• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Uncategorized

న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నిక : విజయబాటలో దూసుకుపోతున్న సోషలిస్టు అభిమన్యుడు జోహ్రాన్‌ మమ్దాని !

30 Wednesday Jul 2025

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti communist, Donald trump, Leftist Zohran Mamdani, New York mayor battle, Zohran Wedding


ఎం కోటేశ్వరరావు

మీడియా తీరుతెన్నులను చూస్తుంటే అధ్యక్ష ఎన్నికల కంటే న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎన్నికల్లో 33 ఏండ్ల సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీ ఓటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒక నగర మేయర్‌ పదవికి నిజంగా అంతగా కేంద్రీకరిస్తున్నారా అన్న సందేహం ఎవరికైనా కలగవచ్చు గానీ అది పచ్చినిజం. మహా భారతంలో కౌరవులు పన్నిన పద్మవ్యూహంలో అభిమన్యుడు వీరోచితంగా పోరాడి అశువులు బాశాడు. న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నికల్లో శత్రువులు, ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంపే రంగంలోకి దిగి జోహ్రాన్‌ ఓటమికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాడంటే అతిశయోక్తి కాదు.నవంబరు నాలుగవ తేదీన జరిగే ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రముఖుల్లో జోహ్రాన్‌ ముందున్నట్లు తాజా సర్వేలు సూచిస్తున్నాయి. అయితే ఇంకా చాలా వ్యవధి ఉన్నందున ఏమైనా జరగవచ్చు అంటూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రతి సర్వే సంస్థ బుద్దిశుద్ధికి పూనుకుంది.ఇద్దరు డెమోక్రటిక్‌ పార్టీ తిరుగుబాటుదార్లు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి జోహ్రాన్‌కు వ్యతిరేకంగా రంగంలో ఉన్నారు.

జెఫ్రీ ఎపస్టెయిన్‌ ఫైల్స్‌ గురించి అమెరికా మీడియాకు పెద్దగా పట్టలేదు.ఎపస్టెయిన్‌ ఖాతాదార్లలో డోనాల్డ్‌ ట్రంప్‌ ఒకడు అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట. ఎలన్‌మస్క్‌ కూడా దాని సంగతేమిటని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇక్కడా ఖాతాదార్లంటే ఎపస్టెయిన్‌ అనేవాడు కల్లుదుకాణం నడుపుతుంటే రోజూ తాగేందుకు వెళ్లేవారు కాదు.మైనర్లయిన బాలికలకు వలవేసి ట్రంప్‌ వంటి తాతయ్యలు, డబ్బున్న విచ్చలవిడిగాండ్లకు తార్చేవాడు.వాడెంత పెద్దవాడంటే స్వంత విమానం కూడా నడిపేంత పేరుమోసిన వాడు. ఒక కేసుల్లో జైల్లో చచ్చాడు. ఎలా జరిగిందన్నది అనేక అనుమానాలు, పెద్దలందరూ కలసి తమపేర్లు బయటకు రాకుండా పనికానిచ్చేశారని చెబుతారు. అలాంటి ఖాతాదార్ల జాబితాను బయటపెట్టాలన్నది ఒక పెద్ద సమస్యగా మారింది.ట్రంప్‌ ఆ వివాదంలో మాట్లాడిన మాటలు అనుమానాలకు మరింత ఆజ్యం పోశాయి.గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా అసలు అలాంటి ఖాతాదార్ల జాబితా లేదని న్యాయశాఖ చెప్పింది. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏమిటి ? ఆ జాబితాలో తన పేరు ఉన్నదని తానెప్పుడూ చెప్పలేదని, తన మీద కుట్ర జరుగుతోందని ట్రంప్‌ అంటున్నాడు. అయితే కచ్చితంగా ఏదో ఉండే ఉంటుందని ట్రంప్‌ గురించి తెలిసిన వారందరూ నమ్ముతున్నారు. గొర్రెల గోత్రాల కాపరులకే ఎరుక అని ఊరికే చెప్పలేదు పెద్దలు. ట్రంప్‌ గురించి పెద్దగా పట్టించుకోని మీడియా, సామాజిక మాధ్యమం జోహ్రాన్‌ మమ్దానీ గురించి గోరంతను కొండంతలుగా చేస్తోంది. అసలు జరిగింది ఏమిటట ?

సోషలిస్టు జోహ్రాన్‌ మమ్దానీ 27 ఏండ్ల రమా దువాజీ అనే యువతిని లేపుకుపోయాడని మీడియా వర్ణించింది. ఇది పచ్చి అబద్దం, అమెరికా సమాజంలో కొంతకాలం సహజీవనం, వివాహంతో నిమిత్తం లేకుండానే పిల్లల్ని కనటం, కావాలనుకుంటే వివాహం చేసుకోవటం సర్వసాధారణం. డేటింగ్‌ యాప్‌ ద్వారా కలిగిన పరిచయం ప్రేమగా మారి ఫిబ్రవరిలో వారు వివాహం చేసుకున్నారు. ఆ విషయాన్నీ జోహ్రాన్‌ స్వయంగా చెప్పాడు. నా రాజకీయ అభిప్రాయాలను విమర్శించండి గానీ కుటుంబ వ్యవహరాల్లోకి తొంగి చూడవద్దని హుందాగా ఎక్స్‌ద్వారా స్పందించాడు. వివాహం జరిగినపుడు ఎలాంటి వివాదం లేదు, ఆ తరువాత డెమోక్రటిక్‌ పార్టీ మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేసినపుడు ఎలాంటి రచ్చ లేదు. ఇప్పుడు జూలై మూడవ వారంలో సన్నిహితులను పిలిచి వివాహ విందు ఇవ్వటాన్ని అమెరికా మీడియా రచ్చ చేసింది. ఉగాండాలో జన్మించిన జోహ్రాన్‌ మమ్దానీ ఏడు సంవత్సరాల వయస్సులో అమెరికా వచ్చాడు, 2018లో పౌరసత్వం వచ్చింది, తరువాత జరిగిన ఎన్నికల్లో న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నాడు.


ఒక సోషలిస్టు అయి ఉండి వివాహ విందును మూడు రోజుల పాటు అంత భారీగా ఇవ్వటమా అంటూ మీడియా విశ్లేషకులు గుండెలు బాదుకుంటున్నారు.ఉగాండా రాజధాని కంపాలా శివార్లలో ధనికులు ఉండే ప్రాంతంలోని రెండెకరాల్లో ఉన్న వారి కుటుంబ ఫాంహౌస్‌లో విందు జరిగింది. అక్కడ తండ్రి మహమ్మద్‌ మమ్దానీ, తల్లి మీరా నాయర్‌ ఉంటారు. వారు న్యూయార్క్‌, న్యూఢల్లీిలను తరచూ సందర్శించి కొంత కాలం అక్కడా ఉంటారు. దాని చుట్టూ ఉద్యానవనాలు(వారివి కాదు), విక్టోరియా సరస్సు,ఎంతో అందమైన ప్రాంతంలో దానికి మూడు గేట్లు ఉన్నాయట, వివాహ సమయంలో ముసుగులు ధరించిన భద్రతా సిబ్బంది 20 మంది కాపలా ఉన్నారట,సెల్‌ఫోన్లు పనిచేయకుండా జామర్లను అమర్చారు, చెట్లకు విద్యుత్‌ దీపాలను అమర్చారు, ఆహ్వానించిన అతిధులను మాత్రమే అనుమతించారు.వారు ఖరీదైన కార్లలో వచ్చారు.అర్ధరాత్రి వరకు డిజెలతో కాలక్షేపం చేశారు. భారతీయ పద్దతిలో అతిధులకు పండ్ల రసాలు ఇచ్చారు. ఇలా కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడిరచినట్లుగా చిలవలు పలవలతో వర్ణించారు. ఆ సమయంలో ఉగాండా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు మరణించారట. సంతాపం తెలపాల్సిన ఆ సమయంలో విందు, విలాసాలేమిటి అని మనోభావాలను ముందుకు తెచ్చే అంశాన్ని కూడా జోడిరచారు. ప్రభుత్వం సంతాపదినాలుగా ప్రకటించిందో లేదో తెలియదు, ఒకవేళ ప్రకటించినా అది అధికారిక కార్యకలాపాలకు తప్ప ప్రయివేటు, అదీ కూడా ఎంతో ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలకు వర్తించదు, బహిరంగ ఊరేగింపులు, అలాంటివేమీ లేవు. జోహ్రాన్‌ వివాహ విందు గురించి స్థానికులను ప్రశ్నిస్తే తమకు పెద్దగా తెలియదని, ఏదో పెద్దలు వచ్చినట్లు, భారీగా విందుజరిగినట్లు తాము కూడా గమనించామని చెబుతూనే తమ దగ్గర జన్మించిన బుడ్డడు న్యూయార్క్‌ నగరమేయర్‌గా పోటీ చేసేంత గొప్పవాడయ్యాడా అని సంబర పడిన వారు కూడా ఉన్నారట. బురద చల్లదలచుకొంటే ఇలానే మీడియా వ్యవహరిస్తుంది.ఎందుకంత కంటగింపు ?

జోహ్రాన్‌ మమ్దానీ ఎన్నికైతే అది భీతిగొలిపే పరిణామం అవుతుదని జూనియర్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా తండ్రితో గొంతుకలిపాడు.ప్రపంచంలో సమాధి అయిన భావజాలాన్ని ముందుకు తీసుకువస్తున్నారన్నాడు.జోహ్రాన్‌ గనుక ఎన్నికైతే న్యూయార్క్‌ వాసులందరూ ఫ్లోరిడాకు వలసపోతారని చెప్పాడు. న్యూయార్క్‌ నగర రాబడిలో 80శాతం కేవలం 18వేల మంది మాత్రమే చెల్లిస్తున్నారని, వారంతా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగలరని ఈ కొత్త మేయర్‌ అపని చేస్తారన్నాడు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన తనకు భయమేస్తున్నదని చెప్పుకున్నాడు. జోహ్రాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి జూనియర్‌ ట్రంప్‌ చెప్పిన మాటలు ప్రతిబింబం.నగరంలోని యావత్‌ ధనికులను రెచ్చగొట్టి పెద్ద మొత్తంలో డబ్బును రంగంలోకి దించి తమకు అనుకూలమైన వారిని గెలిపించుకోవాలన్న యావ కనిపిస్తున్నది. తాను ఎన్నికలలో భాగస్వామి కావటం లేదని, అయితే అమెరికా ఎన్నడూ సోషలిస్టు దేశం కాజాలదని జూనియర్‌ ట్రంప్‌ చెప్పాడు.


జోహ్రాన్‌ మమ్దానీని ఓడిరచేందుకు డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాదులు, రిపబ్లికన్‌ పార్టీ, ఇతరులందరూ ఒక్కటి కావాలని చూస్తున్నప్పటికీ వారి మధ్య ఇప్పటివరకు ఏకాభిప్రాయం లేదు.వైరుధ్యాలు కూడా బహిర్గతమయ్యాయి. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉన్నట్లు ప్రకటించుకున్న డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన న్యూయార్క్‌ రాష్ట్ర మాజీ గవర్నర్‌ ఆండ్రూ కుమోకు తాను మద్దతు ఇస్తున్నట్లు డోనాల్డ్‌ట్రంప్‌ సంచలనాత్మక ప్రకటన చేశాడు. పార్లమెంటును తప్పుదారి పట్టించినందుకు అతని మీద విచారణకు తానే ఆదేశించినప్పటికీ అతను ఒక కమ్యూనిస్టుకు వ్యతిరేకంగా ఉన్నాడని, కనుక రంగంలో ఉండాలని అన్నాడు.డెమోక్రటిక్‌ పార్టీకే చెందిన ప్రస్తుత మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ కూడా స్వతంత్రుడిగా పోటీచేయనున్నట్లు ప్రకటించాడు. అయితే అతన్ని బలపరుస్తారా అన్న ప్రశ్నకు తానేమీ చెప్పదలచుకోలేదంటూ వ్యతిరేకతను వెల్లడిరచాడు. ఎవరికి వారే మమ్దానికి వ్యతిరేకంగా ఏకైక అభ్యర్థిగా తానే ఉండాలని ప్రచారం చేసుకుంటున్నారు.ఒక వైపు అందరినీ కూడగట్టేందుకు చూస్తూనే మరోవైపు అసలు పోటీకి దూరం చేసేందుకు జోహ్రాన్‌పై ట్రంప్‌ సర్కార్‌ కుట్రలకు పూనుకుంది. జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే వ్యక్తిగా చిత్రించి ఆ పేరుతో పోటీకి అనర్హుడిగా చేసేందుకు అలాంటి వారి జాబితాను రూపొందించాలని న్యాయశాఖ అధికారులను ఆదేశించింది. ఆ పేరుతో రూపొందించిన జాబితాలను కోర్టులు కూడా సమీక్షించే అవకాశం లేదని వార్తలు. ఇంతకు ముందు ఎవరినీ ఈ సాకుతో పోటీకి దూరం చేయలేదు. జోహ్రాన్‌ మమ్దానీ అమెరికాలో చట్టవిరుద్దంగా ఉంటున్నట్లు అనేక మంది చెబుతున్నారని, ప్రతిదాన్నీ తాను పరిశీలిస్తానని, న్యూయార్క్‌ను నాశనం చేసే ఈ పిచ్చి, నూటికి నూరుశాతం కమ్యూనిస్టును తాను వదిలేది లేదని ట్రంప్‌ కొద్ది రోజుల క్రితం ప్రకటించాడు. అంతర్గత భద్రత సలహా కమిటీ సమావేశంలో ట్రంప్‌ బూట్లు నాకే రూడీ గియులియానీ కమిటీ కార్యదర్శి క్రిస్టీ నియోమ్‌తో మాట్లాడుతూ మమ్దానీ బదులు ఒక దొంగ అయిన ఎరిక్‌ ఆడమ్స్‌ అయినా ఫరవాలేదని ఎందుకంటే అతను కమ్యూనిస్టు కాదని అన్నాడు. మమ్దానీలో ఇస్లామిక్‌ ఉగ్రవాది, కమ్యూనిస్టు కలిసి ఉన్నట్లు నోరుపారవేసుకున్నాడు. ఇది అధికారిక సమావేశంలో జరిగిన ఉదంతం గనుక ఏకంగా ప్రభుత్వమే కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి తెరతీసిందన్నది స్పష్టం. అందుకే ఏదో ఒకసాకుతో జోహ్రాన్‌ అభ్యర్ధిత్వాన్ని దెబ్బతీసేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది.


అభ్యర్థిత్వం కోసం పోటీ ప్రారంభమైన సమయంలో ఎవరు నెగ్గినప్పటికీ అందరూ ఐక్యంగా బలపరచాలని చెప్పిన డెమోక్రటిక్‌ పార్టీ పెద్దలు తీరా జోహ్రాన్‌ ఎన్నికైన తరువాత మాట మార్చారు.మితవాదులు ఎన్నికైతే ఎక్కడ పురోగామివాదులు వ్యతిరేకిస్తారో అని ముందరి కాళ్లకు బంధం వేసినట్లుగా వ్యవహరించిన వారి అసలు రంగు ఇప్పుడు కనిపిస్తోంది.జోహ్రాన్‌ మమ్దానీ గెలిస్తే అమెరికా చరిత్రలో స్వయంగా డోనాల్డ్‌ ట్రంప్‌ వర్ణించినట్లు(జోహ్రాన్‌ చెప్పుకోలేదు) ఒక కమ్యూనిస్టు ప్రపంచ పెట్టుబడిదారీ కేంద్ర కుంభస్థలమైన న్యూయార్క్‌ మేయర్‌ పీఠంపై కూర్చోవటం నిజంగా ఒక చరిత్రే అవుతుంది.ప్రపంచమంతటా సోషలిస్టులు, కమ్యూనిస్టుల పెరుగుదలను అరికట్టాలంటూ దశాబ్దాల తరబడి అమెరికా పాలకవర్గం చేసిన ప్రచారం, దానికి గాను ఖర్చు చేసిన వందలాది బిలియన్‌ డాలర్ల సొమ్ము స్వంత గడ్డమీదనే గాలికి కొట్టుకు పోతుంది. అమెరికాలో కూడా సోషలిస్టు ప్రత్యామ్నాయం సాధ్యమే అనే అభిప్రాయం బలపడుతుంది. అనేక మందిలో ఉన్న సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకత కరిగిపోతుంది. ఏ విధంగా చూసినా పురోగామి శక్తులకు యావత్‌ ప్రపంచంలోనే ఎంతో ఊపువస్తుంది. ఒకవేళ ఓడితే అమెరికాలో డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీల నిజస్వరూపం మరింత బట్టబయలు అవుతుంది.ప్రత్నామాయ శక్తులు ఎదగకుండా చేసేందుకు ఆ పార్టీలు ఎంతకైనా తెగిస్తాయని మరింతగా కార్మికవర్గానికి అర్ధం అవుతుంది. ఏవిధంగా చూసినప్పటికీ పురోగామి ఉద్యమాలు ముందుకు పోవటానికి, ఆశక్తులు బలపడటానికే న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నిక దోహదం చేయటం ఖాయం !


మహాభారతంలో అభిమన్యుడు అశువులుబాశాడు, నేడు అమెరికా కార్పొరేట్లు, మితవాదుల పద్మవ్యూహంలో జోహ్రాన్‌ మమ్దానీ దూసుకుపోతున్నట్లు, ప్రత్యర్ధులందరూ ఒక్కటైనా వారెవరూ గెలిచే అవకాశం లేదని దిగ్భ్రాంతి గొలిపే తాజా సర్వే వెల్లడిరచినట్లు పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక న్యూయార్క్‌ పోస్టు జూలై 29 సంచికలో వాపోయింది. కుంభకోణాల్లో చిక్కుకున్న ప్రత్యర్ధులందరూ ఒక్కటైనా 50శాతం ఓట్లతో ముందున్నట్లు పేర్కొన్నది.జెనిత్‌ రీసర్చ్‌ లేదా పబ్లిక్‌ ప్రోగ్రెస్‌ సొల్యూషన్‌ సర్వే ప్రకారం డెమోక్రటిక్‌ పార్టీ తిరుగుబాటుదార్లు కుమో, ఎరిక్‌ ఆడమ్స్‌లో ఒకరు తప్పుకొని కుమో ఉంటే 55శాతం, ఎరిక్‌ ఉంటే 59శాతం ఓట్లతో గెలిచే అవకాశం ఉందని, రిపబ్లికన్‌ అభ్యర్ధి స్లివా సుదూరంగా ఉన్నట్లు పేర్కొన్నది. కొంత మంది చెబుతున్నట్లు ఇంకా చాలా సమయం ఉంది, తాజా సర్వే తీరు చూసిన తరువాత ఇంకా కుట్ర తీవ్రమయ్యే అవకాశం లేకపోలేదు, చూద్దాం ఏం జరుగుతుందో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బరిలో కమ్యూనిస్టు నేత : సంకుల సమరంగా చిలీ అధ్యక్ష ఎన్నికలు !

23 Wednesday Jul 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti communist, Chile presidential Race 2025, Chilean Communist Jeannette Jara, Jeannette Jara, Latin America’s Left

ఎం కోటేశ్వరరావు

చిలీ చరిత్రలో, బహుశా లాటిన్‌ అమెరికా చరిత్రలో ఇతర పార్టీల పేరుతో కమ్యూనిస్టులుగా, మార్క్సిస్టులుగా ఉన్న వారు పోటీ చేసి గెలిచిన ఉదంతాలు ఉన్నాయి గానీ ఒక కమ్యూనిస్టు పార్టీ నేత జీనెటె జారా విశాల వేదిక పేరుతో ఉన్న వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన తరఫున పోటీ చేయటం ఇదే ప్రధమం.గతంలో పాబ్లో నెరూడా, గ్లాడీ మారిన్‌ పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావితం చేయలేదు. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలలో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన పూర్వరంగాన్ని చూసినపుడు ఒక కరుడు గట్టిన కమ్యూనిస్టుగా పేరున్న జీనెటె జారా పోటీకి దిగటం చిన్న విషయమేమీ కాదు, సంకుల సమరంగా సాగనున్న పోటీలో 51 ఏండ్ల లాయర్‌, మాజీ మంత్రి అయిన ఆమె గెలిస్తే లాటిన్‌ అమెరికా వామపక్ష రాజకీయాల్లో అదొక మైలు రాయి అవుతుంది. పదిపార్టీలతో కూడిన చిలీ ఐక్య సంఘటన వామపక్ష కూటమి అభ్యర్థి ఎంపికకు జూన్‌29న జరిగిన పోటీలో 60శాతం ఓట్లతో కమ్యూనిస్టు పార్టీ నేత ముందంజలో ఉండటంతో అమెనే అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రస్తుతం అదే ఫ్రంట్‌ నేత గాబ్రియెల్‌ బోరిక్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం వరుసగా రెండవ సారి పోటీ చేసే అవకాశం లేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు జారా మంత్రిపదవికి రాజీనామా చేశారు.


జూలై 14వ తేదీన జీనెటె జారా చిలీ ఎన్నికల ట్రిబ్యునల్‌ కార్యాలయానికి వెళ్లి తనను బలపరిచిన పార్టీల నేతలతో కలసి అధికారికంగా విశాల వేదిక పేరుతో ఉన్న వామపక్ష, ప్రజాతంత్ర ప్రంట్‌ తరఫున అభ్యర్థిగా నమోదు చేసుకున్నారు(మన దగ్గర నామినేషన్‌ వంటిదే). నలుగురు మితవాద పార్టీల నేతలు ఆమెతో మొదటి రౌండ్‌లో పడనున్నారని వార్తలు. ఆగస్టు 18వ తేదీలోగా కనీసం 35వేల ఓటర్ల సంతకాల ప్రతిపాదనతో వచ్చిన ప్రతి ఒక్కరిని అభ్యర్థిగా అంగీకరిస్తారు. కొందరు స్వతంత్రులు కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. పార్లమెంటు ఎన్నికలు కూడా ఒకేసారి జరగనున్నందున వివిధ పార్టీలతో కూటములు ఆ సీట్ల సర్దుబాటు యత్నాల్లో ఉన్నాయి. అధ్యక్ష పదవికి తొలి రౌండ్‌లో పోటీ పడినప్పటికీ దామాషా విధానం గనుక కొన్ని పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో సర్దుబాటు చేసుకుంటున్నాయి. వామపక్ష కూటమి క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీతో అవగాహనకు వచ్చేందుకు చూస్తున్నట్లు వార్తలు.


