిక వుద్యమ సంస్ధలైనా, రాజకీయ పార్టీలైనా అంగీకృత అంశాల మేరకు కలసి పనిచేయాలి. ఈ విషయంలో ఇటీవలి కాలంలో అంబేద్కరిస్టుల వైఖరిలో కూడా మార్పును గమనిస్తున్నాం, రిజర్వేషన్లు అమలు జరగాలంటే అసలు ప్రభుత్వ వుద్యోగాలు, ప్రభుత్వ రంగంలో పరిశమ్రలు వుండాలి. వుద్యోగాలను క్రమంగా రద్దు చేస్తున్నారు, పరిశ్రమలను మూసివేస్తున్నారు, లేదా పొరుగు సేవల పేరుతో పర్మనెంటు వుద్యోగాలను రద్దు చేస్తున్నారు. వీటిని రక్షించుకోవటంతో పాటు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం ప్రారంభమైన వుద్యమంలో కూడా వారు భాగస్వాములు కావటం ప్రారంభమైంది.

   ఇక్కడ ఒక విషయంపై స్పష్టత కలిగి వుండటం అవసరం. మహిళల సమస్యలు మహిళలకే తెలుస్తాయి, బీసిల సమస్యలు వారికే తెలుస్తాయి, ఎస్సీ,ఎస్టీల సమస్యలు వారికే తెలుస్తాయి. ఈ అభిప్రాయాలతో ఎవరూ విబేధించాల్సిన అవసరం లేదు. వాస్తవం వుంది. పేచీ ఎక్కడ వస్తుందంటే ఈ తరగతులకు చెందని వారికి ఆ సమస్యలు తెలియవు, అందువలన వారు మాట్లాడకూడదు, వుద్యమాలకు సారధ్యం వహించకూడదు అన్న పెడ ధోరణులకు గురైన స్థితి వుంది. దీనికి గురైన వారు రెండు రకాలు. ఇది నయా వుదారవాద భావజాలం ముందుకు తెచ్చిన విభజించి పాలించు అన్న పాత ఎత్తుగడలకు కొత్తరూపం. తమకు తెలియకుండానే ఇది నిజమే కదా అనుకున్నవారు కొందరు. వీరితో పేచీ లేదు. మంచి చెడులను వివరిస్తే అర్ధం చేసుకుంటారు. రెండో రకం వారు వున్నారు. అన్నీ తెలిసి కూడా ఈ వాదాన్ని ముందుకు తెచ్చేవారు. వీరు కలిగించే హాని అంతా ఇంతా కాదు. అగ్రవర్ణాలుగా పిలవబడుతున్న కులాలలో పుట్టిన వారు మాట్లాడ కూడదు అంటే రాజ కుటుంబంలో పుట్టిన బుద్దుడు ఎవరు? ఆయన కులతత్వాన్ని వ్యతిరేకించిన వారిలో ఆద్యుడిగా పరిగణించబడుతున్నారా లేదా ? అందువలన ఎవరు ఏ కులంలో పుట్టారు లేదా పేదవాడా, ధనికుడా అని కాదు, ఏం చెబుతున్నారు అన్నది ముఖ్యం. ఒక అగ్రకులంలో పుట్టిన వ్యక్తి కుల తత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే అగ్రకులతత్వం వున్న వారి నుంచి దూరమైనట్లే. ఒక కులంలో పుట్టటం అనేది ఒక యాదృచ్చిక ఘటన మాత్రమే.

