• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: August 2020

దేవుడి పేరుతో రాష్ట్రాలకు జిఎస్‌టి శఠగోపం ? అబద్దాలతో తప్పుదారి పట్టిస్తున్న బిజెపి !

29 Saturday Aug 2020

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP False Claims, Old IMF data, Old IMF data about India


ఎం కోటేశ్వరరావు


కోవిడ్‌-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. అన్ని దేశాల పాలకులకు వైరస్‌ పెద్ద పరీక్షగా మారింది. అనేక దేశాల పాలకులు, పాలక పార్టీలు జిమ్మిక్కులు చేసి జనాన్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ అనే చులకన భావం ఎల్లెడలా వ్యాపించి ఉంది.


” నరేంద్రమోడీ భారత్‌కు దైవమిచ్చిన బహుమతి, పేదల పాలిట రక్షకుడు ” అని ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న ఎం.వెంకయ్య నాయుడు గతంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పని చేసిన సమయంలో వర్ణించారు. 2016 మార్చి 21వ తేదీన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సమయంలో ప్రవాహంలా దొర్లిన ఈ మాటలను అప్పుడు నరేంద్రమోడీ అభిమానులు వహ్వా వహ్వా అంటూ ఎంతగానో ఆనందించారు. మీడియా కూడా ప్రముఖంగానే ఈ వార్తలను ఇచ్చింది. సమావేశం ముగిసిన తరువాత కొందరు విలేకర్లు వెంకయ్య నాయుడి పొగడ్తల గురించి అడగ్గా హౌం మంత్రిగా ఉన్న రాజనాధ్‌ సింగ్‌ వెంకయ్యగారు మాట్లాడుతుండగా తాను వినలేదని తప్పించుకున్నారు. పోనీ దేశానికి దేవుడు ఇచ్చిన బహుమతిగా నరేంద్రమోడీని మీరు గానీ బిజెపిగానీ భావిస్తున్నదా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తిరస్కరించారు.
దేవుడు ఇచ్చిన బహుమతి, పేదల పాలిట రక్షకుడు అయిన నరేంద్రమోడీ ఏలుబడిలో జరగరానివి జరిగిపోతున్నాయి. ఆగస్టు 27న జిఎస్‌టి 41వ కౌన్సిల్‌ సమావేశం ముగిసిన తరువాత కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దైవ విధి లేదా దైవిక కృత్యం( యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ ) కారణంగా కరోనా మహమ్మారి వలన పన్ను వసూళ్లు తగ్గాయని సెలవిచ్చారు. దేశానికి తానిచ్చిన ” బహుమతి ” గురించి దేవుడు మరచి పోయినట్లా ? పేదల పాలిట రక్షకుడు వలస కార్మికులను స్వ స్ధలాలకు చేర్చటంలో ఎలా ఇబ్బందులు పెట్టారో, అలవిగాని ఇబ్బందులకు, దిక్కులేని చావులకు ఎలా కారకులయ్యారో, పని కోల్పోయిన వారి కడుపు ఎలా నింపుతున్నారో యావత్‌ దేశంతో పాటు దేవుడు కూడా చూస్తేనే ఉన్నాడు కదా !


ఐదు సంవత్సరాల పాటు జిఎస్‌టి వలన నష్టపోయే రాష్ట్రాలకు అంగీకరించిన సూత్రం ప్రకారం ఎంత నష్టమైతే అంత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. 2017 జూలై ఒకటి నుంచి 2022 జూన్‌ 30వరకు ఈ అవగాహన అమల్లో ఉంటుంది. అమల్లోకి వచ్చిన తేదీ నాటికి రాష్ట్రాలకు అంతకు ముందున్న అమ్మకపు పన్ను మీద ప్రతి ఏటా 14శాతం వృద్ధి ఉంటుందనే భావనతో రాష్ట్రాల ఆదాయాన్ని లెక్కించాలి. 2017 జూలై ఒకటి నాటికి వంద రూపాయలు ఆదాయం వచ్చిందనుకుందాం. మరుసటి సంవత్సరం దాన్ని రు.114గా పరిగణించాలి. ఒక వేళ ఆ మొత్తం రాకపోతే ఎంత తగ్గితే అంత మొత్తాన్ని ప్రతి రాష్ట్రానికి కేంద్రం చెల్లించాలి. మరుసటి సంవత్సరం 114 రూపాయలు మీద పద్నాలుగు శాతాన్ని పెంచి లెక్కించితే ఆ మొత్తం రు.129.96 అవుతుంది.తరువాత రూ.148.15కు పెరుగుతుంది. ఇలా ఐదు సంవత్సరాలు పెంచుతూ అమలు జరపాలి, సదరు మొత్తాలకు ఎంత తగ్గితే అంత మొత్తాన్ని కేంద్రం ఇవ్వాలి.


గత ఏడాది అంటే 2020 మార్చి నెల వరకు నష్టం మొత్తాన్ని చెల్లించిన కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి చెల్లింపులను నిలిపివేసింది. నలభై ఒకటవ జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశానికి నివేదించిన వివరాల ప్రకారం 2020-21 సంవత్సరానికి మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు ఆదాయం తగ్గుతుందని, జిఎస్‌టి సెస్‌ ద్వారా రూ.65వేల కోట్ల మేరకు సమకూరుతుందని, నిఖర ఆదాయ లోటు రూ.2.25లక్షల కోట్లని చెప్పారు. ఈ మొత్తాన్ని కేంద్రం చెల్లించాలన్నది రాష్ట్రాల డిమాండ్‌. అయితే రుణాలు తీసుకొని నష్టపోయిన ఆదాయాన్ని సమకూర్చుకొంటే తరువాత ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని దానికి గాను రెండు పద్దతులలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలని కేంద్రం కోరింది. దీనికి గాను వారం రోజుల గడువును రాష్ట్రాలు కోరాయి.


సాధారణ పరిస్ధితుల్లో అవగాహన ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని అయితే ఆ మొత్తం సెస్‌ నిధి నుంచి తప్ప ఇతర ఖాతాల నుంచి చెల్లించకూడదని అటార్నీ జనరల్‌ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.అయితే దైవిక కృత్యాల ద్వారా ఆదాయం తగ్గితే కేంద్రం చెల్లించాలన్న నిబంధన లేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశంలో వాదించారు. అదే పల్లవిని బిజెపి పాలిత రాష్ట్రమైన అసోం ఆర్ధిక మంత్రి హేమంత బిస్వాస్‌ శర్మ అందుకున్నారు. వారం తరువాత రాష్ట్రాలు ఏమి చెబుతాయి అన్న అంశాన్ని పక్కన పెడితే దైవిక కృత్యం పేరుతో కేంద్రం నుంచి రాష్ట్రాలకు చెల్లించాల్సిందేమీ లేదని చెప్పినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే దేవుడి పేరుతో శఠగోపం పెట్టటాన్ని రాష్ట్రాలు ఎలా పరిగణిస్తాయి, పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది. లోటును పూడ్చుకొనేందుకు రాష్ట్రాలకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. జిఎస్‌టి పరిధిలో లేని మద్యం, చమురు, మరికొన్ని వస్తువులపై ఇప్పటికే రాష్ట్రాలు గరిష్టంగా పన్ను వసూలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం డీజిలు, పెట్రోలు ధరల విధానాన్ని పక్కన పెట్టి వాటిమీద పన్నులను పెంచటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌ ధరలతో నిమిత్తం లేకుండా ధరలు పెంచుతూ వినియోగదారుల జేబులు కొడుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రాలు నిధుల లేమితో ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. అందుకోసం వైరస్‌ వ్యాప్తి ప్రమాదాన్ని పట్టించుకోకుండా మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం, రాష్ట్రాలు మద్యం ధరలను విపరీతంగా పెంచిన తీరును చూశాము. ఇప్పుడు రానున్న రోజుల్లో జిఎస్‌టి ఆదాయం తగ్గటం ఖాయమని తేలిపోయినందున వివిధ వస్తువులపై జిఎస్‌టిని పెంచినా చేసేదేమీ లేదు. పెట్రోలు, డీజిలు ధరలను భరిస్తున్నట్లే జనం జిఎస్‌టి పెంపుదలకు కూడా నోరెత్త కుండా అలవాటు పడాల్సి ఉంటుంది.


అనేక మంది నిపుణులు, సంస్ధలు, సర్వేలు దేశ ఆర్ధిక వ్యవస్ధ తిరిగి కోలుకోవటం గురించి పెదవి విరుస్తున్నాయి తప్ప ఆశాభావం వెలిబుచ్చటం లేదు. కానీ అధికారపక్షం బిజెపి మాత్రం దేశం వెలిగిపోనుందని చెప్పటం గమనించాల్సిన అంశం. ఆగస్టు 22న ఆ పార్టీ సామాజిక మాధ్యమాల్లో ఒక ట్వీట్‌ చేసింది. దానికి మద్దతుగా సమాచారం ఉన్న చిత్రాన్ని కూడా జత చేసింది. ట్వీట్‌లో ఇలా ఉంది. ” కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రధాన దేశాలన్నీ తిరోగమన వృద్ధితో ప్రపంచం ఆర్ధికంగా రక్తమోడుతూ తంటాలు పడుతుండగా 2020లో సానుకూల వృద్దితో వెలిగిపోయే చోట భారత్‌ ఉంటుంది. వేగంగా అభివృద్ది చెందుతున్న దేశ స్దాయిని అది నిలబెట్టుకుంటుంది ” అని పేర్కొన్నది.
పైన పేర్కొన్న అభిప్రాయాన్ని బలపరుస్తూ బిజెపి విడుదల చేసిన చిత్రంలో ” కోవిడ్‌-19 సమయంలో భారత అసమాన ఆర్ధిక పోరాటం ” అని ఒక నినాదం ” 2020లో ప్రపంచంలోని పెద్ద ఆర్ధిక వ్యవస్దలలో అత్యధిక జిడిపి అభివృద్దిని నమోదు చేసేందుకు భారత్‌ నడుం కట్టింది ” అని మరొక నినాదాన్ని రాశారు. వాటి కింద భారత్‌ 1.9శాతం, చైనా 1.2 శాతం చొప్పున వృద్ది చెందుతాయని, అమెరికా 5.9, జర్మనీ 7, ఫ్రాన్స్‌ 7.2, ఇటలీ 9.1, స్పెయిన్‌ 8, జపాన్‌ 5.2, బ్రిటన్‌ 6.2 , కెనడా 6.5 శాతాల చొప్పున తిరోగమన వృద్ధి నమోదు చేస్తాయని పేర్కొన్నారు. ఈ అంకెలను అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్ద నుంచి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఐఎంఎఫ్‌ అంకెలకు, ఇతర సంస్దల అంచనాలకు తేడాలుంటాయి. వాటి గురించి పేచీ లేదు. ఈ అంకెలతో బిజెపి జనాన్ని తప్పుదారి పట్టించింది అన్నదే గమనించాల్సిన అంశం. ఇదే బిజెపి ఏప్రిల్‌ 15న చేసిన ఒక ట్వీట్‌లో ఇదే అంకెలతో భారత అభివృద్ది గురించి పేర్కొన్నది. అప్పటి చిత్రంలో 2021లో పైన పేర్కొన్న దేశాల ఆర్ధిక వ్యవస్ధలు పురోగమనంలో ఉంటాయని ఐఎంఎఫ్‌ అంకెలను పేర్కొన్నది. ఇప్పుడు వచ్చే ఏడాది అంచనాలను తొలగించి వర్తమాన సంవత్సరానికి నాలుగు నెలల క్రితం వేసిన అంచనాలు తాజావి అన్నట్లుగా పాత అంకెలనే బిజెపి ఆగస్టు 22న ట్వీట్‌ చేసింది. ఇది తప్పుదారి పట్టించటం తప్ప నిజాయితీ కాదు.


ఈ ఏడాది మిగిలిన కాలమంతా తీవ్ర ఆర్ధిక మాంద్యంలో ఉంటుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో మాత్రమే కోలుకోవటం ప్రారంభం కావచ్చని ఆగస్టు 18-27 మధ్య రాయిటర్స్‌ వార్తా సంస్ద నిర్వహించిన అభిప్రాయసేకరణలో ఆర్ధికవేత్తలు పేర్కొన్నారు. వేగంగా పెరుగుతున్న వైరస్‌ వ్యాప్తిని చూస్తే సమీప భవిష్యత్‌లో కోలుకొనే అవకాశాలు కనిపించటం లేదని, ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున జనం దగ్గర పొదుపు చేసుకున్న మొత్తాలు కూడా కరిగిపోతాయని, తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ధి రేటు 18.3శాతం కుంగిపోనుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మూడు నెలల్లో వృద్ధి రేటు మూడుశాతం మాత్రమే ఉండవచ్చని చెప్పారు. కరోనాకు ముందు స్ధితికి చేరుకొనేందుకు ఏడాది పట్టవచ్చని 80శాతం మంది ఆర్ధికవేత్తలు చెప్పారు. మిగిలిన వారు రెండు సంవత్సరాలకు పైగా పట్టవచ్చని మిగిలిన వారు చెప్పారు.


ప్రతి ఏటా ఐఎంఎఫ్‌ ఏప్రిల్‌లో ఒకసారి, సెప్టెంబరు లేదా అక్టోబరులో రెండవ సారి ఆర్ధిక వ్యవస్ధల గురించి అంచనాలు, జోశ్యాన్ని వెల్లడిస్తుంది. అయితే కరోనా కారణంగా జూన్‌లో కూడా అంచనాలను సవరించింది. దాని ప్రకారం 2020లో చైనాలో ఒక శాతం పురోగమనం, మన దేశంలో 4.9శాతం తిరోగమనంలో ఉంటుందని పేర్కొన్నది. కానీ బిజెపి మాత్రం 1.9శాతం పురోగమనం అని వెలిగిపోతున్న చోట దేశం ఉందని, వేగంగా అభివృద్ది చెందుతున్నదని ఐఎంఎఫ్‌ పేరుతో బుకాయిస్తున్నది ! తప్పుడు విధానాలతో కరోనాతో నిమిత్తం లేకుండానే దేశాన్ని దిగజార్చిన వారు, కరోనా పేరుతో ఎంతకైనా దిగజారేందుకు సిద్ద పడుతున్నారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే పేరుతో మోడీ గురించి అతిశయోక్తులు !

27 Thursday Aug 2020

Posted by raomk in CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Chinese global times survey, fake news, Narendra Modi


ఎం కోటేశ్వరరావు
చైనాలోనూ మోడీయే….. వెల్లడించిన చైనా అధికార పత్రిక అంటూ ఒక పోస్టు సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. తమ నేతల కంటే నరేంద్రమోడీ అంటేనే చైనీయులు ఎక్కువ అభిమానం చూపుతున్నారని, యాభైశాతం మంది మోడీ ప్రభుత్వాన్ని పొగిడారంటూ జి టీవీ, డిఎన్‌ఏ పత్రిక, ఇతర వెబ్‌సైట్లలో వార్త దర్శనమిచ్చింది. చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఈ వార్త ఆధారంగా ఒకటి రెండు తెలుగు వెబ్‌సైట్లలో కూడా రాసినట్లు వెల్లడైంది. దీన్ని పట్టుకొని కొందరు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.
ఆగస్టు 17-20 తేదీల మధ్య చైనాలోని పది ప్రధాన పట్టణాల్లో 1,960 మంది నుంచి డాటా 100 అనే మార్కెట్‌ సర్వే సంస్ధ ప్రశ్నావళికి సమాధానాలను సేకరించింది. గ్లోబల్‌ టైమ్స్‌ పరిశోధనా కేంద్రం మరియు చైనాలో దక్షిణాసియా అధ్యయనాల సంస్ధల కోసం దీన్ని నిర్వహించారు. వాటి మీద విశ్లేషణ-కొందరి వ్యాఖ్యలతో కూడిన సమీక్ష వార్తను ఆగస్టు 27వ తేదీన గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. పాఠకుల సౌకర్యం, అనుమానితుల సందేహ నివృత్తి కోసం వార్త లింక్‌ను చివర ఇస్తున్నాను. ఆ సర్వే వార్తలో ఎక్కడా నరేంద్రమోడీ, చైనా నేతల ప్రస్తావన లేదు. ” మిలిటరీ రీత్యా చైనాను భారత్‌ బెదిరించలేదు ” అని ఆ వార్త శీర్షిక. గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక వార్తా విశ్లేషణలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
చైనా పట్ల భారత్‌ తీవ్ర వ్యతిరేకతతో ఉందని 70శాతం మందికి పైగా భావించారు. భారత రెచ్చగొట్టుడు చర్యలను గట్టిగా తిప్పికొట్టాలని కోరారు. భవిష్యత్‌లో భారత్‌ వైపు నుంచి మరింత రెచ్చగొట్టే చర్యలు ఉంటే గట్టిగా తిప్పి కొట్టాలని 90 శాతం మంది భావించారు. చైనాకు అత్యంత ప్రీతి పాత్రమైన దేశాలుగా రష్యాను 48.8శాతం మంది పేర్కొన్నారు. పాకిస్ధాన్‌కు 35.1, జపాన్‌కు 26.6, భారత్‌కు 26.4శాతం మద్దతు పలికారు.
యాభై ఆరుశాతం మంది భారత్‌ గురించి తమకు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పగా 16.3శాతం మంది తమకు బాగా తెలుసునని పేర్కొన్నారు. దీని గురించి చైనా విశ్లేషకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సిఐసిఐఆర్‌లోని దక్షిణాసియా అధ్యయన సంస్ధ డైరెక్టర్‌ హు షిస్‌హెంగ్‌ మాట్లాడుతూ ప్రజల మధ్య మార్పిడి మరియు సాంస్కృతిక అంశాల కారణంగా సగం మందికి పైగా భారత్‌ మీద ఉన్న అవగాహన గురించి విశ్వాసం వ్యక్తం చేసి ఉంటారు అని చెప్పారు. అదే సంస్ధకు చెందిన ఫ్యుడాన్‌ విశ్వవిద్యాలయ డిప్యూటీ డైరెక్టర్‌ లిన్‌ మిన్‌వాంగ్‌ మాట్లాడుతూ భారత్‌ గురించి తమకు అవగాహన ఉందని విశ్వాసం వ్యక్తం చేయటం వాస్తవానికి దూరంగా ఉంది. చైనీయులకు భారత్‌ కంటే ఎక్కువగా అమెరికా, జపాన్‌ గురించి తెలుసు అదే విధంగా భారతీయులకు చైనా కంటే పశ్చిమ దేశాల గురించి ఎక్కువ తెలుసని అన్నారు. పశ్చిమ దేశాలతో పోల్చితే రెండు దేశాల మధ్య సమాచార సంబంధాలు తక్కువ ఎక్కువ మందికి సమగ్ర చిత్రం తెలియదు అన్నారు.
భారత్‌ గురించి మీకు బాగా తెలిసిన విషయాలు ఏమిటి అని అడిగితే మహిళల సామాజిక స్దాయి తక్కువ అని 31.4శాతంతో ప్రధమ స్ధానమిచ్చారు. ప్రస్తుతం భారతీయులు వ్యతిరేకతతో ఉన్నా దీర్ఘకాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని 25శాతం మంది ఆశాభావం వెలిబుచ్చారు.
భారత మిలిటరీ నుంచి చైనాకు ఎలాంటి ముప్పు లేదని 57.1శాతం, భారత ఆర్ధిక వ్యవస్ధ చైనా మీద గట్టిగా ఆధారపడి ఉందని 49.6శాతం చెప్పారు. చైనాను అధిగమించటానికి భారత్‌కు ఎంత సమయం పడుతుంది అన్న ప్రశ్నకు అధిగమించే అవకాశమే లేదని 54శాతం మంది చెబితే వంద సంవత్సరాలు పట్టవచ్చని 10.4శాతం మంది చెప్పారు.
చైనాను నిలువరించేందుకు అమెరికా వెంట భారత్‌ వెళుతోందని 66.4శాతం మంది పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్య అతి పెద్ద ఆటంకంగా ఉందని 30శాతం భావిస్తే రెండు దేశాల మధ్య అమెరికా జోక్యం చేసుకుంటోందని 24.5శాతం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య పరిస్ధితి దిగజారటానికి అమెరికా రెచ్చగొట్టుడు పెద్ద పాత్రపోషించిందని పేర్కొన్నారు.
చైనా వస్తువులను బహిష్కరించాలన్న భారత్‌లోని వైఖరిని పట్టించుకోవాల్సిన పని లేదని, వారలా అంటారు తప్ప సీరియస్‌గా తీసుకోరని 29.3శాతం పేర్కొనగా 35.3శాతం మంది తీవ్రంగా పరిగణించాలని చెప్పారు.
జి న్యూస్‌ టీవీ ఛానల్‌, డిఎన్‌ఏ పత్రిక, ఇతర వెబ్‌సైట్‌లలో కొన్ని వాక్యాలు అటూ ఇటూగా ఉండటం తప్ప విషయం ఒకటే ఉండటం విశేషం. దాన్ని బట్టి వాటికి వనరు ఒకటే అయి ఉండాలి. గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే అంశంతో పాటు ఒకే పదజాలంతో చైనా టెలికాం సంస్ధ హువెరుకి సంబంధించిన అంశం చోటు చేసుకుంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

చైనా గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే పేరుతో మోడీ గురించి అతిశయోక్తులు !

27 Thursday Aug 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

Global Times Survey, Narendra Modi


ఎం కోటేశ్వరరావు

      చైనాలోనూ మోడీయే..... వెల్లడించిన చైనా అధికార పత్రిక అంటూ ఒక పోస్టు సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. తమ నేతల కంటే నరేంద్రమోడీ అంటేనే చైనీయులు ఎక్కువ అభిమానం చూపుతున్నారని, యాభైశాతం మంది మోడీ ప్రభుత్వాన్ని పొగిడారంటూ జి టీవీ, డిఎన్‌ఏ పత్రిక, ఇతర వెబ్‌సైట్లలో వార్త దర్శనమిచ్చింది. చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ సర్వేలో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఈ వార్త ఆధారంగా ఒకటి రెండు తెలుగు వెబ్‌సైట్లలో కూడా రాసినట్లు వెల్లడైంది. దీన్ని పట్టుకొని కొందరు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.

     ఆగస్టు 17-20 తేదీల మధ్య చైనాలోని పది ప్రధాన పట్టణాల్లో 1,960 మంది నుంచి డాటా 100 అనే మార్కెట్‌ సర్వే సంస్ధ ప్రశ్నావళికి సమాధానాలను సేకరించింది. గ్లోబల్‌ టైమ్స్‌ పరిశోధనా కేంద్రం మరియు చైనాలో దక్షిణాసియా అధ్యయనాల సంస్ధల కోసం దీన్ని నిర్వహించారు. వాటి మీద విశ్లేషణ-కొందరి వ్యాఖ్యలతో కూడిన సమీక్ష వార్తను ఆగస్టు 27వ తేదీన గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. పాఠకుల సౌకర్యం, అనుమానితుల సందేహ నివృత్తి కోసం వార్త లింక్‌ను చివర ఇస్తున్నాను. ఆ సర్వే వార్తలో ఎక్కడా నరేంద్రమోడీ, చైనా నేతల ప్రస్తావన లేదు. '' మిలిటరీ రీత్యా చైనాను భారత్‌ బెదిరించలేదు '' అని ఆ వార్త శీర్షిక. గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక వార్తా విశ్లేషణలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

    చైనా పట్ల భారత్‌ తీవ్ర వ్యతిరేకతతో ఉందని 70శాతం మందికి పైగా భావించారు. భారత రెచ్చగొట్టుడు చర్యలను గట్టిగా తిప్పికొట్టాలని కోరారు. భవిష్యత్‌లో భారత్‌ వైపు నుంచి మరింత రెచ్చగొట్టే చర్యలు ఉంటే గట్టిగా తిప్పి కొట్టాలని 90 శాతం మంది భావించారు. చైనాకు అత్యంత ప్రీతి పాత్రమైన దేశాలుగా రష్యాను 48.8శాతం మంది పేర్కొన్నారు. పాకిస్ధాన్‌కు 35.1, జపాన్‌కు 26.6, భారత్‌కు 26.4శాతం మద్దతు పలికారు.

యాభై ఆరుశాతం మంది భారత్‌ గురించి తమకు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పగా 16.3శాతం మంది తమకు బాగా తెలుసునని పేర్కొన్నారు. దీని గురించి చైనా విశ్లేషకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సిఐసిఐఆర్‌లోని దక్షిణాసియా అధ్యయన సంస్ధ డైరెక్టర్‌ హు షిస్‌హెంగ్‌ మాట్లాడుతూ ప్రజల మధ్య మార్పిడి మరియు సాంస్కృతిక అంశాల కారణంగా సగం మందికి పైగా భారత్‌ మీద ఉన్న అవగాహన గురించి విశ్వాసం వ్యక్తం చేసి ఉంటారు అని చెప్పారు. అదే సంస్ధకు చెందిన ఫ్యుడాన్‌ విశ్వవిద్యాలయ డిప్యూటీ డైరెక్టర్‌ లిన్‌ మిన్‌వాంగ్‌ మాట్లాడుతూ భారత్‌ గురించి తమకు అవగాహన ఉందని విశ్వాసం వ్యక్తం చేయటం వాస్తవానికి దూరంగా ఉంది. చైనీయులకు భారత్‌ కంటే ఎక్కువగా అమెరికా, జపాన్‌ గురించి తెలుసు అదే విధంగా భారతీయులకు చైనా కంటే పశ్చిమ దేశాల గురించి ఎక్కువ తెలుసని అన్నారు. పశ్చిమ దేశాలతో పోల్చితే రెండు దేశాల మధ్య సమాచార సంబంధాలు తక్కువ ఎక్కువ మందికి సమగ్ర చిత్రం తెలియదు అన్నారు.

     భారత్‌ గురించి మీకు బాగా తెలిసిన విషయాలు ఏమిటి అని అడిగితే మహిళల సామాజిక స్దాయి తక్కువ అని 31.4శాతంతో ప్రధమ స్ధానమిచ్చారు. ప్రస్తుతం భారతీయులు వ్యతిరేకతతో ఉన్నా దీర్ఘకాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని 25శాతం మంది ఆశాభావం వెలిబుచ్చారు.

భారత మిలిటరీ నుంచి చైనాకు ఎలాంటి ముప్పు లేదని 57.1శాతం, భారత ఆర్ధిక వ్యవస్ధ చైనా మీద గట్టిగా ఆధారపడి ఉందని 49.6శాతం చెప్పారు. చైనాను అధిగమించటానికి భారత్‌కు ఎంత సమయం పడుతుంది అన్న ప్రశ్నకు అధిగమించే అవకాశమే లేదని 54శాతం మంది చెబితే వంద సంవత్సరాలు పట్టవచ్చని 10.4శాతం మంది చెప్పారు.
చైనాను నిలువరించేందుకు అమెరికా వెంట భారత్‌ వెళుతోందని 66.4శాతం మంది పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్య అతి పెద్ద ఆటంకంగా ఉందని 30శాతం భావిస్తే రెండు దేశాల మధ్య అమెరికా జోక్యం చేసుకుంటోందని 24.5శాతం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య పరిస్ధితి దిగజారటానికి అమెరికా రెచ్చగొట్టుడు పెద్ద పాత్రపోషించిందని పేర్కొన్నారు.

   చైనా వస్తువులను బహిష్కరించాలన్న భారత్‌లోని వైఖరిని పట్టించుకోవాల్సిన పని లేదని, వారలా అంటారు తప్ప సీరియస్‌గా తీసుకోరని 29.3శాతం పేర్కొనగా 35.3శాతం మంది తీవ్రంగా పరిగణించాలని చెప్పారు.

జి న్యూస్‌ టీవీ ఛానల్‌, డిఎన్‌ఏ పత్రిక, ఇతర వెబ్‌సైట్‌లలో కొన్ని వాక్యాలు అటూ ఇటూగా ఉండటం తప్ప విషయం ఒకటే ఉండటం విశేషం. దాన్ని బట్టి వాటికి వనరు ఒకటే అయి ఉండాలి. గ్లోబల్‌ టైమ్స్‌ సర్వే అంశంతో పాటు ఒకే పదజాలంతో చైనా టెలికాం సంస్ధ హువెరుకి సంబంధించిన అంశం చోటు చేసుకుంది.
https://www.globaltimes.cn/content/1199027.shtml

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కష్టకాలంలో ప్రధాని నరేంద్రమోడీ నెమలి నాట్యాలా ?

26 Wednesday Aug 2020

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Narendra Modi shared a video with peacocks


ఎం కోటేశ్వరరావు


మడిసన్నాక కాసింత కలాపోసన ఉండాలయ్యా ఉత్తినే తిని తొంగుంటే మడికి గొడ్డుకు తేడా ఏటుంటాది అన్న మాటలను ముత్యాలముగ్గు సినిమాతో ప్రముఖ దర్శకుడు బాపు ఎంతగా ప్రజాబాహుళ్యంలోకి తెచ్చారో తెలిసిందే. అదే మాదిరి దేశం కష్టకాలంలో ఉన్న తరుణంలో జనానికి కాస్త వినోదం పంచుదామని ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నించారా ?


రోజు రోజుకూ కొత్త రికార్డులను స్ధాపిస్తూ దేశంలో కరోనా కేసులు ఒక వైపు పెరిగి పోతున్నాయి. అనేక రాష్ట్రాలలో వరదలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఉపాధి ఎంతగా పోయిందో తెలిపే లెక్కలను చూసి అప్పటి వరకు మంచి రోజులు రాక పోతాయా అనే ఆత్మ ధైర్యంతో ఉన్న నిరుద్యోగులు ఆత్మ నిబ్బరాన్ని కోల్పోతున్నారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మాసంలో దేశ ఆర్ధిక వ్యవస్ధ దిగజారిన తీరును చూసి సామాన్య జనం సామూహిక గుండెపోటుకు గురి కాకుండా ఎంతగా పతనం అయిందో అనేక సంస్ధలు, వ్యక్తులు అంచనాలతో జనాన్ని మానసికంగా సిద్దం చేస్తున్నారు. ఇరవైనుంచి ఇరవై ఆరుశాతం వరకు అంటే నాలుగో వంతు వరకు మరో విధంగా చెప్పాలంటే గుండెకు ఉండే నాలుగు కవాటాల్లో ఒకటి దెబ్బతిన్నదనే రీతిలో వార్తలు వస్తున్నాయి.


ఈ స్దితిలోనే మన ప్రధాని నరేంద్రమోడీ దేశానికి ఆత్మనిర్భర నినాదమిచ్చారు. అదేమిటో అర్ధంగాక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో నినాదాలిచ్చారు, ప్రధాని పొదిలో ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో వాటిని కూడా రానివ్వండి చూద్దాం అన్నట్లుగా లేదా మన కెందుకులే అని గానీ మేథావుల జాబితాలో ఉన్న వారు వేచి చూస్తున్నారు. సరే వంది మాగధులు, భజన పరుల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేముంది !


ఎప్పుడూ కష్టాలూ, కన్నీళ్లేనా కాస్త ఉపశమనం పొందొచ్చు కదా అన్నట్లుగా తాను నెమళ్లకు మేత ఎలా వేస్తున్నదీ, తనను చూడగానే అవి పురివిప్పి ఎలా ఆడేది, వాటిని తాను కూడా మెప్పించేందుకు మరింతగా ఆడేందుకు రకరకాల డ్రస్సులను ధరించి అలరిస్తున్నారో చూపుతూ మన ప్రధాని నరేంద్రమోడీ గత ఆదివారం నాడు (ఆగస్టు 23న) యావత్‌ ప్రపంచాన్ని ఒక నిమిషం 47సెకండ్ల పాటు రంజింప చేసే ఒక వీడియోను స్వయంగా విడుదల చేశారు. ఎన్నికల్లో పీకల్లోతు మునిగి ఉన్న మోడీ గారి జిగినీ దోస్తు ట్రంప్‌ చూశారో లేదో లేక ఇంతకంటే వినోదం రోజూ కలిగిస్తున్నాగా దీనిలో ఏముంది అని విస్మరించారో గానీ ఎలాంటి ట్వీటు స్వీటు మనకు పంచలేదు.
ప్రధాని మోడీ ఏమి చేసినా గొప్పే కనుక మన మీడియా నెమలి వీడియోకు బాగానే ప్రాచుర్యం కలిగించింది. చూడని వారి ఖర్మ చేసేదేమీ లేదు. దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం మిగిలి ఉంది. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు పాకేజీలకు అమ్ముడు పోయి కొందరు నేతలు, కొన్ని పార్టీలకు అనుకూలంగా ఎలా ప్రచార అవకాశాలు కల్పిస్తున్నాయో రోజూ వార్తల్లో చూస్తున్నాం. కేవలం భజన పరులకే అవకాశం ఇస్తే కొంతకాలానికి వాటి ముఖం చూసే వారు ఉండరు కనుక భిన్నమైన అభిప్రాయ వ్యక్తీకరణకు కూడా చోటు కల్పిస్తున్నాయి. చట్టాలు కొందరికే తప్ప అందరికీ ఒకే విధంగా వర్తించవు అనే అభిప్రాయం ప్రధాని నెమలి ఉదంతంతో వెల్లడైంది.


నెమలి జాతీయ పక్షి. దాన్ని స్వేచ్చగా ఉండనివ్వాలి తప్ప ఎవరూ మచ్చిక చేసుకో కూడదు. దేశంలో ఉన్న చట్టాల ప్రకారం అది నేరం. 2017లో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, గడ్డి కుంభకోణం ఫేం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇంటికి రెండు నెమళ్లను తీసుకు వచ్చారు.1972 వన్య ప్రాణి రక్షణ చట్టం ప్రకారం అలా తీసుకురావటం నేరమని, కేసు బనాయించి శిక్షించాలని బీహార్‌ బిజెపి అప్పుడు ఆందోళన చేసింది. ఇటీవలనే బిజెపి నేస్తం నితీష్‌ కుమార్‌ పార్టీ జెడియు నుంచి లాలూ ప్రసాద్‌ పార్టీ ఆర్‌జెడిలో చేరిన శ్యామ్‌ రాజక్‌ అనే నేత ప్రధానిని తప్పు పట్టారు. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాన్ని ప్రతి ఒక్కరూ విధిగా అనుసరించాలి, ప్రత్యేకించి ప్రధాని దాన్ని అమలు జరపాలి అని చెప్పారు.


మన ఆర్ధిక వ్యవస్ధ రక్తమోడుతోంది. రోజుకు వెయ్యి మంది కరోనాతో మరణిస్తున్నారు, 70వేల మందికి సోకుతోంది. ఇలాంటి సమయంలో ప్రధాని సామాజిక మాధ్యమంలో అలాంటి వీడియోను విడుదల చేయటం ఎబ్బెట్టుగా ఉంది, జనం ఇబ్బందుల్లో ఉన్నపుడు రోమన్‌ పాలకులు పరిహాసం చేసినట్లుగా ఉంది అని ఆర్‌జెడి ఎంపీ మనోజ్‌ ఝా స్పందించారు.


నెమళ్లను పక్కనుంచుకుంటే ఇబ్బందులు తొలుగుతాయని, అదృష్టం వరిస్తుందని లాలూ ప్రసాద్‌ యాదవుకు జ్యోతిష్కులు చెప్పారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం బాగోలేకపోవటం, కేసులు చుట్టుముట్టటంతో 2017లో అధికారంలో ఉన్న తన కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ మంత్రిగా ఉన్న అటవీశాఖ నుంచి రెండు నెమళ్లను తెప్పించారు. దేశ ఆరోగ్యం బాగోలేదు, ఆర్ధిక వ్యవస్ద దెబ్బతిన్నది తప్ప నరేంద్రమోడీకి అలాంటివేమీ లేవు. లాలూ నెమళ్లను తెప్పించటం మీద బిజెపి రభస చేసింది. అయితే నెమళ్లు కీటకాలను తింటాయని అందువలన పాట్నాలోని ముఖ్యమంత్రి, గవర్నరు, ఇతర ప్రముఖుల నివాసాల్లో వంద నెమళ్లను విడుదల చేయాలని చేసిన నిర్ణయం మేరకే ఆ పని చేశామని అధికారులు సమర్ధించుకున్నారు. అయితే రెండు రోజుల తరువాత తన నివాసంలో వదలిన రెండు నెమళ్లు ఎగిరిపోయాయని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ విలేకర్లతో చెప్పి వివాదానికి ముగింపు పలికారు. అవి పాట్నాలోని సంజయ గాంధీ బయలాజికల్‌ పార్కుకే చేరుకున్నాయని వార్తలు రావటం ఆ ఉదంతంలో కొసమెరుపు. అయితే అదే సమయంలో కృష్ణ జింక వివాదంలో సల్మాన్‌ ఖాన్‌ కేసు ప్రముఖంగా మీడియాలో వచ్చిన నేపధ్యంలో ఇది జరిగింది. వివాదాస్పదం కావటంతో తప్పనిసరై లాలూ మీద కేసు నమోదు చేశారు గానీ, నివాసంలో ఎలాంటి నెమళ్లు దొరకలేదని కూడా విచారణలో తేల్చారు.


తాజాగా ప్రధాని మోడీ నెమళ్ల వ్యవహారం వెలుగులోకి రావటంతో బిజెపి, మీడియా కొత్త పల్లవి అందుకుంది. లాలూ ప్రసాద్‌ నెమళ్లను పంజరంలో ఉంచారు. ప్రధాని మోడీ నివాసంలో అవి స్వేచ్చగా తిరుగుతున్నాయి అని బిజెపి ప్రతినిధి రజనీ రంజన్‌ పటేల్‌ సమర్ధించుకున్నారు. ఒక్క ప్రధాని నివాసంలోనే కాదు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో నెమళ్లు స్వేచ్చగా తిరగటాన్ని చూడవచ్చు అని కూడా చెప్పారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లుగా నరేంద్రమోడీ ఉదయ వ్యాహ్యాళి సమయంలో నెమళ్లు ఆయన్ను అనుసరిస్తాయని, అవి స్వేచ్చగా ఉండేందుకు నివాసంలో పెద్ద పంజరాల వంటివి ఏర్పాటు చేశారని కూడా మీడియా రాతగాళ్లు కొందరు పేర్కొన్నారు. ప్రధాని నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న లోఢ గార్డెన్స్‌ నెమళ్ల పుట్టుక కేంద్రంగా ఉందని అందువలన ఆప్రాంత మంతటా నెమళ్లు తిరగటం సహజమని దానిలో భాగంగానే ప్రధాని నివాసంలోకి వచ్చి పోతుంటాయని రాస్తున్నారు. ఇది రోజువారీ వ్యవహారమే అని స్వయంగా ప్రభుత్వ సంస్ధ ప్రసార భారతి న్యూస్‌ సర్వీసు ఒక ట్వీట్‌లో పేర్కొన్నది.


ఆ వాదనలతో విబేధించాల్సిన అవసరం లేదు. కేవలం 107 సెకన్ల వీడియోలో ఫ్రధాని ఆరుసార్లు వేర్వేరు దుస్తులతో కనిపించటం విశేషం. యాదృచ్చికంగా నెమళ్లు వచ్చినపుడు వాటికి వేయటానికి ఎలాంటి ఆహారం అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఒక వేళ తరచూ వస్తున్నందున వేయటానికి కొన్ని గింజలను అందుబాటులో ఉంచుకున్నారను కోవాలి. కానీ దృశ్యాలను చూసినపుడు అలా అనిపించటం లేదు. ఆరు రకాల దుస్తులను మార్చుకున్నారంటే ఫొటో లేదా నెమలితో దృశ్యాల చిత్రీకరణకు ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటే, ఎంతో సమయం వెచ్చిస్తే తప్ప సాధ్యం కాదు. వీటన్నింటిని బట్టి ప్రచారం కోసమే ఇదంతా చేసినట్లుగా కనిపిస్తోంది.
ప్రధాని నెమళ్ల వ్యవహారం చూడగానే మీడియాలో జర్మన్‌ హిట్లర్‌కు సంబంధించి కొన్ని ఫొటోలు, వ్యాఖ్యలు దర్శనమిచ్చాయి.పిల్లలు, పిల్ల జింకలు, కుక్క పిల్లలతో ఎంతో ప్రేమగా ఉన్న హిట్లర్‌ ఫొటోలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి. అవన్నీ తాను ఎంత సున్నిత మనస్కుడనో అని ప్రపంచానికి చూపేందుకు హిట్లర్‌ తయారు చేయించిన ప్రచార చిత్రాలన్నది తెలిసిందే. నిజానికి అంత సున్నిత మనస్కుడైతే యూదులను హతమార్పించిన తీరు అంత భయంకరంగా ఉంటుందా ? పిల్లలు,స్త్రీలు, వృద్దులు అనే విచక్షణ లేకుండా మారణకాండ సాగించిన దుర్మార్గుడని తెలిసిందే. అయితే హిట్లర్‌ కుక్కల ప్రియుడు అన్నది నిజం. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్దంలో పరాజయాన్ని తట్టుకోలేక ప్రియురాలు ఎవా బరూన్‌తో కలసి ఆత్మహత్య చేసుకోబోయే ముందు తనకు ఇష్టమైన బ్లోండీ అనే పేరుతో పిలుచుకున్న జర్మన్‌ షెపర్డ్‌ కుక్కకు సైనైడ్‌ విషమిచ్చి చంపినట్లు వెల్లడైంది.


నరేంద్రమోడీ నెమళ్ల ప్రియుడా లేక నివాసంలో వచ్చినందున వాటికి ఆహారం వేశారా అన్నది ఒక అంశం. ప్రధాని నిత్యం ఉదయాన్నే నడుస్తారు గనుక ప్రతి రోజూ వచ్చి వాలే నెమళ్ల గురించి లేదా వాటికి వేసే ఆహారం నిత్యకృత్యమైతే ఎన్నడూ మీడియాలో రాలేదు,నిజంగా అంత పక్షి ప్రేమికుడే అయితే దాన్ని వెల్లడించటానికి ఆరు సంవత్సరాల వ్యవధి ఎందుకు తీసుకున్నట్లు ? మోడీ వీడియో గురించి సామాజిక మాధ్యమంలో మిశ్రమ స్పందన వెల్లడైంది. సమర్ధించిన వారు ఉన్నారు. ధైర్యం కలిగిన అధికారులెవరైనా ఉంటే అలా నెమళ్లను మచ్చిక చేసుకోవటం వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నేరం అని ప్రధానికి చెప్పండి అన్నది వాటిలో ఒకటి. ప్రచారం కోసం తప్ప మరొకటి కాదన్నది మరొక అభిప్రాయం. సామాన్య జనం కరోనా మహమ్మారి బారిన పడినపుడు, ఆర్ధికంగా దేశం దిగజారిన స్దితిలో ఇలాంటి వీడియోలను స్వయంగా తానే విడుదల చేయటం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాటి గురించి నరేంద్రమోడీ స్వయంగా మాట్లాడతారని ఎవరూ భావించటం లేదు, కనీసం తన చర్య గురించి ట్విటర్‌లో అయినా స్పందించలేదు.అయినా ఆపని చేస్తే నరేంద్రమోడీ ఎలా అవుతారు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

భద్రతా మండలిలో అమెరికాకు ఎదురు దెబ్బ-ఇరాన్‌పై ఏకపక్ష ఆంక్షలు !