లాటిన్‌ అమెరికాలో జరుగుతున్న ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థులు రంగంలో ఉన్న చోట అమెరికా సిఐఏ, మితవాద, ఫాసిస్టు శక్తులు, నేరగాండ్ల ముఠాలు, వారికి మద్దతుగా నిలిచే మీడియా మొత్తంగా వామపక్షాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. చిలీలో కూడా అదే జరుగుతోంది. ఇప్పటికే అందరూ రంగంలోకి దిగారు. పచ్చిమితవాది కాస్ట్‌ ప్రధాన స్రవంతి మితవాదిగా ముందుకు రావటం, కమ్యూనిస్టులు పోటీలో ఉండటంతో చిలీ రాజకీయాలను నేరాలు వణికిస్తున్నట్లు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. మితవాద శక్తులకు విజయావకాశాలు ఉండటంతో నవంబరులో జరిగే ఎన్నికలకు ముందు సంఘటిత నేరాలు రాజకీయాలకు ఒక రూపం ఇస్తున్నట్లు పేర్కొన్నది. హింసాత్మక చర్యలు గత పదేండ్లలో రెట్టింపు అయిన కారణంగా జనాలు మిగతా అంశాల కంటే అలాంటి శక్తుల నుంచి రక్షణే ప్రధాన ఎన్నికల అంశంగా భావిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. దీంతో మూడవసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జోస్‌ ఆంటోనియో కాస్ట్‌కు లబ్ది కలిగినట్లు పేర్కొన్నది. ఇంకా నాలుగు నెలల వ్యవధి ఉండగానే ఒక అభ్యర్థి ముందున్నట్లు చిత్రించటం జనాలను ప్రభావితం చేసే యత్నాలలో ఒకటని వేరే చెప్పనవసరం లేదు.ఫైనాన్సియల్‌ టైమ్స్‌ కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక తప్ప అనుకూలం కాదు. నేరాలు చిలీలో కొత్త కాదు, వాటిని మాదకద్రవ్యాల ముఠాల వంటి కొన్ని శక్తులు పెంచి పోషిస్తున్నాయి. అలాంటి శక్తులపై చర్యలు తీసుకొనే చిత్తశుద్ధి ఇతర అభ్యర్థులకు లేదని కాస్ట్‌ నాయకత్వం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీ చెప్పుకుంటున్నది.


లాటిన్‌ అమెరికాలో ఒక విచిత్రమైన స్థితి.దాన్లో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.అధ్యక్ష ఎన్నికలు ప్రత్యక్ష పద్దతిలో జరిగితే పార్లమెంటు ఎన్నికలు దామాషా విధానంలో ఉంటాయి. అందువలన అధ్యక్షపదవిని గెలుచుకున్నవారు పార్లమెంటులో మెజారిటీ సాధిస్తారని చెప్పలేము. 2021లో జరిగిన చిలీ ఎన్నికల్లో తొమ్మిది పార్టీల వామపక్ష కూటమి అభ్యర్ధి గాబ్రియెల్‌ బోరిక్‌ గెలిచినప్పటికీ పార్లమెంటు ఉభయ సభల్లో మెజారిటీ లేదు. పార్లమెంటు ఎన్నికలకు వచ్చే సరికి వామపక్ష కూటమిలో ఐదు మాత్రమే ఉన్నాయి. చిలీ పోడెమాస్‌ మాస్‌ నాలుగు మితవాద పార్టీల కూటమి 25.43శాతం ఓట్లతో 155 స్థానాలున్న దిగువ సభ డిప్యూటీస్‌లో 53 సీట్లు తెచ్చుకొని పెద్ద కూటమిగా ఉంది. కమ్యూనిస్టులతో పాటు మరో నాలుగు వామపక్ష పార్టీల కూటమి 20.94శాతం ఓట్లు 37 సీట్లు తెచ్చుకోగా కమ్యూనిస్టులు 12 మంది ఉన్నారు. వామపక్షాలు, ఉదారవాద పార్టీలతో కూడిన ఆరు పార్టీల కూటమి 17.16శాతం ఓట్లు 37 సీట్లు తెచ్చుకుంది. మిగతా సీట్లను ఇతర పార్టీలు, ఒక స్వతంత్ర అభ్యర్ధి తెచ్చుకున్నాడు. ఇలాంటి పరిస్థితే ఈ ఏడాది కూడా పునరావృతమైతే కమ్యూనిస్టు జారానే కాదు ఏ పార్టీ గెలిచినా తాము నమ్మిన విధానాలను పూర్తిగా అమలు జరపటానికి కుదరదు, రాజీ పడాల్సిందే. గాబ్రియెల్‌ బోరిక్‌ ప్రభుత్వం అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నది. అందువలన ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను పూర్తిగా అమలు జరపకపోవటంతో విఫలమైందనే విమర్శలను ఎదుర్కోక తప్పటం లేదు.ఇది ఒక ఇబ్బందికర పరిస్థితి, అదే మితవాదులు అధ్యక్షులుగా గెలిచినా వారికీ ప్రతిఘటన ఉంటుంది, అది కొంతమేరక ప్రజాఅనుకూల స్థితి.ప్రపంచంలో పెన్షన్‌ సంస్కరణలు కార్మికవర్గానికి ఎంతో నష్టదాయకమైనందున ఆ విధానాన్ని సంస్కరించాలని వామపక్ష ప్రభుత్వం ప్రయత్నించినా పూర్తిగా కుదరలేదు.


లాటిన్‌ అమెరికాలో 1970 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తొలి వామపక్ష నేత సాల్వడార్‌ అలెండీపై 1973లో మిలిటరీ జనరల్‌ అగస్టో పినోచెట్‌ తిరుగుబాటు చేశాడు. దాన్ని ఎదుర్కొనే క్రమంలో తుపాకి పట్టిన అలెండీ ఆ పోరులో అమరుడుయ్యాడు. అధికారానికి వచ్చిన పినోచెట్‌ 1980లో తన నియంతృత్వాన్ని సుస్థిరం గావించుకొనేందుకు ఒక రాజ్యాంగాన్ని రుద్దాడు. వాడు విధిలేని స్థితిలో 1990లో గద్దె దిగాడు. ఆ రాజ్యాంగాన్ని మార్చాలని గాబ్రియెల్‌ బోరిక్‌ ప్రయత్నించి ఒక ముసాయిదాను తయారు చేసి 2022లో జనం ఆమోదానికి పెడితే దాన్ని ఓటర్లు తిరస్కరించారు. అది వామపక్ష భావజాలంతో కూడి ఉందని, విప్లవాత్మకంగా, చాలా పెద్దదిగా ఉందంటూ మీడియా, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున జనం చెవుల్లో విద్వేషాన్ని నూరిపోశాయి. తరువాత 2023లో నూతన రాజ్యాంగ మండలి మరొక రాజ్యాంగాన్ని ప్రతిపాదించింది. అది మితవాదంతో, మార్కెట్‌ శక్తులకు అనుకూలంగా ఉందనే విమర్శలు వచ్చాయి. జనం దాన్ని కూడా తిరస్కరించారు. ఏతావాతా నియంత పినోచెట్‌ రాజ్యాంగమే ఇప్పుడు అమల్లో ఉంది.కార్మికవర్గానికి అనుకూలమైన రాజ్యాంగం లేకుండా అధికారంలో ఉన్నప్పటికీ వామపక్షాలకు అనేక పరిమితులు ఉంటాయన్నది చిలీ నేర్పిన గుణపాఠం.

పినోచెట్‌ ఎంతగా జనం నుంచి దూరమయ్యాడంటే వాడి పేరు చెప్పుకొని ఎన్నికల్లో పోటీ చేసేందుకు తరువాత కాలంలో ఎవరూ ధైర్యం చేయలేదు. అయితే పదవి నుంచి దిగిపోయిన తరువాత ఎనిమిదేండ్లు మిలిటరీ అధిపతిగా, 2006లో చచ్చేంతవరకు సెనెటర్‌గా ఉండేందుకు పాలకులు సానుకూలంగా ఉన్నారు. జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ మూడవసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇతడు పినోచెట్‌ మద్దతుదారు. పినోచెట్‌ భావజాలంతో ఉన్నవారు గానీ, కమ్యూనిస్టులుగానీ ఇంతవరకు చిలీలో గెలవలేదని, 2025 ఎన్నికలు అసాధారణమైనవని న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ పాట్రిసియో నవియా చెప్పాడు. కరోనా సమయంలో అధికారంలో ఉన్న వారి వైఫల్యం 2021ఎన్నికల్లో వామపక్షం గెలవటానికి అవకాశం కల్పించిందని కొందరు చెబుతారు.పినోచెట్‌ అధికారం నుంచి తప్పుకున్న తరువాత జరిగిన ఎన్నికల్లో అమరజీవి సాల్వెడార్‌ అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీ నేత మిచెల్లీ బాచ్‌లెట్‌ రెండుసార్లు, మరో ఉదారవాద నేత ఒకసారి మితవాదులు రెండుసార్లు ఎన్నికయ్యారు. అందువలన అలాంటి సూత్రీకరణలు చెల్లవు. అయితే బాచ్‌లెట్‌ పాలన మీద కూడా జనంలో అసంతృప్తి వల్లనే తరువాత ఎన్నికల్లో వామపక్ష నేతలు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో విదేశాల్లో ఉన్న చిలియన్లు ఆరుశాతం( పది లక్షల మంది) కీలకంగా మారనున్నారని చెబుతున్నారు. గతంలో కూడా వారు ఉన్నారు, అయితే ఈ సారి ఒక కమ్యూనిస్టు నేరుగా రంగంలోకి దిగుతున్న కారణంగా మితవాద శక్తులకు మద్దతుగా వారు పని చేస్తారని వారి ఓట్లు ఫలితాన్ని తారు మారుచేస్తాయని సూత్రీకరిస్తున్నారు.

కాడెమ్‌ సంస్థ తాజా ప్రజాభిప్రాయసర్వేలో కమ్యూనిస్టు జారాకు 29శాతం, మితవాద కాస్ట్‌కు 27, మిగతా మితవాద శక్తులందరికీ 25శాతం మద్దతు ఉన్నట్లు పేర్కొన్నారు.ఎన్నికల నిబంధనావళి ప్రకారం ప్రత్యక్ష పద్దతిలో జరిగే ఎన్నికలలో 50శాతంపైగా ఓట్లు తెచ్చుకున్నవారిని విజేతగా ప్రకటిస్తారు. లేనట్లయితే ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న అభ్యర్థుల మధ్య డిసెంబరు నెలలో మరోసారి ఎన్నికలు జరిపి విజేతను తేలుస్తారు. మితవాదుల మొత్తం ఓట్లు 52శాతం ఉన్నాయి గనుక గంపగుత్తగా రెండవ దఫా ఓటింగ్‌లో పడతాయి గనుక కమ్యూనిస్టు గెలిచే అవకాశం లేదని సూత్రీకరిస్తున్నారు. గత ఎన్నికలలో తొలి దఫా ఏడుగురు పోటీ చేశారు.కాస్ట్‌కు 27.91శాతం ఓట్లు రాగా వామపక్ష అభ్యర్థి గాబ్రియల్‌ బోరిక్‌ 25.82శాతంతో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ముగ్గురు మితవాదులకు వచ్చిన మొత్తం ఓట్లు 53.51శాతం ఉన్నప్పటికీ తుది పోరులో బోరిక్‌ 55.87శాతం ఓట్లతో విజయం సాధించాడు. అప్పుడు కూడా ఎన్నికల పండితులు కాస్ట్‌ గెలుపు గురించి జోశ్యాలు చెప్పారు. ఇదే కాడెమ్‌ సంస్థ ఆ ఎన్నికలలో జరిపిన చివరి సర్వేలో కాస్ట్‌ 29, బోరిక్‌ 27శాతం ఓట్లతో మొదటి రెండు స్థానాల్లో ముందున్న ఉన్నట్లు చెప్పింది. కాడెమ్‌ అనే సంస్థ తాజాగా ప్రకటించిన రేటింగ్‌ ప్రకారం జారా 29, కాస్ట్‌ 27, కొద్ది నెలల క్రితం ప్రధాన నేతగా ముందుకు వచ్చిన మరో మితవాద నాయకురాలు ఎవలిన్‌ మత్తయ్‌ 14శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. కమ్యూనిస్టు జారా జూలై ఆరవ తేదీన ఒక సంస్థ సర్వేలో ఆమెకు 39శాతం మద్దతు వున్నట్లు తేలింది. ఇంకా నాలుగు నెలల వ్యవధిలో ఏ మార్పులు జరుగుతాయో, ఏ అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయో చూడాల్సి ఉంది.


కమ్యూనిస్టు వ్యతిరేకతను బాగా రెచ్చగొట్టిన లాటిన్‌ అమెరికాలో కమ్యూనిస్టులకు ఆదరణ పెరగటం గమనించాల్సిన అంశం. వర్తమాన ఎన్నికల్లో కూడా జారాకు ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న కాస్ట్‌ అదే చేస్తున్నాడు. ఆమె గెలిస్తే క్యూబా, వెనెజులా మాదిరి నియంత పాలనను రుద్దుతారంటూ తప్పుడు ప్రచారానికి దిగాడు. మానవహక్కులకు భంగం కలిగించే దేశాలకు జారా మద్దతు ఇస్తారంటూ మీడియా కూడా రెచ్చగొడుతున్నది. విదేశీ ప్రభుత్వాలకు లేదా నమూనాలకు లోబడి ఉండేవిధంగా చిలీ ఉండాలని తాను కోరుకోవటం లేదని, మానహక్కులకు భంగం వాటిల్లిన చోట వాటి రక్షణకు, స్వతంత్ర చిలీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని, బహుపాక్షికత మార్గాన్ని అనుసరిస్తాను తప్ప ఇతర దేశాలను అనుకరించేది లేదంటూ జారా దాన్ని తిప్పికొట్టారు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు కమ్యూనిస్టు పార్టీ చిలీలో ఒక గణనీయశక్తి. తరువాత కాలంలో ప్రభావాన్ని కోల్పోయింది. పది సంవత్సరాల క్రితం నామమాత్రంగా ఉండి ఇప్పుడు అధ్యక్ష పదవికి అధికారంలో ఉన్న కూటమి అభ్యర్థిగా ఎంపిక కావటం చిన్న విషయమేమీ కాదు.చిలీ సమాజంలో కమ్యూనిస్టు వ్యతిరేకత కరిగిపోతున్నదనటానికి ఒక చిహ్నం. అయితే ఇంకా ఎంతో మార్పు రావాల్సి ఉంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎడారిలో ఇసుక అమ్మకం – ఎలన్‌ మస్క్‌ అమెరికా పార్టీ !

12 Saturday Jul 2025

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

America Party, BILLIONAIRE RAJ, Democratic party, Donald trump, Elon Musk, MAGA Republicans, Republican party

ఎం కోటేశ్వరరావు


ప్రపంచ ధనికుడు ఎలన్‌ మస్క్‌ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మీద ఆగ్రహంతో ‘‘ అమెరికా పార్టీ ’’ పేరుతో రాజకీయ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించేశాడు. దాని మీద రాజకీయ పండితులు చర్చలు చేస్తున్నారు. తమకు ప్రయోజనం కలిగించని లేదా వ్యతిరేకించిన పాలకుల మీద ఆగ్రహించిన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు డబ్బుమదంతో తెల్లవారేసరికి పార్టీ పెట్టి తడాఖా చూపుతామంటూ హడావుడి చేయటం అన్ని దేశాలలో జరిగేదే. అమెరికాలో కూడా అదే జరిగింది. ఇప్పుడున్న స్థితిలో అతగాడి ప్రయత్నం ఎడారిలో ఇసుక అమ్మటమే అవుతుందన్నది ఒక వ్యాఖ్య. ట్రంప్‌తో ప్రేమాయణానికి కటీఫ్‌ చెప్పిన తరువాత తన ఫ్యాక్టరీలు, వ్యాపారాలను చూసుకుంటానని చెప్పిన పెద్దమనిషి బిగ్‌, బ్యూటీఫుల్‌( పెద్దది, అందమైన) బిల్లుగా వర్ణించినదానిని పార్లమెంటు గనుక ఆమోదిస్తే తాను రాజకీయ పార్టీని పెడతానని ప్రకటించాడు.ఆమోదం పొందటం, రాజకీయ పార్టీ ప్రకటన వెంటనే జరిగాయి.మఖలో పుట్టి పుబ్బలో అంతరించే పార్టీలు ప్రపంచమంతటా ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే అవుతుందా, 24.7బిలియన్‌ డాలర్ల వ్యక్తిగత సంపదతో ప్రపంచ ధనికుడిగా ఉన్న మస్క్‌ డబ్బును వెదజల్లి అమెరికా రాజకీయాలను మలుపుతిప్పుతాడా, అక్కడ ఇప్పటికే తిష్టవేసిన రిపబ్లిన్‌, డెమోక్రటిక్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలుపుతాడా ? ఇలా పరిపరి విధాలుగా ప్రపంచ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు ముద్దులాడుకున్న వారు నేడు దెబ్బలాడుకుంటున్నారు. రేపేం చేస్తారో తెలియదు, రాజకీయాలు, వ్యాపారాల్లో ఏదైనా జరగవచ్చు.


అసలు వారెందుకు విడిపోయారు ? తాను తయారు చేసే టెస్లా విద్యుత్‌ కార్లతో అమెరికాను ప్రపంచాన్ని నింపాలని ఎలన్‌ మస్క్‌ ఆశపడ్డాడు. అందుకు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఉంటే తన ఆటలు సాగించుకోవచ్చనుకున్నాడు. ట్రంప్‌ పలుకుబడితోనే నరేంద్రమోడీపై వత్తిడి తెచ్చి మనదేశంలో స్టార్‌లింక్‌ను సాధించిన సంగతి తెలిసిందే, టెస్లా కార్లను కూడా మార్కెటింగ్‌ చేస్తానని ప్రకటించాడు.మస్క్‌ కంపెనీకి స్థానిక మార్కెట్‌ మొత్తాన్ని అప్పగిస్తే అమెరికాలో పెట్రోలు, డీజిలు, గ్యాస్‌ వ్యాపారం చేసేవారు, వాటితో నడిచే కార్లు తయారు చేసేవారు చేతులు ముడుకు కూర్చుంటారా ? రంగంలోకి దిగి ట్రంప్‌కు వార్నింగ్‌ ఇవ్వటంతో అతగాడు వెనక్కు తగ్గాడు.అక్కడే మొదలైంది రచ్చ. దాన్ని బయటకు చెప్పుకోలేడు గనుక ట్రంప్‌ యంత్రాంగం రూపొందించిన పొదుపు బిల్లు ఆమోదం పొందితే అమెరికా సర్వనాశనం అవుతుందంటూ ధ్వజమెత్తాడు. ట్రంప్‌ ఊరుకుంటాడా ఇలాగే వాగితే నీ కార్లకు ఇస్తున్న సబ్సిడీల మొత్తాన్ని ఎత్తివేస్తా ఆలోచించుకో అన్నాడు. కాస్త మెత్తబడినప్పటికీ ఆవిరైన ప్రేమ తిరిగి చిగురించలేదు, ఛీ పో అంటే ఛా పో అనుకున్నారు. ఇప్పుడేం జరుగుతుందన్నది ఆసక్తి కలిగించే అంశం.


అమెరికాను మరోసారి గొప్పదాన్ని చేయాలనే పిలుపును సమర్ధించిన వారందరికీ మస్క్‌ నిర్ణయం రుచించలేదు.ట్రంప్‌ ద్వారా గరిష్టంగా లబ్దిపొందాలని చూసిన బడాబాబులకు అమెరికా పార్టీ గురించి భయం లేదుగానీ మస్క్‌ తెస్తున్న వత్తిడి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. పార్లమెంటు ఆమోదించి ట్రంప్‌ సంతకం అయిన పొదుపు చట్టం అమలు జరిగితే కార్మికవర్గ సంక్షేమ కార్యక్రమాల మీద తొలివేటు పడుతుందనే భయంతో ఇప్పటికే జనం భారీ ఎత్తున రెండుసార్లు నిరసన ప్రదర్శనలు చేశారు.ప్రాధమిక వార్తల ప్రకారం ఇది అమల్లోకి వస్తే కోటీ 30లక్షల మందికి ఆరోగ్యబీమా గల్లంతు లేదా ఉన్నప్పటికీ నిరుపయోగంగా మారుతుందనే విశ్లేషణలు వచ్చాయి.జనాల నుంచి ఎదురయ్యే నిరసనలను ఎలా అణచివేయాలా అని చూస్తుంటే మధ్యలో మస్క్‌ గొడవేంటని ఇతర కార్పొరేట్‌ శక్తులు చిరాకు పడుతున్నాయి. ట్రంప్‌ చట్టంతో ఇప్పటికే ఉన్న దేశ రుణానికి మరో నాలుగున్నరలక్షల కోట్ల డాలర్లు తోడవుతుందని మస్క్‌ ధ్వజమెత్తాడు. ఇప్పటికే జిడిపిలో 122శాతం 36.2లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉంది. దాన్ని మరో నాలుగులక్షల కోట్ల డాలర్లు పెంచుకొనేందుకు మే నెలలో అనుమతి ఇచ్చారు, ఇప్పుడు మరో ఐదు లక్షల కోట్లడాలర్ల వరకు పెంచాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాలో జన్మించి 2002లో అమెరికా పౌరసత్వం పొందిన మస్క్‌కు కెనడా పౌరసత్వం కూడా ఉంది. నిబంధనల ప్రకారం అమెరికా గడ్డమీద పుట్టిన వారు మాత్రమే అధ్యక్షపదవికి అర్హులు. ప్రస్తుతం రెండు పార్టీలు పోటాపోటీగా పార్లమెంటు ఉభయ సభల్లో సీట్లు తెచ్చుకుంటున్న పూర్వరంగంలో తనకున్న ధనబలంతో సెనెట్‌లో రెండు మూడు, ప్రజాప్రతినిధుల సభలో 8 నుంచి 10 తెచ్చుకుంటే చక్రం తిప్పవచ్చన్నది మస్క్‌ ఎత్తుగడ.తాజాగా మస్క్‌ వ్యతిరేకించిన ట్రంప్‌ ముందుకు తెచ్చిన బిగ్‌, బ్యూటీఫుల్‌ బిల్లు పార్లమెంటులో చావుతప్పి లొట్టపోయినట్లుగా నెగ్గింది. వంద మంది ఉన్న సెనెట్‌లో వ్యతిరేక, అనుకూల ఓట్లు 50 చొప్పున రాగా ఉపాధ్యక్షుడిగా ఉన్న జెడి వాన్స్‌ తన నిర్ణయాత్మక ఓటుతో బిల్లును గట్టెక్కించాడు. ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 220 ఓట్లు ఉన్నప్పటికీ బిల్లుకు అనుకూలంగా 218 మాత్రమే రాగా 212 ఉన్న డెమోక్రాట్లతో మరో ఇద్దరు అధికారపక్ష సభ్యులు చేతులు కలపటంతో వ్యతిరేకంగా 214 వచ్చాయి. ఇలాంటి సమయాల్లో మూడో పక్షానికి ఎంపీలు ఉంటే కింగ్‌ మేకర్‌లుగా మారతారు. ఎలన్‌ మస్క్‌ ఆకాంక్ష, యత్నం అదే. రెండు పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయం గురించి కాదు. గతంలో డెమోక్రటిక్‌ పార్టీకి, గత ఎన్నికల్లో రిపబ్లికన్‌ ట్రంప్‌కు మద్దతు ఇచ్చాడు. ఎవరికి బాసటగా ఉన్న తన లాభమే పరమావధి.

రెండు పార్టీలకు పరిష్కారం తన పక్షమే అని, అమెరికన్లు కోల్పోయిన స్వాతంత్య్రాన్ని తిరిగి ఇస్తానని మస్క్‌ చెప్పాడు. మూడిరట రెండు వంతుల మంది కొత్త పార్టీ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ట్రంప్‌ ఏలుబడిలో ప్రభుత్వ సిబ్బంది సామర్ధ్యం పెంచే పేరుతో ఎలన్‌ మస్క్‌ చేపట్టిన డోజ్‌ ఉద్యోగులను తొలగించేందుకు పని చేసింది తప్ప మరొకటి కాదు. ట్రంప్‌ తెచ్చిన చట్టం కార్పొరేట్లకు పన్నుల తగ్గింపు, సామాన్యుల సంక్షేమం కుదింపుకు ఉద్దేశించింది. ప్రస్తుతం 7.1 కోట్ల మంది ఆరోగ్యబీమాపై ఆధారపడి ఉన్నారు. రానున్న పది సంవత్సరాల్లో కోటీ 70లక్షల మంది ఈ పథకానికి దూరం అవుతారు. మనదేశంలో ఆహార భద్రతా పథకం కింద 80 కోట్ల మందికి ఉచిత బియ్యం, గోధుమలు ఇస్తున్నట్లుగానే అమెరికాలో అదనపు పోషకాహారం పేరుతో 4 కోట్ల మంది ఆహార కూపన్లు ఇస్తున్నారు. వీరిలో 47 లక్షల మంది వాటిని కోల్పోతారు. కొత్త చట్టం అమలుచేస్తే సంక్షేమ పథకాలకు లక్ష కోట్లడాలర్లు కోతపడుతుందని అధ్యక్ష భవనం రూపొందించిన పత్రమే చెప్పింది. ఈ సొమ్మును దేనికి ఖర్చు చేస్తారో తెలుసా ! అక్రమంగా సరిహద్దు దాటకుండా ఉండేందుకు మెక్సికో సరిహద్దులో ఏర్పాటు చేసిన ఇనుప గోడకు 46బిలియన్‌ డాలర్లు, వలస వచ్చిన వారికి నిర్బంధ శిబిరాల్లో పడకలకు 45బి.డాలర్లు, వలస వచ్చిన వారిని గుర్తించి 2029 నాటికి దేశం నుంచి తరిమివేసేందుకు అవసరమైన మరో పదివేల మంది సిబ్బంది నియామకానికి ఇలా మొత్తం 350 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనున్నారు. కొత్త లేదా పాత విద్యుత్‌ కార్లు కొనుగోలు చేసే వారికి ఇస్తున్న పన్ను రాయితీలు సెప్టెంబరు 30తో ముగుస్తాయి, వాటిని 2032వరకు పొడిగిస్తారు. పార్లమెంటు అనుమతి లేకుండా ప్రభుత్వం అప్పులు చేయటానికి లేదు, ఒక పరిమితి ఉంటుంది. అయితే 1960 నుంచి ఇప్పటికి 78 సార్లు నిబంధనలను సవరించారు. ట్రంప్‌ తొలిసారి పాలనా కాలంలో 8లక్షల కోట్ల మేర కొత్త అప్పు చేసేందుకు నిబంధనలు సడలించారు. ఇలాంటి సవరణలకు రెండు పార్టీలూ సై అంటాయి.


అమెరికా రాజకీయాల్లో బ్లాక్‌మెయిల్‌ చేయటం కూడా మామూలే, పెరోట్‌ కుమార్తె గురించి బుష్‌ తప్పుడు ప్రచారం చేయటం, అదివాస్తవం కాదని నిరూపించుకోలేని స్థితిలో 1992 ఎన్నికల్లో తొలుత పోటీ నుంచి వెనక్కు తగ్గాడు, తరువాత తిరిగి రంగంలోకి వచ్చాడు. బుష్‌ కుటుంబం మీద ఉన్న ఆగ్రహంతో రాస్‌ పెరోట్‌ అనే బిలియనీర్‌ 1992 అధ్యక్ష ఎన్నికలలో రిఫామ్‌ పార్టీ పేరుతో పోటీ చేశాడు. బిల్‌ క్లింటన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (43) జార్జి బుష్‌ రిపబ్లికన్‌ పార్టీ 37.5 శాతం ఓట్లు తెచ్చుకోగా పెరోట్‌కు 18.9శాతం ఓట్లు వచ్చాయి. అయితే అధ్యక్ష ఎన్నికకు కావాల్సిన ఎలక్టరల్‌ కాలేజీలో ఒక్క ఓటూ రాలేదు. ఎలన్‌ మస్క్‌ కూడా బ్లాక్‌మెయిలింగ్‌లో తక్కువ తినలేదు. ఎప్‌్‌స్టెయిన్‌ అనేవాడు బడాబాబులకు పిల్లల్ని తార్చి డబ్బుగడిరచటంలో పేరు మోశాడు. అతగాడి జాబితాలో డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఉన్నట్లు విమర్శలు వచ్చాయి. అనుమానాస్పద స్థితిలో వాడు జైల్లో చచ్చాడు. దాంతో ఎప్‌స్టెయిన్స్‌ ఫైల్స్‌ గురించి దర్యాప్తును మూసివేసి పెద్దలను కాపాడారని గుప్పు మంది. అందే అంశాన్ని ట్రంప్‌తో చెడిన తరువాత మస్క్‌ ముందుకు తెచ్చాడు. ఆ విషయాలు అతగాడికి ఎప్పుడో తెలిసినప్పటికీ గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా సర్వశక్తులూ వడ్డాడు, తన సామాజిక మాధ్యమం ఎక్స్‌ను ఉపయోగించాడు, పెద్ద మొత్తంలో స్వంతంగా సొమ్ము ఖర్చు చేశాడు. అందువలన పార్టీ పెట్టి తమను దెబ్బతీస్తాడనుకుంటున్నటున్న మస్క్‌ను వేరే రూపంలో దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదు.

పార్టీలను ఏర్పాటు చేయటంలోనూ, రాజకీయాల్లో బిలియనీర్లు పాల్గొనటం ఎలన్‌ మస్క్‌తో ప్రారంభం కాలేదు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక అధ్యయనంలో ఫోర్బ్స్‌ రూపొందించిన జాబితా ప్రకారం ప్రపంచంలోని 2072 మంది బిలియనీర్లలో 11శాతం మంది రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు, తమ ప్రభావాన్ని చూపేందుకు ధనికులు ముందుకు వస్తున్నారనటానికి ఇదొక సూచిక. వారు ఎలాంటి విధానాలకు మద్దతు ఇస్తారో కూడా వేరే చెప్పనవసరం లేదు. వారికి ప్రపంచంలో బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ సైద్ధాంతికంగా పెద్దగా తెలియదని తేలింది. ప్రపంచ ధనికుల కేంద్రం అమెరికా అయినప్పటికీ ఇక్కడి బిలియనీర్లు ప్రపంచ సగటు కంటే తక్కువగా కేవలం 3.7శాతమే రాజకీయాల్లో ఉన్నారు. రెండు ప్రధాన పార్టీల్లో వీరు తమను అధ్యక్షపదవి అభ్యర్థులుగా ఎన్నుకోవాలని భారీ మొత్తాల్లో నిధులు ఖర్చు చేశారు.లాస్‌ ఏంజల్స్‌ నగర మేయర్‌ పదవి కోసమే రెండుసార్లు జెబి ప్రిట్జ్‌కర్‌ 35 కోట్ల డాలర్లు ఖర్చు చేశాడంటే అధ్యక్ష పదవికి స్వయంగా లేదా మద్దతు ఇచ్చేవారు ఎంత మొత్తాలు ఖర్చు చేస్తారో అర్ధం చేసుకోవచ్చు. 2022 మధ్యంతర పార్లమెంటు ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలకు బిలియనీర్లు ఇచ్చిన విరాళాల మొత్తం 88 కోట్ల డాలర్లు. అగ్రస్థానంలో ఉన్న ఇరవై మందిలో 14గురు రిపబ్లికన్‌ పార్టీకి ఇచ్చినట్లు తేలింది. వివిధ దేశాల ప్రభుత్వాలలో కొలువుదీరిన వారు 242 మంది కాగా సగటున 2.5 పదవులు చేపట్టారు. మనకు మిరేజ్‌, రాఫేల్‌ యుద్ద విమానాలు అమ్మిన కంపెనీ యజమాని సెర్గీ దసాల్ట్‌ ఫ్రాన్సులో ఏకంగా 16 పదవుల్లో పని చేశాడు. తన భార్య రాఫేల్‌ పేరునే విమానానికి పెట్టాడు. బిలియనీర్లు నిరంకుశ, నియంత పాలనలోనే ఎక్కువగా పదవుల్లో రాణించారట. అమెరికా బిలియనీర్లలో డెమోక్రాట్ల కంటే రిపబ్లికన్లను సమర్ధించిన వారు రెండున్నరరెట్లు ఎక్కువ, ఐరోపాలో అత్యధికులు మితవాద శక్తుల మద్దతుదార్లు. ఎలన్‌ మస్క్‌ కార్మికవర్గానికి వ్యతిరేకి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో అతగాడి పార్టీ గెలుస్తుందో లేదో చెప్పలేము గానీ ఓట్లను చీల్చితే రిపబ్లికన్‌ పార్టీ బలం తగ్గి డెమోక్రాట్లు లాభపడితే ట్రంప్‌కు అడుగుడుగునా ప్రతిఘటన తప్పదు !
 

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిగ్గూ ఎగ్గూలేని బతుకులు : ఔను వాళ్లిద్దరూ విడిపోయారు, తిరిగి దగ్గరవ్వాలని చూస్తున్నారు !

11 Wednesday Jun 2025

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald trump, Elon Musk, Narendra Modi, Tesla, Trump-Musk relationship


ఎం కోటేశ్వరరావు


కేవలం మూడు నిమిషాల్లోనే విడిపోయిన జంట ఉదంతం ప్రపంచంలో అత్యంత తక్కువ సమయం మనుగడ సాగించిన వివాహంగా చరిత్రలో నమోదైంది. కువాయిట్‌లో 2019లో ఇది జరిగింది, ప్రమాదవశాత్తూ తూలిపడిన వధువును బుద్ధిలేనిదానా అని తిట్టిన వరుడు తనకు అక్కర లేదనటంతో కోర్టుకు ఎక్కారు. అంతకు వందేళ్ల క్రితం ఒక హాలీవుడ్‌ జంట కేవలం 20నిమిషాల్లోనే విడిపోయింది. వివాహం మీద పునరాలోచనలో పడ్డ నటి భర్తను హానీమూన్‌ రూమ్‌లో పెట్టి బయట తాళం వేసి వెళ్లిపోయిందట. ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌, ప్రపంచ అగ్రరాజ్య అధిపతి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రేమాయణం చెడిరది. ఇద్దరూ లాభాలు తప్ప మరొకటి పట్టని పక్కా వ్యాపారులే. ఛీ పో అంటే ఛా పో అనుకున్నారు, అంతలోనే మరోసారి దగ్గరయ్యేందుకు చూస్తున్నారు, సిగ్గూ ఎగ్గులేని బతుకులు. ప్రేమలో పడటానికి, విడిపోవటానికి, తిరిగి దగ్గర కావటానికి డాలర్లు తప్ప మరొక అంశాన్ని ఊహించటం కష్టం. జెఫ్రీ ఎప్‌స్టెయిన్‌ అనే అమెరికన్‌ పక్కా తిరుగుబోతు, తార్పుడుగాడు. పద్నాలుగు, పదిహేనేండ్ల ఆడపిల్లలను వలవేసి పట్టటం అనుభవించటం, బడాబాబులకు తార్చటం, తద్వారా లబ్దిపొందటం వాడి చరిత్ర.2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వాడి గురించి దర్యాప్తు చేసిన పోలీసులు సేకరించిన సమాచారాన్ని జెఫ్రీ ఫైల్స్‌ అంటున్నారు. వాటిలో డోనాల్డ్‌ ట్రంప్‌ పేరు ఉందన్నది తాజాగా ఎలన్‌ మస్క్‌ పేల్చిన బాంబు. అందుకే వాడిని జైల్లో లేపేశారని బయటకు ఆత్మహత్య చేసుకున్నాడని కథలు అల్లారని చెబుతారు. వీడి ఖాతాదార్లలో ట్రంప్‌ ఉన్నట్లు ఎక్స్‌ చేసిన మస్క్‌ దాన్ని వెనక్కు తీసుకున్నాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ పేరు ఎప్‌స్టెయిన్‌ ఫైల్స్‌లో ఉంది, అందుకే వాటిని బహిర్గత పరచలేదు అని మస్క్‌ పేర్కొన్నాడు. తరువాత దాన్ని తొలగించాడు. దీని మీద తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో నాకు వ్యతిరేకంగా ఎలన్‌ మస్క్‌ మారటాన్ని నేను పట్టించుకోను అన్నాడు, ఎయిర్‌ ఫోర్స్‌ ఒన్‌ విమానంలో ప్రయాణిస్తూ దాని గురించి నేనసలు ఆలోచించటం లేదన్నాడు.అయితే మస్క్‌ కంపెనీలతో ప్రభుత్వ కాంట్రాక్టుల గురించి ప్రతి అంశాన్ని పరిశీలిస్తామన్నాడు. డెమోక్రటిక్‌ పార్టీకి నిధులు ఇస్తే సంగతి చూస్తానని బెదిరించాడు.


ట్రంప్‌ను పదవి నుంచి అభిశంసన ద్వారా తొలగించాలని మస్క్‌ అన్నాడు. అదే నోటితో లాస్‌ ఏంజల్స్‌లో వలస కార్మికుల నిరసనలను అణచివేసేందుకు మిలిటరీని దింపిన ట్రంప్‌ను పొగుడుతున్నాడు. మస్క్‌తో మాట్లాడేదేలేదు అన్న ట్రంప్‌ మాట మార్చాడు. మస్క్‌ ఫోన్‌ చేస్తే మీరు మాట్లాడతారా అన్న విలేకర్ల ప్రశ్నకు దాని గురించి నిజంగా నేను ఆలోచించలేదు, నేను ఊహించగలను, దాని గురించి ఆలోచిస్తా అన్నాడు తప్ప అవునని కాదని చెప్పలేదు. దోచుకొనేదగ్గర, వాటాల పంపిణీలో దెబ్బలాట, జనాన్ని అణచటంలో ముద్దులాట. వర్గనైజం ఇది. ఎలన్‌మస్క్‌ పెద్ద వ్యాపారి, పారిశ్రామికవేత్త.తన టెస్లా కార్లను అమ్ముకోవాలన్నా, స్టార్‌లింక్‌ను పలుదేశాల్లో ఏర్పాటు చేయాలన్నా అమెరికా పాలకుల అండకావాలి. మన నరేంద్రమోడీ ఇటీవలనే అనుమతించటం దానికి పక్కా నిదర్శనం. డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదారుగా ఉన్న ఆ పెద్ద మనిషి అందుకోసమే డోనాల్డ్‌ ట్రంప్‌కు ఎన్నికల విరాళాల రూపంలో ఆర్థికంగా భారీ మొత్తంలో సమర్పించుకున్నాడు.అధికారానికి వచ్చిన మరుసటి రోజు నుంచే సతాయించటం మొదలు పెట్టాడు. రానున్న రోజుల్లో వినియోగదారులందరూ విద్యుత్‌ కార్లే కొనుగోలు చేయాలంటూ ఒక విధాన నిర్ణయం చేయాలని, వాటి మీద ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని పెంచాలని, వారికి అందుబాటులో మూలమూలనా చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశాడు. ట్రంప్‌ దానికి అంగీకరించలేదు . ఎందుకని ? అమెరికా కార్ల కంపెనీల యజమానుల చరిత్రను చూసినపుడు తమ కార్లను అమ్ముకొనేందుకు ప్రజారవాణా వ్యవస్థలైన బస్సులు, రైళ్లను, ట్రామ్‌లను పక్కన పెట్టేసే విధంగా ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చి విజయవంతమయ్యారు. వారికి పెట్రోలు, డీజిలు అమ్ముకొనే కంపెనీలు వత్తాసు పలికాయి. ఎక్కడో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఎలన్‌ మస్క్‌ ప్రపంచ కుబేరుడు కావచ్చు కానీ ఇప్పటికే ఉన్న చమురు కార్ల పరిశ్రమ మొత్తాన్ని మూసివేయించేంత మొనగాడా అది జరిగితే నీ సంగతి తేలుస్తామని ఆ రంగంలోని కంపెనీలు ట్రంప్‌ను హెచ్చరించటంతో ఇరకాటంలో పడి వెనక్కు తగ్గాడు. వారి మధ్య వైరానికి అసలు కారణం ఇదే !


ఎలన్‌ మస్క్‌, డోనాల్డ్‌ ట్రంప్‌ల అక్రమ సంబంధాలు జగమెరిగిన సత్యం. ఇంతకు ముందు గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బెన్‌ భార్య నికోలే సహాన్‌తో మస్క్‌ పెట్టుకున్న అక్రమ సంబంధం కారణంగా వారిద్దరూ విడిపోయారు. తాజా ఉదంతానికి వస్తే అమెరికా అధ్యక్ష భవనంలో ఉన్నత అధికారిగా పనిచేస్తున్న స్టెఫాన్‌ మిల్లర్‌ భార్య కాటీ మిల్లర్‌తో సంబంధం పెట్టుకున్నట్లు గుప్పుమంది. ట్రంప్‌ మీద ఆగ్రహంతో మస్క్‌ డోజ్‌ పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్లినపుడు అప్పటి వరకు అధ్యక్ష భవనంలో ఉద్యోగిగా ఉన్న కాటీ కూడా రాజీనామా చేసి ఎలన్‌ మస్క్‌ కంపెనీలో పని చేసేందుకు వెళ్లిపోయింది. వేరే సందర్భంలో స్టెఫాన్‌ మిల్లర్‌ ‘‘ అమెరికాను తిరిగి వెనక్కు తీసుకువచ్చాం’’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. దాని మీద మస్క్‌ స్పందిస్తూ ‘‘ నేను నీ భార్యను తీసుకుపోయినట్లేనా ’’ అని వ్యాఖ్యానించాడు. అయితే అదంతా నిజం కాదని తానలాంటి పోస్టు పెట్టలేదని మస్క్‌ చెప్పుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. తన స్వంత కృత్రిమ మేథ గ్రోక్‌ను సంప్రదిస్తే అది కూడా మస్క్‌ పెట్టిన పోస్టు స్క్రీన్‌ షాట్‌ నిజమే అని చెప్పిందట. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ వీటిని పెద్దగా పట్టించుకోదు. ఇద్దరూ రాజీబాటలో ఉన్నారని సంతృప్తి వ్యక్తం చేయటంతో మస్క్‌ కంపెనీల వాటాల ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ పడిపోయన నాటి స్థాయికి చేరలేదు. వెంటనే వారిద్దరూ కలవక పోయినా కొన్ని నెలలకు పూర్తిగా సర్దుకుంటారని భావిస్తున్నారు.ఇద్దరి మధ్యా సంబంధాలు బాగున్నాయని అందరూ భావించినపుడు మార్చి నెలలో ట్రంప్‌ ఒక ఎర్ర టెస్లా కారు ముందు నిలిచి దానిని కొనుగోలు చేసినట్లు ఫొటోలకు ఫోజులిచ్చాడు. దాన్ని ఇప్పుడు వదిలించుకోవచ్చని అధ్యక్ష భవన సిబ్బంది చెబుతున్నారు.


మాజీ డెమోక్రాట్‌ అయిన మస్క్‌ 2016లో ట్రంప్‌ తొలిసారి అధికారానికి వచ్చినప్పటి నుంచి వాణిజ్య సలహ మండళ్లలో చోటు సంపాదించుకున్నాడు.రెండోసారి ఓడిపోయిన తరువాత ఇక చాల్లే మళ్లీ పోటీకి దిగవద్దన్నాడు. ఫ్లోరిడా గవర్నర్‌ డేశాంటిస్‌ పోటీ చేస్తే తాను మద్దతు ఇవ్వకపోయినా జో బైడెన్‌ మీద గెలుస్తాడని ఎక్స్‌ చేశాడు. కానీ 2024లో ట్రంప్‌కు అన్నీ తానే అన్నట్లు వ్యవహరించాడు. అతగాడి కోసమే తొలిసారిగా రిపబ్లికన్‌ పార్టీకి ఓటు వేశానన్నాడు. అమెరికా అధికారపీఠంపై అనుచరులతో ట్రంప్‌ దాడి చేయించినపుడు ఎక్స్‌ ఖాతాను రద్దు చేశారు. తరువాత మస్క్‌ కొనుగోలు చేసిన తరువాత 2022 చివరిలో పునరుద్దరించాడు.ట్రంప్‌ సొంతంగా ట్రూత్‌ అనే వేదికను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ కేసుల్లో ఇరుక్కునపుడు ఐదు కోట్ల డాలర్లు మస్క్‌ ఇచ్చాడు. ట్రంప్‌ ఎన్నడూ తనను డబ్బు అడగలేదని తానే ఇచ్చినట్లు చెప్పుకున్నాడు.ఎన్నికల్లో 25 కోట్ల డాలర్లు ఖర్చు చేశాడు. అధికారానికి వచ్చిన తరువాత మస్క్‌ గొంతెమ్మ కోర్కెలు తీర్చే అవకాశం లేదని ట్రంప్‌ పక్కన పెట్టటం ప్రారంభించాడు, ఇచ్చిన పదవితో పండగ చేసుకో అన్నాడు. విద్యుత్‌ వాహనతయారీదారులు కష్టకాలంలో ఉన్నారు. వారు బిలియన్ల డాలర్లను సబ్సిడీగా ఇవ్వాలని కోరుకుంటున్నారు, అది సాధ్యం కాదనటంతో మస్క్‌ ఆశాభంగం చెందాడని ట్రంప్‌ చెప్పాడు. తన మద్దతులేకపోతే రిపబ్లికన్లు ఓడిపోయి ఉండేవారని, కృతజ్ఞత చూపలేదని మస్క్‌ అంటే అతగాడికి పిచ్చి ఎక్కిందని, తానింకే మాత్రం అతగాడి గురించి ఆలోచించనని ట్రంప్‌ బదులిచ్చాడు. నేను చైనా, రష్యాలతో, ఇంకా చాల సమస్యలతో తీరిక లేకుండా ఉన్నాను, ఎలన్‌ గురించి ఆలోచించటం లేదు, మీకు తెలుసు అతగాడు బాగుండాలని కోరుకుంటున్నా అన్నాడు.గుడిలో లింగాన్ని, గుడినీ మింగాలనుకున్న మస్క్‌ ఇచ్చిన పదవితో సంతృప్తి చెందలేదు. దాంతో ఇద్దరూ రోడ్డెక్కారు. మస్క్‌ త్వరలో బయటకు వెళ్లిపోతాడని ట్రంప్‌ తన కాబినెట్‌, ఇతర ముఖ్యులతో వ్యాఖ్యానించినట్లు ఏప్రిల్‌ రెండవ తేదీన పొలిటికో పత్రిక రాసింది. మే చివరి వారంలో పదవీ కాలం ఒక రోజు ఉండగానే రాజీనామా చేశాడు.


ఈ బాగోతం చూసిన తరువాత సామాజిక మాధ్యమం, రాజకీయ వర్గాల్లో జోకులే జోకులు. సముచితమైన ఫీజు కింద మాకు స్టార్‌లింక్‌ కంపెనీ వాటాలు ఇస్తే ఇద్దరి మధ్య రాజీకుదుర్చుతాం, దెబ్బలాడుకోవద్దు అంటూ రష్యన్‌ మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్‌ చమత్కరించాడు. కావాలంటే మస్క్‌కు రాజకీయ ఆశ్రయం కల్పిస్తామని రష్యా ఇతర నేతలు చెప్పారు. ఎలన్‌ ఆశాభంగం చెందవద్దు, అమెరికాలో అసాధ్యమైన సమస్యలను ఎదుర్కొంటే మా దగ్గరకు రండి మాలో ఒకరిగా మారండి, మీ సాంకేతిక నైపుణ్యానికి పూర్తి స్వేచ్చ ఉంటుంది ఇక్కడ నిజమైన స్నేహితులు ఉన్నారంటూ ఎక్స్‌లు చేశారు. ఎవరెన్ని మాట్లాడినా ఒక డాలరు విలువ చేయవు అన్నది ట్రంప్‌, మస్క్‌ తీరు. ఈ మొత్తం ఉదంతంలో అంతిమంగా ట్రంప్‌దే పైచేయి అన్నది స్పష్టం. ఎందుకంటే అపరిమితమైన అధికారం ఉన్నందున ఎలన్‌ మస్క్‌ ఆర్థిక సామ్రాజ్యాన్ని కుప్పకూల్చివేసే అవకాశం ఉంది. అందుకే మస్క్‌ దారికి వచ్చినట్లు కనిపిస్తోంది. కొస మెరుపు ఏమంటే మంగళవారం నాడు ఎలన్‌ మస్క్‌ డ్రైవర్‌తో పనిలేని తన తొలి కారును ప్రయోగించి చూపాడు. దాంతో రోబోటాక్సీ రంగంలో అతగాడి కంపెనీ ఉందన్న భరోసాతో స్టాక్‌మార్కెట్‌లో వాటాల ధరలు పెరిగాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నియంతృత్వం దిశగా అమెరికా ! మిలిటరీ ముట్టడిలో లాస్‌ ఏంజల్స్‌ నగరం !!

11 Wednesday Jun 2025

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Opinion, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Democratic party, Donald trump, Immigrants, L.A. Mayor Karen Bass, L.A. Riots, Los Angeles, Republican party


ఎం కోటేశ్వరరావు


అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డిసి, ఆర్థిక రాజధాని న్యూయార్క్‌, ప్రపంచ సినిమా హాలీవుడ్‌ రాజధాని లాస్‌ ఏంజల్స్‌. ఇప్పుడు ఈ నగరంపై ముట్టడికి అమెరికా మిలిటరీలోని నేషనల్‌ గార్డ్స్‌, మెరైన్లను అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దించాడు. 1965లో పౌరహక్కుల ప్రదర్శకులను అడ్డుకొనేందుకు అలబామా రాష్ట్రానికి అక్కడి ప్రభుత్వ అనుమతి లేకుండా నాటి అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ కూడా ఇదే మాదిరి మిలిటరీని పంపాడు, ఆ తరువాత ఇదే ప్రధమం. అక్రమ వలసదారులను ఏరివేసే పేరుతో ఇమ్మిగ్రేషన్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసిఇ) సిబ్బంది నగరమంతటా వందలాది మందిని అరెస్టు చేయటాన్ని జనం నిరసిస్తున్నారు. వారిని అణచివేసేందుకు శనివారం నాడు రెండువేల మంది మిలిటరీ నేషనల్‌ గార్డులను పంపిన ట్రంప్‌ సోమవారం నాడు మరో రెండువేల మందితో పాటు , 700 మంది మెరైన్లను కూడా రంగంలోకి దించాడు. తమ అధికారాన్ని అతిక్రమించి మిలిటరీని దించటాన్ని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ న్యూసమ్‌ కోర్టులో సవాలు చేశాడు. నిరసనలను తెలుపుతున్నవారి సమీపంలో ఉన్న జర్నలిస్టులను మిలిటరీ దూరంగా తరిమివేస్తోంది, ప్రజాప్రతినిధులను కూడా ఆ ప్రాంతాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నది. తమ అధ్యక్షుడు వెనక్కు తగ్గేది లేదని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ మరింతగా రెచ్చగొడుతూ ప్రకటించాడు. విదేశీ వ్యతిరేకత, ఉన్మాదాలను రెచ్చగొడుతున్నారు. లాటినోలు ఎక్కువగా ఉన్న పారామౌంట్‌ వంటి చోట్ల నిరసనలు పెద్ద ఎత్తున చెలరేగాయి. స్థానికంగా ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తినపుడు అమెరికాలో మిలిటరీని దించటం అసాధారణం. అలాంటిది కేవలం నిరసన ప్రదర్శనలు జరిగిన వెంటనే ట్రంప్‌ తీసుకున్న ఈ అసాధారణ చర్య ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సి ఉంది. లాస్‌ ఏంజల్స్‌ పాత నగర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు, అనేక పట్టణాల్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి.


ట్రంప్‌ ప్రాజెక్టు 2025పేరుతో అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాల్లో భాగంగా అధికారంలోకి రాగానే అనేక అంశాల్లో వేలు పెట్టాడు, సాధారణ భాషలో చెప్పాలంటే కెలికాడు. అక్రమంగా వలస వచ్చిన వారిని స్వదేశాలకు పంపాలి లేకపోతే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ఇచ్చిన ఆదేశాలతో లాస్‌ ఏంజల్స్‌ నగరం ఇప్పుడు ఆందోళనలతో అట్టుడుకుతోంది. న్యూయార్క్‌ నగరంలో వలస వచ్చిన కుటుంబాలకు చెందిన వారు 59లక్షల మంది ఉండగా తరువాత 44లక్షల మందితో ఈ నగరం ఉంది. మొత్తం జనాభాలో వీరు 33శాతం మంది. కొద్ది రోజులుగా అక్రమ వలసదారుల పేరుతో కొంత మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టటంతో వారంతా వీధుల్లోకి వస్తున్నారు.వారిని అదుపు చేసేందుకు ట్రంప్‌ సర్కార్‌ మిలిటరీని పంపింది. వలసదారులు శత్రుదేశాల మాదిరి లాస్‌ ఏంజల్స్‌ను ఆక్రమించుకున్నట్లుగా చిత్రించి నగరాన్ని విముక్తి చేయాలని ట్రంప్‌ ఆదేశించాడు. ఒక నాడు గొప్పనగరంగా విలసిల్లిన దానిని విదేశీ చొరబాటుదార్లు, నేరగాండ్లు ఆక్రమించినట్లు ట్రంప్‌ వర్ణించాడు. అక్రమ వలసదారులుగా చెబుతున్నవారు అమెరికాలో కోట్లాది మంది ఉన్నారు. అక్కడ తలెత్తిన ఆర్థిక, ఉపాధి సమస్యలను పరిష్కరించటంలో విఫలమైన పాలకులు వలస వచ్చిన వారే అన్నింటికీ కారణమంటూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు, వారిలో ట్రంప్‌ ముందున్నాడు. ఐరోపా దేశాలలో కూడా ఇదే ధోరణి, ఎన్నికల సమస్యగా ఉంది.


ప్రస్తుతం లాస్‌ ఏంజల్స్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది, అణచివేత ఏ రూపం తీసుకుంటుందో, దానికి ప్రతిఘటనలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.చౌకగా పని చేయించుకొని లాభాలు పొందేందుకు అమెరికా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, వ్యవసాయ క్షేత్రాల వారు వలసలను ప్రోత్సహించారు. చట్టబద్దంగా వచ్చిన వారితో పాటు అక్రమంగా వచ్చిన వారిని చూసీ చూడనట్లు అధికార యంత్రాంగం వ్యవహరించింది. ఆర్థిక వ్యవస్థలో వారి పాత్ర తక్కువేమీ కాదు. వ్యవసాయం, సేవారంగం, నిర్మాణ రంగాలలో వారి పాత్ర పెద్దది.అధికారికంగా నమోదు కాని వారి సంఖ్య గురించి అంచనాలు మాత్రమే, కోటి మందికి పైగా ఉంటారని ఒక అంచనా. శ్రామిక శక్తిలో రికార్డుల్లో నమోదు కాని వారితో సహా విదేశాల్లో జన్మించిన కార్మికులు 18.6 శాతం లేదా 2.91 కోట్ల మంది అని 2023 కార్మిక శాఖ వివరాలు తెలిపాయి.అంతకు ముందు ఏడాది 18.1శాతం ఉన్నారు. వీరిలో 47.6 శాతం మంది మెక్సికో, ఇతర లాటిన్‌ అమెరికా దేశాల నుంచి వచ్చిన వారు కాగా25.1శాతం ఆసియా ఖండం నుంచి ఉన్నారు. అధికారికంగా నమోదు కాని వారు 83 లక్షల మంది ఉన్నట్లు, వారిలో 30శాతం మెక్సికో నుంచి మధ్య, దక్షిణ అమెరికా దేశాల నుంచి 20, ఆసియా నుంచి 15శాతం ఉన్నట్లు న్యూయార్క్‌ వలస అధ్యయనకేంద్రం అంచనా వేసింది. రానున్న సంవత్సరాల్లో వంట, ఇంటిపనివారు, డ్రైవర్లు, ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ వంటి పనులు చేసేందుకు డిమాండ్‌ పెరగనుందని చెబుతున్నారు.


కరోనా తరువాత ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు,ద్రవ్యోల్బణం తగ్గటానికి వలస కార్మికులు తోడ్పడ్డారని డల్లాస్‌ ఫెడరల్‌ రిజర్వుబ్యాంకు అధ్యయనం తెలిపింది. అమెరికాలో పుట్టి పెరిగిన వారు ఉద్యోగవిరమణ చేయటం, జననాలరేటు తగ్గిన కారణంగా 2019`21 మధ్య 20లక్షల మంది కార్మికులు తగ్గినట్లు, రానున్న పది సంవత్సరాలలో వలస కార్మికులు లేకపోతే వివిధ రంగాలలో ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణలో ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరికలు వెలువడ్డాయి.జనాభాలో వలస వచ్చిన వారు 13.8శాతం, వీరిలో కొందరు వాణిజ్యాలను కూడా ప్రారంభించారు, వారి ద్వారా 2022 ఒక్క ఏడాదే 110 బిలియన్‌ డాలర్ల రాబడి వచ్చింది.అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే ప్రకారం వలస వచ్చిన వారు ఫెడరల్‌ ప్రభుత్వానికి 2022లో 383 బిలియన్‌ డాలర్లు, రాష్ట్ర, స్థానిక సంస్థలకు 196 బిలియన్‌ డాలర్లు రాబడి చేకూర్చారు. నమోదు కాని కార్మికులు, ఆదాయ, సామాజిక భద్రత పన్నులే మొత్తం వందబిలియన్‌ డాలర్లకు పైగా ఉన్నాయి. చిత్రం ఏమిటంటే నిరుద్యోగ, ఆరోగ్యబీమా వారికి వర్తించకపోయినా పన్ను చెల్లించారు. 2033 నాటికి మరో 5.2శాతం వలస కార్మికులు పెరుగుతారని వారి వలన ఏడులక్షల కోట్ల డాలర్ల మేరతోడవుతుందని, జిడిపి 8.7లక్షల కోట్ల డాలర్లు పెరగటంతో పాటు ఫెడరల్‌ ప్రభుత్వానికి 1.2లక్షల కోట్ల పన్ను ఆదాయం పెరిగి, 900బిలియన్‌ డాలర్ల లోటు తగ్గుతుందని అంచనాలు వెలువడ్డాయి.వలస వచ్చిన వారి కారణంగానే స్థానికులకు అందాల్సిస సౌకర్యాలకు కోతపడుతున్నదని కొందరు సర్వేలు, బడ్జెట్ల పేరుతో రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. వలస వచ్చిన వారి గృహవసతి కోసం న్యూయార్క్‌ వంటి నగరాల్లో బడ్జెట్‌ కేటాయింపులు చేస్తూ ఇతరులకు కోతపెడుతున్నారని చిత్రిస్తున్నారు. నిజానికి పైనచెప్పుకున్నట్లుగా వలస వచ్చిన వారి నుంచి వచ్చే రాబడితో పోల్చుకున్నపుడు ఇవి పెద్ద మొత్తాలేమీ కాదు. వారు పని చేస్తున్న పరిశ్రమలు, వాణిజ్య, వ్యవసాయ రంగాల నుంచి వారి సంక్షేమానికి ప్రభుత్వం పన్నులు మరొక రూపంలో అదనంగా నిధులు సేకరించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ వారికి నానాటికీ మరిన్ని రాయితీలు ఇస్తున్నారు తప్ప అదనపు రాబడికి పూనుకోవటం లేదు తక్కువ వేతనాలకు పని చేసే నైపుణ్యం అంతగా అవసరం లేని కార్మికులు ఇప్పుడు అమెరికాకు అవసరమని తెలిసినప్పటికీ ట్రంప్‌ వారి మీద దాడి ప్రారంభించాడు, లబ్ది పొందే కార్పొరేట్లు సహిస్తారా ?

వలస కార్మికులను వెనక్కు పంపుతానని ట్రంప్‌ పెద్ద ప్రకటనలు చేస్తున్నాడు.అందరినీ పంపాలంటే ఏడాదికి 500 బిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతాయని, రానున్న పది సంవత్సరాలలో కార్మికుల కొరత ఏర్పడుతుందని, జిడిపి 5.1లక్షల కోట్ల డాలర్లు తగ్గుతుందని తెలిసినా వ్యాపారవేత్త, లాభనష్టాలు తెలిసిన ట్రంప్‌ అలాంటి పనులకు ఎందుకు పాల్పడుతున్నట్లు ?ఎన్నికలకు ముందే వలస కార్మికులను పంపివేస్తానని ట్రంప్‌ వాగ్దానం చేశాడు. ఇప్పుడు లాస్‌ ఏంజల్స్‌ నగరంలో చిచ్చు పెట్టాడు. సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ డిమాండ్‌ చేశాడు, ట్రంప్‌ చర్య రాష్ట్ర సార్వభౌమత్వాన్ని హరించటమే అన్నాడు. శాంతి భద్రతలకు విఘాతం కలగాలని వాంఛిస్తున్న ట్రంప్‌కు అలాంటి అవకాశం ఇవ్వవద్దని పౌరులను కోరాడు. నగర మేయర్‌ కరేన్‌ బాస్‌ కూడా గవర్నర్‌ను సమర్దిస్తూ ట్రంప్‌ చర్య అశాంతిని రెచ్చగొట్టినట్లు ఆమె వ్యాఖ్యానించారు. నగర కౌన్సిల్లోని 15 మంది సభ్యులు కూడా మిలిటరీ చర్యను ఖండిరచారు. వారి వైఫల్యం కారణంగానే తాను మిలిటరీని పంపినట్లు ట్రంప్‌ సమర్ధించుకున్నాడు.ట్రంప్‌ను సమర్ధించే మితవాద మీడియా నిరసన తెలుపుతున్నవారి మీద దుమ్మెత్తిపోస్తూ వార్తలు ఇస్తున్నది.

2024 నవంబరులో నగరపాలక సంస్థ వలసదారులను రక్షించేందుకు ‘‘ శరణ నగరం ’’ అని ఏకగ్రీవంగా తీర్మానించింది. వలస నిరోధ అధికారులను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం చేశారు. అంతకు ముందు వలసదారులను బహిష్కరిస్తామని ట్రంప్‌ వాగ్దానం చేశాడు. మిలిటరీని దించటాన్ని డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన 22 రాష్ట్రాల గవర్నర్లు ఒక ప్రకటనలో ఖండిరచారు. ట్రంప్‌ అధికార దుర్వినియోగం, దుర్మార్గమైన, విభజించే చర్య అన్నారు. మెక్సికన్లు లాస్‌ ఏంజల్స్‌ నగరంలో నివశించటాన్ని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్‌ సమర్ధించారు. వారు మంచి వారు, నిజాయితీ పరులు, నేరస్తులు కాదు, తమ కుటుంబాలకు తోడుగా ఉండేందుకు, మెరుగైన జీవితం కోసం వారంతట వారే వెళ్లారని ఆమె అన్నారు. నిరసనకారులు అమెరికా పతాకాలతో పాటు మెక్సికో జాతీయ జెండాలను కూడా ప్రదర్శించుతున్నారు. వాటిని చూపుతూ చూడండి విదేశీయులు మన దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారో వారిని బయటికి పంపవద్దా అంటూ రెచ్చగొడుతున్నారు. తాము అమెరికాకు వలస వచ్చామని, ఇక్కడే పిల్లలను కని పౌరులమయ్యామని తమ వారసత్వానికి చిహ్నంగా మెక్సికో పతాకాలను ప్రదర్శిస్తూ దమనకాండకు నిరసన తెలుపుతున్నట్లు ప్రదర్శకులు సమర్ధించుకుంటున్నారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిని రెచ్చగొట్టేందుకు ముసుగులు ధరించిన రహస్య పోలీసులను వినియోగించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిరసనకారులు అనుమానం వచ్చి ఎవరని ప్రశ్నిస్తే సమాధానం లేకపోగా బెదిరింపులకు దిగుతున్నారు.ముసుగులు ధరించిన ఐసిఇ సిబ్బంది ఒక రెస్టారెంటులో చొరబడి వంటవారిని అదుపులోకి తీసుకోవటంతో కస్టమర్లు అడ్డం తిరిగి ప్రశ్నించారు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో. అవాంఛనీయ చర్యలకు పాల్పడి ఆ నెపాన్ని వలస కార్మికులు మీద నెట్టే కుట్ర కనిపిస్తోంది. ఇలాంటి దుర్మార్గం ఫాసిస్టులు మాత్రమే చేయగలరన్నది చరిత్ర చెప్పిన సత్యం. తమకు అడ్డు పడితే గవర్నర్‌, నగర మేయర్లనూ అరెస్టు చేస్తామని ట్రంప్‌ యంత్రాంగం బెదిరించింది. ఈ దమనకాండకు నిరసనగా అనేక నగరాల్లో ప్రదర్శనలు జరపాలని పిలుపు నిచ్చారు. కార్మిక నేతల అరెస్టును కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిరది. వలస వచ్చిన వారిపై రాజ్యమే హింసాకాండకు పూనుకుందని కార్మిక సంఘాలు విమర్శించాయి. అనేక మంది స్థానిక అమెరికన్లు వలస వచ్చిన వారు తమ సోదరులే అంటూ మద్దతు తెలుపుతున్నారు. దమనకాండ అమెరికా విలువలకే వ్యతిరేకమని టీచర్స్‌ యూనియన్‌ ఒక ప్రకటనలో విమర్శించింది. ట్రంప్‌ జారీ చేస్తున్న ఆదేశాలను చూస్తుంటే నియంతృత్వంవైపు దేశాన్ని నడిపిస్తున్నట్లుందని డెమోక్రటిక్‌ సోషలిస్టు సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ విమర్శించాడు.ఒకవైపు ప్రతికూల పన్నులతో ప్రపంచ దేశాల మీద దాడికి దిగిన ట్రంప్‌ దేశీయంగా వలసలు వచ్చారనే పేరుతో మిలిటరీ దాడులకు దిగాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ముదురుతున్న సమస్యలకు ప్రతిరూపాలే ఈ దాడులు. అందువలన అమెరికా సాధారణ పౌరులతో పాటు యావత్‌ ప్రపంచమూ డోనాల్డ్‌ ట్రంప్‌ దుర్మార్గాలపై గళమెత్తాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యవసాయ ఉగ్రవాదం : చైనా మీద ఆరోపణ మాత్రమే, అమెరికా అధ్యక్షుడు కెనడీ, బ్రిటన్‌ దుర్మార్గం గురించి తెలుసా !

08 Sunday Jun 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Environment, Farmers, Germany, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, Opinion, Science, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Agro Terrorism, Amarican Virus, Biological weapons, Bioterrorism, chemical weapons


ఎం కోటేశ్వరరావు


వ్యవసాయ ఉగ్రవాదం ప్రపంచమంతటా పురాతన కాలం నుంచి ఉన్నదే. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలోనే అస్సీరియన్లు తమ శత్రువుల ప్రాంతాలలోని బావులలో విషాన్ని కలిపేవారు. మొదటి ప్రపంచ యుద్ద కాలంలో ఫ్రాన్సుకు రవాణా అయ్యే గుర్రాలు, పశువులకు అమెరికాలో జర్మన్‌ ఏజంట్లు విషం ఇచ్చేవారు. కత్తి, బాకు, బల్లెం వంటి వాటిని కనుగొన్న తొలి మానవుడు వాటిని ప్రమాదకర జంతువుల నుంచి రక్షణకు, ఆహారం కోసం ఉపయోగించాడు. తరువాత అవే యుద్దాల్లో ఆయుధాలుగా మారాయి. శాస్త్రవేత్త చార్లెస్‌ డార్విన్‌ 1880దశకంలో చేసిన పరిశోధనలు పంటల్లో కలుపు మొక్కల నివారణకోసం రసాయనాలను కనిపెట్టేందుకు దారితీశాయి. తరువాత కాలంలో బ్రిటన్‌, అమెరికా, తదితర సామ్రాజ్యవాదులు, నియంతలు ఏకంగా పంటలు, అడవులనే నాశనం చేసేందుకు, లక్షలాది మంది మానవులు, జంతుజాలాన్ని అంతమొందించేందుకు వినియోగించిన చరిత్ర తెలుసా ? శాస్త్రవిజ్ఞానాన్ని మానవ, ప్రకృతి వినాశనానికి వినియోగించింది మానవ కల్యాణానికి బదులు వినాశనాన్ని కోరుకున్న దుర్మార్గులే అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ప్రమాదకరమైన ఫంగస్‌ను అమెరికా వ్యవసాయక్షేత్రాల్లో ప్రవేశపెట్టి దాని ఆహార వనరును దెబ్బతీయాలని చైనా కుట్రపన్నింది, దానిలో భాగంగా ఇద్దరు చైనా జాతీయులు ఆ ఫంగస్‌ను అక్రమంగా తెస్తూ ఎఫ్‌బిఐకి దొరికి పోయారు. ఇదీ వార్త, ఒక ఆరోపణ, సదరు ఫంగస్‌ను ఎక్కడా ప్రయోగించలేదు. పరిశోధనల కోసం తెచ్చారన్నది ఒక అభిప్రాయం. అమెరికా మనదేశంలోకి వయ్యారి భామ అనే వినాశకారి అయిన కలుపు మొక్కను ఎలా ప్రవేశ పెట్టిందీ వేరే విశ్లేషణలో చూశాము. గుండెలు బాదుకుంటున్న అమెరికా కొన్ని దశాబ్దాల నాడే ఆ దుర్మార్గానికి పాల్పడిరది అనే అంశం ఎక్కడా మీడియాలో చర్చకు రావటం లేదు.పురాతన, ఆధునిక యుద్ధాలలో ఆహార ఉత్పత్తి వ్యవస్థలను దెబ్బతీయటం ఒక ఆయుధం. అందుకే చరిత్రను చదివినపుడు శత్రుదేశాలు కోటలను చుట్టుముట్టినపుడు నెలల తరబడి తట్టుకొనేందుకు ఆహారం, నీటిని నిల్వచేసుకొనే ఏర్పాట్లు చేసుకున్నట్లు అనేక దుర్గాలు, కోటల చరిత్రలు వెల్లడిరచాయి. ఆధునిక కాలంలో అందుకు జీవ, రసాయనాలను అమెరికా అస్త్రంగా వాడుకున్నది. అదెలా జరిగిందో చూద్దాం !


1953లో కొరియా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే నెల రోజుల ముందు ఉత్తర కొరియా ప్రాంతంలో అమెరికా వైమానిక దళం చేసిన దాడుల్లో 75శాతం వరి ఉత్పత్తికి నీటిని అందించే ప్రాజెక్టులను నాశనం చేసింది. ఇది తరువాత కాలంలో అక్కడ కరవుకు దారి తీసింది. కమ్యూనిస్టుల పాలనలో జనాన్ని ఆకలితో మాడ్చి చంపారని ప్రచారం చేసే మానవతావాదులకు ఈ విషయం పట్టలేదు. వియత్నాంపై దాడిచేసిన అమెరికా మొక్కలను నాశనం చేసే ఏజంట్‌ ఆరెంజ్‌ అనే రసాయనాన్ని ఆపరేషన్‌ రాంచ్‌ హాండ్‌ పేరుతో 1962 నుంచి 1971వరకు వెదజల్లింది. దీనికి ఆదర్శం ఎవరు అంటే మలయా యుద్ధంలో ప్రయోగించిన బ్రిటీష్‌ దుర్మార్గులు. అమెరికాలో రైలు మార్గాలు, విద్యుత్‌ లైన్లు వేసే ప్రాంతాలలో పిచ్చి మొక్కలు పెరగకుండా చూసేందుకు 1940దశకంలో దీన్ని తయారు చేశారు. మనందరికీ తెలిసిన మానశాంటో సహా తొమ్మిది కంపెనీల నుంచి వియత్నాంలో చల్లేందుకు అమెరికన్‌ మిలిటరీ 7.6 కోట్ల లీటర్లు కొనుగోలు చేసింది. దాన్ని చల్లిన చోట 40లక్షల మంది మీద ప్రతికూల ప్రభావాలను చూపింది,30లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ అంచనా ప్రకారం పది లక్షల మంది వికలాంగులయ్యారు. ఈ దుర్మార్గ ప్రక్రియలో భాగస్వాములైన అమెరికా మిలిటరీలో అనేక మందికూడా దీని ప్రభావంతో కాన్సర్‌, లింఫోమా వంటి వ్యాధులకు గురైనట్లు తేలింది. వారికి పుట్టిన పిల్లలకు జన్యు సంబంధమైన వ్యాధులు వచ్చాయి, వారి దుర్మార్గానికి పిల్లలు బలయ్యారు. వియత్నాంలో పర్యావరణానికి కలిగిన హాని గురించి చెప్పనవసరం లేదు, 77లక్షల ఎకరాల్లో పంటలు పండలేదు, అడవుల్లో మొక్కలు పెరగలేదు. అనేక జంతువులకు హాని కలిగింది.మానవ మారణకాండను జనోసైడ్‌ అని వర్ణిస్తే పర్యావరణానికి చేసిన హానిని ఎకోసైడ్‌ అని వర్ణించారు. అమెరికా దురాక్రమణను వ్యతిరేకించిన వియత్నాం వీరులు అడవుల్లో ఉండటంతో వియత్నాం సరిహద్దుల్లో ఉన్న లావోస్‌, కంపూచియా అడవులను కూడా అమెరికా దుర్మార్గులు వదల్లేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌, అమెరికా, జర్మనీ వంటి దేశాలు రసాయన, జీవ ఆయుధాలను తయారు చేశాయి. ఆ సమయంలో అనేక ప్రాంతాల్లో వాటిని పరీక్షించి చూశారు. జపాన్‌పై అణుబాంబును వేసిన అమెరికా యుద్దం గనుక కొనసాగితే 1946లో జపాన్‌పై ఏజంట్‌ ఆరెంజ్‌ను ప్రయోగించాలని పథకం వేసింది. బ్రిటీష్‌ పాలనలో ఉన్న మనదేశం, ఆస్ట్రేలియాలతో సహా మొత్తం 1,100 కేంద్రాల్లో దాని పనితీరును పరీక్షించారు. అమెరికాను కూడా వదల్లేదు. ఉష్ణప్రదేశాల్లో ఎలా పని చేస్తుందో చూసేందుకు కెన్యాలో కూడా చల్లారు. మలయా ప్రాంత దేశాల్లో రబ్బరు తోటల్లో పెరిగే కలుపు మొక్కలను నివారించేందుకు తయారు చేసిన రసాయనాన్ని తమ మీద తిరుగుబాటు చేసిన మలయన్లు ఉన్న అడవుల్లో 1960వరకు బ్రిటీష్‌ మిలిటరీ ప్రయోగించింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని అమెరికా తరువాత ఇండోచైనా ప్రాంతంలో అమలు చేసింది.ముఖ్యంగా దక్షిణ వియత్నాం బలైంది. అనేక మంది గొప్పగా పొగిడే నాటి అమెరికా అధ్యక్షుడు కెనడీ ఈ దుర్మార్గానికి అనుమతి ఇచ్చాడు. ఈ దుర్మార్గం గురించి తెలుసుకున్న తరువాత అమెరికాలో వియత్నాం యుద్ధవ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది.తప్పుడు వాదనలతో ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా, బ్రిటన్‌ వ్యతిరేకించాయి.


అమెరికా ముందుగా ఎవరి మీద జీవ, రసాయన ఆయుధాలను ప్రయోగించదని, అయితే శత్రుదేశం ఏదైనా వినియోగిస్తే మాత్రం రసాయన ఆయుధాలను వదులుతామని అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ గొప్పగా చెప్పాడు, ఏ దేశమూ వినియోగించకుండానే అణుబాంబుతో సహా ఆ దుండగాలకు అమెరికా పాల్పడిరది. జపాన్‌లో వరి పొలాలను నాశనం చేసేందుకు అమెరికా వినియోగించింది.వియత్నాంలో ఏజంట్‌ ఆరంజ్‌ చల్లిన ప్రాంతాల్లో గత ఐదు దశాబ్దాలుగా చెట్లలో సాధారణ పెరుగుదల లేదు, మామూలు స్థితికి రావాలంటే చాలాకాలం పడుతుందని చెబుతున్నారు.వియత్నాం దురాక్రమణ, దాడుల్లో పాల్గొన్న అమెరికా సైనికులు ఏజంట్‌ ఆరంజ్‌ తదితర విషపూరిత రసాయనాలను వెదజల్లుతున్నపుడు వారికి కూడా వాటి ప్రభావం సోకిన కారణంగా 1984లో కోర్టు వెలుపల రసాయన కంపెనీలు 18 కోట్ల డాలర్లు పరిహారంగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఇజ్రాయెల్‌ ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాల్లోకి సముద్రపు నీరు, తమ నివాసాల నుంచి వెలువడే మురుగునీటిని పాలస్తీనియన్ల నివాసాలు, వ్యవసాయ భూముల్లోకి వదలి పనికి రాకుండా చేయటం నిత్యకృత్యం. ఇది కూడా ఒక రకంగా వ్యవసాయ ఉగ్రవాదమే. పంటలు పండకుండా అరబ్బులను మాడ్చే ఎత్తుగడ.

నీవు నేర్పియే నీరజాక్షా అని తమ వ్యవసాయం మీద చైనా దాడి చేయనుందని అమెరికా గగ్గోలు పెడుతోంది. దానికి ఇదేమీ కొత్త కాదు. ప్రతి దేశం మీద కుట్ర సిద్దాంతాలను ప్రచారంలో పెట్టటం తెలిసిందే. తద్వారా తాను చేసే దుర్మార్గాలను స్వంత జనం ప్రశ్నించకుండా సమర్ధించేందుకు అది ఎంచుకున్న ఎత్తుగడ.తాను పెంచి పోషించిన ఉగ్రవాదానికి అదే బలికావటం కూడా వాస్తవం న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై వైమానికదాడి అదే. తాను పెంచిన తాలిబన్లే దానికి పాల్పడ్డారు.అమెరికా జిడిపిలో వ్యవసాయం తక్కువే అయినప్పటికీ గణనీయ మొత్తం ఎగుమతులకు ఉపయోగపడుతున్నది. ఆల్‌ఖైదాతో చెడిన తరువాత తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని అనేక కేంద్రాలపై దాడులు చేసినపుడు దొరికిన పత్రాలలో అమెరికా వ్యవసాయ వివరాలున్న పత్రాలు దొరికాయి. వ్యవసాయాన్ని ఎలా దెబ్బతీయాలా అన్నది ఆల్‌ఖైదా శిక్షణలో భాగంగా బయటపడిరది.అమెరికాకు నాలుగు తరగతుల నుంచి వ్యవసాయ ఉగ్రవాద ప్రమాదం ఉందని 2012లో ఎఫ్‌బిఐ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. ఒకటి ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు, రెండవది మార్కెట్లను తిమ్మినిబమ్మిని చేసి లబ్దిపొందాలని చూసే ఆర్థిక నేరగాండ్లు లేదా అవకాశవాదుల నుంచి ప్రధానంగా ముప్పు ఉన్నట్లుపేర్కొన్నారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి(ఎఫ్‌ఎండి అంటే ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌)ని వ్యాపింప చేస్తే మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం పడుతుందన్నది తెలిసిందే. మూడవ తరగతి అసంతృప్తి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు తమ కసి తీర్చుకొనేందుకు చేసే ఉగ్రవాద చర్యలు, నాలుగవ తరగతిగా జంతుహక్కుల రక్షకులు, పర్యావరణ ప్రేమికులు అని పేర్కొన్నారు. న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసిన తరువాత అమెరికాలో ఆగ్రో టెర్రరిజం ఆకర్షణీయంగ ఉన్నట్లు కనిపించిందట.


అమెరికా ప్రపంచ మిలిటరీ శక్తిగా ప్రపంచానికి కనిపించకుండా చేయాలంటే దాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ఒసామా బిన్‌లాడెన్‌ పదే పదే వాదించేవాడట.2004 అమెరికా ఎన్నికల సమయంలో ఒక వీడియోలో పదేండ్ల పాటు రష్యా రక్తమోడిరది, అమెరికా కూడా దివాలా తీసేంతవరకు అదే విధానాన్ని అనుసరించాలని చెప్పాడట. 2011 సెప్టెంబరులో అమెరికా ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడికి ఆల్‌ఖైదాకు అయిన ఖర్చు కేవలం ఐదు లక్షల డాలర్లేనని , అమెరికాకు కలిగిన నష్టం 500బిలియన్‌ డాలర్లని ఒసామా చెప్పాడు. ఉగ్రవాద సంస్థలు నిజంగా అలా ఆలోచిస్తున్నాయో, పథకాలు వేస్తున్నాయో తెలియదు గానీ అమెరికా విశ్లేషకులు మాత్రం ఏం చేస్తే ఎలా,ఎంతటి నష్టం జరుగుతుందో వారికి విడమరచి చెబుతున్నారు. ఆహార ధాన్యాలు విషపూరితం అయితే వాటి ఎగుమతులు ఆగిపోతాయి లేదా నిల్వలు పేరుకు పోతాయి. పశువుల్లో వ్యాధులను వ్యాపింప చేస్తే వాటిని హతమార్చాల్సి ఉంటుంది. పరోక్షంగా రైతాంగానికి భారీ మొత్తాలను పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.పరిశ్రమలకూ పరిహారంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయి, ఖర్చులూ పెరుగుతాయి. పశువుల్లో గాలికుంటు వ్యాధిని అమెరికాలో 1929లోనే నిర్మూలించారు. ఇతర ప్రాంతాల్లో ఉంది. ఇది మసూచి కంటే 20 రెట్లు వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ కేవలం నలభై ఎనిమిది గంటల్లో వంద కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందగలదు. ఏదైనా వస్త్రానికి అంటుకుంటే నెల రోజుల పాటు బతికి ఉంటుంది. దీని గురించి తెలుసుకొనే లోపే అమెరికాలోని 25 రాష్ట్రాలకు కేవలం ఐదు రోజుల్లో వ్యాపింపగలదని అంచనా. అమెరికాకు పక్కనే దక్షిణ అమెరికాలో ఈ వ్యాధి ఉంది. అమెరికాలో ఒక్కో రైతు 1,500 నుంచి పదివేల వరకు ఆవులను పెంచుతాడు. ఒక దగ్గర ఈ వైరస్‌ను ప్రవేశపెడితే జరిగే నష్టాన్ని ఊహించుకోవచ్చు.2001లో బ్రిటన్‌లో ఈ వ్యాధి వ్యాపించటంతో 40లక్షల పశువులను వధించాల్సి వచ్చింది. అదే అమెరికాలో సంభవిస్తే 60 బిలియన్‌ డాలర్ల నష్టం(2012అంచనా) అని పరిశోధకులు పేర్కొన్నారు.ఇలాంటి దుర్మార్గాలకు తాము పాల్పడిన ఉదంతాలు అమెరికా అధికార యంత్రాంగానికి తెలుసుగనుక వారు నిరంతరం భయపడుతూనే ఉంటారు, ఎందుకు అంటే అమెరికాను ప్రతి ఒక్కరూ ద్వేషిస్తున్నారు గనుక. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, అది అమెరికా నుంచి కూడా కావచ్చు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యవసాయ ఉగ్రవాదం : వయ్యారి భామను భారత్‌పై దాడికి పంపిన వగలమారి మామ !

06 Friday Jun 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Environment, Farmers, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

Agro Terrorism, Bioterrorism, China, FBI, invasive herb, parthenium seeds, US Attacked India

ఎం కోటేశ్వరరావు


అమెరికా వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకు ఫుసారియమ్‌ గ్రామినియారమ్‌ అనే ఫంగన్‌ను చైనా పంపిందని, దాన్ని తీసుకువచ్చిన ఇద్దరు చైనా జాతీయులను అమెరికా ఎఫ్‌బిఐ అరెస్టు చేసినట్లు అంతర్జాతీయంగా వార్తలు వచ్చాయి. దీన్ని ఆగ్రో టెర్రరిజం(వ్యవసాయ ఉగ్రవాదం లేదా దాడి ) అని పిలుస్తున్నారు. ఆ ఫంగస్‌ను పరిశోధనలకోసం తెచ్చారన్నది ఒక కథనమైతే అమెరికా వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకు తీసుకువచ్చారనేది మరొక ఆరోపణ. ఎవరినైనా కేసుల్లో ఇరికించదలిస్తే పోలీసులు లేదా క్రిమినల్‌ గాంగ్స్‌ మాదక ద్రవ్యాలను ప్రత్యర్థుల నివాసాలు లేదా కార్యాలయాల్లో పెట్టి కేసుల్లో ఇరికించటం తెలిసిందే. రెండు దేశాల మధ్య వైరుధ్యాలు ముదిరితే ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల సిబ్బంది గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపించి వెళ్లగొట్టటం సాధారణమే. అమెరికా, చైనా మధ్య నడుస్తున్న వైరం పూర్వరంగంలో ఫుసారియమ్‌ ఫంగస్‌ను అమెరికా ఏజంట్లే చైనీయుల చేతిలో పెట్టి అరెస్టు చేసి ఉండవచ్చు. ఎందుకంటే అది అమెరికాలో కూడా దొరుకుతుంది. అరెస్టు చేసిన ఎఫ్‌బిఐ కథనం ప్రకారం జున్‌యోంగ్‌ లియు అనే 34 ఏండ్ల పరిశోధకుడు చైనాలో పని చేస్తున్నాడు.తన స్నేహితురాలు యంగింగ్‌ జియాన్‌ (33) అమెరికాలోని మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నది. ఆమెను కలిసేందుకు 2024జూలైలో అమెరికా వచ్చాడు, తనతో పాటు ఫంగస్‌ను తెచ్చాడు. జియాన్‌ పని చేస్తున్న ప్రయోగశాలలో పరిశోధన కోసం పంగస్‌ను తెచ్చినట్లు ఆరోపణ. వారి చర్యలు అమెరికా పౌరుల భద్రతకు పెను ముప్పు అంటూ కేసు నమోదు చేశారు. వారు కమ్యూనిస్టు పార్టీకి విధేయులు కావటం మరింత ముప్పని అమెరికా అటార్నీ చెప్పాడు. మన దేశంలో నక్సలైట్లను బూటకపు ఎన్‌కౌంటర్లు చేసినపుడు వారి వద్ద ఎర్ర అట్టలున్న విప్లవ సాహిత్యం దొరికినట్లు పోలీసులు చెప్పే పిట్టకతలు తెలిసినవే. అలాగే వారు చైనా కమ్యూనిస్టు పార్టీలో సభ్యులని కూడా అమెరికా పోలీసులు తెలుసుకున్నారట. తప్పుడు సమాచారం, తప్పుడు వీసాల ఆరోపణల గురించి చెప్పనవసరం లేదు. చైనా తన ఏజంట్లు, పరిశోధకులను అమెరికా సంస్థలలోకి చొప్పించి విద్రోహ చర్యలతో అమెరికా ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ పని చేస్తోందని భారతీయ సంతతికి చెందిన ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ ఆరోపించాడు. ఆ కేసు ఏమౌతుంది ఏమిటి అన్నది ముందు ముందు చూద్దాం.