    మతశక్తులు తమ అజెండాను అమలు జరిపే క్రమంలో తమకు తెలియకుండానే హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, జెఎన్‌యు విశ్వవిద్యాలయాలలో వ్యవరించిన తీరుతో కమ్యూనిస్టులు, వామపక్షాలు,అంబేద్కరిస్టులు, సామాజిక న్యాయం కోరుకొనే ఇతర అనేక శక్తులను దగ్గరకు తెచ్చాయి. దాని నుంచి వచ్చిందే జైనీల్‌ -జై లాల్‌ నినాదం.ఎవరి ఎజండాలు వారు కలిగి వుండండి, ఎవరి జండాలను వారు మోసుకోండి. సమస్యలపై కలసి పనిచేయండి, జనానికి మేలు చేయండి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

The Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Amendment Rules, 2016 notified

15 Friday Apr 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Social Inclusion

≈ Leave a comment

Tags

PoA, Prevention of Atrocities, Scheduled Tribes, The Scheduled Castes, The Scheduled Castes and the Scheduled Tribes, The Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Amendment Rules 2016

 Amendments done in the Principal Rules namely the Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Rules, 1995 by the Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Amendment Rules, 2016 have been notified on 14th April.

     Consequent upon amendments done in the Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) {PoA} Act, 1989 by the Scheduled Castes and the  Scheduled Tribes (Prevention of Atrocities) Amendment Act, 2015 (No. 1 of 2016), certain amendments had been  necessitated in the subordinate legislation namely the Scheduled Castes and the  Scheduled Tribes (Prevention of Atrocities) Rules, 1995, made by the Central Government in exercise of powers conferred by sub-section (1) of  Section 23 of the PoA Act.

  1.  Accordingly a Task Force was constituted under Chairpersonship of the Secretary, Department of Social Justice and Empowerment, Ministry of Social Justice and Empowerment, vide Order dated 22.01.2106, with members drawn fromMinistries of Social Justice and Empowerment, Home Affairs, Tribal Affairs, Law and Justice, National Commission for Scheduled Castes, National Commission for Scheduled Tribes, State Governments of Andhra Pradesh, Bihar, Uttar Pradesh, Madhya Pradesh, Maharashtra, Rajasthan, Tamil Nadu and Odisha. The Task Force having held two meetings on 02.02.2016 and 22.02.2016, finalized its report.  Based on the recommendations contained in the said Report of the Task Force and the introspection done in the Department of Social Justice and Empowerment, amendments of following nature have been done in the PoA Rules:-

(i)  Amendments of consequential nature arising from amendments done in the PoA Act.

(ii) Rationalization of the phasing of payment of relief amount to victims for various offences of atrocities, and substitution of  Annexure-I of the Schedule to the PoA Rules, which specifies relief amount for various offences of atrocities. This includes prescribing relief for new offences of atrocities as well for rephrased/expanded offences and not linking payment of any part of relief amount with the requirement of medical examination for non-invasive kind of offences against women likesexual harassment, gestures or acts intended to insult the modesty, assault or use of criminal force with intent to disrobe, voyeurism, stalking.

(iii) Provision of relief for offences of rape and gang rape.

(iv) Increase in the existing quantum of relief amount i.e. between Rs. 75,000/- to Rs. 7, 50,000/-, depending upon the nature of the offence, by around 10%, as rounded of i.e. between Rs. 85,000/- to Rs. 8, 25,000/-, depending upon the nature of the offence, while linking it with the Consumer Price Index for Industrial Workers for the month of January, 2016.

  1. The Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Amendment Rules, 2016, have been accordingly notified in the Gazette of India Extraordinary on 14th April, 2016.

The key features of the Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Amendment Act, 2015, are:

  • New offences of atrocities like tonsuring of head, moustache, or similar acts which are derogatory to the dignity of members of Scheduled Castes and Scheduled Tribes, garlanding with chappals, denying access to irrigation facilities or forest rights , dispose or carry human or animal carcasses, or to dig graves, using or permitting manual scavenging, dedicating a Scheduled Caste or a Scheduled Tribe women as devadasi, abusing in caste name, perpetrating witchcraft atrocities, imposing social or economic boycott, preventing Scheduled Castes and Scheduled Tribes candidates from filing of nomination to contest elections, hurting a Scheduled Castes/Scheduled Tribes woman by removing her garments, forcing a member of Scheduled Caste/Scheduled Tribe to leave house , village or residence, defiling objects sacred to members of Scheduled Castes and Scheduled Tribe, touching or using words, acts or gestures of a sexual nature against members of Scheduled Castes and Scheduled Tribe.
  • Addition of certain IPC offences like hurt, grievous hurt, intimidation, kidnapping etc., attracting less than ten years of imprisonment, committed against members of Scheduled Caste/Scheduled Tribe, as offences punishable under the PoA Act. Presently, only those offences listed in IPC as attracting punishment of 10 years or more and committed on members of Scheduled Caste/Scheduled Tribe are accepted as offences falling under the PoA Act.
  • Establishment of Exclusive Special Courts and specification of Exclusive Special Public Prosecutors also, to exclusively try the offences under the PoA Act to enable speedy and expeditious disposal of cases.
  • Power of Special Courts and Exclusive Special Courts, to take direct cognizance of offence and as far as possible, completion of trial of the case within two months, from the date of filing of the charge sheet
  • Addition of chapter on the ‘Rights of Victims and Witnesses’.
  • Defining clearly the term ‘wilful negligence’ of public servants at all levels, starting from the registration of complaint, and covering aspects of dereliction of duty under this Act.•Addition of presumption to the offences –If the accused was acquainted with the victim or his family, the court will presume that the accused was aware of the caste or tribal identity of the victim unless proved otherwise.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

దేనికీ ‘అసహనం’, ఎందుకా ‘సహనం ‘ ఓ మహాత్మా ! ఓ మహర్షీ !!

13 Saturday Feb 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

Intolerance, Reservations, Tolerance

 

ఎం కోటేశ్వరరావు

     ఇటీవలి కాలంలో సామాజిక మీడియాలో రిజర్వేషన్లు,సామాజిక వివక్షపై జరుగుతున్న చర్చలలో రెండు రకాల ధోరణులు వ్యక్తం అవుతున్నాయి. భాష, భావం తీరుతెన్నులు చూస్తే వుభయులూ తీవ్ర స్ధాయిలోనే వున్నట్లు కనిపిస్తోంది. ఒకటి వేల సంవత్సరాల అణచివేత, అమానుష వివక్షపై ఎందుకీ సహనం అన్న ఆగ్రహంతో కూడిన జ్వాల. రెండవది దీనికి బాధ్యత తమది కానపుడు దాని పర్యవసానాలను తామెందుకు అనుభవించాలన్న ఆక్రోశం, దాని నుంచే దళితులు, గిరిజనులు, ఓబిసిలకు రిజర్వేషన్లు ఎంతకాలం కొనసాగిస్తారు అనే తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. పుట్టుక అన్నది యాదృచ్చికం. కానీ ఒక చోట పుట్టిన వారికి ఒక ముద్రవేసి ఒక విధంగానూ, మరొక చోట పుట్టిన వారికి మరో తోక తగిలించి వేరే విధంగా చూడటం అన్నది కాదనలేని వాస్తవం. రిజర్వేషన్ల వయస్సు ఏడు పదులు, మరి అమానుష వివక్ష, అణచివేత ఎంత కాలం నుంచి కొనసాగుతోంది, ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది, చెప్పేవారెవరు ?

      రిజర్వేషన్ల గురించి రానున్న రోజుల్లో మరోసారి తీవ్ర చర్చకు తెరలేవ నుంది.ప్రయివేటు రంగంలో కూడా వుద్యోగాలలో రిజర్వేషన్‌ విధానాలను పాటించాలని వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ (ఎన్‌సిబిసి) కేంద్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సిఫార్సు చేసింది. ప్రభుత్వ రంగంలో వున్న రిజర్వేషన్లనే తొలగించాలని తాము కోరుతుంటే ప్రయివేటు రంగంలో కూడా అమలు జరపాలని సిఫారసు చేయటం ఏమిటని రిజర్వేషన్‌ వ్యతిరేకులు మండిపడుతున్నారు. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల కారణంగా అప్పటి నుంచి క్రమంగా ప్రభుత్వరంగంలో పెట్టుబడులు నిలిచిపోయాయి. అటు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గానీ కొత్త పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి రాలేదు. హెచ్‌ఎంటి, ఐడిపిఎల్‌ , భెల్‌ వంటి కొన్నింటిని ఒక పధకం ప్రకారం మూతపడేట్లు చేశారు. అవి పోగా వున్నవాటిలో యాంత్రీకరణ, పాక్షిక ప్రయివేటీకరణ వంటి చర్యల ద్వారా 2006 -12 మధ్య కాలంలో ప్రభుత్వ రంగంలో 3.3శాతం వుద్యోగాలు తగ్గిపోగా, ఇదే సమయంలో ప్రయివేటు రంగంలో 35.7శాతం పెరిగాయి. ప్రయివేటు రంగం అందరికీ గౌరవ ప్రదమైన జీవనానికి వుపాధి కల్పించి వుంటే అసలు ఈ రిజర్వేషన్ల అనుకూలం లేదా వ్యతిరేకత సమస్య తలెత్తి వుండేది కాదు. ఈనేపధ్యంలోనే ఈ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు జరపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. దానికి అనుగుణ్యంగానే ఎన్‌సిబిసి సిఫారసు వెలువడింది. ఇప్పటికే ఈ డిమాండ్‌పై పలు చోట్ల ప్రచార ఆందోళన చేపట్టిన వామపక్షాలు, అవి పనిచేసే ప్రజాసంఘాలు సహజంగానే ఈ పరిణా న్ని హర్షిస్తాయి. తమ వుద్యమాలను మరో మెట్టు ముందుకు తీసుకుపోతాయి.

     ప్రస్తుతం అధికారంలో వున్న కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారస్‌ను తిరస్కరిస్తుందా? ఆమోదిస్తుందా? ఆమోదిసే,్త అమలు జరుపుతుందా? ఎప్పటి నుంచి? ఎంత కాలం అమలు జరుపుతుంది వంటి అనేక ప్రశ్నలు ముందుకు వస్తాయి. ఇవన్నీ చర్చకు తెరలేపుతాయి. బిజెపి, కాంగ్రెస్‌, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌, డిఎంకె, అన్నాడిఎంకె వంటి ప్రాంతీయ పార్టీలన్నీ పాలకవర్గ పార్టీలే. అధికారంలో లేనపుడు సామాన్య జనం పట్ల కడవల కొద్దీ కన్నీరు కార్చి, అధికారం రాగానే వారిని మర్చిపోయి పెట్టుబడిదారులు, భూస్వాముల సేవలో తరిస్తూ వారి ప్రయోజనాలను కాపాడే వారిని పాలకవర్గ పార్టీలు అంటారు.మిగతావాటిలో సిపిఎం, సిపిఐ వంటి వామపక్ష పార్టీలు కొన్ని సందర్బాలలో అక్కడక్కడా అధికారానికి వచ్చినప్పటికీ వాటిని పాలకవర్గ పార్టీలుగా పరిగణించటం లేదు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో డెమోక్రటిక్‌, లేబర్‌, సోషలిస్టు పార్టీల పేరుతో వున్నవి కూడా ప్రతిపక్షంలో వుండగా ఏమి చెప్పినా సామాజికాంశాలలో తరతమ తేడాలు తప్ప ఆర్ధిక విషయాలలో మిగతా పార్టీలకు ఏమాత్రం తీసిపోవు కనుక వాటిని కూడా పాలకవర్గ పార్టీలే అంటున్నారు.

       ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల విషయానికి వస్తే ఎన్‌సిబిసి సిఫార్సును బిజెపి స్వాగతించింది. అయితే సాధ్వీ సావిత్రీ అదియును నీ పతిప్రాణంబు దక్క అని యముడు షరతు పెట్టినట్లు ఒక చిన్న మెలిక పెట్టింది. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు జరపటానికి అనువైన పరిస్ధితులు వచ్చినపుడు మాత్రమే అమలు జరపాలి తప్ప బలవంతంగా చేయకూడదు అని బిజెపి ప్రతినిధి విజయ్‌ సోంకార్‌ శాస్త్రి ముక్తాయింపు ఇచ్చారు. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఏ ప్రభుత్వం ఈ దిశగా ఏమీ చేయలేదని కూడా విమర్శించారు. అమలుకు అనుకూలమైన పరిస్ధితులంటే ఏమిటో, అవి ఎప్పుడు వస్తాయో మాత్రం చెప్పలేదు. ప్రతి పక్ష కాంగ్రెస్‌ కూడా స్పందించింది.’ ఎల్లవేళలా సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు తాము చర్యలు తీసుకున్నామని,అందుకోసం ఎస్‌సి,ఎస్‌టి మరియు ఓబిసిల రిజర్వేషన్లు అమలు జరిపేందుకు తాము చట్టాలు తెచ్చామని, ప్రయివేటు రంగంలో కూడా రిజర్వేషన్ల గురించి తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నామని కాంగ్రెస్‌ గుర్తు చేసింది.

       ఈ సమస్యపై ప్రతిపక్షాలు దెబ్బలాటలకు కవ్వించే అవకాశం వున్నందున బిజెపి జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ పార్టీ మేథావులు అప్పుడే ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.ఈ సవాలును తేలికగా తీసుకోవద్దంటూ రిజర్వేషన్ల ఫలాలు దిగువకు సక్రమంగా అందాల్సిన వారికి అందనందున వాటిని సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగత్‌ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అయినా బీహార్‌ ఎన్నికలలో బిజెపి భారీ మూల్యం చెల్లించించిందని వారు గుర్తుకు తెచ్చారు. రాజ్యాంగం ఆర్టికల్‌ 16లో ప్రభుత్వరంగంలో రిజర్వేషన్ల గురించి మాత్రమే వుందని ప్రయివేటు రంగం గురించి ఏ కోశానా ప్రస్తావన లేదని, అయితే రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పని చేయవచ్చని, దీని వలన తాత్కాలికంగా బిజెపి రాజకీయ ప్రయోజనం పొందినప్పటికీ మండల్‌ తరహా ఘర్షణలు చోటు చేసుకోవచ్చని, ఓబిసిల తరువాత మతపరమైన మైనారిటీలు కూడా తమకూ అమలు జరపాలని కోరతారని, ఆర్ధిక వ్యవస్ధకు ఎంతో నష్టం కలిగిస్తుందని కాషాయ మేథావులు హెచ్చరిస్తున్నారు. యుపిఏ-2 హయాంలో పారిశ్రామికవేత్తలు బయటి దేశాలలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రాధాన్యత ఇవ్వటంతో పెట్టుబడులు బయటకు పోయాయని, ఇప్పుడు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తే మేథావులు కూడా వలస పోతారని బెదిరిస్తున్నారు. సామాజికంగా వెనుక బడిన తరగతుల వారికి కావాలంటే వుచిత విద్య, విద్యా రుణాల సౌకర్యం వంటివి కలిగించాలని ఎంతో వుదారంగా సలహాలు ఇస్తున్నారు.

     ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు వుద్రేకాలను తగ్గించుకొని ఆలోచించటం అవసరం. సమాజంలోని మెజారిటీ ఎస్‌సి,ఎస్‌టి,ఓబిసి సామాజిక తరగతుల శ్రమ స్వేదంతో సృష్టించబడేదే సంపద. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రమలో ఏ మాత్రం పాత్రలేని కొన్ని సామాజిక తరగతులు వునికిలో వుండటం మన సమాజ ప్రత్యేకత. దానికి కూడా తమకు అనుకూలమైన నియమనిబంధనలను రూపొందించారు. సామాజిక పరిణామ క్రమంలో వివిధ రూపాలలో అధికారిక వ్యవస్ధలు వునికిలోకి వచ్చాయి.అవి సమాజ పురోభివృకి ఆటంకంగా మారినపుడు వాటిని తొలగించి మెరుగైన కొత్త వ్యవస్ధలను ఏర్పాటు చేసుకుంది సమాజం. భూస్వామిక వ్యవస్ధ తమకు ఆటంకం అని భావించినపుడు ఐరోపా దేశాలలో పెట్టుబడిదారులు ఆ భూస్వామిక వ్యవస్ధను నామరూపాలు లేకుండా నాశనం చేశారు. ఫ్రెంచి విప్లవం అంటే అదే. అటువంటిది మన మన దేశంలో జరగలేదు. బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఆక్రమించి తమకు అవసరమైన కొన్ని పరిశ్ర మలను ప్రోత్సహించారు తప్ప మన దేశాన్ని తమకు అవసరమైన ముడిసరకులను అందచేసే దేశంగానే వుంచారు. అందుకే భూస్వాములతో రాజీపడి వారిని కూడా కొనసాగించారు. ఈ కారణంగానే ప్రస్తుతం మన దేశంలో పెట్టుబడిదారుల నాయకత్వంలో భూస్వాములు కూడా అధికార వ్యవస్ధలో పెత్తనం సాగిస్తున్నారు. ఇటువంటి ప్రత్యేక పరిస్ధితి ప్రపంచంలో మరోచోట కనపడదు.అందువలననే మన సమాజంలో కూడా భూస్వామిక, పెట్టుబడిదారీ లక్షణాలు రెండూ జంటగా కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రభావంతో కొన్ని అంశాలో పురోగామి వైఖరిని ప్రదర్శించేవారు మరికొన్ని విషయాలలో తిరోగామి భావజాలానికి లొంగిపోతున్నారు. సామాజిక వివక్ష చట్ట ప్రకారం నేరం అని అంగీకరిస్తూనే తమదాకా వచ్చేసరికి సాంప్రదాయం, ఎప్పటి నుంచో వుంది, ఆ మనోభావాలను కూడా మనం అంగీకరించాలి కదా అనే వాదనలతో చట్ట వ్యతిరేకమైన తాతగారి నాన్నగారి భావాలను ముందుకు పెడుతున్నారు. అది సమాజంలో ఘర్షణకు దారితీస్తోంది.

     ప్రయివేటు రంగ రిజర్వేషన్ల విషయంలో కూడా దీన్ని చూడవచ్చు. ప్రయివేటు రంగంలో ఏ చిన్న పరిశ్రమ పెట్టాలన్నా, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కావాలన్నా చేయాల్సింది ఎవరు ? ప్రభుత్వమే. పెట్టుబడి ఇవ్వాల్సింది ఎవరు ప్రభుత్వరంగంలోని బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలే. అంటే ప్రయివేటు రంగం గాలిపీల్చి మనుగడ సాగించాలంటే ప్రభుత్వం లేకుండా ఒక్క క్షణం నడవదు. ప్రభుత్వమంటే ప్రజలు తప్ప మరొకటి కాదు. అందువలన ప్రభుత్వ రంగం పాటిస్తున్న విధానాలను ప్రయివేటు రంగం అమలు జరపాలని కోరటం ప్రజల హక్కు తప్ప దయాదాక్షిణ్యం కాదు. ఎవరైనా తమకు అందుకు మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటే ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా తమ స్వంత పెట్టుబడులు, విద్యుత్‌, నీరు, భూమి, రోడ్ల వంటి మౌలిక సదుపాయాలను స్వంతంగా సమకూర్చుకోమనండి. అది సాధ్యం కాదు కనుకనే 2004 నవంబరు 18న దేశంలోని 218 అగ్రశ్రేణి సంస్ధలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సాధికారత కలిగించేందుకు మనసా వాచా కర్మణా తాము చేయాల్సిందంతా చేస్తామని రాతపూర్వంగా నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు నివేదించాయి. అంటే అర్ధం ఏమిటి స్వచ్చందంగా ఆ తరగతుల వారికి తగు స్ధానం కల్పిస్తామని చెప్పటమే కదా? ఆ వాగ్దానాన్ని ఎన్ని సంస్ధలు ఎంత మేరకు అమలు జరిపాయి? రాజ్యాంగంలో హక్కులు కాకుండా ఆదేశిక సూత్రాల పేరుతో అనేక పురోగామి భావాలను అమలు జరపాలని చెప్పారు. కానీ వాటిని హక్కుగా అమలు జరిపే పరిస్ధితి ఇంకా మనకు రాలేదనే పేరుతో మన పాలకులు ఎగవేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు ఎటా ఐదారు లక్షల కోట్ల రూపాయలను రాయితీలుగా ఇస్తున్న ప్రభుత్వాలు స్కూళ్లలో పిల్లలకు అవసరమైన తరగతి గదులు, మరుగుదొడ్లు కట్టించాలంటే డబ్బు లేదంటూ ఇంతకాలం వాయిదా వేశాయా లేదా ? కనుకనే ప్రయివేటు రంగంలో వుద్యోగాల రిజర్వేషన్లు చట్టబద్దంగా అమలు జరపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది.

     రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు జరపాల్సింది పది సంవత్సరాలే కదా, అయినా డెబ్బయి సంవత్సరాలుగా అమలు జరుపుతున్నారు, ఇంకా ఎంతకాలం ఇలా అని అనేక మంది ‘అసహనం’ వ్యక్తం చేస్తున్నారు. నిజమే దానిని అర్ధం చేసుకోవాల్సిందే, మనది ప్రజాస్వామ్యం కనుక ఆ భావాల వ్యక్తీకరణను ‘సహించాల్సిందే’, ఎలాంటి మినహాయింపులు లేవు. ఎలాంటి చట్టాలు లేకుండానే వేల సంవత్సరాల పాటు కుల వివక్ష, అణచివేతను సమాజం అమలు జరిపింది. చట్టబద్దంగా రద్దు చేసిన తరువాత కూడా అమలు జరిపేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. దళితులు దేవాలయ ప్రవేశ ం చేస్తే అవి మలిన పడ్డాయనే పేరుతో శుద్ధి చేయటం నేరం. దానికి ఎవరినైనా ఇంతవరకు శిక్షించారా ? వివక్షను ఇంకా రూపు మాపలేదెందుకన్న ‘అసహనం’ ఎందుకు వ్యక్తం చేయరు? అసలు రిజర్వేషన్లకు మూలం ఆ సామాజిక వివక్షే కదా ? దాన్ని నిర్మూలించకుండా దాని పర్యవసానాలను వ్యతిరేకించటం, అసహనం వ్యక్తం చేస్తే ప్రయోజనం వుంటుందా ?

     కుల వివక్షకు వ్యతిరేకంగా ఆరువందల సంవత్సరాల నాడే వేమనతో ప్రారంభించి అంబేద్కర్‌ వరకు ఎందరో సంస్కర్తలు తమ పరిధులు, పద్దతులలో వాటిని నిరసించి వ్యతిరేకించారే మరి సమాజం మొత్తంగా దానిని ఎందుకు నిరసించటంలేదు? ఎక్కడైనా వ్యతిరేకిస్తే సామూహిక దాడులకు పాల్పడటాన్ని ఏమనాలి? ఎక్కడో దక్షిణాఫ్రికాలో, అమెరికాలో నల్లజాతీయుల పట్ల వివక్షను ఖండించే మనం మన చుట్టుపక్కల మానవత్వానికే మాయని మచ్చగా వున్న వివక్ష పట్ల ఎక్కడలేని ‘సహనం ‘ ఎందుకు వహిస్తున్నట్లు? ఆ వివక్షను ఎదుర్కొనే వారి ఆక్రోశానికి ఎవరు సమాధానం చెబుతారు ?

     ఏదేశంలోనూ లేని రిజర్వేషన్లు మన దేశంలోనే ఎందుకు అని ప్రశ్నించే వారు ఎక్కడా లేని వివక్ష, కుల వ్యవస్ధ ఇక్కడ ఎందుకో చెప్పాల్సిన అవసరం లేదా ? అదంతా పూర్వజన్మ సుకృతం ఎవరు ఎంత చేసుకుంటే అంత అనుభవించాలి అని చెబుతారా ? అయితే రిజర్వేషన్లు కూడా అలాంటివే అనుకోవాలి. వేదాలలోనే విజ్ఞానం అంతా నిక్షిప్తమై వుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు. తిరోగమన శక్తులు అధికార కేంద్రాలలో తిష్టవేయటంతో ఇటీవలి కాలంలో మరోసారి చెప్పటం ఎక్కువైంది. అదెంత నిజమో ? వాస్తవాలేమిటో కాసేపు పక్కన పెడదాం. ఆ వేదాలను బ్రహ్మ ముఖంలోంచి పుట్టుకు వచ్చారని చెప్పుకొనే బ్రాహ్మణులు మాత్రమే చదవాలని,చెప్పాలన్న రిజర్వేషన్లు అవి పుట్టినప్పటి నుంచి కొనసాగుతున్నాయి కదా ? బ్రాహ్మణులు తప్ప వేరే కులాల వారు చదవకూడదన్న నిషేధం ఇప్పటికీ కొనసాగుతున్నదా లేదా ? వేదాలు, పురాణాలలో చెప్పినట్లు బ్రాహ్మణులు తిరిపెమొత్తుకుని తినాలి తప్ప వుద్యోగాలు చేయకూడదనే నిషేధాలు ఇప్పుడు లేవే ? రిజర్వేషన్లు కూడా జనాభా ప్రాతిపదికగా దామాషా పద్దతి ప్రకారం అమలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదే. వేద పఠనంపై కొనసాగిన రిజర్వేషన్లతో పోల్చితే నేటి వుద్యోగ, విద్యా రిజర్వేషన్ల వ్యవధి ఎంత ? అన్నింటినీ మన ఖర్మ అనుకొని సహిస్తున్నవారు రిజర్వేషన్ల విషయంలో కూడా అలా అనుకోకుండా వ్యతిరేకంగా వీధులకు ఎందుకు ఎక్కుతున్నట్లు ? హింసాకాండకు ఎందుకు పాల్పడుతున్నట్లు ?

    సామాజిక అంశాలలో కొనసాగుతున్న వివక్ష గురించి ఎక్కడలేని ‘సహనం’ వ్యక్తం అవుతోంది. రిజర్వేషన్లపై వెల్లడిస్తున్న వ్యతిరేకత, ఇతర సామాజిక వివక్షపై వ్యక్తం చేయటం లేదంటే అర్ధం దాన్ని సహిస్తున్నట్లే. సమాజంలో ఈ వైఖరి కొనసాగినంత కాలం ఏదో ఒక రూపంలో దాని పర్యవసానాలు సంభవిస్తూనే వుంటాయి. రిజర్వేషన్లు కొనసాగుతూనే వుంటాయి. అయితే రిజర్వేషన్లే అణచివేతకు గురైన సామాజిక వర్గాలకు ఆశించిన మేలు చేకూర్చలేవని కూడా ఈ కాలంలో రుజువైంది. అందువలన పరిమితంగా వున్న అవకాశాలను చేజిక్కించుకొనేందుకు కొట్లాడుకోవటం కాకుండా అందరికీ అన్ని అవకాశాలు కల్పించే ప్రత్యామ్నాయ విధానాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం లేదా ? ఆలోచించండి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !
  • అక్రమం జరిగిందా లేదా విచారణకు ఆదేశిస్తారా లేదా : అదానీ కంపెనీలపై నోరు విప్పని ప్రధాని నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: