దానిని చదివి వుత్తేజితుడైన కాంగ్రెస్ వాది మౌలానా హజరత్ మొహానీ ఆ సభలో సంపూర్ణ స్వాతంత్య్రం కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశ పెడితే దానిని గాంధీజీ వ్యతిరేకించటంతో మెజారిటీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు చేశారు. తీర్మానం ఓడిపోయినప్పటికీ తరువాత కాలంలో ఆ డిమాండ్ ఊపందుకుంది. ఇది కమ్యూనిస్టులది కాక మరెవరి విజయం ? ఇదేమైనా చిన్న విజయమా ?
ఎవరు దేని గురించైనా ఎవరినైనా ప్రశ్నించటంలో తప్పు లేదు. అసలు దేన్నయినా ప్రశ్నించే లక్షణం అలవరుచుకోవాలి.ఎవరు ,ఏమిటి, ఎందుకు,ఎక్కడ, ఎలా అనే ప్రశ్నలు మానవజాతి పరిణామాలను మలుపు తిప్పుతున్నాయి. వాటిలోంచి పుట్టిందే కమ్యూనిస్టు తత్వశాస్త్రం.ప్రశ్నించేవారు రెండు రకాలు. ఒకటి ఆసక్తితో సానుకూల దృక్పధంతో, రెండవది అడ్డుసవాళ్లకోసం వ్యతిరేక వైఖరితో వుంటారు. అందువలన ఈ దేశానికి కమ్యూనిస్టులు చేసిందేమిటని కొందరు ప్రశ్నించటాన్ని ఆహ్వానించాలి.
తాష్కెంట్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన తరువాత కమ్యూనిస్టు మిలిటరీ పాఠ శాల ఏర్పాటు చేసినట్లు రాశారేమిటని కొందరు మితృలు అడిగారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అనేక వలస దేశాలో సామ్రాజ్యవాద వ్యతిరేక, స్వాతంత్య్ర, స్వరాజ్య భావాలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.అనేక దేశాలలో కమ్యూనిస్టుపార్టీలు పురుడు పోసుకున్నాయి. అనేక మంది విప్లవకారులు, దేశ భక్తులు తిరుగుబాటు,ప్రవాసాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు, సైనిక శిక్షణ తీసుకున్నారు. గదర్ పార్టీ అలాంటి వాటిలో ఒకటి. ఈ పూర్వరంగంలో ఆ నాడు రాజకీయ శిక్షణ అంటే మిలిటరీ అంశాలు కూడా కొన్ని సందర్బాలులో కలగలసి వుండేవి.ఈ పూర్వరంగంలోనే బ్రిటీష్ సర్కార్ భారత్లో విప్లవకారుల పట్ల మరింత కఠిన వైఖరి అనుసరించింది. అదే సమయంలో తన వైఖరిని మార్చుకోకపోతే పరిణామాలు వేరే విధంగా వుంటాయని భయపడింది. ప్రపంచ యుద్దం పూర్తిగా ముగియక ముందే మన దేశ వైస్రాయ్గా వున్న చెమ్స్ఫర్డ్ కొన్ని సంస్కరణలు తప్పని సరి అని నివేదిక పంపాడు. దాని పర్యవసానమే భారత్లో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ, ఇఎస్ మాంటేగ్ను భారత ప్రభుత్వ కార్యదర్శిగా బ్రిటీష్ సర్కార్ నియమించి కొన్ని చర్యలను ప్రకటించింది. వాటినే మాంటేగ్_`చెమ్స్ ఫర్డ్ సంస్కరణలని పిలిచారు. ఇవి పరిమితమే అయినప్పటికీ విప్లవకారులవైపు జనం మొగ్గకుండా చూసే ఎత్తుగడ కూడా అంతర్గతంగా వుంది. నాటి విప్లవకారులే అనేక మంది తరువాత కాలంలో కమ్యూనిస్టులుగా మారారు కనుక పార్టీ ఏర్పడక ముందే కమ్యూనిస్టు సాధించిన ఒక విజయం అని ఎందుకు చెప్పుకోకూడదు ?
పాలనా సంస్కరణలతో కొందరు మంత్రుల వంటి పదవులు పొందితే కమ్యూనిస్టులు మాత్రం జైలు పాలయ్యారు. ఈ సంస్కరణలతో పాటు బ్రిటీష్ సర్కార్ తన న్యాయమూర్తి రౌలట్ ఆధ్వర్యాన ఒక కమిటీని నియమించింది. విప్లవోద్యమంతో సంబంధాలున్న నేరపూరిత కుట్ర స్వభావాన్ని విస్తృత పరచేందుకూ, విప్లవోద్యమాన్ని అణచేందుకు అవసరమైన చర్యలను కూడా సూచించాలని రౌలట్ కమిటీకి అప్పగించారు. ఆ మేరకు రౌలట్ చట్టం 1919 మార్చి 18 అమలులోకి వచ్చింది. దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. ప్రభుత్వం గాంధీజీని అరెస్టు చేసింది. దానికి తలెత్తిన నిరసన అణచివేతలో భాగంగానే 1919 ఏప్రిల్ 13 నాటి జలియన్ వాలా బాగ్ వూచకోత.
మన స్వాతంత్య్ర వుద్యమంలో లాల్, బాల్, పాల్ త్రయంగా పిలిచే వారిలో ఒకరైన బిపిన్ చంద్రపాల్ 1920 మార్చి 6న చేసిన ఒక ప్రసంగం గురించి బ్రిటీష్ పోలీసు నివేదిక ఇలా వర్ణించింది.‘ఆయన ప్రసంగం మొత్తం పెద్దగా దాపరికం లేని బోల్షివిజం(కమ్యూనిజం) అని వర్ణించవచ్చు’ అని పేర్కొన్నది. భారత జాతీయ కాంగ్రెస్ 36వ మహాసభ 1921లో అహమ్మదాబాదులో జరిగింది. భారత కమ్యూనిస్టుల తరఫున ఎంఎన్ రాయ్, అబనీ ముఖర్జీ సంతకాలు చేసిన ఒక ప్రణాళికను ప్రతినిధులకు పంపిణీ చేశారు. బ్రిటీష్ వారితో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని కాంగ్రెస్ నూతన కార్యాచరణ మార్గం చేపట్టాలని అందులో కోరారు.దానిని చదివి వుత్తేజితుడైన కాంగ్రెస్ వాది మౌలానా హజరత్ మొహానీ ఆ సభలో సంపూర్ణ స్వాతంత్య్రం కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశ పెడితే దానిని గాంధీజీ వ్యతిరేకించటంతో మెజారిటీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు చేశారు. తీర్మానం ఓడిపోయినప్పటికీ తరువాత కాలంలో ఆ డిమాండ్ ఊపందుకుంది. ఇది కమ్యూనిస్టులది కాక మరెవరి విజయం ? ఇదేమైనా చిన్న విజయమా ?
ప్రస్తుతం మన దేశంలో కాషాయ తాలిబాన్లు తమ చర్యలను వ్యతిరేకించే వారిని కుహనా లౌకిక వాదులుగా, వామపక్ష వాదులుగా ముద్రవేస్తూ దాడి చేస్తున్నారు. ఇది అమెరికా నుంచి ఎరువు తెచ్చుకున్న ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. అక్కడ కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన పాలకులు తమ విధానాలను వ్యతిరేకించే వారందరినీ కమ్యూనిస్టులుగా ముద్రవేసి నోరు మూయించేందుకు, వేధించేందుకు ప్రయత్నించారు
ప్రస్తుతం మన దేశంలో కాషాయ తాలిబాన్లు తమ చర్యలను వ్యతిరేకించే వారిని కుహనా లౌకిక వాదులుగా, వామపక్ష వాదులుగా ముద్రవేస్తూ దాడి చేస్తున్నారు. ఇది అమెరికా నుంచి ఎరువు తెచ్చుకున్న ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. అక్కడ కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన పాలకులు తమ విధానాలను వ్యతిరేకించే వారందరినీ కమ్యూనిస్టులుగా ముద్రవేసి నోరు మూయించేందుకు, వేధించేందుకు ప్రయత్నించారు. బ్రిటీష్ పాలకులు మన దేశంలో 1920 దశకంలోనే నూతన భావాలు,పరిణామాలను ప్రతిబింబించిన పత్రికలను కొన్నింటిని నిషేధించారు. దాంతో అనేక కొత్త పేర్లతో కమ్యూనిస్టులు వాటిని ప్రచురించి తమ భావాలను ప్రచారం చేశారు.
ఈ పూర్వరంగంలోనే మూడు పెషావర్ కుట్ర కేసులను బనాయించారు. ఇవి తొలి కమ్యూనిస్టు కుట్ర కేసులు. మాస్కో, తాష్కెంట్ల నుంచి 1921 జూన్ మూడున పెషావర్ చేరిన తొలి మొహజిర్ బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు. అలా 1922,23 సంవత్సరాలలో మరో రెండు కేసులు బనాయించి విప్లవకారులకు శిక్షలు వేశారు. ఎంఎన్రాయ్,బోల్షివిక్లు ఆమోదించిన కమ్యూనిజానికి దూతలుగా పని చేసినందుకే శిక్షించబడ్డారని విచారణ తతంగం జరిపిన సెషన్స్ జడ్జి వ్యాఖ్యానించారు. తొలి రోజుల్లోనే ఇంతటి త్యాగాలు చేసిన వారిని భారత కమ్యూనిస్టులు నిజమైన వారు కాదని అనటానికి కొందరికి నోరెలా వస్తుంది? అలాంటి వారు తప్పుదారి పట్టిన వారా లేక కమ్యూనిస్టు వ్యతిరేకులా ?
( ఇది సమగ్ర చరిత్ర కాదు కేవలం ఆసక్తి, పరిచయం కలిగించేందుకే)
