• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: November 2019

ఉరుగ్వే ఎన్నికల ఫలితంపై తీవ్ర ఉత్కంఠ !

28 Thursday Nov 2019

Posted by raomk in Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Latin America, Uncategorized

≈ Leave a comment

Tags

Daniel Martínez, Luis Lacalle Pou, the Uruguay runoff election results, Uruguay runoff election results

Image result for great eagerness about the Uruguay run-off election results

డేనియల్‌ మార్టినెజ్‌                                    లూయీస్‌ లాసలే

ఎం కోటేశ్వరరావు
లాటిన్‌ అమెరికాల దేశమైన ఉరుగ్వే అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠనెల కొన్నది. అక్టోబరు27నజరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణమెజారిటీ ఓట్లు రాకపోవటంతో ఈనెల 24న అత్యధిక ఓట్లు తెచ్చుకున్న రెండు పార్టీల మధ్య అంతిమ పోటీ జరిగింది. ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి ప్రస్తుతం అధికారంలో ఉన్న వామపక్ష, ప్రజాతంత్ర కూటమి బ్రాడ్‌ఫ్రంట్‌ అభ్యర్ధి డేనియల్‌ మార్టినెజ్‌కు 49.38శాతం ఓట్లు రాగా, ప్రతిపక్ష మితవాద నేషనల్‌ పార్టీ అభ్యర్ధి లూయీస్‌ లాసలేకు 51.62శాతం ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య ఓట్ల పరంగా తేడా 28,666 మాత్రమే. ఇవిగాక మరో 34,500 నిర్ణయాత్మక ఓట్లు లెక్కించాల్సి ఉంది. దీంతో తుది ఫలితాన్ని వెల్లడించటానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. ఉరుగ్వే రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఓటరు నిర్ణీత పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయలేని పక్షంలో సరైన కారణాలు చూపి మరొక చోట ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. సాధారణంగా గత ఎన్నికలలో అలాంటి ఓట్ల లెక్కింపుతో పని లేకుండానే స్పష్టమైన మెజారీటీ తెచ్చుకోవటంతో అభ్యర్ధుల అంతిమ ఫలితాలను ప్రకటించారు. ఇప్పుడు పైన చెప్పుకున్నట్లుగా మెజారిటీ కంటే నిర్ణయాత్మక ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాటిని కూడా లెక్కించిన తరువాత గానీ ఫలితం తేలదు. ఇటువంటి పరిస్దితి ఏర్పడటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
అక్టోబరు 27న జరిగిన తొలి దఫా ఓటింగ్‌లో బ్రాడ్‌ ఫ్రంట్‌ అభ్యర్ధి డేనియల్‌ మార్టినెజ్‌కు 40.49, ప్రతిపక్ష సమీప అభ్యర్ధి లూయీస్‌ లాసలేకు 29.70, మరో రెండు మితవాద పార్టీలకు 12.80, 11.46శాతాల చొప్పున ఓట్లు వచ్చాయి. మొత్తం 11 పార్టీలు పోటీ చేశాయి. రాజ్యాంగాన్ని సవరించి నూతన ఎన్నికల విధానాన్ని అమల్లోకి తెచ్చిన తరువాత జరిగిన మూడు ఎన్నికలలో బ్రాడ్‌ ఫ్రంట్‌ తొలి సారి మాత్రమే తొలిదఫాలోనే మెజారిటీ తెచ్చుకొని విజయం సాధించింది. గత రెండు ఎన్నికలలో రెండవ దఫా జరిగిన ఎన్నికలలోనే ఆ పార్టీ అభ్యర్దులు , జోస్‌ ముజికా, డేనియల్‌ మార్టినెజ్‌ విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో డేనియల్‌ మార్టినెజ్‌కు తొలి దఫా ఎన్నికల్లో 49.45శాతం ఓట్లు రాగా తుది ఎన్నికల్లో 56.63శాతం వచ్చాయి. 2009 ఎన్నికల్లో మాజీ గెరిల్లా దళనేత జోస్‌ ముజికా తొలిదశలో 49.36 శాతం, రెండవ సారి 54.63శాతం ఓట్లతో విజయం సాధించారు. బ్రాడ్‌ ఫ్రంట్‌ తొలిసారిగా అధికారానికి వచ్చిన 2004ఎన్నికల్లో అభ్యర్ధిగా ఉన్న తబరే వాజ్‌క్వెజ్‌ తొలిసారే 51.67శాతం ఓట్లతో విజయం సాధించారు.
గత మూడు ఎన్నికల్లో బ్రాడ్‌ ఫ్రంట్‌కు తొలిదఫా ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం 50శాతానికి అటూ ఇటూగా ఉన్నట్లు అంకెలు వెల్లడించాయి. రెండవ దఫా ఎన్నికల్లో మితవాత శక్తులను వ్యతిరేకించే శక్తులు బ్రాడ్‌ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వటంతో గత రెండు సార్లు విజయం సాధించారు. ఈ సారి తొలి దఫా ఎన్నికల్లోల్లోనే బ్రాడ్‌ ఫ్రంట్‌కు గతంతో పోల్చితే తొమ్మిదిశాతం వరకు ఓట్లు తగ్గాయి. ఈ సారి మితవాద శక్తులను ్యవతిరేకించే ఓట్లను పెద్దగా రాబట్టలేకపోయిందని స్పష్టమైంది. ఎన్నికల కమిషన్‌ అధ్యక్షుడు జోస్‌ అరోసియేనా ఒక ప్రకటన చేస్తూ నిర్ణయాత్మక ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత ఈనెల 28 లేదా 29న ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. అయితే వచ్చిన ఓట్లను బట్టి తాను విజయం సాధించినట్లు ప్రతిపక్ష అభ్యర్ధి లూయీస్‌ లాసలే ప్రకటించారు. అధికారిక ప్రకటన వరకు వేచి చూడాలని తన అభిమానులతో చెప్పారు. ‘మనలను భూ స్ధాపితం చేయాలని వారు చూశారు, అయితే మనం గరిక వంటి వారమని వారికి తెలియదు. దేశంలో అసాధారణ పరిస్ధితిని ఎదుర్కొంటున్నాము. అంతిమ ఫలితం వెలువడే వరకు వేచి చూద్దాం ‘ అన్నారు.
అధ్యక్ష ఎన్నికలతో పాటు 30 స్ధానాలున్న సెనెట్‌, 90 స్ధానాలున్న పార్లమెంట్‌కు కూడా పోలింగ్‌ జరిగింది. రద్దయిన సెనెట్‌లో బ్రాడ్‌ ఫ్రంట్‌కు 15 సీట్లు ఉండగా ఇప్పుడు 13కు తగ్గాయి. పార్లమెంట్‌లో 90కి గాను 50 స్ధానాలుండగా ఇప్పుడు 42 సీట్లతో పెద్ద పార్టీగా ముందుంది. గతంలో పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లేని కొలరాడో పార్టీ ఈ సారి 13, కొత్తగా ఏర్పడిన ఓపెన్‌ కాబిల్డో పార్టీ 11 స్ధానాలను తెచ్చుకుంది. ఈ సమీకరణాలను బట్టి మితవాద శక్తులు పార్లమెంట్‌ రెండు సభల్లోనూ మెజారిటీ సాధించినట్లయింది.
రెండవ దఫా ఎన్నికలకు ముందు మితవాద శక్తులన్నీ ఏకం కావటం, సామాజిక మాధ్యమం, సంప్రదాయ మీడియాలో పెద్ద ఎత్తున వామపక్ష, ప్రజాతంత్ర బ్రాడ్‌ ఫ్రంట్‌కు వ్యతిరేకంగా విషప్రచారాన్ని సాగింది. వామపక్ష అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని సైనిక, పోలీసు బలగాలకు బహిరంగంగా విజ్ఞప్తి చేశారంటే ప్రచారం ఏ తీరున సాగిందో అర్ధం చేసుకోవచ్చు. లాటిన్‌ అమెరికాలోని మరో దే శమైన బొలీవియాలో మిలిటరీ, పోలీసు బలగాలు అక్కడి వామపక్ష అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ను రాజీనామా చేయాల్సిందిగా వత్తిడి, తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల ప్రభావంతో పాటు అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో మితవాద శక్తులు పై చేయి సాధిస్తున్న అంశాలు, కుట్రలు కూడా ఈ ఎన్నికల మీద ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది.
గత పదిహేను, ఇరవై సంవత్సరాలలో లాటిన్‌ అమెరికాలో అధికారానికి వచ్చిన వామపక్ష ప్రభుత్వాలు అనేక విజయాలు సాధించాయన్నది నిర్వివాదాంశం. అయినా ఇటీవల కొన్ని దేశాలలో ఎదురు దెబ్బలు కూడా తిన్నాయి. పదిహేను సంవత్సరాల పాటు బ్రాడ్‌ ఫ్రంట్‌ అధికారంలో ఉండి అస్తవ్యస్ధంగా ఉన్న దేశ పరిస్ధితులను చక్కదిద్దటంలో ఎంతో కృషి చేసింది. విద్య, ఆరోగ్య, గృహరంగాలలో, దారిద్య్ర నిర్మూలనలో ఎన్నో విజయాలు సాధించింది. ద్రవ్యోల్బణానికి మించి వేతనాలు, పెన్షన్లను పెంచటంతో పాటు కార్మికులకు అనేక హక్కులను కలిగించింది. క్రైస్తవమతం వైపు నుంచి ఎంతగా వ్యతిరేకత వెలువడినా స్వలింగ వివాహాలను అనుమతించటంతో పాటు స్త్రీ పురుషులు కాని వారికి హక్కులను వర్తింప చేయటం, కొన్ని ప్రత్యేక పరిస్దితులలో అబార్షన్లను అనుమతించటం, వివాహసమానత్వాన్ని గుర్తించటం వంటి పురోగామి చర్యలు అమలు జరిపింది.
లాటిన్‌ అమెరికాలో నియంతలు, నిరంకుశపాలనతో పాటు ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ విధానాల ప్రయోగశాలుగా అక్కడి దేశాలను మార్చారు. ఫలితంగా జనం ముఖ్యంగా కార్మికవర్గం అనేక విధాలుగా దోపిడీకి గురైంది. నయా ఉదారవాద విధానాల అమలు కారణంగా జనంలో తీవ్ర అసంతృప్తి తలెత్తిన పూర్వరంగంలో తలెత్తిన సామాజిక ఉద్యమాలు అనేక చోట్ల వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు అధికారంలోకి రావటానికి దోహదం చేశాయి. ఉన్నంతలో సంక్షేమ పధకాలను అమలు జరిపి ఎంతో స్వాంత్వన చేకూర్చాయి. అందువల్లనే పదిహేను, ఇరవై సంవత్సరాల పాటు అధికారంలో మనగలిగాయి. అయితే నయా ఉదారవాద విధానాల నుంచి సంపూర్ణంగా వెనక్కు మళ్లకుండా, అదే వ్య వస్ద మీద సంక్షేమ చర్యలు అమలు జరపటం సాధ్యం కాదు అనే అంశం ఇప్పుడు ప్రతి చోటా వ్యక్తం అవుతోంది.
ఉరుగ్వేలో 175 సంవత్సరాల పాటు మితవాద కొలరాడో లేదా నేషనల్‌ పార్టీలు, మిలిటరీ అధికారులు అధికారంలో ఉన్నారు. తొలిసారిగా 2004లో బ్రాడ్‌ ఫ్రంట్‌ ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఉరుగ్వేలో 2015వరకు ఆర్ధిక వృద్ధిసాగింది. దారిద్య్రం 39.9 నుంచి 9.7శాతానికి పడిపోయింది. దుర్భరదారిద్య్రం 4.7 నుంచి 0.3శాతానికి తగ్గింది. తరువాత కాలంలో ఇంకా తగ్గింది. లాటిన్‌ అమెరికా మొత్తంగా చూస్తే అత్యంత తక్కువ స్ధాయికి గినీ కోఎఫిసియెంట్‌ సూచిక 0.46 నుంచి 0.38కి పడిపోయింది. అయినప్పటికీ నయా వుదార విధాన పునాదులు అలాగే ఉన్న కారణంగా సంపద కేంద్రీకరణ పెరిగింది. ఆఫ్రో-ఉరుగ్వేయన్లు, యువతలో దారిద్య్ర పెరుగుదల కనిపించింది.శ్వేత జాతీయుల కంటే పదిశాతం ఎక్కువ మంది ఈ సామాజిక తరగతిలో దారిద్య్రంతో ఉన్నారు.లాటిన్‌ అమెరికా దేశాలను ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలుగా మార్చివేసిన పూర్వరంగాన్ని చూస్తేనే అక్కడి సమస్యలను అర్ధం చేసుకోగలం.2017లో మాడ్రిడ్‌ నుంచి వెలువడే ఎల్‌ పాయిస్‌ అనే పత్రిక వివేచన గల ఉరుగ్వే వామపక్ష అద్భుతం పేరుతో అక్కడి బ్రాడ్‌ ఫ్రంట్‌ సర్కార్‌ సాధించిన విజయాలను పేర్కొన్నది.
అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో ఆర్ధిక సంక్షోభాలు కొనసాగుతున్న పూర్వరంగంలో ఎగుమతి ఆధారిత వ్యవస్దలు గల దేశాలన్నీ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఉరుగ్వేలో కొన్ని దశాబ్దాల తరువాత ఎనిమిది సంవత్సరాల క్రితం 6.3శాతానికి నిరుద్యోగం పడిపోయిన తరువాత ఇటీవలి కాలంలో తిరిగి ఎనిమిది శాతానికి పెరిగింది. అనేక సంస్ధలు ఉద్యోగులను తీసుకోవటం గణనీయంగా తగ్గించాయి. సంక్షేమ పధకాలకు పరిమితులు ఏర్పడ్డాయి. ఇటీవలి కాలంలో అనేక తరగతుల్లో అసంతృప్తి పెరిగింది. పదిహేను సంవత్సరాల తరువాత తొలిసారిగా మితవాద నేషనల్‌ ఫ్రంట్‌ వామపక్ష బ్రాడ్‌ ఫ్రంట్‌ విధానాల కారణంగానే నిరుద్యోగం, ప్రతికూల ఆర్ధిక సమస్యలు పెరుగుతున్నాయనే దాడి ప్రారంభించింది. దీనికి మీడియా కూడా తోడైంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తొలిసారిగా అసమానతలు, దారిద్య్రం పెరుగుతున్నట్లు వెల్లడైంది. సామాజిక వ్యవస్ధల నిర్మాణమే దీనికి కారణమని తేలింది. బ్రాడ్‌ ఫ్రంట్‌లో ఉన్న పార్టీలకు చెందిన కొందరు అవినీతికి పాల్పడటం కూడా ఫ్రంట్‌ ప్రభ మసకబారటానికి దోహదం చేసిందని చెప్పవచ్చు. 2017లో రావుల్‌ సెండిక్‌ జూనియర్‌ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి అవినీతి కేసులలో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
లాటిన్‌ అమెరికాలో వామపక్ష ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసిన తరువాత కొందరు మేధావులు చేస్తున్న సూచనలను గమనంలోకి తీసుకోవాల్సి ఉంది. వామపక్షాలు స్వల్పకాలిక కార్యక్రమాలతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడా ఒకే సమయంలో పని చేయాల్సి ఉంది. ఒకసారి అధికారానికి వచ్చిన తరువాత ప్రతి నెలాఖరుకు కార్మికులు, ఇతర పేదలకు ఏమి కావాలో సమకూర్చటం మీదే కేంద్రీకరించి దీర్ఘకాలిక లక్ష్యా లను మరవకూడదన్నదే వాటి సారాంశం.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ సర్కార్‌ : అంకెల గారడీ, ఎదురుదాడులు !

20 Wednesday Nov 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Aravind Subrahmanyam, India Data Crisis, India GDP, jugglery of numbers, narendra modi government, narendra modi offensive attacks, offensive attacks

Image result for narendra modi offensive attacks
(ఆర్థిక దిగజారుడు, సమాచార విశ్వసనీయత సంక్షోభం – 2 ముగింపు భాగం)
ఎం కోటేశ్వరరావు
గత లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏడాది అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రధాని నరేంద్రమోడీ ఉపాధి కల్పన గురించి పార్లమెంట్‌లో మాట్లాడారు. పిఎఫ్‌ పధకంలో ఎంత మంది చేరిందీ, వైద్యులు, చార్టర్డ్‌ ఎకౌంటెంట్ల గురించి అంకెలు చెబుతూ ఏడాదికి కోటి ఉద్యోగాల కల్పన చేయకపోతే అవన్నీ ఎలా సాధ్యమని ఎదురుదాడి చేశారు. తరువాత ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో కూడా అదే కబుర్లు చెప్పారు. ఎన్నికలకు ముందుగానే ఎన్‌ఎస్‌ఎస్‌ఓ వెల్లడైంది. నాలుగున్నర దశాబ్దాల రికార్డును అధిగమించి నిరుద్యోగశాతం 6.1కి చేరిందన్నది దాని సారం. అయితే తాము కల్పించిన ఉద్యోగాలన్నీ లెక్కల్లోకి చేరలేదని, తప్పుడు లెక్కలని పకోడీ బండి పెట్టుకోవటం కూడా ఉపాధి కల్పనకిందికే వస్తుందని కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు వెల్లడైన ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదిక వాస్తవం కాదని బుకాయించిన సర్కార్‌ అనంతరం అదే నివేదికను వాస్తవమైనదిగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో 8.2శాతంగా ఉన్న నిరుద్యోగం అక్టోబరులో 8.5కు చేరింది.
నిరుద్యోగం లేదా ఉద్యోగాల కల్పన గురించి ప్రధాని, బిజెపి నేతలు జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. 2017 సెప్టెంబరు-2018నవంబరు మధ్య తొలిసారిగా కోటీ ఎనభై లక్షల మంది ప్రావిడెంట్‌ ఫండ్‌కు తమ వాటాను జమచేయటం ప్రారంభించారని వారిలో 65లక్షల మంది 28ఏండ్ల లోపు వారేనని, వారందరికీ కొత్తగా ఉద్యోగాలు వచ్చిన కారణంగానే అది జరిగిందని, అదే విధంగా 2014 మార్చి నుంచి 2018 అక్టోబరు వరకు కోటీ ఇరవై లక్షల మంది నూతన పెన్షన్‌ పధకంలో నమోదైనట్లు కూడా మోడీ చెప్పారు.
ఇక్కడ మోడీ మహాశయుడు నాణానికి ఒక వైపును మాత్రమే చూపారు. రెండో వైపు చూద్దాం. ప్రావిడెంట్‌ ఫండ్‌ వెబ్‌సైట్‌లో ఈ లెక్కలన్నీ పెడుతున్నారు. మోడీ గారు కోటీ 79లక్షల నమోదు కాలంలోనే కోటీ 39లక్షల మంది ఈ పధకం నుంచి తప్పుకున్నారు. 33లక్షల మంది గతంలో చేరి తప్పుకొని తిరిగి చేరిన వారు ఉన్నారు. అంటే నిఖరంగా నిలిచిన వారు 73లక్షల మందే. తప్పుకున్నవారందరూ నిరుద్యోగం సైన్యంలో చేరినట్లా లేక ఉద్యోగవిరమణ చేసినట్లా ? ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. నరేంద్రమోడీ సర్కార్‌ కార్మికుల పేరుతో యజమానులకు మేలుచేసే సబ్సిడీ పధకాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరు పిఎం రోజ్‌గార్‌ ప్రోత్సాహ యోజన. దాని ప్రకారం తమ పధకం ప్రారంభం నాటికే ఉన్న సిబ్బంది గాకుండా తరువాత కొత్తగా చేరిన సిబ్బందిని ప్రావిడెంట్‌ పధకంలో చేర్చితే వారి ఖాతాలకు యజమానులు చెల్లించాల్సిన సొమ్మును మూడేండ్ల పాటు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అది కూడా పదిహేను వేల రూపాయల లోపు వేతన ఉన్న వారికి మాత్రమే. అందువలన అనేక యజమానులు దాన్ని వినియోగించుకొని అప్పటికే ఉద్యోగాల్లో వున్నా పిఎఫ్‌ పధకంలో చేర్చని వారిని కొత్తవారిగా చేర్పించి వుండవచ్చు. అందువలన ఒక్కసారిగా ఉద్యోగాలు పెరిగినట్లు చిత్రిస్తున్నారు.
అంకెలతో జనాన్ని ఎలాగైనా ఆడుకోవచ్చు. కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో పిఎం రోజ్‌గార్‌ ప్రోత్సాహయోజన పధకం ప్రారంభమైన 2016 నుంచి 2019 నవంబరు 18 వరకు విస్తరించిన జౌళి రంగ కార్మికులతో సహా లబ్ది పొందిన వారు కోటీ 24 లక్షల 33వేల 819 మంది. లబ్ది పొందిన సంస్ధల సంఖ్య లక్షా 53వేల 574. ఇందుకు గాను ప్రభుత్వం యజమానుల వాటాగా చెల్లించిన సొమ్ము 6,887 కోట్ల రూపాయలు. సగటున ఒక్కొక్క కార్మికుడి ఖాతాలో వేసిన సొమ్ము రూ.5,539. మరి ఈ లెక్కలను మోడీ గారు కాదంటారా తప్పంటారా ?
మోడీ గారు మరో లెక్క చెప్పారు. అదేమంటే 2014 నుంచి కొత్తగా 36లక్షల కొత్త వాణిజ్య ట్రక్కులు,27లక్షల ఆటోలు, కోటీ 50లక్షల ప్రయాణీకుల వాహనాల విక్రయం జరిగిందని, తద్వారా రవాణా రంగంలో కోటీ 25లక్షల ఉద్యోగాలు కొత్తగా వచ్చినట్లు వివరించారు. ఇక్కడ చూడాల్సింది, పాతవాహనాలు ఎన్ని వినియోగం నుంచి తప్పుకున్నాయి. కొత్తవాహనాలకు కొత్త ఉద్యోగులే వచ్చారనుకుందాం, వారిలో ఎవరూ అంతకు ముందు ఎక్కడా ఏ పనీ చేయటం లేదా కొత్త వాహనాల మీద అప్పటికే పని చేస్తున్నవారు గాక కొత్తవారు ఉద్యోగాల్లో చేరినట్లు రుజువులు ఏమిటి?
టూరిజం రంగంలో కొత్త హౌటళ్లకు అనుమతులు 50శాతం పెరిగాయని, దీని వలన మరో కోటీ 50లక్షల ఉద్యోగాలు వచ్చాయని మోడీ చెప్పారు. దీనికి కూడా రవాణా రంగం మాదిరే అధికారుల అంచనా లెక్కలు తప్ప ఆధారాలేమీ లేవు.
తొలిసారిగా ముద్ర రుణపధకం కింద నాలుగు కోట్ల 25లక్షల మంది రుణాలు పొందారని, అయితే ఉపాధి వివరాలు లేవని మోడీ చెప్పారు. అంటే రుణాలు తీసుకున్నవారందరికీ ఉపాధి చూపినట్లే అనుకోవాలనా ? ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారమే 15.59 కోట్ల మందికి ఇచ్చిన రుణాల మొత్తం రెండులక్షల 75వేల కోట్లు, అంటే సగటున ఇచ్చిన మొత్తం రు 17,582, దీనితో వచ్చే ఉపాధి ఎంత అన్నది ప్రశ్న.

Image result for narendra modi offensive attacks
ఇక్కడ మరో ప్రశ్న తలెత్తుతున్నది. ప్రధాని నరేంద్రమోడీకి ఇన్ని వివరాలు తెలిసినపుడు, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ గణాంక సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) లేదా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేల్లో అవెందుకు ప్రతిబింబించటం లేదు. లెక్కలు సరిగా వేయటం లేదంటున్నారు. ఐదున్నర సంవత్సరాల పాలనలో లెక్కల విధానాన్ని కూడా సరి చేసి సరైన లెక్కలు చెప్పటంలో మోడీ సర్కార్‌ విఫలమైనట్లు అంగీకరించటమే కదా ! లేదూ సరైన లెక్కల విధానాన్ని అమల్లోకి తెచ్చేంత వరకు ఆ సంస్ధ రూపొందించిన వాటిని ఎందుకు అంగీకరించటం లేదు ? ప్రతి సారీ వివాదం ఎందుకు రేపుతున్నట్లు ? మోడీ సర్కార్‌ కోసం ఎన్‌ఎస్‌ఓ కొత్త పద్దతినేమీ ప్రవేశపెట్టలేదు కదా, అంతకు ముందున్నదాని కొనసాగింపే కదా ? పోనీ నరేంద్రమోడీ సర్కార్‌ సాధించినట్లు చెప్పుకుంటున్న లెక్కలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నట్లు? అవి సరైనవే అయితే నిరుద్యోగం పెరగటం, వినిమయశక్తి తగ్గటం వంటి వివరాలు తప్పుడు లెక్కలు ఎలా అవుతాయి ?
2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని నరేంద్రమోడీ వాగ్దానం చేశారు. ఆచరణ సంగతి పక్కన పెడదాం. రైతుల ఆదాయం ఎంత అన్నది ప్రభుత్వం ఎప్పుడైనా ప్రకటించిందా ? రైతుల పరిస్ధితి గురించి శ్వేతపత్రం ఏమైనా ప్రకటించిందా అంటే లేదు. ప్రభుత్వ సంస్ధలు చెబుతున్న లెక్కలు తప్పు, వాస్తవాన్ని ప్రతిబింబించటం లేదు అంటున్నారు. స్వచ్చ భారత్‌ లేదా బహిరంగ మలవిసర్జన నిరోధ పధకం కింద మరుగుదొడ్ల గురించి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ వాటిలో ఎన్నింటిని వినియోగిస్తున్నారు అన్న అంశంపై తయారు చేసిన విశ్లేషణ నివేదికను మాత్రం బయట పెట్టకుండా తొక్కి పెట్టారు.
మరుగుదొడ్ల నివేదిక సర్వేను ఎందుకు మూసిపెట్టారు ? ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించేందుకు వెళ్లిన మన ప్రధాని నరేంద్రమోడీ మన దేశంలో ఇప్పుడు ఎక్కడా బహిరంగ మలవిసర్జన లేదని అంతర్జాతీయ సమాజానికి చెప్పేశారు. తమ ప్రభుత్వం సాధించిన ఘనతగా చిత్రించారు. అక్టోబరు రెండవ తేదీన గాంధీ మహాత్ముడి 150 జయంతి సందర్భంగా అహమ్మదాబాద్‌ సబర్మతి నదీ తీరంలో ఇరవై వేల గ్రామపంచాయతీలకు సర్పంచ్‌లకు సర్టిఫికెట్లను కూడా ప్రదానం చేశారు. ఇంత హడావుడి చేసిన తరువాత అధికారిక నివేదికను విడుదల చేస్తే మోడీ గారి గాలి తీసినట్లు అవుతుంది. దేశంలో మరుగుదొడ్లు 75శాతం మందికే అందుబాటులో ఉన్నాయని, వాటిలో 80శాతం మాత్రమే వినియోగంలో ఉన్నట్లు సదరు ముసాయిదా నివేదిక పేర్కొన్నది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 76వ నివేదికకోసం 2018 జూలై నుంచి డిసెంబరు మధ్య సర్వే చేశారు. దానిలో చేర్చిన ప్రశ్నావళి మోడీ సర్కార్‌ను ఇబ్బంది పెట్టింది. తొలిసారిగా మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉందా? ఉంటే దాన్ని వినియోగిస్తున్నారా ? వినియోగించకపోతే కారణాలేమిటి ? అని అడిగారు. ఈ నివేదిక సర్వేలో 75శాతం మందికే మరుగుదొడ్లు ఉన్నట్లు తేలింది. సర్వే ముగిసిన డిసెంబరు తరువాత కేవలం తొమ్మిది నెలల కాలంలో మిగిలిన 25శాతం మరుగుదొడ్లు కట్టటం ఎలా సాధ్యమైంది అనే ప్రశ్న తలెత్తుతుంది కనుక మోడీ సర్కార్‌ దీన్ని తొక్కి పెట్టిందన్నది స్పష్టం. ఇదే నివేదికను తరువాత ఎప్పుడో జనం మరచిపోయిన తరువాత గుట్టుచప్పుడు కాకుండా ఎన్నికల అనంతరం నిరుద్యోగ నివేదిక మాదిరి విడుదల చేస్తారా ?

Image result for narendra modi offensive attacks
ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి రేటు ఏడు వాస్తవం కాదని, నాలుగున్నరశాతానికి మించదని ప్రధాని ఆర్ధిక సలహాదారుగా పని చేసిన అరవింద్‌ సుబ్రమణ్యం , అభివృద్ధి అంకెలకు ఉపాధి కల్పనకు పొసగటం లేదని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ చెప్పిన విషయం తెలిసిందే. అరవింద సుబ్రమణ్యం గణించిన తీరులో లోపాలు ఉన్నాయని కాసేపు అంగీకరిద్దాం. అవెలా తప్పో ఇంతవరకు మోడీ సర్కార్‌ ఎందుకు అసలు గుట్టు విప్పి చెప్పలేదు, అడ్డుకున్నదెవరు ? ప్రతి అంశానికి సమాధానం చెబుతామని రంకెలు వేశారు, ఇంతవరకు అలాంటి దాఖలాలు లేవు. ఈ ఏడాది ఇప్పటి వరకు వెలుబడిన అంకెలు సుబ్రమణ్యం చెప్పిందే సరైనవని నిర్ధారించటం లేదా ? మోడీ స్వయంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు చర్యవలన జిడిపి వృద్ధిరేటు 6.7 నుంచి 8.2శాతానికి పెరుగుతుందని ప్రభుత్వమే అంతకు ముందు వేసిన అంచనాలను సవరించింది. కానీ ఆచరణలో ఆ చర్య వృద్దిని దెబ్బతీసిందని రుజువు చేసింది. అంటే కొందరి బుర్రల్లో తలెత్తిన ఆలోచనల మేరకు చేసిన అంకెల గారడీ తప్ప ప్రాతిపదిక లేదు లేదా తప్పుడు ప్రాతిపదికన అంకెలను సవరించారన్నది స్పష్టం. అభివృద్ది సూచికల తయారీకి తీసుకొనే అంశాలైన కార్ల అమ్మకాలు, విమానాల్లో సరకు రవాణా, కొనుగోలు శక్తి తదితర అంశాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం వృద్ది గురించి అతి అంచనాలు వేసినట్లు రాయిటర్స్‌ వ్యాఖ్యానించింది.
దేశంలో ఆర్ధిక వ్యవస్ధ మందగమనంలో ఉందా మాంద్యంలో ఉందా అనే పండిత చర్చను కాసేపు పక్కన పెడితే కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ ఉత్పత్తి సంస్దలు ఎంత సామర్ధ్యంతో పని చేస్తున్నాయి, అంచనాల మేరకు విద్యుత్‌ ఎందుకు అమ్ముడు పోవటం లేదంటే పరిశ్రమలు, వాణిజ్యం కొత్తగా రాకపోవటమే అన్నది స్పష్టం. అందుకే విద్యుత్‌ కంపెనీల దివాళా. ఈ పూర్వరంగంలో సమాచారం వెలువడుతున్న అనుమానాలు మన అధికారయంత్రాంగం, పాలకుల విశ్వసనీయతనే దెబ్బతీస్తున్నాయని గుర్తించాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ సర్కార్‌ : ఆర్థిక దిగజారుడు, సమాచార విశ్వసనీయత సంక్షోభం – 1

19 Tuesday Nov 2019

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

finance minister nirmala sitharaman, India Data Crisis, India Economic slowdown, Narendra Modi, narendra modi credibility crisis

Image result for narendra modi and nirmala sitharaman
ఎం కోటేశ్వరరావు
ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నాడు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం సుమతీ శతకకర్త బద్దెన భూపాలుడు లేక భద్ర భూపాల. అయితే ఆయన దాన్ని వాడిన సందర్భం తెలియదు గానీ మన రాజకీయనేతలు మాత్రం దాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. కొందరిని కొంత కాలం అలాంటి మాటలతో మభ్యపరచవచ్చుగానీ ఎల్లరనూ ఎల్లకాలం మోసం చేయటం కుదురుతుందా ?
మోడీగారు తనకు ఇబ్బంది కలిగించే అంశాల మీద నోరు విప్పరు. ఆయన మాదిరి నోరు మూసుకొని ఉండటం మంత్రులకు సాధ్యం కాదు. ఎవరూ మాట్లాడకపోతే ప్రభుత్వ దుకాణం మూతపడిందని జనం అనుకుంటారు. ఆటోమొబైల్‌ రంగం మందగమనం లేదా రాయంచనడక సంగతేమిటమ్మా అని అడిగితే కుర్రాళ్ల మైండ్‌ సెట్‌ మారింది, స్వంతకారుకు నెలవారీ వాయిదాలు చెల్లించే బదులు ఓలా, ఉబర్‌ వంటి వాటిని ఉపయోగించటం, త్వరలో వచ్చే కొత్త మోడల్స్‌ కోసం ఎదురు చూస్తూ పాతవాటిని కొనుగోళ్లను వాయిదా వేయటం వంటి కారణాలున్నాయని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సెప్టెంబరులో చెప్పారు. ఆయితే ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగటంతో ఆమె కాస్త తగ్గారు. దేశ ఆర్థిక వ్యవస్ధ మందగించింది తప్ప మాంద్యంలోకి జారలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నవంబరు 18న లోక్‌సభకు సమర్పించిన రాత పూర్వక సమాధానంలో చెప్పారు. అంతకు ముందు నాలుగు రోజుల క్రితం ఆర్ధిక వ్యవస్ధ అధమ స్ధాయిలోకి దిగజారలేదన్నారు. మందగించినా వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 20దేశాల బృందంలో మనదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా ఉందని, 2025 నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి లక్ష్యాన్ని సాధిస్తామని కూడా లోక్‌సభలో చెప్పారు.

Image result for finance minister nirmala sitharaman
మంత్రులు లేదా మరొకరు చట్టసభల వెలుపల మాట్లాడేవాటిలో అతిశయోక్తులు, అవాస్తవాలు, వక్రీకరణలు ఉండటాన్ని ప్రాణ, విత్త,మాన భంగములతో పాటు రాజకీయములందు కూడా అబద్దములాడవచ్చని సరిపెట్టుకుందాం. నిర్మలా సీతారామన్‌ సమాధానం తరువాత అనుబంధ ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతను ఆమె జూనియర్‌ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్వీకరించారు. నిజమే చెబుతాను అబద్దాలు చెప్పను అని ప్రమాణం చేసిన ఆ మంత్రిగారు ఆధారాలు లేని అంశాలను చెప్పారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోయిందని(ఇది ఆరేండ్ల కనిష్టం) ప్రభుత్వమే చెప్పింది. ఐదుశాతం మాంద్యం లేదని సదరు మంత్రి అడ్డంగా మాట్లాడారు.
అంతేనా ! పెద్ద నోట్ల రద్దు తరువాత పన్ను చెల్లింపుదార్ల ప్రాతిపదిక రెట్టింపు కాగా, ప్రత్యక్ష పన్నుల వసూలు మొత్తం రెట్టింపు అయిందని బయట బహిరంగ సభల్లో చెప్పే అంశాలను పార్లమెంటులోనూ చెప్పారు. ఆదాయ పన్ను శాఖ గణాంకాల ప్రకారం 2016-17లో 6.92కోట్ల మంది పన్ను చెల్లింపుదార్లు ఉంటే 2018-19 నాటికి 8.45 కోట్ల మందికి పెరిగారు. కూడికలు తీసివేతలు మాత్రమే తెలిసిన వారికి కూడా ఇది రెట్టింపు కాదు కదా నాలుగోవంతుకు తక్కువ ఐదో వంతుకు ఎక్కువ అన్నది స్పష్టం. ఇక పన్ను వసూళ్లు 2015-16లో అంటే పెద్ద నోట్ల రద్దుకు ముందు రూ 7,41,945 కోట్లు కాగా అవి 11,37,685 కోట్లకు పెరిగాయి, అంటే యాభైశాతానికి కొద్దిగా ఎక్కువ. మరి రెట్టింపు ఎక్కడ ? సమర్ధించుకోవటానికి మంత్రులు ఎలాంటి పాట్లు పడుతున్నారో ఇంకా చూడండి !
జాతీయ సెలవు దినం అక్టోబరు రెండవ తేదీ ఒక్క రోజే మూడు సినిమాలు 120 కోట్ల రూపాయలు వసూలు చేశాయని చిత్ర విమర్శకుడు కోమల్‌ నహతా నాకు చెప్పాడు. ఒక దేశంలో 120 కోట్ల రూపాయలు వచ్చాయంటే ఆ దేశం గట్టి ఆర్దిక వ్యవస్ధను కలిగి ఉన్నట్లే అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఆక్టోబరు 12న ముంబై పత్రికా గోష్టిలో వ్యాఖ్యానించారు. దీని మీద తీవ్ర విమర్శలు రావటంతో తన వ్యాఖ్యను అసందర్భంగా పేర్కొని వక్రీకరించారని, తానెంతో సున్నిత మనస్కుడను కనుక చేసిన వ్యాఖ్యలు సరైనవే అయినా వాటిని ఉపసంహరించుకుంటున్నా అని మరుసటి రోజు సదరు మంత్రి ప్రకటించారు.
తాజాగా నవంబరు 16న కేంద్ర మంత్రి సురేష్‌ అంగాడీ ఆర్ధిక వ్యవస్ధ గట్టిగా ఉందని దానికి నిదర్శనం వివాహాలు పెద్ద ఎత్తున జరుగుతుండటం, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో జనం పెద్ద సంఖ్యలో కనిపించటమే అని సెలవిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. అంతే కాదు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఆర్ధిక వ్యవస్ధ మందగిస్తుందని, తరువాత పుంజుకుంటుందని ఇది ఒక చక్రమణం వంటిదని వివరించారు. దేశంలో పౌరుల వినిమయ ఖర్చు గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా 2017-18లో పడిపోయిందని జాతీయ గణాంక సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) తాజా నివేదికలో వెల్లడి కావటం గురించి మంత్రి సురేష్‌ అంగాడీ పై వ్యాఖ్యలు చే శారు.
నరేంద్రమోడీ చెబుతున్న ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధ పగటికల అన్నది ఒక అభిప్రాయం. కానీ కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ తెల్లవారు ఝామున వచ్చిన కల నిజం అవుతుందనే మూఢనమ్మకంతో ఉన్నారు. ఈ జిడిపి అంకెలతో ఐదులక్షల కోట్లడాలర్ల ఆర్ధిక వ్య వస్ధ సాధ్యమా అని ప్రశ్నిస్తే జనాలు అంకెలను, ఆర్ధిక వ్యవస్ధ లెక్కలను పట్టించుకోవద్దు అన్నారు. అంతటితో ఆగితే ఫరవాలేదు. సాంద్రత సిద్దాంతాన్ని కనుగొనేందుకు ఐనిస్టీన్‌కు లెక్కలేమీ ఉపయోగపడలేదని వ్యాఖ్యానించారు.వాస్తవానికి ఐనిస్టీన్‌ సాపేక్షతా సిద్దాంతాన్ని న్యూటన్‌ సాంద్రతా సిద్దాంతాన్ని కనుగొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి ఆర్ధిక పరిస్ధితిని చక్కదిద్ధే తెలివి తేటల సంగతి తరువాత, పై వ్యాఖ్యలను చూసిన తరువాత వారికి ఎప్పుడు, ఏం మాట్లాడాలో కూడా తెలియదనుకొనే పరిస్ధితులు తలెత్తాయని ఎవరైనా భావిస్తే అది వారి తప్పు కాదు. ఇప్పుడు ప్రధాని నాయకత్వం విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదంటే అతిశయోక్తి కాదు.
ప్రధాని నరేంద్రమోడీ సుడిగాలి మాదిరి విదేశీ పర్యటనలు జరిపి దేశ ప్రతిష్టను పెంచి ఎక్కడికో తీసుకుపోయారని బిజెపి నేతలు చెప్పటాన్ని అంగీకరిద్దాం ! భారత ప్రభుత్వ అధికారిక సమాచారం గురించి ఆర్ధికవేత్తలు, పెట్టుబడిదారులకు ఏ మాత్రం నమ్మకం లేదని అంతర్జాతీయ వార్తా సంస్ద రాయిటర్స్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక వార్తా విశ్లేషణను విడుదల చేసింది. జిడిపి పెరుగుదలను అభివృద్దిగా చూపేందుకు మోడీ సర్కార్‌ పడుతున్న తాపత్రయం గురించి తెలిసిందే. 2016 జూలై నుంచి 2017 జూన్‌ వరకు పన్నెండు నెలల కాలంలో గణాంక మంత్రిత్వశాఖ ఒక సర్వే జరిపింది. దేశ జిడిపి లెక్కల్లో ఉపయోగించిన కంపెనీల సమాచారాన్ని ఎంచుకొని జరిపిన సర్వేలో 36శాతం కంపెనీల ఉనికి లేకపోవటం లేదా తప్పుడుగా వర్గీకరించినట్లు తేలింది. సమాచార సేకరణలో లోపాలు ఉన్నాయని అంగీకరిస్తూనే జిడిపి అంచనాల మీద వాటి ప్రభావం ఉండదని, తగిన జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రిత్వశాఖ చెప్పింది. నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల గరిష్ట స్ధాయికి చేరిందన్న నివేదికను విడుదల చేయకుండా తొక్కి పట్టటాన్ని , జిడిపి గణాంకాలను ఆధారం చేసుకొని కేంద్ర ప్రభుత్వ సమాచారాన్ని నమ్మటానికి లేదనే నిర్ధారణకు రాయిటర్స్‌ వచ్చింది. ఈ కారణంగానే తాము ప్రత్యాయమ్నాయ సమాచార వనరులపై ఆధారపడేందుకు ప్రయత్నిస్తున్నామని రాయిటర్స్‌ విలేకర్లు ఇంటర్వ్యూలు చేసిన ఆర్ధికవేత్తలు, బ్యాంకుల విశ్లేషకులు, మేథావులు చెప్పారు.
దేశ జిడిపి వృద్ధి రేటు పడిపోతున్నది. ఎనిమిదిశాతంగా ఉన్నది ఈ ఏడాది రెండవ త్రైమాసంలో ఐదు శాతానికి పడిపోయినట్లు, నిరుద్యోగులు పెరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడించాయి.2020 ఆర్ధిక సంవత్సరంలో ముందుగా అంచనా వేసిన వృద్ధి రేటు 6.8శాతానికి బదులు 6.1శాతానికి మించకపోవచ్చునని రిజర్వుబ్యాంకు జోశ్యం చెప్పింది. వినిమయంపై జనాల ఖర్చు పడిపోవటం ఆందోళన కలిగిస్తోందని జాతీయ గణాంక సంస్ధ సర్వే చెప్పింది. నాలుగు దశాబ్దాల తరువాత ఆహార వినియోగం తగ్గిపోయిందని, దేశం పోషకాహారలేమి వైపు పయనిస్తోందని, వినిమయం తగ్గటం అంటే దారిద్య్రంలోకి జారుతున్న జనం పెరుగుదలను సూచిస్తోందని గణాంకాలు వెల్లడించాయి.1972-73లో కంటే వినిమయ ఖర్చు తగ్గిపోయింది. అప్పుడు వినిమయ ఖర్చు తగ్గుదలకు చమురు ధరల పెరుగుదలను కారణంగా చెప్పారు. ఎన్‌ఎస్‌ఓ తాజా నివేదికను తొలుత సర్కార్‌ బయటకు రాకుండా తొక్కి పెట్టింది. అది ఎలాగో బయటికి వచ్చింది, దాంతో గణాంకాల ప్రమాణాల మీద అనుమానాలు వున్నాయని, ఇది ముసాయిదా తప్ప నిర్ధారించినది కాదని ప్రభుత్వం ప్రకటించింది. అంటే మోడీ సర్కార్‌ అచ్చేదిన్‌ బండారాన్ని ఎండగట్టింది కనుక అంకెలను మార్చి అంతా బాగుంది అని విడుదల చేస్తారా ?
2011-12లో గ్రామీణులు సగటున నెలకు ఆహారం మీద రూ.643 ఖర్చు చేస్తే 2017-18లో రూ.580కి తగ్గింది. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో మాత్రం రూ.943 నుంచి 946కు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా వినిమయ ఖర్చు ఇదే కాలంలో 8.8శాతం పడిపోగా, పట్టణాల్లో రెండుశాతం పెరిగింది. ఆహారం మీద వినియోగం తగ్గటం అంటే పోషకాహారలేమి పెరగటానికి ఒక సూచిక. ప్రపంచ ఆకలి సూచికలో మన దేశం అధమ స్ధానంలో ఉంది. ఎన్నో విజయాలు సాధించామని సులభరత వాణిజ్య సూచిక మెరుగుదల గురించి పదే పదే చెబుతున్న నరేంద్రమోడీ వంది మాగధులు దీని గురించి మాట్లాడరు.2014లో 76దేశాల వివరాలను విశ్లేషించగా మన దేశం 55వ స్ధానంలో ఉంది. 2019లో 117 దేశాల్లో 102వ స్ధానంలో ఉంది. అంటే దేశంలో ఆకలి పెరిగిందని స్పష్టంగా చెబుతోంది. అయితే దీనిలో అనేక తప్పులు ఉన్నాయని, వాస్తవ పరిస్ధితిని ప్రతిబింబించలేదని నీతి ఆయోగ్‌ నిపుణులు ఫిర్యాదు చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్ధలు అనుసరించే పద్దతులు అనేక సందర్భాలలో మారుతున్నాయి. ఆ మేరకు మన దేశానికి వచ్చిన పాయింట్లలో ఒక ఏడాది నివేదికకు మరొక ఏడాది దానికి పొంతన ఉండటం లేదన్నది విమర్శ. గణాంక పద్దతులు ఏడాది కేడాది మారవచ్చు తప్ప దేశానికి దేశానికి మారవు. తప్పులుంటే అన్ని దేశాల సూచికల మీద ప్రతిబింబిస్తాయి. మన పరిస్ధితి గత ఐదు సంవత్సరాల్లో మెరుగుపడిందో లేదో చెప్పకుండా లెక్కల్లో తప్పులని తప్పించుకో చూస్తున్నారు.

Image result for narendra modi credibility  crisis
నిజానికి దేశంలో ఆర్ధిక పరిస్ధితి దిగజారుడు యుపిఏ చివరి రోజుల్లోనే ప్రారంభమైంది. అయితే దాని పాలనా కాలంలో జరిగిన భారీ కుంభకోణాల మీద ప్రతిపక్షాల, మీడియా దాడి కేంద్రీకృతం కావటంతో జనంలో పెద్దగా చర్చ సాగలేదు. విసిగిపోయి ఉన్న జనం నరేంద్రమోడీ ఆకర్షక నినాదాలతో పట్టం కట్టారు. గత ఐదు సంవత్సరాల కాలంలో చమురు ధరల భారీగా పడిపోయిన కారణంగా ఖజానాకు ఎంతో మిగులుతో పరిస్దితి తొలి రోజుల్లో స్ధిరంగా ఉంది. అయితే చమురు ధరలు ఒక స్ధితికి చేరిన తరువాత తిరిగి అన్ని రంగాల దిగజారుడు ప్రారంభమైంది. వాటిని మూసిపెట్టి భావోద్వేగాల మీద జనం దృష్టిని మళ్లించి, ఇతర అంశాలను ముందుకు తెచ్చి రెండవసారి అధికారానికి వచ్చారు.
ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. పియూష్‌ గోయల్‌, రవిశంకర ప్రసాద్‌, సురేష్‌ అంగాడీ, నిర్మలా సీతారామన్‌ వంటి వారు అలా మాట్లాడటానికి కారణాలను విస్మరించకూడదు. అలాంటి ప్రకటనలు చేయాలని స్వయంగా నరేంద్రమోడీయే దారి చూపారంటే ఆయన భక్తులకు కోపం రావచ్చు. భిన్నమైన ఫలితాలు రావాలని కోరుకుంటూ ఒకే పనిని పదే పదే చేయటం గురించి ఐనిస్టీన్‌ ఒక సందర్భంగా చెప్పారు. కొందరు ఏదీ నేర్చుకోరు, దేన్నీ మరచిపోరు అన్న విషయం కూడా తెలిసిందే. (ముగింపు రెండవ భాగంలో )

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆర్‌టిసి కార్మిక సమ్మె- అడ్డం తిరిగిన సర్కార్‌ – ముందుకు తెచ్చిన సవాళ్లు !

16 Saturday Nov 2019

Posted by raomk in Current Affairs, employees, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

adamant government, challenges before working class, KCR warning to RTC staff, Telangana CM, TSRTC staff strike

Image result for tsrtc staff strike- adamant government - challenges before working class
ఎం కోటేశ ్వరరావు
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ(టిఎస్‌ఆర్‌టిసి) సిబ్బంది సమ్మె నలభై మూడు రోజులు దాటి ఇప్పటికే కొత్త రికార్డు నమోదు చేసింది. ఇంతకాలం హైకోర్టు, కార్మికులు, సామాన్య జనాన్ని తప్పుదారి పట్టించిన సర్కార్‌ అంతిమంగా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో అసలు విషయం బయట పెట్టింది. కార్మికులతో చర్చించేదేమీ లేదు, ఆర్టీసీ నష్టాల్లో ఉంది, డిమాండ్లను అంగీకరించేది లేదు. విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టినా తిరిగి ముందుకు తీసుకువచ్చే అవకాశం వుంది. జెఎసి రాజకీయ పార్టీలతో చేతులు కలిపింది.ఇలా సాగింది(ఇది రాసే సమయానికి వివరాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు).
చరిత్రాత్మక ఈ సమ్మె పట్ల అనుసరించిన వైఖరి తమ ఖ్యాతిని పెంచుతుంది అనుకుంటే కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌ నిరభ్యంతరంగా తమ ఖాతాలో వేసుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను ఒక్కసారి అవలోకిద్దాం. శనివారం నాడు ఆర్‌టిసి యూనియన్ల నేతలపై ప్రభుత్వం నిర్బంధాన్ని మరింతగా పెంచింది. సమ్మెపై దాఖలైన కేసు విచారణను హైకోర్టు నవంబరు 18వ తేదీకి వాయిదా వేసింది. అంటే మరో రెండు రోజులతో 45 రోజులకు చేరనుంది. ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలిసింది కనుక కోర్టు అభిప్రాయాన్ని బట్టి తదుపరి ఏమి జరగునుందో తెలుస్తుంది తప్ప ముందుగా జోశ్యం చెప్పలేము.ముగ్గురు పదవీ విరమణ చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో మధ్యవర్తుల కమిటీ వేసి సమ్మె అంశాలను వారికి నివేదించాలన్న హైకోర్టు సూచనకు 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అన్నది. మరోవైపు 14వ తేదీన సమావేశమైన ఆర్‌టిసి జెఏసి తమ డిమాండ్లలో ప్రధానమైన ప్రభుత్వంలో ఆర్‌టిసి విలీనం అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని మిగిలిన అంశాలపై ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుతున్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వత్థామరెడ్డి చెప్పారు. కార్మిక సంఘాలు పందొమ్మిదవ తేదీ వరకు ఆందోళన కార్య క్రమాలను ప్రకటించారు. అన్ని గ్రామాల్లో బైక్‌ ర్యాలీలు, ఇందిరాపార్క్‌ వద్ద జేఏసీ నేతల దీక్ష , అన్ని డిపోల వద్ద నిరసన దీక్షలు.. 19న హైదరాబాద్‌ నుంచి కోదాడ వరకు సడక్‌ బంద్‌ నిర్వహిస్తామని తెలిపారు. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులతో గవర్నర్‌ని కలుస్తామని, ఎన్‌హెచ్‌ఆర్సీ అపాయింట్‌మెంట్‌ కోరామని అశ్వత్థామరెడ్డి తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు సూచించినట్లుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఉన్నత స్థాయి మధ్యవర్తిత్వ కమిటీ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. కార్మికులకు, యాజమాన్యానికి మధ్య వివాదం తలెత్తినపుడు పరిష్కారం కోసం ఉన్నత స్థాయి మధ్యవర్తిత్వ కమిటీని వేయాలని పారిశ్రామిక వివాదాల చట్టంలో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి అఫిడవిట్‌ను అడ్వకేట్‌ జనరల్‌ న్యాయస్థానానికి సమర్పించారు. ఆ చట్టంలోని పదో సెక్షన్‌ ప్రకారం దీనిపై లేబర్‌ కమిషనర్‌ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. ఈ వివాదంపై దాఖలైన వ్యాజ్యాల్లో కోర్టు విచారణ చేస్తున్నందున ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.పిటిషనర్ల తరఫు న్యాయవాది ‘శివారావ్‌ శాంతారావ్‌ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు. సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ వేసే అధికారాలు ఈ న్యాయస్థానానికి ఉంటాయన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను నవంబరు 18కి వాయిదా వేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాల ఆర్టీసీ సమ్మెపై, బస్సు రూట్ల ప్రయివేటీకరణపై రెండు వ్యాజ్యాలను ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏజీ వాదిస్తూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమన్నారు. ఎస్మా కింద చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఆర్టీసీని ఎస్మా కిందకు చేర్చుతూ ప్రభుత్వం జీవో ఇచ్చిందా? అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఉందని ఏజీ బదులిచ్చారు. ఆర్టీసీ సేవలు ప్రజోపయోగం కిందకు వస్తాయని చెప్పారు. వాటికి భంగం కలిగించిన వారిపై ఎస్మా కింద చర్యలు చేపట్టవచ్చన్నారు. ఆర్టీసీ సమ్మె ఎస్మా కిందకు రాదని కార్మిక సంఘాల న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి బదులిచ్చారు. టీఎస్‌ ఆర్టీసీని ఆర్టీసీ యాక్టు 1950, ఏపీ పునర్‌విభజన చట్టం-2014లోని సెక్షన్‌ 3 కింద ఏర్పాటు చేశామని ఏజీ కోర్టుకు వివరించారు.

ఈ వాదనలను ధర్మాసనం తొలుత తోసిపుచ్చింది. ”ఆర్టీసీకి ప్రత్యేక చట్టం ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఏపీఎస్‌ ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా ఉందని, టీఎస్‌ ఆర్టీసీని కేంద్రం గుర్తించడం లేదని గతంలో అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ చెప్పారు. ఆర్టీసీని విభజించాలంటే ఆర్టీసీ చట్టంలోని సెక్షన్‌ 47ఏ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. కేంద్ర అనుమతి లేకుండా ఏర్పాటు చేయడానికి వీల్లేదు” అని న్యాయస్థానం ప్రస్తావించింది. రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయని, ఈ చట్టం ప్రకారమే ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థలను రెండు రాష్ట్రాల మధ్యన పంచవచ్చని ఏజీ సమాధానం ఇచ్చారు. ఆర్టీసీ నుంచి సాంకేతికంగా వేరు పడనప్పటికీ బస్సులను చట్ట ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య విభజించారన్నారు.

Image result for tsrtc staff strike- adamant government - challenges before working class
చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం టీఎస్‌ ఆర్టీసీని ఏర్పాటు చేశామని, అలాంటి అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పారు. టీఎసఆర్టీసీ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్నారు. ఏజీ వాదనలు విన్న ధర్మాసనం తన అభిప్రాయాన్ని మార్చుకుంది. ఆర్టీసీ కార్పొరేషన్‌ తరుపున అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదించారు.1994లో ‘సిండికేట్‌ బ్యాంక్‌ వర్సెస్‌ అదర్స్‌’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమా? కాదా? అని తేల్చే అధికారం హైకోర్టుకు లేదని చెప్పారు. దాన్ని లేబర్‌ కోర్టే తేల్చాలన్నారు. వాదనలు విన్న ధర్మాసనం సమస్యను లేబర్‌కోర్టుకు రిఫర్‌చేస్తే నిర్ణీత కాలంలో సమస్యకు పరిష్కారం చూపగలదా? అని ఏజీని ఉద్దేశించి ప్రశ్నించింది. ఇది ముఖ్యమైన సమస్య అయినందున లేబర్‌కోర్టు కూడా ఎక్కువ సమయం తీసుకోదని హైకోర్టుకు నివేదించారు.
ఆర్‌టిసి సిబ్బంది సమ్మెపై హైకోర్టులో ఇన్ని రోజులు విచారణ జరగటమే ఒక విశేషం అని చెప్పవచ్చు. ఆర్‌టిసికి సంబంధించి కోర్టుకు నివేదించిన తప్పుడు లెక్కలను చూసిన తరువాత అసెంబ్లీకి సమర్పించే బడ్జెట్‌ అంకెలు, సభలో మంత్రులు చేసే ప్రకటనలు, చెప్పే సమాచార విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది. ఆర్‌టిసికి రావాల్సిన బకాయిల గురించి అసెంబ్లీకి ఒక సమాచారం, హైకోర్టుకు ఒక సమాచారం ఇవ్వటం, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తరులకు ఎవరికి వారు తమకు అనుకూలమైన భాష్యాలు చెప్పేందుకు వీలుగా లోపాలతో కూడిన వాటిని తయారు చేయటం వంటి అనేక అంశాలు యావత్‌ ప్రజానీకానికి కనువిప్పు కలిగించాయి.
మేక పిల్లను తినదలచుకున్న తోడేలు మాదిరి ఆర్‌టిసిని దెబ్బతీయటానికి తద్వారా దానికి ఉన్న విలువైన ఆస్ధులను కాజేయటానికి రాష్ట్ర ప్రభుత్వ నేతలు యత్నిస్తున్నారనే అభిప్రాయం మరింత బలపడింది.ఈ సమ్మె ఒక్క తెలంగాణాలోని కార్మికవర్గానికే కాదు, దేశవ్యాపితంగా యావత్‌ కార్మికులకు ఎన్నో పాఠాలు నేర్పుతున్నది. సవాళ్లను ముందుకు తెచ్చింది. గత పాలకుల హయాంలో ప్రభుత్వ రంగ సంస్ధల ఆస్ధులను అప్పనంగా నీకిది నాకది అన్న పద్దతిలో కారుచౌకగా ఆశ్రితులకు అప్పగించారు. ఇప్పుడు ముక్కలు ముక్కలుగా ఎక్కడి కక్కడ ఆశ్రితులకు కట్టబెట్టేందుకు మిగిలి ఉంది ఆర్‌టిసి ఒక్కటే అన్నది తేలిపోయింది. సచివాలయాన్ని వేరే చోటకు తరలించి ఆ స్దలాన్ని కూడా అన్యాక్రాంతం చేసే అజెండా అలాగే ఇంకా ఉందనుకోండి.
దేశంలో అమలు జరుగుతున్న నయా ఉదారవాద విధానాలను మరింత ఉథృతంగా అమలు జరిపేందుకు కేంద్ర పాలకులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాలలోని మెజారిటీ బిజెపి పాలిత ప్రభుత్వాలు లేదా కాంగ్రెస్‌, ఇతర ప్రాంతీయ పార్టీల పాలకులు గానీ వాటికి వ్యతిరేకం కాదు.పోటీ, ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే సాకుతో ఆర్‌టిసి రూట్లలో ప్రయివేటు బస్‌లను తిప్పేందుకు అనుమతి ఇచ్చేందుకు వీలుగా ఇటీవల సవరించిన మోటారు వాహనాల చట్టంలో తెచ్చిన మార్పును ఉపయోగించుకొని ఆర్‌టిసిని దెబ్బతీసేందుకు పూనుకున్న తొలి ప్రభుత్వంగా తెలంగాణా టిఆర్‌ఎస్‌ సర్కార్‌ చరిత్రకెక్కింది.దీనికి కేంద్ర బిజెపి సర్కార్‌ పరోక్ష సాయం తక్కువేమీ కాదు.
సమ్మె నోటీసుపై చర్చలు ప్రారంభమైన తరువాత వాటి ఫలితం ప్రతికూలంగా ఉంటే ఏడు రోజుల వరకు సమ్మెకు వెళ్లకూడదన్న నిబంధనతో కార్మికులపై వేటు వేసేందుకు ఉన్నత అధికార యంత్రాంగం వేసిన ఎత్తుగడను కార్మిక సంఘాలు పసిగట్టలేకపోయినట్లు స్పష్టం అవుతోంది. అక్టోబరు ఐదు నుంచి సమ్మెకు పిలుపు ఇస్తే నాలుగవ తేదీన చర్చల ప్రహసనాన్ని ప్రభుత్వం నడిపింది. మరుసటి రోజు నుంచి సమ్మెలోకి వెళ్లటంతో ఏడు రోజుల నిబంధనను ముందుకు తెచ్చి సమ్మె చట్టవిరుద్దమని తొలి నుంచి సర్కార్‌ వాదించింది. అందుకే దాన్ని లేబర్‌ కోర్టుకు నివేదించాలని పదే పదే డిమాండ్‌ చేసింది.
విభజించి పాలించు అన్న బ్రిటీష్‌ రాజనీతిని తెలంగాణా సర్కార్‌ ఈ సందర్భంగా ప్రదర్శించింది. ఎన్‌జిఓలు, టీచర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బంది, కార్మికులు సంఘీభావంగా ఆందోళనలోకి రాకుండా చేసింది. నిజానికి వారంతా ముందుకు వచ్చి ఉంటే సమ్మె ఇన్ని రోజులు జరిగి ఉండేది కాదు. ఒకవైపు ఎన్నడూ లేని రీతిలో సంపూర్ణ సమ్మె జరుగుతుండగా పది పన్నెండు రోజుల్లో పిఆర్‌సి నివేదిక ఇమ్మని ముఖ్యమంత్రి కమిషన్‌ను ఆదేశించిట్లు ప్రకటించారు. బండి గుర్రం నోటికి చిక్కెం కట్టి కళ్ల ముందు గడ్డి కట్టను ఉంచటం తప్ప వేరు కాదు. దానిలో ఉద్యోగులకు ఏమేరకు న్యాయం చేస్తారో అన్యాయం చేస్తారో చూడాల్సి ఉంది.

Image result for tsrtc staff strike- adamant government -kcr
విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసి విద్యార్ధులను కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలకు అప్పగించారు. త్వరలో ప్రయివేటు విశ్వవిద్యాలయాలు కూడా రానున్నాయి. వైద్యరంగంలో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేసి రోగులను కార్పొరేట్‌ జలగల పాలు చేశారు. ముఖ్యమంత్రి ప్రయివేటు బస్‌ ఆపరేటర్ల విషయంలో చేసిన వాదనల ప్రకారం కార్పొరేట్ల మధ్య పోటీ ఏర్పడి విద్యా, వైద్య సంస్ధలలో వసూలు చేసే మొత్తాలు తగ్గాలి. ఎక్కడా తగ్గకపోగా జనం రుణగ్రస్తులు కావటానికి కారణాలలో ఈ రెండు రంగాలు కూడా చేరాయి. ఇప్పుడు ఆర్‌టిసిని నిర్వీర్యం చేసి ప్రయివేటు ఆపరేటర్లపాలు చేస్తే జరిగేది కూడా ఇదే అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రయివేటు మోజుల్లో జనం పడితే అంతిమంగా నష్టపోయేది తామే అని ఏ మాత్రం జనానికి అవగాన ఉన్నా ప్రభుత్వం మీద ఇంకా వత్తిడి పెరిగి ఉండేది.

ఇది రాస్తున్న సమయానికి ఆర్‌టిసి కార్మికుల సమ్మె ఏమౌతుంది అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా తయారైంది. తాము ఏ ఒక్క డిమాండ్‌ను అంగీకరించేది లేదని ప్రభుత్వం తన ఆఖరి మాటగా అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.ఇప్పటివరకైతే కార్మికులను సమ్మె విరమించాలని కోర్టు వైపు నుంచి ఎలాంటి సూచనలు వెల్లడి కాలేదు. ఇది వారి కోర్కెలు సమంజసమైనవే అని కోర్టు భావిస్తోందని అనుకొనేందుకు ఆస్కారమివ్వవచ్చు. తమను కూడా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టటం కూడా చూశాము. మొండి వైఖరిని కూడా చూసింది. కోర్టు ముందు ఉన్న వివాదం ఏదైనప్పటికీ ఇది 50వేల మంది కార్మికులు, రోజువారీ ప్రయాణించే దాదాపు కోటి మంది ప్రయాణీకుల వ్యవస్ధ కనుక తనకున్న ప్రత్యేక అధికారాలతో ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తుందా ? సమ్మె విరమించమని కార్మికులకు సూచిస్తుందా లేక మూడో మార్గం దేన్నయినా ఎంచుకుంటుందా అన్నది చూడాలి. తాజా పరిణామాలపై సిబ్బంది సంఘాల జెఎసి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి వుంది.
డజన్ల సంఖ్యలో కార్మికులు ఆత్మహత్యలు లేదా ఆవేదనతో మరణించటం ఒక ఆందోళనకరమైన అంశం.ఫ్యూడల్‌ సమాజానికి చెందిన రైతులు, వ్యవసాయ కార్మికులు, అంతరించి పోతున్న చేతివృత్తుల కుటుంబాల నుంచి వస్తున్న వారికి పూర్తిగా కార్మికవర్గ లక్షణాలు, ఆలోచనలు వెంటనే రావు. ఇది ఒక సంధి సమయం. తెలంగాణా రాష్ట్ర సాధన ఆందోళన సమయంలో ఆత్మాహుతుల ఉదంతాలు దీనికి పురికొల్పాయా లేక పాలకుల మీద విపరీతమైన భ్రమలు పెట్టుకొని హతాశులై ఇలాంటి తీవ్రచర్యలకు పాల్పడ్డారా అన్న అన్నది పరిశోధించాల్సి ఉంది. పోరాటం తప్ప ఆత్మహత్యలు కార్మికవర్గ లక్షణం కాదు. కార్మిక సంఘాలు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి కార్మికులు, ఉద్యోగులను ఆమేరకు చైతన్యవంతం చేసేందుకు పూనుకోవాల్సిన అవసరాన్ని ఈ పరిణామం ముందుకు తెచ్చింది.

Image result for adamant kcr
కార్మికుల న్యాయమైన సమస్యలపై చివరి ఆయుధంగానే కార్మికులు సమ్మెకు దిగుతారు. ఆర్‌టిసి చరిత్రలో సూపర్‌వైజర్‌లు తొలిసారిగా సమ్మెకు దిగితే, చిన్నా పెద్దా, గుర్తింపు పొందిన, లేని యూనియన్లన్నీ ఏకతాటిపైకి వచ్చి సమ్మెకు దిగటం ఒక మంచి పరిణామం. కార్మికులు కూడా నాయకత్వంపై విశ్వాసం ఉంచి నిలబడ్డారు. ప్రభుత్వ బెదిరింపులు, ప్రలోభాలను ఖాతరు చేయలేదు. ప్రపంచ చరిత్రను, మన దేశ చరిత్రను చూసినపుడు గానీ కార్మికుల సమ్మెలన్నీ జయప్రదం కాలేదు. అనివార్యమై రాజీ పడి విరమించాల్సి వచ్చినా ఒక సంస్ధ లేదా ఒక తరగతి కార్మికులు నిరాశా నిస్పృహలకు గురైనా అది తాత్కాలికమే. నిరంకుశమైన యాజమాన్యాలు కార్మికులను పీల్చిపిప్పి చేస్తున్నంత కాలం కార్మికుల ఆందోళనలకు అంతం ఉండదు. ప్రతి సమ్మె విజయం లేదా వైఫల్యం కూడా భవిష్యత్‌లో అదే సంస్ధ లేదా ఇతర సంస్ధల కార్మికులకు అనేక పాఠాలు నేర్పుతుంది. సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తే అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ప్రపంచంలో మంచి భూస్వామి, మంచి వ్యాపారి, మంచి పెట్టుబడిదారుడు, మంచి కార్పొరేట్‌ సంస్ధ, పాలకవర్గ పార్టీలలో మంచి పాలకుల కోసం వెతకటం నేతి బీరలో నెయ్యి కోసం దేవులాడినట్లే !
ఆర్‌టిసి కార్మికుల సమ్మె సందర్భంగా ముఖ్య మంత్రి కెసిఆర్‌ యూనియన్లకు, కార్మికులు సంఘటితం కావటానికి ఎంత బద్ద వ్యతిరేకో స్పష్టంగా చెప్పారు. యూనియన్లను లేకుండా చేస్తానని అన్నారు. చరిత్రలో ఇలాంటి యూనియన్‌ విచ్చిన్నకులు కాలగర్భంలో కలసి పోయారు. ఈ పరిణామం తరువాత పాలకపార్టీ నేతలతో అంటకాగితే తమకేదో మేలు జరుగుతుందని ప్రలోభపెట్టేవారిని కార్మికవర్గం అంతతేలికగా విశ్వసించదు. అధికారపార్టీకి చెందిన వారు కూడా కార్మికుల దగ్గరకు వచ్చి యూనియన్లుపెట్టి ఉద్దరిస్తామని చెప్పేందుకు వెనుకాడే స్ధితి వస్తుంది. పాలకపార్టీల మీద కార్మికవర్గంలో భమ్రలు తొలగటానికి ఈ సమ్మె నాంది. ఆర్‌టిసి సమ్మె జయప్రదమైతే ఇతర కార్మికులు, ఉద్యోగులు మరింత వేగంగా తమ సమస్యల మీద పోరు బాట పడతారు. ఒక వేళ విఫలమైతే కాస్త విరామం వచ్చినా మరింత జాగరూకతతో వ్యవహరించి పోరుబాట ఎక్కటం తప్ప మరొక దగ్గర మార్గం ఉండదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కుట్రతో బొలీవియా మొరేల్స్‌ నిష్క్రమణ-బ్రెజిల్‌ లూలా జైలు నుంచి విడుదల !

16 Saturday Nov 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Bolivia’s leader Evo Morales, Evo Morales, Former Brazilian President Luiz Inácio Lula da Silva, lula da silva

Image result for evo morales disposed in a coup, lula da silva freed from jail

ఎం కోటేశ ్వరరావు
గతవారంలో గమనించదగిన రెండు పరిణామాలు జరిగాయి. ఒకటి తప్పుడు కేసుల్లో ఇరికించిన బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా జైలు నుంచి విడుదల అయ్యారు. అమెరికా కుట్రలో భాగంగా బొలీవియా మిలిటరీ తిరుగుబాటు చేయటంతో అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నతరువాత మరోసారి ఎన్నికై రాజీనామా చేసి దేశం వదలి మెక్సికోలో రాజకీయ ఆశ్రయం పొందారు.
పౌరుల రక్తపు మరకలను అంటించుకోవద్దని బొలీవియా మాజీ అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ దేశ అధికారులను హెచ్చరించారు. మిలిటరీ కుట్ర కారణంగా పదవికి రాజీనామా చేసి సోమవారం నాడు మెక్సికో చేరిన మొరేల్స్‌ నూతన ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తున్న తన మద్దతుదారులకు బాసటగా ఈ ప్రకటన చేశారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రకటించుకున్న సెనేట్‌ డిప్యూటీ స్పీకర్‌ జీనైన్‌ ఆంజెను తాము గుర్తించటం లేదంటూ లాపాజ్‌ పట్టణంలో పెద్ద ఎత్తున మొరేల్స్‌ మద్దతుదారులు ప్రదర్శనలు చేశారు. మూలవాసీ(స్ధానిక రెడ్‌ ఇండియన్‌ తెగలు) పతాకాలను చేబూని నిరసన తెలుపుతున్న నిరసనకారులు పలు చోట్ల పోలీసులతో తలపడినట్లు వార్తలు వచ్చాయి. అంజె ప్రభుత్వాన్ని గుర్తించినట్లు అమెరికా ప్రకటించింది.ఈ చర్యను మెక్సికో సిటీలో ఉన్న ఇవో మొరేల్స్‌ ఖండించారు. శుక్రవారం నాడు మొరేల్స్‌ అనుకూల ప్రదర్శకులపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. మొరేల్స్‌ లేకుండానే మరోసారి ఎన్నికలు జరిపేందుకు నూతన పాలకులు తెరతీసినట్లు వార్తలు వచ్చాయి. బొలీవియాలో జరిపిన సైనిక కుట్రను డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారయుతంగా సమర్ధిస్తూ ఒక ప్రకటన చేశాడు.వెనెజులా, నికరాగువాల్లో ఉన్న ప్రభుత్వాలకు ఇదొక హెచ్చరిక అని బెదిరించాడు.
మొరేల్స్‌ దేశం నుంచి పోయేట్లు చేసిన కుట్రలో శ్వేతజాతి దురహంకారి అయిన మితవాద ప్రతిపక్ష నేత లూయీస్‌ ఫెర్నాండో కమాచో పాత్ర కూడా ఉంది. మొరేల్స్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలను అతని మద్దతుదారులు నిర్వహించారు. వ్యవసాయ, సహజవాయు వాణిజ్యవేత్త అయిన కమాచో బొలీవియా అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు చూస్తున్నాడు. ఫాసిస్టు, క్రైస్తవ సంస్దలతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి. స్ధానిక తెగలను ద్వేషించటం, పురోగామి శక్తులు క్రైస్తవ మతవిరోధులని ప్రచారం చేయటంలో ముందున్నాడు.

Image result for evo morales disposed in a coup, lula da silva freed from jail
బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా డ సిల్వాను సుప్రీం కోర్టు అనుమతి మేరకు ఏడాదిన్నర తరువాత జైలు నుంచి విడుదల చేశారు. అవినీతి అక్రమాల కేసులో 2018 నుంచి పన్నెండు సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్న తనను అక్రమంగా కేసుల్లో ఇరికించారంటూ తీర్పును సవాలు చేస్తూ పునర్విచారణకు దరఖాస్తు చేశారు. విచారణ పూర్తయ్యేంతవరకు నిందితుడు నిర్దోషే అని చెబుతున్న 1988నాటి రాజ్యాంగ నిబంధనను అంగీకరిస్తూ సుప్రీం కోర్టు తన గత తీర్పుకు భిన్నంగా నిర్ణయించటంతో లూలాను వెంటనే విడుదల చేశారు. లూలా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన మూడు సంవత్సరాల తరువాత తానున్న ఇంటి మరమ్మతులకు ఒక కంపెనీ నుంచి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిస సాయానికి అక్రమంగా మరమ్మతుల రూపంలో లంచం తీసుకున్నట్లు ఒక నేరగాడితో తప్పుడు సాక్ష్యం చెప్పించారు. అసలు ఆ ఇల్లు లూలాది కాదు, అంతకు మించి మరమ్మతులు జరిగిన దాఖలాలు కూడా లేవని తేలింది. లూలా మీద చేసిన ఆరోపణల్లో ఇదొకటి. అమెరికా ప్రమేయంతో జరిగిన కుట్రలో సరిగ్గా గత ఎన్నికలకు ముందు లూలాను ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేందుకు కుట్ర చేశారు. ఫలితంగా చివరి నిమిషంలో లూలా నాయకత్వంలోని వర్కర్స్‌ పార్టీ నూతన అభ్యర్ధిని ప్రకటించాల్సి వచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ ఓడిపోయినా, పార్లమెంట్‌లో మెజారిటీ స్ధానాలు, రాష్ట్రాలలో మెజారిటీని దక్కించుకుంది.

Image result for evo morales disposed in a coup,
బొలీవియా విషయానికి వస్తే అక్కడ మరో కుట్రకు తెరలేపారు. అక్టోబరు 20న జరిగిన ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు వీధులకు ఎక్కాయి. అమెరికా దేశాల సంస్ధ ప్రతినిధులు గనుక అక్రమాలు జరిగినట్లు నివేదిక ఇస్తే మరోసారి ఎన్నిక జరిపేందుకు తాను సిద్దమే అని మొరేల్స్‌ ముందుకు వచ్చాడు. అమెరికా కనుసన్నలలో పని చేసే ఆ సంస్ధ అక్రమాలు జరిగినట్లు ఆ నివేదిక ఇచ్చింది. ఆ మేరకు తిరిగి ఎన్నికలు జరుపుతానని ప్రకటించాడు. అయితే పదవిని వదులుకోవాలంటూ పోలీసులు, మిలిటరీ తిరుగుబాటు చేశారు. ఈ నేపధ్యంలో ప్రాణ రక్షణకు ఆయన మెక్సికో వెళ్లి ఆశ్రయం పొందారు.
బొలీవియాలో ఐదు వందల సంవత్సరాల వలస లేదా స్ధానికేతరుల పాలన తరువాత 2006లో తొలిసారిగా స్ధానిక గిరిజన తెగలకు చెందిన ఇవో మొరేల్స్‌ సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పేరుతో పనిచేస్తున్న పార్టీ తరఫున అధికారానికి వచ్చాడు. తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని, తాను గిరిజనుడిని, కార్మిక ఉద్యమ ఉద్యమ కార్యకర్తను, కోకా పండించే రైతును కావటమే తాను చేసిన పాపం అని రాజీనామా సందర్భంగా వ్యాఖ్యానించాడు. సోమవారం జరిగిన పరిణామాల్లో అధ్యక్ష భవన రక్షణ సిబ్బంది, పోలీసులు తమ విధులను బహిష్కరించారు. దేశంలో శాంతినెలకానాలంటే మొరేల్స్‌ గద్దె దిగాల్సిందేనని మిలిటరీ అధిపతి విలియమ్స్‌ కాలిమాన్‌ డిమాండ్‌ చేశాడు.
మొరేల్స్‌ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం గత పదమూడు సంవత్సరాలలో అక్కడి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాన్ని పైకి తెచ్చింది. గ్యాస్‌, ఖనిజాల ఎగుమతుల కారణంగా జిడిపి గణనీయంగా పెరిగింది. ప్రయివేటు రంగం చేతుల్లో ఉన్న సంపదలన్నింటినీ జాతీయం చేస్తానని ప్రకటించినప్పటికీ వాటి జోలికి పోలేదు.దేశ ంలోని సహజవనరులను వెలికి తీసి దారిద్య్ర నిర్మూలన వంటి సంక్షేమ చర్యలను సమర్ధవంతంగా అమలు జరిపింది. ఇటీవలి సంవత్సరాలలో వైద్యులు, గని కార్మికుల వంటి తరగతుల సమ్మెలు, ఇతర ఆందోళనల కారణంగా గతంలో ఆయనను బలపరచిన శక్తులు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. దేశంలో పేదరిక నిర్మూలన, ఇతర సంక్షేమ చర్యలను తీసుకున్నప్పటికీ అంతకు ముందు ప్రారంభమైన నయా వుదారవాద విధానాలలో పెద్దగా మార్పులు లేవనే విమర్శలు కూడా ఉన్నాయి.

Image result for evo morales disposed in a coup, protests
ఇవో మొరేల్స్‌కు వ్య తిరేకంగా జరిగిన కుట్రను ప్రతిఘటించాలని ఇరుగుపొరుగు సంఘాల ఫెడరేషన్‌ పిలుపునిచ్చింది. మొరేల్స్‌ అధికారంలోకి రాకముందు జరిగిన పోరాటాలలో ఈ సంస్ధ ప్రముఖపాత్ర పోషించింది. ఆత్మరక్షణ దళాలను ఏర్పాటు చేయాలని, ఎక్కడి కక్కడ ప్రతిఘటనకు పూనుకోవాలని కోరింది. ఎల్‌ ఆల్టో పట్టణంలో ఇలాంటి దళాల నాయకత్వంలో అనేక పోలీసు కార్యాలయాలను ఆక్రమించుకొని కొన్నింటిని దగ్దం చేసినట్లు వార్తలు వచ్చాయి. 2005ఎన్నికలకు ముందు దేశంలో కార్పొరేట్‌ సంస్ధల ఆర్దిక ప్రయోజనాల రక్షణకు వాటి తరఫున పని చేసే రాజకీయ బృందాలు, సంస్ధలు ఉన్నాయి. అవి అవకాశవాద పొత్తులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేవి. అవి ప్రజల సమస్యలను పట్టించుకొనేవి కాదు. ఈ పూర్వరంగంలో వివిధ ప్రాంతాలలో ఏర్పడిన పౌర సంస్ధలు జరిపిన పోరాటాలు వాటితో మమేకం కావటం ఎన్నికలలో ఇవో మొరేల్స్‌ విజయానికి బాటలు వేసింది.మొరేల్స్‌ నాయకత్వంలోని సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పార్టీ అవకాశవాద రాజకీయాలు, పొత్తులకు వ్యతిరేకంగా పని చేసింది. ఎన్నికలలో అభ్యర్ధులుగా దిగువ స్ధాయి నుంచి ఉద్యమాలలో పాల్గన్నవారే ఉండటంతో ఘనవిజయాలు సాధించారు.
అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్ధల బొలీవియా సహజవనరుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఇవో మొరేల్స్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సహించలేని శక్తులే తాజా కుట్రవెనుక వున్నట్లు భావిస్తున్నారు. వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మొరేల్స్‌ అధికారానికి వచ్చిన కొత్తలో విదేశీ కంపెనీల చేతుల్లో వున్న గ్యాస్‌, చమురు కంపెనీలను జాతీయం చేశారు. అయితే విదేశీ కంపెనీలే ఇప్పుడు ప్రభుత్వం తరఫున వాటిని వెలికి తీస్తున్నాయి. విద్యుత్‌ కార్లు, స్మార్ట్‌ ఫోన్లలో వాడే బ్యాటరీల తయారీకి ఎంతో అవసరమైన లిథియం నిల్వలు బొలీవియాలో పుష్కలంగా ఉన్నాయి. వర్తమాన శతాబ్ది బంగారంగా ఈ ఖనిజాన్ని పరిగణిస్తున్నారు. కొద్ది సంవత్సరాలలో దీనికి డిమాండ్‌ మరింత పెరిగి కొరత ఏర్పడవచ్చని కార్పొరేట్‌ శక్తులు అంచనా వేశాయి. ప్రపంచంలో ఉన్న లిథియం నిల్వల్లో ఒక్క బలీవియాలోనే 25 నుంచి 45శాతం వరకు నిక్షిప్తమై ఉన్నట్లు అంచనా. దీన్ని ప్రభుత్వరంగంలో వెలికి తీసి వచ్చే ఆదాయంతో మరిన్ని సంక్షేమ చర్యలను చేపట్టాలని మొరేల్స్‌ ప్రభుత్వం తలపెట్టింది. జర్మన్‌ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం వలన జనానికి పెద్దగా ప్రయోజనం చేకూరదని స్ధానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో గతవారంలో ఒప్పందాన్ని మొరేల్స్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
లాటిన్‌ అమెరికాలో సహజవనరుల దోపిడీని అరికట్టి జనానికి లబ్ది కలిగించే చర్యలు తీసుకొనే ఏ ప్రభుత్వాన్ని అమెరికా,కెనడా తదితర దేశాలు అంగీకరించటం లేదు. వామపక్ష శక్తులు అధికారానికి వచ్చిన ప్రతి చోటా పచ్చిమితవాద శక్తులు వాటికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావటం వెనుక అమెరికా హస్తం ఉండటం బహిరంగ రహస్యం. బొలీవియాలో కూడా అదే జరిగింది. ధనికులు, మితవాద శక్తులు బలంగా ఉన్న శాంతా క్రజ్‌ ప్రాంతంలో ప్రతిపక్ష నేత ఫెర్నాండో కామాచో, ఇతరుల నాయకత్వంలో తాజా కుట్రకు తెరలేచింది. ఆదివారం నాడు మిలిటరీ, పోలీసు అధికారులు వారికి వంతపాడారు. మొరేల్స్‌ను గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు.తొలుత కార్మికనేతగా ఎదిగిన చాపారే ప్రాంతానికి చేరుకున్న మొరేల్స్‌ అక్కడి నుంచి టీవీలో మాట్లాడుతూ నన్ను ఎన్నడూ వదలని నా జనం వద్దకు తిరిగి వచ్చాను, పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అంటూ తన రాజీనామాను ప్రకటించారు.
సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ పోలసీ రిసర్చ్‌ సంస్ద జరిపిన అధ్యయనం ప్రకారం మొరేల్స్‌ పాలనా కాలంలో దారిద్య్రనిర్మూలన కార్యక్రమం విజయవంతమైందని తెలిపింది. లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల ప్రాంతంలోని దేశాలతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువగా బొలీవియా ఆర్ధిక ప్రగతి సాధించినట్లు పేర్కొన్నది. మొరేల్స్‌ అధికారానికి రాకముందు చమురు కంపెనీల నుంచి ఏటా 73.1కోట్ల డాలర్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. జాతీయం తరువాత అది 495 కోట్ల డాలర్లకు పెరిగింది.2018 నాటికి దారిద్య్ర రేఖకు దిగువన వున్నవారి సంఖ్య 60 నుంచి 35శాతానికి తగ్గింది. దుర్భరదారిద్య్రంలో ఉన్న వారి సంఖ్య 38 నుంచి 15శాతానికి తగ్గింది. అయినప్పటికీ బలీవియా ఇప్పటికీ పేద దేశంగానే ఉంది. ఈ కారణంగా కొన్ని తరగతుల్లో కొన్ని అంశాలపై అసంతృప్తి తలెత్తింది. దానిని సొమ్ము చేసుకొనేందుకు మితవాద శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయి.
అక్టోబరులో జరిగిన ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలియక ముందే అమెరికా, లాటిన్‌ అమెరికాలోని ఇతర మితవాదశక్తుల నాయకత్వంలోని ప్రభుత్వాలు బొలీవియన్ల ఆకాంక్షలను ప్రతిబింబించని ఫలితాలను తాము గుర్తించబోమని ప్రకటించాయి. 2005కు ముందు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి ప్రపంచ ఆర్ధిక సంస్ధలన్నీ మొరేల్స్‌ వ్యతిరేకులను బలపరిచాయి. సహజవనరులను జాతీయం చేయబోమని ప్రకటించిన శక్తులకు ప్రాతినిధ్యం వహించిన అధ్యక్షుడు కార్లోస్‌ మెసాకు మద్దతు ప్రకటించాయి. 2002లో ఇవో మొరేల్స్‌ అధ్యక్ష పదవికి పోటీచేసినపుడు మొరేల్స్‌ గెలిస్తే ఆర్ధిక సాయంలో కోత పెడతామని బెదిరించాయి. ఈ పూర్వరంగంలో మొరేల్స్‌కు వ్యతిరేకంగా ఎంతటి కుట్రకు తెరలేచిందో అర్దం చేసుకోవచ్చు.

Image result for evo morales disposed in a coup, protests
బొలీవియా పరిణామాల నేపధ్యంలో రాయిటర్స్‌ వార్తాసంస్ధ వెలువరించిన ఒక కథనాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి వుంది.బొలీవియా మాదిరి పరిణామాలు వెనెజులాలో పునరావృతం కావటానికి అక్కడి మిలిటరీ అడ్డుగా ఉందనే శీర్షికతో ఒక కథనాన్ని అందించింది. ఇవో మొరేల్స్‌ మాదిరి వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో రాజీనామా చేసేందుకు అక్కడి ప్రతిపక్ష నాయకులు ఎదురు చూస్తున్నారని, అయితే ఒక కీలకాంశం దాన్ని కష్టతరం గావిస్తున్నదని ఆదివారనాడు బొలీవియా నిరసనకారుల పక్షాన మిలిటరీ చేరిన మాదిరి వెనెజులా మిలిటరీ వ్యవహరించటం లేదని పేర్కొన్నది. దేశంలో ఆర్ధిక వ్యవస్ధ దిగజారుతున్నప్పటికీ 2014,17లో పెద్ద ఎత్తున నిరసన తలెత్తినా, 2018 ఎన్నికల్లో అక్కడి సోషలిస్టు పార్టీకి మిలటరీ మద్దతు ఇచ్చిందని రాయిటర్‌ పేర్కొన్నది.ఈ ఏడాది ఏప్రిల్‌ 30న అనేక మ ంది మిలిటరీ అధికారులు తిరుగుబాటు నేత గురుడోకు మద్దతు ఇచ్చారని అయితే ఉన్నతాధికారులు మదురోకు మద్దతు ఇవ్వటంతో తిరుగుబాటు విఫలమైందని తెలిపింది. వెనెజులా మిలిటరీలో తన వామపక్ష సైద్ధాంతిక భావజాలాన్ని మాజీ అధ్యక్షుడు ఛావెజ్‌ ఎక్కించారని బలీవియా మిలిటరీలో అలాంటి పరిస్ధితి లేదన్న ఒక ప్రొఫెసర్‌ అభిప్రాయాన్ని అది ఉటంకించింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అయోధ్య తీర్పు : అనంతర దృశ్యాలు ?

10 Sunday Nov 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

ayodhya verdict, economic challenges before narendra modi, Narendra Modi, post ayodhya verdict, probable scenario of the post ayodhya verdict

Image result for economic challenges before narendra modi

ఎం కోటేశ్వరరావు
అయోధ్య బాబరీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఒక తీర్పు వెలువరించింది. నిజానికి ఆ కేసు రాముడు ఎక్కడ జన్మించాడు అన్నది కాదు, వివాదాస్పద రెండు ఎకరాల 77సెంట్ల భూమి మీద హక్కులకు సంబంధించిన వాజ్యం మీద అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద దాఖలైన పునర్విచారణ అంశం. దానికి పరిమితం కాకుండా విశ్వాసాలను కలగలపి ప్రభుత్వ భూమి గనుక రాముడికి కేటాయిస్తూ ఇచ్చిన తీర్పు. సరే దీని పర్యవసానాలు, పరిణామాలు ఎలా ఉంటాయన్నది రాబోయే రోజుల్లో నిపుణులు చర్చిస్తారు. ఒక్క ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తప్ప మిగిలిన ముస్లిం సంస్ధలన్నీ కొన్ని మినహాయింపులతో అయినా తీర్పును స్వాగతించాయి. పునర్విచారణ పిటీషన్‌ దాఖలు చేయాలా లేదా అన్నది త్వరలోనే ముస్లిం పర్సనల్‌ లాబోర్డు నిర్ణయిస్తుంది. పిటీషన్‌ దాఖలు చేస్తే ఈ వివాదం మరికొంతకాలం సాగుతుంది. లేకపోతే ఇంతటితో ముగుస్తుంది. న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు తప్ప తీర్పు మంచి చెడ్డల గురించి చర్చించే అవకాశం ఇంకా మన దేశంలో మిగిలే ఉంది కనుక ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. సద్వివిమర్శనాత్మక వైఖరి ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్ధలను మరింత పటిష్ట పరుస్తుందే తప్ప ప్రపంచంలో ఎక్కడా దెబ్బతీసిన దాఖలాలు లేవు. అయితే ప్రభుత్వ విధానాలను విమర్శించటం కూడా దేశద్రోహమే అన్న వైఖరి రోజురోజుకూ పాలకుల్లో బలపడుతున్న కారణంగా ఈ స్వేచ్చ ఎంతకాలం ఉంటుంది అన్నది ఊహాజనితమైన ప్రశ్న.
చరిత్రలో ప్రతి ముగింపు మరో దానికి నాంది కావటాన్ని అనేక పరిణామాల్లో చూశాము. సుప్రీం కోర్టు ఎవరికి ఎలా కనిపించినా అది ఒక నూతన అధ్యాయానికి తెర తీసింది అన్నది నిర్వివాదం. గతంలో అనేక ముఖ్య అంశాలపై ఇచ్చిన తీర్పులు వాటి స్వభావాన్ని బట్టి న్యాయమూర్తుల మీద పూలూ రాళ్లూ కూడా పడ్డాయి. మహాత్మా గాంధీ ప్రస్తావన వచ్చినపుడు ఆయన హంతకుడైన హిందూ మతోన్మాది గాడ్సే పేరును తలవకుండా ఉండలేము కదా ! చరిత్ర పేజీలో ఎవరి అవగాహన మేరకు వారు రాసేందుకు అవకాశం ఉంది కనుక దీని గురించి కూడా అదే జరుగుతుంది. అయోధ్యపై సుప్రీం తీర్పు గురించి గాంధీ ముని మనవడు తుషార్‌ గాంధీ వ్యాఖ్యానిస్తూ మన న్యాయవ్యవస్ధలో విశ్వాసానికి సంబంధించిన నేరం కూడా చేరిందని, మహాత్మాగాంధీ హత్యకేసును ఇప్పుడు గనుక సుప్రీం కోర్టు పునర్విచారణ జరిపితే గాడ్సే హంతకుడే అయితే అతను దేశభక్తుడు కూడా అని తీర్పు చెప్పి ఉండేవారు అని వ్యాఖ్యానించాడు. దీనికి టీకా, తాత్పర్యాలు చెబితే అంత బాగోదు ! అయోధ్య తీర్పు అనంతరం ఏమి జరుగుతుంది ?

పునర్విచారణలో తీర్పును కొట్టి వేస్తే ?
ముస్లిం పర్సనల్‌ లా బోర్డు పునర్విచారణ కోరితే ఐదుగురు సభ్యుల బెంచ్‌ లేదా అంతకంటే ఎక్కువ సభ్యుల బెంచ్‌ గానీ దానిని విచారణ చేయవచ్చు. కోర్టు తీర్పులను ఊహించలేము గనుక పునర్విచారణలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తోసి పుచ్చ వచ్చు లేదా నిర్ధారించనూ వచ్చు, నిర్దారణ ఏక గ్రీవం కావచ్చు లేదా మెజారిటీ ప్రకారమూ కావచ్చు. ఒక వేళ ఇప్పుడిచ్చిన తీర్పును కొట్టి వేసి కొత్త తీర్పు ఇస్తే అది కేంద్రంలో ఉన్న పాలకపక్షానికి అంగీకారం కానట్లయితే ? గతంలో షాబానో కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ సర్కార్‌ మైనారిటీలను సంతృప్తి పరచేందుకు పార్లమెంట్‌ ద్వారా ఆ తీర్పును రద్దు చేసింది. ఇప్పుడు బిజెపి సర్కార్‌కు నచ్చని తీర్పు వస్తే అదేపని చేసి మెజారిటీ పజానీకాన్ని సంతృప్తి పరచవచ్చు.
విశ్వాసాల ప్రాతిపదికన కొత్త డిమాండ్లను ముందుకు తెస్తే ?
ఒక్క అయోధ్య వివాదం తప్ప మిగిలిన ప్రార్ధనా స్ధలాలు 1947 ఆగస్టు 15 నాటికి అంటే స్వాతంత్య్రం వచ్చిన సమయానికి ఏ స్ధితిలో ఉన్నాయో వాటిని అదే విధంగా ఉంచాలని 1991లో కేంద్ర ప్రభుత్వం ప్రార్దనా స్ధలాల ప్రత్యేక అంశాల చట్టం నిర్దేశిస్తోంది. దాని ప్రకారం అప్పటి వరకు ఉన్న కేసులను కోర్టుల నిర్ణయానికి వదలి వేయాలి. మిగతా వాటిని వివాదం చేయటానికి లేదు. దానికి అనుగుణ్యంగానే అయోధ్య కేసును కోర్టు నిర్ణయానికి వదలివేశారు. అయోధ్య తీర్పు ప్రాతిపదికన మధుర, కాశీలోని మసీదులను కూడా దేవాలయాలను కూల్చి నిర్మించినవే అని లేదా లేదా ఇతర ప్రార్ధనా స్దలాల గురించి వివాదాలను ముందుకు తెచ్చినా కోర్టులలో చెల్లవు.
అయితే ఈ చట్టానికి సవరణలు లేదా రద్దు జరగనంత వరకు మాత్రమే ఆ స్ధితి కొనసాగుతుంది. ఒక వేళ ప్రస్తుత పాలకులు లేదా తరువాత వచ్చే వారు గానీ దాన్ని సవరిస్తే ఏమిటి ? ప్రస్తుతం ఊహాగానంగా లేదా మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారని ఎవరైనా అనుకోవచ్చు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు అని సుప్రీం కోర్టు గతంలో తీర్పు చెప్పినప్పటికీ దాన్ని పక్కన పెట్టి తన రాజకీయ అజెండాకు అనుకూలంగా బిజెపి ఒక మౌలిక లక్షణమైన ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తీరు చూసిన తరువాత ఏ రాజకీయ పార్టీ అయినా తన రాజకీయ అజెండాకు అనుగుణంగా ఏ చట్టాన్ని అయినా మార్చే అవకాశం ఉంటుంది అన్నది స్పష్టమైంది. అనేక దేశాలలో పాత రాజ్యాంగాలను మార్చి కొత్త వాటిని ఉనికిలోకి తీసుకు వచ్చారు. ఎన్నడో మధ్యయుగాల్లో, అంతకు ముందో యూదులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే పేరుతో ఇజ్రాయెల్‌ అనే దేశాన్నే ఐక్యరాజ్యసమితి సృష్టించటాన్ని చూశాము. అదే పేరుతో చరిత్రలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే పేరుతో మన రాజ్యాంగాన్ని మార్చి తమ అజెండాను అమలు చేసేందుకు పూనుకోరు అన్న హామీ ఎక్కడుంది.

సంఘపరివార్‌ హిందూత్వ అజెండా పూర్తి అయినట్లేనా ?
మన దేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్నది హిందూత్వశక్తుల లక్ష్యం. అందుకు గాను ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగంగా జనసంఘాన్ని ఏర్పాటు చేసింది. తరువాత దాన్ని జనతా పార్టీలో విలీనం చేసింది. దాన్నుంచి విడదీసి భారతీయ జనతా పార్టీగా మార్చింది. రాజకీయ, ఇతరంగా ఏర్పాటు చేసిస సంస్దల ద్వారా జన సమీకరణకు ఎంచుకున్న అనేక అంశాలలో ఆర్టికల్‌ 370, రామజన్మభూమి, ఉమ్మడి పౌరస్మృతి. వీటిలో రెండింటిని పూర్తి చేశారు.మూడవ దానిని కొంత చేశారు. ఒకసారి వివాదాస్పద అంశాలు పూర్తి అయిన తరువాత అజెండా అయిపోయింది కనుక దుకాణాన్ని మూసుకుంటారు అనుకుంటే పొరపాటు. గుళ్లకు, ఇళ్లకు పరిమితం కావాల్సిస దేవుళ్లను వీధుల్లోకి తీసుకు వచ్చారు. ఇంకా అనేక వివాదాస్పద అంశాల గురించి మాట్లాడుతున్నందున వాటిని ఏ రూపంలో ముందుకు తీసుకు వస్తారో చూడాల్సి ఉంది.

Image result for economic challenges before narendra modi
అయోధ్య తీర్పు అనంతర పర్యవసానాలు ఏమిటి ?
దేశంలో మతాలను నమ్మే వారు, నమ్మని వారు కూడా మతం,ఆలయం, మసీదుల పేరుతో జరిగిన రాజకీయాలు, మారణకాండలను చూసి ఏదో ఒక పరిష్కారం కావాలని కోరుకున్నారు. పెద్ద మనుషుల మాదిరి రెండు పక్షాలను సంతృప్తి పరచేందుకు ఇచ్చిన తీర్పుగా చూసి జనంలో కూడా ఒక సంతృప్తి వ్యక్తం అవుతోంది. మొత్తంగా చూసినపుడు 370 అర్టికల్‌ కంటే రామజన్మభూమి ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే సదరు ఆర్టికల్‌ కాశ్మీర్‌కు చెందినదిగా భావిస్తే రాముడు అనే దేవుడి ఆలయం హిందువులందరూ తమదిగా భావించే స్ధితికి తీసుకువచ్చారు. అది ఒక కొలిక్కి వచ్చింది కనుక. జనం ఇప్పుడు తాము ఎదుర్కొన్న అసలు సమస్యల మీద దృష్టి కేంద్రీకరించే పరిస్ధితులు ఏర్పడతాయి.
అలా కేంద్రీకరించకపోతే జనమే నష్టపోతారు, కేంద్రీకరిస్తే బిజెపి నష్టపోతుంది. నరేంద్రమోడీ కల్పించిన భ్రమల తీవ్రత కారణంగా మూడు సంవత్సరాల క్రితం పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించిన వారిని దేశద్రోహులు అన్నట్లుగా చూశారు. నోట్ల మార్పిడి, బ్యాంకుల్లో వున్న సొమ్ము కోసం పని పాటలు మాని బ్యాంకుల వద్ద బారులు తీరటాన్ని దేశభక్తియుతమైనదిగా పరిగణించారు. మూడేండ్ల క్రితం రొమ్ము విరుచుకొని మతి మాలిన ఆ చర్యను సమర్ధించిన వారిలో ఇప్పుడా పరిస్ధితి లేదు. పకోడీలు అమ్ముకోవటం కూడా ఉపాధి కల్పనే అన్న మోడీ మాటను ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సమర్ధించేవారిని జనం అపహాస్యం చేస్తారు.

ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరపడుతుందా !
రాజకీయ, సామాజిక అంశాలలో వివాదాస్పద అంశాలను ముందుకు తీసుకురావటంలో, అధికారాన్ని పొందటంలో బిజెపి-కాంగ్రెస్‌ ఇతర ప్రాంతీయ పార్టీల మధ్య వివాదాలు, విబేధాలు ఉన్నాయి తప్ప విధానాల పరంగా వామపక్షాలు మినహా అన్నీ ఒక్కటే. మైనారిటీలను ఓటు బ్యాంకుగా చేసుకొనేందుకు కాంగ్రెస్‌ రాజకీయాలు చేసింది. మెజారిటీ జనంతో ఓటు బ్యాంకు ఏర్పాటుకు బిజెపి తెరతీసింది. అంతకు మినహా ఆర్ధిక విషయాల్లో వాటికి తేడా లేదా పంచాయితీ లేదు. అమలు జరపటంలో పోటీ పడుతున్నాయి. ఆవిధానాలే భారీ కుంభకోణాలు, అవినీతి అక్రమాలకు, జన జీవితాలు అతలాకుతలం కావటానికి తద్వారా కాంగ్రెస్‌, కొని ప్రాంతీయ పార్టీల పతనానికి దారి తీశాయి. బిజెపి విషయంలో కూడా అది జరగటానికి ఎంతో సమయం పట్టదు. అచ్చే దిన్‌ బదులు మోడీ విధానాలు జనాలు చచ్చే దినాలకు దారి తీశాయని, రోజు రోజుకూ ముదురుతున్న ఆర్ధిక మందగమనం వెల్లడిస్తోంది. ఆటోమొబైల్‌ రంగంలో కొనుగోళ్లు పడిపోయాయంటే జనం కొత్త మోడళ్ల కోసం కొనుగోలు వాయిదా వేసుకున్నారని చెప్పారు. ఇప్పుడు రోజువారీ వినియోగ వస్తువుల కొనుగోళ్లు, విదేశాల నుంచి దిగుమతులు కూడా పడి పోయాయని వస్తున్న వార్తలకు ఏ సాకు చెబుతారు? అక్టోబరు నెలలో నిరుద్యోగం 8.5శాతానికి పెరిగింది. అంటే మరింత మెరుగైన వాటికోసం జనాలు ఉద్యోగాల్లో చేరటం లేదని సిద్ధాంతీకరిస్తారా ? పని పాటలు లేని యువత కొంత భాగం పక్కదారి పట్టటమే కాదు, సరైనదారి కోసం కూడా ఆలోచించేది కూడా యువతే. ప్రస్తుతం అనేక దేశాల్లో జరుగుతున్న ఆందోళనలో ముందుంటున్నది వారే. ఆ ధోరణి నుంచి మన దేశం ఎలా తప్పించుకోగలదు ? కొందరిని కొంతకాలం మభ్యపెట్టగలరు గానీ అందరినీ ఎలా కాలం మోసగించలేరుగా !

బిజెపి చెబుతున్న జాతీయ వాదం పర్యవసానాలు ఏమిటి ?
బిజెపి ముందుకు తెచ్చిన హిందూత్వ అజెండాలో భాగమే జాతీయ వాదం. ఏ దేశమైనా కుంభకోణాలు, అవినీతి మయంగా మారినపుడు, పాలకుల విధానాల వైఫల్యాలతో ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నపుడు జాతీయ వాదాలను, ప్రజాకర్షక నినాదాలను ముందుకు తేవటం సులభం. అయితే అవి ఎక్కువ కాలం పని చేయవన్నది అంతర్జాతీయ అనుభవం. ఒక దేశం వాటికి దూరంగా ఉండజాలదు. బిజెపి నేతలు ఒక వాదనను ముందుకు తెచ్చారు. మేము ముస్లింలందరినీ ఉగ్రవాదులు అనటం లేదు గానీ, ఉగ్రవాదులంతా ముస్లింలే ఉన్నారు అని చెబుతారు. ఇప్పుడు మన జనం నోళ్లలో నానుతున్న అంశం ఏమంటే పాకిస్ధాన్‌ నుంచి యుద్ధం, ఉగ్రవాద చర్యలు అందరికీ తెలిసినవే గానీ అదేమిటో బిజెపి అధికారంలో ఉన్నపుడు సరిగ్గా అవి ఎన్నికల ముందే జరుగుతున్నాయి అనే చర్చ ప్రతి ఉదంతం సందర్భంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే వాటిని ఆ పార్టీ ఎన్నికల అస్త్రాలుగా, మనోభావాలను రెచ్చగొట్టేందుకు వినియోగిస్తున్న తీరు చూసిన తరువాత బిజెపి అభిమానుల్లో కూడా నాటుకున్న అనుమానం అదే. జాతీయ వాదం పులి స్వారీ వంటిది. పులినెక్కిన వారు దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి లేదా దానికే బలి కావాలి. నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించకుండా జాతీయ వాదాన్ని తిని, జాతీయవాదాన్ని చెప్పి, జాతీయ వాదాన్ని పీల్చి బతకమంటే కుదిరేది కాదు.

కిన్లే బదులు ఆవు మూత్రం తాగి, బాబా గారి సబ్బుల బదులు ఆవు పేడతో స్నానం చేస్తామా ?
దేశభక్తి అంటే ఆవు మూత్రం, ఆవు పేడలో సుగుణాలను అంగీకరించటంగా తయారైంది. నిజానికి అలా చెప్పే వారు రోజూ గోమూత్రం తాగుతూ సబ్బుల బదులు ఆవు పేడతో స్నానం చేస్తున్నారా ? ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ! ప్రధాని నరేంద్రమోడీ గారూ, వారి పార్టీ నేతలూ కాంగ్రెస్‌ 50 ఏండ్లలో సాధించలేని వాటిని మేము ఐదేండ్లలో సాధించాం అని వూరూ వాడా ఎన్నికల ప్రచారం చెశారు. రెండోసారి అధికారానికి వచ్చాక 70 ఏండ్లుగా చేయలేని దానిని 70 రోజుల్లో చేశాం అన్నారు. నీతి ఆయోగ్‌ వుపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ సరిగ్గా ఈ సమయంలోనే 70 సంవత్సరాలలో ఎన్నడూ తలెత్తని అసాధారణ పరిస్ధితి ఏర్పడింది అని వ్యాఖ్యానించారు.
ఆరు సంవత్సరాల క్రితం అంటే 2012, 2013లో రూపాయి విలువ పతనంతో ధరలు పెరుగుతాయని మిగతా వారంతా ఆందోళన పడుతుంటే ‘నేనూ పాలనలోనే వున్నాను(ముఖ్యమంత్రిగా) ఇంత వేగంగా రూపాయి విలువ పడిపోకూడదని నాకు తెలుసు, ఈ విధంగా పతనం కావటానికి కారణం ఏమై వుంటుంది. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి, సమాధానం కావాలని దేశం డిమాండ్‌ చేస్తోంది.రూపాయి ఈ రోజు ఆసుపత్రిలో వుంది, జీవన పోరాటం చేస్తోంది, అని మన్మోహన్‌ సింగ్‌ గురించి నరేంద్రమోడీ అన్నారు. గతేడాది గరిష్టంగా రికార్డు స్ధాయిలో ఒక రోజు రూపాయి విలువ 74.48కి పడిపోయింది. ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ రూపాయి విలువ పతనం వార్త సందర్భంగా ‘ కాలం మారింది. నరేంద్రమోడీ ప్రధాని అయ్యారు. ఇప్పుడు రూపాయి విలువ పతనం అవుతోంది. ఆయనేమీ చెప్పటం లేదు’ అన్నారు.

Image result for economic challenges before narendra modi
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడితే ….. ?
నల్ల ధనం దేశం నుంచి బయటకు పోతున్న కారణంగా రూపాయి విలువ పడిపోతున్నదని 2018 సెప్టెంబరు 23న గోవాలో జరిగిన ఒక సభలో బిజెపి నేత సుబ్రమణ్య స్వామి చెప్పారు. అమెరికా డాలరుతో మన రూపాయి విలువ పతనానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నల్లధనం దేశం నుంచి బయటకు పోతున్నది, రూపాయల సరఫరా ఎక్కువైనపుడు విలువ పతనం అనివార్యం. ‘ అన్నారు. యుపిఏ హయాంలో రూపాయి విలువ పతనం భయానకం అన్న అరుణ్‌ జైట్లీ ఆర్ధిక మంత్రిగా మాట్లాడుతూ ‘ ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివ ద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధ గనుక మనం భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు ‘ అన్నారు.
స్వాతంత్య్రం వచ్చినపుడు రూపాయి విలువ 4.16 అంటే సుబ్రమణ్య స్వామి తర్కం ప్రకారం ఆ రోజు నల్లధనం బాగా వున్నట్లు, అది క్రమంగా తగ్గుతూ వున్న కారణంగా 2004లో 45.32కు పడిపోయింది. నల్లధనాన్ని వెలికి తీసే పేరుతో నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చేసిన ఏడాది విలువ 66.46 అంటే అప్పటికి ఇంకా నల్లధనం తగ్గిపోయింది లేదా బయటకు పోయింది. 2018లో 70.09కి చేరింది. అంటే పెద్ద నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా వున్నట్లే, ఇప్పుడు 72రూపాయలకు చేరింది కనుక నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా పెరిగినట్లే కదా ! బిజెపి వారు ఎది చెబితే అదే దేశ భక్తి, అదే జాతీయవాదం, అదే ఆర్ధశాస్త్రం. దాన్ని నమ్మిన ఆమోదించిన వారు దేశభక్తులు, కాని వారు దేశద్రోహులు. నాడు బ్రిటీష్‌ వారి ద ష్టిలో భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు వంటి వారందరూ దేశ ద్రోహులే. ఇప్పుడు బిజెపి చెప్పేదాన్ని అంగీకరించని వారందరూ దేశ ద్రోహులే.
సంవత్సరం -రూపాయి సగటు విలువ

2004 45.32

2005 44.10

2006 45.31

2007 41.35

2008 43.51

2009 48.41

2010 45.73

2011 46.67

2012 53.44

2013 56.57

2014 62.33

2015 62.97

2016 66.46

2017 67.79

2018 70.09
2019 70.31 (జనవరి నుంచి నవంబరు పదవ తేదీ వరకు సగటు విలువ)

నరేంద్రమోడీ నిజం చెప్పినా జనం నమ్మని రోజులు రాబోతున్నాయి. యుపిఏ పదేండ్ల కాలంలో రూపాయి విలువ ఏడాది సగటు 47.04గా వుంది. అదే నరేంద్రమోడీ 2014-19 మధ్య 66.65కు పతనమైంది. రామాలయ సమస్య ఒక కొలిక్కి వచ్చింది కనుక అప్రకటిత కర్ఫ్యూ, ఆంక్షలతో మూతవేసిన కాశ్మీరును ఎప్పుడు తెరుస్తారు, నిరుద్యోగాన్ని కనీసం ఆరేండ్ల స్ధాయికి ఎప్పుడు తగ్గిస్తారు వంటి ప్రశ్నలన్నీ ఎదురు కానున్నాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆవు కాదు, గాడిద పాలు ‘ బంగారం ‘ !

08 Friday Nov 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP Delip Ghosh, BJP pseudoscience, Cow Milk, Donkey Milk, pseudoscience

Image result for not cow, donkeys milk is gold

ఎం కోటేశ్వరరావు
బిజెపి నేతలు తమ అగ్రజుడు నరేంద్ర మోడీకి నిజంగానే కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే సైన్సు గురించి తాను మాట్లాడి, అనుచరులు కూడా ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడే స్వేచ్చ ఇచ్చారు కదా ! ఆవు పాలల్లో బంగారం ఉందని చెప్పిన బెంగాల్‌ బిజెపి నేత దిలీప్‌ ఘోష్‌ అపర ‘దేశభక్త’ తెగ తండాలో ఉన్నారు కనుక సరిపోయింది.అదే ఆవు దాని పాలు, మూత్రం, పేడ గురించి ఇతర తెగ వారు ఏమైనా మాట్లాడి ఉంటే ….. ?
ఆవు పాలల్లో బంగారం ఉందని చెప్పటంతో బెంగాల్లో ఒక రైతు తన రెండు ఆవులను మనప్పురం బంగారం తాకట్టు కార్యాలయానికి తీసుకుపోయి వాటిని తాకట్టుపెట్టుకొని రుణం ఇవ్వాలని కోరాడట. తనకు ఇరవై ఆవులున్నాయని, రుణం ఇస్తే వ్యాపారాన్ని పెంచుకుంటానని కూడా ప్రాధేయపడ్డాడట. ఆవు పాలల్లో బంగారం లేదు, ఆవులను తాకట్టుపెట్టుకొని ఎవరూ రుణాలు ఇవ్వరని తన దగ్గరకు ఆవులతో సహా వచ్చి తమ ఆవులు రోజుకు 15-16 లీటర్ల పాలు ఇస్తాయని వాటికి ఎంత రుణం వస్తుందంటూ అడుగుతున్న రైతాంగానికి నచ్చచెప్పలేక చస్తున్నానని బెంగాల్‌ హుగ్లీ జిల్లా గార్‌లగ్‌చా పంచాయతీ అధ్యక్షుడు మనోజ్‌ సింగ్‌ వాపోయారు. ఈ పరిస్ధితికి కారకుడైన బిజెపినేత దిలీప్‌ సింగ్‌కు నోబెల్‌ బహుమతి ఇవ్వాలని, ఇదంతా విన్న తనకు ఎంతో సిగ్గుగా ఉందని కూడా అన్నాడు.
బర్ద్వాన్‌ జిల్లాలో ఒక సభలో మాట్లాడిన దిలీప్‌ ఘోష్‌ భారతీయ ఆవులకు మూపురాలు ఉంటాయి, విదేశీ ఆవులు గేదె(బర్రెలు)ల వంటివి. మూపురాల్లో ఒక నరం ఉంటుంది దాన్ని స్వర్ణనారి అంటారు. దాని మీద వెలుగు పడగానే బంగారం తయారవుతుంది. అందువల్లనే ఆవు పాలు పచ్చగా లేదా బంగారం రంగులో ఉంటాయి. ఇలాంటి ఆవు పాలు రోగనిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. మరొక పదార్ధమేదీ తినకుండా కేవలం ఈ పాలు తాగి బతకవచ్చు, ఇది సంపూర్ణ ఆహారం అని దిలీప్‌ ఘోష్‌ చెప్పారు. ఇంకా నయం మూపురాలు హిందూ ఆవులకు మాత్రమే ఉంటాయని చెప్పలేదు. అంతే కాదు ఆవులను చంపటం, పవిత్ర భారత భూమిలో గొడ్డు మాంసం తినేవారిని సంఘవ్యతిరేక శక్తులుగా పరిగణిస్తాం. కొంత మంది మేథావులు రోడ్ల మీద గొడ్డు మాంసం తింటారు, వారు కుక్క మాంసం కూడా తినాలని చెబుతున్నాను నేను, ఏది కావాలనుకుంటే దాన్ని ఇండ్లలో తినమనండి, రోడ్ల మీద ఎందుకు ? ఆవు మన తల్లి వంటిది, ఎవరైనా నా తల్లితో అసభ్యంగా ప్రవర్తిస్తే వారిని ఏమి చెయ్యాలో అదిచేస్తా. దేశీ ఆవులు మాత్రమే మన తల్లుల వంటివి విదేశీవి కాదు. విదేశీ భార్యలను జెర్సీ ఆవులతో పోల్చుతూ కొందరు విదేశీ భార్యలను తెచ్చుకుంటారు, వారంతా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు అని కూడా సెలవిచ్చారు.
బిజెపి దాని మాతృ సంస్ధ సంఘపరివార్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ దేశాన్ని వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్నది. శాస్త్రవేత్తలకు ఏమైంది అన్నది ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ నెల మొదటి వారంలో కొల్‌కతాలో జరిగిన ఐదవ భారత అంతర్జాతీయ సైన్స్‌ ఉత్సవాన్ని ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్సుద్వారా ప్రారంభించారు.అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఉన్న ఆ సమావేశంలో మోడీ ప్రసంగం సందర్భంగా జై శ్రీరామ్‌ అనే నినాదాలు చేయటం, వారిని అడ్డుకున్నవారు లేకపోవటం నిజంగా ఆందోళనకరమే. శాస్త్రవేత్తలైనా మరొకరు ఎవరైనా జై శ్రీరామ్‌ నినాదాలు లేదా భజనలు చేయదలచుకుంటే అందుకు వేరే స్ధలాలు, సందర్భాలు లేవా ?
వేల సంవత్సరాల నాడే ఇంథనంతో నిమిత్తం లేకుండా, పైకి కిందికి ఎలా కావాలంటే అలా ఎగిరే, ఎంత మంది ఎక్కినా మరొకరికి సీటు దొరికే విమానాలు ఉన్నాయని, మనిషికి ఏనుగు తలను అతికించిన పరిజ్ఞానం మన దగ్గర ఎప్పుడో ఉందని చెప్పిన వారిని మన శాస్త్రవేత్తలు గట్టిగా ఎదుర్కొని ఉంటే దిలీప్‌ ఘోష్‌ వంటి వారు ఆవు పాలల్లో బంగారం గురించి , మరొకరు మరొక ఆశాస్త్రీయ అంశం గురించి చెప్పి ఉండేవారా ? ఇలాంటి వాతావరణంలో మన భావి భారత పౌరులు ఏమి నేర్చుకుంటారు? కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తి, అనురక్తి ఎలా కలిగి ఉంటారు. మన దేశాన్ని ఎటువైపు తీసుకుపోవాలనుకుంటున్నారు? సమాజంలో మత ఛాందసాన్ని నింపిన అనేక దేశాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాము, వాటి సరసకు మనలను తీసుకుపోతున్నారు. ఇదే దేశభక్తి అని చెబుతున్నారు. వినాయకుడు పాలు తాగాడంటే గుడ్డిగా నమ్మిన జనాన్ని చూశాము. ఆధునిక ఆవిష్కరణలు, రోబోట్స్‌తో సహా అనేకం మన ప్రాచీన గ్రంధాలలో ఉన్నాయని సభలు పెట్టి మరీ సంఘపరివారం ప్రచారం చేయటాన్ని చూశాము.
బిజెపి నేతలు లేదా ప్రవచన కారులు, ఇతర ప్రముఖులు చెప్పే ఆశాస్త్రీయ అంశాల గురించి నవ్వుకొని వదలి వేస్తున్నారు చాలా మంది. కానీ దీర్ఘకాలంలో అవి చేసే హాని, పర్యవసానాల గురించి ఆలోచించటం లేదు. ఏదో కొంత నిజం లేకపోతే శాస్త్రవేత్తలందరూ ఎందుకు వ్యతిరేకించటం లేదు అనే అర్ధం లేని తర్కంతో నమ్మటమే కాదు, వారే ప్రచారకర్తలుగా మారతారు. ఆవు మూత్రం, పేడ గురించి ఎలా నమ్ముతున్నారో, వాట్సాప్‌లో తిరుగుతున్న అసంబద్ధ సమాచారానికి కారణమిదే. ఇలాంటి సమాచారాన్ని ఎండగట్టే వారు సమాజంలో ఉన్నప్పటికీ అది నిరంతర ప్రక్రియగా సాగటం లేదు. మనం అటువంటి మూర్ఖత్వానికి లోను కాలేదుగా అని తగినంతగా ముందుకు రావటం లేదు.

Image result for not cow, donkeys milk is gold
ఇక దిలీప్‌ ఘోష్‌ గారి పరిజ్ఞానం గురించి చూద్దాం. ఆవు పాలైనా గాడిద పాలైనా పాలు పాలే, ఒకదానిలో బంగారం మరొకదానిలో మట్టి ఉండదు, నిజానికి లీటరు నాలుగువేల రూపాయల వరకు పలుకుతున్న గాడిద పాలే బంగారంతో సమానం అంటే ఆశ్చర్యపడవద్దు. ఇలా చెప్పిన వారిని గోమాతను అవమానిస్తున్నారు, మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు, హైందవ ద్రోహులు, దేశద్రోహులు అని జై శ్రీరాం నినాదాలతో ఎదురు దాడికి దిగినా ఆశ్చర్యం లేదు. అలవిగానివిగా ఉన్న ఆవులు, గాడిదలు రెండింటినీ ముందుగా మచ్చిక చేసుకొని పెంపకం మొదలు పెట్టింది ఆఫ్రికా,ఐరోపాలోని నేటి ముస్లిం దేశాలతో కూడిన ప్రాంతంలో అంటే కొంత మందికి ఏమౌతుందో తెలియదు. కనుక వారి మీద దయతో ఇంతటితో వదలివేద్దాం.
ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ(ఎఫ్‌ఏఓ) ప్రకారం గాడిద పాలు కూడా తల్లిపాలవంటివే.విలువైన విటమిన్స్‌, ఫాటీ యాసిడ్స్‌ ఉన్నాయని, కొన్ని ప్రత్యేక పోషకాహార ఉపయోగాలున్నాయని చెప్పిన అంశంతో ఏకీభవిస్తారా లేకపోతే గాడిద అని తృణీకరిస్తారా ? గాడిదలకూ మనోభావాలు ఉంటాయి, అవి తమవైన శైలిలో తన్నకుండా చూసుకోవాలి మరి !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆర్‌సిఇపి ఒప్పందం : కర్షకులకు కాస్త మోదం -కార్మికులకు తీవ్ర ఖేదం !

07 Thursday Nov 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Labour Reforms INDIA, Labour reforms RCEP, RCEP Farmers, RCEP INDIA, RCEP workers

Image result for rcep
ఎం కోటేశ్వరరావు
‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ‘ ఒప్పందం(ఆర్‌సిఇపి)లో మన దేశం చేరుతుందా లేదా అన్న అంశంపై చివరి క్షణం వరకూ ఉత్కంఠకు గురి చేసి ఇప్పటికైతే చేరటం లేదు అని ప్రధాని నరేంద్రమోడీ దానికి తెరదించారు.మన వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యానికి హాని కలిగించే తద్వారా మన ఆర్ధిక వ్యవస్ధను మరింత దిగజార్చి జనాన్ని ఇబ్బందుల పాలు చేయకుండా తాత్కాలికంగా అయినా నివారించారు. అధికార పార్టీ, కేంద్ర ప్రభుత్వ తీరుతెన్నులు, చివరి నిమిషం వరకూ ఏమి జరుగుతుందో తెలియకుండా యావత్‌ దేశాన్ని ఉంచిన తీరు గత విశ్లేషణల్లో పేర్కొన్నందున చర్విత చరణం చేయనవసరం లేదు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వెనుక పని చేసిన అంశాలేమిటి ? పర్యవసానాలేమిటి ? అనే చర్చ ఇప్పుడు దేశంలో ప్రారంభమైంది. ఒప్పందంలో చేరటానికి ఇంకా తలుపులు తెరిచే ఉన్నందున అంతిమంగా ఒక వైఖరిని ప్రకటించే వరకు ఎవరి అనుమానాలు వారికి ఉండటం సహజం. అప్పటి వరకు మెడమీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఒప్పందంలో చేరితే ఎగుమతుల పోటీని మన రైతాంగం, పరిశ్రమలు, వాణిజ్యం తట్టుకోలేదు, నష్టం అనే కారణాలే వెనుకడుగుకు ప్రధాన కారణం. అయితే ఇది సమాజంలోని కోట్లాది మంది కార్మికులను దెబ్బతీస్తుందా ?
రైతులు, పరిశ్రమలు, వాణిజ్యవేత్తలు ముప్పు తప్పిందిలెమ్మని ఆదమరవ కూడదు. ఒప్పందంలో చేరాలని ఇప్పటికీ వత్తిడి చేసే బలమైన కార్పొరేట్‌ శక్తులు ఉన్నాయని మరచి పోరాదు. గతంలో చేసుకున్న ఒప్పందాలు, అనుసరించిన విధానాలు మన రైతాంగాన్ని నిండా ముంచాయి. వాటిని వెనక్కు తీసుకొనేందుకు, రైతుల జీవితాలను బాగు పరిచేందుకు గత ఐదున్నర సంవత్సరాలుగా తీసుకున్న చర్యలేమీ లేవని గ్రహించాలి. పారిశ్రామిక, వాణిజ్యవేత్తల నుంచి వసూలు చేస్తున్న పన్నులను గణనీయంగా తగ్గించటాన్ని మనం చూశాము. ఇది కార్పొరేట్‌శక్తులకు ఇచ్చిన అతిపెద్ద సబ్సిడీ. మరోవైపున రైతాంగానికి ఇస్తున్న సబ్సిడీలకు కోత పెట్టారు. ఉన్నవాటిని మరింత తగ్గించటం తప్ప కొత్తగా పెంచిందేమీ లేదు. ఇప్పుడు రైతాంగాన్ని మరింత ముంచకుండా చూశారు తప్ప అదనపు మేలేమీ లేదు. మరింతగా దిగజారకుండా చూడటమే గొప్ప మేలు కదా అని ఎవరైనా అంటే వారి మేథకు జోహార్లు.
ఆర్‌సిఇపి ఒప్పందం- మోడీ సర్కార్‌ 2024 ఓట్ల లెక్కలు అనే శీర్షికతో అక్టోబరు 19వ తేదీన కొన్ని అంశాల మీద, ఒప్పంద ఖరారు సమావేశం నవంబరు నాలుగవ తేదీకి ఒక రోజు ముందుగా ‘ఆర్‌సిఇపికి బిజెపి అనుకూలం, కమ్యూనిస్టుల వ్యతిరేకత-ఎవరు దేశ భక్తులు ? అనే శీర్షికతో మరికొన్ని అంశాలను చర్చించాను. దీనికి సంబంధించిన మంచి చెడ్డలను స్ధలాభావం రీత్యా పరిమితంగానే రెండు వ్యాసాల్లో విశ్లేషణ చేశాను.
ఒప్పందం మీద సంతకాలు చేయరాదని నిర్ణయించటం వెనుక ఏ కారణం ఎంత మేరకు పని చేసింది అనే అంశాన్ని పక్కన పెడితే భవిష్యత్‌లో కూడా మోడీ సర్కార్‌ ఇదే వైఖరికి కట్టుబడితే హర్షించాల్సిందే. మోడీ ఈ నిర్ణయానికి రావటానికి కారణాలను మరోసారి చర్చించబోయే ముందు గత రెండు వ్యాసాల్లో ఏమి రాశానో పాఠకులకు గుర్తు చేయటం అవసరం.(ఆసక్తి వున్న వారు పూర్తి వ్యాసాలు ఇక్కడే చదవుకోవచ్చు)
అక్టోబరు 19 వ్యాసంలో ” ఇప్పటి వరకు వెలువడిన సూచనలు, ధోరణులను బట్టి ‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం(ఆర్‌సిఇపి)’ ఒప్పందంపై మన దేశం సంతకాలు చేసే అంశం చివరి నిమిషం వరకు ఉత్కంఠను కలిగించే అవకాశం వుంది. మన ఎగుమతిదార్లకు తగినన్ని రాయితీలు సంపాదించేందుకు ప్రయత్నించి ఒప్పందం మీద సంతకం చేయాలన్న వైఖరితో మన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమేరకు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఒప్పందం మన ఆర్ధిక వ్యవస్ధను మరింతగా దెబ్బతీస్తుందనే అభిప్రాయాల పూర్వరంగంలో మోడీ సర్కార్‌ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు. అధికారిక అభిప్రాయాలు వెల్లడి కాలేదు.
మూడు సంవత్సరాల క్రితం మతిమాలిన పెద్ద నోట్ల రద్దు, తగినంత కసరత్తు లేకుండా జిఎస్‌టి ప్రవేశపెట్టటం, ఇతర కారణాలతో దేశం ప్రస్తుతం రోజురోజుకూ మాంద్యంలోకి కూరుకుపోతోంది. ఈనేపధ్యంలో మోడీ సర్కార్‌ రాజకీయంగా తన లాభనష్టాలను లెక్కవేసుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఒప్పందం వ్యవసాయంతో పాటు అనుబంధ పాడి, సేవా రంగాలను దెబ్బతీస్తుందని రైతు సంఘాలు, ఇతర సంస్ధలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి. నవంబరులో ఆర్‌సిఇపి ఒప్పందం కుదిరితే దాని అంశాలు 2021-22 నాటికి అమల్లోకి వస్తాయి. వాటి ప్రభావం 2023-24లో కనిపిస్తుంది. ఒక వేళ అది ప్రతికూలమైతే ఆ ఏడాది జరిగే ఎన్నికల్లో తమ భవిష్యత్‌ ఏమిటన్నది బిజెపి తేల్చుకోలేకపోతున్నది. పైన చెప్పుకున్నట్లు ఓట్ల లెక్కలు కేంద్ర పాలకులను ప్రభావితం చేస్తాయా? కార్పొరేట్ల వత్తిడిది పై చేయి అవుతుందా చూడాల్సి వుంది. ”
నవంబరు మూడవ తేదీ వ్యాసంలో ఇలా పేర్కొన్నాను ” ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ‘ ఒప్పందం(ఆర్‌సిఇపి)లో మన దేశం సహేతుకమైన ప్రతిపాదనలను చేసిందని ప్రధాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పోస్ట్‌ అనే థారులాండ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఒప్పందం అమల్లోకి వస్తే రాగల ప్రతికూల పర్యవసానాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు, వ్యాపారవేత్తలకు అవేమిటో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. గత నెల రోజులుగా దీని గురించి ఎంతో ఉత్కంఠనెలకొన్నది. ఒప్పందంతో ప్రభావితులయ్యే వారితో బిజెపి చర్చించినట్లు మీడియాలో వార్తలు రాయించుకోవటం తప్ప ఏమి చర్చించారు, సర్కార్‌కు ఏమి సూచించారో తెలియదు. మరోవైపు కేంద్రం ఏమి చెబుతుందా అని ఎదురు చూసిన వారికి ఎలాంటి సమాచారం అందించలేదు. ప్రభావితులయ్యే తరగతులతో అధికారిక చర్చ అసలే లేదు. సోమవారం నాడు సదరు ఒప్పందం మీద సంతకాలు జరగాల్సి ఉంది. ఒక వేళ మన దేశానికి అంగీకారం కానట్లయితే ప్రదాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పర్యటన రద్దయి ఉండేది. అసాధారణ పరిణామాలు జరిగితే తప్ప సంతకాలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది.”

Image result for rcep modi
సమావేశం జరిగిన సోమవారం నాడు ఒప్పందం మీద సంతకాలు చేయరాదని మన సర్కార్‌ నిర్ణయించింది.దీనికి ఓట్ల లెక్కలే ప్రధానంగా పని చేశాయన్నది స్పష్టం. ఒప్పందం ప్రజల జీవనాధారాలను దెబ్బతీస్తుంది కనుక వ్యతిరేకించినట్లు బిజెపి చెప్పింది. ఇది భారత విజయం అని కూడా పేర్కొన్నది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఈ ఒప్పందంలో చేరటం సరైంది కాదని విదేశాంగ వ్యవహారాల శాఖ వ్యాఖ్యానించింది. ఇది మా విజయమే అని కాంగ్రెస్‌ ప్రకటించుకుంది. తాము గట్టిగా వ్యతిరేకత వ్యక్తం చేయటంతో తప్పనిసరై బిజెపి సర్కార్‌ వెనక్కు తగ్గిందని వ్యాఖ్యానించింది. మంత్రులు పియూష్‌ గోయల్‌, అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఇంకా ఇతరులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. మోడీని అభినందించారు. సర్కార్‌ వెనక్కు తగ్గటం వెనుక వత్తిడిలో ఎవరి వాటా ఎంతో తేల్చటం కష్టం గనుక ఆ లెక్కలను వదలి వేద్దాం. తాత్కాలికంగా కొంతకాలం పాటు అయినా రైతాంగం, చిన్న వ్యాపారులు, తోటల రైతాంగం కాస్త ఊపిరి పీల్చుకుంటుంది అనటం నిస్సందేహం.
అయితే అది ఎంతకాలం? ఇంతటితో ఆర్‌సిఇపి కథ ముగిసినట్లేనా ? ఇప్పుడు జరగాల్సింది ఏమిటి ? ఏదో ఒకసాకుతో ముగిసిన అధ్యాయాన్ని తిరిగి ప్రారంభిస్తారా ? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానిద్దాం, హర్షిద్దాం అయితే ముసాయిదా ఒప్పందంలోని ఏఏ అంశాల మీద మన సర్కార్‌ ఎలాంటి సవరణలు కోరింది? అవి ఏమిటో అధికారయుతంగా వెల్లడిస్తే అనేక ఊహాగానాలకు తెరపడుతుంది. ఒప్పందంలో చేరితే చైనా, ఇతర దేశాల నుంచి చౌకగా వస్తువులు మన మార్కెట్‌ను ముంచెత్తుతాయన్న అభిప్రాయాలు, ముంచెత్తుతున్న వాస్తవాలూ పాతవే. వాటిని అరికట్టేందుకు ఏ చర్యలు తీసుకోవాలని మన సర్కార్‌ కోరింది, చైనాతో సహా మిగతా దేశాలు ఎక్కడ విబేధించాయి అన్నది తెలియాల్సి ఉంది.
పదహారు దేశాల కూటమి నుంచి మన దేశం సంతకం చేయటం లేదని ప్రకటించటంతో మిగిలిన దేశాలన్నీ ముందుకు పోవాలని నిర్ణయించాయి. భారత్‌ ఎప్పుడైనా చేరవచ్చని పేర్కొన్నాయి. అంటే ద్వారాలు ఇంకా తెరిచే ఉంచారు. అనేక అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేసిన దేశాలన్నీ ఒకేసారి చేరలేదు. ఏదైనా ఒక ఒప్పందాన్ని సూత్రప్రాయంగా అంగీకరించిన తరువాత ఆయా దేశాల రాజ్యాంగాలను బట్టి వాటికి చట్టసభలు ఆమోద ముద్రవేయాల్సి ఉంటుంది. అందువలన సంతకాల కార్యక్రమం వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది.
అమెరికా ప్రభావంతో మన దేశం వెనక్కు తగ్గిందా ? ఆర్‌సిఇపిని చూపి మన దేశం బేరమాడుతోందా ?
ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక బడా కొర్పొరేట్ల మానస పుత్రిక అనటంలో ఎలాంటి సందేహం లేదు. దానిలో సైబల్‌ దాస్‌గుప్తా అనే వ్యాఖ్యాత చేసిన విశ్లేషణ సారాంశం ఇలా ఉంది.” ఆర్‌సిఇపి ఒప్పందం మీద సంతకం చేయటం అమెరికాకు వ్యతిరేకంగా బల ప్రదర్శన అవుతుంది. ఈ బృందంలో చేరేందుకు భారత్‌ తిరస్కరించటం, తద్వారా దాన్ని బలిష్టం కావించేందుకు తిరస్కరించటాన్ని ఈ రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. భారత్‌ నిర్ణయాన్ని కొంత మేరకు అమెరికా ప్రభావితం చేసిందని చైనా సర్కార్‌తో ముడిపడిపడి వున్న నిపుణులు ఇప్పటికే చెబుతున్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో బేరమాడేందుకు ఈ నిర్ణయాన్ని భారత్‌ ఉపయోగించేందుకు సాధ్యపడుతుంది అని ఏనాన్‌ అకాడమీలో భారత అధ్యయనాల కేంద్రం పరిశోధకుడు మావో కెజీ చెప్పారు. ఇందుకు గాను ట్రంప్‌ యంత్రాంగం భారత్‌కు లబ్ది చేకూరుస్తుందనిగానీ లేదా భారత కంపెనీలతో సామరస్య వైఖరి తీసుకుంటుందని ఎవరూ అనుకోవటం లేదు.
తక్షణ ప్రశ్న ఏమంటే భారత్‌ నుంచి ఔషధాలు ముఖ్యంగా కాన్సర్‌కు సంబంధించి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలన్న చైనా పధకాల మీద మోడీ నిర్ణయం ప్రభావం చూపుతుందా అన్నది. పశ్చిమ దేశాల కంపెనీలతో మాదిరి చైనా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యం లేదా భారత ఉత్పత్తి కేంద్రాలను చైనాలో ఏర్పాటు చేయాలని గానీ చైనీయులు కోరుతున్నారు. ఇందుకు భారత తయారీదారులు ఉత్సాహంగా లేరు.ఔషధాల తయారీ సాంకేతిక పద్దతులను చైనీయులు అపహరిస్తారని భయపడుతున్నారు. ధరలు తక్కువగా ఉండే భారత ఔషధాలకు చైనాలో డిమాండ్‌ పెరుగుతున్నందున తలుపులు మూయటం చైనాకు అంత సులభం కాదు. సంతకం చేయకపోవటం ద్వారా భారత్‌కు జరుగుతుందని చెబుతున్న నష్టం ఏమైనా అది తాత్కాలికమే.” అని దాస్‌ గుప్తా పేర్కొన్నారు.
చైనా, అమెరికా, ఐరోపా యూనియన్‌ దేనితో అయినా బేరమాడేందుకు ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు తప్పు పట్టనవసరం లేదు. అయితే అది మన రైతాంగం, పరిశ్రమలకు మొత్తంగా ఎంతమేరకు ఉపయోగపడుతుందన్నది గీటు రాయిగా ఉండాలి. గతంలో ఆ విధంగా బేరమాడిన పర్యవసానమే నాటి సోవియట్‌ యూనియన్‌ సహకారంతో అనేక ప్రభుత్వ రంగ సంస్ధల ఏర్పాటు, అంతరిక్ష పరిశోధనలకు ఊపు ఇచ్చిన క్రయోజనిక్‌ ఇంజన్ల పరిజ్ఞానం, ఆయుధాలు మనకు అందాయి. వాటితో మనకు కలిగిన లబ్ది తెలిసిందే. ఇప్పుడు అంతా ప్రయివేటీకరణ, ప్రయివేటు రంగం తప్ప ప్రభుత్వరంగం లేనందున జనానికి ఎలా లబ్ది కలిగిస్తారో తెలుసుకోవటం అవసరం.
దేశంలో నెలకొన్న ఆర్ధిక పరిస్ధితిపై ఆందోళనలు వ్యక్తమౌతున్న నేపధ్యంలో ఒప్పందంపై సంతకం చేయరాదన్న నిర్ణయం వెనుక రాజకీయ ప్రాముఖ్యత వుందని మింట్‌ పత్రిక వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. అనుకున్నదాని కంటే రెండు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి పనితీరు తక్కువగా ఉండటం, త్వరలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఈ నిర్ణయం జరిగింది. ఒప్పందం వలన భారత మార్కెట్‌ను ఇతర దేశాలకు తెరవటం తప్ప చైనా వంటి మార్కెట్లలో ప్రవేశానికి ఎలాంటి హామీ లేకపోవటం ఒప్పందం మీద సంతకం చేయకపోవటానికి ఒక ప్రధాన కారణం అని ఒప్పందం గురించి బాగా తెలిసిన ఒకరు చెప్పినట్లు మింట్‌ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.
సిఐఐ ఏమి చెప్పింది ?
ఆర్‌సిఇపిలో మన దేశం భాగస్వామి కానట్లయితే ప్రాంతీయ, ప్రపంచ గుంపులో చేరే ప్రయత్నాలకు నష్టం జరిగి దేశ ఎగుమతులు, పెట్టుబడుల ప్రవాహానికి హాని జరుగుతుందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ(సిఐఐ) ఒప్పంద గడువు సోమవారానికి ఒక రోజు ముందు ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ సంస్ధ దేశంలోని బడా కార్పొరేట్‌ సంస్ధలకు ప్రతినిధి అన్నవిషయం తెలిసిందే. ప్రతి చోటా బడా పెట్టుబడిదారులు-చిన్న పెట్టుబడిదారుల మధ్య ఉండే మిత్రవైరుధ్యం దీనిలో చూడవచ్చు. ఒప్పందం కుదిరిన తరువాత పదహారు భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతుంది. ఎగుమతుల అవకాశాలు దెబ్బతింటాయని సిఐఐ పేర్కొన్నది. చైనా నుంచి ద్వైపాక్షికంగా మనం రాయితీలు పొందటం అన్ని వేళలా ఎంతో కష్టమని తెలిసిందే, ఇప్పుడు ఆర్‌సిఇపిని ఒక అవకాశంగా ఉపయోగించుకోవటంలో మనం వైఫల్యం చెందామని వ్యాఖ్యానించింది. మన పరిశ్రమలోని కొందరు ఈ రోజు ఏమిటని చూస్తున్నారు. ఈ ప్రాంతంలోని సచేతనమైన 15 ఇతర దేశాల్లో ప్రవేశించాలని పదేండ్ల తరువాత వీరే కోరతారని సిఐఐ అధ్యక్షుడు విక్రమ్‌ కిర్లోస్కర్‌ వ్యాఖ్యానించారు. ఒక దేశం ప్రాతిపదికగా మనం ఆందోళన చెందకూడదని దీర్ఘకాలంలో జరిగే ప్రయోజనాన్ని చూడాలన్నారు. ఈ ఒప్పందం గురించి చర్చలు ప్రారంభమైన 2012లో ఇప్పుడు చర్చిస్తున్న అంశాలు లేవని, మొత్తం వ్యవహారమంతా స్వకీయ రక్షణ, చైనా నుంచి రక్షణ గురించి మాట్లాడుతున్నారని కిర్లోస్కర్‌ వ్యాఖ్యానించారు.
నరేంద్రమోడీ సర్కార్‌ చిత్తశుద్ది గురించి ఎవరికీ భ్రమలు ఉండనవసరం లేదు. ఆర్‌సిఇపి ఒప్పందం చర్చల్లో చైనా వస్తువుల గురించి ఒక ప్రధాన సమస్యగా వస్తోంది. వాస్తవం కూడా, అయితే దీనికి బాధ్యులెవరు ? మనకు అవసరమైన వాటిని చైనా నుంచి గాకపోతే అమెరికా లేదా ఐరోపా యూనియన్‌ నుంచి ఎక్కడో ఒక దగ్గర నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. చైనా నుంచి దిగుమతులు లాభసాటి గనుక సైద్ధాంతికంగా బిజెపి సర్కార్‌ చైనాను వ్యతిరేకిస్తున్నా గత ఐదు సంవత్సరాలలో ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులు పెరగటానికి అనుమతి ఇచ్చింది. ఒప్పందంలో చేరితే పాడి రైతాంగం నష్టపోతారు. దీనికి చైనా కాదు, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా అన్నది అందరికీ తెలిసిందే. అదే విధంగా మన వేరుశనగ, ఇతర చమురు గింజల, పామాయిల్‌ రైతులు నష్టపోయేది ఇండోనేషియా, మలేషియాల నుంచి వచ్చే పామాయిల్‌ తప్ప మరొక దేశం నుంచి కాదు. ఒప్పందం జరగక ముందే సుగంధ ద్రవ్యాలు ఇతర దేశాల నుంచి శ్రీలంకకు వచ్చి అక్కడి నుంచి మన మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఒప్పందంలో చేరి ఉంటే మరింతగా వరదలా పారతాయన్నది నిజం. అందుకే రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించారు. దానికి దూరంగా ఉండాలన్న నిర్ణయం మంచిదే. కానీ అంతటితో సమస్య పరిష్కారం అవుతుందా ? వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం సమసి పోతుందా ?
అసలే ఆర్ధిక మందగమనం లేదా మాంద్యం, ఎగుమతులు తగ్గటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న మన దేశానికి వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా కేసు దాఖలు చేసి గెలిచింది. మన ప్రభుత్వం అమలు చేస్తున్న ఎగుమతి రాయితీ లేదా సబ్సిడీ పధకాలను రద్దు చేయాలన్నది ఈనెల ప్రారంభంలో వచ్చిన కేసు తీర్పు సారాంశం. దీని వలన కేవలం ఎగుమతుల కోసమే ఏర్పాటు చేసిన సంస్ధలు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ టెక్నాలజీ పార్కులు, బయో టెక్నాలజీ పార్కులు, ఎగుమతి దారులకు పన్నులేని దిగుమతుల అనుమతులు, ఇలా అనేక పధకాలకు ఇప్పుడు ఇబ్బందులు తలెత్తాయి. దీనికి చైనా కారణం కాదు. తలసరి జిడిపి భారత్‌లో వెయ్యి డాలర్లు దాటింది కనుక ఎగుమతుల ప్రోత్సాహక సబ్సిడీలు ఇవ్వకూడదని కూడా తీర్పులో ఉంది. వరుసగా మూడు సంవత్సరాల పాటు తలసరి జిడిపి వెయ్యి డాలర్లు దాటితే అన్ని రకాల ఎగుమతుల రాయితీలను నిలిపివేయాల్సి ఉంటుంది. ఉక్కు, ఔషధాలు, రసాయనాలు, వస్త్రాలు, దుస్తులు, ఐటి వంటి వాటికి వెంటనే రాయితీలను మూడు నుంచి నాలుగు నెలల్లోగా నిలిపివేయాలని డబ్ల్యుటిఓ మన దేశాన్ని ఆదేశించింది. దీనిపై అప్పీలుకు ఒక నెల గడువు ఇచ్చింది.

Image result for labour reforms india protest citu
అమెరికా వంటి దేశాలు మనలను ప్రపంచవాణిజ్య సంస్ధలో ఇలాంటి ఇబ్బందులను పెడుతుంటే మరోవైపున ఏమి జరుగుతోందో చూద్దాం. ఎగుమతుల్లో పోటీ పడాలంటే పారిశ్రామికవేత్తలకు చౌకగా వస్తువులు తయారు కావాలి. అందుకు గాను మన దేశంలో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని, కార్మిక చట్టాలు ఆటంకంగా వున్నాయని, వేతనాలు ఎక్కువగా ఉన్నాయనే వాదనలను ముందుకు తెస్తూ ఆ రంగాలలో మార్పులను డిమాండ్‌ చేస్తున్నారు. సంస్కరణల పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ అందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు వేతనాలపై నవంబరు ఒకటి ఒక ముసాయిదా పత్రాన్ని తయారు చేసి దాని మీద డిసెంబరు ఒకటిలోగా అభిప్రాయాలు తెలపాల్సిందిగా కార్మిక సంఘాలను కోరింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన బిఎంఎస్‌కే అవి మింగుడుపడలేదు. అనేక లోపాలు వున్నాయని, కొన్ని అంశాల మీద స్పష్టత లేదని చెప్పాల్సి వచ్చింది. వేతనాల గురించి స్పష్టత ఇవ్వలేదు గానీ రోజుకు తొమ్మిది గంటలను పని వ్యవధిగా చేయాలనే ప్రతిపాదన చేశారు. వేతన నిర్ణాయక సంఘాలలో కార్మిక సంఘాలకు ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్యం గురించి ముసాయిదా పత్రంలో ప్రతిపాదన లేదు. ఎగుమతుల కోసం లేదా వస్తువులు చౌకగా తయారు అయ్యేందుకు కార్మికుల మీద భారాలు మోపటం ఏమిటి ? కర్షకులను మరింత ఇబ్బందుల పాలు కాకుండా ఆర్‌సిఇపిలో చేరేందుకు నిరాకరించినందుకు సంతోషించాలా? అదే సమయంలో కార్మికులపై భారాలు మోపేందుకు, వారి ప్రయోజనాలను దెబ్బతీసేందుకు పూనుకున్నందుకు ఆగ్రహించాలా ? కార్మికులు, కర్షకులు మిత్రులే తప్ప శత్రువులు కాదు, ఒకరి ప్రయోజనాలకు ఒకరు బాసటగా ఉండాల్సిన సమయం ఆసన్నమైనట్లు అనిపించటం లేదూ !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆర్‌సిఇపికి బిజెపి అనుకూలం, కమ్యూనిస్టుల వ్యతిరేకత – ఎవరు దేశ భక్తులు !

03 Sunday Nov 2019

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

BJP on RCEP, CPI(M) on RCEP, RCEP, RCEP INDIA, RCEP Narendra Modi, Regional Comprehensive Economic Partnership (RCEP)

Image result for rcep
ఎం కోటేశ్వరరావు
‘ ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ‘ ఒప్పందం(ఆర్‌సిఇపి)లో మన దేశం సహేతుకమైన ప్రతిపాదనలను చేసిందని ప్రధాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పోస్ట్‌ అనే థారులాండ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఒప్పందం అమల్లోకి వస్తే రాగల ప్రతికూల పర్యవసానాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు, వ్యాపారవేత్తలకు అవేమిటో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. గత నెల రోజులుగా దీని గురించి ఎంతో ఉత్కంఠనెలకొన్నది. ఒప్పందంతో ప్రభావితులయ్యే వారితో బిజెపి చర్చించినట్లు మీడియాలో వార్తలు రాయించుకోవటం తప్ప ఏమి చర్చించారు, సర్కార్‌కు ఏమి సూచించారో తెలియదు. మరోవైపు కేంద్రం ఏమి చెబుతుందా అని ఎదురు చూసిన వారికి ఎలాంటి సమాచారం అందించలేదు. ప్రభావితులయ్యే తరగతులతో అధికారిక చర్చ అసలే లేదు. సోమవారం నాడు సదరు ఒప్పందం మీద సంతకాలు జరగాల్సి ఉంది. ఒక వేళ మన దేశానికి అంగీకారం కానట్లయితే ప్రదాని నరేంద్రమోడీ బ్యాంకాక్‌ పర్యటన రద్దయి ఉండేది.ఆయన అక్కడకు చేరుకొని ఎర్రతివాచీ స్వాగతం పొందారు. రెండవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు ఆసియన్‌ దేశాల శిఖరాగ్ర సభ, ఆర్‌సిఇపి శిఖరాగ్ర సమావేశం జరగనున్నాయి. అసాధారణ పరిణామాలు జరిగితే తప్ప సంతకాలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది.
పారదర్శకత గురించి కొందరు ఎంత ఎక్కువగా చెబుతారో అంత ఎక్కువగా తెరవెనుక పనులు చేస్తారనేది అందరికీ తెలిసిన సత్యం. అలాంటి వారు చేసేది చెప్పరు-చెప్పింది చేయరు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేస్తామని బిజెపి ఎన్నడూ చెప్పకుండా ఆ పని చేయటం అందుకు నిదర్శనం. ఆర్‌సిఇపి ఒప్పందం విషయంలో కూడా నరేంద్రమోడీ సర్కార్‌ అదే పని చేస్తోందా ? 2017లో మోడీ ఏర్పాటు చేసిన నీతి అయోగ్‌ పత్రం కూడా ఒప్పందం మీద హెచ్చరికలు చేసింది. వ్యతిరేకతను వ్యక్తం చేసింది. అలాంటి దాని గురించి పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ జరపలేదు. నిజానికి ఈ ఒప్పందంలోని అంశాలు పెద్ద నోట్ల రద్దు వంటి రహస్యమైనవేమీ కాదు.ఏ ఏ అంశాలను అంగీకరిస్తే ఎలా నష్టం జరుగనుందో ఇప్పటికే చర్చ జరిగింది. ఏఏ వస్తువుల మీద మన దేశం పన్నులను ఎంతమేరకు తగ్గిస్తుంది, వేటిని మినహాయిస్తుంది అనేది వెల్లడి కావాల్సి ఉంది. వీటిి మీద ప్రభుత్వం తన వైఖరిని చెప్పలేదు, రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోలేదు. ఒప్పందాన్ని మన దేశం అంగీకరించరాదని కోరుతూ 250 రైతు సంఘాలతో కూడిన ఐక్యవేదిక ఆందోళనకు పిలుపు నిచ్చింది. సోమవారం నాడు ప్రదర్శనలు జరగనున్నాయి. సిపిఎం దీనికి మద్దతు ప్రకటించింది. సంతకాలు చేయరాదని డిమాండ్‌ చేసింది. ఆరెస్సస్‌ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. అయినా ఏ అంశాలను కేంద్రం అంగీకరించిందో, వేటిని వ్యతిరేకించిందో జనానికి ఇంతవరకు తెలియదు. అంగీకరించిన వాటితో ఎలా లబ్ది చేకూరనుందో, ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడతాయో, వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏమి చేయనుందో జనానికి చెప్పాలా లేదా ?

Image result for rcep
పదహారు దేశాలు, 360కోట్ల జనాభా వున్న ప్రాంతాలతో కూడిన ఈ ఒప్పందం ప్రపంచంలో అతి పెద్ద స్వేచ్చావాణిజ్య అవగాహనగా చరిత్రకెక్కనుంది.2012లో ప్రారంభమైన ఈ చర్చలు భారత్‌ సంతకం చేస్తే సోమవారం నాటితో మరో అధ్యాయానికి నాంది పలుకుతాయి. మన దేశానికి సంబంధించి రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్న ఈ ఒప్పందం గురించి కేంద్రం రాష్ట్రాలను సంప్రదించకపోవటం రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులను బాహాటంగా ఉల్లంఘించటంతప్ప మరేమీ కాదని ప్రముఖ ఆర్ధికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ అన్నారు. ఒప్పందంపై సంతకం చేయటానికి బదులు దాన్ని బహిర్గత పరచాలని, రైతులతో సంప్రదింపులు జరపాలని రైతు సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ డిమాండ్‌ చేసింది.ఈ ఒప్పందం అమల్లోకి వస్తే కేరళ తోటల రైతాంగం అందరికంటే ఎక్కువగా నష్టపోనుంది. ఈ కారణంగానే అక్కడి ఎల్‌డిఎఫ్‌ సర్కార్‌ వ్యతిరేకత తెలిపింది. ఇప్పటికే వియత్నాం నుంచి శ్రీలంక ద్వారా వస్తున్న మిరియాల కారణంగా వాటి ధరలు దారుణంగా పడిపోయాయి. కొబ్బరి, రబ్బరు, పామ్‌ ఆయిల్‌, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు తదితర పంటలకు తీవ్రమైన పోటీ ఎదురు కానుంది. ఇప్పటి వరకు అనేక దేశాలు చివరికి ఐరోపా యూనియన్‌-అమెరికా మధ్య స్వేచ్చావాణిజ్య ఒప్పందాల నుంచి కూడా వ్యవసాయాన్ని మినహాయించారు.

Image result for rcep
దేశీయ ఉత్పత్తిదారుల సామర్ధ్యాలను పెంచకుండా ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తే ప్రతికూల ప్రభావాలు పడతాని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బిఐ) పరిశోధన నివేదిక కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.2018-19లో ఆర్‌సిఇపిలోని పదకొండు దేశాలతో మనకు వాణిజ్య లోటు 107.28 బిలియన్‌ డాలర్లు ఉంది. ఇతర దేశాలతో కూడా కలిపి చూస్తే మొత్తంగా మన వాణిజ్య లోటు 184బిలియన్‌ డాలర్లు. ఆర్‌సిఇపి దేశాలకు మన ఎగుమతులు 21శాతం జరగ్గా మన దిగుమతులు ఈ దేశాల నుంచి 34శాతం వున్నాయి. మన వాణిజ్యం వ్యవసాయం, సంబంధిత ఉత్పత్తులు, దుస్తులు, ఆభరణాల వంటి వాటిలో మాత్రమే మిగులు ఉంది. మొత్తం వాణిజ్యంతో పోలిస్తే అది నామమాత్రమే. ఈ ఒప్పందంలో మన దేశం భాగస్వామి అయితే ఈ మిగులు కూడా హరించుకుపోయి లోటు ఇంకా పెరుగుతుందని ఎస్‌బిఐ నివేదిక చెప్పింది.
సంప్రదింపుల్లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా విజయం సాధిస్తే మనం పాల ఉత్పత్తుల దిగుమతుల మీద పన్నులు తగ్గిస్తే అది మరింత నష్టదాయకమని కూడా ఎస్‌బిఐ హెచ్చరించింది. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను మనం ఉపయోగించుకోవటం 25శాతానికి లోపుగానే ఉందని కూడా పేర్కొన్నది. అయితే ఒప్పందంలో భాగస్వామి కాకపోయినా మన దేశానికి నష్టమే అని ఎగుమతులు కష్టమౌతాయని కూడా తెలిపింది.
ఆర్ధికవేత్త సూర్జిత్‌ ఎస్‌ భల్లా నాయకత్వంలోని హైలెవెల్‌ అడ్వయిజరీ గ్రూప్‌(హెచ్‌ఎల్‌ఏజి) బృందం ఆర్‌సిఇపి ఒప్పందం మీద సంతకాలు చేయాలని సూచించింది. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల గురించి నిరంతరం తెలియ చేస్తూ వాటిని ఉపయోగించుకోవాలని కోరింది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వశాఖ కోరిక మేర తన సిఫార్సులు, ఇతర అంశాల గురించి ఈనివేదికను రూపొందించారు. అయితే ఇది అందచేసే సమయానికే మన అధికారులు, మంత్రులు బ్యాంకాక్‌ తరలివెళ్లారు. ఒప్పందం మీద సంతకాలకు ఒక సాకుగా దీన్ని ఉపయోగించుకోనున్నట్లు కనిపిస్తోంది.
1991లో ప్రారంభమైన నూతన ఆర్ధిక విధానాల కారణంగా మన వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం లక్షలాది మంది రైతుల బలవన్మరణాలకు కారణాలలో ప్రధానమైనది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో తలెత్తిన సమస్యలు ఇంకా అపరిషతృంగానే ఉన్నాయి. రైతుల్లో మరింత ఆగ్రహం తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ యోజన పేరుతో ఏటా ఆరువేల రూపాయల నగదు సాయాన్ని అందచేస్తున్నది. ఇదేమీ శాశ్వత పధకం కాదు. ఆర్‌సిఇపి ఒప్పందం అమలులోకి వస్తే మన వ్యవసాయ రంగ సంక్షోభం మరింత తీవ్రం కావటం అనివార్యం.అది గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తిని మరింత తీవ్రంగా ప్రభావితం చేయనుంది.
ఈ ఒప్పందానికి తెరలేపింది కాంగ్రెస్‌ అయితే బిజెపి తెర దించనుంది. రెండు పార్టీలూ దీన్నుంచి రాజకీయ లబ్దిపొందేందుకు చూస్తున్నాయి. అధికారంలో ఉండగా ఒప్పందానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. నవంబరు ఐదు నుంచి ప్రదర్శనలకు పిలుపు ఇచ్చింది. అప్పుడేం చేశారని బిజెపి ఎద్దేవా చేస్తోంది తప్ప తన వైఖరి ఏమిటో చెప్పదు. ప్రతిపక్షంలో ఉండగా, ఇప్పుడు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ మంచ్‌ ఈ ఒప్పందానికి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నది తప్ప బిజెపిని ఒప్పించలేకపోయింది. ఈ ఒప్పందాన్ని అందరూ వ్యతిరేకించటం లేదమ్మా అంటూ బిజెపి నేతలు ఇతరుల మీద నెపాన్ని నెడుతున్నారు. మరీ ఎక్కువ లొంగిపోవద్దబ్బా అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. మొత్తం మీద అసలు విషయం చెప్పకుండా గత నెల రోజులుగా కేంద్ర పాలకులు, అధికారపక్షం మీడియాకు లీకులతో కాలం గడిపింది.
ఇక మిగతా దేశాల విషయానికి వస్తే ఒక వేళ భారత్‌ సంతకం చేయకున్నా మనం ముందుకు పోవాల్సిందే అని మలేషియా ప్రధాని మహతిర్‌ మహమ్మద్‌ జూన్‌లోనే వ్యాఖ్యానించాడు. గణనీయంగా దిగుమతి పన్నులు ఉన్నప్పటికీ ఇప్పటికే ఇండోనేషియా, మలేషియాల నుంచి వస్తున్న పామాయిల్‌ మన దుకాణాల్లో నిండిపోతోంది. ఈ ఒప్పందంలో చేరితే పన్నులను రద్దు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు తక్కువ ధరలకు లభించవచ్చు, వ్యాపారులకు లాభాల పంట పండవచ్చుగానీ మన రైతాంగ పరిస్ధితి, మన దేశం నుంచి తరలిపోయే డబ్బు సంగతేమిటి? న్యూజిలాండ్‌,ఆస్ట్రేలియాల నుంచి వచ్చే పాల ఉత్పత్తులతో పాల రైతాంగ పరిస్ధితి అగమ్యగోచరం. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో పంట, ఉత్పత్తుల రైతాంగం ప్రభావితం అవుతారు. బిజెపి చెప్పే గోమాత పవిత్రత సంగతి ఎలా ఉన్నా ఆవుపాలతో రాజస్ధాన్‌లో ఇంకా అనేక ప్రాంతాలలో అనేక కుటుంబాలు తమ అవసరాలు తీర్చుకుంటున్నాయి. పది కోట్ల మంది రైతులకు పాల రాబడి ఒక వనరుగా ఉన్నట్లు అంచనా.
ఇప్పుడు నరేంద్రమోడీకి మరో పెద్ద సమస్య వచ్చింది. ఆయన అంతర్జాతీయ నాయకుడని, అనేక అంశాలను ప్రభావితం చేస్తున్నారని, పెద్ద ఆర్ధిక నిపుణుడన్నట్లుగా ఇంతకాలం ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రపంచ జనాభాలో సగానికి ప్రాతినిధ్యం వహించే దేశాల ఒప్పందంపై సంతకం చేయకపోతే ఆయన ప్రతిష్టకు దెబ్బ అని వ్యాఖ్యానిస్తున్నవారు లేకపోలేదు. చేస్తే దేశీయంగా రైతాంగం, ఇతర తరగతుల ప్రజానీకం నుంచి వేరుపడిపోతే అసలుకే మోసం వస్తుంది అన్నది చెప్పుకోలేని సంశయం. ఒప్పందం మీద సంతకం చేస్తే చైనా, ఇతర దేశాల నుంచి ఒక్క వ్యవసాయ ఉత్పత్తులే కాదు, అన్ని రకాల వస్తువులు వెల్లువలా మన మార్కెట్‌ను ముంచెత్తుతాయి. పోనీ ఈ ఒప్పందానికి దూరంగా అమెరికా, ఇతర ఐరోపా దేశాలతో చేతులు కలిపితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని చూస్తే అవన్నీ కూడా మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌- మాయింటి కొస్తే మాకేం తెస్తావ్‌ అనే రకాలు తప్ప మనకు సాయపడేవి కాదు. ఎగుమతి ఆధారిత అభివృద్ధి అనే ఒక దివాలా కోరు ఆర్ధిక విధానాన్ని అనుసరిస్తున్న (మేకిన్‌ ఇండియా అంటే అదే) మోడీ సర్కార్‌ ఈ ఒప్పందంలో చేరకపోతే మన ఎగుమతులు ఇంకా పడిపోయేందుకు దోహదం చేసినట్లు అవుతుంది. ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధను రూపొందిస్తా అని చెప్పిన గొప్పల గురించి జనం అడిగితే పరిస్ధితి ఏమిటి అనే మనో వ్యాధి పట్టుకుంది. ఒప్పందంలో చేరక ముందే మన ఆర్ధిక వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోయింది. ఇక విదేశాల నుంచి వస్తు దిగుమతులు మరింత పెరిగితే మన పరిశ్రమలు, వ్యవసాయం మూతపడుతుంది. ఇప్పటికే 8.5శాతానికి చేరిన నిరుద్యోగం మరింత పెరుగుతుంది.

Image result for bjp cpim
ఇప్పటి వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎంతగా రెచ్చగొట్టాలో అంతగా చేయాల్సింది చేశాయి. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఆర్‌సిఇపిలో చైనాదే ప్రధాన పాత్ర. చైనా వస్తువులను బహిష్కరించండి అంటూ ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నది వారే. కనీసం చైనా నుంచి వచ్చే సగం వస్తువులనైనా అడ్డుకోవాలన్నది కొందరి వత్తిడి.అలాంటి చైనాతో కలసి ఒప్పందం చేసుకోవటం ఏమిటన్నది వారికి మింగుడుపడటం లేదు. ఈ విషయంలో నరేంద్రమోడీ తక్కువేమీ తినలేదు. వాణిజ్య, పారిశ్రామికవేత్తల వత్తిడికి లంగి తన కుర్చీని కాపాడుకొనేందుకు చైనాతో సయోధ్యకు ముందుకు పోక తప్పని స్ధితి.మన దేశంలోని కమ్యూనిస్టులు చైనా అనుకూలురనే ప్రచారం చేస్తున్నది కూడా కాషాయ దళాలే అన్నది తెలిసిందే. ఇప్పుడు ఆ కమ్యూనిస్టులు ఈ ఒప్పందంపై సంతకాలు చేయరాదని డిమాండ్‌ చేస్తున్నారు. బిజెపి దేశభక్తి, స్వదేశీ అనుమానంలో పడింది.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కోర్టుకు హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు నిరాకరణ, ముందుకు తెచ్చిన కొన్ని సమస్యలు !

02 Saturday Nov 2019

Posted by raomk in AP NEWS, Current Affairs, History, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Andhra CM’s DA case, CBI court rejects Andhra CM’s exemption application, YS jagan

Image result for Andhra CM’s DA case

ఎం కోటేశ్వరరావు
ఆర్థిక నేరాల కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దాఖలు చేసిన వినతిని హైదరాబాద్‌ నాంపల్లి సిబిఐ కోర్టు తిరస్కరించింది. ఈ పరిణామం ఆలోచించాల్సిన కొన్ని అంశాలను ముందుకు తెచ్చింది. మినహాయింపునకు కోరిన కారణాలతో పాటు అభ్యంతరానికి చెప్పిన కారణాలు కూడా విచిత్రంగానే ఉన్నాయి. సీఎంగా బిజీగా ఉన్నందున, ప్రతివారం హైదరాబాద్‌ వచ్చి వెళ్లాలంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని అందుకే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్‌ కోరారు.
జగన్‌ పిటిషన్‌ విచారణకు అర్హమైందే కాదని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ సిబిఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఛార్జిషీట్లు దాఖలై ఆరేళ్లయినా విచారణ ప్రారంభం కాలేదని ఆయన ఏదో ఒక కారణంతో విచారణను జాప్యం చేస్తారని, జగన్‌ పిటిషన్‌లో పేర్కొన్న ఏపీ పునర్విభజన, గత ప్రభుత్వ పనితీరు అంశాలు ఈ కేసుతో సంబంధం లేనివని, జగన్‌ వ్యక్తిగత హౌదాలోనే నిందితుడిగా ఉన్నారని, ఆయనపై నమోదైన అభియోగాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావితం చూపుతాయని, విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్‌లోని కోర్టుకురావడం పెద్ద కష్టమేం కాదని వాదించింది. ఎంపీగా ఉన్నప్పుడే సాక్ష్యాల్ని తారుమారు చేస్తారనే ఉద్దేశంతో ఆయన్ను గతంలో అరెస్టు చేశామని. ఇప్పుడు అందుకు ఆస్కారం ఎక్కువ ఉందని, కేసులో సాక్షులుగా ఉన్న అధికారులు సీఎంగా ఉన్న జగన్‌ అధీనంలోనే ఉన్నారని వాదించింది.
అత్యవసర పరిస్థితి ఏదైనా తలెత్తితే ఆ రోజు మినహాయింపు కోరవచ్చని సూచించింది. ప్రభుత్వ విధుల్లో ఉన్నందున మినహాయింపు ఇవ్వాలనడం రాజ్యాంగ విరుద్ధం, చట్టం ముందు అందరూ సమానులేనని సీబీఐ పేర్కొంది.
సిఎం పదవిలో ఉన్నందున వారానికోసారి హైదరాబాద్‌ కోర్టుకు రావటం ఇబ్బంది అనటం పొసగని వాదన. రాజధాని, సచివాలయాన్ని వదలి ముఖ్యమంత్రి విదేశీ, రాష్ట్రేతర, రాష్ట్రంలో జిల్లాల పర్యటనలు జరుపుతున్నపుడు లేని ఇబ్బంది కోర్టుకు వచ్చినపుడు కొత్తగా వచ్చేదేమిటో తెలియదు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఐదుగురు ఉప ముఖ్య మంత్రులను నియమించుకున్న సిఎంకు నిజానికి వెసులు బాటు ఎక్కువగా వుంటుంది. రాజధాని వదలి వెళ్లిన సమయాల్లో ఏదైనా అసాధారణ సమస్య తలెత్తితే విధానపరమైన అంశాలు మిగిలిన రోజువారీ అంశాలపై చర్యలు తీసుకొనేందుకు అధికార యంత్రాంగం, మంత్రులకు ఆ బాధ్యతలను అప్పగించవచ్చు. రెండవది ఖర్చు గురించిన అంశం. ఒక వ్యక్తిగా ఉన్నపుడు దాఖలైన కేసును ఎదుర్కొనేందుకు జనం సొమ్మును ఎందుకు ఖర్చు చేయాలి ? ముఖ్యమంత్రి కుటుంబంతో సహా జెరూసలేం సందర్శించినపుడు ఖర్చును స్వయంగా భరించినట్లు చెప్పారు. వ్యక్తిగత కేసుల విషయంలో కూడా స్వంత ఖర్చుతోనే కోర్టులకు హాజరు కావాలి కదా ? గవర్నర్‌ మాదిరి ముఖ్యమంత్రికి మినహాయింపులు లేనపుడు ఖర్చులు భరించటానికి అనుమతి సరైనదేనా ? స్వంత ఖర్చుతోనే కోర్టుకు వెళ్లాలి కదా !
సిబిఐ వాదనను కోర్టు అంగీకరించి జగన్‌ వినతిని తిరస్కరించింది. దాని గురించి పై కోర్టులకు వెళతారా లేక కోర్టు ఆదేశాన్ని పాటించి హాజరవుతారా అన్నది వేరే అంశం. ఇక్కడ న్యాయమూర్తులకు ఎలాంటి దురుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు. ఇక సీబీఐ వాదన తీరుతెన్నులను చూద్దాం. వారానికోసారి విచారణ నుంచి హాజరు కాకుండా మినహాయింపు ఇస్తే జగన్‌ సాక్షుల్ని ప్రభావితం చేస్తారనడం అసంగతంగా ఉంది. ఎంపీగా ఉన్నప్పుడే సాక్ష్యాలను తారు మారు చేసే బలం జగన్‌కు ఉందని అందుకే అరెస్ట్‌ చేశామని సీబీఐ చెప్పింది. ఇప్పుడు సీఎం హౌదాలో ఉన్న జగన్‌ మరింత బలపడ్డారు. సిబిఐ వాదన ప్రకారం సాక్ష్యాలను తారు మారు జరిగితే ఇప్పటికే జరిగి ఉండాలి. అయినా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరైతే అలాంటి అక్రమాన్ని ఎలా అడ్డుకుంటారో సామాన్యులకు అర్ధం కావటం లేదు. వారంలో ఆరు రోజులు అలాంటి అవకాశం ఇచ్చి ఏడో రోజు అడ్డుకుంటారా ?
ఇక ముఖ్యమంత్రులు ఎడతెగని పనిలో ఉంటారు కనుక కోర్టులకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వాదన మీద ఢిల్లీ హైకోర్టు రెండు రకాల తీర్పులు ఇచ్చింది. బిజెపి నేత మీద కాంగ్రెస్‌ నేత షీలా దీక్షిత్‌ ఒక పరువు నష్టం కేసు వేశారు. ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక పని వత్తిడిలో ఉంటారని అందువలన కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె న్యాయవాది కోర్టును కోరారు. అందుకు తిరస్కరించిన కోర్టు ఆమె హాజరు కానట్లయితే కేసు కొట్టివేస్తామని స్పష్టం చేసి తదుపరి వాయిదాకు రావాలని అదేశించింది. రెండు పరువు నష్టం కేసుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీవాల్‌ కేసు తేలేవరకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కానవసరం లేదని ఆ రాష్ట్ర హైకోర్టు, మెట్రోపాలిటన్‌ కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిచినపుడు కోర్టుకు వస్తామని హామీ ఇవ్వాలని కేజరీవాల్‌ను హైకోర్టు కోరింది.తన పరోక్షంలో కేసు విచారణ కొనసాగించవచ్చని రాసివ్వాలని కోరింది. ఇది తమనేతకు ఎందుకు వర్తించదు అని వైసిపి శ్రేణులు ప్రశ్నించవచ్చు. కేజరీవాల్‌ది పరువు నష్టం కేసు, జగన్‌ది అవినీతి అక్రమాల కేసు అనేతేడా తప్ప ఇద్దరూ నిందితులే, ఇద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నవారే. ఒకే చట్టం ఇద్దరు ముఖ్యమంత్రుల విషయంలో భిన్నమైన అన్వయం.

Image result for Andhra CM’s DA case
కేజరీవాల్‌ అయినా, జగన్‌ అయినా ప్రతి ప్రజాప్రతినిది అనే కారణం చూపి అటువంటి మినహాయింపు కోరితే చట్టం ముందు అందరూ సమానులే అనే దానికి అర్ధం ఏమిటి అన్నది ప్రశ్న. ఈ కేసులకు ముఖ్యమంత్రి పదవికి సంబంధం లేదు. వ్యక్తిగత స్ధాయిలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాబరీ మసీదు కూల్చివేత సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న బిజెపి నేత కల్యాణ్‌ సింగ్‌ ఆ కేసులో నిందితుడు. అలాంటి వ్యక్తిని కేంద్ర బిజెపి సర్కార్‌ గవర్నర్‌గా నియమించటం నైతికమా అనైతికమా అన్నది ఒక అంశం. గవర్నర్‌ పదవిలో ఉన్నారు కనుక రాజ్యాగంలోని ఆర్టికల్‌ 361కింద గత ఐదు సంవత్సరాలుగా మసీదు కూల్చివేత కేసులో కోర్టుకు హాజరు కావటానికి కల్యాణ్‌ సింగ్‌కు మినహాయింపు లభించింది. ఆ పదవి కాలం అయిపోగానే ఆయన కోర్టుకు రాకతప్పదని సిబిఐ పేర్కొన్నది. ముఖ్యమంత్రికి అటువంటి మినహాయింపులు లేకపోవటం లోపమా లేక ప్రజాస్వామ్య బద్దమా అన్న అంశాన్ని చర్చించాలి. గవర్నర్‌తో సహా ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే వారు ఎదుర్కొంటున్న ఆరోపణలు ప్రజా ప్రయోజనాలకోసం చేసిన పనుల పర్యవసానాలు కాదు.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !
  • మనవాళ్లు వట్టి వెధవాయి లోయి అన్న గిరీశాన్ని గుర్తుకు తెస్తున్న వాట్సాప్‌ పండితులు !
  • బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !
  • వైవిధ్య సమస్యలతో ప్రపంచ వ్యవసాయ రంగం !
  • రష్యా – జర్మనీలను శాశ్వత శత్రు దేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: