• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: IMF

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌ రుణం : ఒక్కరూ మనవెనుక రాలే, దేశ పరువు తీశారు, అన్నీ తెలిసి నరేంద్రమోడీ జనాన్ని మభ్యపెట్టారా ?

11 Sunday May 2025

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, WAR

≈ Leave a comment

Tags

IMF, IMF loan, IMF Loan to Pakistan, India Protest to IMF, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు


పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) రెండు ఖాతాలలో 350 కోట్ల డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించింది. దీన్లో తక్షణమే వందకోట్ల డాలర్లు ఇస్తారు. వాషింగ్టన్‌ డిసిలో శుక్రవారం నాడు జరిగిన బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. ఈ మంజూరును అడ్డుకొనేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తామని ఎన్ని కబుర్లు చెప్పినా వాటిని ఖాతరు చేయకుండా రుణం ఖరారైంది. మనకు మద్దతుగా ఒక్కరంటే ఒక్క ఇతర డైరెక్టర్లు రాలేదు. ప్రపంచంలో మన పలుకుబడికి ఇది నిదర్శనమా ? పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలు, పర్యవసానాల్లో పాక్‌ను అష్టదిగ్బంధనం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో ఒకటిగా ఐఎంఎఫ్‌ నిధులు అందకుండా అడ్డుకుంటామన్న ప్రచారం తెలిసిందే. ఐఎంఎఫ్‌, దాని పని తీరు గురించి తెలిసిన వారు దేశంలో నెలకొన్న పరిస్థితులలో ప్రభుత్వం వృధా ప్రయాసకు లోనవుతున్నదని చెబితే మీ సొమ్మేం పోయింది, ఏదో ప్రయత్నం చేస్తున్నారుగా తప్పేముంది అనే వారు కొందరైతే మరి కొందరు దేశద్రోహులుగా చూసే తీరు ఉండటంతో ఎవరూ నోరు మెదపలేదని చెప్పవచ్చు. చిత్రం ఏమిటంటే పెద్ద మీడియా విశ్లేషకులు, సంపాదకులు కూడా పాఠకులను తప్పుదారి పట్టించే కథనాలను అల్లారు. సరే నరేంద్రమోడీ అండ్‌కో వచ్చిన ప్రతి అవకాశాన్నీ తమ ప్రతిష్టకు, ఓట్లు దండుకొనేందుకు ఎంత మేరకు ఉపయోగపడుతుందనే కోణంలో చూడటం కొత్తేమీ కాదు. ఇప్పుడూ జనాన్ని మభ్యపెట్టి అదే ప్రయత్నం చేశారు, భంగపడ్డారు. ఒక తర్కం ఎలా ఉందంటే కాల్పుల విరమణ షరతుల్లో భాగంగా వంద కోట్ల డాలర్ల రుణాన్ని పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌ ఇచ్చిందా అంటూ ఒక మీడియా వార్తకు శీర్షిక పెట్టారు. భారత్‌ దాడుల్లో తమ మిలిటరీ ఆస్తులు ధ్వంసమయ్యాయి గనుక తమకు రుణం ఇస్తే కాల్పుల విరమణ పాటిస్తామని పాకిస్తాన్‌ షరతు పెట్టి ఉండవచ్చని, అదే షరతుతో రుణం ఇచ్చి ఉండవచ్చన్నది ఒక భాష్యం. రుణానికి లంకె పెట్టి పాకిస్తాన్‌ మీద అమెరికా వత్తిడి తెచ్చిందని కూడా సెలవిచ్చారు. ఇది జరిగినదానికి విరుద్దం.


తమకు రుణం ఇవ్వకుండా చూసేందుకు భారత్‌ ప్రయత్నించినప్పటికీ ఐఎంఎఫ్‌ అంగీకరించటం పట్ల పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సంతృప్తి వెల్లడిరచినట్లు పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. మన ప్రధాని నరేంద్రమోడీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే ఆర్థికశాఖ ఒక ప్రకటన చేస్తూ ఉగ్రవాదానికి ఊతమిస్తున్నందుకు రుణాన్ని బహుమతిగా ఇచ్చారని, ప్రపంచ మానవాళికి ప్రమాదకర సంకేతాన్ని పంపారని, నిధులు ఇచ్చే సంస్థలు, దాతలకు గౌరవాలకు భంగకరమని, ప్రపంచ విలువలను తక్కువగా చూసిందని విమర్శించింది.పాకిస్తాన్‌కు రుణమిస్తే ఆ మొత్తాన్ని సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగిస్తుందని, గతంలో ఇచ్చిన రుణాలను దుర్వినియోగం చేసిందని మన ప్రభుత్వం గట్టి అభ్యంతరాలను వ్యక్తం చేసింది.ఓటింగ్‌ సందర్భంగా మన నిరసన నమోదు చేసి ఓటింగ్‌ను బహిష్కరించింది.


పాక్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం.దేశ విదేశీ రుణ భారం 2024 నాటికి 130 బిలియన్‌ డాలర్లకు చేరింది. ప్రపంచ బ్యాంకు 48 బిలియన్‌ డాలర్లు ఇచ్చింది, 2025 మార్చి నెలాఖరుకు ఐఎంఎఫ్‌ ఇచ్చిన రుణాలు 6.2బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. అనేక దేశాల నుంచి చేబదులు మాదిరి సాయం పొందుతున్నది. తిరిగి కోలుకొనేందుకు, నిర్వహణకు అవసరమైన నిధి(ఆర్‌ఎస్‌ఎఫ్‌) పేరుతో 140 కోట్ల డాలర్లు, మరోఖాతా కింద 210 కోట్ల డాలర్లను ఇచ్చేందుకు సూత్రప్రాయంగా 2024 సెప్టెంబరు 25న ఐఎంఎఫ్‌ ఆమోదించింది.మార్చి నెల 25న అధికారుల స్థాయిలో ఐఎంఎఫ్‌, పాకిస్తాన్‌ రుణం గురించి ఒప్పందానికి వచ్చాయి. ఏడువందల కోట్ల డాలర్లను వంతుల వారీగా ఇస్తారు. 2025 మే నెల తొమ్మిదిన వాటి గురించి సమీక్షించి రానున్న 37నెలలో వాటిని విడుదల చేసేందుకు అంగీకరించింది. మొత్తం 700 కోట్ల డాలర్ల రుణం కావాలని పాకిస్తాన్‌ కోరింది.గతేడాది ఆగస్టు నాటికి 9.4బిలియన్‌ డాలర్లు ఉన్న విదేశీమారక ద్రవ్య నిల్వలు ఏప్రిల్‌ చివరి నాటికి 10.3బి.డాలర్లకు పెరిగాయి, వాటిని జూన్‌ నాటికి 13.9 బిలియన్లకు పెంచాలన్నది లక్ష్యం.ఆర్‌ఎస్‌ఎఫ్‌ నిధులతో ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినపుడు పునరుద్దరణ, చార్జీల వసూలుతో సహా నీటిని మరింత పొదుపుగా వాడేందుకు చర్యలు, కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం, సమాచార వ్యవస్థల మెరుగుదల వంటి అంశాలు చేపట్టాల్సి ఉంది. సవాళ్ల వాతావరణం ఉన్నప్పటికీ స్థూల అర్థిక స్దిరత్వం పునరుద్దరణ జరుగుతున్నదని ఐఎంఎఫ్‌ పేర్కొన్నది. వ్యవసాయ ఆదాయంపై పన్ను విధింపుతో సహా అనేక సంస్కరణలను చేపట్టినట్లు తెలిపింది.సకాలంలో విద్యుత్‌ ఛార్జీల సవరణ ద్వారా రుణభారం తగ్గిందని, పాకిస్తాన్‌ రిజర్వుబాంకు గట్టి చర్యల కారణంగా రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం తగ్గిందని, వ్యవస్థాగత సంస్కరణలు చేయాలని పేర్కొన్నది. నక్షత్రకుడి మాదిరి జనానికి వ్యతిరేకమైన షరతులతో పాకిస్తాన్‌ రుణాలు తీసుకున్నది. మనదేశంలో మాదిరి ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల నిలిపివేత, మూసివేత, తెగనమ్మటం, వినియోగదారుల నుంచి సేవలకు ఛార్జీలు, విద్యుత్‌ ఇతర రంగాలలో సంస్కరణల వంటివి వాటిలో ఉన్నాయి.


ఐఎంఎఫ్‌ నిబంధనల ప్రకారం ప్రతి దేశానికి ఓటింగ్‌ సంఖ్య ఉంటుంది. ఆ మేరకు ఇతర సందర్భాలలో ఓటు వేయవచ్చు. రుణాల మంజూరు విషయంలో ఏకాభిప్రాయమేగాని ఓటింగ్‌ ఉండదు. అంగీకారం లేని దేశం దూరంగా ఉండటం తప్ప వ్యతిరేక ఓటు వేసేందుకు అవకాశం లేదు. తాజాగా మనదేశం అదే చేసింది. ఐఎంఎఫ్‌లో ఓటింగ్‌ బలాబలాల విషయాన్ని చూద్దాం. అమెరికా 16.49, జపాన్‌ 6.14, చైనా 6.08. మొత్తం 25 మంది డైరెక్టర్లలో ఈ మూడు దేశాలకు ఒక్కొక్క డైరెక్టర్‌ నిరంతరం ఉంటారు. మిగిలిన 22 మందిని దేశాలతో కూడిన 22 బృందాలు వంతుల వారీ ఎన్నుకుంటాయి. ఉదాహరణకు బంగ్లాదేశ్‌,భూటాన్‌,శ్రీలంక, భారత్‌ కలసి ఒక బృందం. ఈ దేశాల నుంచి ఎవరో ఒక మాత్రమే ఉంటారు.వీటన్నింటి ఓటింగ్‌ బలం 3.05 మాత్రమే. మొత్తం ఓట్లు 49,91,063 కాగా చైనాకు 3,06,281 కాగా మన బృంద దేశాలన్నింటికీ కలిపి ఉన్నది 1,53,610 కాగా మన దేశానికి 1,32,596, బంగ్లాదేశ్‌ 12,118, శ్రీలంక 7,240, భూటాన్‌ 1,656 ఉన్నాయి. వేరే గ్రూపులో ఉన్న పాకిస్తాన్‌కు 21,762 ఉన్నాయి. ప్రస్తుతం మన దేశం నుంచి పరమేశ్వరన్‌ అయ్యర్‌ తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్నారు.


పాక్‌పై గతంలోనే ఒక అంచనాకు వచ్చిన ఐఎంఎఫ్‌ రుణం ఇవ్వకుండా ఉంటుందని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఉగ్రవాదులకు మద్దతు, శిక్షణ ఇవ్వటం, ఇతర దేశాల మీదకు వదలటం ఇస్లామాబాద్‌కు కొత్త కాదు. తాము శిక్షణ ఇచ్చినట్లు ఆ దేశ మంత్రే స్వయంగా చెప్పాడు. అయినప్పటికీ దశాబ్దాలుగా ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ రుణాలు, గ్రాంట్లు ఇస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదానికి వాటికి లంకె పెట్టలేదు.ఒక్క పాకిస్తానే కాదు, ఏ దేశానికీ అలాంటి షరతులేదు. అలాంటి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధన ఉండి ఉంటే అసలు ఏ దేశానికీ రుణం పొందే అర్హత, అవకాశం ఉండదు. ఏదో ఒక ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణ లేదా విమర్శలకు గురికాని దేశం ఒక్కటంటే ఒక్కటి లేదు. పహల్గాం ఉగ్రదాడితో నిమిత్తం లేకుండానే ముందే చెప్పినట్లు నెల రోజుల ముందే అధికారుల మధ్య కుదిరిన ఒప్పందానికి లాంఛన ప్రాయంగా ఆమోద ముద్రవేయటం తప్ప మే తొమ్మిది సమావేశానికి మరొక అజెండా లేదు. ఈ విషయాలన్నీ మన విధాన నిర్ణేతలు, పరిశీలకులకు తెలియవా ? తెలిసి కూడా జనంలో ఉన్న మనోభావాలను సొమ్ము చేసుకొనేందుకు, వ్యతిరేకిస్తున్నట్లు నాటకం ఆడారా ? ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దాయాదిని ఒంటరి పాటు చేసే క్రమంలో మిగిలిన దేశాలు కలసి వచ్చినపుడు ఒకటి రానపుడు వేరే ఎత్తుగడలను అనుసరించాల్సి ఉంటుంది. అందుకోసం తెరవెనుక ప్రయత్నాలు చేశారా ?2019లో పుల్వామా దాడికి ప్రతిగా మనం బాలాకోట్‌పై మెరుపుదాడి చేశాము. అప్పటి నుంచి లేదా అంతకు ముందు జరిగిన దాడుల నాటి నుంచి ఐఎంఎఫ్‌ లేదా ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇస్లామాబాద్‌కు రుణాలు ఇస్తే వాటిని ఉగ్రవాదులకు మళ్లిస్తారని మన దేశం చేసిన ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా అంటే మీడియాలో అలాంటి ఛాయలు లేవు. అంతర్గతంగా వత్తిడి తెచ్చారేమో మనకు తెలియదు కదా అని అమాయకంగా చెప్పేవారు ఉండవచ్చు. ఆ ప్రకారం చూసినా నిజమే అనుకుంటే ఒక్కదేశం కూడా మన మాటకు గౌరవమిచ్చి మనతో పాటు కలసి రాలేదు. మన నిరసన తెలిపేందుకు బహిష్కరించామని ఇప్పుడు కొంత మంది చెబుతున్నారు. దానికి ముందు అడ్డుకుంటామని, మరేదో చేస్తామనే ప్రచార ఆర్భాటం ఎందుకు, ఆ మాటలు నమ్మి అనేక మంది నరేంద్రమోడీకి ప్రపంచంలో నిజంగానే అంత పలుకుబడి ఉందని అనుకున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల పాటు ఉక్రెయిన్‌ యుద్దాన్ని ఆపారని, చైనా, అమెరికాలను మన చుట్టూ తిరిగేట్లు చేశారనే ప్రచారాలు, భజనలూ తెలిసిందే. మన అభిప్రాయాలను ఖాతరు చేయని ఐఎంఎఫ్‌ నుంచి మన దేశం నిరసనగా తప్పుకుంటుందా ? అవమానాన్ని దిగమింగి కొనసాగుతుందా ? ఖ్యాతి అయినా అపఖ్యాతి అయినా నరేంద్రమోడీ ఖాతాలోనే పడతాయి మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు ఆదేశాల అమలుకు నరేంద్రమోడీ, పాకిస్తాన్‌ జీ హుజూర్‌ !

19 Thursday Sep 2024

Posted by raomk in Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, farm crisis, IMF, IMF ‘stops’ Pakistan govt, Narendra Modi Failures, Pakistan default, World Bank


ఎం కోటేశ్వరరావు


ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమను ఆదుకోవాలని అడిగిన పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌ పెట్టిన షరతేమిటో తెలుసా ? వర్తమాన తరుణం నుంచి 37 నెలల రుణవాయిదాల కాలంలో 2026 జూన్‌ నాటికి క్రమంగా వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరల ఎత్తివేతను అమలు జరపాలంది. అక్కడి ఐదు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పాటించాలని చెప్పింది. ఇలాంటి షరతులనే మనకూ ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ పెట్టాయి. రైతాంగానికి భయపడి కాంగ్రెస్‌ పాలకులు వాటిని అమలు జరిపేందుకు సాహసించలేదు. తాయత్తు కట్టుకొని జై భజరంగ భళీ అంటూ నరేంద్రమోడీ మూడు సాగు చట్టాల రూపంలో వాటిని రుద్దేందుకు చూశారు. ఫలితాన్ని, పర్యవసానాలను అనుభవించటం చూస్తున్నాము. దివాలా స్థితిలో ఉన్న పాకిస్తాన్ను ఆదుకొనేందుకు అమెరికా పైరవీతో ఐఎంఎఫ్‌ 700 కోట్ల డాలర్ల సాయం అందించేందుకు అంగీకరించింది. దానికి గాను ఒక షరతు పెట్టింది. తమ అప్పు తీరాలంటే రైతులతో సహా ఎవరికీ రాయితీలు, సబ్సిడీలు ఇవ్వకుండా ‘‘పాదుపు’’ చేయాలంది. దానికి గాను ప్రభుత్వ ఖర్చు తగ్గించాలన్నది. కావాలంటే ప్రభుత్వం తన అవసరాలకు మార్కెట్‌ ధరలకు కొనుగోలు చేసి అదే ధరలకు విక్రయించాలి తప్ప సబ్సిడీలు కుదరవంది. ఐఎంఎఫ్‌ షరతు అమల్లోకి వస్తే కనీస మద్దతు ధరలూ ఉండవు, ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన బాధ్యతా ఉండదు. పొదుపు పాటింపులో భాగంగా ఎరువులు, విద్యుత్‌ తదితర రాయితీలు రద్దు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పాక్‌ పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం గోధుమల సేకరణ నిలిపివేయటంతో బహిరంగ మార్కెట్‌లో 40శాతం ధరలు పడిపోయాయి. తరువాత వంతు చెరకు, పత్తి ధర ప్రకటన విధాన రద్దు అంటున్నారు. వినియోగదారులకు ఇస్తున్న గాస్‌ సబ్సిడీ తదితరాలకు దశలవారీ కోత పెడతారు. ఇది పాకిస్తాన్‌కే తప్ప సురక్షితమైన హస్తాలు ఉన్న నరేంద్రమోడీ ఉన్నంత వరకు భారత్‌కు వర్తించదు అని ఎవరైనా అనుకుంటే చేసేదేమీ లేదు.గతంలో 1990దశకంలో తప్ప తరువాత కాలంలో మనదేశం ఐఎంఎఫ్‌ నుంచి అప్పులు తీసుకోలేదు. ప్రపంచ బ్యాంకు నుంచి వివిధ పధకాలకు ప్రాజెక్టు రుణాలు తీసుకుంటున్నాం. కుడికన్ను ఎడమ కన్ను తేడా తప్ప రెండు సంస్థల నుంచి తీసుకొనే రుణాలకు షరతులు షరా మామూలే.మన దేశంలో ఎరువుల ధరల నియంత్రణ విధానాన్ని ఎత్తివేసి పరిమితంగా కొన్నింటికి సబ్సిడీ విధానం అమలు చేస్తున్నారు. ఎగుమతులకు సబ్సిడీలు ఇవ్వకూడదు దిగుమతుల మీద పన్ను విధించకూడదన్న షరతులు కూడా ఐఎంఎఫ్‌ విధించింది. మన దేశం కూడా చేస్తున్నది అదే. చిత్రం ఏమిటంటే మన పాలకులు పాకిస్తాన్‌తో కొట్లాడినట్లు జనం ముందు ఫోజు పెడతారు. ఇద్దరిని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ పిలిపించినపుడు వాటి ముందు చెప్పినట్లే చేస్తాం జీ హుజూర్‌ అంటూ చేతులు కట్టుకొని నిలబడటం తప్ప వ్యతిరేకించే ధైర్యం లేదు.


అన్ని అవకాశాలూ మూసుకుపోయిన తరువాతనే ఏ దేశమైనా ఐఎంఎఫ్‌ వద్దకు అప్పుకోసం వెళుతుంది.ఒకసారి తీసుకుంటే దాని రుణ ఊబిలో చిక్కుకున్నట్లే. పాత అప్పులు తీసుకొనేందుకు కొత్త రుణాలు తీసుకోవాల్సిందే.రుణాలు తీసుకున్న దేశాల మీద సర్‌ఛార్జీలు విధించి జలగలా పీల్చుతుంది. ఈ విధానం మీద తీవ్ర విమర్శలు తలెత్తటంతో సర్‌ఛార్జీల రూపంలో వచ్చిన రాబడిని రాయితీలతో కూడిన రుణాలు ఇవ్వటానికి వినియోగిస్తామని చెబుతోంది. ఇది మోసం తప్ప మరొకటి కాదు.తీసుకున్న రుణాల మీద వడ్డీ, సేవారుసుముల మీద అదనపు వసూలునే సర్‌ఛార్జి అంటారు.జనం భాషలో చక్రవడ్డీ. రుణాలు ఎక్కువగా తీసుకోకుండా దేశాలను నిరోధించేందుకే వాటికే విధిస్తున్నామని వితండవాదం చేస్తోంది. ఇబ్బందుల్లో ఉన్న దేశాలను ఉద్దరించటానికే తాము రుణాలు ఇస్తున్నామని ఐఎంఎఫ్‌ చెబుతుంది. అదే నిజమైతే ఇప్పటికి 24సార్లు రుణం తీసుకున్న పాకిస్తాన్‌ పరిస్థితి ఇప్పుడేమిటి ? దాన్ని ఉద్దరించిందీ లేదు, మరోసారి అప్పుకు రాకుండా చూసిందీ లేదు. ఐఎంఎఫ్‌కు చక్రవడ్డీలు చెల్లిస్తున్న ఐదు దేశాల్లో అదొకటిగా మారింది. పాకిస్తాన్‌ జిడిపిలో 70శాతం మేరకు అప్పులున్నాయి. ప్రభుత్వ ఆదాయంలో 50 నుంచి 60శాతం అసలు, వడ్డీల చెల్లింపులకే పోతోంది. మన ప్రభుత్వ రుణ భారం కూడా వందశాతానికి చేరనుందని ఐఎంఎఫ్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. రానున్న ఐదు సంవత్సరాల్లో 22 దేశాల నుంచి ఐఎంఎఫ్‌ అదనపుబాదుడు 980 కోట్ల డాలర్లు ఉంటుందని, వాటిలో 2024 నుంచి 2033 వరకు ఉక్రెయిన్‌ 290 కోట్ల డాలర్ల మేర చెల్లించనుందని తేలింది.ధనిక దేశాల మీద ఆధారపడకుండా స్వంతంగా నిధులు సమకూర్చుకోవాలంటే అదనపు వసూలు తప్పదని సమర్థకులు చెబుతున్నారు. అంటే దివాలా స్థితిలో ఉన్నవాటి దగ్గర వసూలు చేసి ఆ మొత్తాన్నే తిరిగి వడ్డీలకు ఇస్తారన్నమాట, ఈ విధంగా కూడా ధనికదేశాలకు ఐఎంఎఫ్‌ మేలు చేస్తున్నది.


ఇబ్బందుల్లో ఉన్న 22 దేశాల నుంచి అదనపు బాదుడు ద్వారా ఐఎంఎఫ్‌కు వస్తున్న ఆదాయం ఎక్కువగా ఉంది. అలాంటి దేశాలను రక్షించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ నిధి చివరికి చక్రవడ్డీ వ్యాపారిలా మారి పీక్కుతింటోంది.2020లో అదనపు చెల్లింపు దేశాల సంఖ్య పది కాగా కరోనా దెబ్బతో కుదేలై ఐఎంఎఫ్‌ దగ్గరకు అప్పుకోసం వెళ్లిన మరోపన్నెండు దేశాలు వాటి సరసన చేరాయి. ఈ సంస్థ వడ్డీ రేటు ఒకటి నుంచి ఐదుశాతానికి పెరగ్గా, సర్‌ఛార్జి చెల్లించే దేశాలకు అది 7.8శాతంగా ఉంటోంది. అందువలన ఈ దేశాలు అప్పుల ఊబినుంచి బయటపడే అవకాశమే లేదని అనేక మంది ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ అప్పు, వడ్డీ చెల్లించటానికి ఆ దేశాల పాలకులు జనాన్ని పీక్కు తింటారు. ఈ క్రమంలో మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు అంతర్జాతీయ మానవహక్కుల పరిశీలన సంస్థ(హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌) ఏడాది క్రితం ‘‘ బుల్లెట్‌ గాయంపై బాండేజ్‌ ’’ పేరుతో 131పేజీల నివేదికలో వెల్లడిరచింది. ఐఎంఎఫ్‌ షరతులు అనేక సంక్లిష్ట పరిస్థితులను సృష్టించటమేగాక అసమానతలను కూడా పెంచుతున్నాయని చెప్పింది.


2020 మార్చి నెల నుంచి 2023 మార్చి నెల వరకు 110 కోట్ల జనాభా ఉన్న 38దేశాలకు ఇచ్చిన రుణాలను ఆ నివేదికలో విశ్లేషించారు. పొదుపు షరతులే అత్యధికంగా ఉన్నాయి. ప్రభుత్వ ఖర్చు తగ్గింపు, రాబడి పెరిగే కొద్దీ మధ్యతరగతి, ధనికులు చెల్లించాల్సిన పన్ను రేటు తగ్గింపు, తక్కువ ఆదాయం వచ్చేవారి మీద పన్ను పెంపు విధానాలను అది రుద్దుతున్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా అనేక దేశాల్లో జనం ఆందోళనలకు దిగుతున్నారు.ఈ షరతుల వలన ఆయా దేశాల రుణ దామాషాలు తగ్గటం లేదని స్వయంగా ఆ సంస్థ నివేదికలోనే పేర్కొన్నారు. దాని 39 ప్రాజెక్టులను సమీక్షించగా 32లో ఏదో ఒక ఆదేశం లేదా షరతు మానవహక్కులను ఉల్లంఘించేదిగా ఉందని తేలింది. ఇరవై రెండిరటిలో ప్రభుత్వ వేతన బిల్లు తగ్గించేందుకు వేతన స్థంభన, వేతన పరిమితి లేదా తగ్గింపు షరతులు ఉన్నాయి.ఇరవై మూడు ఉదంతాలల్లో వ్యాట్‌ పెంచాలనే ఆదేశాలున్నాయి. ఇరవై ప్రాజెక్టుల్లో ఇంథనం, విద్యుత్‌ సబ్సిడీల తగ్గింపు, సామాజిక భద్రతా పథకాల ఖర్చు తగ్గింపు వంటివి ఉన్నాయి. మన దేశంలో నరేంద్రమోడీ సర్కార్‌ పెట్రోలు, డీజిలు మీద పెద్ద మొత్తంలో సెస్‌ల పేరుతో వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి అంశాలపై ఖర్చు తగ్గించటం, ప్రభుత్వాలు ఆ రంగాల నుంచి వైదొలగటం లేదా నామమాత్రంగా ఉండాలన్నది ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు చెప్పే సలహాలు లేదా ఆ ముసుగులో ఆదేశాలు ఉంటాయి. ఈ రెండు సంస్థలను బ్రెట్టన్‌ఉడ్‌ కవలలు అంటారు. ఎందుకంటే ఒకే దగ్గర అవి రూపుదిద్దుకున్నాయి.నాణానికి బొమ్మ బొరుసు వంటివి. రెండూ వేర్వేరుగా ఉన్నప్పటికీ సమన్వయంతో పనిచేస్తాయి. దేశాల మీద ఆదేశాలను రుద్దుతాయి. వాటి దగ్గరకు వెళ్లక ముందు మన దేశంలో రోడ్లకు టోల్‌టాక్సు, సెస్‌లు, వినియోగదారుల రుసుముల వంటి భారాలు లేవు. పెట్రోలు, డీజిలు మీద భారీగా ఒకవైపు పన్నులు సెస్‌ల వడ్డింపు,వాహనాలకు జీవితకాల పన్ను, మరోవైపు అవి రోడ్ల మీద తిరిగితే టోల్‌టాక్సు. దీన్నే గోడదెబ్బ`చెంపదెబ్బ అంటారు.


ఐఎంఎఫ్‌ విధానాలను అమలు జరిపిన జోర్డాన్‌ పరిస్థితిని మానవహక్కుల సంస్థ విశ్లేషించింది.2011 నుంచి 2017 మధ్య అక్కడ వృద్దాప్య పెన్షన్ల వంటి సామాజిక భద్రతా బడ్జెట్‌ను గణనీయంగా తగ్గించారు. ఇంథనం, రొట్టెల మీద ఉన్న సబ్సిడీలను(మనదేశంలో పెట్రోలు,డీజిలు, గ్యాస్‌ మాదిరి) ఎత్తేశారు.తద్వారా ఆరు సంవత్సరాల్లో 110 కోట్ల డాలర్లను పొదుపు చేశారు.కోటీ పది లక్షల మంది జనాభాకు గాను కేవలం లక్షా ఇరవై వేల మందికి 2019లో ప్రపంచ బ్యాంకు సహకారంతో ఐఎంఎఫ్‌ పధకాల్లో నగదు బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టారు.తమకూ వర్తింపచేయాలని కోరిన వారిని వేధించారు, అణచివేశారు. 2018 నుంచి 2022 కాలంలో దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారు 15 నుంచి 24శాతానికి పెరిగారు. దరఖాస్తు చేసుకున్న అత్యధికులకు తిరస్కరించారు. కేంద్రం అనుమతి ఇవ్వని కారణంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గత పది సంవత్సరాలుగా కొత్తగా తెల్లరేషన్‌ కార్డుల జారీ నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఇదీ మానవహక్కుల ఉల్లంఘనకిందికే వస్తుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వికసిత భారత్‌ 2047 : కనుచూపు మేరలో లేదు ! నరేంద్రమోడీ గాలి తీసిన ప్రపంచ బ్యాంకు !! కాదనే దమ్ము, ధైర్యం ఉందా !!!

04 Sunday Aug 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

BJP, IMF, Narendra Modi Failures, RSS, Viksit Bharat 2047, Vision India@2047, World Bank, World Development Report 2024


ఎం కోటేశ్వరరావు


త్వరలో మరో తిరంగా జెండా పండగ జరుపుకోబోతున్నాం. చరిత్రను చూస్తే పరాయి పాలనలో ఆ జెండాను ఎగుర వేస్తే దేశ ద్రోహం, ప్రాణాలకు తెగించి ఆవిష్కరించటమే దేశభక్తి. నేటి పాలకులు అదే జెండాను ఎగురవేస్తూ చెప్పే కబుర్లలో నిజాయితీని ప్రశ్నించటమే దేశద్రోహంగా పరిగణించబడుతున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశ అభివృద్ధి గురించి కబుర్లు చెప్పేవారు అపర దేశ భక్తులు, వారి విధానాల బండారాన్ని ప్రశ్నించేవారు క్షమించరాని దేశద్రోహులు.నేడు దేశంలో జరుగుతున్న ప్రచారదాడిలో నలుగుతున్న అంశమిది. ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి ఓట్లేయించుకొని తప్పించుకు తిరుగువారు మనకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కనిపిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పిన అభివృద్ధి కబుర్లలో వెయ్యోవంతు ఆచరించినా దేశం ఈ స్థితిలో ఉండేది కాదు. స్వాతంత్య్రం మాకేమిచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమయ్యేది కాదు. 2047వరకు ఒకటే లక్ష్యంగా అదే వికసిత్‌ భారత్‌గా ఉండాలని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.దాని అమలు గురించి ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఈ దేశంలో ఉండటం లేదా ? ఇక్కడి గాలి పీల్చటం లేదా ఇక్కడి తిండి తినటం లేదా అని ఎదురుదాడి చేస్తున్నారు. అసలు వికసిత భారత్‌ అంటే ఏమిటి ?


రెండు సంవత్సరాలకు పైగా నీతి ఆయోగ్‌ నిర్దేశం మేరకు అధికారులు మధనం చేసి తీసుకువచ్చిందే వికసిత భారత్‌ 2047 ప్రణాళిక. అంటే అప్పటికి స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు నిండుతాయి గనుక ఆనాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన వాటి జాబితాలో చేర్చే విధంగా పని చేస్తామన్నారు. దాని ప్రకారం దేశ జిడిపి 30లక్షల కోట్ల డాలర్లకు, తలసరి సంపద 18 నుంచి 20వేల డాలర్లకు పెరుగుతుంది.నవకల్పన, సాంకేతికంగా ప్రపంచ నేతగా ఎదుగుతుంది, మానవాభివృద్ధి, సామాజిక సంక్షేమంలో ఆదర్శవంతంగా తయారవుతుంది, పర్యావరణాన్ని కాపాడే ఒక మొనగాడుగా నిలుస్తుంది. సరిగ్గా దీన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023 డిసెంబరు 11న ప్రధాని నరేంద్రమోడీ ”వికసిత్‌ భారత్‌ 2047: యువ గళం ” పేరుతో విడుదల చేశారు. ఈ ప్రకటన చేసేందుకే మోడీకి పదేండ్లు పట్టింది. మనకంటే ఎంతో ముందంజలో ఉన్న చైనా 2012లోనే 2049 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యాన్ని ప్రకటించింది. దీన్ని చూసి ఎవరైనా చైనా కంటే మనమే ముందుంటాం అని టాంటాం వేసుకుంటే చేయగలిగిందేమీ లేదు, నిజంగా అభివృద్దిలో పోటీ పడాలని కోరుకుందాం.