అసలు ఆగ్రో టెర్రరిజం గురించి అమెరికా గుండెలు బాదుకోవటాన్ని చూస్తే దొంగే దొంగని అరవటం గుర్తుకు వస్తోంది. మన దేశం గడచిన ఏడున్నర దశాబ్దాలుగా అమెరికా ఆగ్రో టెర్రరిజానికి బలి అవుతున్నది. ఇది నమ్మలేని నిజం, మన మీడియాకు కనిపించని వాస్తవం. మీరు ఎప్పుడైనా వయ్యారి భామ, కాంగ్రెస్‌ గడ్డి, పార్ధీనియమ్‌ అనే మాటలను విన్నారా ? మూడూ ఒకటే, మన రైతాంగాన్ని, మనకు తెలియకుండానే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అమెరికా కలుపు మొక్క. దీని శాస్త్రీయ నామం పార్థీనియం హిస్టరోఫోరస్‌. ఇది చూడటానికి అందంగా ఉంటుంది గనుక వయ్యారి భామ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్‌ గడ్డి అని పిలిచారు. అమెరికా అమ్మాయి కూడా అంటారు. ఒక మొక్క ఎంతో ఏపుగా పెరిగి చాలా త్వరగా పుష్పించి వేలాది విత్తనాలను విడుదల చేస్తుంది.చాలా చిన్నవిగా ఉండటంతో గాలిలో మూడు కిలోమీటర్ల వరకు వ్యాపించి మొలకలెత్తుతాయి. ఒక్కో మొక్క 60 కోట్ల పుప్పొడి రేణువులను వదులుతుందట. ఇవి మొలిస్తే పంటల దిగుబడి 40శాతం తగ్గుతుంది, వాటిని తాకితే, తింటే పశువులు, మనుషులకూ వ్యాధికారకాలవుతాయి.దేశంలో 35 మిలియన్ల హెక్టార్లలో ఇది వ్యాపించి ఉన్నట్లు అంచనా. ఇంకా ఎక్కువే అన్నది మరొక అభిప్రాయం. మొక్కగా ఉన్నపుడు దాన్ని నాశనం చేయకపోతే పుష్పించినపుడు రెచ్చిపోతుంది.


మనదేశం స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొన్నది. ఆసమయంలో అమెరికాతో ఉన్న సంబంధాలతో ప్రధాని నెహ్రూ అక్కడి నుంచి గోధుమలను దిగుమతి చేసుకుంటే వాటితో అమెరికా ఈ కలుపు మొక్కనూ కావాలనే మనకు బహుమతిగా పంపింది. అంతకు ముందు అసలు మన రైతాంగానికి దీని గురించి తెలియదు. ఇది పంటలను దెబ్బతీస్తుందని అమెరికన్లకు పూర్తిగా తెలుసు. గోధుమలతో పాటు పంపింది అంటే మన పొలాల్లో వ్యాపించి పంటలను దెబ్బతీయాలని, తద్వారా శాశ్వతంగా తమ మీద ఆహార ధాన్యాలకు ఆధారపడేట్లు చేసుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ. నాడు పిఎల్‌ (పబ్లిక్‌ లా)480 పధకం కింద 1950దశకంలో కేవలం రెండు మిలియన్‌ టన్నుల గోధుమలను సాయంగా తెచ్చుకున్నందుకు ఇప్పటికీ మనం మూల్యం చెల్లిస్తూనే ఉన్నాం. అనేక మంది ఊపిరితిత్తులు, చర్మ వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు, నోరులేని పశువుల సంగతి సరేసరి. వ్యాధులతో పాటు పాలదిగుబడీ తగ్గిపోతుంది.దీన్ని అమెరికా మన ఒక్క దేశానికే కాదు 46దేశాలకు వ్యాపింప చేసిందంటే దాని కుట్ర ఎంత పెద్దదో అర్ధం చేసుకోవచ్చు, ఇది అతి పెద్ద ఆగ్రో టెర్రరిజం కాదా ! నాడు మనదేశం అలీన విధానాన్ని అనుసరిస్తున్నది, ఆహార ధాన్యాలు కావాలని కోరినపుడు తమతో కలిస్తే వెంటనే ఇస్తామని 1949లో నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ ఒక బిస్కెట్‌ వేశాడు. నెహ్రూ అంగీకరించలేదు, ఉచితంగా వద్దు డబ్బుతీసుకోవాలని ప్రతిపాదించాడు.1955వరకు ఎటూ తేల్చలేదు, మరోవైపు దేశంలో ఆహార కొరత పెరుగుతుండటంతో అమెరికా సాయంగానే ఇస్తూ ప్రపంచంలో పది ప్రమాదకర మొక్కల్లో ఒకటైన వయ్యారి భామను మన మీదకు వదిలింది. కావాలనే వదలినట్లు ఇంత వరకు అంగీకరించకపోగా తామే పంపినట్లు ఆధారాలేమిటో చూపాలని మనలను దబాయిస్తోంది.

ప్రమాదకరమైన కలుపు మొక్కలు, విత్తనాలు ఇతర దేశాల నుంచి రాకుండా అరికట్టేందుకు అవసరమైన గట్టి చట్టాలు, నిబంధనల మనదేశంలో లేని కారణంగా అనేకం మన దేశంలో ప్రవేశించాయి. మెక్సికో, అమెరికా, లాటిన్‌ అమెరికా నుంచి వయ్యారి భామ ఇతర దేశాలకు వ్యాపించింది. మన దేశంలో దీన్ని పూర్తిగా తొలగించాలంటే పదేండ్ల పాటు ఏడాదికి 18,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని 2010లో శాస్త్రవేత్తలు చెప్పారు, 1955 నుంచి మనకు జరిగిన నష్టం రు. 2,06,716 కోట్లు అని ఒక అంచనా. ఇది గాక మనుషుల, పశువుల అనారోగ్య ఖర్చు అదనం. జీవ వైవిధ్యానికి జరిగిన నష్టం, పునరుద్దరణలను పరిగణనలోకి తీసుకుంటే ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ నష్టం అంటున్నారు. జమ్మూ`కాశ్మీరులో పాకిస్తాన్‌ ఉగ్రవాద సమస్య గురించి మాత్రమే మనకు తెలుసు, కార్గిల్‌ వంటి ప్రాంతాలలో వయ్యారి భామ తిష్టవేసింది, ప్రధాన భూభాగానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అండమాన్‌కు సైతం ఇది విస్తరించిందంటే దాని వేగం, ప్రమాదం ఏమిటో అర్దం చేసుకోవచ్చు. మన కళ్ల ముందు వయ్యారాలు పోతూ సవాలు చేస్తున్న ఈ ఆగ్రో ఉగ్రవాదిని అరికట్టేందుకు దేశమంతటా ఒకేసారి చర్యలు తీసుకొని ఉంటే నిరోధించి ఉండేవారు. కానీ జరగలేదు. దీని విస్తరణ ఎంత ప్రాంతంలో జరిగిందన్నది కూడా సమగ్ర అధ్యయనం లేదు. ఒక అంచనా ప్రకారం ఎక్కువగా పెరిగిన ప్రాంతం నుంచి దీన్ని తొలగించాలంటే హెక్టారుకు నలభై పనిదినాలు అవసరమని తేల్చారు. ఆయా సమయాలను బట్టి అందుకయ్యే ఖర్చును లెక్కకట్టాలి.


ఆగ్రో ఉగ్రవాది వయ్యార భామ గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం, వ్యవసాయంతో అనుబంధంగా ఉండే వాటిపై మరికొన్ని దాడుల గురించి చూద్దాం. వీర, రౌద్ర,శోక,హాస్య,శృంగార తదితర రసాలతో పాటు భీభత్స రసం అంటే ఉగ్రవాదమే. ఇతిహాసాలు, పురాణాల్లో వీరులు శత్రువులకు ఈరసాన్ని చవి చూపించినట్లు చదువుకున్నాం. కానీ ఆధునిక మిలిటరీ దుర్మార్గాల్లో బయో ఉగ్రవాదం కూడా ఒక ఆయుధం.అనేక ప్రమాదకర వైరస్‌లను ప్రత్యేకంగా ఎవరో పనిగట్టుకొని వ్యాపింప చేయనవసరం లేదు. అయితే సహజంగా తలెత్తినవి ఏవో ఇతరులు ప్రయోగించినవి ఏవో తెలుసుకోవటం అవసరం, అదేమీ కష్టం కూడా కాదు. ఆఫ్రికన్‌ హార్స్‌ సిక్‌నెస్‌(ఎహెచ్‌ఎస్‌) వైరస్‌ను తొలిసారిగా 1600 సంవత్సరాల్లో ఆఫ్రికాలోని సహారా ఎడారి కనుగొన్నారు. అది క్రమంగా మనదేశానికి వ్యాపించి మిలిటరీలో ఉన్నవాటితో సహా 20లక్షల గుర్రాల మరణానికి కారణమైంది. రిఫ్ట్‌వాలీ వైరస్‌ అనేది ఒంటెల ద్వారా వ్యాపిస్తుంది, అనేక దేశాలను అది చుట్టుముట్టింది,మన దేశం సంగతి తెలియదు, ఎప్పుడైనా రావచ్చు. మన వ్యవసాయానికి అనుబంధంగా ఉండేది పశుపాలన, చేపలు, రొయ్యలు, కోళ్ల పెంపకం వంటివి. వాటికి అనేక వైరస్‌లు వ్యాపిస్తున్నాయి. సంతలు, మార్కెట్‌లు పెద్ద వ్యాపక కేంద్రాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఆరేండ్ల నాటి అంచనా ప్రకారం దేశంలో ఎలుకలు, పందికొక్కుల సంఖ్య 240 కోట్లు, అవి ఇప్పుడిరకా పెరిగి ఉంటాయి. ప్రతి ఆరు ఒక మనిషి ఆహారాన్ని తింటున్నాయి. ఏటా 24లక్షల నుంచి 2.6కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి. వాటితో వచ్చే వ్యాధులు, వాటి నివారణ ఖర్చులపై అంచనాల్లేవు. వీటన్నింటినీ ఎవరు ప్రవేశపెట్టినట్లు ? ఇప్పుడైతే కుట్ర సిద్దాంతవేత్తలు, వారిని అనుసరించే మీడియా పండితులు వెంటనే చైనా అనేస్తారు. గతంలో ప్రపంచలో కోట్లాది మంది ప్రాణాలు తీసిన ప్లేగు, స్పానిష్‌ ఫ్లూ వంటి వాటికి కూడా అదే అని చెప్పినా ఆశ్చర్యం లేదు.బ్రిటీష్‌ పాలనా కాలంలో 1943లో వచ్చిన బెంగాల్‌ కరువుకు 30లక్షల మంది మరణించారు.వారి ఆకలి బాధ తీర్చటానికి ఆ రోజు ప్రపంచంలో ఆహారం లేదా అంటే ఉంది,బ్రిటీష్‌ వారికి పట్టలేదంతే ! ఇటీవలి సంవత్సరాల్లో తెల్లదోమ ఎంతటి వినాశనాన్ని కలిగించిందో చూశాము. తెగుళ్ల నివారణకు తయారు చేసిన సింథటిక్‌ పైరిత్రాయిడ్స్‌ వినియోగంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని కొత్త సమస్యలు తలెత్తాయి. అనేక పశ్చిమ దేశాలలో వాటిని నిషేధించినప్పటికీ మనదేశంలో వాటిని విక్రయించేందుకు ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. బహుళజాతి గుత్త సంస్థలు చేస్తున్న ఆగ్రో ఉగ్రదాడి తప్ప మరొకటి కాదు. అసలు అమెరికా గతంలో చేసిన ఆగ్రో ఉగ్రదాడులకు బలైన దేశాలు, ఉదంతాలు గురించి మరో విశ్లేషణలో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యాపై ఉక్రెయిన్‌ భారీ దాడి పర్యవసానాలేమిటి ? నాలుగు రోజులైనా నోరు విప్పని ట్రంప్‌, పుతిన్‌ !

04 Wednesday Jun 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Ukraine attack on Russia, Ukraine crisis, Vladimir Putin, Zelensky

ఎం కోటేశ్వరరావు

నాటో కూటమి దేశాలు సృష్టించిన ఉక్రెయిన్‌ సంక్షోభం అక్షరాలా పదకొండు వందల తొంభై ఆరవ రోజులో ప్రవేశించింది. ఎప్పుడు, ఎలా ముగుస్తుందో తెలియదు.ఆదివారం నాడు రష్యా గడ్డమీద ఆపరేషన్‌ స్పైడర్‌ వెబ్‌ (సాలెగూడు) పేరుతో ఉక్రెయిన్‌ జరిపిన డ్రోన్ల దాడిలో భారీ మొత్తంలో నష్టం చేకూర్చినట్లు జెలెనెస్కీ ప్రకటించాడు. దాన్ని ఉగ్రవాద చర్యగా వర్ణించిన రష్యా ప్రతిగా వెంటనే పెద్ద ఎత్తున దాడి చేసింది. ఉక్రెయిన్‌ చర్య మీద బుధవారం నాడు ఇది రాసిన సమయానికి అటు డోనాల్డ్‌ ట్రంప్‌ వైపు నుంచి ఇటు వ్లదిమిర్‌ పుతిన్‌ నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. దాడి గురించి ఉక్రెయిన్‌ తమకు ఎలాంటి ముందస్తు సమాచారమూ ఇవ్వలేదనే ఒక్క మాట మాత్రమే అమెరికా అధ్యక్ష భవనం నుంచి వెలువడిరది. సోమవారం నాడు టర్కీ నగరమైన ఇస్తాంబుల్‌లో రెండు దేశాల మధ్య యుద్ధ ఖైదీలు, మరణించిన వారి మృతదేహాల మార్పిడికి సంబంధించిన అవగాహన కుదిరింది. మూడు రోజుల పాటు కాల్పుల విరమణ చేస్తామని రష్యా ప్రతిపాదిస్తే బేషరుతుగా అంగీకరించాలని ఉక్రెయిన్‌ చేసిన ప్రతిపాదనను పుతిన్‌ దూతలు తిరస్కరించారు.పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. రెండు శిబిరాలూ తాజా పరిస్థితికి అనుగుణంగా ఎత్తుగడలను రూపొందించుకొనే కసరత్తులో ఉన్నాయని వేరే చెప్పనవసరం లేదు. బందీల విడుదల గురించి గతంలోనే ఒక అవగాహన కుదిరి అమలు జరిపారు, మరోసారి మిగిలిన వారి గురించి చర్చలలో పాల్గ్గొనటానికి ఇరువురికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. దానికి ఉక్రెయిన్‌ జరిపినదాడికీ సంబంధం లేదు. గడచిన మూడున్నర సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య ఇలాంటి దాడులు, ప్రతిదాడులూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆదివారం నాడు ఉక్రెయిన్‌ జరిపిన దాడికి ఉన్న ప్రాధాన్యతను తక్కువ అంచనా వేయనవసరం లేదు. యుద్ధం అన్న తరువాత రెండు వైపులా నష్టం ఉంటుంది. మూడున్నరేండ్ల రష్యా మిలిటరీ చర్యలో ఉక్రెయిన్‌ ఇప్పటి వరకు కోల్పోయిన ప్రాంతం, ఇతర వాటితో పోల్చితే ఆదివారం నాటి రష్యా నష్టం పెద్దదేమీ కాదు.ఇక ఇస్తాంబుల్‌ చర్చల విషయానికి వస్తే జూన్‌ రెండవ తేదీన ఖైదీల మార్పిడి గురించి తప్ప శాంతి ప్రతిపాదనల మీద ఎలాంటి పురోగతీ లేదు. ఉక్రెయిన్‌ దాడిని అవకాశంగా తీసుకొని పశ్చిమ దేశాల పండితులు రష్యన్‌ సామర్ధ్యం గురించి కథనాలు వండి వారుస్తున్నారు, ప్రచారదాడికి పూనుకున్నారు.

వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియాతో సహా రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్‌ డ్రోన్లను ఎలా పంపింది. ఏక కాలంలో ఐదు వైమానిక స్థావరాల మీద ఎలా దాడి చేసింది అన్నది ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది. ఈ పథకాన్ని రచించేందుకు తమకు పద్దెనిమిది నెలలు పట్టిందని జెలెనెస్కీ చెప్పుకున్నప్పటికీ పశ్చిమ దేశాలన్నింటి ఉమ్మడి హస్తం దీనివెనుక లేకుండా ఉక్రెయిన్‌కు అంతసీన్‌ లేదు. అంతర్గతంగా రష్యాలో కొందరు చేతులు కలిపిన కారణంగానే డ్రోన్ల రవాణా జరిగిందన్నది ప్రాధమిక సమాచారం. రష్యా పత్రిక మాస్కో టైమ్స్‌ కథనం సారాంశం ఇలా ఉంది. ఉక్రెయిన్‌ నగరాల మీద బాంబులు వేసేందుకు ఉపయోగించే 41టియు 95 మరియు టియు 22 బాంబర్లు, ఏ 50 అనే రాడార్‌ విమానాన్ని ధ్వంస చేసినట్లు ఉక్రెయిన్‌ చెప్పినదాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంది. వీటిలో పదికంటే తక్కువే మిలిటరీ సర్వీసులో ఉన్నాయి.మరో రెండిరటిని 2024లో ఉపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులతో ఉక్రెయిన్‌ కూల్చివేసింది. మూడున్నర సంవత్సరాలలో ఇది రష్యాకు మూడవ పెద్ద దెబ్బ. ఈ రకం విమానాలను ఇప్పుడు రష్యా ఉత్పత్తి చేయటం లేదు. టియు 160 రకం బాంబర్లు గాక ఇవి ఒకే సారి 16క్షిపణులను రెండు వేల కిలోమీటర్ల దూరం మోసుకుపోగలవు. ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులతో అనేక విమానాలకు నిప్పంటుకున్నట్లు, ఆర్పివేసినట్లు, ఎలాంటి మరణాలు లేవని, అనుమానితులను అరెస్టు చేసినట్లు రష్యన్‌ రక్షణ మంత్రిత్వశాఖ నిర్ధారించింది. రష్యా వూహాత్మక బాంబర్లలో 34శాతాన్ని ధ్వంసం చేశామని వాటి నష్టం 7 బిలియన్‌ డాలర్లని ఉక్రెయిన్‌ భద్రతా సంస్థలు చెప్పాయి.ఉపగ్రహ చిత్రాల ఆధారంగా విశ్లేషించిన వారు మొత్తం 13 విమానాలు నాశనం లేదా దెబ్బతినట్లు చెప్పారు. ఎనిమిదని వాషింగ్టన్‌ డిసికి చెందిన నిపుణుడు క్రిస్‌ బిగ్గర్స్‌ ఎక్స్‌లో పోస్టు చేశాడు.మరోచోట ఐదు అని ఉక్రెయిన్‌ ఓకో హోరా గ్రూపు విశ్లేషకులు పేర్కొన్నారు.


చెక్క పెట్టెలలో 117 డ్రోన్లను ఉంచి రష్యా ట్రక్కులలోనే రహస్యంగా తరలించామని, రిమోట్‌ కంట్రోలుతో చెక్క పెట్టెల మూతలను తొలగించి డ్రోన్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ పేర్కొన్నది. వైమానిక కేంద్రాల సమీపం నుంచి వాటిని ప్రయోగించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ చెప్పింది.ఒక వైమానిక కేంద్రం ఉక్రెయిన్‌ నుంచి సైబీరియాలో 4,300 కిలోమీటర్లు, మరొకటి 1,900కి.మీ దూరంలో ఉంది. మూడు కేంద్రాల మీద జరిగిన దాడిని తిప్పికొట్టిన్లు పేర్కొన్నది. పర్యవసానాలు, రష్యన్‌ మిలిటరీ సామర్ద్యాన్ని అంచనా వేయటం ఈ దశలో కష్టం. ఇదీ మాస్కో టైమ్స్‌ మరుసటి రోజు విశ్లేషణ. ఉక్రెయిన్‌ దాడి మీద రష్యా ఎలా స్పందిస్తుందోనని ప్రపంచమంతా ఎదురుచూస్తున్నది.అది అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ మీద ఆధారపడి ఉంటుందన్నది ఒక తర్కం. తాను అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే పరిష్కరిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఫారిన్‌ పోలిసీ అనే పత్రిక సిఐఏలో రష్యా గురించి విశ్లేషణ చేసిన మాజీ డైరెక్టర్‌ జార్జి బీబీతో మాట్లాడిరది. పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకురావాల్సింది డోనాల్డ్‌ ట్రంప్‌ అని బీబీ చెప్పాడు. ఉక్రెయిన్‌ దాడి మీడియా ప్రత్యేకించి పశ్చిమదేశాల దృష్టిని పెద్దగా ఆకర్షించవచ్చు, రష్యా మీద పెద్ద ప్రభావం చూపుతుందని అనుకోవటం లేదు, దాని సామర్ద్యాన్ని దెబ్బతీయదని, రెండు దేశాల మధ్య పెద్ద మార్పులు తెస్తుందని అనుకోవటం లేదన్నాడు.


రష్యన్‌ మిలిటరీ వైమానిక, పెద్ద డ్రోన్ల దాడిని ఎలా ఎదుర్కోవాలా అన్నదాని మీదే భద్రత గురించి దృష్టి సారించింది తప్ప భూమి మీద నుంచి డ్రోన్లను ప్రయోగించి దెబ్బతీసే ఎత్తుగడల గురించి కేంద్రీకరించలేదన్నది ప్రాధమికంగా కనిపిస్తున్నది.తక్కువ ఎత్తులో సమీపం నుంచి దాడి చేసే చిన్న డ్రోన్ల గురించి దృష్టి సారించలేదు. ఇది ఒక్క రష్యాకే కాదు యావత్‌ ప్రపంచానికి ఒక మిలిటరీ గుణపాఠం. ఎలాంటి అనుమానం కలగకుండా రష్యన్‌ డ్రైవర్లు వాటిని ట్రక్కులలో వైమానిక స్థావరాల వద్దకు తీసుకు వెళ్ల గలిగారు. మాస్కోలోని ప్రధాన గూఢచార కార్యాలయం సమీపం నుంచే స్పైడర్‌వెబ్‌ కమాండ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి రిమోట్‌ కంట్రోలతో పని చేయించారని చెబుతున్నారు, నిర్ధారించుకోవాల్సి ఉంది. ఈ దాడి కారణంగా రెండు దేశాల చర్చల క్రమంలో మార్పు రాదని మరుసటి రోజే జరిగిన సమావేశం వెల్లడిరచింది. అయితే దీనికి, ఎవరికి వారు వేసే ఎత్తుగడలకు సంబంధం ఉండదు. ఈ దాడి తరువాత పుతిన్‌పై ట్రంప్‌ పట్టు పెరుగుతుందని కొందరు భావిస్తున్నారు. ఇప్పటి వరకు రష్యాకు అనుకూలంగా పరిస్థితి ఉందని వేసిన అంచనాలను సవరించుకోవాలని సూచిస్తున్నారు. అందువలన రష్యా డిమాండ్‌ చేస్తున్న షరతులతో ఒప్పందానికి అంగీకరించే అవకాశం ఉండదని సూత్రీకరిస్తున్నారు. ఇంతకు ముందే ఆ షరతులకు ట్రంప్‌ అంగీకరించలేదని, ఇప్పుడు మరింతగా వైఖరి గట్టిపడుతుందని అంటున్నారు. దాడికి ముందే గత కొద్ది రోజులుగా రష్యా మీద మరింత కఠిన వైఖరి తీసుకోవాలని, ఆంక్షల తీవ్రతను పెంచాలనే వత్తిడి ట్రంప్‌ మీద వస్తున్నది, ఐరోపా దేశాలు బహిరంగంగానే చెప్పాయి. పుతిన్‌ స్వయంగా కాల్పుల విరమణకు అంగీకరించకపోతే కొత్త ఆంక్షలను అమలు జరుపుతామనే సందేశాన్ని పంపగలడని విశ్లేషకులు చెబుతున్నారు. కొద్ది వారాల క్రితం ట్రంప్‌ తన ఓవల్‌ కార్యాలయంలో జెలెనెస్కీతో మాట్లాడుతూ ప్రయోగించటానికి తురుపుముక్కలేవీ లేవని చెప్పిన సంగతి తెలిసిందే. నాటో ప్రధాన కార్యాలయంలో అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేత్‌ ఫిబ్రవరిలో మాట్లాడుతూ 2014కు ముందు కలిగి ఉన్న ప్రాంతాలన్నీ తిరిగి వస్తాయని ఉక్రెయిన్‌ భావించటం వాస్తవ విరుద్దమన్నాడు. ఇప్పుడు ధ్వంసం చేశామని చెబుతున్న ఫైటర్‌లు రష్యా దగ్గర ఉన్నవాటిలో ఒక చిన్న భాగమే.
రష్యా మిలిటరీ బలగంతో పోల్చితే ఉక్రెయిన్‌ ఏ మాత్రం పోల్చటానికి లేదు. అయినప్పటికీ మూడున్నర సంవత్సరాలుగా అది నిలిచి ఎదిరిస్తున్నది.కొందరు చెబుతున్నదాని ప్రకారం ఉక్రెయిన్‌ తన సమాచారం మొత్తాన్ని మైక్రోసాఫ్ట్‌కు తరలించింది. దాని క్లౌడ్‌ సేవలను ఉపయోగించుకుంది. పలు పశ్చిమ దేశాలు సమన్వయం చేసుకొని రష్యా మీద సైబర్‌దాడులు జరిపాయి. ఎలన్‌ మస్క్‌ స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ స్టార్‌లింక్‌ను అందచేసింది. ఇది ఉక్రెయిన్‌ సమాచార వ్యవస్థలను పటిష్టం కావించింది. మైక్రోసాఫ్ట్‌తో పాటు క్లౌడఫేర్‌, పాలన్‌టిర్‌ వంటి అనేక సంస్ధలు సైబర్‌దాడుల్లో ఉక్రెయిన్‌కు తోడ్పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికాతో సహా నాటో దేశాలన్నీ తమ సర్వశక్తులను ఉక్రెయిన్‌ మీద వడ్డి అనేక విధాలుగా సాయపడ్డాయి. వాటిలో ఆధునిక డ్రోన్ల ఉత్పత్తి ఒకటి.ఇది రష్యాకంటే ఆధునికమైన వాటిని ముందుగానే రూపొందించేందుకు తోడ్పడిరది. గూఢచార సమాచారం, ఆధునిక ఆయుధాల అందచేత గురించి చెప్పనవసరం లేదు. ఒక చిన్న దేశం రష్యాను ఓడిరచిందనే ప్రచారదాడికి దాన్ని ఒక సాధనం చేసుకోవాలని చూశాయి. మరోవైపున ఆర్థికంగా ఆంక్షలతో ఎలా దెబ్బతీశాయో చెప్పనవసరం లేదు. ఇంత చేసినప్పటికీ వాటన్నింటినీ రష్యా అధిగమిస్తూ ఇప్పటి వరకు ఐదోవంతు ఉక్రెయిన్‌ భూభాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగింది. అనేక మౌలిక వ్యవస్థలను ధ్వంసం చేయగలిగింది.
నాటో దేశాలు ఉక్రెయిన్ను నిలిపేందుకు ఎంత చేసినా అవి సఫలం కాలేకపోతున్నాయి. ఆయుధాలు ఇచ్చినా వాటిని వినియోగించే నైపుణ్యం ఉక్రెయిన్‌ మిలిటరీకి లేదని తేలింది, అంతే కాదు అవసరమైన సంఖ్యలో సైనికుల సంఖ్య కూడా లేదు. రష్యాలో ఉన్న రక్షణ ఉత్పత్తుల మౌలిక వ్యవస్థ ఎంతో ముఖ్యమైనది, రోజు రోజుకూ రష్యాకు అనుకూలంగా పరిస్థితులు మారటంలో అది కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నది. అయితే తెల్లవారేసరికి రష్యా పైచేయి సాధిస్తుందని అర్ధం కాదు. పోరు దీర్ఘకాలం సాగినందున ఉక్రెయిన్‌కు లభించిన సాయాలన్నీ తాత్కాలికం తప్ప ముఖ్యంగా ఆయుధాలు శాశ్వతం కాదు. ముందే చెప్పుకున్నట్లు అనేక ప్రాంతాలు రష్యా స్వాధీనంలోకి వచ్చాయి. ఇది రష్యాకు అనుకూలతలను పెంచింది.మిలిటరీ జవాన్ల సంఖ్యలో రష్యాదే ఆధిపత్యం. అందువల్లనే దాని ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాల మీద పట్టు నిలుపుకుంటోంది. ఉక్రెయిన్‌కు తగినన్ని బలగాలు లేని కారణంగా రష్యాలో ఆక్రమించుకున్న కురుస్కు ప్రాంతాన్ని అది నిలుపుకోలేకపోయింది. అనేక అనుభవాలను చూసిన తరువాత పుతిన్‌ సేనలు వ్యూహాన్ని మార్చాయి. పశ్చిమ దేశాలు ఆశించినట్లు ఆంక్షలతో రష్యా కుదేలు కాలేదు.పోరు విషయంలో తటస్థంగా ఉన్నప్పటికీ భారత్‌, చైనా దాని నుంచి చమురు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేసి ఒక విధంగా ఆర్థికంగా ఎంతగానో ఆదుకున్నాయి. అవి కూడా లబ్దిపొందాయి, ఇదొక కొత్త అనుభవం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేడిన్‌ చైనా విడిభాగాల కోసం బారులు తీరుతున్న మేకిన్‌ ఇండియా ఉత్పత్తిదారులు ! ఎటూ తేల్చుకోలేని స్థితిలో నరేంద్రమోడీ !!

03 Tuesday Jun 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti China Media, Anti communist, BJP, China, Made in China 2025, Make In India, make in india crew line for made in china products, Narendra Modi Failures, Narendra Modi in Policy dilemma, RSS, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మన ఆటోమొబైల్‌ పరిశ్రమ చైనా నుంచి రావాల్సిన ఒక చిన్న పరికరం కారణంగా ప్రస్తుతం ఆందోళన చెందుతోందంటే ఎవరైనా నమ్ముతారా ? అదే నియోడిమియమ్‌ ఐరన్‌ బోరోన్‌ అనే మాగ్నెట్‌.కార్లలో స్టీరింగ్‌ నుంచి బ్రేకులు, వైపర్‌లు, ఆడియో పరికరాల వంటి వాటికి ఇది ఎంతో ముఖ్యం. అది లేకపోతే మొత్తం కారు సిద్దమైనా ప్రయోజనం ఉండదు. వాటి తయారీ, సరఫరాలో గుత్తాధిపత్యం ఉన్న చైనా ఏప్రిల్‌ నుంచి ఎగుమతుల మీద పలు ఆంక్షలు విధించింది. వాటిని దేనికి వినియోగిస్తారో ముందుగానే ఆయా దేశాలు హామీ పత్రాలు ఇవ్వాలన్నది వాటిలో ఒకటి. కొన్ని దేశాలు వాటిని కొని చైనాతో వైరానికి దిగిన అమెరికా, ఐరోపా దేశాలకు అమ్ముకుంటున్నాయి.దాన్ని నిరోధించేందుకే ఆ షరతు అన్నది స్పష్టం. మన దేశంలో గతంలో దిగుమతి చేసుకున్న నిల్వలు జూన్‌ మొదటి వారం వరకు వస్తాయని అందువలన త్వరగా తెచ్చుకొనేందుకు చైనాతో సంప్రదింపులు(పైరవీలు) జరపాలని ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ సొసైటీ, ఆటోమోటివ్‌ కాంపొనెంట్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్ల ప్రతినిధులు చైనా వెళ్లేందుకు సిద్దం అవుతున్నారని బిజినెస్‌ టుడే పత్రిక 2025 మే 31వ తేదీ వార్తలో పేర్కొన్నది. 2024లో 470 టన్నుల మాగ్నెట్‌లు దిగుమతి చేసుకోగా ఈ ఏడాది 700 టన్నులకు నిర్ణయించారు. చైనా మీద ఆధారపడకుండా మనమే మాగ్నెట్‌లు తయారు చేసేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో నిర్ణయించేందుకు జూన్‌ 3న ఉన్నతస్థాయి కమిటీ సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు కూడా ఆ పత్రిక రాసింది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవటం అంటే ఇదే ! పదకొండు సంవత్సరాల నుంచి ఏం చేసినట్లు ? తన పెట్టుబడులను మన ప్రభుత్వం అడ్డుకున్న కారణంగానే సరఫరాకు చైనా ఆంక్షలు పెడుతోందా ? ఏమో, ఎవరి ప్రయోజనం వారిది, ఎవరి తురుపు ముక్కలు వారివి !


లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ 2025 ఏప్రిల్‌ 25వ తేదీన తన సర్వే నివేదికను ప్రచురించింది.దాన్లో చెప్పినదాని ప్రకారం గడచిన ఏడాది కాలంలో భారతీయుల్లో 62శాతం మంది చైనా వస్తువులను కొనుగోలు చేశారు. అంతకు ముందు ఏడాది వారు 55శాతమే ఉన్నారు, 15శాతం మంది కొత్త చైనా వస్తువులు భారతీయ కంపెనీల ద్వారా వస్తే కొనుగోలు చేయటం ఖాయమని చెప్పారు. ఈ వివరాలు సూచిస్తున్నదేమిటి ? స్వదేశీ వస్తువులనే వాడండి అని పాలకులు ఎన్ని సుభాషితాలు పలికినప్పటికీ జనం పట్టించుకోవటం లేదు. ఆధునిక జీవితం, వినియోగదారీ తత్వాన్ని పెంచుతున్న కారణంగా నాణ్యమైన, చౌకగా దొరికే చైనా వస్తువుల కోసం ప్రపంచమంతా ఎగబడుతున్నపుడు మనవారు దూరంగా ఉంటారా ! మావెనుకే జనం ఉన్నారని చెప్పుకుంటున్న పార్టీ మాటలు విని ఉంటే చైనా దిగుమతులు పడిపోయేవి. దానికి విరుద్దంగా మోడీ ఏలుబడిలో రికార్డులు బద్దలవుతున్నాయి.


పదకొండు సంవత్సరాల ప్రచార ఆర్భాటం తరువాత పరిస్ధితి ఏమిటి ? ఏదీ ఊరికే రాదు. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో లక్కు మీద ఆధారపడిన రాజేంద్ర ప్రసాదు మాదిరి ఉంటే కుదరదు. కొంత మందికి చైనాలో కమ్యూనిస్టు నియంత్రత్వం కనిపిస్తుంది. నియంతల పాలన ఉన్నదేశాలన్నీ దాని మాదిరి ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పాలి మరి. పరిశోధన మరియు అభివృద్ధికి గణనీయంగా ఖర్చు పెట్టిన కారణంగానే చైనా అనేక రంగాలలో దూసుకుపోతున్నది. ముందే చెప్పుకున్న మాగ్నెట్‌ల ఎగుమతిలో చైనా వాటా ప్రపంచంలో అపురూప ఖనిజాలతో తయారయ్యే వాటిలో 80శాతం వరకు ఉన్నట్లు అంచనా, మెటల్‌ మాగ్నెట్లలో 2012లో 49.6శాతం ఉండగా 2024కు అది 63.5శాతానికి పెరిగింది.నాన్‌ మెటల్‌ మాగ్నట్లలో 50.8 నుంచి 59.1శాతానికి పెరిగింది(మనీ కంట్రోల్‌ వెబ్‌ 2025 మే 29).మన నరేంద్రమోడీ తలచుకోవాలే గానీ తెల్లవారేసరికి వాటిని ఉత్పత్తి చేయగలరని గొప్పలు చెప్పేవారు మనకు కనిపిస్తారు. వాస్తవం ఏమంటే 2013లో మనకు అవసరమైన మెటల్‌ మాగ్నట్లలో చైనా నుంచి 73.5శాతం దిగుమతి చేసుకుంటే 2024లో 82.9శాతానికి పెరిగాయి. విద్యుత్‌ వాహనాల తయారీలో ఈ మాగ్నెట్‌లు కీలకం. పాకిస్తాన్‌ వందకు వంద, ఐరోపా సమాఖ్య 90, దక్షిణ కొరియా 87.4శాతం, అమెరికా దిగుమతుల్లో 75శాతం చైనా నుంచి తెచ్చుకుంటున్నాయి. ప్రపంచంలో 78 దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటుండగా వాటిలో 41 చైనా మీద 60శాతంపైగా ఆధారపడి ఉన్నాయి.మన పాలకులు లేదా పరిశ్రమగానీ చైనా మీద ఆధారపడకుండా చేయటంలో విఫలమయ్యారు. డోనాల్డ్‌ ట్రంప్‌ ఏడు అపురూప ఖనిజాలు, మాగ్నెట్‌ ఉత్పత్తుల దిగుమతుల మీద ఆంక్షలు విధించాడు.ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్నట్లుగా ఇది ఇతర దేశాలకు ఇబ్బందులు తెచ్చింది. మన విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ మే నెలలో 30 సర్టిఫికెట్లు జారీ చేసి చైనా నుంచి దిగుమతుల పునరుద్దరణకు వీలు కల్పించినట్లు వార్తలు వచ్చాయి. వాటిని రక్షణ అవసరాలకు లేదా తిరిగి అమెరికాకు ఎగుమతులు చేయబోమని హామీ ఇచ్చింది.వాటిని చైనా పరిశీలించిన తరువాత దిగుమతి చేసుకోవచ్చు, ఆ ప్రక్రియను త్వరగా చేపట్టాలనే పరిశ్రమల వారు పైరవీ కోసం చైనా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని ముందే చెప్పుకున్నాం.

బిజెపి లేదా దానికి భజన చేసే గోడీ మీడియా పండితులు మేకిన్‌ ఇండియా గురించి గోరంతను కొండంతలుగా చిత్రించి కబుర్లు చెబుతారు. రాజకీయంగా అమెరికాతో అంటకాగేందుకు కేంద్ర పాలకులు తపించి పోతుంటారు. కాషాయ దళాలు నిత్యం చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతుంటాయి. కానీ ఆర్థిక విషయాల్లో మాత్రం చైనా కావాల్సి వస్తోంది. నరేంద్రమోడీ అధికారం స్వీకరించగానే 2014లో చెప్పిందేమిటి ? మేకిన్‌ ఇండియా పథకంతో దేశాన్ని ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మారుస్తా, అందుకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తా అన్నారు, ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహక పధకం(పిఎల్‌ఐ) ప్రకటించారు. జిడిపిలో ఉత్పాదక రంగ వాటాను 15 నుంచి 2025 నాటికి 25శాతానికి పెంచుతానని, కీలక రంగాల్లో చైనా మీద ఆధారపడటాన్ని తగ్గిస్తా అని చెప్పారు. అందుకు దేశమంతటా గుజరాత్‌ నమూనా అభివృద్ధి చేస్తా అన్నారు. పదేండ్లలో జరిగిందేమిటి ? కొంత మేరకు ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఎగుమతుల విలువ పెరిగింది. జిడిపిలో వస్తూత్పత్తి వాటా పెరగకపోగా 14శాతానికి తగ్గింది. దీని గురించి మాట్లాడకుండా సెల్‌ ఫోన్ల ఎగుమతి చూడండి, ఆపిల్‌ కంపెనీ 20శాతం ఉత్పత్తి ఇక్కడే చేస్తున్నది అంటూ సర్వస్వం అదే అన్నట్లుగా చిత్రిస్తున్నారు. పిఎల్‌ఐ స్కీములో కేటాయించిన 1.9లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ దీనికి ఒక కారణం. టెలికమ్యూనికేషన్స్‌, పివి సెల్స్‌ వంటి కొన్ని దిగుమతులు చైనా నుంచి తగ్గాయి. కానీ ఔషధ రంగానికి అవసరమైన ఏపిఐ దిగుమతులు 75 నుంచి 72శాతానికి మాత్రమే తగ్గాయి. అనేక రంగాలకు ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాలను సాధించటంలో వైఫల్యం కనిపిస్తుంది. మొత్తంగా విజయమా వైఫల్యమా అన్నది చూడాలి. యాపిల్‌ కంపెనీని ఒక ఉదాహరణగా చూపుతున్నారు.చైనాలో ఉత్పాదక ఖర్చు పెరిగిన కారణంగా అది వియత్నాం, మనదేశానికి వచ్చింది. అమెరికాలో తడిచి మోపెడవుతుంది గనుక ఎన్ని పన్నులు వేసినా విదేశాల్లోనే తయారు చేస్తానని ట్రంప్‌కు తెగేసి చెప్పింది.షీ జింపింగ్‌, నరేంద్రమోడీ, ట్రంపా ఎల్లయ్యా పుల్లయ్యా అన్నది కాదు, దానికి కావాల్సింది లాభాలు. రేపు ఆఫ్రికా ఖండంలో ఖర్చు తక్కువగా ఉంటే పొలో మంటూ అక్కడికి పోతుంది. ఆ కంపెనీ చైనాలో విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, విడిభాగాలు తయారు చేసే పరిశ్రమలతో సమగ్ర ఒప్పందాలు చేసుకుంది. చైనా ప్రభుత్వ సహకారంతో రెండు దశాబ్దాల కాలంలో అది జరిగింది. మనదేశంలో అలాంటివేమీ లేదు.


వాజ్‌పాయి పాలనలో దేశం వెలిగి పోయింది అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ పాలన ముగిసి యుపిఏ అధికారానికి వచ్చిన రెండేళ్లకు 2006లో నేషనల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కాంపిటీటివ్‌ కౌన్సిల్‌ ఉత్పాదక రంగం సంక్షోభంలో ఉందని, జాతీయ ఉత్పాదక విధానాన్ని రూపొందించాలని కోరింది. దానికి అనుగుణంగా 2011లో యుపిఏ సర్కార్‌ పదేండ్లలో జిడిపిలో ఉత్పాదక రంగ వాటాను 25పెంచేందుకు ఒక విధానాన్ని ఆమోదించింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2014లో దానికి మేకిన్‌ ఇండియా అనే పేరు తగిలించి తానే రూపొందించినట్లు ప్రచారం చేసుకున్నారు. దాన్లో భాగంగానే సబ్సిడీలకు ప్రోత్సాహకాల పేరుతో కొత్త పేరు పెట్టి 2020లో పిఎల్‌ఐ స్కీమును ఐదేండ్ల ప్రణాళికతో ప్రకటించారు. దాని గడువు ముగిసినప్పటికీ లక్ష్యాలను సాధించకపోవటంతో పొడిగించాలని నిర్ణయించారు. చిత్రం ఏమిటంటే గాల్వన్‌ లోయ ఉదంతాల తరువాత దేశభద్రతకు ముప్పు అనే పేరుతో పరోక్షంగా చైనా పెట్టుబడులను నిషేధించిన మోడీ సర్కార్‌ ఈ స్కీము కింద ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల్లో చైనా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టి సబ్సిడీలు పొందవచ్చని నిర్ణయించింది. అయితే దానికి మనదేశంలో ఉన్న ఏదైనా కంపెనీతో సంయుక్త భాగస్వామ్యంలో 49శాతం వాటాకు పరిమితం కావాలని, యాజమాన్యం భారతీయ కంపెనీల చేతుల్లో ఉండాలని, సాంకేతిక పరిజ్ఞాన బదిలీలు జరగాలని షరతు పెట్టింది.(ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ 2025 ఏప్రిల్‌ 28). వేగంగా పని చేస్తానని చెప్పుకొనే మోడీ సర్కార్‌కు ఈ నిర్ణయం తీసుకొనేందుకు పదేండ్లు పట్టింది, చివరకు పెట్టుబడిదారుల వత్తిడి పని చేసినట్లు కనిపించి, ఏదైతే అదవుతుందని సందిగ్ధావస్ధ నుంచి బయటపడినట్లు ఉంది. చైనా, దాని కమ్యూనిస్టు పార్టీని వ్యతిరేకించే పచ్చివ్యతిరేకులు బిజెపిలో పుష్కలంగా ఉన్నారు. వారు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు కనుకనే ఈ అలశ్యం. ఎందుకంటే చైనాను అనుమతిస్తే వారి సైద్దాంతిక దాడిని జనం ఏమాత్రం నమ్మరు. అన్నింటికీ మించి అమెరికా, ఐరోపా ధనికదేశాల మీద ఉన్న మోజు మామూలుగా లేదు. వేదాల్లో అన్నీ ఉన్నాయష అని చెప్పేవారు సంస్కృత గ్రంధాల్లో విమానాల తయారీతో సహా ఉందని చెబుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏమైనా వెలికితీశారా అంటే అదీ లేదు. పోనీ ఈ పదేండ్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులేమైనా కేటాయించిందా ? గత మూడు పారిశ్రామిక విప్లవాల బస్సులను ఎక్కలేకపోయామని నరేంద్రమోడీ చెప్పింది నిజమే, కానీ నాలుగో బస్సును ఎక్కటానికి చేసిందేమిటి అన్నది ప్రశ్న. జిడిపిలో అమెరికా 2.8, చైనా 2.1,దక్షిణ కొరియా 4.2, ఇజ్రాయెల్‌ 4.3శాతం ఖర్చు చేస్తుంటే మన ఖర్చు పదేండ్లలో 0.6 నుంచి 0.7శాతం మధ్య ఉందంటే మోడీ దేశాన్ని ఎంత వెనక్కు తీసుకుపోయారో అర్ధం అవుతోంది. ఎంతసేపూ ఆవు పేడలో, మూత్రంలో బంగారం ఉందా,ఏముంది అనే ఆత్రంతో పరిశోధనల మీద ఉన్న కేంద్రీకరణ మిగతా వాటి మీద లేదు. ఇందువల్లనే మనదంటూ చెప్పుకొనేందుకు హిందూత్వ తప్ప ఒక్క వస్తు బ్రాండైనా లేదు. చైనా నుంచి కంపెనీలు వస్తున్నాయదిగో చూడండి ఇదిగో చూడండి అంటూ ఇంట్లోకి గేటు బయటకు తిరిగి చూసినట్లు తప్ప స్వంత కంపెనీల ఏర్పాటు గురించి పట్టించుకోలేదు. ప్రైవేటు వారికి ఏం పడుతుంది, రిలయన్స్‌ , ఇతరులకు చమురు తవ్వకం ఇచ్చారు. పదేండ్ల నాటికీ ఇప్పటికీ స్వంత ఉత్పత్తి తగ్గింది తప్ప పెరగలేదు.

పదకొండేండ్ల మోడినోమిక్స్‌ తీరు తెన్నులు చూసినపుడు కొన్ని ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎండమావుల వెంట నీళ్ల కోసం పరుగెత్తినట్లుగా ఆధునిక టెక్నాలజీ కోసం మనదేశం అమెరికా వైపు చూస్తోంది. ఇంథనం, ఆయుధాల కోసం రష్యా మీద, చౌకగా వచ్చే వస్తువుల కోసం చైనా మీద ఆధారపడినట్లు కనిపిస్తోంది. ఇలా ఎంతకాలం అన్నది ప్రశ్న. చైనా వస్తువుల మీద ఆధారపడిన అమెరికా, ఇతర ఐరోపా దేశాలు నేర్చుకున్న గుణపాఠం మనవారు నేర్చుకోవటానికి సిద్దంగా లేరు. అందుకు నిదర్శనం పరిశోధన మరియు అభివృద్ధి కేటాయింపులను నిర్లక్ష్యం చేయటమే. మనదంటూ ఒక ప్రత్యేకత లేకపోతే సమగ్ర స్వయం సమృద్ధి అనేది పగటి కలే. ఏ దేశం కూడా మరొక దేశానికి తనకు లబ్దికలిగించే పరిజ్ఞానాన్ని మరొకదేశానికి పంచుకొనే స్థితి ప్రస్తుతం లేదు. అది పాతబడిన తరువాత మాత్రమే బదలాయిస్తున్నాయి. దేశాలతో వ్యవహరించే తీరును బట్టి వాణిజ్య లావాదేవీలు జరుగుతాయి. మనం ఇతరుల మీద ఆధారపడినంతకాలం అవి చెప్పినట్లు మనం వినాలి తప్ప మన మాట చెల్లదు. ఉదాహరణకు గాల్వన్‌ లోయ ఉదంతాలు జరిగినపుడు చైనా వస్తువుల దిగుమతులు నిలిపివేసి డ్రాగన్‌ దేశాన్ని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని అనేక మంది వీధుల్లో వీరంగం వేశారు.చైనా ఎగుమతులు ఎన్ని, వాటిలో మనదేశ వాటా ఎంత అన్న కనీస సమాచారం తెలిసి ఉంటే ఆ గంతులు, ప్రకటనలు ఉండేవి కాదు. వారి మనోభావాలను మోడీ గట్టి దెబ్బతీశారు, దిగుమతులు పెంచారు. తాజాగా పాకిస్తాన్‌కు చైనా ఆయుధాలు అందించి సాయం చేస్తున్నదని ప్రచారం చేసినా చైనా వస్తువులు బహిష్కరించాలనే పిలుపులు రాలేదంటే తత్వం తలకెక్కిన బిజెపి ఈసారి ముందు జాగ్రత్త పడి తన మరుగుజ్జులను అదుపు చేయటమే, కాదంటారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కులగణనపై నీ వ్యాఖ్యయే నీరజాక్షా : బీహార్‌ ఓట్ల కోసం అర్బన్‌ నక్సల్‌గా మారిన ప్రధాని నరేంద్రమోడీ !

03 Saturday May 2025

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Politics, RELIGION, Uncategorized

≈ 1 Comment

Tags

Bihar elections, BJP, Caste census, Have Modi, Modi govt’s U-turn on caste census, Narendra Modi Failures, Nitish Kumar, RSS, Urban naxals


ఎం కోటేశ్వరరావు


ఒక సినిమాలో రాజకీయ నేతలు కుడి జేబులో ఒకటి, ఎడమదానిలో మరో ప్రకటన పెట్టుకు తిరగటం గురించి పరుచూరి బ్రదర్స్‌ చెప్పారు. ఇప్పుడు విశ్వగురువు నరేంద్రమోడీ ఆ కోవలో చేరిపోయారు. చరిత్రలో ఎప్పుడో జరిగినదానికి వక్రీకరణలు తెలిసిందే, మన కళ్ల ముందు జరిగిన వాటిని కూడా బిజెపి నేతలు ఎలా మార్చి వేస్తున్నారో కులగణనకు కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయంపై సమర్ధన స్పందన వెల్లడిస్తున్నది.జనం మరీ అంత బుర్రలేని వారిగా కనిపిస్తున్నారా ! కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వార్తగా ఇచ్చిన తరువాత ఈ అంశంపై ఆకస్మికంగా మాట మార్చింది అంటూ కొన్ని మీడియా సంస్థలు విశ్లేషణలు వెలువరిస్తున్నాయి. వార్తను సంతోష పడే బిజెపి మద్దతుదారులు ఇప్పుడు ఇవెందుకు అని చిరాకు పడుతున్నారు. ఇప్పటికీ కొందరు స్వతంత్రంగా ఆలోచించే జర్నలిస్టులు ఉన్నందుకు మండిపడుతున్నారు,విమర్శనాత్మకంగా చూడకుండా పాకేజ్‌లతో మొత్తం గోడీ మీడియాగా ఎందుకు మారలేదని చిందులు వేస్తున్నారు. అవును మరి హిట్లర్‌ బాటలో నడుస్తున్న కాషాయ దళాల ప్రజాస్వామ్యంలో నందంటే నంది కాదు పందంటే పంది అనాలి కదా ! లేకపోతే వీపులు పగులుతాయి మరి !!


కులగణన చేయాలని కోరే వారు ప్రత్యేకించి కాంగ్రెస్‌ పేదల అనుభూతులతో ఆటలాడుకుంటున్నదని, కులం పేరుతో విడదీస్తున్నదని ప్రధాని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు.(2023 అక్టోబరు 2, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా) గతంలో వారు దేశాన్ని చీల్చారని ఇప్పుడు కూడా అదే చేస్తున్నారన్నారు. మధ్య ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు బీహార్‌ కుల సర్వే వివరాల విడుదల సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బీహార్‌ ఎన్నికల్లో ఓట్లు అవసరం గనుక కులగణనకు అంగీకరిస్తూ కాబినెట్‌లో తీర్మానించారు. ఆకలేస్తే తినేందుకు ఏదీ దొరకనపుడు మొరటు పనిని తెలుగులో మర్యాద పూర్వకంగా దుప్పి భోజనం అనటాన్ని బిజెపి ఓట్ల ఆకలి గుర్తుకు తెచ్చింది.బీహార్‌ సర్వే ఫలితాలు అవాస్తవమని, పేదల కంటినీరు తుడిచే ఎత్తుగడ అని బిజెపి వర్ణించింది. అంతేనా ప్రతిపక్ష పార్టీలు కుల గణన చేయాలని కోరటం అర్బన్‌ నక్సల్స్‌ ఆలోచనలకు ఒక సూచిక అని 2024లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే అర్బన్‌ నక్సల్‌గా అధికారికంగానే మారినట్లు కాదా ? ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఒక్కటిగా ఉంటేనే ఐక్యంగా ఉంటాం అని చెప్పారు, అంటే ఇప్పుడు కులాల వారీ విడతీసేందుకు పూనుకున్నారా ? విశ్వగురువు గనుక రాత్రి ఒక సుభాషితం పగలు ఒకటి వల్లిస్తారా ! మోడీ తరువాత వారసుల్లో ఒకరని భావిస్తున్న ఉత్తర ప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాధ్‌ కులంపేరుతో విడతీస్తే హత్య చేసినట్లే అన్నారు. ఓటు బాంకు రాజకీయాలకు మేం వ్యతిరేకం అని సుద్దులు చెప్పే బిజెపి బుద్ది ఇప్పుడు అదే ఓట్ల కోసం అర్రులు చాస్తున్నదని, విధిలేకనే దిగివచ్చిందని జనం భావిస్తున్నారు. నేషనల్‌ ఫ్రంట్‌ నేతగా ప్రధాని విపి సింగ్‌ వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు మండల్‌ కమిషన్‌ సిఫార్సు చేస్తే దానికి పోటీ కమండల్‌గా అద్వానీ రామ్‌ రథయాత్ర చేపట్టారనే విమర్శలు అప్పుడే వచ్చాయి. ఓబిసిలో వర్గీకరణకు మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి రోహిణీ కమిషన్‌ వేశారు, అది సమర్పించిన నివేదికను రెండేండ్లు కావస్తున్నా ఇంతవరకు బయటపెట్టలేదు. అలాంటి పాలకులు ఇప్పుడు బిసిల మీద ఎక్కడలేని ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. కుల గణన చేస్తే హిందూ సమాజం విడిపోతుందని చెప్పటమే అసలు హిమాలయమంత అబద్దం, సాకు. ఇప్పుడు ఒక్కటిగా ఉందా ? ఎన్ని రకాలుగా విడిపోయి ఉందో జనాలకు తెలియదా, గ్రామాల్లో గోడలతో విభజిస్తున్నారు, చివరకు చచ్చిన తరువాత శ్మశానాల్లో కూడా మతాలు, కులాలవారీ లేవా ? ఇంకా కులం ఎక్కడ, మతం ఎక్కడా అనిపడక కుర్చీల్లో కూర్చొని వాదించేవారు కనిపిస్తారు. ఇంత అభివృద్ది, విద్య తరువాత కూడా సమాజంలో కులాంతర వివాహాలు కేవలం ఐదుశాతమే అని చెప్పాలంటే సిగ్గుపడాలి. ఏ నియోజకవర్గంలో ఏ కులం, మతం, ప్రాంతం వారు ఎందరున్నారో ఎన్నికలపుడు అందరికీ తెలిసిందే కదా ?


కులగణనను గతంలో కాంగ్రెస్‌ కూడా వ్యతిరేకించిన మాట నిజం. నిజానికి బిజెపి దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం కూడా వ్యతిరేకమే. రెండిరటికీ కారణాలు వేర్వేరు. బిజెపికి 2014లో సంపూర్ణ అధికారం వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు సముఖత చూపలేదు. ఇప్పుడు సామాజిక న్యాయం కోసం చేశామని చెబుతున్నవారు తమ పార్టీ నేత వాజ్‌పాయ్‌ హయాంలోనే 2001 జనగణన జరిగిందని, అప్పుడే ఎందుకు చేయలేదో చెప్పాలి. కుల గణన జరిగితే రిజర్వేషన్లు, వర్గీకరణ డిమాండ్లతో పాటు, బిజెపి నాయకత్వంలో ఉన్న కొన్ని కులాల వారి ఆధిపత్యానికి గండిపడుతుంది గనుకనే ఆ పార్టీ సుముఖంగా లేదు. కొన్ని పదవుల్లో కొందరికి అవకాశం కల్పించినప్పటికీ సంఘపరివార్‌ సంస్థలలో పునాది ఆధిపత్య కులాలదే. కొన్ని సంక్షేమ పధకాలు అమలు జరపవచ్చు, రాజకీయ సాధికారత అప్పగించటానికిసిద్దపడుతుందా అన్నదే సమస్య. మోడీ సామాజిక తరగతి ఓబిసి అయినప్పటికీ గత పదకొండు సంవత్సరాల్లో వారికి ఒరగబెట్టిందేమీ లేదు, ఆర్థికంగా పరిస్థితి మెరుగుపరచిందీ లేదు. బిజెపి మతం కార్డుతో రాజకీయం చేస్తున్నదానికి విరుగుడుగా కాంగ్రెస్‌ ఇప్పుడు కులగణన ముందుకు తెచ్చింది. దానికంటే ముందు బిసి సంఘాలు ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి. దీనికి మూలం అస్థిత్వ భావజాలం విస్తరించిన కారణంగా దేశంలో అత్యధికులుగా ఉన్న వెనుకబడిన తరగతుల వారు మేమెంత మందిమో మాకంత వాటా పేరుతో రాజకీయ ప్రాతినిధ్యం కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయటమే. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో రాజ్యాంగం అన్ని కులాలను సమంగానే చూస్తున్నప్పటికీ ఆచరణలో మనువాదం ప్రకారం పైనున్న ప్రతివారూ దిగువన ఉన్న వారిని తక్కువగా చూస్తున్నారు. వివాహాలు, కలసి భోజనం చేసేందుకు కూడా అంగీకరించటం లేదు. దాడులు చేసి చంపేస్తున్నారు. అంబేద్కర్‌ కుల నిర్మూలన జరగాలని కోరుకున్న నాటికీ ఇప్పటికీ చివరికి వివక్షకు గురవుతున్న దళితుల్లోనూ కుల ధోరణులు మరింత పెరిగాయి.ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి తాజాగా అందరికీ ఒకే దేవాలయం, ఒకే బావి, ఒకే స్మశానం ఉండాలని చెప్పారు గానీ కులం, మతం విద్వేషాలు పోవాలని కోరలేదు.


ఇప్పుడు బిజెపి ఎందుకు కులగణనకు అంగీకరించింది ? ఆయారాం గయారాం పాత మాట. నితీష్‌ ఆయా నితీష్‌ గయా అన్నది కొత్త మాట, కూటముల ఫిరాయింపులకు బ్రాండ్‌ అంబాసిడర్‌ బీహార్‌లో ఎదురీదుతున్నట్లు అర్ధమైంది, తన కులగణన సర్వే గురించి చెప్పుకోవాలంటే సిగ్గుపడే స్థితి.అన్నింటికీ మించి మోడీ సర్కార్‌ నిలిచేందుకు రెండు పంగటి కర్రలలో ఒకటి నితీష్‌. అదువలన గతంలో మోడీ కులగణన గురించి ఎంత ఠలాయించినా ఇప్పుడు కుదరదు, నితీష్‌తో పాటు బిజెపి మునగటం ఖాయం. కనుక నితీష్‌ కూడా కులగణనకు అంగీకరిస్తారా లేదా అని పట్టుబట్టినట్లు కనిపిస్తోంది. అందుకే తక్షణ ప్రయోజనంగా బీహార్‌ ఓట్ల కోసం అన్నది స్పష్టం. అయితే ఆ ఎన్నికల నాటికి గణన జరగదు, ఒక ప్రచార అస్త్రంగా మాత్రమే ఉంటుంది. మతం కార్డుతో నూటికి 80శాతంగా ఉన్న హిందువుల ఓట్లు తమకే పడతాయని ఆశించిన వారికి అంత సీన్‌ లేదని, హిందువులు అంత అమాయకంగా బిజెపి వెంటనడవరని, చివరికి అయోధ్యలో ఆ పార్టీని ఓడిరచిన తీరు, మోడీకి గణనీయంగా మెజారిటీ పడిపోవటం, గత ఎన్నికల కంటే ఓట్లు, సీట్లు తగ్గటంతో దిగజారుడు మొదలైనట్లు గ్రహించారు. కులగణన కార్డు ఎంత కాలం పని చేస్తే అంతవరకు ఉపయోగించుకోవాలని నిర్ణయించారని వేరే చెప్పనవసరం లేదు. సంఘపరివార్‌ సంస్థలలో బిసిలు పెద్ద సంఖ్యలో ఉన్నారు,హిందూత్వ భావజాలాన్ని వారిలో గణనీయంగా ఎక్కించామనే విశ్వాసం ఆర్‌ఎస్‌ఎస్‌లో కలిగి ఉండాలి, 2013 నుంచి నరేంద్రమోడీని ఓబిసిగా చూపుతూ తమది బిసిల పార్టీ అని బిజెపి ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే. అందువలన గణన జరిగినా తమ ఓట్లు పదిలంగా ఉంటాయనే అంచనాకు వచ్చి ఉండాలి, ఈ నిర్ణయానికి ముందు ప్రధానితో మోహన్‌భగవత్‌ భేటీ కూడా దాని గురించి చర్చించటానికే అన్నది వేరే చెప్పనవసరం లేదు. అయితే వారి అంచనా ప్రకారమే జరుగుతుందా ?


లెక్కతేలినంత మాత్రాన ఒరిగేది, జరిగేది ఏమిటి ? ఎవరెంత అన్న వివాదానికి తెరపడుతుంది. కొత్త డిమాండ్లు ముందుకు వస్తాయి, వాటికి రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే దళితులు, గిరిజనుల సంఖ్య ఎంతో తెలిసిందే.201112 జాతీయ నమూనా సర్వే ప్రకారం, 201516 కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం చూసినా జనరల్‌ తరగతులతో పోలిస్తే ఎస్‌సి,ఎస్‌టి,ఓబిసిలు చేస్తున్న ఖర్చు చాలా తక్కువ.జనరల్‌ తరగతుల్లో దారిద్య్రం 15.6శాతం ఉంటే గిరిజనుల్లో 50.6, దళితుల్లో 33.3, ఓబిసీల్లో 27.2శాతాల చొప్పున దారిద్య్రంలో ఉన్నట్లు తేలింది. విద్య, ఉద్యోగాలు, చట్టసభలు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఉపశమనం తప్ప అసమానతలు, దారిద్య్రాన్ని తగ్గించే సాధనాలు కాదని తేలిపోయింది. ముస్లింలలో కూడా దారిద్య్రం ఎక్కువగానే ఉంది. కులగణన తరువాత ఈ పరిస్థితిని మార్చేందుకు పథకాలేమైనా ఉంటే ఉపయోగం, లేకుంటే ఎప్పటికాలు ఇట్టిట్టే ! దాని గురించి ఎలాంటి ప్రకటన లేదు. దళితుల వర్గీకరణ న్యాయసమ్మతమే అయినప్పటికీ ఒకే తరగతిగా ఉన్నపుడు లబ్ది పొందిన సామాజిక తరగతులు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అదే విధంగా ఓబిసి వర్గీకరణ డిమాండ్‌ కూడా ఉంది, దాన్ని చేసేందుకు మోడీ సర్కార్‌కు చెమటలు పడుతున్నాయి. రోహిణీ కమిషన్‌ వేసి అనేకసార్లు గడువు పొడిగించి నివేదిక రాకుండా చూసినప్పటికీ 2023 ఆగస్టులో ఇచ్చిన నివేదికను ఇంతవరకు బహిర్గత పరచలేదు.


బ్రిటీష్‌ పాలనా కాలంలో 1881 నుంచి 1931వరకు కులగణన జరిగింది.అణగారిన తరగతుల ఉద్దరణకు గాక విభజించి పాలించు అనే ఎత్తుగడతో ఆ లెక్కలను తీసిందన్నది స్పష్టం. దాని పర్యవసానాలలో ముస్లింలను వేరుగా సంఘటిత పరచేందుకు ముస్లిం లీగ్‌ ఆవిర్భావం ఒకటి. మద్రాస్‌ ప్రావిన్స్‌లో కులాల వారీ కోటాల నిర్ణయానికి దారితీసింది.దేశంలో దళితుల కోసం ద్విసభ్య నియోజకవర్గాలూ, తరువాత రిజర్వేషన్లూ దాని ఫలితమే. కులగణన జరిగితే సామాజిక విభజనకు దారి తీస్తుందని,అణగారిన తరగతులకు సంక్షేమ పథకాలను అమలు జరిపి ఉద్దరించాలనే వైఖరితో దళితులు, గిరిజనులకు తప్ప 1951 నుంచి నెహ్రూ సర్కార్‌ కులగణన నిలిపివేసింది.అయితే నాటి నుంచి నేటి వరకు చూస్తే అలాంటి ఉద్దరణ జరగకపోగా కొంత మంది దగ్గర సంపద పోగుపడటం, ముఖ్యంగా 1990 దశకం నుంచి ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాల అమలు తరువాత కనిపిస్తున్నది. గత పదేండ్లలో దాని తీవ్రత మరింత పెరిగింది. అందుకే తిరిగి కులగణన, రాజకీయ, ఆర్థిక సాధికారత సామాజిక న్యాయ డిమాండ్లు ముందుకు వచ్చాయి.1931 తరువాత జరిగిన మార్పుల్లో వివిధ తరగతుల జనాభా పొందికలో అనేక మార్పులు వచ్చాయి. మొత్తంగా జనాభా పెరుగుదల తగ్గినప్పటికీ ఇతరులతో పోల్చినపుడు భూమి, ఆస్థి కేంద్రీకృతమైన వారిలో సంతానోత్పత్తి గణనీయంగా తగ్గింది. ఇప్పుడు బిసిల జనాభా 52శాతమని చెబుతున్నవన్నీ అంచనా లేదా 1931 లెక్కల ప్రాతిపదికన చెబుతున్నవి మాత్రమే.వచ్చే జనాభా గణనలో లెక్కలు తేలిన తరువాత తలెత్తే కొత్త సమస్యలను ఇప్పుడే ఊహించటం, వ్యాఖ్యానించటం తొందరపాటు అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d