25 Tuesday Aug 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Trump Iran Sanctions, UN arms vote, UN Security Council


ఎం కోటేశ్వరరావు


తనకు ఎదురు లేదని విర్రవీగుతున్న అమెరికాకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో గత వారం ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మండలిలోని 15 మందికి గాను 13 మంది ఇరాన్‌ మీద తిరిగి ఆంక్షలు విధించాలన్న అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు లేఖలు అందచేశారు.2015లో కుదిరిన అణు ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘించించిదని ప్రకటించేందుకు ఐరాస ప్రధాన కార్యాలయానికి వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియోకు ఈ లేఖలు శరా ఘాతం మాదిరి తగిలాయి. అయితే తాము ఏకపక్షంగా ఆంక్షలను అమలు జరుపుతామని అమెరికా ప్రకటించింది. అయితే ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగినందున ఆంక్షలను అమలు జరపాలని కోరే హక్కును కోల్పోయిందని పదమూడు మంది పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబరు18తో ఆయుధాల విక్రయంపై ఇరాన్‌ మీద ఉన్న ఆంక్షల గడువు ముగియనుంది. భద్రతా మండలి ఆమోదం పొంది ఉంటే మరికొంత కాలం ఆంక్షలు కొనసాగేవి. ఈ పరిస్ధితిపై చర్చించేందుకు సమావేశం కావాలని రష్యా ప్రతిపాదించింది. తాము హాజరు కావటం లేదని ట్రంప్‌ ప్రకటించాడు.


కిందపడినా తనదే పై చేయి అన్నట్లుగా అమెరికా తప్పుడు వాదనకు పూనుకుంది. తాను ఒప్పందం నుంచి వైదొలిగినా 2015లో సంయుక్త సమగ్ర కార్యాచరణ పధకం ఒప్పందం ప్రకారం భద్రతా మండలి ఆమోదించిన తీర్మానంలో సాంకేతికంగా తాము కూడా సంతకం దారుగా ఉన్నందున తిరిగి ఆంక్షలను విధించాలని కోరే హక్కు తమకు ఉన్నదని ట్రంప్‌ సర్కార్‌ విఫలవాదన చేసింది. ఆ వాదనను తిరస్కరిస్తున్నట్లు అమెరికా మిత్రరాజ్యాలైన జర్మనీ, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ స్పష్టం చేశాయి. అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించిన సభ్యదేశాలలో రష్యా, చైనా,జర్మనీ, బెల్జియం, వియత్నాం, నైగర్‌, సెయింట్‌ విన్‌సెంట్‌, గ్రెనడైన్స్‌, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఎస్తోనియా, ట్యునీసియా ఉన్నాయి.కేవలం డొమినికన్‌ రిపబ్లిక్‌ ఒక్కటే ఈ సమస్యపై లేఖను ఇవ్వాల్సి ఉంది. అయితే అంతకు ముందు జరిగిన చర్చలో ఇరాన్‌ మీద ఆంక్షలు విధించాలన్న అమెరికా ప్రతిపాదనను బలపరచిన దేశం అదొక్కటే కావటంతో లేఖను కూడా అదే మాదిరి ఇవ్వవచ్చని భావిస్తున్నారు.
భద్రతా మండలిలో తగిలిన ఎదురు దెబ్బతో దిమ్మతిరిగిన మైక్‌ పాంపియో ఉక్రోషం వెళ్లగక్కుతూ యూరోపియన్లు అయాతుల్లాల వైపు ఉండేందుకు నిర్ణయించుకున్నారని నోరు పారవేసుకున్నాడు.భద్రతా మండలిలో అమెరికన్లు అపహాస్యం పాలయ్యారనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. డెబ్బయి అయిదు సంవత్సరాల ఐరాస చరిత్రలో తమ శత్రువు ఇంతగా ఒంటరి పాటు కావటం గతంలో జరగలేదని ఇరాన్‌ వ్యాఖ్యానించింది.అయినా తాను తగ్గేది లేదని ట్రంప్‌ ప్రకటించాడు. తామేం చేసేది త్వరలో తెలుస్తుందని వ్యాఖ్యానించాడు.
భద్రతా మండలి తీర్మాన తిరస్కరణతో గల్ఫ్‌ ప్రాంతంలో తలెత్తిన పరిస్ధితి గురించి చర్చించేందుకు చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, అమెరికా, ఇరాన్‌కు రష్యా చేసిన ప్రతిపాదన మేరకు జరిగే వీడియో సమావేశంలో తాను పాల్గొనకపోవచ్చని ట్రంప్‌ చెప్పాడు. సమావేశ ప్రతిపాదనను చైనా స్వాగతించింది. 2018లో సంయుక్త సమగ్రకార్యాచరణ పధకం నుంచి అమెరికా వైదొలిగిన తరువాత దానిలో అమెరికా భాగస్వామి కాదని ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ సంయుక్త ప్రకటనలో వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. ఈ పధకానికి తీవ్రమైన సవాళ్లు ఎదురైనప్పటికీ తాము కట్టుబడి ఉన్నామని అమెరికా చర్యను తాము సమర్ధించలేమని, ఒప్పందానికి మద్దతు యత్నాలకు ఇది పొసగటం లేదని పేర్కొన్నాయి. ఒప్పందానికి అనుగుణంగా లేని చర్యలనుంచి వెనక్కు తగ్గాలని తాము ఇరాన్‌పై వత్తిడి తెస్తామని మూడు దేశాలు స్పష్టం చేశాయి.
తమ మిత్రులుగా ఉన్న ఇ3(బ్రిటన్‌, జర్మనీ,ఫ్రాన్స్‌) దేశాలు ఇరాన్‌కు ఆయుధ సరఫరాపై ఆంక్షలకు మద్దతు ఇవ్వకపోవటం తమకు ఆశాభంగం కలిగించిందని ఇజ్రాయెల్‌ వ్యాఖ్యానించింది. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డోమినిక్‌ రాబ్‌తో మంగళవారం నాడు సమావేశమైన ఇజ్రాయెల్‌ మంత్రి అషెకెనాజీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్‌-యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మధ్య కుదిరిన ఒప్పందం పట్ల ఇరాన్‌ స్పందించిన తీరు ఈ ప్రాంత భద్రతకు ముప్పు తెచ్చేదిగా ఉందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది.
మూడు అణువిద్యుత్‌ కర్మాగారాలలో అణుశుద్ధి కార్యక్రమం నుంచి ఇరాన్‌ వైదొలిగితే దానికి పరిహారంగా ఆంక్షల తొలగింపు, ఇతర సహాయం చేస్తామంటూ భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ భాగస్వాములుగా 2015లో ఇరాన్‌తో ఒప్పందం చేసుకున్నాయి.2018లో దీన్నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అయితే ఇరాన్‌ గనుక ఒప్పందానికి కట్టుబడి ఉండకపోతే దానిలో భాగస్వాములైన ఏ దేశమైనా తనంతటతానుగా 2007నాటి భద్రతా మండలి తీర్మానంలో పేర్కొన్న ఆంక్షల విధింపునకు చర్య తీసుకోవచ్చనే నిబంధన కూడా ఉంది. 2007నాటి తీర్మానంలో తాము భాగస్వాములం కనుక ఆ మేరకు ఆంక్షలు విధించవచ్చనే వితండవాదానికి అమెరికా దిగింది.అది ఒప్పందానికి కట్టుబడి ఉన్న ఇతర భాగస్వాములకు తప్ప వైదొలగిన అమెరికాకు లేవని మిగిలిన దేశాలు చెబుతున్నాయి. ఎవరూ తమను అనుసరించకపోయినా తాము ఆంక్షలను అమలు జరుపుతామని అమెరికా అంటోంది. నిజానికి 2018 తరువాత అమెరికా అదరగొండితనంతో తన ఆదేశాలను పాటించని దేశాల మీద కూడా ఆంక్షలు విధిస్తానని బెదిరిస్తోంది. దానికి అనుగుణ్యంగానే ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు సైతం మినహాయింపులేదని అమెరికా చెప్పటంతో మన దేశం భయపడి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేసింది.
అయితే అమెరికా బెదిరింపులకు భయపడి మిగతా దేశాలేవీ ఇరాన్‌తో సంబంధాలను వదులుకోలేదు. అంతర్జాతీయ నిబంధనలు, తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా వ్యవహరిస్తామే తప్ప ఇరాన్‌తో సంబంధాలను వదులుకొనేది లేదని రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ రియబకోవ్‌ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితిని కొన్ని ముడుల మధ్య బంధించాలని అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించారు. అమెరికా చర్య అక్రమం అని చైనా పేర్కొన్నది. అంతే కాదు పాతిక సంవత్సరాల వ్యవధిలో ఇరాన్‌లో 400 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు చైనా సిద్దం అవుతోంది. ఒప్పందం ప్రకారం తమకు చేస్తామన్న సాయం రానపుడు దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఇరాన్‌ చెబుతోంది. తాము పూర్తి స్ధాయి అణుశుద్ధి చేస్తున్నపుడు విధించిన వాటి కంటే తీవ్రమైన ఆంక్షలను ఇప్పుడు అనుభవిస్తున్నామని అంటున్నది. అణురియాక్టర్లలో వినియోగించే అణు ఇంధనాన్ని ఐదుశాతానికి మించి శుద్ది చేయకూడదు. ఒప్పందం ప్రకారం 3.67శాతం మించకూడదు. అయితే ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించినందున మిగతా సభ్యదేశాలపై ముఖ్యంగా ఐరోపా దేశాలపై వత్తిడి తెచ్చేందుకు ఇరాన్‌ 4.5శాతానికి పెంచింది
2015లో అంగీకరించిన దానికి మించి అదనపు నిబంధనలను తాము అంగీకరించేది లేదని మంగళవారం నాడు ఇరాన్‌ స్పష్టం చేసింది. ఐరాస అంతర్జాతీయ అణుఇంధన సంస్ధ ప్రతినిధి(ఐఏఇఏ) బృందం సోమవారం నాడు ఇరాన్‌ పర్యటనకు వచ్చింది. బహిర్గతం చేయకుండా నిల్వ చేసిన లేదా ఉపయోగించిన అణుపదార్ధాల తనిఖీకి అనుమతించాలని ఆ బృందం కోరుతోంది. గత ఏడాది వరకు ఒప్పందానికి అనుగుణ్యంగానే ఇరాన్‌ వ్యవహరిస్తున్నట్లు ఐరాస బృందం నివేదించింది. ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తరువాత పరిమితికి మించి అణు శుద్ధి చేస్తున్నట్లు బహిరంగంగానే ఇరాన్‌ చెబుతోంది. తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణ్యంగా వ్యవహరిస్తామని అణుశక్తి సంస్ద ప్రతినిధి బృంద నేత రాఫెల్‌ గ్రాసీతో కలసి టెహరాన్‌లో విలేకర్లతో మాట్లాడిన ఇరాన్‌ ప్రతినిధి అలీ అక్బర్‌ సలేహీ స్పష్టంగా చెప్పారు. రెండు అణుకేంద్రాలను తనిఖీ చేయాలని ఐఏఇఏ కోరుతోంది. గత ఏడాది వాటి తనిఖీని ఇరాన్‌ అడ్డుకుందని, వాటిలో ఒక దానిని 2004లో పాక్షికంగా ధ్వంసం చేశారని, మూడవదానిని తనిఖీ చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అణుకేంద్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామనే ఆరోపణలను తాము ఖండిస్తున్నామని, ఒప్పందానికి తాము కట్టుబడే ఉన్నామని ఇరాన్‌ చెబుతోంది
టెహరాన్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని ఇరాన్‌ అతి పెద్ద నాటంజ్‌ యురేనియం శుద్ధి కర్మాగారంలో గత నెలలో జరిగిన పేలుడు, చెలరేగిన అగ్ని విద్రోహచర్యల్లో భాగమే అని ఇరాన్‌ అణు శక్తి సంస్ధ చెబుతోంది. కేంద్రం పరిసరాలలో చెలరేగిన మంటలకు సైబర్‌ దాడులు కారణం కావచ్చని తొలుత అధికారులు భావించారు. అక్కడ మరింత ఆధునిక పరికరాలను అమర్చుతామని ప్రకటించారు. ఇక్కడ యురేనియం శుద్ధిని మరింతగా పెంచినట్లు, ఇది 2015 ఒప్పంద ఉల్లంఘనే అని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు కథనాలను వెల్లడించాయి. ముందే చెప్పుకున్నట్లు తక్కువ శాతం శుద్ధి మాత్రమే చేయాల్సి ఉంది. అయితే ఆయుధ తయారీకి ఉపయోగించే యురేనియం 90శాతం ఉన్నట్లు ఆరోపించాయి. ఒప్పందం ప్రకారం నాంటజ్‌లో 2026వరకు 5,060 సెంట్రిఫ్యూజస్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఫోర్డోలోని భూగర్భ కేంద్రంలో 2031 వరకు ఎలాంటి శుద్ధి చేయకూడదు. ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తరువాత నాంటజ్‌లో ఆధునిక సెంట్రిఫ్యూజస్‌ను రెట్టింపు చేసిందని, ఫోర్డోలో సెంట్రిఫ్యూజస్‌లోకి హెక్సాఫ్లోరైడ్‌ గ్యాస్‌ను ఎక్కిస్తున్నారని చెబుతున్నారు.ఇప్పుడు భద్రతా మండలితో నిమిత్తం లేకుండా అమెరికా ప్రకటించిన ఆంక్షల గురించి రానున్న రోజుల్లో పరిణామాలను చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

జాతీయవాద పులి మీద నరేంద్రమోడీ స్వారీ !

24 Monday Aug 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

COVID-19, Donald trump, Eurasia, India economy slowdown, Narendra Modi, Narendra Modi fifth biggest geopolitical risk, nationalism

ఎం కోటేశ్వరరావు
ప్రతి ఉగాదికి పంచాంగం చెప్పే పండితుల గురించి మనకు తెలిసిందే. వాటిలో సానుకూల అంశాలు తప్ప ప్రతి కూల అంశాలు సాధారణంగా చోటుచేసుకోవు. మహా అయితే కరవుల గురించి చెబుతారు. రాజకీయ పార్టీలకు పంచాంగం చెప్పే వారు ప్రతికూలంగా చెబితే వారు కార్యాలయాల గేటును ఎలా దాటుతారో వారికే తెలియదు. కనుక అది కూడా బి పాజిటివ్‌గానే ఉంటుంది.


ఉగాది పంచాంగానికి భిన్నంగా ప్రపంచానికి లేదా దేశాలకు ముప్పుగా పరిణమించే వారు లేదా పరిణామాల గురించి చెప్పేరాజకీయ జోశ్యులు కూడా ఉన్నారు. అమెరికా కేంద్రంగా పని చేసే యూరేసియా గ్రూప్‌ వాటిలో ఒకటి. 2020లో ప్రపంచ రాజకీయ ముప్పుగురించి జనవరిలో ఒక విశ్లేషణను వెలువరించింది. తరువాత మార్చినెలలో దానిని నవీకరించింది. అయినా తొలి పది ముప్పు జాబితాలో ఎలాంటి మార్పు లేదు. సాధారణంగా అమెరికా గడ్డమీద పని చేస్తున్న సంస్ధ గనుక ప్రపంచానికి అమెరికా నుంచి తలెత్తే ప్రధాన ముప్పు జాబితాలో అక్కడి రాజకీయాలను చేర్చదు. కానీ ఈ ఏడాది దానికి భిన్నంగా తొలి ప్రపంచ రాజకీయ ముప్పుగా అమెరికా అంతర్గత రాజకీయాలని పేర్కొనటం విశేషం. రెండవదిగా సాంకేతిక రంగం, వాణిజ్యంలో చైనా-అమెరికా యుద్దం, మూడవదిగా అమెరికా-చైనా రాజకీయ వ్యవస్ధల మధ్య ముదురుతున్న వైరం, నాలుగవదిగా కార్పొరేట్‌ సంస్ధల పోరు, ఐదవదిగా నరేంద్రమోడీ వైఖరిని పేర్కొన్నది.


ఈ జోశ్యం లేదా రాజకీయ అంచనాలకు అనుగుణ్యంగానే తొలి ఎనిమిది నెలల్లో దాదాపు వాటి చుట్టూనే పరిణామాలు జరగటాన్ని గమనించవచ్చు. జనవరి నాటికి కరోనా వైరస్‌ అంశం యూరేసియా గ్రూప్‌ పరిగణనలో లేదు. మార్చినాటికి సవరించినా అప్పటికి అంతగా సమస్య తీవ్రతరం కాలేదు. ప్రపంచ రాజకీయ ముప్పుకు సంబంధించి తొలి ఐదు అంశాలలో పక్కాగా మొదటిది డోనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాలో, రెండవది ఆ పెద్ద మనిషి జిగినీ దోస్త్‌ నరేంద్రమోడీకి చెందాయి.మరో రెండింటిలో ట్రంప్‌కు మద్దతుగా నరేంద్రమోడీ ఉండటం యాదృచ్చికమా ? పధకం ప్రకారం జరిగిందనుకోవాలా ? నాటకీయ పరిణామాల మధ్య తిరిగి ట్రంప్‌ ఎన్నికైతే పాత కౌగిలింతలు కొనసాగుతాయి, సర్వేలు చెబుతున్నట్లుగా జోబిడెన్‌ గెలిస్తే నరేంద్రమోడీ కొత్త ప్రియుడి ప్రసన్నం కోసం ప్రయత్నించాల్సిందే.
2020లో మోడీ తన రెండవ పదవీ కాలంలో ఆర్ధిక అజెండాను ఫణంగా పెట్టి వివాదాస్పద సామాజిక విధానాలను ముందుకు తెస్తారని, మతపరమైన, ఒంటెత్తువాదంతో అస్దిర పరిస్ధితి ఏర్పడుతుందని, విదేశాంగ విధానం, ఆర్ధిక రంగంలో ఎదురుదెబ్బలు తగులుతాయని కూడా యూరేసియా నివేదిక పేర్కొన్నది. ఆర్టికల్‌ 370రద్దు, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర రద్దు, ముమ్మారు తలాక్‌ రద్దు, ఎన్‌ఆర్‌సి, సిఏఏ వంటి అంశాలను మరింత ముందుకు తీసుకుపోతారనే జోశ్యం దానిలో ఉంది. అయితే అనూహ్యంగా కరోనా సమస్య ముందుకు రావటంతో అవి తాత్కాలికంగా తెరవెనుకకు పోయాయి. విదేశాంగ విధానం, ఆర్ధిక రంగంలో ఎదురవుతున్న సమస్యలను మనం చూస్తున్నదే.


రెండవసారి ఎన్నికైనప్పటి నుంచి ఆర్ధిక అంశాలను విస్మరించి వివాదాస్పద సామాజిక అంశాలను ముందుకు తెచ్చారనేందుకు తార్కాణంగా గత ఏడాది తొలి మూడు నెలల కాలంలో 8శాతంగా ఉన్న వృద్ది రేటు నాలుగవ త్రైమాస కాలానికి 4.2శాతానికి పడిపోవటం తెలిసిందే. యూరేసియానే కాదు అనేక మంది ఆర్ధిక వేత్తలు చెప్పినట్లు ఈ దిగజారుడుకు కరోనాకు ఎలాంటి సంబంధం లేదు. అనేక మంది ముందే హెచ్చరిస్తున్నా మందగమనం తప్ప మాంద్యం లేదని ప్రభుత్వం బుకాయించిందే తప్ప వాస్తవాన్ని అంగీకరించలేదు. వరుసగా ఆరునెలల పాటు ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో పయనిస్తే దాన్ని అధికారయుతంగా మాంద్యం అని పరిగణిస్తారు. ఇప్పుడు దేశం వర్తమాన ఆర్దిక సంవత్సరం తొలి మూడుమాసాల్లో ( ఏప్రిల్‌-జూన్‌) తిరోగమనం అన్నది స్పష్టం కాగా అది ఏ స్దాయిలో ఉందో ఇంకా వెల్లడించాల్సి ఉంది. దేవుడు నైవేద్యం తినడనే వాస్తవం పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదన్నట్లుగా ఆర్ధిక దిగజారుడు ముందే తెలుసు గనుక కార్పొరేట్లకు రాయితీలతో వర్తమాన సంవత్సర బడ్జెట్‌ను రూపొందించారు. కరోనా రాకపోయినా దానితో ఫలితం ఉండేది కాదు. కరోనా రావటంతో ఇప్పుడు అసలు విషయాన్ని దాచి పెట్టి కరోనా పేరుతో విదేశాంగ విధానం, ఆర్ధిక రంగాలలో జాతీయ వాదానికి తెరతీసి దేశ పౌరుల దృష్టిని మళ్లించేందుకు పూనుకున్నారు.


ప్రపంచీకరణ నిరంతర అభివృద్ధికి తోడ్పడుతుందని నమ్ముతారు. లేనట్లయితే ఆ క్రమంలో దాని ఆర్ధిక ప్రయోజనాలు, రాజకీయ మద్దతు దెబ్బతింటుంది అని ప్రముఖ అమెరికన్‌ ఆర్ధిక వేత్త పాల్‌ శామ్యూల్‌సన్‌ హెచ్చరించాడు. పెట్టుబడిదారీ వ్యవస్ధ ఎలాంటిదో కరోనా వైరస్‌ నిరూపించింది.దాని కంటే ముందే ప్రపంచీకరణ సంగతి తరువాత ముందు మన సంగతి మనం చూసుకుందామని ప్రతి దేశం రక్షణాత్మక చర్యలకు, జాతీయవాదానికి పెద్దపీట వేస్తున్నది. డోనాల్డ్‌ ట్రంప్‌ ముందు పీఠీన ఉంటే మన దేశం, నరేంద్రమోడీ కూడా అదే బాటలో ఉన్నారు.

ఓకల్‌ ఫర్‌ లోకల్‌ (స్ధానిక తయారీ వస్తువులనే అడగండి) అని మన ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు, సరిహద్దు సమస్యను సాకుగా చూపి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటం, చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు వంటివి వాటిలో భాగమే. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కొన్ని జాతీయవాద ధోరణులను చూద్దాం. అమెరికాకు అగ్రస్ధానం అన్నది అందరికీ తెలిసిందే. ట్రంప్‌ గత ఎన్నికల్లో ఆ నినాదంతోనే ప్రచారం చేశాడు. దానిలో భాగంగానే చైనా మీద అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించింది. చైనా వస్తువులు, సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలపై, ఇతర దేశాలపై తాను ఆంక్షలను ప్రకటించటమే కాదు, తన ఆంక్షలను ఇతరులు కూడా పాటించాలని లేనట్లయితే వారి మీద కూడా చర్యలు తీసుకుంటానని అమెరికా బెదిరిస్తున్నది. ఇరాన్‌ నుంచి మన దేశం చమురు కొనుగోలు నిలిపివేయటానికి ఈ బెదిరింపే కారణం.


గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా అనుసరిస్తున్న వైఖరితో తలెత్తిన పర్యవసానాల కారణంగా ఇతర మార్కెట్లలో ప్రవేశించేందుకు బెల్డ్‌ అండ్‌ రోడ్‌ పేరుతో చైనా తన పధకాలను ముందుకు తీసుకుపోతున్నది. కొందరు దీనిని విస్తరణవాదం అని చిత్రిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు బ్రిటన్‌ వంటి దేశాలు విస్తరణవాదంలో భాగం మనవంటి అనేక దేశాలను వలసలుగా చేసుకున్నాయి. చైనా ఏ దేశాన్నీ ఆక్రమించలేదు. మిగతా దేశాల మాదిరి వాణిజ్య సంబంధాలను నెలకొల్పుకుంటోంది.


అమెరికా, జపాన్‌లను ఒంటరిగా ఎదుర్కొనే శక్తిలేని ఐరోపా దేశాలు సమిష్టిగా వ్యవహరించేందుకు ఐరోపా యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి.అయినా సభ్యదేశాలన్నీ రక్షణాత్మక చర్యలకు పాల్పడుతున్నాయి. దానిలో భాగంగానే యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగింది. వస్తువుల కోసం చైనా, లేదా ఆసియా దేశాల మీద ఆధారపడకూడదనే ధోరణి ఐరోపాలో పెరుగుతోంది. ఐరోపా జాతీయవాదంతో ఐరోపా యూనియన్‌ ముందుకు పోతున్నది.
ఆర్ధిక జాతీయవాదానికి ముద్దు పేరు ఆర్ధిక దేశభక్తి. ఆర్ధిక జనాకర్షక నినాదాలు, చర్యలు ఆచరణలో భాగం. తొలి రోజుల్లో స్వేచ్చా మార్కెట్‌ ఛాంపియన్‌గా ముందున్న నరేంద్రమోడీ ఇప్పుడు దానికి వ్యతిరేకమైన వైఖరిని అనుసరిస్తున్నారనే విమర్శలు ప్రారంభమయ్యాయి. ప్రపంచీకరణలో భాగమైన ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరేందుకు తిరస్కరించటం వాటిలో ఒకటి.( దానిలో చేరితే మన దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని దేశంలోని దాదాపు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు వ్యతిరేకించాయి) తాజాగా చైనా నుంచి వచ్చే పెట్టుబడులను అడ్డుకునేందుకు తీసుకున్న చర్యల ఆంతర్యమిదే. ఈ రోజు చైనాతో ప్రారంభం కావచ్చుగానీ ఆర్ధిక జాతీయవాదం మరింత ముదిరితే అది మిగతా దేశాల పెట్టుబడులకు, వస్తువులకు సైతం విస్తరించే అవకాశాలు ఉన్నాయి. స్ధానిక వస్తువులనే అడగండి, ఆత్మనిర్భరత పేరుతో స్ధానికంగా అవసరమైన వస్తువులను తయారు చేసుకోవాలనే నినాదాలతో మన దేశం కూడా రక్షణ చర్యలకు పూనుకుంది. దీన్నో తప్పుపట్టాల్సిందేమీ లేదు. ఇంతకు ముందు ఉన్న నిబంధనలను సడలించి 200 కోట్ల రూపాయల లోపు వస్తువులు, సేవలను విదేశాల నుంచి పొందకూడదని నిర్ణయించింది. చైనా నుంచి పెట్టుబడులను నిరోధించేందుకు వీలుగా నిబంధనలను సవరించింది. దీన్ని ఆర్దిక జాతీయవాదం అంటున్నారు.


జాతీయవాదానికి అనుగుణ్యంగా ఏ దేశానికి ఆ దేశం రక్షణాత్మక చర్యలు తీసుకోవటం, ఇతర దేశాల మీద ఆధారపడకుండా దేశీయంగానే అవసరాలను తీర్చుకొనేందుకు తీసుకొనే చర్యలను తప్పుపట్టనవసరం లేదు. కొన్ని సందర్భాలలో తప్పదు. ప్రపంచీకరణలో భాగంగా అమలు జరుపుతున్న ఉదారవాద విధానాలు అన్ని దేశాలకూ ఉపయోగపడటం లేదు. దానికి మన దేశమే చక్కటి ఉదాహరణ. ఇతర దేశాల వస్తువులన్నీ మన దేశంలో కుమ్మరిస్తున్నారు. ఫలితంగా స్ధానిక చేతివృత్తులు, పరిశ్రమలు, చివరికి వ్యవసాయం మీద కూడా ప్రతికూల ప్రభావాల పడ్డాయి.జాతీయ వాదాన్ని కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు, కానీ జాతీయోన్మాదాన్ని ఎలా చూడాలి. పాలకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ఎత్తుగడల్లో భాగంగా ఇలాంటి వాటిని ముందుకు తీసుకు వస్తారు.


జాతీయవాదంలో భాగంగా పోలీసు, మిలటరీ కాంటీన్లలో మన దేశంలో తయారైన వస్తువులను మాత్రమే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిషేధిత వస్తువుల జాబితాలో పండ్లు తోముకొనే కోల్గేట్‌ పేస్ట్‌ వంటి బహుళజాతి సంస్దల ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అవేవీ చైనా ఉత్పత్తులు కాదు. నిజానికి కేంద్రప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నరేంద్రమోడీ అధికారానికి రాగానే ఈ చర్యలెందుకు తీసుకోలేదు? టిక్‌టాక్‌ లేదా ఇతర చైనా యాప్‌లు మన భద్రతకు ముప్పు అని ఆకస్మికంగా గుర్తుకు రావటం ఏమిటి ? అదే నిజమైతే దానికి మోడీ అండ్‌కోను విచారించాలా లేదా ?


దేశంలో 1991నుంచి నూతన ఆర్ధిక విధానాలకు తెరతీశారు. అప్పటి వరకు లేని స్వదేశీ జాగరణ మంచ్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ రంగంలోకి తెచ్చింది. నూతన ఆర్ధిక విధానాలను కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు గనుక, తామూ దేశ ప్రయోజనాలకోసమే పని చేస్తామని చెప్పేందుకు ఆ సంస్ధను ఏర్పాటు చేశారు. అదే ఆర్‌ఎస్‌ఎస్‌ సృష్టి అయిన బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత చేసిందేమిటి ?


చైనా వస్తువులను విధిగా కొనాలన్న నిబంధనలేవీ ప్రపంచ ఆరోగ్య సంస్ధ విధించలేదు. ఇక్కడున్న కమ్యూనిస్టు పార్టీలేవీ చైనా వస్తువుల గురించి లాబీయింగ్‌ జరపలేదు, దిగుమతి చేసుకోవాలని అడగలేదు. చైనా పెట్టుబడుల విషయం కూడా అంతే. గత ఆరు సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడి కావటానికి నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చిన అవకాశాలు తప్ప తమ వస్తువులు కొనమని,పెట్టుబడులు తీసుకోవాలని చైనా వైపునుంచి వత్తిడేమీ లేదు. లేదా అమెరికా మాదిరి ప్రతీకార చర్యలు ఉన్నట్లు ఎవరూ ఇంతవరకు చెప్పలేదు.


అన్ని దేశాలూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో భాగస్వాములుగా ఉన్నపుడు దాని నిబంధనలను అమలు జరపటం వాటి విధి. లేకపోతే బయటకు వచ్చే స్వేచ్చ ఉంది. కమ్యూనిస్టులు అంతర్జాతీయవాదులు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉంది. సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం జరుపుతోందని భావిస్తున్నారు కనుక ఆ పార్టీ విధానాల మంచి చెడ్డల గురించి సహజంగానే ఆసక్తి ఉంటుంది. పార్టీల మధ్య సంబంధాలు కూడా పెట్టుకుంటారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో ఏ బంధం ఉందని బిజెపి ప్రతినిధి బృందాలు చైనా పర్యటనకు వెళ్లినట్లు ? నోరు తెరిస్తే చైనా కమ్యూనిస్టు పార్టీ నియంతృత్వం అంటారు.


భారత్‌-చైనా మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. అందువలన రెండు దేశాల ఆర్ధిక వ్యవస్ధలు,ఇతర అనేక అంశాల గురించి రెండు దేశాలను పోల్చటం నరేంద్రమోడీ అధికారంతో నిమిత్తం లేకుండానే ఎప్పటి నుంచో జరుగుతోంది.చైనాతో మన దేశాన్ని పోల్చటాన్ని కొందరు దేశ ద్రోహంగానూ, చైనా భక్తిగానూ వర్ణిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమంలో ఆ దాడి ఎక్కువగా ఉంది. చైనాతో మన దేశాన్ని పోల్చి ఎక్కువగా మాట్లాడుతున్నదెవరు ? నరేంద్రమోడీ ప్రధాని అయిన ఆరునెలల్లోపే చైనాను సందర్శించిన బిజెపి బృందాలు అక్కడి కమ్యూనిస్టు పార్టీ నిర్వహించే రాజకీయ పాఠశాలలను ఎందుకు సందర్శించాయి. మేము కూడా కమ్యూనిస్టు పార్టీ మాదిరే పార్టీని విస్తరిస్తామని, రాజకీయ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పిందెవరు? చైనా కమ్యూనిస్టు పార్టీతో పోల్చుకున్నదెవరు?


చైనాను పక్కకు నెట్టి ప్రపంచానికి వస్తువులను అందిస్తామంటూ మేకిన్‌ ఇండియా, ఇప్పుడు మేక్‌ ఫర్‌ వరల్డ్‌ అని, త్వరలో జిడిపి రేటులో చైనాను అధిగమిస్తామని చెబుతున్నదెవరు ? ప్రతి ఏటా అనుకూలంగానో వ్యతిరేకంగానో చైనా వస్తువుల గురించి మాట్లాడుతున్నది వారే. అంతెందుకు 2019-20 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సర్వేలో చైనా మాదిరి ఉపాధి, అభివృద్ది గురించి దాదాపు పదిపేజీలు కేటాయించి రాసినవారెవరు ? దీన్ని పోలిక అంటారా మరొకపేరుందా ?ఒక వేళ అదే దేశద్రోహం అయితే సంఘపరివార్‌ శక్తులే తొలి దేశద్రోహులు అవుతారు. చైనాను పక్కన పెట్టండి, అభివృద్ధి చెందిన దేశాల సరసకు దేశాన్ని తీసుకుపోతామని చెబుతారు. దాన్నేమంటారు ? పోలిక తప్పు కాదు. అయినా పోల్చిన వారిని దేశవ్యతిరేకులు అంటున్నారంటే జనాన్ని తప్పుదారి పట్టించటం తప్ప అది జాతీయవాదమా ? జాతీయోన్మాదమా ?


వలస పాలనను వ్యతిరేకించటం స్వాతంత్య్రానికి ముందు జాతీయవాదం. ప్రపంచాన్ని ఆక్రమించుకొనే క్రమంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, డచ్‌, పోర్చుగీసు, ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాలలో జాతీయ వాదం ముందుకు వచ్చింది. తమ దేశం ప్రపంచంలో పై చేయి సాధించాలంటే ప్రపంచాన్ని ఆక్రమించాలనేది వాటి జాతీయ వాదం. చైనా,జర్మనీ, దక్షిణకొరియా, జపాన్‌ వంటి దేశాలతో పోటీపడుతూ వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతి చేయాలను కోవటంలో తప్పు లేదు. వాటిని పక్కకు నెట్టి ఆ స్ధానాన్ని మనమే ఆక్రమించాలనుకుంటే అది సమస్యలకు దారి తీస్తుంది. నాడు జాతీయవాదంతో ఐరోపా దేశాలు పోటీపడి తొలుత ప్రాంతీయ యుద్ధాలు తరువాత ప్రపంచ యుద్ధాలకే పాల్పడ్డాయి. వస్తు తయారీ జాతీయ వాదం ముదిరితే అది వాణిజ్య యుద్దాలకు దారి తీస్తుంది.


అమెరికాను మరోసారి అగ్రస్ధానంలో నిలబెడతానని డోనాల్డ్‌ ట్రంప్‌ చెబితే మంచి రోజులు తెస్తానని మన నరేంద్రమోడీ వాగ్దానం చేశారు. ఇద్దరూ విఫలమయ్యారు. కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేయటంలోనూ అదే రికార్డు. వైరస్‌ నివారణ రాష్ట్రాల బాధ్యత అని తప్పించుకొనేందుకు పూనుకోవచ్చు. ప్రపంచం మొత్తాన్ని మహమ్మారులు చుట్టుముట్టినపుడు దేశపాలకులు తమ బాధ్యత లేదని తప్పించుకుంటే కుదరదు. జిడిపిని ఐదులక్షల కోట్ల డాలర్లకు తీసుకుపోతానని నరేంద్రమోడీ చెప్పారు. రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా సాధిస్తారా ? ఏ క్షణంలో అయినా కరోనా కేసుల్లో మన దేశాన్ని అమెరికా సరసన చేర్చే దిశలో ఉన్నారు. నరేంద్రమోడీ ఘోరవైఫల్యంగా ప్రపంచం కరోనా విస్తరణను చూస్తున్నది. అదే విధంగా కరోనా వైరస్‌ను తక్కువ చేసి మాట్లాడటం ట్రంప్‌ ఏలుబడిలోని అమెరికా చరిత్రలో అతి పెద్ద గూఢచర్య వైఫల్యంగా చరిత్రలో నమోదైంది. చరిత్రలో అమెరికా ఎంత ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నదో అదే బాటలో భారత్‌ కూడా పయనిస్తున్నది. రెండింటికీ కరోనా ఒక్కటే కారణం కాదు. రాకెట్‌ మాదిరి అమెరికాలో ఆర్ధిక స్దితి తిరిగి దూసుకుపోనుందని ట్రంప్‌ కనీసం మాటలైనా చెబుతున్నారు. నరేంద్రమోడీ నుంచి ఒక్క మాటైనా విన్నామా ?


డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ ఒకే కంచం-ఒకే మంచం స్నేహితుల మాదిరి ఉన్నారు. ఇద్దరూ తమ వైఫల్యాలను లేదా ఆర్ధిక, కరోనా వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు చైనా వ్యతిరేకతను ముందుకు తీసుకు వచ్చారు. ఒక రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీలను అక్కడి ప్రభుత్వం అణచివేస్తున్నదనే పేరుతో చైనా అధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది. దేశ భద్రతకు ముప్పు అనే పేరుతో చైనా యాప్‌లను మోడీ నిషేధించారు. ఇలా ఇద్దరు స్నేహితులూ ప్రజాకర్షక జాతీయవాద పులి స్వారీ చేస్తున్నారు. పెద్దలు చెప్పిన దాని ప్రకారం పులి స్వారీకి దిగిన వారు దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి లేనట్లయితే దానికి బలికావాలి ! ఇద్దరు స్నేహితులకు ఆ సత్తా ఉందా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెజాన్‌, అంబానీ సేవలో మోడీ – ఆందోళనలో కిరాణా దుకాణాల నాడి !

21 Friday Aug 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Jeff Bezos, Kirana Shopper, Mukesh Ambani, Reliance vs Amazon


ఎం కోటేశ్వరరావు
బాంక్‌ ఆఫ్‌ చైనా మన ప్రయివేటు ఐసిఐసిఐ బ్యాంకులో 15 కోట్ల రూపాయల విలువగల వాటాలను కొనుగోలు చేసింది. దీని మీద దేశంలో కొందరు గగ్గోలు లేవనెత్తారు. ఇంకేముంది సదరు బ్యాంకును చైనా మింగేసింది అన్నట్లుగా చిత్రించారు. ఇంతకూ అది ఎంత అంటే ఆ బ్యాంకు వాటాలలో 0.006శాతం మాత్రమే.
అమెరికాకు చెందిన ప్రయివేటు కార్పొరేట్‌ సంస్ద అమెజాన్‌ గత కొద్ది సంవత్సరాలుగా మన దేశంలోని సంస్ధలను, వ్యాపారాన్ని మింగివేస్తున్నది. టాటా గ్రూప్‌కు చెందిన వెస్ట్‌లాండ్‌ అనే ప్రచురణ, పుస్తకపంపిణీ సంస్దలో 26శాతం వాటాలను 9.5 కోట్ల రూపాయలకు 2016 ఫిబ్రవరిలో కొనుగోలు చేసింది. మిగిలిన 74శాతం వాటాలను కూడా తీసుకుంటానని అంగీకరించింది. 2018లో టాప్‌జో అనే కంపెనీని 4 కోట్లడాలర్లకు (అంటే దాదాపు మూడు వందల కోట్ల రూపాయల విలువ) కొనుగోలు చేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ మోర్‌ అనే పేరుతో ఒక సూపర్‌ మార్కెట్‌ దుకాణాల సముదాయాన్ని ఏర్పాటు చేసింది. వారి నుంచి ఒక సంస్ద దాన్ని రూ.4,200 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సంస్ధ నుంచి 49శాతం వాటాలను అమెజాన్‌ కొనుగోలు చేసి పెద్ద సంఖ్యలో దుకాణాల ఏర్పాటుకు పూనుకుంది.
పార్టిసిపేటరీ నోట్స్‌ పేరుతో విదేశీ పెట్టుబడిదారులు మన స్టాక్‌ మార్కెట్లో ఏ కంపెనీ వాటాలను అయినా కొనుగోలు చేయవచ్చు, లాభం అనుకున్నపుడు అమ్ముకొని వెళ్లిపోవచ్చు. ఒక దశలో మన దేశాలో ఇలాంటి పెట్టుబడులు నాలుగున్నరలక్షల కోట్ల రూపాయల మేరకు చేరాయి. ఇలా బడా కార్పొరేట్‌లు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో మన సంస్ధలను మింగివేస్తూ లాభాలను తరలించుకుపోతుంటే చైనా బ్యాంకు కేవలం 15 కోట్ల రూపాయల వాటాలను కొన్నందుకు గగ్గోలు పెట్టటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? ఏనుగులను దూరే కంతలను వదలి చీమలు దూరే వాటి మీద కేంద్రీకరించినట్లు అనుకోవాలా ? ఇది దేశ భక్తా లేక చైనా వ్యతిరేకతా ? ఇలా ప్రశ్నించటాన్ని చైనా అనుకూలం అని ఎవరైనా అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి ఉండదు. ఐసిఐసి అయినా హెచ్‌డిఎఫ్‌సి అయినా మరొక కంపెనీ అయినా వాటాలు, ఆస్ధులను అమ్మకానికి పెట్టటమా లేదా అన్నది వేరే అంశం. బహిరంగ మార్కెట్‌లో ఎవరైనా శక్తి ఉన్నవారు ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఏ విదేశీ సంస్ధ అయినా మన ప్రభుత్వం అనుమతించిన మేరకు లాభాలను తరలించుకుపోయేదే తప్ప మరొకటి కాదు.
ఇప్పుడు చిన్న చిన్న దేశాలను సైతం కొనుగోలు చేయగలిగిన బడా కార్పొరేట్‌లు మన మార్కెట్‌ను తమ స్వంతం చేసుకొనేందుకు ఎంతకైనా తెగించేందుకు పూనుకున్నాయి. ఒక నాడు గుత్తాధిపత్యాన్ని నిరోధించేందుకు చట్టాలు చేసిన మన దేశం ఆరోగ్యకరమైన ఆ విధానాన్ని విస్మరించి అంతర్జాతీయ సంస్దల వత్తిడి లేదా ఆదేశాల మేరకు ఆ చట్టాన్ని రద్దు చేసి పోటీ కమిషన్‌ పేరుతో కొత్త చట్టాలను చేశాయి. దానిలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకొనే వారు లేరు. ఒక వైపు తీవ్ర ఆర్ధిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. మరోవైపు మూల మూలకూ తమ దుకాణాల గొలుసును విస్తరించేందుకు విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌లు కండలు పెంచుతూ కసరత్తు చేస్తున్నాయి. ఆంబోతుల మధ్య లేగదూడలు నలిగినట్లుగా పెద్ద ఎత్తున స్వయం ఉపాధికల్పిస్తున్న కిరాణా దుకాణాల భవిష్యత్‌ నానాటికీ ప్రశ్నార్ధకంగా మారుతూ ఉపాధి సమస్యను ముందుకు తెస్తోంది. మన దేశంలో అతి పెద్ద కార్పొరేట్‌ సంస్ధ అయిన రిలయన్స్‌, అమెరికాలో అతి పెద్ద సంస్ధ అయిన అమెజాన్‌ మార్కెట్‌ను చేజిక్కించుకొనేందుకు గోదాలోకి దిగాయి. రానున్న రోజుల్లో పోటీ ఏ విధంగా సాగుతుందో, పర్యవసానాలు ఏమిటన్నది ఆసక్తికరంగా మారుతోంది.
రిలయన్స్‌ కంపెనీ అధిపతి ముకేష్‌ సంపాదన గంటకు ఏడు కోట్ల రూపాయలు కాగా అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ తొమ్మిది రెట్లు అంటే గంటకు 63 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు అంచనా.రిలయన్స్‌ కంపెనీ విలువ గత ఏడాది 140 బిలియన్‌ డాలర్లు కాగా అమెజాన్‌ విలువ 991.6బిలియన్‌ డాలర్లు. ఆసియాలోనే అతి పెద్ద ధనవంతుడైన ముకేష్‌ అంబానీ నిన్నా మొన్నా తన కంపెనీల్లో వాటాలను అమ్మి దాదాపు 20 బిలియన్‌ డాలర్ల మేర ( దాదాపు లక్షా 50వేల కోట్ల రూపాయలు) ధనం కూడ బెట్టుకున్నట్లు, తన కంపెనీలకు అప్పులు లేకుండా చేసుకున్నట్లు వార్తలు చదివాం. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి కంపెనీలు వాటిని కొనుగోలు చేశాయి. ఇప్పుడు అదే ముకేష్‌ తానే అనేక కంపెనీల కొనుగోళ్లకు దిగారు. అమెజాన్‌తో పోటీ పడేందుకు తన వాణిజ్య సామ్రాజ్యాన్ని విస్తరించుకొనేందుకు పూనుకున్నారు. రోగులు దుకాణాలకు పోకుండా ఆన్‌లైన్‌లో ఆర్డరు చేస్తే ఔషధాలను అందచేసే నెట్‌మెడ్స్‌ అనే కంపెనీలో 620 కోట్లకు మెజారిటీ వాటాలను కొనుగోలు చేసినట్లు ఇది రాసిన సమయానికి చదివాము. ఇప్పటికే అమెజాన్‌ రంగంలో ఉంది. వచ్చే ఐదు సంవత్సరాలలో పాలు సరఫరా చేసే కంపెనీతో సహా అనేక సంస్ధలను తన సామ్రాజ్యంలో కలుపుకొనేందుకు పావులు కదుపుతున్నాది. రిలయన్స్‌ సంస్ధ జియో ఫోన్లతో పాటు ఇప్పుడు జియో మార్ట్‌ కంపెనీ ద్వారా కిరాణా సరకులను ఇండ్లకు అందచేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. వాల్‌ మార్ట్‌ కంపెనీ ఇప్పటికే 16 బిలియన్‌ డాలర్లు, అమెజాన్‌ 5.5 బిలియన్‌ డాలర్ల రంగంలోకి దిగాయి. స్వదేశీ డిమార్ట్‌ కూడా పోటీకి సన్నద్దం అవుతోంది. ఉల్లిపాయల మొదలు ఆర్ధిక సేవల వరకు దేన్నీ వదిలేందుకు ఇవి సిద్ధంగా లేవు.
మోటారు వాహనాల బీమా పాలసీలను ఎలాంటి పత్రాలతో నిమిత్తం లేకుండా కేవలం రెండు నిమిషాల్లో పునరుద్దరించే సేవలను అమెజాన్‌ ప్రారంభించింది. త్వరలో అమెజాన్‌ మెడికల్‌ షాపులు కూడా రాబోతున్నాయి.దాన్లో ఇంగ్లీషు మందులతో పాటు మూలికా ఔషధాలు కూడా ఉంటాయి. చైనాలో ప్రవేశించేందుకు విఫలయత్నం చేసిన ఈ సంస్ధ ఇప్పుడు మన మార్కెట్‌ మీద కేంద్రీకరించింది.
రిలయన్స్‌ లేదా అమెజాన్‌ వంటి బడా సంస్ధలన్నీ జన సమ్మర్దం ఎక్కువగా ఉండే పట్టణాల మీదే కేంద్రీకరిస్తున్నాయి. పని వత్తిడిలో ఉండే వారు, ధనికులు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. రిలయన్స్‌ జియో మార్ట్‌లో కొద్ది వారాల్లోనే రోజుకు రెండున్నరలక్షల ఆర్డర్లు వచ్చాయి. రెండు వందల పట్టణాలకే ప్రస్తుతం ఉన్న ఈ సేవలను విస్తరిస్తే ఇంకా పెద్ద మొత్తంలో స్పందన వస్తుంది. అయితే కూరగాయలు చెడిపోవటం, కొన్ని వస్తువుల జాడ లేకపోవటం, వాటికి నగదు వాపస్‌ ఆలస్యం కావటం వంటి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. వాటిని అధిగమించేందుకు పూనుకున్నారు. పెద్ద పట్టణాల్లో ఉన్న డిమార్డ్‌ దుకాణాల్లో ఇస్తున్న రాయితీలు ఇప్పుడు వినియోగదారులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి.
ఇప్పుడు రిలయన్స్‌, అమెజాన్‌ వంటి సంస్ధలన్నీ రాయితీల జల్లులతో వినియోగదారులను ఆకట్టుకోబోతున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌లో ఏడాది చందా చెల్లించిన వారికి ఆ సంస్ధ ద్వారా ఏ వస్తువును కొనుగోలు చేసినా ధరల తగ్గింపుతో పాటు రవాణా చార్జీల రాయితీ అదనంగా ఇస్తున్నారు. పెద్ద పట్టణాల్లో ఉన్న బిగ్‌ బజార్‌ కంపెనీలో అమెజాన్‌కు వాటా ఉంది. రిలయన్స్‌ కూడా కొంత వాటాను దక్కించుకొనేందుకు పూనుకోగా అమెజాన్‌ అడ్డుపడుతోంది. అమెజాన్‌ ప్రస్తుతం ఒక్కో వ్యాపార రంగం గురించి ఒక్కొక్క పట్టణంలో ప్రయోగాలు, పరిశీలనలు జరుపుతోంది. ఉదాహరణకు పూనాలో ఇండ్లకు పండ్లు, కూరగాయల సరఫరా. మార్కెట్‌ తీరు తెన్నులు అవగతం అయిన తరువాత తన గొలుసును విస్తరించబోతున్నది.
రిలయన్స్‌ ఇప్పటికే తన దుకాణాల ద్వారా తాజాగా ఇండ్లకు సరఫరా చేస్తున్నది. రైతుల నుంచి నేరుగా ఇప్పటికే కొనుగోలు చేస్తుండగా మరింత ఎక్కువ చేసేందుకు పూనుకుంది. జియో కనెక్షన్‌ రేట్లు తగ్గించటం, ఫోన్లకు రాయితీల వంటి చర్యల ద్వారా మిగతా నెట్‌ వర్కులను దెబ్బతీసిన రిలయన్స్‌ ఇప్పుడు రేట్లు పెంచింది. తన కంటే ఆర్ధికంగా అన్ని విధాలా పెద్ద దైన అమెజాన్‌తో ఎలా ఢకొీంటుందో చూడాల్సి వుంది. స్ధానికంగా ఉండే కిరాణా దుకాలతో అనుసంధానించి ఆన్‌లైన్‌ ఆర్డర్లను పెద్ద ఎత్తున సంపాదించేందుకు ఒప్పందాలు చేసుకోనుంది. అంటే ప్రస్తుతం ఉన్న కిరాణా దుకాణాలు రిలయన్స్‌ లేదా అమెజాన్‌ వంటి కంపెనీల సరకులను సరఫరా చేసే కేంద్రాలుగా మారనున్నాయి. దీని వలన ఆ బడా సంస్దలు మౌలిక సదుపాయాలకు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ కంపెనీల పోటీకి నిలువలేని దుకాణదారులు కోల్పోయిన ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు ఆ కంపెనీల ఏజంట్లుగా మారిపోవటం అనివార్యంగా మారే దృశ్యం కనిపిస్తోంది. అయితే ఇదంతా తెల్లవారేసరికి జరిగిపోతుందని కాదు గానీ, సాంప్రదాయ కిరాణా దుకాణాలు ముందుగా పెద్ద పట్టణాలలో మనుగడ సమస్యలను ఎదుర్కోనున్నాయి.ప్రస్తుతం మన దేశంలో గొలుసుకట్టు షాపులు లేదా ఆన్‌లైన్‌(ఇకామర్స్‌) ద్వారా గానీ కేవలం 12శాతం లావాదేవీలు మాత్రమే జరుగుతున్నాయి. బడా సంస్దలన్నీ రాబోయే 20సంవత్సరాల వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకొని తమ పధకాలను రూపొందిస్తున్నాయి.
ప్రధాన నగరాలలో రిటైల్‌ వ్యాపారులకు వస్తువులను విక్రయిస్తున్న జర్మన్‌ మెట్రో సంస్ధ ఇప్పుడు దాన్ని మరింత విస్తరించి కిరాణా దుకాణదారులకు సరకులను సరఫరా చేసేందుకు ఆలోచిస్తున్నది. అంటే ఒక విధంగా చెప్పాలంటే పంపిణీదారు పాత్ర పోషించనుంది. ఇదే మాదిరి వాల్‌మార్ట్‌, అమెజాన్‌ కూడా హౌల్‌సేల్‌ వ్యాపారంలోకి దిగాలని చూస్తున్నాయి. రిలయన్స్‌ తన జియో ఖాతాదారులు, అదే విధంగా అది నిర్వహిస్తున్న నెట్‌వర్క్‌18పేరుతో వివిధ రాష్ట్రాలు, జాతీయ స్ధాయిలో నిర్వహిస్తున్న వివిధ టీవీ ఛానళ్ల వీక్షకులు, రిలయన్స్‌ ఫ్రెష్‌ ఖాతాదారులతో మరింతగా తన కార్యకలాపాలను పెంచుకొనేందుకు చూస్తోంది.చౌకదుకాణాలతో ఒప్పందాలు చేసుకొని వాటి ద్వారా సరఫరా చేయాలని యోచిస్తున్నది. అంతే కాదు కొన్ని చోట్ల స్టాక్‌ పాయింట్ల ఏర్పాటు, ఐదువేల దుకాణాలతో ఇప్పటికే ఒప్పందం చేసుకుందన్న వార్తలు వచ్చాయి. పదివేల కిరాణా దుకాలతో ఒప్పందాలకు ఫ్యూచర్‌ గ్రూపు కూడా ఆలోచిస్తున్నది. అమెజాన్‌ 17,500 దుకాణాలతో, ఫ్లిప్‌కార్ట్‌ 15వేల కిరాణా దుకాణాల ద్వారా సెల్‌ఫోన్లు, ఇతర ఉత్పత్తుల విక్రయానికి ఆలోచిస్తున్నది. అనేక వేల దుకాణాల ద్వారా ఈ కంపెనీలన్నీ ఆన్‌లైన్‌ వాణిజ్యం జరిపేందుకు పూనుకున్నాయి. ఈ ఏర్పాట్ల ద్వారా విదేశీ, స్వదేశీ బ్రాండ్‌ ఉత్పత్తులు వినియోగదారులకు మరింత అందుబాటులోకి వస్తున్నాయి. పర్యవసానంగా వాటి లావాదేవీలు పెరుగుతున్నాయి.
నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తున్న గొలుసుకట్టు షాపులు ఇస్తున్న రాయితీలు వినియోగదారులను సహజంగానే ఆకట్టుకుంటున్నాయి. కరోనా సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా గొలుసుకట్టు షాపులకు వెళ్లేందుకు వినియోగదారుల సంఖ్య మీద పరిమితులు విధించటంతో అనేక మంది తిరిగి ముఖ్యంగా పట్టణాల్లోని కిరాణా దుకాణాలను ఆశ్రయించారు. నిబంధనలను సడలించిన తరువాత తిరిగి మామూలు స్ధితికి చేరుకుంటున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో దాదాపు 70లక్షల కిరాణా దుకాణాలు ఉన్నట్లు అంచనా. కుటుంబ సభ్యులతో పాటు సగటున ఒక్కొక్క దుకాణం ఇద్దరికి ఉపాధి కల్పించినా దాదాపు రెండున్నర నుంచి మూడు కోట్ల మంది పని చేసే అవకాశం ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

74 ఏండ్ల స్వాతంత్య్రం-2 : ద్రవ్య పెట్టుబడి-నయా ఉదారవాదం- హిందూత్వ !

17 Monday Aug 2020

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ Leave a comment

Tags

74th independence day India, Finance Capital, Narendra Modi, Neoliberalism in India, RSS-Hindutva


ఎం కోటేశ్వరరావు
ప్రస్తుతం ఉన్న పార్లమెంట్‌, పాలకుల నివాసాలు శుభ్రంగా ఉన్నాయి, మన సామాన్యుల ఇండ్ల మాదిరి వర్షాలకు కురుస్తున్నట్లు వార్తలేమీ లేవు. దేశం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది, లోటు బడ్జెట్‌ను పూడ్చుకొనేందుకు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగపోయినా ఎడా పెడా వేల కోట్ల రూపాయల పన్నులు, ధరల పెంపుతో జనాల జేబులు కొల్లగొడుతున్నారు.లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. కరోనా నివారణ చర్యలకు రాష్ట్రాలు నిధుల్లేక నానా అగచాట్లు పడుతున్నాయి. అయినా నూతన పార్లమెంట్‌ భవనం, ఇతర కట్టడాలు నరేంద్రమోడీ హయాంలో నిర్మిత మయ్యాయనే కీర్తి కండూతి కోసం దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలను తగలేసి కట్టేందుకు నిర్ణయించారు. దీన్ని చూస్తే హిట్లర్‌ గుర్తుకు వస్తున్నాడు. చరిత్రలో నిలిచిపోయేలా ఐరోపాలో ఎక్కడా లేని విధంగా జర్మనీలో గ్రేట్‌ హాల్‌ నిర్మించాలని నిర్ణయించి, నమూనాలను గీయించాడు. రెండవ ప్రపంచ యుద్దంలో కమ్యూనిస్టుల చేతిలో పరాజయం పాలై ఆత్మహత్య చేసుకున్నాడు గానీ గెలిచి ఉంటే దాన్ని నిర్మించి ఉండేవాడు. నెహ్రూ నీటిపారుదల ప్రాజెక్టులకు, ఇతర పారిశ్రామిక సంస్దలకు నాంది పలిక ఆధునిక దేవాలయాలకు ఆద్యుడయ్యాడనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నరేంద్రమోడీ తన ఖాతాలో ఆర్టికల్‌ 370 రద్దు, విగ్రహాలు, ఆయోధ్యరామ మందిరం తదితర అంశాలతో పాటు పార్లమెంట్‌ భవనాన్ని చేర్చి నెహ్రూ పేరును చెరిపి వేయాలన్న తాపత్రయం, ప్రయత్నం కనిపిస్తోంది.


సుప్రీం కోర్టు తీర్పు మాత్రమే చెప్పింది !
సుప్రీం కోర్టు బాబరీ మసీదు స్ధలం రాముడికే చెందాలని తీర్పు చెప్పింది తప్ప న్యాయం చేకూర్చలేదు అనే విమర్శలు ఉన్నాయి. మసీదు కూల్చివేతను ఒక నేరపూరిత చర్యగా వర్ణించింది.దోషులను శిక్షించేందుకు విచారణను వేగవంతం చేయాలన్నది. అదే కోర్టు మరోవైపున మసీదు కూల్చివేతలో ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రమేయం ఉన్నవారికి ఆ స్ధలంలో రామాలయనిర్మించే బాధ్యతను అప్పగించింది. అయితే అది ఒక ట్రస్టు ఆధ్వర్యాన జరగాలని తీర్పు చెప్పింది. కానీ నరేంద్రమోడీ అండ్‌కో దాన్ని ఒక అధికారిక కార్యక్రమంగా మార్చివేశారు. లౌకిక రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసిన మోడీ దీనికి హాజరు కావటాన్ని రాజ్యాంగ ఉల్లంఘన అని తప్ప ఏమనాలి ? రామాలయ నిర్మాణం కోసం శతాబ్దాల తరబడి అనేక మంది త్యాగాలు చేశారంటూ స్వాతంత్య్ర ఉద్యమంతో పోల్చటం చరిత్రను కించపరచటం కాదా ? నరేంద్రమోడీ మాతృసంస్ధ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వామి కాదు. ఉద్యమాన్ని వ్యతిరేకించింది. ఒక సంస్ధగా ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్రం పోరాటంలో ఎందుకు పాల్గొనలేదు అని తనకు తానే ప్రశ్న వేసుకొని ఆ సంస్ధ ప్రముఖుడు నానాజీ దేశముఖ్‌ ఇచ్చిన వివరణే అందుకు నిదర్శ నం.


చెప్పింది చెయ్యరు- చేసేది చెప్పరు !
అచ్చేదిన్‌ (మంచి రోజులు) అని నినాదమిచ్చిన నరేంద్రమోడీ ఏలుబడిలో ఎన్నికల తరువాత అసలు ఆ మాటను ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రస్తావించలేదంటే అతిశయోక్తి కాదు. అదే విధంగా గుజరాత్‌ అభివృద్ది నమూనాను దేశమంతటా అమలు జరుపుతానని చెప్పారు. దాని ప్రస్తావనా లేదు. విదేశాల్లో దాచుకున్న దొంగ సొమ్మును తీసుకువస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు వస్తాయి, ఇస్తామన్నట్లుగా మాట్లాడారు. అదేమైందో తెలియదు. నిరుద్యోగం 40 సంవత్సరాల రికార్డు స్ధాయికి చేరింది అని ప్రభుత్వ గణాంకాల నివేదిక తేల్చింది. అయితే అదంతా తప్పుల తడక, కల్పించిన ఉపాధిని పరిగణనలోకి తీసుకోలేదు, ఉదాహరణకు పకోడీల తయారీ కూడా ఉపాధికల్పనలో భాగమే అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకోలేదు, సరైన లెక్కల పద్దతిని రూపొందించి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఎన్నికల తరువాత అదే నివేదికను ఆమోదించారు. కొత్త గణాంకాలను తెచ్చిందీ లేదు.2019 పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే(పిఎల్‌ఎఫ్‌ఎస్‌)ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల కోసం ఆరునెలల పాటు తొక్కిపెట్టింది.2011-12 సంవత్సరాలలో 467.7 మిలియన్‌లుగా ఉన్నకార్మికశక్తి 2017-18 నాటికి 461.5మిలియన్లకు తగ్గిపోయారు. వ్యవసాయ రంగంలో 29.3 మిలియన్ల మంది ఉపాధి కోల్పోగా వారిలో 24.7 మిలియన్ల మంది మహిళలే ఉన్నారు. అయినప్పటికీ పాలకులు మహిళా ఉద్దరణ, విజయగాధల గురించి కబుర్లు చెబుతూనే ఉన్నారు. ఉపాధి తగ్గిపోయినట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం .రూపొందించిన నివేదికలో నాలుగు దశాబ్దాల రికార్డు స్ధాయి 6.1.శాతానికి నిరుద్యోగం పెరిగిందని పేర్కొన్నది. దీనికి 2016లో నరేంద్రమోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు కారణం అన్నది దాని సారాంశం. దాన్ని ఎన్నికల ముందు విడుదల చేస్తే నష్టదాయకం కనుక తొక్కి పెట్టారు.


నరేంద్రమోడీ హయాంలో జిడిపి పెరుగుదల మొదలు అనేక గణాంకాలు వివాదాస్పదం అయ్యాయి. ఏది నిజమో కాదో తెలియని సందిగ్ద స్దితిలో జనాన్ని పెట్టారు. మోడీ గణానికి కావాల్సింది అదే. అలాంటి పరిస్ధితిలో తమ ప్రచార యంత్రాంగం ద్వారా అర్ధసత్యాలు, అసత్యాలను ప్రచారం చేసి తమ పబ్బం గడుపుకోవాలన్నది ఎత్తుగడ. లెక్కించే పద్దతి సరిగా లేదు, మేము సాధించిన వృద్ధి గణాంకాల్లో చేరటం లేదని చెబుతున్న మోడీ సర్కార్‌ ఇంతవరకు సరైన పద్దతిని ఎందుకు రూపొందించలేకపోయింది.అంతచేతగాని స్ధితిలో మన యంత్రాంగం, ప్రధాని సలహాదారులు ఉన్నారా ? లేదూ కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ఉన్న విధానం ప్రకారం రూపొందించిన అంకెలను అంగీరించాలి, జనానికి అందించాలా లేదా ? పెద్ద నోట్ల రద్దు వలన సాధించేదేమిటి అంటే తరువాత కాలంలో లావాదేవీలన్నీ నమోదు అవుతున్నాయని చెబుతున్నారు. దానికోసమే అయితే యావత్‌ జనాన్ని అంత ఇబ్బంది పెట్టటం ఎందుకు, ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీయటమెందుకు? నల్లధనాన్ని బయటపెట్టేందుకు అని చెప్పిన పెద్దలు అసలా మాటనే మరచిపోయినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారి గురించి దేశం ఏమి ఆశిస్తుంది? ఆచరణలో ఎన్ని లావాదేవీలు నమోదు అవుతున్నాయి. క్రెడిట్‌ కార్డు ద్వారా చిన్న దుకాణదారులందరూ రెండున్నరశాతం అదనంగా వసూలు చేస్తున్నందున వినియోగదారులు నగదు చెల్లింపుకే మొగ్గు చూపుతున్నారు. రియలెస్టేట్‌ రంగంలో లెక్కల్లో చూపుతున్నది ఎంతో నల్లధనం ఎంత చెల్లిస్తున్నారో బహిరంగ రహస్యం. అనేక దుకాణాల్లో కార్డు చెల్లింపులను అంగీకరించటం లేదన్నదీ తెలిసిందే. బిజెపి ఎన్నడూ కాశ్మీరు రాష్ట్రాన్ని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తానని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఎంత నాటకీయంగా ఆపని చేసిందో చూశాము


అభివృద్ధికి ఆటంకం కార్మిక చట్టాలా – పాలకుల విధానాలా ?
దేశంలో అభివృద్ది కుంటుపడటానికి, ముందుకు పోయేందుకు కార్మిక చట్టాలు ఆటంకంగా ఉన్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. కాపలాగా ఉన్న ఒక కుక్కను తప్పించాలంటే దాన్ని పిచ్చిదని ప్రచారం చేయాలన్నట్లుగా కార్మిక చట్టాలను రద్దు చేసి లేదా నీరు గార్చి యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలి వేసి దోపిడీని స్వేచ్చగా కొనసాగనివ్వాలన్నది అసలు లక్ష్యం. ముందే చెప్పుకున్నట్లు ద్రవ్య పెట్టుబడి, నయా ఉదారవాద విధానం కార్మికుల హక్కులను, బేరమాడే, పోరాడేశక్తిని సహించదు.
ఈ నేపధ్యంలోనే 1991 నుంచి ఒక పధకం ప్రకారం కార్మిక చట్టాల సంస్కరణల గురించి ప్రచార దాడి ప్రారంభించారు. మన కేంద్ర ప్రభుత్వం 45, అన్ని రాష్ట్రాలూ కలిపి మరో 170వరకు కార్మిక చట్టాలను చేశాయి. వీటిలో అత్యధిక భాగం కార్మికశక్తిలో పదిశాతానికి అటూ ఇటూగా ఉండే సంఘటిత కార్మికుల కోసం రూపొందించినవే. అసంఘటిత కార్మికులకు ఉన్న రక్షణ నామమాత్రం. అయినప్పటికీ పదిశాతం కార్మికులకు ఉన్న చట్టాలు అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయని నమ్మబలుకుతున్నారు. అసంఘటిత రంగ కార్మికుల్లో వలస కార్మికులు ఎందరున్నారో, వారికి ఎలాంటి రక్షణ లేదని కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా రుజువైంది. అసలు వారెంత మంది ఉన్నారో, ఎక్కడెక్కడ పని చేస్తున్నారో కేంద్రం లేదా రాష్ట్రాల వద్ద సమాచారమే లేదు, రికార్డులు అంతకంటే లేవు. కరోనా నివారణ కాలేదు కానీ కార్మికశాఖ డొల్లతనం, పాలకుల బండారం బట్టబయలైంది.
కార్మిక చట్టాలను సంస్కరించవద్దని ఎవరూ చెప్పటం లేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటిదంటే తిరస్కరించిన దరఖాస్తులను కూడా పరిష్కరించిన జాబితా అంకెల్లో చూపుతుంది. అలాగే సంస్కరణలు అంటే ఉన్నవాటిని మరింత మెరుగుపరచటం గాకుండా అసలు పూర్తిగా ఎత్తివేయటంగా తయారైంది. పారిశ్రామిక, వాణిజ్య సంస్దలలో తనిఖీ యంత్రాంగం అక్రమాలకు పాల్పడుతోంది బాబూ అని కార్మికులంటే యజమానులకు అనుగుణ్యంగా అసలు తనిఖీలనే ఎత్తివేశారు. యాజమాన్యాలు నిబంధనలను సక్రమంగా అమలు జరపటం లేదంటే చట్టాల అమలు గురించి యజమానులు స్వయంగా అఫిడవిట్లు ఇస్తే చాలన్నట్లుగా చెబుతున్నారు.
కోర్టులు ఏ దేశంలో ఏ పాలనా వ్యవస్ధ ఉంటే దాని విధానాలకు అనుగుణ్యంగానే నడుచుకుంటాయన్నది ప్రపంచ అనుభవం. ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే వారికే కాదు యావత్‌ ఉద్యోగులు, కార్మికులకు సమ్మె హక్కు లేదిప్పుడు అంటే అతిశయోక్తి కాదు. సమ్మెను ఒక ఆయుధంగా వాడుతూ అత్యధిక సందర్భాలలో దుర్వినియోగం చేస్తున్నారని కోర్టులు వ్యాఖ్యానించాయి. సమ్మె ప్రాధమిక హక్కు కాదని వ్యాఖ్యానించాయి.


పరస్పర విరుద్ద వాదనలు !
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో మాదిరి పరస్పర విరుద్ద వాదనలు ఎలా ఉంటాయో చూద్దాం. నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది? పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఉన్న లోపాల కారణంగా తలెత్తుతుంది అని కమ్యూనిస్టులు చెబుతారు. కాదు మేము వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఉత్పాదకత పెరుగుతుంది, మాలాభాలు పెరుగుతున్నాయి, పని చేసే వారు ఎక్కువ మంది అవసరం లేదు, అందువలన నిరుద్యోగం పెరుగుతుంది అని యజమానులు, వారికి మద్దతు ఇచ్చే వారు చెబుతారు. ఇదే వాదన చేసే వారు కార్మిక చట్టాలు, కార్మికులకు హక్కులు కలిగించటం వలన వారు వేతనాల పెంపుదల కోసం, హక్కుల కోసం డిమాండ్లు చేస్తారు. వారి చర్యలు ఉత్పత్తికి ఆటంకంగా మారతాయి, ఉత్పాదక ఖర్చులు పెరుగుతాయి అని చెబుతారు. ఒక వైపు యాంత్రీకరణ ద్వారా ఖర్చులు తగ్గించామని చెప్పేవారు ఇక్కడ వేతనాలు పెరిగితే ఖర్చు పెరుగుతుంది అని వాదిస్తారు.


ఉత్పత్తి పడిపోవటానికి కార్మిక సమ్మెలు కారణం కానేకాదు. 2011లో దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సామర్ధ్య వినియోగం 83శాతం ఉండగా క్రమంగా తగ్గుతూ పెరుగుతూ కరోనాకు ముందు 2019లో 76శాతం ఉండగా ఈ ఏడాదిలో ప్రస్తుతం 68శాతానికి పడిపోయింది.2003 నుంచి 2014వరకు సమ్మెలు 75శాతం తగ్గితే, పని దినాల నష్టం 90శాతం తగ్గింది. 2014లో 119 సమ్మెలు జరిగితే తరువాత రెండు సంవత్సరాలలో 106,93కు తగ్గాయి. 2017 జనవరి-అక్టోబరు మధ్య కాలంలో 82 జరిగాయి. ఇటీవలి కాలంలో వాణిజ్య సులభతర సూచికలో ఎన్నో పాయింట్ల మెరుగుదల ఉంది, నరేంద్రమోడీ ఏ ప్రధానీ చేయనన్ని విదేశీ పర్యటనలు చేసి సంబంధాలు మెరుగుపరచినట్లు, దేశ ప్రతిష్టను పెంచినట్లు చెప్పటాన్ని విన్నాం. అయినా మన ఎగుమతులు పెరగకపోగా పడిపోయాయి. దీనికి కార్మికులు కారణం కాదు. అయినా కార్మిక చట్టాలను మరింతగా సంస్కరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఎగుమతి ఆధారిత, ప్రత్యేక ఆర్ధిక ప్రాంతాలలో చట్టాలు పని చేయవు, ఇప్పుడు వాటిని ఇతర అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారా ? అనుమానం అక్కర లేదు.
అప్రెంటిస్‌ల పేరుతో చట్టబద్దంగానే శ్రమశక్తిని దోచుకొనేందుకు యజమానులకు అవకాశం కల్పించారు. కనీసం 15శాతం అప్రెంటిస్‌లు ఉండాలి. అంటే వారికి ఎలాంటి చట్టాలు, చట్టబద్ద వేతనాలు వర్తించవు. స్టైఫండ్‌ మాత్రమే ఇస్తారు.రిజిస్టర్లు, ఇతర రికార్డుల నిర్వహణలో కూడా మినహాయింపులు ఇచ్చారు గతంలో 19 మంది కార్మికులున్న ఫ్యాక్టరీలు, సంస్ధలకు ఇలాంటి వెసులుబాటు ఇస్తే నరేంద్రమోడీ గారు ఆ సంఖ్యను 40కి పెంచారు.


మన కార్మికుల శ్రమ శక్తిని దోపిడీ చేసేందుకు స్వదేశీ-విదేశీ కంపెనీలకు విచ్చల విడి అధికారాలను ఇచ్చేందుకు పూనుకున్నారు. మన దేశం మీద విదేశాలకు ఆసక్తి ఏమిటి, ఎందుకు ? ఉదాహరణకు జర్మనీలో గంటకు సగటున 35యూరోలు ఉన్నది. అంటే 41.5డాలర్లు. అందువలన మన దేశంలో గంటకు రెండు డాలర్లు ( రు.150 ) ఇచ్చినా ఇబ్బంది లేదన్నది విదేశీ పెట్టుబడిదార్ల లెక్క. రోబోలను వినియోగించినా గంటకు నాలుగు డాలర్లు అవుతుందని అందువలన రోబోల మాదిరి పని చేసే భారతీయ కార్మికులను వినియోగించుకోవటమే లాభం అని లెక్కలు వేసుకుంటున్నారు. అందుకు అవసరమైన నైపుణ్యం కలిగిన వారు కావాలి గనుకనే, పెద్ద సంఖ్యలో గతంలో పాలిటెక్నిక్‌లను ప్రోత్సహిస్తే తరువాత తామర తంపరగా ఇంజనీరింగ్‌ కాలేజీలను ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందే. నైపుణ్య అభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించటం కూడా దీనిలో భాగమే.


జర్మనీలో నాజీలు ప్రపంచ యుద్దంలో జర్మనీ పొందిన పరాజయాన్ని పరాభవంగా చిత్రించి జనాల్లో జాతీయ ఉన్మాద భావనలను రెచ్చగొట్టారు. తిరిగి పూర్వ ప్రాభవాన్ని నెలకొల్పాలనే మనోభావాన్ని చొప్పించారు. మన దేశంలో అదే పద్దతుల్లో పన్నెండు వందల సంవత్సరాలుగా హిందువులు బాధితులు అనే ప్రచారాన్ని సంఘపరివార్‌ సంస్దలు నిరంతరం ప్రచారం చేస్తున్నాయి. పూర్వ వైభవాన్ని పునరుద్దరించాలని దానికి హిందూత్వ అని పేరు పెట్టారు. దాన్ని అంగీకరించని వారు దేశం వదలి పోవాలని హెచ్చరిస్తుంటారు. చరిత్రకు మతం రంగు పులుముతున్నారు. దేశంలో పాలన మత ప్రాతిపదికనే జరిగినట్లయితే మెజారిటీ ముస్లింలు ఉన్న కాశ్మీరులో రాజు హిందువు ఎలా అయ్యాడు ? మెజారిటీ జనం హిందువులుగా ఉన్న హైదరాబాద్‌, మైసూరు, జునాగఢ్‌ వంటి సంస్దానాలలో ముస్లింలు పాలకులుగా వందల సంవత్సరాలు ఎలా ఉన్నారు ?


మన దేశంలో కోట్లాది కుటుంబాలకు కనీస సౌకర్యాలు లేవు గానీ ప్రస్తుతం ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు. వాట్సాప్‌ గురించి వేరే చెప్పనవసరం లేదు. దీన్ని గరిష్టంగా ఉపయోగించుకుంటున్న బిజెపి కుహనా వార్తలను ప్రచారం చేసేందుకు పెద్ద యంత్రాంగాన్నే ఏర్పాటు చేసుకుంది. వాట్సాప్‌లో వచ్చిన వాటిని నమ్మకూడదని ఒక వైపు అనుకుంటూనే పదే పదే ఆ సమాచారం వస్తుండటంతో తమకు తెలియకుండానే నమ్ముతూ బుర్రను ఉపయోగించని విద్యావంతులైన వారెందరో ఉన్నారు. వాట్సాప్‌కు భారత్‌ను అతిపెద్ద మార్కెట్‌గా మార్చిన వినియోగదారులయ్యారు.


బిజెపి, దాని విధానాలను విమర్శించే జర్నలిస్టులను ప్రెస్టిట్యూట్స్‌(పత్రికా వ్యభిచారులు), ముజాహిదిన్స్‌, రెడ్‌ తాలిబాన్స్‌ ఇలా అనేక పదాలతో అవమానిస్తున్నారు. బెదిరిస్తున్నారు, లొంగని గౌరీలంకేష్‌ వంటి వారిని హతమార్చుతున్నారు. మీడియాను నియంత్రించే కార్పొరేట్లు సహజంగానే తమ ప్రయోజనాల కోసం మీడియాను పాకేజ్‌లకు, ప్రలోభాలకు అప్పగించే శారు.
ఫాసిస్టు, నాజీజాన్ని పెంచి పోషించిన శక్తులు తమ లక్ష్యాలను సాధించుకొనేందుకు ప్రయివేటు దళాలను ఏర్పాటు చేసుకున్నాయి, కొన్ని సందర్భాలలో ప్రత్యర్ధులను హతమార్చేందుకు కిరాయిహంతకులను కూడా వినియోగించుకున్నాయి. మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన అనేక సంస్ధలు విశ ్వహిందూపరిషత్‌, భజరంగ్‌దళ్‌ వంటివి అలాంటివే. గౌరీ లంకేష్‌, కులుబుర్గి, నరేంద్ర దబోల్కర్‌ వంటి వారిని కాషాయ భావజాలంతో ఉన్మాదులైన వారు లేదా వారు ఉపయోగించిన కిరాయి హంతకులు హతమార్చారు. గోరక్షకులు, హిందూత్వ పరిరక్షకుల పేరుతో ఎవరికి వారే దళాలుగా ఏర్పడటం ప్రత్యర్ధులు లేదా మైనారిటీ మతాలకు చెందిన వారిని హత్యలు చేయటాన్ని చూశాము.


మన దేశంలో ఫాసిస్టు శక్తులు అధికారంలో ఉన్నాయని చెప్పేవారు కొందరున్నారు. కాదు ఫాసిస్టు తరహా ధోరణులు నానాటికీ ప్రబలుతున్నాయనే వారు మరికొందరు. లేదు లేదు అసలైన ప్రజాస్వామ్యం ఇదే అని నమ్మబలుకుతున్నవారు ఎందరో ఉన్నారు. నువ్వేమిటో తెలుసు కోవాలంటే నీ గురించి ఆలోచించుకో అని సుప్రస్దిద్ద గ్రీకు తత్వవేత్త సోక్రటీస్‌ చెప్పాడు. అందువలన ఎవరేమి చెప్పినా, రాసినా, దృశ్యరూపంలో ప్రదర్శించినా ముందు వాటిని ‘సహనంతో ‘ వ్యక్తపరచనివ్వాలి, వినాలి, చదవాలి, చూడాలి. అలాంటి పరిస్ధితి దేశంలో ఉందా లేదా అని ప్రతి ఒక్కరూ మెదడుకు పదును పెట్టాలి. ఈ నేపధ్యంలో వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలను, దేశంలో వ్యక్తమౌతున్న కొన్ని ధోరణుల తీరు తెన్నులను చూశారు. ప్రపంచ వ్యాపితంగా ద్రవ్య పెట్టుబడి-నయా ఉదారవాదం- మితవాదం జమిలిగా ముందుకు వస్తున్నాయి. మన దేశంలో వాటికి మతోన్మాదం కూడా తోడైంది. కనుక పరిణామాలు, పర్యసానాలు ఎలా ఉంటాయి అన్నది ఎప్పటికప్పుడు జాగరూకులై ఉండాల్సిందే ! ముందే చెప్పుకున్నట్లు తద్దినం మాదిరి ఒక్క స్వాతంత్య్ర దినం రోజునే కాదు, నిరంతరం ప్రతి ఒక్కరూ ఆలోచించినపుడే స్వాతంత్య్రం నిలుస్తుంది. ( తొలి భాగం – 74 ఏండ్ల స్వాతంత్య్రం – 1: మేకిన్‌ ఇండియాకు పాతర -మేక్‌ ఫర్‌ వరల్డ్‌ జాతర ! )

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

74 ఏండ్ల స్వాతంత్య్రం – 1: మేకిన్‌ ఇండియాకు పాతర -మేక్‌ ఫర్‌ వరల్డ్‌ జాతర !

17 Monday Aug 2020

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

74th independence day India, Make for World, Make In India, Narendra Modi


ఎం కోటేశ్వరరావు
ఇతరులపై ఆధారపడకుండా స్వంత శక్తులు, స్వంత వనరులతో అభివృద్ది చెందాలంటూ ఆత్మనిర్భర భారత్‌ అని పిలుపు ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచం కోసం తయారీ (మేక్‌ ఫర్‌ వరల్డ్‌) అని పిలుపునిచ్చారు. ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చిన మేకిన్‌ ఇండియా పిలుపు ఘోరంగా విఫలమైనందున బహుశా ఆ పేరును ఉచ్చరించేందుకు ఇచ్చగించక లేదా పాత నినాదాలకు పాతరేసి కొత్త నినాదాల జాతరను ముందుకు తేవటంలో మోడీ చూపుతున్న అసమాన ప్రతిభకు ఇది నిదర్శనం అని చెప్పవచ్చు. నిజానికి రెండు నినాదాల అర్ధం, లక్ష్యం ఒక్కటే. విదేశాల కోసం భారత్‌లో వస్తు తయారీ. ఈ కొత్త నినాద మోజు ఎంతకాలం ఉంటుందో ఎప్పుడు మరో కొత్త నినాదం మన చెవులకు వినిపిస్తారో ఎదురు చూద్దాం.


ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం నుంచి రెండు సంవత్సరాల పాటు ఉండే సభ్యత్వానికి జరిగిన ఎన్నికలో భారత్‌కు 192కు గాను 184 ఓట్లు రావటం మన పరపతి పెరుగుదలకు నిదర్శనమని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. దీన్లో కాస్త హుందాతనం తగ్గినట్లు అనిపిస్తోంది. ఈ ఎన్నికలలో ఐదు స్దానాలకు ఐదు దేశాలు మాత్రమే రంగంలో ఉన్నాయి కనుక ఏకగ్రీవంగా జరిగినట్లే. అయినా నిబంధనావళి ప్రకారం ఓటింగ్‌ జరిగింది. మన దేశానికి 184 వస్తే మెక్సికోకు 187 వచ్చాయని గమనించాలి. అంటే మనకంటే మెక్సికో ఎక్కువ పలుకుబడి కలిగిన దేశం అనుకోవాలా ? గౌరవనీయమైన ప్రధాని నరేంద్రమోడీ గారికే వదలివేద్దా !
ఆగస్టు పదిహేను అన్నది ఒక పండుగ రోజు కాదు. దీక్షాదినంగా పాటించాల్సిన రోజు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని నిత్యం కాపాడుకోవాల్సి ఉంది. ఆ ఉద్యమంతో సంబంధం లేకపోవటమే కాదు, వ్యతిరేకించిన శక్తుల వారసులు ఇప్పుడు అధికారంలో ఉన్నందున ప్రతి స్వాతంత్య్రం దినానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి రోజూ దాన్ని కాపాడు కొనేందుకు దీక్ష పూనాల్సిందే. దేశంలోని నాలుగు అత్యున్నత రాజ్యాంగ వ్యవస్ధలైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌ పదవుల్లో తొలిసారిగా సంఘపరివార్‌కు చెందిన వారే ఉన్నారు.


తప్పులు చేసేందుకు సైతం అవకాశం ఇవ్వని స్వేచ్చ విలువైనది కాదు అని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పారు. అనేక రాష్ట్రాలలో కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండగా స్వాతంత్య్రానికి 73 సంవత్సరాలు నిండాయి, 74వ దినోత్సవం జరుపుకున్నాము. మహాత్ముడిని హత్య చేసిన భారత తొలి మతోన్మాద ఉగ్రవాది నాథూరామ్‌ గాడ్సేను మరొక దేశంలో అయితే అక్కడికక్కడే కాల్చి చంపి ఉండేవారు. కానీ అతగాడిన కోర్టులో ప్రవేశపెట్టటమే కాదు, గాంధీని తానెందుకు హతమార్చిందీ చెప్పుకొనేందుకు స్వేచ్చ ఇచ్చిన వ్యవస్ధ మనది. ఆ ప్రకటననే ఒక భగవద్గీతగా, ఒక బైబిల్‌, ఒక ఖురాన్‌ మాదిరి అచ్చువేసి మహాత్ముడిని హతమార్చటం ఎలా సమర్ధనీయమో చూడండి అని చెప్పేందుకు ప్రచారంలో పెట్టిన శక్తులకు, వాటిని హస్తభూషణాలుగా చేసుకొనేందుకు కూడా ప్రస్తుతం ఈ దేశంలో స్వేచ్చ ఉంది. మరోవైపు ప్రభుత్వ విధానాలను, పాలకపార్టీల వైఖరులను విమర్శించటమే దేశద్రోహం అన్నట్లుగా చిత్రించి దాడులు చేయటం, తప్పుడు కేసులు పెట్టే ప్రమాదకర పరిస్ధితి కూడా ఉంది.


ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ?
మెజారిటీ పౌరుల నిర్ణయమే ప్రజాస్వామిక తీర్పు. కానీ జరుగుతున్నదేమిటి ? మైనారిటీ తీర్పే మెజారిటీని శాసిస్తున్నది. ఇది గతంలో కాంగ్రెస్‌ హయాంలో, వర్తమానంలో బిజెపి ఏలుబడిలో అయినా అదే జరుగుతున్నది. 2014లో బిజెపి లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల రీత్యా విజయం సాధించింది, 2019లో ఘన విజయం సాధించింది.2014-19కి తేడా ఏమిటి ? ఆరుశాతం ఓట్లు పెంచుకొని 2019లో 37.4శాతం ఓట్లతో బిజెపి పెద్ద పార్టీగా ఉండగా, దాని మిత్రపక్షాలకు వచ్చిన ఓట్లు కలుపుకుంటే 45శాతం. అంటే 55శాతం మంది దానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. మొత్తం 29 రాష్ట్రాలలో 17 చోట్ల మాత్రమే పోలైన ఓట్లలో సగానికి మించి దానికి వచ్చాయి. ఒక్క వామపక్షాలు తప్ప కాంగ్రెస్‌ లేదా ఇప్పుడు బిజెపి లేదా వాటికి మద్దతు ఇస్తున్న పార్టీలు గానీ ఎన్నికల సంస్కరణల గురించి చెబుతాయి తప్ప డబ్బు, ప్రలోభాల ప్రమేయం లేని దామాషా ప్రాతినిధ్య ఎన్నికల విధానం కావాలని అడగటం లేదు.


ఎలాంటి పాలకుల ఏలుబడిలో ఉన్నాము !
” మనం అంటే ప్రజాస్వామ్యాలు యూదుల విషయంలో ఒక వైఖరిని తీసుకొనే స్ధితిలో లేవు.ఈ సామ్రాజ్యాలలో చదరపు కిలోమీటరుకు పది మంది జనం కూడా లేరు. అదే జర్మనీలో చదరపు కిలోమీటరుకు 135 మంది నివాసితులున్న చోట వారికి చోటు కల్పించాలట ” ఇది 1939 జనవరి 30న నాజీ హిట్లర్‌ తనను వ్యతిరేకించే దేశాలను ఉటంకిస్తూ చేసిన ప్రసంగంలోని అంశం.
మన భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు 2002 సెప్టెంబరు తొమ్మిదిన గుజరాత్‌ గౌరవ యాత్ర బేచారాజ్‌లో ప్రవేశించిన సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ యాత్రలో మాట్లాడుతూ ” మనం బేచారాజ్‌కు నిధులు కేటాయించితే వారు మెచ్చరు. మనం నర్మద నీటిని శ్రావణమాసంలో తీసుకువస్తే అప్పుడు కూడా వారు మెచ్చరు. కాబట్టి ఏమి చేయాలి? మనం పునరావాస కేంద్రాలను నడపాలా ? బహిరంగ పిల్లల ఉత్పత్తి కేంద్రాలను తెరవాలా ” అన్నారు. మనం ఐదుగురం-మనకు 25 మంది అంటూ ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ చేసిన ప్రఖ్యాత ప్రసంగంలోని ఆణిముత్యాలివి.
జాతీయ మైనారిటీ కమిషన్‌ ఈ విద్వేష ప్రసంగానికి సంబంధించి వివరాలు కావాలని నాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మోడీ ముఖ్యకార్యదర్శిగా ఉన్న పికె మిశ్రా ఇదే విషయమై ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రసంగానికి సంబంధించి ఏ విధమైన టేపులు లేదా రాతపూర్వకంగా ఏమీ లేనందున తాము జాతీయ మైనారిటీ కమిషన్‌కు పంపేందుకేమీ లేవని చెప్పాడు. ఇదేదో శతాబ్దం క్రితం జరిగింది కాదు. అధికారిక ఆధారాలు నాశనం చేయటం చేయటం లేదా అసలు లేకుండా చేసినందున అసలు ఇలాంటి ప్రసంగాన్ని మోడీ చేయలేదని బుకాయించినా చేసేదేమీ లేదు. అయితే పత్రికలు, టీవీలు వాటిని రికార్డు చేశాయి, ప్రచురించాయి, ప్రసారం చేశాయి గనుక తెలుసుకోగలుగుతున్నాము. అందుకే పని చేసే మీడియా అంటే నరేంద్రమోడీకి గిట్టదు. పాకేజ్‌లతో లేదా ముందే తయారు చేసిన ఫలానా ప్రశ్నలు మాత్రమే అడగాలి అన్న నిర్దేశాలకు అంగీకరించిన భజన మీడియా ప్రతినిధులతోనే ఇప్పటి వరకు మోడీ మాట్లాడారు తప్ప, ఒక్కటంటే ఒక్క పత్రికా గోష్టిని కూడా పెట్టలేదు, ఎందుకంటే ఏటికి ఎదురీదే జర్నలిస్టులు ఇంకా మిగిలే వారు ఉన్నారు గనుక, ప్రశ్నలు అడుగుతారు గనుక అని వేరే చెప్పనవసరం లేదు.
2007జనవరిలో మొహరం పండగ సందర్భంగా జరిగిన మతకలహంలో రాజకుమార్‌ అగ్రహారి అనే యువకుడు మరణించాడు. దాన్ని అవకాశంగా తీసుకొని అప్పుడు గోరఖ్‌పూర్‌ ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాధ్‌ వెళ్లి ” కొంత మంది హిందువుల ఇళ్లు, దుకాణాలను తగులబెడితే ప్రతిగా అదేపని చేయకుండా ఆపాలని అనటంలో నాకు విశ్వాసం లేదు. ” అని మతవిద్వేషాన్ని రెచ్చగొట్టారు. ఇప్పుడు ఆయన దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్య మంత్రి, అవసరమైతే నరేంద్రమోడీని తప్పించి ప్రధాని అభ్యర్ధిగా రంగంలో తెచ్చేవారిలో తొలి వ్యక్తిగా ప్రచారంలో ఉన్నారు. కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న అనేక మంది బిజెపి నేతలు ఇలాంటి ప్రచారాలకు పెట్టింది పేరు.
మేము హిట్లర్‌ను ఎక్కడైనా, ఎప్పుడైనా పొగిడామా అని సంఘపరివార్‌ శక్తులు ఎదురుదాడి చేస్తాయి. ఇలాంటి విద్వేషపూరిత ప్రచారం చేసేవారికి ఉత్తేజమిచ్చేది ప్రపంచంలో హిట్లర్‌ తప్ప చరిత్రలో మరొకరు లేరు. పేరు చెప్పనంత మాత్రాన బహిరంగంగా ఆరాధించనంత మాత్రాన గుండెల్లో గుడి కట్టిందెవరికో తెలియనంత అమాయకంగా మన సమాజం ఉందా ? ఇవి ఫాసిస్టు లేదా నాజీల ధోరణులు కావా ?


దేశంలో జరుగుతున్నదేమిటి ?
ఒక వ్యవస్ధను ధ్వంసం చేయాల్సి వస్తే దాని అవసరం ఏమిటో చెప్పాలి. జనాన్ని ఒప్పించాలి. కొద్ది మంది పెట్టుబడిదారులు అత్యధికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు గనుక ఆ వ్యవస్ధను ధ్వంసం చేయాలని కమ్యూనిస్టులు నిరంతరం దాని గురించి చెబుతూ ఉంటారు, తమ అంతిమ లక్ష్యం దోపిడీ వ్యవస్ధ నిర్మూలనే అని, అది జరగకుండా దోపిడీ అంతం కాదని బహిరంగంగానే చెబుతారు. వారి అవగాహనతో ఏకీభవించటమా లేదా అన్నది వేరే విషయం. ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెబుతూ కొన్ని శక్తులు నిరంతరం దాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించటాన్ని చూస్తున్నాం. దానికి మూలమైన అన్ని రాజ్యాంగ వ్యవస్ధలను దుర్వినియోగం చేయటం, నీరు గార్చటం, దిగజార్చటం, చివరికి వాటి మీద విశ్వాసం లేకుండా చేసి అసలు ఈ రాజ్యాంగాన్నే మార్చివేయాలి, కఠినంగా ఒక వ్యవహరించే ఒక నియంత కావాలి అని జనం చేతనే అనిపించే విధంగా వారి చర్యలుంటున్నాయి. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోంది.


మెజారిటీ వర్గ పాలనా ? మెజారిటీ మత పాలనా ?
ప్రపంచంలో ప్రజాస్వామిక వ్యవస్ధలున్నాయని చెప్పుకొనే ప్రతి దేశంలోను ప్రజాస్వామిక వ్యవస్ధలు వత్తిళ్లకు, దాడులకు గురవుతున్నాయి.నిరంకుశ పోకడలున్న పాలకులు రోజు రోజుకూ పెరుగుతున్నారు.మొదటి ప్రపంచ యుద్దం ముగిసి వందేళ్లు గడచాయి.మొదటి ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచ పరిణామాల్లో తొలి సోషలిస్టు రాజ్యం సోవియట్‌ రష్యా ఏర్పడింది. మెజారిటీ కార్మికవర్గానికి ప్రాతినిధ్యం వహించే కమ్యూనిస్టుపార్టీ అధికారానికి వచ్చింది కనుక దాన్ని తొలి శ్రామికరాజ్యం అన్నారు. దాని స్ఫూర్తితో అనేక దేశాల స్వాతంత్య్ర ఉద్యమాల్లో భాగస్వాములుగా ఉన్న వారు కమ్యూనిస్టు పార్టీలను ఏర్పాటు చేశారు.


ఇదే సమయంలో అనేక దేశాల్లో ఫాసిస్టు, నాజీ శక్తులు కూడా రంగంలోకి వచ్చాయి. మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అలాంటి శక్తే అన్నది అనేక మంది విమర్శ. దాని మైనారిటీ, కమ్యూనిస్టు వ్యతిరేకత ముందు బ్రిటీష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడటం ముఖ్య అంశంగా లేదు. అందుకే స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉంది. బ్రిటీష్‌ వారికి అనుకూలంగా కూడా వ్యవహరించిన చరిత్ర ఉంది. వ్యక్తులుగా తొలి రోజుల్లో ఉద్యమంలో పాల్గొన్న వినాయక దామోదర్‌ సావర్కర్‌ వంటి వారు జైలు జీవితాన్ని భరించలేక నాటి బ్రిటీష్‌ పాలకులకు లొంగిపోయి సేవ చేస్తామని రాసిన లేఖలు తరువాత బహిర్గతం అయ్యాయి. హిందూరాజ్య స్ధాపన నినాదంతో సంఘపరివార్‌ మెజారిటీ రాజ్య స్ధాపన లక్ష్యంగా పని చేస్తోంది.


మొదటి ప్రపంచ యుద్దం తరువాత ఇటలీ, జర్మనీ,జపాన్‌లలో అంతకు ముందున్న ప్రజాస్వామిక వ్యవస్ధలను కూల్చివేసి ముస్సోలినీ, హిట్లర్‌, టోజో వంటి నియంతలు రంగంలోకి వచ్చారు. మొదటి-రెండవ ప్రపంచ యుద్దాల మధ్య రెండు దశాబ్దాల కాలంలో ఒక వైపు సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌తోక పాటు కొన్ని దేశాల్లో ఫాసిస్టు శక్తులు కూడా బలపడ్డాయి. మహా ఆర్ధిక మాంద్యం పెట్టుబడిదారీ వ్యవస్ధలను అతలాకుతలం చేసింది. ఫాసిస్టు శక్తులు అటు సోషలిజానికి ఇటు పెట్టుబడిదారీ వ్యవస్ధలున్న అమెరికా, ఐరోపా దేశాలకూ ముప్పుగా పరిణమించటంతో ఆ రెండుశక్తులు కలసి రెండవ ప్రపంచ యుద్దంలో ఫాసిజాన్ని ఓడించాయి. సోవియట్‌ యూనియన్‌ భారీ మూల్యం చెల్లించి, ఫాసిజం ఓటమిలో నిర్ణయాత్మక పాత్రను పోషించింది. దీని పర్యవసానం అనేక దేశాలు సోషలిస్టు వ్యవస్ధలోకి మరలాయి. ప్రత్యక్ష వలసలు రద్దయి స్వాతంత్య్రం పొందాయి.


తరువాత కాలంలో ద్రవ్య పెట్టుబడి ప్రపంచాన్ని పెద్ద ఎత్తున ఆవరించింది. దానికి మద్దతుగా కొన్ని చోట్ల నియంతృత్వ పోకడలు పెరగటం ప్రారంభమైంది.గతంలో పెట్టుబడిదారీ విధానం మధ్య తలెత్తిన తీవ్ర పోటీ ఫాసిజాన్ని ముందుకు తెచ్చింది. అయితే ఫాసిజం, మిలిటరీ నియంతలకు కాలం చెల్లింది కనుక ద్రవ్య పెట్టుబడిదారీ విధానం నయా ఉదారవాదాన్ని ముందుకు తెచ్చింది. దాన్ని అమలు జరిపేందుకు లాటిన్‌ అమెరికాలో మిలిటరీ నియంతలకు పట్టం కట్టారు. వాటికి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావటంతో ప్రజల ఆగ్రహాన్ని పక్కదారి పట్టించటం కోసం వారిని వదిలించుకొని కొత్త శక్తులను రంగంలోకి తెచ్చారు. ఇదే సమయంలో నయా ఉదార వాదం కంటే ఫాసిస్టు విధానమే పరిష్కారం అని చెప్పే నయా ఫాసిస్టు లేదా ఫాసిస్టు తరహా నయా ఫాసిస్టు శక్తులు అనేక ఐరోపా దేశాల్లో ముందుకు వచ్చాయి, గణనీయమైన విజయాలను కూడా సాధిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే మన దేశంలో బిజెపి విజయం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ యూదు దురహంకారులు, డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి రిపబ్లికన్‌ పార్టీ మితవాదులు, శ్వేతజాతి దురహంకారులు నరేంద్రమోడీకి సహజమిత్రులుగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు.
స్వేచ్చ పరిరక్షకురాలిగా నయా ఉదారవాదం ఫోజు పెడుతుంది. స్వేచ్చామార్కెట్‌కు హామీ ఇస్తుంది. కానీ ఆచరణలో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంది. గత కొద్ది సంవత్సరాలలో ఈ అవగాహనకు విరుద్దంగా అనేక దేశాలు తీసుకుంటున్న రక్షణాత్మక చర్యలే దానికి నిదర్శనం. ఇంతే కాదు ఆయా దేశాల అర్ధిక, సామాజిక, రాజకీయ అంశాలలో పాలకుల జోక్యం, నియంత్రణలను పరిమితం చేసేందుకు నయా ఉదారవాదం పూనుకుంది.గతంలో పెట్టుబడిని పాలకులు నియంత్రిస్తే ఇప్పుడు పెట్టుబడే పాలకులను నియంత్రిస్తోంది. ఇది ఒక్క ఆర్ధిక రంగానికే కాదు, సామాజిక, రాజకీయ రంగాలకూ విస్తరిస్తోంది.


నయా ఉదారవాద విధానాలకు భిన్నంగా పాలకులను నియంత్రించటాన్ని ” ఆర్డోలిబరలిజం ” అంటున్నారు. ఆర్డర్‌ మరియు లిబరలిజం అనే రెండు పదాలను కలిపి అలా పిలుస్తున్నారు. ఉదారవాద విధానాలకు భంగం కలగ కుండా ఆదేశాలు(ఆర్డర్‌) జారీ చేయటం. ఇది నయాఉదారవాదాన్ని ముందుకు తెచ్చే ద్రవ్యపెట్టుబడిదారుల ఆదేశమే. మన దేశంలో ద్రవ్య నియంత్రణ మరియు బడ్జెట్‌ యాజమాన్యం(ఎఫ్‌ఆర్‌బిఎం) పేరుతో 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం తెచ్చిన చట్టం దీనిలో భాగమే. రుణ, ద్రవ్యలోటు, ఆదాయలోటు, ద్రవ్యోల్బణ లక్ష్యాలను నిర్ణయించటం దీనిలో భాగమే. ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ ద్రవ్య రంగంలో మరింతగా ద్రవ్య పెట్టుబడిదారులకు అవకాశాలను కల్పిస్తున్నది.


ద్రవ్య పెట్టుబడి – కార్మికోద్యమం !
నయా ఉదారవాదాన్ని ముందుకు తెచ్చిన ద్రవ్య పెట్టుబడి కార్మికోద్యమాన్ని సహించదు.1991లో సరళీకరణ ప్రారంభమైన తరువాత కార్మిక సంఘాలను దెబ్బతీసేందుకు ప్రారంభమైన చర్యలు ఇప్పుడు మరింత తీవ్రమయ్యాయి. దేశ వ్యవస్ధలను,సంపదలను అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి మరియు దేశీయ పెట్టుబడిదారీ-భూస్వామ్యశక్తులకు మరింతగా అప్పగించేందుకు గత ఆరు సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌ మరింత వేగంగా పని చేస్తోంది. ఈ విధానాల వలన జనం ముఖ్యంగా పని చేయగలిగిన యువత నష్టపోతోంది. ఒక వైపు మేకిన్‌ ఇండియా పేరుతో ఉపాధి అవకాశాలను పెంచి ప్రపంచ ఫ్యాక్టరీగా మన దేశాన్ని మార్చుతామని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రకటించింది. ఆచరణలో ఉపాధి తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అధికారంలో కాంగ్రెస్‌ లేదా బిజెపి, రెండు పార్టీల వెనుకా చేరే లేదా విడిగా ఉండే ప్రాంతీయ పార్టీలకు దేశంలో అమలు జరుపుతున్న విధానాల పట్ల మొత్తంగా ఎలాంటి పేచీ లేదు. ఈ పార్టీలను ఆడిస్తున్నది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి-దేశీయ పెట్టుబడిదారులన్నది వాస్తవం. ఈ పార్టీలు తమ ప్రయోజనాలకు దెబ్బతగలనంత వరకు అధికారం కోసం కొట్టుకోవటానికి, వ్యవస్ధలను దిగజార్చటానికి, డబ్బు, ప్రలోభాలతో ఎన్నికలను తొత్తడం చేయటం వంటి అక్రమాలను అంగీకరిస్తారు తప్ప విధానాలను మార్చేందుకు అనుమతించరు. గతంలో కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చిన కార్పొరేట్‌ సంస్ధలు ఇప్పుడు అదేపని బిజెపికి చేస్తున్నాయి. రేపు ఆ పార్టీ జనం నుంచి దూరం అయిందనుకుంటే తిరిగి కాంగ్రెస్‌కు లేదా మరొకశక్తికి మద్దతు ఇచ్చి రంగంలోకి తెచ్చేందుకు పూనుకుంటాయి.


నియంతలు, ఫాసిస్టులు -ఎన్నికలు !
నియంతలు, ఫాసిస్టుల లక్షణం ఎన్నికలను ప్రహసనంగా మార్చటం లేదా అసలు నిర్వహించకపోవటం, తమ వ్యతిరేకుల అణచివేతకు ప్రయివేటు సైన్యాలను ఏర్పాటు చేయటం వంటివి ఉన్నాయి. తాము ఓడిపోతాము అనుకుంటే ఎన్నికల రద్దు లేదా మరొక పద్దతిలో ప్రజాతీర్పును వమ్ము చేయటాన్ని చూశాము. మన దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అత్యవసర పరిస్ధితిని ప్రకటించి 1976లో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేసింది, పార్లమెంట్‌, అసెంబ్లీ వ్యవధిని పొడిగించింది. ఇది ఫాసిస్టు చర్యలను పోలి ఉంది. అయితే అత్యవసర పరిస్ధితిని ఎత్తివేసి తిరిగి ఎన్నికలను జరపకతప్పలేదు. అదే పక్కా ఫాసిస్టులు, నియంతలు అలాంటి అవకాశం ఇవ్వరన్నది చరిత్ర.


బిజెపి విషయానికి వస్తే దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌. ఐరోపా దేశాల్లో నియంతలు ఏర్పాటు చేసిన ప్రయివేటు ఆర్మీకి అనుకరణగా, తిరోగామి భావాలతో ఏర్పాటు అయింది. అయితే 2004 బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ పాలకులు తాము విజయం సాధిస్తామనే ధీమాతో ఎన్నికలను నిర్వహించి ఓటమి పాలయ్యారు. 2019లో బిజెపి ఓడిపోనుంది లేదా తగినంత మెజారిటీ రాదనే వాతావరణం ఉన్నప్పటికీ ఎన్నికలను వాయిదా లేదు. అయితే ఎన్నికల్లో విజయం సాధించటానికి జనాన్ని మభ్యపరిచేందుకు చేయాల్సిందంతా చేసింది. అనేక రాష్ట్రాలలో పాగా వేసేందుకు అన్ని రకాల అవినీతి, అక్రమ పద్దతులను అనుసరిస్తోంది.మెజారిటీ రాని చోట ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చివేసేందుకు నిరంతరం ప్రయత్నించటాన్ని చూస్తున్నాము.