కొన్ని వాదనలు, తర్కాన్ని చూద్దాం. చైనాను పక్కకు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా, సరకుల ఎగుమతి దేశంగా మనదేశాన్ని మారుస్తామని మోడీ(సంఘ) పరివారం చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైనా ఎగుమతుల్లో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. మనవారేం చెప్పారు, 2030 నాటికి మన ఎగుమతుల విలువ 1.58లక్షల కోట్లు కాగా దిగుమతులు 1.88 ఉంటాయని, 2047 నాటికి మన ఎగుమతుల విలువ 8.67లక్షల కోట్ల డాలర్లుగా, దిగుమతులు 12.12లక్షల కోట్ల డాలర్లుగా ఉంటాయని జోశ్యం. దీని అర్ధం, భాష్యాన్ని సంస్కృత, వేదపండితులే చెప్పాలి. తేడా తగ్గాలి లేదా ఎగుమతులు పెరగాలి, దానికి విరుద్దంగా ఉంటుందని చెబుతున్నారు.ఇక ఇప్పుడు మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఎందుకున్నాయంటే మనదేశంలో వృద్ది పెరిగి ఎక్కువ మంది వస్తు వినియోగం చేస్తున్నారు గనుక ఇది నరేంద్రమోడీ సాధించిన ఘనత అన్నారు. అదే అయితే ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులు చేసుకోక చైనా నుంచి విదేశీ కంపెనీలు మనదేశానికి వస్తున్నాయి, మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, అన్నీ ఇక్కడి నుంచే అందరికీ ఎగుమతి చేస్తాం అన్న కబుర్లు ఎందుకు ? ఇప్పుడు చైనా దిగుమతులు తక్కువగా ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి గనుక డ్రాగన్‌ కంటే మనమే మెరుగ్గా ఉన్నట్లా ? దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అంటే ఇదే. కాంగ్రెస్‌ 50 సంవత్సరాల్లో చేసిందాన్ని తాను కేవలం తొలి ఐదేండ్లలోనే చేసి చూపించానన్నారు మోడీ. పదేండ్ల తరువాత ఏం చెప్పారు. ఇప్పటి వరకు చూపింది ట్రైలరే అసలైన సినిమా ముందు ఉంటుంది అన్నారు. వికసిత భారత్‌లో దిగుమతులే ఎక్కువ అంటే మన సొమ్మును విదేశాలకు పంపిస్తామని, విదేశాల్లో ఉన్న కార్మికులకు ఉపాధి చూపుతామని చెప్పటమే! నిజమేలే, ఎందుకంటే మోడీ విశ్వగురువు గనుక ప్రపంచమంతటి మంచి చెడ్డలు చూసుకోవాలి మరి !


అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలనుకుంటే సంకల్పం చెప్పుకుంటే చాలదు. తాజాగా ప్రపంచ బ్యాంకు వెలువరించిన 2024 ప్రపంచ అభివృద్ధి నివేదిక మోడీ అండ్‌ కో ప్రచార గాలి తీసింది. అధికాదాయ స్థాయికి చేరేందుకు ప్రస్తుతం భారత్‌, చైనాలతో సహా 108దేశాలు తీవ్రమైన ఆటంకాలను ఎదుర్కొంటున్నాయని ఆ నివేదికలో పేర్కొన్నది. ఐఎంఎఫ్‌ 2024 అంచనా ప్రకారం అమెరికా తలసరి ఆదాయం 85,373, ప్రపంచ బ్యాంకు 2022 అంచనా మేరకు 76,330, ఐరాస 2021 లెక్కల ప్రకారం 69,185 డాలర్లు ఉంది. వీటిలో నాలుగో వంతు స్థాయికి అంటే ప్రపంచ బ్యాంకు మొత్తాన్నే తీసుకుంటే 19,082 డాలర్లకు చేరటానికి భారత్‌కు 75, ఇండోనేషియాకు 70, చైనాకు పది సంవత్సరాలు పడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది.అదే ప్రపంచ బ్యాంకు తాజా అంచనాను పరిగణనలోకి తీసుకుంటే 21,343 డాలర్లు, కానీ వికసిత భారత్‌ 2047 నాటికి అంటే మరో 23 సంవత్సరాల్లోనే 18 నుంచి 20వేల డాలర్లకు చేర్చుతామన్నారు మోడీ. మన ప్రభుత్వం,నీతి ఆయోగ్‌ ఇచ్చిన లెక్కలు, సమాచారాన్నే ఆధారం చేసుకొని 75 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ బ్యాంకు చెప్పింది. ఎక్కడన్నా పోలిక ఉందా ? తాను మానవ మాత్రుడిని కాదని తన పుట్టుక గురించిచెప్పిన మోడీ ఏదో శక్తి నడిపిస్తున్నదని కూడా అన్నారు. ప్రపంచ బ్యాంకు చెప్పినదాని ప్రకారం మోడీ మరో 75 సంవత్సరాలు ఇలాగే ఉండాలి. చూద్దాం, ఆ మాటలను నమ్మేవారి మనోభావాలను ఎందుకు గాయపరచాలి. త్వరలో చైనాను కూడా అధిగమిస్తామని రంగుల కలను చూపుతున్నారు. ప్రపంచ బ్యాంకు చెప్పినదాని ప్రకారం మన దేశం ఆరున్నర దశాబ్దాలు చైనా కంటే వెనుక ఉంటుంది.మనదేశం గురించి అనేక అంతర్జాతీయ సంస్థలు ఆకలితో సహా ఇచ్చిన సూచికలు వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించటం లేదని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రపంచబ్యాంకు జోశ్యం మీద ఎందుకు స్పందించలేదు ? మన నీతి ఆయోగ్‌ మన పాలకులు చెప్పినట్లు నివేదికలు రాస్తుంది, వాటినే నమ్మాలని జనానికి చెబుతుంది ? ప్రపంచబ్యాంకు మన విశ్వగురువు కనుసన్నలలో నడవదు, దాని విశ్లేషణను తిరస్కరిస్తే అదిచ్చే అప్పులు మనకు రావు. దాన్నుంచి అప్పులు తీసుకోవటం మానుకున్నారని, అది మోడీ ఘనత అని చెప్పారు. కానీ మన సర్కార్‌ తాజాగా హరిత ఇంథన అభివృద్ధి కోసం 150 కోట్ల డాలర్లు ఇప్పటికే అప్పు తీసుకుంది, అమరావతి నగరం కోసం15వేల కోట్ల రూపాయలకు సమానమైన మరో 180 కోట్ల డాలర్లకు హామీగా ఉండి ఆంధ్ర ప్రదేశ్‌కు అప్పు ఇప్పిస్తామని ఇటీవలనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ బ్యాంకును తప్పుపడితే అవేవీ రావు.


ప్రపంచ బాంకు చెప్పినదానికి ప్రాతిపదిక ఏమిటి ? గత ఐదు దశాబ్దాలలో జరిగినదాన్నుంచి తీసుకున్న పాఠాలే.2023 చివరి నాటికి ఉన్న స్థితి ప్రకారం 108దేశాలను మధ్య తరహా ఆదాయ తరగతిలో చేర్చారు.ఈ దేశాల్లో ప్రపంచ జనాభాలో నూటికి 75శాతం(ఆరువందల కోట్లు లేదా ప్రతి ముగ్గురిలో ఇద్దరు ) ఉన్నారు. వీరి తలసరి జిడిపి 1,136నుంచి 13,845 అమెరికన్‌ డాలర్ల వరకు ఉంది.అంతకంటే ఎక్కువ ఉన్న దేశాలు అరవై ఆరు ఉన్నాయి. మలేసియా 13,315 డాలర్లతో 67, చైనా 13,136 డాలర్లతో 68వదిగా ఉంది. మన దేశం మొత్తం 191దేశాలలో 2,71 డాలర్లతో 136వ స్థానంలో ఉంది. మంచి మాటలు చెబుతుంటే సానుకూలంగా (బి పాజిటివ్‌) ఉండాల్సింది పోయి, మన దేశంలో జరుగుతున్నదాన్ని ప్రశ్నించటం ఏమిటనే వారు రెండు రకాలు. ఏదో చెబుతున్నారుగా వ్యతిరేకంగా మాట్లాడటం ఎందుకు అనేవారు ఒకరు, అసలు ప్రశ్నించకూడదు అనే దుష్టాలోచన బుర్రలో పెట్టుకున్న వారు మరొకరు. దేన్నయినా ప్రశ్నించటం, సందేహం వెలిబుచ్చటం మానవనైజం. అదే జంతువుల నుంచి వేరే చేసింది. అందువలన ప్రశ్నించేవారు చెప్పేదాన్లో ఏముందో ఆలోచించాలా వద్దా ? స్వామివారు చెప్పింది వేదవాక్కు దాన్ని ప్రశ్నించకూడదు, ఇది తరతరాల భారత సంస్కృతి అనే పరిరక్షకుల కారణంగానే మన సమాజంలో ఎందుకు అనే జిజ్ఞాస పుచ్చి చచ్చిపోయింది. ఎండిపోయిన నదులను తిరిగి నీటితో నింపుతున్నారు, నిలిచిపోయిన జలలో తిరిగి నీరు వచ్చేట్లు చేస్తున్నారు. అలాంటపుడు చెవుల్లో సీసం పోసుకున్నవారిని ఎవరూ ఏమీ చేయలేముగానీ ఇతరుల్లో ఆలోచనను కలిగించలేమా ? ఎవరూ మనోభావాలను గాయపరచుకోనవసరం లేదు. ఎవడబ్బ సొమ్మని అంటూ భక్త రామదాసు రాముడినే ప్రశ్నించినపుడు ఏమిటీ వంచన అని పాలకులను ప్రశ్నించకూడదా ? బోధించు, సంఘటితపరుచు, పోరాడు అన్న అంబేద్కర్‌ను ఎవరైనా మరచిపోగలరా ! ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగున్నదో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు అన్న కమ్యూనిస్టు మహాశయుడు లెనిన్‌ బోధను విస్మరించగలమా ?


ప్రపంచ బ్యాంకు గ్రూప్‌ ప్రధాన ఆర్థికవేత్త, డెవలప్‌మెంట్‌ ఎకనమిక్స్‌ సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఇందర్‌మిత్‌ గిల్‌ ప్రపంచ అభివృద్ధి నివేదిక 2024లో చెప్పిన అంశాలను ఎవరూ విస్మరించకూడదు. ” ప్రపంచ ఆర్థిక ఐశ్వర్యం కోసం జరిగిన పోరులో మధ్య తరహా ఆదాయ దేశాలు ఎక్కువగా విజయం సాధించటం లేదా ఓడిపోయాయి. అయితే అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలుగా మారేందుకు వీటిలో చాలా ఎక్కువ దేశాలు కాలం చెల్లిన వ్యూహాలను అనుసరించాయి. అవి కేవలం భారీ పెట్టుబడుల మీద లేదా పరిణితి చెందకుండా నవకల్పనల మీద ఆధారపడ్డాయి. నూతన దృక్పధం అవసరం. ముందుగా పెట్టుబడుల మీద కేంద్రీకరించాలి తరువాత విదేశాల నుంచి నూతన సాంకేతికతలను చొప్పించాలి. తరువాత మూడు రకాల వ్యూహాన్ని అనుసరించాలి.ఒకటి సమతుల్యమైన పెట్టుబడులు, నూతన సాంకేతికతల చొప్పింపు,నవకల్పనలుగా అది ఉండాలి. పెరుగుతున్న జనాభా, పర్యావరణ, భౌగోళిక రాజనీతి సంబంధమైన వత్తిడులుంటాయి గనుక తప్పు చేసేందుకు ఆస్కారమివ్వకూడదు. గంగలో మునిగితే కరోనా సోకదు, గోవధ కారణంగానే వయనాడులో ప్రకృతి ప్రళయం సంభవించిందని చెప్పే ప్రబుద్దులు, వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అంటూ అమానుష మనుధర్మాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని చూస్తున్న శక్తులు చెలరేగుతున్నవేళ ఇలాంటి హితోక్తులను పట్టించుకుంటారా ? దేశాన్ని ముందుకు తీసుకుపోతారా ? ఇలాంటి వారి మార్గదర్శనంలో 75 కాదు, మరో 75 సంవత్సరాలు గడిచినా అమెరికాలో నాలుగోవంతు సంవపదల స్థాయికి చేరగలమా ? ఇప్పుడు కావాల్సింది పుట్టుకతో వృద్దులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు కాదు.పావన నవ జీవన బృందావన నిర్మాతలు, కాదంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐఎంఎఫ్‌ భారాలకు కెన్యాలో ప్రతిఘటన !

04 Thursday Jul 2024

Posted by raomk in Africa, COUNTRIES, Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Prices, UK, USA

≈ Leave a comment

Tags

IMF, imperialism, Kenya -IMF, Kenya Protests, Kenya's President William Ruto


ఎం కోటేశ్వరరావు


జనంపై భారాలు మోపుతూ పార్లమెంటు ఆమోదించిన విత్త బిల్లుకు వ్యతిరేకంగా జూన్‌ 25న కెన్యాలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా 26 మంది కాల్పుల్లో మరణించగా అనేక మంది గాయపడినట్లు దేశ మానవహక్కుల కమిషన్‌ ప్రకటించింది.మృతుల సంఖ్య 30దాటినట్లు వార్తలు వచ్చాయి.దేశ పార్లమెంటు భవనానికి నిరసనకారులు నిప్పు పెట్టటంతో సహా అనేక చోట్ల లూటీలు, దహనకాండకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో బిల్లుపై తాను సంతకం పెట్టటం లేదంటూ అధ్యక్షుడు విలియమ్స్‌ రూటో ప్రకటించాడు. అయినప్పటికీ నమ్మకం లేక రాజీనామా చేయాలని కోరుతూ జూలై రెండున తిరిగి ప్రదర్శనలకు పిలుపు ఇచ్చారు. రాజధాని నైరోబీలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకులను బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు అంటారు. అక్కడ జరిగిన సమావేశాల్లో అవి పుట్టాయిగనుక ఆ పేరు వచ్చింది.ప్రజాకంటకుల పుట్టుక కూడా మామూలుగానే జరిగినప్పటికీ వారు పెరిగి పెద్దవారైన తరువాత మాత్రమే సమాజానికి ముప్పుగా చివరకు జనం చేతిలో తుప్పుగా మారతారు.కానీ ఈ కవలలు అలాంటివి కాదు. పుట్టుకతోనే వాటి దగ్గరకు వెళ్లిన దేశాలకు స్పాట్‌ పెడుతున్నాయి.ప్రపంచ బ్యాంకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తమ విధానాలకు ముఖ్యంగా విద్యుత్‌ సంస్కరణలకు ఒక ప్రయోగశాలగా మార్చిన సంగతి తెలిసిందే. వాటికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం, పర్యవసానంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పరాజయం పాలైన విషయాన్నీ వేరే చెప్పనవసం లేదు.


ఆఫ్రికా ఖండంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఒక దేశం కెన్యా. హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న ఈ దేశ జనాభా 5.22 కోట్లు. రాజధాని నైరోబీ. ఐరోపా సామ్రాజ్యవాదుల వలసగా ఉంది. బ్రిటీష్‌ పాలకులు తొలుత తమ రక్షక ప్రాంతంగా, తరువాత వలసగా మార్చారు.1952 నుంచి ప్రారంభమైన మౌమౌ విప్లవంగా పిలిచిన ఉద్యమం కారణంగా 1963లో స్వతంత్రదేశంగా ఆవిర్భవించింది.ఆఫ్రికాలో ఆర్థికంగా అభివృద్ధి, ప్రజాస్వామిక వ్యవస్థతో స్థిరంగా ఉన్న దేశంగా చెబుతారు.అలాంటిది గతంలో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన జనాలపై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా మరణించారని, నేరస్థ ముఠాల చేతుల్లో గితురాయి అనే చోట250 మంది మరణించినట్లు, వారి మృత దేహాలను కూడా లభ్యం కావటం లేదని, అనేక మంది అపహరణలకు గురైనట్లు వార్తలు వచ్చాయి.పౌరులపై భారాలను మోపే ఆర్థిక బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన వెంటనే ఆందోళన తలెత్తింది. దాంతో బిల్లును నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించినప్పటికీ నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉంది. అతగాడి మాటల మీద తమకు నమ్మకం లేదంటూ రూటో రాజీనామా చేసి గద్దె దిగాల్సిందేనంటూ యువత అనేక పట్టణాల్లో ప్రదర్శనలు జరిపింది. మిలిటరీ కవాతులతో భయపెట్టాలని చూసినా బెదరటం లేదు. మరో శ్రీలంకగా మారినా ఆశ్చర్యం లేదు.


ఎందుకీ పరిస్థితి వచ్చింది ? దేశం అప్పులపాలైంది. దేశ, విదేశీ అప్పు 80 బిలియన్‌ డాలర్లు దాటింది. వాటిని గడువులోపల తీర్చే పరిస్థితి కనిపించటం లేదు.దివాలా ప్రకటిస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. దాంతో ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు దగ్గరకు వెళ్లింది. మేం చెప్పిన షరతులకు అంగీకారం తెలిపితే ఇబ్బందుల నుంచి బయటపడవేస్తామని అవి చెప్పాయి. ఆ మేరకు ప్రభుత్వం 2021లో ఒప్పందం చేసుకుంది. బ్రెట్టన్‌ఉడ్‌ కవలలు, ఇతర అంతర్జాతీయ సంస్థలన్నీ ముందుగా అప్పెలా తీరుస్తారో చెప్పమంటాయి. వెంటనే, మీరేమీ చెప్పలేరుగానీ మేం చెప్పినట్లు చేయండి, వాటికి మీ పేరు పెట్టుకోండి అంటాయి. ఇదిగో అలాంటి ఒప్పందంలో భాగంగానే కెన్యా పార్లమెంటు ఆమోదించిన 2024 విత్త బిల్లు.దాని ప్రకారం నిత్యావసర వస్తువులు, పిల్లలకు మార్చే డైపర్లతో సహా అనేక వస్తువులపై ఎడాపెడా పన్నులను పెంచాలని ప్రతిపాదించారు. ఇప్పటికే పెరిగిన నిరుద్యోగం, ధరల పెరుగుదలతో అతలాకుతలంగా ఉన్న పరిస్థితి మరింత దిగజారనుందనే భయంతో జనం నిరసనలకు దిగారు. ఆగ్రహం ఎలా ఉందంటే పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు.ఎంపీలందరూ బతుకు జీవుడా అంటూ పారిపోయారు.అయినా తగ్గేదే లే అన్నట్లుగా అధ్యక్షుడి వైఖరి ఉండటంతో ఆందోళన విస్తరించింది.దాంతో బిల్లు మీద సంతకం చేయటం లేదని ప్రకటించాడు. ఇదంతా ఒక నాటకమని, వ్యవధి తీసుకొనేందుకు వేసిన పాచిక అని చెబుతున్నారు.నిజానికి జనంలో ఆగ్రహం ఇప్పటికిప్పుడు పెరిగింది కాదు. కరోనాకు ముందు పరిస్థితి దిగజారటం ప్రారంభమైంది, కరోనా మరింత దెబ్బతీసింది. అనేక మంది యువతకు ఉపాధిపోయింది. గతేడాది వేసవిలోనే పన్నుల వ్యతిరేక నిరసనలు జరిగాయి. ఉపాధి, పరిశ్రమలు పెద్దగా పెరగకపోయినా అనేక దేశాల్లో విదేశీ సంస్థలు ఇచ్చే రుణాలు, వాటితో పాటు దొరకే ముడుపులకు ఆశపడి ఆర్థిక వ్యవస్థ అవసరాలతో నిమిత్తం లేకుండా పెద్ద ఎత్తున రోడ్ల వంటి మౌలిక సదుపాయాలకు గాను దొరికిన మేర అప్పులు చేసిన దేశాలలో కెన్యా ఒకటి.రెండువేల సంవత్సరాల ప్రారంభంలో విదేశాల నుంచి తీసుకున్న భారీ మొత్తాలను ఆర్థిక వృద్దికి ఖర్చు పెట్టలేదు.దానికి తోడు వరదలు, కరోనా జతకలిశాయి.


దివాలా కోరు ఆర్థిక విధానాలను అనుసరిస్తున్న అన్ని వర్ధమాన దేశాల మాదిరే కెన్యా కూడా ఉంది.ప్రపంచంలో మూడు వందల కోట్ల మంది జనాభా ఉన్న దేశాలు ప్రజారోగ్యం, వైద్యం వంటి వాటికి చేస్తున్న ఖర్చు కంటే రుణాల అసలు, వడ్డీలు తీర్చటానికి ఎక్కువ మొత్తాలను ఖర్చు చేస్తున్నట్లు ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు బినాయిఫెర్‌ నౌరోజీ చెప్పాడు. వలసవాద అవశేషాలు, అవినీతి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, విత్త దుర్వినియోగం. పెరిగిన ఆర్థిక, తెగల మధ్య అసమానతల వంటి అంశాలు కెన్యాను పట్టిపీడిస్తున్నాయి. వీటన్నింటినీ తొలగించి మంచి రోజులను తెస్తానంటూ అనేక సంవత్సరాలు మంత్రిగా, ఐదేండ్ల పాటు ఉపాధ్యక్షుడిగా పని చేసిన విలియం రూటో 2022 ఎన్నికల్లో అధ్యక్షుడయ్యాడు. రెండు సంవత్సరాల్లోనే తన నిజస్వరూపాన్ని ప్రదర్శించి ప్రజా వ్యతిరేకిగా రుజువు చేసుకున్నాడు. తాజా విత్త బిల్లును ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఉద్దేశించారు. దానికి గాను పొదుపు అని ముద్దు పేరు పెట్టారు. చూడండి నా కార్యాలయ ఖర్చుకే కోతపెడుతున్నా అంటూ రూటో ప్రకటించాడు. ఇదంతా జనం మీద మోపే భారాలకు నాంది. ప్రపంచంలో పొదుపు చర్యలు ఎక్కడ తీసుకున్నప్పటికీ తొలుత కోతల వేటు పడేది సామాన్యులు, వారికి ప్రభుత్వం చేసే ఖర్చుల మీదే.అన్నింటికీ ఒక్కసారే కోతపెడితే జనం సహించరు. చేదు మాత్రను మింగించటం అలవాటు చేసినట్లుగా దశల వారీ మొదలు పెడతారు. కెన్యా రాబడిలో 60శాతం రుణాలు తీర్చేందుకే పోతోంది. అందువలన నేరుగా చేసే నగదు బదిలీల మొత్తాల కోత, చివరకు బడి పిల్లల మధ్యాహ్న భోజనఖర్చునూ తగ్గించనున్నారు.


పశ్చిమ దేశాలకు, ప్రత్యేకించి అమెరికా తొత్తుగా అధ్యక్షుడు విలియమ్‌ రూటో వ్యవహరిస్తున్నాడడని కెన్యా కమ్యూనిస్టు పార్టీ విమర్శించింది. గద్దె దిగేవరకూ ఆందోళన చేస్తామని ప్రకటించింది. రాజీనామా మినహా మరొకదాన్ని అంగీకరించేది లేదంది. గాజాలో మారణకాండ జరుపుతున్న యూదు దురహంకార ఇజ్రాయెల్‌ పాలకులకు, ఉక్రెయిన్‌ వివాదంలో నాటోకు మద్దతు ఇచ్చాడు. ఇటీవల కెన్యాను నాటో ఏతర భాగస్వామిగా ప్రకటించారు. సిఐఏ అల్లుతున్న కతలన్నింటినీ వల్లిస్తున్నాడు. అమెరికా మిలిటరీ కార్యకలాపాలకు మండా అనే దీవిని అప్పగించాడు. దేశీయంగా ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు జరుపుతున్నట్లు కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. ఒకసారి పార్లమెంటు ఆమోదించిన బిల్లును వెనక్కు తీసుకోవటానికి రాజ్యాంగం అనుమతించదని, ఒక వేళ అధ్యక్షుడు వెనక్కు పంపితే మూడింట రెండువంతుల మెజారిటీతో ప్రతిపాదనను ఆమోదిస్తే అది చట్టమై కూర్చుంటుందని చెప్పింది. పార్లమెంటు బిల్లును ఆమోదించిన తరువాత 14రోజుల్లో అధ్యక్షుడు ఆమోదం తెలపాల్సి ఉంటుంది, లేదా సవరణలు చేయాలంటూ వెనక్కు పంపాలి.


రొట్టెలపై 16,వంటనూనెలపై 25శాతం పన్ను ప్రతిపాదించారు.ఆర్థిక లావాదేవీలపై దశలవారీ పన్ను పెంపుదల, మోటారు వాహనాల ధరలో రెండున్నరశాతం ప్రతి ఏటా పన్ను కొత్తగా విధింపు, పర్యావరణానికి హాని కలిగించే వృధా ఉత్పత్తులపై పన్ను ప్రతిపాదించారు. దీనిలోనే దిగుమతి చేసుకొనే ఎలక్ట్రానిక్‌ వస్తువులు, శానిటరీ పాడ్‌ల మీద పన్ను ప్రతిపాదించారు. జిఎస్‌టి 16శాతం, ఆసుపత్రుల్లో వాడే పరికరాలు, నిర్మాణ సామగ్రి మీద కూడా పన్ను ప్రతిపాదించారు.ఉద్యోగుల వేతనాలపై గరిష్ట పన్ను మొత్తాన్ని 30 నుంచి 35శాతానికి పెంచగా, కొత్తగా 1.5శాతం ఇంటి పన్ను, వైద్య బీమా పేరుతో 2.75శాతం, ఇంథనంపై ఎనిమిదిశాతంగా ఉన్న పన్నును 16శాతానికి పెంచుతూ ప్రతిపాదించారు. పన్నుల పెంపుదల బాధాకరమే అయినప్పటికీ మన స్వాతంత్య్ర సమర యోధులు గర్వపడాలంటే జనం త్యాగాలు చేయాల్సి ఉంటుందని అధ్యక్షుడు సమర్ధించుకున్నాడు. తనకు గత ప్రభుత్వం నుంచి 65 బిలియన్‌ డాలర్ల అప్పు వారసత్వంగా వచ్చిందన్నాడు. రానున్న కాలంలో పన్ను వసూలు రోజులను కూడా పాటించాల్సి ఉంటుందేమో అంటూ జోకులు వేశాడు. ఏడాది కాలంలో 40సార్లు విదేశీ పర్యటనలు జరిపిన రూటో అట్టహాసంగా ఎంతో ఖర్చు చేశాడు. ఎందుకీ పర్యటనలు అంటే పెట్టుబడుల సాధన, ఉద్యోగఅవకాశాలను వెతికేందుకు అని సమర్ధించుకున్నాడు.ఇదే సమయంలో అనేక సంస్థలు మూతబడి వేలాది మందికి ఉపాధి పోయింది.రానున్న రోజుల్లో ఇంకా కార్యకలాపాలను కుదించవచ్చని కెన్యా యజమానుల సంఘం పేర్కొన్నది.జనం దగ్గర డబ్బులేక రోజుకు ఏడువందల గ్యాస్‌ సిలిండర్లు అమ్మేతాను ప్రస్తుతం రెండువందలకు పడిపోయినట్లు, తన దగ్గర ఉన్న సిబ్బందిని ఆ మేరకు తగ్గించినట్లు ఒక సంస్థ యజమాని చెప్పాడు. ప్రభుత్వ సిబ్బంది పన్ను వసూలు పేరుతో వ్యాపారులను వేధిస్తున్నట్లు చెప్పాడు. గత పాలకుల హయాంలో జరిగిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, జనాన్ని పట్టించుకోకపోవటం వంటి అంశాలను తీసుకొని తాము వస్తే మంచి రోజులు తెస్తామని చెప్పి, అంతకంటే ఎక్కువ భారాలు మోపిన వారిని చరిత్రలో ఎందరో ఉన్నారు. శ్రీలంకలో తాము అభిమానించిన దేశాధ్యక్షుడినే జనం చివరకు తరిమి కొట్టిన తీరును చూశాము. కెన్యాలో ప్రతిపాదించిన భారాలను రద్దు చేస్తే సరే లేకుంటే ఏం జరుగుతుందో చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచీకరణకు వ్యతిరేకతపై కార్పొరేట్లలో ఆందోళన

27 Wednesday Jul 2016

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS

≈ Leave a comment

Tags

anti globalization movement, corporates, corporates worry, G 20, globalization, IMF, WB

నేను ప్రపంచీకరణకు అనుకూలమే అయినప్పటికీ ప్రపంచీకరణ వ్యతిరేకులు ముందుకు తెస్తున్న ముఖ్యమైన సమస్యల కారణంగా దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పాలి: అమర్త్యసేన్‌

ఎం కోటేశ్వరరావు

   రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తమ లాభాలను కాపాడుకొనేందుకు ముందుకు తెచ్చిన ప్రపంచీకరణకు నూరేళ్లు నిండనున్నాయని కార్పొరేట్లలో ఆందోళన మొదలైందా? గత కొద్ది రోజులుగా పశ్చిమ దేశాల పత్రికలలో వెలువడుతున్న వ్యాఖ్యలు వారి మనోభావాలకు అద్ధం పడుతున్నాయి.జూలై మూడవ వారంలో చైనాలోని చెంగుడులో జరిగిన జి 20 దేశాల ఆర్ధిక మంత్రుల, రిజర్వుబ్యాంకుల గవర్నర్ల సమావేశంలో అనేక మంది ప్రపంచీకరణకు పెరుగుతున్న ప్రతిఘటన గురించి ఆందోళన వెలిబుచ్చారు. ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని ఓటింగ్‌ నిర్వహించిన నెల రోజుల తరువాత జరిగిన ఈ సమావేశంలో సహజంగానే దాని పర్యవసానాల గురించి చర్చ జరిగింది. అభివృద్ధి, ఆర్ధిక సరళతతో కలిగిన లబ్దిని సభ్య దేశాలు, అన్నిదేశాల మధ్య పంపకానికి ఇంకా ఎంతో చేయాలనటంపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టినా లాగార్డే వ్యాఖ్యానించగా పశ్చిమ దేశాలలో ప్రపంచీకరణకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌ హెచ్చరించాడు.అయితే ఈ సమావేశంలో ఆ దిశగా ఎలాంటి నిర్ధిష్ట ప్రతిపాదనలు రాలేదు.అమెరికా విత్త మంత్రి జాకబ్‌ జె లీ విలేకర్లతో మాట్లాడుతూ పొదుపు చర్యలపైగాక అభివృద్ధి గురించి ఏకాభిప్రాయం వ్యక్తమైందని అన్నారు. ఈ సమావేశం ఏదైనా ఒక సందేశం అందించిందంటే జరుగుతున్న పరిణామాల పట్ల ప్రపంచవ్యాపితంగా ఓటర్లు సంతోషంగా లేరన్నదే అది అని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న ఎఎంపి కాపిటల్‌ ఇన్వెస్టర్స్‌ అధికారి షేన్‌ ఆలివర్‌ వ్యాఖ్యానించాడు.

   చెంగ్‌డు సమావేశం ముగిసిన కొద్ది సేపటి తరువాత నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిగా ఎంపికైన డోనాల్డ్‌ ట్రంప్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కార్యకలాపాలను వెలుపలి దేశాలకు తరలించిన అమెరికన్‌ కంపెనీల వస్తువులపై పన్నులు వేయాలన్న తన ప్రతిపాదనను అడ్డుకొనేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటిఓ) ప్రయత్నించిందని,ఈ కారణంగా తిరిగి సంప్రదింపులు జరిపేందుకు లేదా దాని నుంచి బయటకు పోవటం గురించి ఆలోచిస్తామని బెదిరించాడు. ఆర్ధిక వ్యవస్ధలో ఎదురవుతున్న ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు ఒక్క జూన్‌ నెలలో చైనా మార్కెట్‌లోకి 244 బిలియన్‌ డాలర్ల విలువగల కొత్త రుణాలను విడుదల చేసింది. దీంతో వినిమయం, సేవల వినియోగాన్ని పెంచటం ద్వారా తగ్గుతున్న ఆదాయాన్ని నిలుపుకొనేందుకు చర్యలు తీసుకుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా, చైనా, జపాన్‌ తరువాత అతి పెద్ద ఆర్ధిక శక్తిగా వున్న దక్షిణ కొరియా వుపాధికి వూతమిచ్చేందుకు 987 కోట్ల డాలర్ల అనుబంధ బడ్జెట్‌ను ప్రతిపాదించగా కెనడా 838 కోట్ల డాలర్ల మేరకు అదనంగా ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇవన్నీ కూడా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని అదుపు చేసే చర్యలలో భాగమే.

   ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ కోలుకుంటున్నప్పటికీ అవసరమైనదాని కంటే బలహీనంగా వుందని,అనేక సవాళ్లున్నాయని జి 20 ప్రకటన పేర్కొన్నది. వుక్కు వంటి పరిశ్రమలలో అవసరానికి మించిన సామర్ధ్యం వలన కేవలం వాణిజ్యం మాత్రమే గాక కార్మికులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారని కూడా ప్రకటన వ్యాఖ్యానించింది.

    స్వేచ్ఛా వాణిజ్యానికి దాడి ముప్పు వుంది, అయితే అది ఎప్పటి కంటే ఎంతో ప్రాధాన్యత కలిగిందని ఫార్చ్యూన్‌ పత్రిక వ్యాఖ్యాత అలన్‌ మురే పేర్కొన్నారు. దాని సారాంశం ఇలా వుంది. గత అర్ధశతాబ్ది కాలంలో కీలకమైన వాణిజ్య ధోరణిగా వున్న ప్రపంచీకరణ తిరోగమనంలో వుంది. తమ వుద్యోగాలు హరించుకుపోవటానికి ఇదే కారణమని అమెరికా, బ్రిటన్‌లో మిలియన్ల మంది ఓటర్లు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పౌరుల్లో కలిగిన పెద్ద కుదుపు బ్రెక్సిట్‌ రూపంలో వెల్లడైంది. ప్రపంచీకరణను సమర్ధించాలని ఇప్పుడెవరూ కోరుకోవటం లేదని వెల్లడిస్తున్నది. ప్రపంచీకరణ విజయం హరించుకుపోతున్నదని ఫార్చ్యూన్‌ పత్రిక రూపొందించిన ఐదువందల ప్రపంచ కంపెనీల జాబితా వివరాలు నిర్ధారిస్తున్నాయి. 2015లో వాటి అమ్మకాలు 11.5శాతం తగ్గి 27.6లక్షల కోట్ల డాలర్లకు పడిపోయాయి.ఆదే రీతిగా లాభాలు కూడా పడిపోతున్నాయి. ప్రపంచీకరణ విమర్శకులు చెబుతున్నదానికంటే పరిస్థితి మరింత సంక్లిష్టంగా వుందన్నది వాస్తవం.

   మెక్సికో మాజీ మంత్రి, ప్రొఫెసర్‌ జార్జ్‌ జి కాస్టేండా ప్రపంచీకరణ గురించి మరో రూపంలో విమర్శించారు.’అసమర్ధ నాయకత్వం రూపొందించిన పనికిమాలిన ప్రపంచీకరణ’ అనే శీర్షికతో విశ్లేషించారు. దాని సారాంశం ఇలా వుంది. 1950 దశకం నుంచీ ఐరోపా దేశాలు ప్రాంతీయ సమగ్రత వలన కలిగే లాభ నష్టాల గురించి చర్చిస్తున్నాయి. అయితే ప్రపంచకీరణ, స్వేచ్ఛా వాణిజ్యం, వలస వాటి ఆర్ధిక పర్యవసానాల కేంద్ర అంశంగా ఆ చర్చ సాగిందని బ్రెక్సిట్‌తో స్పష్టమైంది.ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని తీర్పు నిచ్చి బ్రిటన్‌ పౌరులు తప్పు చేశారు. విడిపోవాలనే ప్రచారం వెనుక వున్న కారణాన్ని కలసి వుండాలని కోరుకొనే వారు కూడా విస్మరించి తప్పు చేశారు. ఆ ప్రభావశీల కారణాలు ఒక్క బ్రిటన్‌ లేదా ఐరోపా యూనియన్‌ సభ్య దేశాలు, ప్రపంచమంతటా వున్న ప్రజాస్వామిక దేశాలన్నింటా వున్నాయని వారు గుర్తించలేదు. అసమర్ధ రాజకీయ నాయకత్వం ప్రపంచవ్యాపితంగా కొత్త ప్రమాదాలను ప్రేరేపిస్తున్నది. ఐరోపా వాసులను ఒక్కటిగా చేయాలని సాగుతున్న ప్రయత్నం సాకారం కావటం అంత సులభం కాదు. దానితో పాటు అనేక సమస్యలను పరిష్కరించాల్సి వుంది. ప్రపంచీకరణ, స్వేచ్ఛా వాణిజ్యం, వలస, అసమానత సమస్యలను దీర్ఘకాలంగా అ న్ని చోట్లా ధనిక దేశాలు విస్మరించాయి. 1990దశంలో అమెరికా అధ్యక్షులు జార్జిడబ్లు బుష్‌, బిల్‌క్లింటన్‌ మెక్సికో పాలకుల స్వేచ్ఛా వాణిజ్య మానసిక స్ధితి దాని వలన ప్రతికూలంగా ప్రభావితమయ్యేవారికి పరిహారం అందించటాన్ని రాజకీయంగా వాస్తవంలో అసాధ్యం చేశారు. ఈ విధానం విఫలం చెందిన 20 సంవత్సరాల తరువాత మనస్సు విరిగిన ఓటర్లు రిపబ్లికన్‌ పార్టీ డోనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ పార్టీ బెర్నీ శాండర్స్‌ వైపు చేరటం ఆశ్చర్యం కాదు. ఆకర్షించే నినాదాలతో ఇద్దరూ వారిని బుట్టలో వేసుకున్నారు. ఇద్దరూ భిన్నమైన నినాదాలు ఇచ్చినప్పటికీ ఓటర్లు ఆకర్షితులు కావటానికి కారణం మాత్రం గత రెండు దశాబ్దాల విఫల విధానాలే. వాటిని సరిచేసేందుకు జరిగే ఏ ప్రయత్నమైనా వాస్తవాల ప్రాతిపదికనే జరగాలి.

   2008-2009 సంవత్సరాల తీవ్ర మాంద్యం తరువాత అమెరికా వుత్పాదక రంగంలో అనేక కొత్త వుద్యోగాల కల్పన జరిగిందని తెలుసుకుంటే వుభయుల మద్దతుదార్లు ఆశ్చర్యపోతారు. మిలియన్ల కొద్దీ వుత్పాదక వుద్యోగాలను చైనా, మెక్సికో వంటి దేశాలకు బదిలీ చేసిన తరువాత ఈ కల్పన కొంత మేరకు ఆ గండిని పూడ్చిందని, అయితే పోయిన వాటికంటే కొత్తగా ఎక్కువ సృష్టించవచ్చని ఎవరైనా వాదించవచ్చు. వుద్యోగాల బదిలీ తరువాత అమెరికా మరింత పోటీదారుగా తయారైంది, అందుకు చైనాకు కృతజ్ఞతలు చెప్పాలి. వేరే దేశాలకు వుద్యోగాలు తరలి పోయిన తరువాత అమెరికాలో కల్పించిన వుద్యోగాలు ఎలాంటివన్నది ప్రధాన సమస్య. ఆర్ధిక పర్యవసానాలను విధాన నిర్ణేతలు విస్మరించారు. యాభై, అరవయ్యవ పడిలో వున్న కార్మికులు గంటకు 30 డాలర్ల వుద్యోగాలు, ఆరోగ్యసంరక్షణ, పెన్షన్‌ లబ్దులను కోల్పోయి అంతకు ముందు పొందిన వేతనాల కంటే సగానికి, ఇతర లబ్దులేమైనా మిగిలి వుంటే ఆ కొన్నింటిని మాత్రమే పొందటానికి సిద్ద పడ్డారన్నది మరిచిపోకూడదు. విధాన నిర్ణేతలు ప్రపంచీకరణ బాధితుల గురించి పట్టించుకోలేదు, ఎందుకంటే వారిని పట్టించుకోవాలన్న అవసరం వుందని వారు అనుకోలేదు. మార్కెట్టే అన్నింటినీ తనంతట తానే పరిష్కరిస్తుందని భావించారు కానీ జరగలేదు, విధాన నిర్ణేతలకు అది పాఠం నేర్పలేదు. గతేడాది పసిఫిక్‌ దేశాల భాగస్వామ్య ఒప్పందం సానుకూలంగా కుదరింది కానీ అమెరికన్‌ కార్మికుల రక్షణకు చేసిందేమీ లేదు.

   మెక్సికోలో కూడా ఇదేమాదిరి ప్రపంచీకరణ వ్యతిరేకత పెల్లుబికింది. నాఫ్టా గురించి ఎక్కువగా చెప్పారు, ఎక్కువగా విమర్శలకు గురైంది. ఆ ఒప్పందం ఎగుమతులు పెంచుతుందని భావించారు, అలాగే జరిగింది గానీ అమెరికా దిశగా వలసలను తగ్గించలేకపోయింది. అనేక మెక్సికో పరిశ్రమలు, వాణిజ్య, వ్యవసాయ సంస్ధలు మరింతగా పోటీ పడేవిధంగా తయారయ్యాయి, జిడిపి దామాషాలో చూస్తే చాలా తక్కువగా , తాత్కాలికంగా విదేశీ పెట్టుబడులు పెరిగాయి. నాఫ్టా వలన మెక్సికో అనేక సంస్కరణల మధ్య చిక్కుకుపోయింది తప్ప వాగ్దానం చేసినట్లుగా అభివృద్ధి జరగలేదు.1994 నుంచీ వృద్ధి చెందుతున్న మార్కెట్‌ ప్రమాణాల ప్రకారం చూస్తే తక్కువగా వార్షిక పెరుగుదల రేటు 2.5శాతం మాత్రమే వుంది. వుత్పాదకత, వుపాధి, వేతనాలు కూడా ఆశాభంగం కలిగించాయి. ఈ ఒప్పందం తరువాత ప్రపంచీకరణ ప్రతికూల ప్రభావాలను అధిగమించేందుకు అవసరమైన వుత్పాదక రంగ కార్మికులకు వేతన పెంపుదలను ఎన్నడూ అమలు జరపలేదు. యావత్‌ దేశం నేడు మూల్యం చెల్లిస్తున్నది, మెక్సికన్లు అసంతృప్తితో వున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను పెంచటానికి ఆ ఒప్పందం దోహదం చేసింది, 2018లో జరిగే సాధారణ ఎన్నికల ఫలితాన్ని అది ప్రభావితం చేయగలదు. ఈ నాటి కొత్త విషయం ఏమిటంటే ఐరోపా, వుత్తర అమెరికా ఖండంలో ప్రజావ్యతిరేకతను గతం కంటే మెరుగ్గా అదుపు చేయగలమని విధాన నిర్ణేతలు విశ్వసించారు.బ్రిటన్‌లో ఓటర్ల తీర్పును చూసిన తరువాత అమెరికా, మెక్సికో ఏ దేశమూ కూడా వాటి నాయకత్వాల తప్పిదాలకు అతీతంగా వుంటుందని చెప్పలేము.

   బ్రెక్సిట్‌ సందర్బంగా బ్రిటన్‌ కార్పొరేట్‌లు స్ధూలంగా రెండుగా చీలిపోయారన్నది స్పష్టం. ఒకటి యూనియన్‌లోనే వుండి లబ్ది పొందాలని చూడగా విడిపోయి ఎవరికి వారం తేల్చుకుందామనే వైఖరిని మరొకటి తీసుకుంది. దున్న, ఎద్దు కాడి మాదిరి. ఎండ ముదరగా ఎద్దు నీడ వైపు లాగితే దున్న ఎండవైపుకు మొగ్గుతుందన్నట్లుగా పెట్టుబడిదారీ వ్యవస్ధలో, అందునా అవసరాలకు మించి వుత్పత్తులు జరుగుతున్నపుడు వుత్పాదక రంగంలో ఎగుమతులపై ఆధారపడిన వారి వైఖరి ఒక విధంగానూ దిగుమతులపై ఆధారపడిన వారి వైఖరి మరొక విధంగానూ వుండటం అని వార్యం.

    వుదాహరణకు ఈ విరుద్ధ ప్రయోజనాల మధ్య కరెన్సీ విలువ పైకీ కిందికీ లాగబడుతోంది.బలమైన డాలరు కారణంగా తమ ఆదాయం, లాభాలపై సంవత్సరాల తరబడి ప్రతికూల ప్రభావం పడటంపై విచారించిన అమెరికన్‌ కార్పొరేట్లు ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు. దాని ప్రభావం ఈఏడాది తొలి త్రైమాసికంలో డాలరు విలువ ఐదునెలల కనిష్టానికి పడిపోయింది. బలహీనపడిన డాలరు అమెరికా ఎగుమతులు పెరగటానికి దోహదపడింది.ఈ ఏడాది తమ లాభాలు పెరగటానికి ఇదొక కారణమని ఔషధ రంగంలోని ఫైజర్‌,ఎలీలిలీ, డ్యూపాంట్‌ కంపెనీలు పేర్కొన్నాయి. హోటల్‌ రూములలో చేరేవారి సంఖ్య పెరిగింది, టూరిజం లాభపడింది, న్యూయార్క్‌ నగరానికి ఐరోపా యాత్రికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇదే విధంగా మరికొంత కాలం డాలరు విలువ తక్కువగా వుంటే పెట్టుబడులు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. డాలరు విలువ ఎక్కువగా వున్న కారణంగా గతేడాది కార్పొరేట్‌ కంపెనీలు 112 బిలియన్‌ డాలర్ల ఆదాయం కోల్పోయాయి.డాలర్లు ఆవిరైంది.

   ప్రపంచీకరణ కార్మికులకు ఎంత నష్టదాయకమో కొన్ని కార్పొరేట్‌ సంస్ధలకు కూడా అదే పరిస్ధితిని సృష్టిస్తోంది. అందువలన కార్పొరేట్‌ సంస్ధల మధ్య కూడా మిత్ర వైరుధ్యం పెరగటం అనివార్యం. అది శతృవైరుధ్యంగా మారినపుడు పరిణామాలు ఎలా వుంటాయనేది ఇపుడే వూహించలేము. అనేక దేశాలలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు ప్రపంచీకరణ స్ధూలంగా కార్పొరేట్లకు లాభదాయకం-కార్మికవర్గానికి నష్టదాయకం అన్నది ఇటీవలి కాలంలో మరింత స్పష్టమైంది. ఇప్పటి వరకు ప్రపంచీకరణ అమలుకు ఒక సాధనంగా వుపయోగపడిన ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల అధిపతులే వారు రానున్న రోజులలో ప్రపంచీకరణకు మరింత వ్యతిరేకత వ్యక్తం కానుందని ముందస్తు హెచ్చరికలు చేయటమే కొత్త విషయం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

The IMF’s Latest Move to Kill the U.S. Dollar

26 Tuesday Jan 2016

Posted by raomk in Economics, International, INTERNATIONAL NEWS, Readers News Service, USA

≈ Leave a comment

Tags

IMF, THE DEATH OF THE U.S. DOLLAR, U.S. Dollar, yuan

BY DAMON GELLER

christine_lagarde2

IMF’s Christine Lagarde

As we predicted months ago, the IMF officially green-lighted the acceptance of China’s currency – the Yuan – into the IMF’s foreign exchange basket.  According to Reuters, this move paves the way for the IMF to place the yuan on a par with the U.S. dollar.  This is the latest in a series of global developments that threatens to eliminate the U.S. dollar as the world’s reserve currency.  Experts predict this announcement will trigger one of the most profound transfers of wealth in our lifetime.  So if you want to protect your savings & retirement, you better get your money out of U.S. dollar investments and into the one asset class that rises as currencies collapse.

 

The IMF Holds Supreme Power

damon_geller_authorThe International Monetary Fund, or IMF, is one of the most secretive and powerful organizations in the world.  They monitor the financial health of more than 185 countries. They establish global money rules and provide “bail-out” assistance to bankrupt nations.  Some are warning that any move by the IMF to supplant the U.S. dollar could be catastrophic to American investments.

 

And now, the IMF has made the first move.  As reported by The Wall Street Journal, the IMF officially green-lighted the acceptance of China’s currency – the Yuan – into the IMF’s foreign exchange basket.  This marks the first time in history the IMF has expanded the number of currencies in the foreign exchange basket.  This means that the Chinese currency will now become a viable global alternative to the U.S. dollar.

According to Juan Zarate, who helped implement financial sanctions while serving in George W. Bush’s Treasury department, “Once the [other currency] becomes an alternative to the dollar, rules of the game begin to change.”

Leong Sing Chiong, Assistant Managing Director at a major central bank, said this dollar alternative “is likely to transform the financial landscape in the next 5-10 years.”

Currency expert Dr. Steve Sjuggerud warned, “I’ve been active in the markets for over two decades now, but I’ve never seen anything that could move so much money, so quickly.  The announcement will start a domino effect, that will basically determine who in America gets rich in the years to come, and who struggles.”

Dr. Sjuggerud says if you own any U.S. “paper” assets—and that includes stocks, bonds, or just cash in a bank account–you should be aware of what’s about to happen and know how to prepare.  A number of experts believe a recent spike in gold and silver prices is a direct result of the IMF’s action.  Precious metals notoriously rise when the U.S. dollar falls.

The Death of the U.S. Dollar in One Frightening Graph

For the last 600 years, there have been six different global reserve currencies controlled by world superpowers. The latest – the U.S. dollar – has dominated world currency for over 80 years. The alarming fact is, global reserve currencies have collapsed every 80-90 years for the last six centuries! What does this mean for America and the dominance of the U.S. dollar? Based on recent evidence and long-standing historical trends, experts predict the imminent collapse of the U.S. dollar! What’s more alarming? Many Americans aren’t yet doing the one thing that will save their savings & retirement from U.S. dollar collapse.

Just take a look at the graph below. It shows the lifespan of dominant currencies going back 600 years. Notice that the U.S. dollar has now been the dominant currency for 88 years, about the same length of time as its predecessors:

us_dollar_decline

It’s obvious why experts say that the U.S. dollar’s days as the world’s reserve currency are coming to a climactic end.

All Fiat Currencies Collapse

“Fiat” currency is paper currency backed by nothing tangible. As opposed to “sound money” which is was backed by gold or some other valuable commodity, a fiat currency is backed by nothing more than faith in the government. The U.S. dollar has been a fiat currency since Nixon closed the gold window in 1971 in what was the greatest heist in American history. The scary fact is, the average life span of a fiat currency is 40 years, and the U.S. dollar has now exceeded 40 years as a fiat currency!

Prior to 1933 and for well over 100 years, the dollar was backed by gold, and $20 bought you an ounce of gold. But after the government stole all U.S. citizens’ gold in 1933 for a $20 paper certificate, gold was revalued at $35 U.S.D., meaning the dollar was devalued by 43% overnight and all foreign and domestic holders of dollars were effectively robbed.

After Nixon closed the gold window completely in 1971, it took $67 to buy an ounce of gold, devaluing the U.S. dollar by 50% again. Today, it takes well over a thousand U.S. dollars to buy that same ounce of gold. Why? Because the U.S. dollar is now nothing more than a fast-declining Federal Reserve note backed by a corrupt government that is saddled with $18 trillion in unpayable debt — growing by $10 million per minute!

dollar_devaluation

Protect Yourself Before It’s Too Late

This “Paper Money Experiment” has run its course. The Federal Reserve, the U.S. government, and Wall Street crooks have misused their power by mismanaging the dollar, and now there are global repercussions. The debt load sitting on top of the U.S. dollar is unsustainable and will continue to crush the dollar’s purchase power until no one wants to hold U.S. dollars, and they are no longer accepted for global trade. The dollar’s collapse means that every single one of your paper investments that are dollar-backed – stocks, mutual funds, money markets, cash accounts, etc. – will go down right along with the dollar! Meanwhile, the government and the banks will find a way to protect themselves at your expense.

So as we say goodbye to the U.S. dollar’s dominance, it doesn’t have to mean goodbye to your savings & retirement. Remove at least some of your savings & retirement from the dollar-backed, paper-based financial system and protect it with the one asset that has outlasted every fiat currency ever invented for the last 5,000 years: Gold.

This article pulished on wholesaledirectmetals.com

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
 

Loading Comments...
 

    %d