• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: sabarimala

ఓట్లకోసమే అయోధ్య, అయ్యప్ప ఆందోళనల్లో సంఘపరివార్‌ !

24 Saturday Nov 2018

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence

≈ Leave a comment

Tags

AYODHYA, ayyappa stirs, Babri Masjid case, sabarimala, Sabarimala Ban On Women

Image result for vote politics behind ayodhya,ayyappa stirs

ఎం కోటేశ్వరరావు

దేశంలో వుత్తరాదిన ప్రారంభం కానున్న ఒక ఆందోళన. దక్షిణాదిన జరుగుతున్న ఒక అరాచకం. రెండింటి నిర్వాహకులూ ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా సంఘపరివార్‌ శక్తులే. నవంబరు 25న ధర్మ సభ పేరుతో ఆయోధ్యలో నిర్వహించే కార్యక్రమానికి విశ్వహిందూపరిషత్‌ ఒక లక్ష మందిని, ఆర్‌ఎస్‌ఎస్‌ మరో లక్షమందిని సమీకరించనున్నట్లు ప్రకటించాయి. వారి నుంచి అయోధ్య-ఫైజాబాద్‌ జంటనగరాలలోని మైనారిటీలపై దాడులు జరిగే అవకాశం వుందనే సమాచారంతో రాష్ట్ర బిజెపి సర్కార్‌ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఆంక్షలను అమలు చేస్తోంది. శివసేననేత వుద్దావ్‌ థాకరే నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదని వార్తలు వచ్చాయి. తాను రామభక్తుడిగా ఆ రోజు అయోధ్యకు వస్తానని తనను ఎవరు ఆపుతారో చూస్తానన్నట్లుగా థాకరే ప్రకటించాడు. డిసెంబరు తొమ్మిదిన ఢిల్లీలో సభ తరువాత దేశ వ్యాపితంగా ఆందోళన చేయనున్నట్లు ప్రకటించారు.

మరొకటి శబరిమల. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఆలయ సందర్శనకు వస్తున్న హిందూ మతానికి చెందిన మహిళలను కూడా తాము రానిచ్చేది లేదంటూ ఆ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకుంటున్న సంస్ధల నుంచి తలెత్తిన ముప్పును నివారించేందుకు, భక్తుల ముసుగులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని అడ్డుకొనేందుకు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం 144వ సెక్షన్‌ ప్రకటించింది. అయోధ్యలో ఆంక్షల గురించి పల్లెత్తు మాట్లాడని వారు శబరిమల విషయంలో ప్రభుత్వం భక్తులను అడ్డుకుంటున్నట్లు నానా యాగీ చేస్తున్నారు.దొంగే దొంగని అరవటం అంటే ఇదేనేమో !

దేశంలో మత లేదా మతోన్మాద శక్తులు అనుకున్నదొకటి, అవుతున్నదొకటి. వారు కోరుకున్నది ఒకటి వస్తున్న ఫలితం మరొకటి. శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలందరికీ ప్రవేశం కల్పించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఒక వైపు వ్యతిరేకిస్తూ ఆలయ సంప్రదాయాల పరిరక్షణ ముసుగులో కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారు. తమ ఆందోళన అసలు లక్ష్యం సిపిఎం నాయకత్వంలోని ప్రభుత్వాన్ని వ్యతిరేకించటమే అని బిజెపి నేత బాహాటంగా చెప్పాడు. అయోధ్య, శబరిమల రెండు చోట్లా జరుగుతున్న ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారి గురించి జనం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం వుంది.

శబరిమల వుదంతంలో కోర్టు తీర్పు వచ్చేంతవరకు వేచి చూసి తాము అనుకున్నదానికి వ్యతిరేకంగా వచ్చే సరికి అయ్యప్పను వీధుల్లోకి లాగుతున్నారు. వయస్సులో వున్న ఆడవారు తనను చూడకూడదని అయ్యప్ప చెప్పటాన్ని తాము స్వయంగా విన్నామన్నట్లుగా మాట్లాడుతున్న వారు మరోవైపు అదే వయస్సులో వున్న మహిళలను ముందుకు తెచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు. బాబరీమసీదు వివాదంలో సుప్రీం కోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండానే తాము కోరుకున్న విధంగా కేంద్రం ఒక చట్టాన్ని చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని రామమందిరం నిర్మించాలంటున్నారు. తాము కోరుకున్నది తప్ప కోర్టులు ఇచ్చిన తీర్పులను, ఇవ్వబోయే తీర్పులను కూడా తాము అంగీకరించేది లేదని రాజ్యాంగమూ, కోర్టులు, చట్టాలను తాము పట్టించుకొనేది లేదని ప్రకటించే వుగ్రవాద సంస్ధలకూ వీటికి తేడా ఏమిటో జనం ఆలోచించాలి.

పరిష్కారమైన శబరిమల కేసును తిరిగి వివాదంగా మార్చ చూస్తున్నది మతశక్తులు. దశాబ్దకాలం పాటు సాగిన కోర్టు విచారణలో తమ వాదనలకు అనుకూలంగా వున్న నిషేధ ఆధారాలను సమర్పించటంలో విఫలమయ్యారు. రెండు వందల సంవత్సరాల నాడే బ్రిటీష్‌ పాలకుల హయాంలో పిల్లలను కనే వయసులో వున్న మహిళలకు ఆలయ ప్రవేశ నిషేధం వున్నట్లు ఆధారాలు దొరికాయని ఇటీవల ఒక పెద్దమనిషి ప్రకటించాడు. నిజానికి అదేమీ కొత్త అంశం కాదు. అన్ని వయసుల వారినీ ఆలయ ప్రవేశానికి అనుమతించాలన్న మెజారిటీ తీర్పును వ్యతిరేకించిన ఐదవ న్యాయమూర్తి ఇందు మల్హోత్రా ఆ అంశాన్ని తన వ్యతిరేక నోట్‌లో పేర్కొన్నారు. వాటన్నింటినీ పరిశీలించిన తరువాతే ఆ తీర్పు వెలువడింది. అయినా ఇదేదో కొత్తగా కనుగొన్న అంశం మాదిరి మీడియాలో పెద్ద ఎత్తున ఆ వార్తలకు ప్రాచుర్యం కల్పించటం గమనించాల్సిన అంశం. నిజంగా అలాంటి పక్కా ఆధారాలు వున్నపుడు వాటి మీద విశ్వాసం వున్నవారు వెంటనే సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలను విరమించాలి. కోర్టులో అనేక పునర్విచారణ పిటీషన్లు దాఖలయ్యాయి, వాటిని పరిశీలించేందుకు కోర్టు కూడా అంగీకరించినందున ఆ సమయంలో తమకు దొరికిన బలమైన సాక్ష్యాన్ని కోర్టుకు సమర్పించి తీర్పును తిరగరాయమని కోరవచ్చు. కానీ ఆపని చేయటం లేదు, అందుకోసమే ఓట్ల కోసం రాజకీయం చేయాలన్న నిర్ణయం ప్రకారం నడుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Image result for vote politics behind ayyappa stirs

బాబరీమసీదు వివాదంలో సదరు స్ధలం ముస్లింలదే అని తీర్పు వచ్చే అవకాశం వుందని ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్ధలు భావిస్తున్నాయా? అందుకే ప్రత్యేక చట్టం చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాయా? కేంద్రంలో పూర్తి మెజారిటీ వున్న బిజెపి ప్రభుత్వం వుండగా నాలుగున్నర సంవత్సరాల పాటు వేచి వుండి ఆ డిమాండ్‌ను ఇప్పుడెందుకు ముందుకు తెచ్చినట్లు ? ఈనెల 25నుంచి దేశవ్యాపితంగా తలపెట్టినట్లు చెబుతున్న ఆందోళనల అసలు లక్ష్యం ఏమిటి? ఇలా పరిపరి విధాలుగా తలెత్తుతున్న అంశాలను కూడా జనం ఆలోచించాలి. బాబరీ మసీదు స్థల వివాద కేసు తమకు అనుకూలంగా వస్తుందని భావించారా? స్ధల వివాద కేసులో వున్న అప్పీళ్లు జనవరిలో విచారణకు వస్తాయని, ఆ లోగా విచారించి తేల్చాల్సిన అత్యవసరమేమీ లేదని, వుత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం, అఖిల భారత హిందూమహాసభ తదితరులు చేసిన వినతిని నవంబరు రెండవ వారంలో సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల లోపు ఆ కేసు తేలదని స్పష్టమై పోయింది. అసలింతకీ ఆ కేసు ఏమిటి? దాని మీద వచ్చే తీర్పు పర్యవసానాలేమిటి?

సుప్రీం కోర్టులో నడుస్తున్న వివాదం ఆస్ధి పరమైనది. అయోధ్యలో వివాదాస్పద బాబరీ మసీదు స్దలాన్ని సేకరించేందుకు కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేసిన కేసులో ఇస్లాం మతావలంబనలో మసీదులు తప్పనిసరేమీ కాదని సుప్రీం కోర్టు 1994లో చెప్పింది.ఈ తీర్పును ప్రాతిపదికగా చేసుకొని 2010లో అలహాబాద్‌ హైకోర్టు 2.77 ఎకరాల బాబరీ మసీదు స్ధలాన్ని మూడు భాగాలుగా చేసి ఒక ముక్కను ముస్లింలకు, ఒక ముక్కను నిర్మోహీ అఖారాకు, మూడో ముక్కను రామాలయానికి ఇవ్వాలని చెప్పింది. ఆ తీర్పును ముస్లిం సంస్ధలు సవాలు చేశాయి. 1994 సుప్రీం కోర్టు తీర్పును పున:పరిశీలించాలన్న వినతిని ఇటీవల సుప్రీం కోర్టు 2-1 మెజారిటీతో తిరస్కరించింది. తీర్పు రాసిన ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, న్యాయమూర్తి అశోక్‌ భూషణ్‌ ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ ఆ తీర్పును పున:పరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొనగా మరో న్యాయమూర్తి అబ్దుల్‌ నజీర్‌ విబేధించి పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. 1994నాటి తీర్పు మతానికి సంబంధించింది కాదని భూసేకరణ సంబంధమైనదని ఇద్దరు న్యాయమూర్తులు చెప్పగా సమగ్ర పరిశీలన లేకుండానే నాటి తీర్పు ఇచ్చారని అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. ఆ కేసులో చేసిన వ్యాఖ్యలు అలహాబాద్‌ హైకోర్టును ప్రభావితం చేశాయని అన్నారు. అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన 14 అప్పీళ్లను సుప్రీం కోర్టు విచారిస్తున్నది. సుప్రీం కోర్టు తీర్పును పున:పరిశీలించకుండా న్యాయమైన నిర్ణయానికి రాలేరని ముస్లిం సంస్ధల ప్రతినిధులు వాదిస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఈ ఏడాది సెప్టెంబరు 27న 1994నాటి తీర్పును పునర్విచారణకు తిరస్కరించిన సుప్రీం కోర్టు తమ విచారణ వాస్తవాలపైనే ఆధారపడి వుంటుందని, గత తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ విచారణను వేగంగా నిర్వహించాలని హిందూ సంస్ధలు చేసిన వినతిని నవంబరు 12న సుప్రీం కోర్టు తిరస్కరించింది. జనవరిలో చేపడతామని పేర్కొన్నది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందే సుప్రీం కోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తుందని అనేక మంది ముఖ్యంగా హిందూ సంస్ధలు భావించాయి. ఈ కేసు విచారణ వచ్చే ఏడాది ఎన్నికల తరువాత జరపాలని గతేడాది డిసెంబరులో న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టును కోరారు.

ఈ పూర్వరంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ తదితర సంఘపరివార్‌ సంస్ధలు, శివసేన రంగంలోకి దిగాయి. ఆదివారం నాడు జరిగే ధర్మ సభ ఆఖరిదని తరువాత ఇంకెలాంటి సభలు వుండవని తదుపరి కార్యాచరణ రామాలయ నిర్మాణమే అని విశ్వహిందూపరిషత్‌ ప్రకటించింది. ప్రతి సారీ ఎన్నికల ముందు రామాలయ నిర్మా ణాన్ని లేవనెత్తి అక్కడే నిర్మిస్తామని చెబుతున్నారని ఎంతకాలమిలా జనాన్ని వెర్రి వెంగళప్పలను చేస్తారని శివసేన నేత వుద్దావ్‌ రెచ్చగొడుతున్నారు. ఇదంతా రానున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకొని చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందువలన ధర్మ సభ తరువాత ఈ శక్తులు ఎన్ని అధర్మాలకు, అరాచకాలకు పాల్పడతాయో చెప్పలేము. 1992 డిసెంబరు ఆరు నాటి బాబరీ మసీదు విధ్వంసం కేసులో అద్వానీ, మురళీమనోహర జోషి వంటి బిజెపి సీనియర్‌ నేతలు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు.

ఓట్ల రాజకీయం గాకపోతే ఇంతకూ విశ్వహిందూపరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ తదితర సంస్ధలు ఎవరికి వ్యతిరేకంగా ఎవరి మీద ఆందోళనలకు దిగుతున్నట్లు? అటు కేంద్రంలోనూ ఇటు అత్యధిక రాష్ట్రాలలోనూ బిజెపి అధికారంలో వుంది. రామ మందిర నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుతోంది. ఎవరు అడ్డుకున్నారు ? లేదా బాబరీ మసీదు వివాదంలో కోర్టు తీర్పులు చెల్లవు, ప్రభుత్వం చేసేదే అంతిమ నిర్ణయం అని ఒక చట్టం చేసినా అడ్డుకొనే శక్తి ప్రతిపక్ష పార్టీలకు లేదు. హిందూత్వ సంస్ధలు చేసే ఆందోళన దేశమంతటినీ మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ స్పందించకపోవటంలో ఆశ్చర్యం లేదు. నిద్రపోయే వారిని లేపగలం తప్ప నటించే వారిని లేపలేము. తన ప్రభుత్వ అన్ని రకాల వైఫల్యాల నుంచి జనం దృష్టిని మరల్చాలంటే ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చని అనేక మంది పరిశీలకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శబరిమల తీర్పు 2 : ఆర్‌ఎస్‌ఎస్‌ రెండు నాలికల వైఖరి !

08 Monday Oct 2018

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, RELIGION, Women

≈ Leave a comment

Tags

RSS doublespeak, RSS doublespeak on sabarimala, sabarimala, sabarimala verdict

Image result for rss doublespeak on sabarimala cartoons

ఎం కోటేశ్వరరావు

భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 125 ప్రకారం విడాకుల తరువాత ముస్లిం మహిళలు భర్త నుంచి భరణం పొందేందుకు అర్హులే అని సుప్రీం కోర్టు ఒక ముఖ్యమైన తీర్పు నిచ్చింది. ఇది తమ మత సాంప్రదాయాలు, వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని ముస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆ తీర్పును వమ్ము చేస్తూ కాంగ్రెస్‌ సర్కార్‌ ఏకంగా ఒక బిల్లునే పార్లమెంట్‌లో ఆమోదించింది. ఆ చర్యను వ్యతిరేకించిన బిజెపి అది ముస్లింల సంతుష్టీకరణ, ఓట్ల రాజకీయం అని విమర్శించింది. కానీ అదే పార్టీ నేడు ఇప్పటి వరకు ఆ డిమాండ్‌ చేయలేదుగానీ దాన్ని మద్దతు దారులు అదే డిమాండ్‌ చేస్తున్నారు. తీర్పును పునర్విచారణ జరపాలని బిజెపి కోరుతున్నది. గమనించాల్సిందేమిటంటే శని శింగనాపూర్‌ దేవాలయంలో అసలు మొత్తంగా మహిళలకు ప్రవేశం లేదు. అది చెల్లదని కోర్టు ఇచ్చిన తీర్పును పునర్విచారణ చేయాలని బిజెపి లేదా మహిళామోర్చా, ఇతర సంఘాలు గానీ డిమాండ్‌ చేయలేదు. పండలం మాజీ రాజకుటుంబం వారు షాబానో కేసు మాదిరి నరేంద్రమోడీ సర్కార్‌ కూడా శబరిమల తీర్పును రద్దు చేస్తూ పార్లమెంట్‌లో చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దాని గురించి ఇంతవరకు బిజెపి లేదా కేంద్రం నోరెత్తలేదు. నెపాన్ని సిపిఎం మీద నెట్టాలని చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల మనోభావాలను పట్టించుకోవటం లేదని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి చెబుతున్నాయి. కమ్యూనిస్టులు కనుక వారి వైఖరి వారికి వుంటుంది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ కొద్ది సంవత్సరాల క్రితం శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశించే అవకాశం ఇవ్వాలని కోరినపుడు భక్తులు గుర్తురాలేదా? ఎందుకీ అవకాశం వాదం, రెండు నాల్కల ధోరణి? కాంగ్రెస్‌ మైనారిటీ ముస్లిం ఛాందసవాదులను సంతృప్తి పరచేందుకు ప్రయత్నిస్తే నేడు బిజెపి మెజారిటీ హిందువుల ఓట్ల కోసం ఛాందసులను తృప్తి పరచేందుకు పూనుకుంది. కోర్టు తీర్పు అమలు గురించి చర్చించేందుకు రావాలని ఆలయ ప్రధాన పూజారి, ఆలయ నిర్మాణం చేసిన పండలం రాజకుటుంబీకుల వారసులను ప్రభుత్వం ఆహ్వానించింది. తీర్పుపై పునర్విచారణకు ప్రభుత్వం నిర్ణయించకుండా తాము చర్చలకు వచ్చేదని వారి ప్రతినిధులు ప్రకటించారు.

నాడు హిందూ కోడ్‌ బిల్లు ద్వారా హిందూ మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ వాదించిన విషయం ముందే చెప్పుకున్నాము. అదే సంస్ధ సృష్టి అయిన బిజెపి జమ్మూకాశ్మీర్‌లో మహిళల వారసత్వహక్కు విషయంలో వివక్ష చూపుతున్నారని మొసలి కన్నీరు కార్చుతున్నది. అసలు లక్ష్యం దానికి ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్‌ 370కి ఎసరు తేవటం. ఇదే బిజెపి వుమ్మడి పౌరస్మృతి గురించి చెబుతుంది. దీని వెనుక ముస్లిం, క్రిస్టియన్‌ వ్యతిరేకత వుంది. ఒక వైపు ముస్లింలు, క్రైస్తవులు ఎలాంటి కుటుంబ నియంత్రణ పాటించకుండా పిల్లలను ఎక్కువ మందిని కంటూ హిందూ జనాభాను మైనారిటీగా చేసేందుకు కుట్రపన్నారని చెబుతారు, మరోవైపు బిజెపిలోని నోటి తుత్తర గాళ్లు, పెండ్లీ పెటాకులు లేని సన్యాసులు, సన్యాసినులు హిందూ మహిళలు కుటుంబ నియంత్రణను పక్కన పెట్టి ఎక్కువ మంది పిల్లలను కనాలని చెబుతారు.

లవ్‌జీహాద్‌ పేరుతో హిందూ యువతులు ఇతర మతాలకు చెందిన వారిని వివాహం చేసుకోకుండా చూసేందుకు సంఘపరివార్‌ సంస్ధలు నిరంతర ప్రచారం చేస్తున్నాయి. మత వుద్రిక్తతలను రెచ్చగొడుతున్నాయి. వాలెంటైన్స్‌ డే రోజున వారంతా బృందాలుగా పార్కుల వెంట తిరుగుతూ కనిపించిన యువతీ యువకులను కొట్టటం, వివాహం చేసుకోమని బలవంత పెట్టటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. నిచ్చెన మెట్ల వంటి మన కుల వ్యవస్ధలో పై మెట్టులో వున్న అమ్మాయి ఎవరైనా కింది మెట్టులో వున్న అబ్బాయిని వివాహం చేసుకుంటే యువకులను హత్య చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. అలాంటి చర్యలను సామాజిక మాధ్య మాల్లో నిస్సిగ్గుగా సమర్ధించేవారంతా పై తరగతికి చెందిన వారే అన్నది అందరికీ తెలిసిన నిజం. అనేక మంది బిజెపి అగ్రనేతల కుమార్తెలు, బంధువులు ముస్లింలను వివాహాలు చేసుకున్నారు. అది మాత్రం ఇలాంటి బాపతుకు లవ్‌ జీహాద్‌గా కనిపించదు. సుబ్రమణ్యస్వామి కుమార్తె సుహాసిని మాజీ అధికారి సల్మాన్‌ హైదర్‌ కుమారుడు నదీమ్‌ను, బిజెపినేతలు సికిందర్‌ భక్త్‌, షా నవాజ్‌ ఖాన్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ హిందూ యువతులను వివాహం చేసుకున్నారు. ఎల్‌కె అద్వానీ మేనకోడలు ఒక ముస్లింను వివాహం చేసుకుంది. సామాన్యులనే సమిధలుగా చేస్తున్నారు. మతకొట్లాటలను రెచ్చగొట్టేందుకు అలాంటి వుదంతాలను వినియోగించుకుంటున్నారు.

ఆమోదంతో స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సెక్షన్‌ 377ను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దీని మీద కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఎనిమిదేండ్ల పాటు ఈ కేసు నడిచింది. ప్రస్తుతం వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వున్న యోగి ఆదిత్యనాధ్‌ 2013లో బిజెపి పార్లమెంట్‌ సభ్యుడిగా వుండి ఏం మాట్లాడారో చూడండి. ‘ సామాజిక నీతికి స్వలింగ సంపర్కం ప్రమాదకరం, సామాజిక కట్టుబాట్లు, సరిహద్దులను చెరిపివేస్తే ఆ తరువాత మనిషి జంతువుకు తేడా వుండదు. చౌకబారు కుతర్కంతో మత గ్రంధాలకు వీటిని జత చేయటం పూర్తి అనైతికం, ఇంట్లో చేసే వాటిని నాలుగు రోడ్ల కూడలిలో చేస్తామని ఎవరైనా అంటే దాన్ని సమాజం అంగీకరించకూడదు. దానికి ఏవిధమైన రాజ్యాంగ బద్దత కూడా వుండకూడదు’ అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షం వున్న కాంగ్రెస్‌ నేత గులాం నబీ అజాద్‌ 2011లో కేంద్ర మంత్రిగా మాట్లాడుతూ ‘ దురదృష్టం కొదీ ఎయిడ్స్‌ వ్యాధి ప్రపంచానికి మన దేశానికి వచ్చింది. ఒక పురుషుడు మరొక పురుషుడితో కలిస్తే ఇది వస్తుంది. ఇది పూర్తిగా అసహజమైనది, జరగకూడనిది, కానీ జరుగుతోంది. బిజెపి ఎంపీ సుబ్రమణ్య స్వామి మరొక అడుగు ముందుకు వేసి 2013లో మాట్లాడుతూ స్వలింగ సంపర్కాన్ని చట్టబద్దం చేస్తే అది లాభదాయకంగా మారి అన్ని పట్టణాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో స్వలంగ సంపర్క బార్లను తెరవటానికి దారి తీస్తుంది’ అన్నారు. ఇప్పటికి ఎన్ని బార్లు తెరిచారో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం తిరుగుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ మనకు చెప్పాలి. ఇక ప్రతిదాన్నీ తన కంపెనీ లాభాల కోసం వినియోగించుకుంటున్న యోగా గురు బాబారామ్‌ దేవ్‌ ఈ అంశాన్ని కూడా వదల లేదు. స్వలింగ సంపర్కులు తన యోగాశ్రమానికి వస్తే దీనికి గ్యారంటీగా చికిత్స చేస్తామని చెప్పాడు. ఇది సాధారణంగా, సహజంగా మానవ మాత్రులెవరూ చేయకూడనిది అని టీవీల్లో బోధలు చేసే ముస్లిం పండితుడు జకీర్‌ నాయక్‌ చెప్పారు.

శబరి మల తీర్పుపై పునర్విచారణ పిటీషన్‌ వేయాలన్న డిమాండుకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నదని ముస్లింలీగ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి పికె కున్హాలికుట్టి ప్రకటించారు.భక్తుల మనోభావాలను గౌరవిస్తున్న కారణంగానే ఆలయపవిత్రతను కాపాడాలని యుడిఎఫ్‌ ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందన్నారు.కోర్టు తీర్పు కంటే భక్తుల విశ్వాసాలు, ఆలయ సాంప్రదాయాలను కాపాడాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న వైఖరి వల్లనే అలజడి తలెత్తింది. నేడు ఇది శబరిమల విషయంలో జరిగింది రేపు దీని ప్రభావం ఇతర విశ్వాసాల మీద కూడా పడవచ్చు అన్నారు. శబరిమల తీర్పు అమలు హేతువాదులకు,నాస్తికులకు ఒక సమస్యగాకపోవచ్చుగానీ కోట్లాది భక్తులకు ఇది ప్రధాన సమస్య. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పునర్విచారణ పిటీషన్‌ దాఖలు చేయవచ్చు. మసీదుల్లో మహిళల ప్రవేశం గురించి కొన్ని ముస్లిం సంస్ధలు అనుమతించాలని కోరుతుండగా మరికొన్ని వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.

భక్తుల విశ్వాసాలను గౌరవించాలంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన అనేక సంస్ధలు మహిళలను వీధుల్లోకి సమీకరిస్తున్నాయి. తొలుత కోర్టు తీర్పుకు అనుకూలంగా మాట్లాడిన ఆ సంస్ధ వెంటనే ప్లేటు ఫిరాయించింది. సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పటికీ భక్తుల మనోభావాలను విస్మరించకూడదని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి సన్నాయి నొక్కులు నొక్కారు. సమీక్ష పిటీషన్‌ వేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఇది జరిగిన మరుసటి రోజు కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నడిపే జన్మభూమి దినపత్రికలో జోషి ప్రకటన తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ మేధావి, భారతీయ విచార కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ అయిన ఆర్‌ సంజయన్‌ రాసిన ఒక వ్యాసంలో కోర్టు తీర్పును సమర్ధించటం గమనించాల్సిన అంశం. వున్నత న్యాయ స్ధానం తీర్పు ఆలయ మౌలిక సాంప్రదాయాలు, క్రతువులను ఏ విధంగానూ మార్పు చేయదని, వాస్తవానికి మరింత మంది మహిళా భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తే దాని ప్రాధాన్యత, ప్రజాదరణ పెరుగుతుందని వ్యాఖ్యానించారు. పది-యాభై సంవత్సరాల మధ్య వయస్సున్న వారి మీద వున్న ఆంక్షలను మాత్రమే కోర్టు కొట్టివేసింది. అటువంటి సాంప్రదాయాలు సక్రమం అని నిరూపించటానికి తర్కబద్దంగా లేదా తగిన శాస్త్రీయ పద్దతులు కూడా లేవని స్పష్టం చేశారు. ఆలయ అధికారుల సహాయంతో గతంలో అన్న ప్రాసన కార్యక్రమాలు కూడా జరిగాయని, పిల్లలను కనే వయస్సులో వున్న మహిళ ప్రవేశంపై ఆంక్షలు విధించాలని 1991లోనే కేరళ హైకోర్టు ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు. దేవాలయాన్ని సందర్శించాలా లేదా అనే, ఎప్పుడు ఆ పని చేయాలి అనే అంశాలను నిర్ణయించుకొనే స్వేచ్చ మహిళలకే వదలి వేయాలి.వారికి నిర్ణయించుకొనే సామర్ధ్యం వుంది, పితృస్వామ్య రోజులు అంతరించాయని ప్రతి ఒక్కరూ గుర్తించటం అవసరం అని కూడా పేర్కొన్నారు. తిరువనంతపురం లోని భారతీయ విచార కేంద్రం డైరెక్టర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అయిన పి పరమేశ్వరన్‌ 2006నవంబరులో త్రిసూర్‌లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మహిళలు దేవాలయ సందర్శనను కోరుకుంటే వారిని అనుమతించాలి, అనుమతించకపోవటానికి ఎలాంటి కారణం లేదు అన్నారు.

మహిళలు కొండమీద వున్న ఆలయాన్ని చేరుకొనేందుకు ఎక్కలేరు, మహిళా కార్యకర్తలు తప్ప మూమూలు నిజమైన భక్త మహిళలెవరూ ఆలయాన్ని సందర్శించరు అనేవారు కొందరు. రెడీ టు వెయిట్‌ అంటే మాకు ఆలయ ప్రవేశ అర్హత వచ్చేంత వరకు వేచి చూస్తాం అనే నినాదంతో కొందరు మహిళలు ప్రచారం చేస్తున్నారు. మహిళలు అంత ఎత్తు ఎక్కలేరు, గంటల తరబడి వేచి వుండలేరు అని చెప్పే మహానుభావులారా అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్న వారు అయ్యప్ప ఆలయానికి వెళ్లలేరా? వెళ్లాలా లేదా అనేది ఎవరిష్టం వారిది. వివక్ష కూడదన్నది సహజన్యాయం తప్ప బలవంతంగా వారిని గుళ్ల చుట్టూ తిప్పాలని ఏ కోర్టూ చెప్పలేదు, చెప్పదు. బస్సుల సౌకర్యం లేనపుడు ఏడుకొండలు ఎక్కి తిరుమలలో వెంకటేశ్వరుడిని మహిళలు దర్శించలేదా? ఇప్పుడు నడకదారిలో వెళుతున్నవారు లేరా ? శక్తి వున్న వారు నడుస్తారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశ అర్హత వున్న పదేండ్ల లోపు వారు, యాభై ఏండ్ల పైబడిన వారు నడవగలరని ఎవరైనా చెప్పగలరా? ఇక మహిళా కార్యకర్తలు మాత్రమే ఆలయాన్ని సందర్శిస్తారని వుక్రోషంతో చెబుతున్నమాట తప్ప మరొకటి కాదు, ఆ మాట చెప్పిన ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పద్మకుమార్‌ మహిళలకు సౌకర్యం కోసం వంద ఎకరాల స్ధలం కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారని గుర్తు చేయటం అవసరం. ఆసక్తి వున్న వారికి అవకాశం కల్పించమని అడగటం తప్ప ఆంక్షలను వ్యతిరేకించే కమ్యూనిస్టు పురుషులు, మహిళా కార్యకర్తలెవరూ అయ్యప్పమాల వేసుకొని దర్శనాలు గతంలో చెయ్యలేదు, ఇప్పుడు చెయ్యరు.

శబరిమల తీర్పును ఆలిండియా కాంగ్రెస్‌ స్వాగతిస్తే కేరళ కాంగ్రెస్‌ నాయకుడు రమేష్‌ చెన్నితల మాత్రం అతని కంటే ఘనుడు ఆచంటమల్లన అన్నట్లు బిజెపి కంటే రెండాకులు ఎక్కువ చదివాడు. విశ్వాసం కంటే హేతుబద్దత పైచేయిగా వుండకూడదు అనటాన్ని నేను సమర్ధిస్తాను, తప్పుడు వాదాల ఆధారంగా కోర్టు తీర్పు ఇచ్చినట్లు కనిపిస్తున్నది, ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం, దేవస్ధానం బోర్డు భిన్నవైఖరులు తీసుకున్నాయి, తీర్పు పునర్విచారణ కోరాలి అని చెన్నితల వ్యాఖ్యానించారు. కోర్టు విచారణ ఒక రోజు ప్రారంభమై మరుసటి రోజుకు ముగియలేదు. సంవత్సరాల పాటు సాగింది, అదేమీ రహస్యంగా జరగలేదు, ఒక పక్షం తప్పుడు వాదాలు చేస్తే రెండవ పక్షం ఏమిచేసినట్లు? కోర్టు అంత గుడ్డిగా తీర్పు ఇచ్చినట్లా ? ప్రజాస్వామ్యంలో కోర్టు తీర్పు మీద అప్పీలు చేయవచ్చు.

ఎవరైనా ఒక వివాదంలో తనకు న్యాయం జరగలేదనుకున్నపుడు, తన వాదనను సరిగా పట్టించుకోలేదని భావించినపుడు కోర్టు తీర్పు మీద అప్పీలు చేసుకొనేందుకు, పునర్విచారణ కోరేందుకు అవకాశం, హక్కు వుంటుంది. శబరిమల కేసులో మహిళల ప్రవేశంపై ఎలాంటి ఆంక్షలు వుండరాదన్నది ఎల్‌డిఎఫ్‌ వైఖరి, దాన్నే కోర్టుకు సమర్పించింది, దానికి అనుగుణ్యంగానే తీర్పు వచ్చింది. అందుకే అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. తన వైఖరికి అనుగుణ్యంగానే తీర్పు వచ్చినందున పునర్విచారణ కోరటం అనే సమస్య ప్రభుత్వం ముందు వుండదు. అయినా సరే కోరకపోవటం తప్పని సిపిఎం వ్యతిరేకులు దాడి చేస్తున్నారు. ప్రజలకు ప్రధాన శత్రువుగా ఏ పార్టీ వుంది, ఏ అంశం ముప్పు కలిగిస్తుంది అని ఎంచుకోవటం, దానికి అనుగుణ్యంగా ఎత్తుగడలు నిర్ణయించుకోవటం గురించి సిపిఎం తీసుకున్న నిర్ణయాలతో ఎవరైనా ఏకీభవించకపోవచ్చు, మంచి చెడ్డలను విమర్శించవచ్చు. అయితే సామాజిక విషయాల్లో ఇంతవరకు ఓట్లకోసమో, మరొకదాని కోసమో గతంలో ప్రకటించిన తన సూత్రబద్ద వైఖరులను నవీకరించుకుందేమోగాని ఒకసారి నిర్ణయించుకున్న తరువాత దానికి విరుద్దంగా మార్చుకున్న దాఖలాలు ఇంతవరకు లేవు అనే అంశంలో దాని రాజకీయ వ్యతిరేకులు కూడా ఏకీభవించకతప్పదు. శబరిమల ఆలయ విషయంలో కూడా అదే రుజువైంది. విఎస్‌ అచ్యుతానందన్‌ ముఖ్య మంత్రిగా వుండగా ఇచ్చిన అఫిడవిట్‌లో ఆంక్షలను వ్యతిరేకించింది. తరువాత అధికారానికి వచ్చిన యుడిఎఫ్‌ దానికి విరుద్ధంగా సుప్రీం కోర్టుకు మరొక అఫిడవిట్‌ను సమర్పించింది. ఐదేండ్ల తరువాత తిరిగి అధికారానికి వచ్చిన సిపిఎం తన పూర్వపు వైఖరినే కోర్టులో పునరుద్ఘాటించింది.

మాటతప్పదు, మడమ తిప్పదు అని ఎంతో మంది నమ్మే ఆర్‌ఎస్‌ఎస్‌ శబరిమల విషయంలో అవకాశవాద వైఖరిని ప్రదర్శించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి ఇప్పుడు రెండు నాలికలతో మాట్లాడారు.దీని వెనుక వున్న కారణాన్ని తరువాత చెప్పుకుందాం. రెండు సంవత్సరాల క్రితం ఆలయ ప్రవేశం గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏం చెప్పిందో చూద్దాం. ‘ కొన్ని ప్రాంతాలలో కొన్ని అనుచిత సాంప్రదాయాల కారణంగా ఆలయ ప్రవేశం సమస్యపై ఏకాభిప్రాయం లేదు. ఎక్కడైతే అటువంటి సమస్యలు ముందుకు వచ్చాయో, తగిన చర్చల ద్వారా అలాంటి ఆలోచనా వైఖరిని మార్చేందుకు ప్రయత్నించాలి.సమాజ హితానికి వ్యతిరేకులైన కొందరు గత కొద్ది రోజులుగా మహిళల ఆలయ ప్రవేశంపై మింగుడు పడని వివాదాన్ని లేవనెత్తుతున్నారు. మత, ఆధ్యాత్మిక వ్యవహారాలు, ఆరాధన, విశ్వాసాల వంటి విషయాలలో స్త్రీ పురుషులు సహజంగానే సమాన భాగస్వాములు అనే ఒక వున్నత సాంప్రదాయాన్ని గతం నుంచీ పాటిస్తున్నాము. మహిళలు వేదాలు నేర్చుకుంటున్నారు, సహజపద్దతుల్లోనే వారు ఆలయ పూజారులుగా కూడా పని చేస్తున్నారు ‘ 2016 మార్చి రెండవ వారంలో రాజస్ధాన్‌లోని నాగౌర్‌ సమీపంలో జరిగిన మూడు రోజుల ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధుల సభకు సమర్పించిన నివేదికలో సురేష్‌ భయ్యాజీ ఈ మాటలు చెప్పినట్లు డక్కర్‌ హెరాల్డ్‌ పత్రిక వెల్లడించింది. శబరిమల ఆలయంలో కొన్ని వయస్సుల మహిళలకు ఆలయ ప్రవేశ నిషిద్ధం వెయ్యి సంవత్సరాల నాటి ఆచారం అని చెప్పినా అర్ధం లేదు, పురుషులకు ఏ పరిమితులు విధించారో మహిళందరికీ అవే వుండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుతోందని కూడా సురేష్‌ చెప్పారు. నాడు కేరళలో అధికారంలో వున్న కాంగ్రెస్‌ మహిళల ప్రవేశానికి వ్యతిరేకం. అదే సమయంలో మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌ ఆలయంలో మహిళల ప్రవేశం గురించి వివాదం నడుస్తున్నది. ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌లో ఒక వ్యాసం వచ్చింది, అంతకు ముందు అదే పత్రిక సంపాదకీయంలో గౌరవ ప్రదమైన చర్చ జరగాలని బోధ చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రవేశానికి సుముఖత వ్యక్తం చేయగా మంత్రి పంకజ్‌ ముండే వంటి వారు వ్యతిరేకించారు.ఈ సమావేశంలోనే నిక్కర్లను విప్పేసి పాంట్లు( పురాణాలు, వేదాలు, ఛాందసవాదుల ప్రకారం నిక్కరు,పాంట్లు మన సంస్కృతి కాదు) వేసుకోవాలని తీర్మానించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ, అనుసరించే సంస్ధలు విశ్వాసాలు, నమ్మకాలు, సాంప్రదాయాల మీద కోర్టులు తీర్పు చెప్పజాలవనే వాదనను చాలా కాలంగా ముందుకు తెస్తున్నాయి. కూల్చివేసిన బాబరీ మసీదు స్ధలంలోనే రాముడు పుట్టాడని, అక్కడి రామాలయాన్ని కూల్చి బాబరు కాలంలో మసీదు నిర్మి ంచారని వాదిస్తున్నది. దానికి ఎలాంటి ఆధారాలు లేవు. విశ్వాసాలకు ఆధారాలేమిటని ఎదురుదాడికి దిగుతున్నది. బాబరీ మసీదు స్థల యాజమాన్య హక్కుల గురించి దీర్ఘకాలంగా నడుస్తున్న కోర్టు వివాదంలో అది తమకు అనుకూలంగా వస్తే ఈ శక్తులు మిన్నకుంటాయి లేకపోతే తమ విశ్వాసాలను దెబ్బతీశారంటూ ఆ తీర్పును వ్యతిరేకించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అందుకే శబరిమల, శని సింగనాపూర్‌ వంటి వాటిని ఆసరా చేసుకొని తమ వాదనలను ముందుకు తెస్తున్నాయి. అందుకు గాను మహిళలను ముందు నిలుపుతున్నాయి.

మత ప్రాతిపదికన జనాన్ని చీల్చి అధికారానికి రావాలన్న మతోన్మాదుల ఎత్తుగడల్లో ప్రార్ధనా స్దలాలను వివాదాస్పదం చేయటం. దానిలో భాగమే రామాలయాన్ని కూల్చివేసి బాబరీ మసీదును కట్టారనటం, వారణాసిలో ఔరంగజేబ్‌ కాలంలో నిర్మించిన జ్ఞానవాపి మసీదు కాశీవిశ్వనాధుని ఆలయమని వివాదాలను రేపిన విషయం తెలిసినదే. కేరళలో పట్టు సంపాదించేందుకు శబరిమల ఆలయం మీద క్రైస్తవులు కుట్ర చేస్తున్నారనే ప్రచారం కూడా దానిలో భాగమే. ఆలయం పరిసర ప్రాంతాలలో క్రైస్తవులు ఎక్కువగా నివశిస్తున్నారు. అయ్యప్ప ఆలయ సమీపంలో పెద్ద చర్చిని నిర్మించి క్రైస్తవ యాత్రా కేంద్రంగా మార్చాలన్న కుట్ర వుందని ప్రచారం చేస్తున్నారు. నిజానికి కేరళలో క్రైస్తవం ఎన్నో శతాబ్దాల క్రితమే వ్యాపించింది. బ్రాహ్మలతో సహా అనేక నిచ్చెన మెట్ల వ్యవస్ధలో ఎగువున వున్న కులాలవారు ఎప్పుడో క్రైస్తవులుగా మారిపోయారన్నది చరిత్రలో దాగని సత్యం. తెలుగు ప్రాంతాలలో రెడ్డి, కమ్మ క్రైస్తవుల మాదిరి కేరళలో సిరియన్‌ క్రైస్తవులంటే అగ్రకులాలకు చెందిన వారే. తెలుగు ప్రాంతాలలో మాదిరి తాళిబట్టుతో సహా అనేక హిందూ సంప్రదాయాలను వారు పాటిస్తారు. సిరియన్‌ క్రిస్టియన్లు అనేక రంగాలలో ప్రముఖులుగా, ధనికులుగా వున్నారు.వారే ఆ ప్రాంతంలో చర్చి నిర్మించతలపెట్టారన్నది ఆరోపణ. బాబరీ మసీదు నిర్మాణంలో రామాలయ నిర్మాణ స్ధంభాలను వుపయోగించారని ఆధారంలేని ప్రచారం చేస్తున్నట్లే శబరిమల ఆలయానికి 20కిలోమీటర్ల దూరంలోని నీలక్కల్‌ శివాలయంలో రెండువేల సంవత్సరాల నాటి కొయ్య శిలువ బయటపడిందని, దానిని సిరియన్‌ క్రిస్టియన్‌ సమూహ ఆద్యుడు సెయింట్‌ థామస్‌ స్వయంగా తీసుకువచ్చిన 1983లో ప్రచారంలోకి వచ్చింది. సెయింట్‌ థామస్‌ చర్యను సహించని తమిళ బ్రాహ్మడు ఆయనను కత్తితో పొడిచి చంపాడని ప్రచారం చేశారు. దాన్ని నమ్మిన క్రైస్తవులు ఆ ప్రాంతాన్ని సందర్శించటంతో పాటు చర్చి నిర్మాణానికి స్ధలం కావాలని కోరారు. దానికి నిరసనగా బిజెపి నేత, ప్రస్తుతం మిజోరాం గవర్నర్‌గా వున్న కుమనం రాజశేఖర్‌ ఆందోళనకు నాయకత్వం వహించాడు.తరువాత అక్కడకు నాలుగు కిలోమీటర్ల దూరంలో అటవీ భూమిని కేటాయించారు. నిజానికి రెండువేల సంవత్సరాల నాటి కొయ్య మన దేశవాతావరణ పరిస్ధితులలో చెక్కుచెదరకుండా వుండటం అసాధ్యం. అయితే తరువాత వచ్చిన వార్తల ప్రకారం బాబరీ మసీదు ప్రాంగణంలో దొంగతనంగా రాముడి విగ్రహాన్ని పెట్టినట్లే అక్కడి శివాలయంలో శిలువను పెట్టారని తేలింది.హైదరాబాదులో హుస్సేన్‌ సాగర్‌ చెరువుకు హిందూమతశక్తులు వినాయకసాగర్‌ పేరు పెట్టినట్లుగానే క్రైస్తవమతశక్తులు అయ్యప్ప కొండను సెయింట్‌ థామస్‌ కొండగా పిలవటం ప్రారంభించారు.సెయింట్‌ థామస్‌ హత్య వాస్తవం కాదని, ఆయన ఇటలీలోని ఓర్టానాలో మరణించాడని వాటికన్‌ తరువాత వివరణ ఇచ్చింది. నిజానికి సిరియన్‌ క్రిస్టియన్లు వలస వచ్చిన వారి వారసులు కాదని, స్ధానిక బ్రాహ్మలే మతం మార్చుకున్నారని 1883లోనే ప్రచురించిన పుస్తకంలో పేర్కొన్నారు. హిందూ మతశక్తులు ఎలా కుట్రలు చేస్తున్నాయో శబరిమల ప్రాంతంలోని క్రైస్తవ మతోన్మాదులు కూడా అలాంటి వాటిలోనే నిమగ్నమయ్యారని జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d