చరిత్ర వక్రీకరణ – కొత్త పుంతలు !
చరిత్ర నిర్మాతలు జనం, అయితే చరిత్రకు భాష్యం చెప్పేది పాలకవర్గం. అది ఎల్లవేళలా తమకు అనుకూలంగానే ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం పరపీడన పరాయణత్వం అని మహాకవి శ్రీశ్రీ పురోగామి భాష్యం చెబితే మతాల ఆధిపత్యంగా మనువాదులు చిత్రించటాన్ని చూస్తున్నాము. మార్పును కోరుతూ 2014లో తమ నరేంద్రమోడీని చూసి జనం ఓటేశారని, ఆ మార్పును కొనసాగించాలని కోరుతూ 2019లో మరిన్ని సీట్లు కట్టబెట్టారని ఆయన మద్దతుదారులు చెబుతారు. మార్పు అంటే ఏమిటి అన్నది బ్రహ్మపదార్ధం. కోరుకున్న వారికి, పరిశీలిస్తున్నవారిక ఒక పట్టాన అర్ధం కావటం లేదు.
దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వచ్చిందని అందరికీ తెలుసు. దానికి ఉన్న పరిమితులను గుర్తిస్తూనే కమ్యూనిస్టులు బూర్జువా స్వాతంత్య్రంగా పరిగణిస్తున్నారు. అయితే అది నిజమైన స్వాతంత్య్రం కాదని తామే అసలు సిసలు కమ్యూనిస్టులం అని చెప్పుకొనే నక్సలైట్స్‌ చెబుతారు. చిత్రం ఏమిటంటే బిజెపి దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన అనేక ఇతర సంస్ధలు కూడా ఇదే మాదిరే అది నిజమైనది కాదంటూనే తమ నరేంద్రమోడీ పాలనతోనే అసలైన స్వాతంత్య్రం వచ్చిందని కొత్త భాష్యం చెబుతారు. తాజాగా వందల సంవత్సరాల తరువాత రాముడు విముక్తి పొందాడని వర్ణిస్తూ , ఆలయ నిర్మాణానికి మోడీ భూమి పూజను దానికి జతచేశారు.గతంలో జరిగిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దుతున్నారన్న ప్రచారం తెలిసిందే. చరిత్రను తిరస్కరించటం, వక్రీకరించటం అంటే ఇదే. విమర్శ, భిన్నాభిప్రాయం కలిగి ఉండటం ప్రజాస్వామ్య లక్షణం. కానీ వాటిని దేశద్రోహం, దేశ వ్యతిరేకతగా అంతర్గత శత్రువులుగా చిత్రించుతున్నారు. 1991తరువాత కమ్యూనిస్టు బాధితుల పేరుతో ప్రచారంచేస్తున్న మితవాద శక్తులు, ఫాసిస్టులు, నాజీల లక్షణాలివి.


బిజెపి చెబుతున్న నూతన భారత్‌ అనేది కొత్తది కాదు. 1925లో ఏర్పడిన నాటి నుంచీ ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతున్నదే. ఇప్పుడు ఆ గళం పెరిగింది కనుక నేటి తరాలకు అది కొత్తగా, వినసొంపుగా ఉండవచ్చు. పార్లమెంట్‌ను ఒక ప్రహసనంగా మార్చారు. కాశ్మీర్‌కు వర్తించే ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ రద్దు ఉదయం మంత్రివర్గ సమావేశంతో ప్రారంభమైన సాయంత్రానికి పార్లమెంట్‌ ఆమోదంతో సంపూర్ణం గావించారంటే బిజెపి తలుచుకుంటే మొత్తం రాజ్యాంగాన్ని కూడా ఇలాగే మార్చివేయగలదు, దానికి వంతపాడే ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని తేలిపోయింది. ఇలాంటి ఆక్మసిక, ఆగంతుక చర్యలు నియంతల ఏలుబడిలో తప్ప ప్రజాస్వామిక దేశాల్లో ఇంతవరకు ఎక్కడా జరగలేదు.


భిన్నమైన పార్టీ అంటే ఏమిటి ? ఆచరణ ఎలా ఉంది ?
దేశ చరిత్రలో విశ్వాసాల ప్రాతిపదికన వివాదాస్పద తీర్పులు ఇవ్వటం, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఒకరు పాలకపార్టీ సిఫార్సుతో రాజ్యసభ సభ్యుడు కావటం న్యాయవ్యవస్ధ మీద జనానికి విశ్వాసం సడలే పరిణామాలు. ఎన్నికల కమిషన్‌లో జోక్యం, సిబిఐ, ఇడి, విజిలెన్స్‌ విభాగాలను ప్రత్యర్ధుల మీద ప్రయోగించటం వంటి చర్యలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఈ దుర్వినియోగం గతంలో కాంగ్రెస్‌ హయాంలోనే ప్రారంభమైంది. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకున్న బిజెపి ఆచరణలో కాంగ్రెస్‌ కంటే ఎక్కువగా వాటిని వినియోగిస్తున్నది. తమ పార్టీలో అంతా పరి శుద్దులు, పులుకడిగిన ముత్యాలే ఉన్నట్లు, ప్రత్యర్ధి పార్టీలన్నీ అవినీతి పరులతో నిండిపోయినట్లు చిత్రిస్తున్నారు. తాము ఓడిపోయిన చోట ఇతర పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలను కూల్చివేసేందుకు నిరంతర ప్రయత్నాలు, ప్రభుత్వ దర్యాప్తు సంస్ధలతో దాడులు చేయించటం అలాంటి అవకాశం లేనపుడు డబ్బు, ఇతర ప్రలోభాలతో లోబరుచుకొని తిమ్మిని బమ్మిని చేయటం చూస్తున్నదే.
నోరు తెరిస్తే ఆధారం లేని హేతు బద్దతకు, శాస్త్రీయ పరీక్షకు నిలవని ఆశాస్త్రీయ అంశాలను ప్రచారం చేయటం చూస్తున్నాము. పురాతన కాలంలోనే ఇంథనంతో పని లేని విమానాలుండేవని, ప్లాస్టిక్‌ సర్జరీ చేసి వినాయకుడికి ఏనుగు తల అంటించారని, కృత్రిమ పద్దతులలో కౌరవులకు జన్మనిచ్చారని, తాజాగా అప్పడాలు తింటే కరోనా వైరస్‌ తగ్గుతుందని చెప్పేవరకు చేయని ఆశాస్త్రీయ ప్రచారం లేదు. ఇది యువతలో ప్రశ్నించే లేదా ఉత్సుకతను చూపే తత్వాన్ని దెబ్బతీస్తున్నది. ఈ మేరకు విద్యారంగాన్ని కూడా తమ అజెండాకు అనుగుణ్యంగా రూపొందించేందుకు పూనుకున్నారు. (కానసాగింపు – 74 ఏండ్ల స్వాతంత్య్రం-2 : ద్రవ్య పెట్టుబడి-నయా ఉదారవాదం- హిందూత్వ ! )

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

గోమూత్రం తాగుతూ, పేడ పూసుకుంటూ మనం- ఆధునిక పరిశోధనల చుట్టూ చైనా జనం !

12 Wednesday Aug 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment


ఎం కోటేశ్వరరావు
తన ప్రత్యేక లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్దను నిర్మిస్తున్నామని ప్రకటించిన చైనా తాజాగా మరో ముందడుగు వేసింది.శాస్త్ర పరిశోధనా పత్రాల సమర్పరణలో తొలిసారిగా అమెరికాను అధిగమించి మొదటి స్ధానంలో ఉన్నట్లు గతవారంలో వెల్లడైన సమాచారం తెలిపింది. సైంటిఫిక్‌ జర్నల్స్‌లో ఆయా దేశాలకు చెందిన వారు సమర్పించిన పత్రాల సమీక్షలో చైనా 19.9శాతంతో ప్రధమ స్ధానంలో ఉండగా అమెరికా 18.3శాతంతో ద్వితీయ స్ధానంలో ఉంది.
ఏ దేశంలో అయినా శాస్త్ర పరిశోధనాఅభివృద్ధికి ఇచ్చే ప్రోత్సాహం, అందుకు గాను ప్రభుత్వాలు చేసే ఖర్చు ఆ దేశ వాణిజ్య, మిలిటరీతో సహా అన్ని రకాల అభివృద్ధికి సోపానాలుగా మారతాయన్నది తెలిసిందే. ఇటీవలి కాలంలో చైనా సాధిస్తున్న విజయాలతో బెంబేలెత్తిన అమెరికా పాలకవర్గం మరో ప్రచ్చన్న యుద్ధానికి తెరలేపింది. దానిలో భాగంగానే రెండు సంవత్సరాల క్రితం ప్రత్యక్ష వాణిజ్య పోరును ప్రారంభించింది. ఇటీవలి కాలంలో దక్షిణ చైనా సముద్రంలోకి తన విమానవాహక యుద్ద నౌకలు, ఇతర యుద్ద నౌకలను తరలించి చైనాను రెచ్చగొట్టేందుకు, ఆ ప్రాంత దేశాలన్నింటినీ కూడగట్టేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. నిజానికి అమెరికా ఈ చర్యలను ఇప్పటికిప్పుడు ప్రారంభించలేదు. ఎప్పుడో పునాదులు వేసింది, ఇప్పుడు ప్రపంచానికి బాగా కనిపిస్తున్నాయి. ఒక వైపు రాజకీయంగా, మిలిటరీ రీత్యా తన చర్యలను తాను తీసుకుంటూనే అత్యంత కీలకమైన శాస్త్ర పరిశోధనా రంగాన్ని నిరంతరాయంగా అభివృద్ధి చేసేందుకు పూనుకోవటమే చైనా విజయ కారణంగా చెప్పవచ్చు.
2016-18 సంవత్సరాల మధ్య చైనా సగటున ఏడాదికి 3,05,927, అమెరికా 2,81,487 శాస్త్ర పత్రాలను ప్రచురించగా 67,041 పత్రాలతో (4.4శాతం) జర్మనీ మూడవ స్ధానంలో ఉంది. అమెరికాలోని క్లారివేట్‌ అనలిటిక్స్‌ సంస్ధ అందచేసిన సమాచారం ప్రాతిపదికన జపాన్‌ జాతీయ శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞాన విధాన సంస్ద పైన పేర్కొన్న విశ్లేషణ చేసింది. పరిశోధనా, శాస్త్ర పత్రాల సంఖ్య స్ధిరంగా ఉండదు, మూడు సంవత్సరాల సగటును తీసుకున్నారు. అయితే జపాన్‌ విశ్లేషణకు ముందే అమెరికా జాతీయ సైన్స్‌ ఫౌండేషన్‌ తమ దేశాన్ని చైనా అధిగమిస్తోందని అంచనా వేసింది. అయితే ఈ రంగంలో పోటీ కారణంగా ఒక దశలో ముందున్న దేశం మరొక దశలో వెనుకబడవచ్చు. మొత్తంగా పురోగమించే ధోరణి కొనసాగుతోందా లేదా అన్నదే ముఖ్యం. చైనాలో అది కనిపిస్తోంది.
జనాభాలో ప్రధమ స్ధానంలో ఉన్న చైనా తమ పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రారంభించిన మహత్తర సోషలిస్టు యజ్ఞంలో ఏ రంగాన్ని వదలకుండా తనదైన శైలిలో స్ధిరంగా ముందుకు పోతుండటమే ఈ పురోగతికి కారణం అని చెప్పవచ్చు. నల్లమందు భాయీలని ప్రపంచంలో ఒకనాడు అవమానాలు పొందిన చైనీయులు ఇప్పుడు నల్లమందు కాదు నవతరం భాయీలని రుజువు చేసుకుంటున్నారు. 1996-98 సంవత్సరాలతో పోలిస్తే శాస్త్రీయ పత్రాల సమర్పణ 18రెట్లు పెరగ్గా 2006-08 సంవత్సరాలతో పోల్చుకుంటే 3.6 రెట్లు పెరిగింది. పత్రాలు సమర్పించటం ఒక్కటే ప్రమాణంకాదు, వాటి నాణ్యత కూడా ముఖ్యమే. 2017లో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిన పదిశాతం పత్రాలలో అమెరికన్లు ప్రచురించినవి 24.7శాతం ఉండగా చైనీయులవి 22శాతం ఉన్నాయి. అదే తొలి ఒకశాతం పత్రాలలో కూడా ఈ దేశాల వాటా 29.3 మరియు 21.9శాతం చొప్పున ఉండటం విశేషమే కాదు, రెండు దేశాల మేథావుల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉందో తెలియచేస్తున్నది.
చైనా పత్రాలను విశ్లేషించినపుడు భౌతిక శాస్త్రాలైన రసాయన, ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ మరియు గణితాల గురించి ఎక్కువగా ఉంటే అమెరికా నుంచి క్లినికల్‌ మెడిసిన్‌ మరియు మౌలిక జీవ శాస్త్రాలపై కేంద్రీకరణ కనిపిస్తోంది. 2018 వివరాలను పరిశీలించినపుడు అమెరికాలో పరిశోధన-అభివృద్ధికి 581 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ఈ మొత్తం అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఐదుశాతం ఎక్కువ. అదే చైనాలో 554 బిలియన్‌ డాలర్లు ఉండగా అంతకు ముందు కంటే పదిశాతం ఎక్కువగా ఉంది.2000 సంవత్సరం నుంచి 2018 మధ్య విశ్వవిద్యాలయాల మీద చైనాలో చేసిన ఖర్చు 10.2 రెట్లు పెరగ్గా అదే అమెరికాలో ఇదే కాలంలో కేవలం 1.8రెట్లు మాత్రమే పెరిగింది.
పరిశోధనాఅభివృద్ధి రంగంలో పెడుతున్న భారీ ఖర్చు కారణంగా 2000 సంవత్సరం నుంచి మొత్తం పెరుగుదలకు చైనా 32శాతం, అమెరికా 20, ఐరోపా యూనియన్‌ 17శాతం వాటాను సమకూర్చాయి. ప్రస్తుతం చైనా ప్రపంచంలో అతిశక్తివంతమైన సూపర్‌ కంప్యూటర్‌, అతి పెద్ద రేడియో టెలిస్కోప్‌ తయారీలో ఉంది. జీన్స్‌ పరిశోధనకు పెద్ద పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. చైనాలో పరిశోధనకు చేస్తున్న భారీ ఖర్చు, అనేక నూతన ఆవిష్కరణలకు దారి తీస్తున్నప్పటికీ నోబెల్‌ బహుమతులు మాత్రం అమెరికా, ఇతర దేశాల వారికే ఇప్పటివరకు దక్కాయి. 2018లో ప్రపంచ వ్యాపితంగా పేటెంట్లకు దరఖాస్తు చేసిన వారిలో చైనీయులు 49శాతం ఉన్నారు.
వర్తమాన చైనా సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్‌ శాస్త్ర, సాంకేతిక రంగాలలో దేశం ముందుకు పోవటానికి ప్రాధాన్యత ఇచ్చి జాతీయ లక్ష్యాల బాటను నిర్దేశించాడు. ఆ మేరకు 1993లో ఒక చట్టాన్ని కూడా రూపొందించారు. పరిశోధన-అభివృద్ధి కేటాయింపు ఒక శాతం కంటే తక్కువగా ఉండటాన్ని గమనించి చైనా ప్రభుత్వం 2001-05 మధ్య 1.5శాతం ఖర్చు చేయాలని నిర్దేశించింది.2020లో ఆ మొత్తం రెండున్నర శాతానికి పెరిగింది.
శాస్త్ర పరిశోధనలో జపాన్‌ వెనుకబడింది, 64,874 పత్రాలతో నాలుగో స్ధానంలో ఉంది. అయితే పత్రాల నాణ్యత విషయంలో తొమ్మిదో స్ధానం నుంచి నాలుగో స్ధానానికి పడిపోయింది.ప్రకటించిన లక్ష్యాల మేరకు పెట్టుబడుల పెట్టటంలో వైఫల్యమే దీనికి కారణం, పర్యవసానంగా పరిశోధకుల సంఖ్య కూడా పడిపోయింది.
చైనా మొత్తంగా పరిశోధనా పత్రాల సమర్పణలో ముందున్న స్ధితికి నిదర్శనంగా ఉన్నత స్ధాయి నాణ్యత గల రసాయన పరిశోధనా పత్రాల సమర్పణలో నేచర్‌ ఇండెక్స్‌లో కూడా తొలిసారిగా ఒకటవ స్ధానంలో నిలిచింది. అగ్రశ్రేణి పది దేశాల్లో అమెరికాను రెండవ స్ధానానికి నెట్టింది. మన దేశం తొలి పదింటిలో స్ధానం పొందినప్పటికీ సుదూరంగా ఉంది. 2018లో చైనా 6,183.75 పాయింట్లతో ముందుండగా వరుసగా అమెరికా 5,371.32, జర్మనీ 1,673.35, జపాన్‌ 1,275.58, బ్రిటన్‌ 1,023.58,ఫ్రాన్స్‌ 671.93, దక్షిణ కొరియా 615.12, భారత్‌ 501.38, కెనడా 464.62, స్పెయిన్‌ 460.21 చొప్పున సాధించాయి. ఎనభై రెండు పత్రికలలో ప్రచురితమైన అంశాల ఆధారంగా ఈ సూచికను రూపొందించారు. వరుసగా మూడు సంవత్సరాలు మొదటి స్ధానంలో ఉన్న అమెరికా తొలిసారిగా రెండవ స్ధానానికి పడిపోయింది. 2017చైనా అభివృద్ధి 17.9శాతం ఉంటే అమెరికా 6.2శాతం దిగజారింది. జపాన్‌ 12.6శాతం, బ్రిటన్‌ 10.8శాతం చొప్పున తగ్గుదల నమోదు చేశాయి.
క్వాంటమ్‌ ఫిజిక్స్‌లో చైనా ఇతర దేశాలకంటే ఎంతో ముందుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెఫెయి విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు 50కిలోమీటర్ల దూరంలోని ఆప్టికల్‌ ఫైబర్‌ సముదాయాలతో క్వాంటమ్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేశారు. అంటే ఒక సముదాయంలో ఏదైనా మార్పు జరిగితే మిగతా వాటిని అది ప్రభావితం చేస్తుంది. ఇంత దూరంలోని వాటిని అనుసంధానించటం ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఈ ప్రయోగం జయప్రదమైతే ఇంటర్నెట్‌ రంగంలో మరో విప్లవానికి దారి తీయనుంది. క్వాంటమ్‌ కమ్యూనికేషన్స్‌, కృత్రిమ మేథ, బయోటెక్నాలజీ, జనోమ్‌ ఇంజనీరింగ్‌లో చైనా ఎంతో పురోగతి సాధించింది. గతంలో చైనా దిక్సూచి, కాగితం, ముద్రణ, తుపాకి మందు విషయాల్లో ప్రపంచంలో ముందున్న విషయం తెలిసిందే.
సాంస్కృతిక విప్లవం పేరుతో 1960దశకంలో అమలు చేసిన కొన్ని దుందుడుకు చర్యల కారణంగా అనేక విశ్వవిద్యాలయాలను మూసివేశారు. పరిశోధన కుంటుపడింది. మావో మరణం తరువాత అధికారానికి వచ్చిన డెంగ్‌సియావో పింగ్‌ 1978లో ప్రారంభించిన సంస్కరణల తరువాత తిరిగి పరిశోధన ఊపందుకుంది. తొలి రోజుల్లో ఇతర దేశాలను అనుసరించిన చైనా ఇప్పుడు కొన్ని రంగాలలో ఇతరులు తనను అనుసరించే స్ధితికి చేరుకుంది. ప్రపంచంలోని 137 పరిశోధనా రంగాలలో చైనా 33 చోట్ల ముందుంది.
చైనా తరువాత 1991లో మన దేశం కూడా నూతన ఆర్ధిక సంస్కరణల పేరుతో కొన్ని చర్యలను తీసుకుంది. అవి ఎలాంటి ఫలితాలను ఇచ్చాయో మనం చూస్తూనే ఉన్నాము. గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పరిశోధన గురించి కబుర్లు చెప్పటం తప్ప తీసుకుంటున్న చర్యలన్నీ తిరోగమనంలోనే ఉన్నాయి. ప్రోత్సాహం లేకపోగా నిరుత్సాహం కలిగిస్తున్నాయి. యువతలో శాస్త్రీయ ఆలోచనలను రేకెత్తించాల్సిన పాలకులు, వారికి మార్గదర్శకులుగా ఉన్నవారు వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అనే కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. మన సంస్కృత గ్రంధాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మొత్తం నిక్షిప్తమై ఉందని చెబుతారు. వాటిని చూసే అమెరికా నాసా, ఇతర సంస్దలు పరిశోధనల్లో ముందున్నాయని, చివరికి కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ను కూడా రాస్తున్నాయనే పోసుకోలు కబుర్లతో వాట్సాప్‌ను నింపివేస్తున్నారు. శాస్త్రీయ ఆలోచనలు, భావాలను ముందుకు తెచ్చేవారి మీద సామాజిక మాధ్యమంలో దాడులు చేస్తున్నారు. విద్యార్దుల్లో సృజనాత్మక శక్తులను మొద్డుబారేట్లు చేస్తున్నారు.
నాలుగు దశాబ్దాల క్రితం చైనా ప్రారంభించిన సంస్కరణలు ఇప్పటి వరకు సాధించిన విజయాల గురించి నమ్మని వారు, వారు నిజం చెప్పటం లేదని భావించే వారు ఇప్పటికీ ఉండవచ్చు, ఇక ముందు కూడా ఉంటారు. నిత్య అనుమానితులతో ఏ సమాజం ముందుకు పోదు, వారిని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు. మాతాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అంటే కుదరదు. సంస్కృత గ్రందాల్లో అన్నీ ఉన్నాయని చెప్పే పండితులు వాటిని వెలికి తీసి దేశానికి ఎందుకు మేలు చేయరు ? గోమూత్రం తాగే వారిని తాగనివ్వండి-దేశానికి నష్టం లేదు. ఆవు పేడ పూసుకొనే వారిని పూసుకోనివ్వండి జనానికి నష్టం లేదు. మూత్రంలో బంగారం దాగుందని, పేడకు ఆరోగ్యం అంటుకొని ఉందని చెప్పి రుజువుకాని అంశాలను జనం మెదళ్లకు ఎక్కించవద్దు. శాస్త్రీయ ఆలోచనలను అణగదొక్కవద్దు. మేలు చేయకపోయినా కీడు చేయకండి ! గతంలో జరిగిందాన్ని పునరావృతం కానివ్వకండి !! దేశాన్ని, సమాజాన్ని మరికొన్ని శతాబ్దాలు వెనక్కు నెట్టకండి !!!

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: