• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Kashmir problem

కాశ్మీరుపై నమ్మలేని నిజం, వాస్తవాలు : పాకిస్తాన్‌కు అప్పగించటానికి అంగీకరించిన వల్లభాయ్‌ పటేల్‌ !

30 Friday May 2025

Posted by raomk in BJP, Congress, Current Affairs, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

Annexation of Hyderabad, BJP, Facts vs Myths, Jammu and Kashmir, Jawaharlal Nehru, Kashmir problem, Narendra Modi Failures, Pakistan-Occupied Kashmir, POK, RSS, Sardar Vallabhbhai Patel

ఎం కోటేశ్వరరావు


ఆక్రమిత కాశ్మీరు(పిఓకె)ను పూర్తిగా స్వాధీనం చేసుకొనే వరకు యుద్ధాన్ని ఆపకూడదని నాటి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చెప్పిన అభిప్రాయాన్ని నాటి ప్రధాని నెహ్రూ అంగీకరించలేదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఆమోదించి ఉంటే పహల్గామ్‌ దారుణం జరిగి ఉండేది కాదని మే 27వ తేదీన గుజరాత్‌ పర్యటనలో చెప్పిన మాటలకు మీడియా పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించింది. కాశ్మీరును ఆక్రమించుకొనేందుకు నాటి ముజాహిదిన్‌ దాడుల కొనసాగింపే పహల్గామ్‌ ఉదంతం అని మోడీ వర్ణించారు. నెహ్రూ నాడు యుద్ధాన్ని మధ్యలోనే ఆపివేసి చారిత్రక తప్పిదం చేశారని సంఘపరివార్‌ సంస్థలలో ఒకటైన బిజెపి పదే పదే చెబుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిపిన ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగించి ఆక్రమిత కాశ్మీరును విముక్తి చేయకుండా నరేంద్రమోడీ సర్కార్‌ వచ్చిన మంచి అవకాశాన్ని విడిచిపెట్టిందని జనం భావిస్తున్నారు. కనీసం ఉగ్రవాదుల మీద పాకిస్తాన్‌ నుంచి ఎలాంటి హామీ పొందకుండా సిందూర్‌ను నిలిపివేసిందని తీవ్ర అసంతృప్తి, విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మోడీ జనం దృష్టిని మళ్లించేందుకు వల్లభాయ్‌ పటేల్‌ మాటున రక్షణ పొందినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గుడ్డిగా నమ్మేవారుంటే అది తాత్కాలికమే, వారు ఒకసారి కళ్లు తెరిస్తే నాన్నా పులి కథే. చివరికి నిజం చెప్పినా నమ్మరు.


కాశ్మీరు సమస్యను ఇరుదేశాలు పరిష్కరించుకోవాలన్నది సిమ్లా ఒప్పంద స్ఫూర్తి.దాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్‌ పాలకులు చిత్తశుద్దితో పనిచేసి పరిష్కరించలేదన్నది ఒక విమర్శ. వాస్తవమే, మరి బిజెపి చేసిందేమిటి ? జనతా పార్టీలో అది భాగస్వామి, వాజ్‌పాయి విదేశాంగ మంత్రిగా పని చేశారు. తరువాత ప్రధాని అయ్యారు. పదకొండు సంవత్సరాలుగా నరేంద్రమోడీ ఏలుబడి సాగుతున్నది. బిజెపి, దాని పూర్వ రూపమైన జనసంఫ్‌ు కాశ్మీరు సమస్యను ఓట్ల కోసం వాడుకోవటం తప్ప ఆక్రమిత కాశ్మీరును సాధించేందుకు మనదేశం వైపు నుంచి చేసిన ఒక్క ప్రయత్నాన్ని చూపమనండి. ఎందుకంటే ఆ సమస్య అలానే రావణకాష్టంలా కాలుతూ ఉండాలి. నెహ్రూ, కాంగ్రెస్‌ల మీద విమర్శలు చేస్తూ ఓట్లు దండుకొనేందుకు వినియోగించుకోవాలన్నది తప్ప బిజెపి చిత్తశుద్ది ఏమిటి ? 1994లోనే పార్లమెంటు ఆక్రమిత కాశ్మీరు మనదే అనే తీర్మానాన్ని కూడా ఆమోదించింది. మాకు అధికారమిస్తే పిఒకెను చిటికెలో వెనక్కు తీసుకువస్తాం అని తుపాకి రాముడు కబుర్లు చెప్పటం తప్ప పదకొండు సంవత్సరాల్లో ఒక్క అడుగువేసింది లేదు. ఆపరేషన్‌ సిందూర్‌తో వచ్చిన మంచి అవకాశాన్ని ట్రంప్‌ బెదిరిస్తే వెనక్కు తగ్గినట్లుగా జనం అనుకుంటున్నందున ముఖం మీద చెప్పకపోవచ్చుగానీ బిజెపి కబుర్లను ఇంకేమాత్రం నమ్మేస్థితి లేదు. దుకాణదారులు గోడమీద అప్పు రేపు అని రాసినట్లుగా రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ మరోమారు గురువారం నాడు అదే చెప్పారు. పిఓకెను మనకు పాక్‌ అప్పగించకపోతే ఏం చేస్తారో ఎప్పుడు చేస్తారో చెప్పాలన్న ప్రశ్నలకు సూటిగా చెప్పకుండా తెస్తాం అంటే మరో 75 ఏండ్లు ఆగాలని అర్ధమా !


పాకిస్తాన్‌లో భాగమైన తూర్పు బెంగాల్‌( నేటి బంగ్లాదేశ్‌)లో తలెత్తిన 1971 తిరుగుబాటును నాడు మనదేశం చక్కగా వినియోగించుకొని పాకిస్తాన్లోని ఒక ముక్కను విడగొట్టి ఒక తలనొప్పిని వదిలించుకుంది. నాడు పాకిస్తాన్‌కు మద్దతుగా అమెరికా మనలను బెదిరించేందుకు బంగాళాఖాతంలోకి తన సప్తమ నౌకాదళాన్ని దింపింది. అయినా ఖాతరు చేయకుండా ముందుకు పోవటమే కాదు, సోవియట్‌తో రక్షణ సంధి చేసుకున్నాం. మనకు మద్దతుగా తాను రంగంలోకి దిగాల్సి ఉంటుందనే సందేశం వెలువడటంతో అమెరికా వెనక్కు తగ్గింది. ఇప్పుడు పహల్గాం రూపంలో వచ్చిన అవకాశాన్ని నరేంద్రమోడీ ఎందుకు వినియోగించకోలేదు ? అన్నింటి కంటే ట్రంప్‌ జోక్యం లేదా బెదిరింపులతో వెనక్కు తగ్గి ఏమీ సాధించకుండానే పాకిస్తాన్‌తో రాజకీ కుదుర్చుకున్నట్లు జనం భావిస్తున్నారు. లేదూ పాక్‌ కోరికతో మనమే రాజీపడ్డామని చెబుతున్నారు, దాని ప్రకారమే అయినా ఏం సాధించారని సంధికి అంగీకరించారు. ఇప్పుడు కూడా రష్యాతో రక్షణ ఒప్పందం ఉంది అయినా 56 అంగుళాల ఛాతీ ధైర్యం చేయలేకపోయింది.


నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్లే కాశ్మీరుపై పటేల్‌ వైఖరిలో రెండూ ఉన్నాయి. పత్రికలు చదివేవారూ, టీవీలు చూసే ప్రతి ఒక్కరు చరిత్రలో ఏం జరిగిందనే శోధన చేయరనే గట్టి విశ్వాసంతో తమకు కావాల్సిందాన్నే కొందరు చెబుతారు.2018 ఫిబ్రవరి ఏడవ తేదీన ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో మాట్లాడుతూ ‘‘ సర్దార్‌ పటేల్‌ గనుక భారత తొలి ప్రధాని అయి ఉంటే మొత్తం కాశ్మీరు మనదే అయి ఉండేది ’’ అని చెప్పారు.కానీ అదే పటేల్‌కు అసలు కాశ్మీరు గురించి ఆసక్తి ఉందా ? ఉంటే నాటి రక్షణ మంత్రి బలదేవ్‌ సింగ్‌కు అలా లేఖ రాసేవారా ? కల్నల్‌ కటోచ్‌ను కాశ్మీరులో నియమించాలని, ఒకవేళ కాశ్మీరు గనుక వేరేదేశం(పాకిస్తాన్‌)లోకి వెళ్లిపోతే అతన్ని తిరిగి మనదేశానికి తీసుకురావాలని నరేంద్రమోడీ పుట్టక ముందే 1947 సెప్టెంబరు 13న లేఖ రాశారు. అది ఇంటర్నెట్‌లో అందరికీ అందుబాటులో ఉంది.


1947 ఆగస్టుఅక్టోబరు మధ్య తొలిసారిగా భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం జరిగింది. అనేక మంది చరిత్రకారులు, విశ్లేషకులు రాసినదాన్ని బట్టి కాశ్మీరును రాబట్టుకోవాలా లేదా అనే అంశంలో నెహ్రూ, పటేల్‌ మధ్య గందరగోళం ఉంది. కనుకనే సెప్టెంబరులో పటేల్‌ అలా లేఖరాశారన్నది స్పష్టం. పటేల్‌ వైఖరి గురించి నరేంద్రమోడీ నోరు విప్పక ముందే అనేక మంది తమ రచనల్లో చర్చించారు. అవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎవరికి వారు స్వంత అభిప్రాయాలకు రావచ్చు. 1984లో రాజేంద్ర శరీన్‌ ‘‘పాకిస్తాన్‌ ద ఇండియా ఫాక్టర్‌ ’’ అనేపేరుతో రాసిన పుస్తకంలో అనేక అంశాలను చర్చించారు. అబ్దుల్‌ రాబ్‌ నిష్తార్‌ అనే పాకిస్తాన్‌ మంత్రితో పటేల్‌ సంభాషిస్తూ ‘‘ భాయ్‌ హైదరాబాద్‌, జునాఘడ్‌ల గురించి మాటలొద్దు, కాశ్మీరు గురించి చెప్పండి, కాశ్మీరును తీసుకోండి సమస్యను పరిష్కరించండి ’’ అని చెప్పినట్లుగా పేర్కొన్నారు. మౌంట్‌బాటన్‌ పాక్‌ ప్రధాని లియాకత్‌ అలీతో భేటీ అయినపుడు పాక్‌ రాజ్యాంగపరిషత్‌ సభ్యుడు సర్దార్‌ షౌకత్‌ హయత్‌ కూడా ఉన్నాడు. పాకిస్తాన్‌ గనుక హైదరాబాద్‌ను వదులు కుంటే దానికి బదులుగా కాశ్మీరును భారత్‌ ఇస్తుందని మౌంట్‌బాటన్‌ పటేల్‌ సందేశంగా లియాకత్‌ అలీకి చెప్పాడు. దాని మీద సంభాషణల్లో ‘‘ సర్దార్‌ సాహెబ్‌ మీకేమైనా మతిపోయిందా పంజాబ్‌ కంటే పెద్దదైన ప్రాంతాన్ని మనం ఎందుకు వదులుకోవాలి, దానికి బదులుగా కొన్ని పర్వతాలున్న దాన్ని ఎందుకు తీసుకోవాలి ’’ అన్నాడు. అంతే కాదు రాజేంద్ర శరీన్‌ పుస్తకంలో ఇంకా ఏమి ఉటంకించిదీ చూద్దాం.1947 జూన్‌లో కాశ్మీరు రాజు హరిసింగ్‌తో మౌంట్‌బాటన్‌ భేటీ అయ్యాడు. ఆ సందర్భంగా మౌంట్‌బాటన్‌ మాట్లాడుతూ ‘‘ మీరు పాకిస్తాన్‌తో కలవదలచుకుంటే భారత్‌ దాన్ని ఒక తప్పుగా భావించదు, ఆ మేరకు సర్దార్‌ పటేల్‌ స్వయంగా గట్టి హామీ ఇచ్చారు ’’ అని చెప్పినట్లు నాడు పటేల్‌ రాజకీయ కార్యదర్శిగా ఉన్న వి శంకర్‌ ( సర్దార్‌ పటేల్‌తో నా జ్ఞాపకాలు 1974 ) అనేపుస్తకంలో రాశారు.‘‘ కాశ్మీరు పాలకుడు ఒకవేళ తాను, తన రాజ్యానికి పాకిస్తాన్‌తో కలవాలనే ఆసక్తి ఉంటే ఆ దారికి నేను అడ్డుపడను ’’ అని పటేల్‌ అన్నట్లుగా కూడా శంకర్‌ రాశారు.


కాశ్మీరు గనుక పాకిస్తాన్‌ వైపు వెళ్లాలని ఎంచుకుంటే దాని నిర్ణయాన్ని నేను నిరాక్షేపణీయంగా అంగీకరిస్తానని పేర్కొన్నారు. నిజంగా పటేల్‌ ప్రధాని అయివుంటే అన్నంత పనీ చేసి ఉండేవారు కాదా ! ఈ విషయాన్ని అదే పటేల్‌ ఉపప్రధానిగా ఉన్నపుడు ప్రభుత్వ కార్యదర్శిగా పని చేసిన విపి మీనన్‌ నిర్ధారించారని 1990లో ప్రచురితమైన ‘‘ పటేల్‌ ఏ లైఫ్‌( పటేల్‌ జీవితం ) అనే గ్రంధంలో మహాత్మాగాంధీ మనవడు, చరిత్రకారుడు రాజ్‌మోహన్‌ గాంధీ రాశారు. అదే విషయాన్ని మౌంట్‌బాటన్‌ అప్పుడే మహమ్మదాలీ జిన్నాకు కూడా చేరవేశారు. అంతే కాదు కాశ్మీరు స్వతంత్ర దేశంగా ఉన్నప్పటికీ దాన్ని వ్యతిరేకించబోమని చెప్పినట్లు కూడా మౌంట్‌బాటన్‌ చెప్పాడు. కాశ్మీరును తీసుకొని దాని బదులు జునాఘడ్‌, హైదరాబాద్‌ సంస్థానాలను మనం తీసుకోవాలన్నది పటేల్‌ వైఖరి. అయితే మూడు సంస్థానాలూ తమకే కావాలనే దురాశతో జిన్నా దానికి ఒప్పుకోలేదు. ఒకవేళ అంగీకరించి ఉంటే……
స్వాతంత్య్రం వచ్చిన సమయంలో సంస్థానాలు ఏ దేశంలో విలీనం కావాలో నిర్ణయించుకొనే స్వేచ్చను ఇచ్చారు. అది తప్పా ఒప్పా అంటే దానికి పటేల్‌ కూడా నాడు అంగీకరించారు. గట్టిగా పటేల్‌ అడ్డుపడి ఉంటే అసలు సమస్యే ఉండేది కాదు, కాశ్మీరు ఆక్రమణకు గురయ్యేదే కాదు. హైదరాబాద్‌ సంస్థానం, కాశ్మీరు స్వతంత్ర దేశాలుగా ఉంటామని ప్రకటించుకోగా జునాఘడ్‌(ప్రస్తుత గుజరాత్‌ రాష్ట్రంలో ఉంది) పాకిస్తాన్‌తో చేరాలని నిర్ణయించుకుంది.కాశ్మీరులో అత్యధికులు ముస్లింలు కాగా పాలకుడు హిందూ రాజు, జునాఘడ్‌, హైదరాబాదులో అత్యధికులు హిందువులు కాగా పాలకులు ముస్లింలు. పటేల్‌కు ఆ నాటికే ముస్లింలంటే పడదో లేక దేశవిభజనకు కారకులయ్యారనే కోపమో ఏమో హైదరాబాద్‌, జునాఘడ్‌లను వదులుకొనేది లేదు, కావాలంటే కాశ్మీరును పాకిస్తాన్‌ తీసుకుంటే వ్యతిరేకించం అని చెప్పినట్లు కనిపిస్తోంది. తరువాత పటేల్‌ వైఖరిలో మార్పు వచ్చిందంటే దానికి కారణం కాశ్మీరు గురించి నెహ్రూ ఇతర నేతలు గట్టిగా నిలవటం, పాకిస్తాన్‌ దురాక్రమణకు పూనుకోవటమే. కాశ్మీరు హిందూ రాజు స్వతంత్ర దేశమంటూ నాటి బ్రిటన్‌, అమెరికా పన్నిన కుట్రలో భాగంగా హడావుడి చేస్తే అక్కడి జనం ముస్లింలు మాత్రం నేషనల్‌ కాన్ఫరెన్సు నాయయకుడు షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో భారత్‌లో విలీనాన్ని కోరుకున్నారు. ఆ కారణంగానే మూడొంతుల కాశ్మీరు మనలో విలీనమైంది. దక్షిణాసియాలో అమెరికా, బ్రిటన్‌ చెప్పుచేతల్లో ఉండే పాకిస్తాన్‌, దానికి మరో స్వతంత్ర దేశంగా కాశ్మీరుకూడా తోడు కావటాన్ని నాటి సోవియట్‌,చైనా తదితర సమీప దేశాలేవీ అంగీకరించలేదు. అదే జరిగి ఉంటే ఎలాంటి ముప్పు వచ్చి ఉండేదో సిక్కిం అనుభవం తరువాత తెలిపింది.

చైనాభారత సరిహద్దులో సిక్కిం మనదేశంలో విలీనం కాలేదు. రాచరిక దేశంగా ఉంది. అక్కడ పాగా వేసేందుకు రాజుకు అమ్మాయిలను ఎరవేసి తనవైపు తిప్పుకోవాలని అమెరికా చేసిన యత్నాన్ని నాటి ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వంలోని యంత్రాంగం వమ్ముచేసింది. భారత్‌లో విలీనానికి అవసరమైన కథనడిపి విజయవంతమైంది.ప్రజాభిప్రాయం మేరకు 1975లో మన దేశంలో విలీనమైంది. లేకుంటే హిమాలయాల్లో అమెరికా తొత్తు దేశంగా ఇజ్రాయెల్‌ మాదిరి మనకూ, చైనాకూ సమస్యలను తెచ్చిపెట్టి ఉండేది. కాశ్మీరు సమస్యను ఐరాసకు తీసుకువెళ్లి జవహర్‌లాల్‌ నెహ్రూ పెద్ద తప్పుచేశారన్నది బిజెపి ఆరోపణ. తప్పో ఒప్పో జరిగిపోయింది. అలా తీసుకువెళ్లినందుకు నిరసనగా వల్లభాయ్‌ పటేల్‌ ఎందుకు రాజీనామా చేయలేదు ? అంటే ఆ నిర్ణయానికి ఆయన కూడా అంగీకరించినట్లే, కనుక నెహ్రూనే బాధ్యుడిని చేయటం వక్రీకరణ.భద్రతా మండలి ఒక తీర్మానం చేయాలని 1948 జనవరి ఒకటిన భారత్‌ కోరింది. దాని మీద అదే ఏడాది ఏప్రిల్‌ 21న 47వ నంబరు తీర్మానాన్ని ఆమోదించారు. దాని ప్రకారం ఉభయ దేశాలూ కాల్పుల విరమణ పాటించాలి. ఇతర ప్రాంతాల నుంచి పోరాటానికి వచ్చిన గిరిజనులు, పాక్‌ పౌరులు, ఇతరులు కాశ్మీరు నుంచి వెళ్లిపోవాలి.భారత ప్రభుత్వం తన ఆధీనంలోని ప్రాంతాలలో మిలిటరీని కనీస స్థాయికి తగ్గించాలి. తద్వారా పాకిస్తాన్‌, భారత్‌ ఏ దేశంలో చేరేదీ నిర్ణయించేందుకు ప్రజాభిప్రాయ సేకరణకు వీలు కల్పించాలి.అది 1949 జనవరి ఒకటి వరకు జరగలేదు. ఈలోగా ఐరాస కమిషన్‌ మూడుసార్లు కాశ్మీరు సందర్శించింది. పరిస్థితి మీద ప్రభావితం చూపే విధంగా కాశ్మీరులో పాకిస్తాన్‌ మార్పులకు పాల్పడిరది. అందువలన ముందుగా పాక్‌ తన మిలిటరీ, పౌరులను అక్కడి నుంచి ఉపసంహరించాలి.తరువాత భారత్‌ వెనక్కు తీసుకోవాలి. ఆ తరువాత ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని 1948 ఆగస్టులో కమిషన్‌ భద్రతా మండలికి నివేదించింది. దీన్ని మనదేశం అంగీకరించగా పాక్‌ తిరస్కరించింది. చట్టబద్దంగా కాశ్మీరు మనదేశంలో విలీనమైంది, అంటే పాక్‌ మిలిటరీ, అది మద్దతు ఇచ్చిన వారు కాశ్మీరులో ఉండటం అంటే శత్రుపూరిత చర్య, దురాక్రమణకు పాల్పడటమే, ప్రజాభిప్రాయ సేకరణ అంటే విలీనాన్ని నిర్ధారించేందుకు తప్ప అంతకు ముందే అన్ని లాంఛనాలు పూర్తయినట్లు మనదేశం వాదించింది. అయితే ఇతర దేశాలతో ఒప్పందం చేసుకొనే ముందు తొలుత తమతో కాశ్మీరు ప్రభుత్వం యథాతధస్థితి (కాశ్మీరు అంతకు ముందు మాదిరే ఉండేట్లు ) ఒప్పందం చేసుకుందని, కాశ్మీరు పౌరులు తిరుగుబాటు చేశారని, మహరాజు పారిపోయినందున అతగాడికి ఒప్పందం చేసుకొనే హక్కులేదని పాకిస్తాన్‌ వాదించింది. విముక్త కాశ్మీరు ఆందోళనలు, గిరిజనుల తిరుగుబాట్లు వాటికవే పుట్టినవి తప్ప వాటికి తమ మద్దతు గురించి విమర్శకు తావేలేదన్నది. ముందు పాకిస్తాన్‌ తన దళాలను ఉపసంహరించుకోవాలని భారత్‌ అంటే మేము తప్పుకున్న తరువాత భారత్‌ వైదొలుగుతుందన్న గ్యారంటీ ఏమిటి అంటూ పాకిస్తాన్‌ అడ్డం తిరిగింది. అంతే, తరువాత జరిగిందేమీ లేదు.బంగ్లా విముక్తి తరువాత 1972లో ఇరుదేశాలు పరస్పరం చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని సిమ్లా ఒప్పందంలో నిర్ణయించటంతో ఐరాస పాత్రకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పటి వరకు వాజ్‌పాయి, నరేంద్రమోడీ ఎవరు ఏలుబడిలో ఉన్నప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ చేసిందేమీ లేదు.

హైదరాబాద్‌ సంస్థాన విలీనం గురించి ఎందుకు పటేల్‌ అంతగట్టిగా పట్టుబట్టారనటం ఆసక్తి కలిగించే అంశం. దేశం మధ్యలో మరొక దేశం లేదా పాకిస్తాన్‌ ప్రాంతం ఉండటం అంటే కడుపులో కాన్సరే అని పటేల్‌ వర్ణించాడు. అది వాస్తవమే. మరొక కారణాన్ని కూడా కొట్టి పారవేయటానికి లేదు. నైజాం నవాబు మీద స్వాతంత్య్రానికి ముందు నుంచే కమ్యూనిస్టులు పాలనకు వ్యతిరేకంగా సాయుధపోరాటం చేస్తున్నారు. చైనాలో దీర్ఘకాలం సాగిన కమ్యూనిస్టుల లాంగ్‌ మార్చ్‌ మాదిరి భారత్‌లో కూడా నైజాం సంస్థానం మారితే ప్రమాదకరమని నెహ్రూ ప్రభుత్వాన్ని సిఐఏ హెచ్చరించిందని చెబుతారు. ఆపరేషన్‌ పోలో నాలుగు రోజుల్లోనే ముగిసింది కానీ తరువాత నెహ్రూపటేల్‌ సైన్యాలు కమ్యూనిస్టుల మీద మూడు సంవత్సరాల పాటు అణచివేతకు పాల్పడ్డాయి. నైజాం నవాబు, వాడితో చేతులు కలిపిన జాగీర్దార్లు, దేశముఖల కంటే మిలిటరీ ఎక్కువ మంది కమ్యూనిస్టులను చంపింది, ఒక్క తెలంగాణాలోనే కాదు, దానికి మద్దతు ఇచ్చిన ఆంధ్రప్రాంతంలో కూడా వందలాది మందిని పొట్టన పెట్టుకుంది. పాకిస్తాన్‌ వైపు నుంచి కాశ్మీరు ఆక్రమణకు పూనుకోవటం, భారత్‌లో విలీనానికి రాజు హరిసింగ్‌ అంగీకరించటం, కేంద్ర ప్రభుత్వం సైన్యాలను పంపిన తరువాత పటేల్‌ వైఖరిలో మార్పు రావటం అనివార్యం. ఉక్కు మనిషి, పట్టిన పట్టు వదలడు కదలడు అని పటేల్‌ గురించి చెబుతారు. కానీ నరేంద్రమోడీ చెప్పినట్లుగా ఆక్రమిత కాశ్మీరును విముక్తి చేసేంత వరకు యుద్ధం కొనసాగించి ఉండాల్సిందనే వైఖరి మీద గట్టిగా పట్టుబట్టినట్లుగానీ, దానికి తిరస్కరించిన నెహ్రూతో విబేధించి మంత్రివర్గం నుంచి బయటకు రావటం గానీ ఎక్కడా మనకు కనిపించదు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంలో 1949 జనవరి ఒకటి నుంచి రెండుదేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. పటేల్‌ కుమార్తె మణిబెన్‌ రాసిన డైరీలలో 1949 జూలై 23నమోదు చేసినదాని ప్రకారం ‘‘ మనం మొత్తం ప్రాంతం కావాలని కోరుతున్నాం… మొత్తం కాశ్మీరు కోసం పోరు సాగించాలి’’ అని ఉన్నట్లు బిజెపి నేత తరుణ్‌ విజయ్‌ రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. దానిలో నెహ్రూ నా మాట వినలేదు అనే భావం ఉందా ? అది కూడా యుద్దం ముగిసిన ఆరు నెలల తరువాత నిజంగానే నెహ్రూ వినలేదు అని చెప్పినందువలన ప్రయోజనం ఏముంది ? అంత పట్టుదలగల వ్యక్తి నిజంగా దేశానికి నష్టం జరిగిందని భావిస్తే రాజీనామా చేసి ఉండాలి. అటూ ఇటూ కాందిశీకులుగా వెళ్లిన వారు స్వస్థలాలకు వచ్చి తమ ఆస్తులను విక్రయించుకొనేందుకు వీలు కల్పించే ఒప్పందాన్ని నెహ్రూ పాకిస్తాన్‌తో చేసుకున్నారనే కారణంతో నిరనస తెలిపి వాణిజ్యశాఖ మంత్రిపదవికి శ్యామప్రసాద ముఖర్జీ రాజీనామా చేసి బయటకు వచ్చారు. తరువాత వెంటనే జనసంఘాన్ని ఏర్పాటు చేశారు. దానికే అంత పట్టుదల ఉంటే మరి ఉక్కు మనిషి పటేల్‌కు కీలకమైన కాశ్మీరు విషయంలో నెహ్రూతో విబేధాలు ఉంటే ఎందుకు బయటకు రానట్లు ? అందువలన కాశ్మీరు సమస్య మీద పటేల్‌ అసలు వైఖరిని వదలి నెహ్రూ మీద మరోసారి దాడి చేసేందుకు, తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.పోనీ నెహ్రూ, తరువాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఆక్రమిత కాశ్మీరు గురించి పట్టించుకోలేదని విమర్శిస్తున్న కాషాయ దళాలు తాము అమితంగా ప్రేమించే వల్లభాయ్‌ పటేల్‌ వాంఛను తీర్చాలనే చిత్తశుద్ది ఉంటే కబుర్లు కాదు, కార్యాచరణను ప్రారంభించాలి,యావత్‌ ప్రతిపక్షం, పౌరులూ సంపూర్ణ మద్దతు ఇస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతీయ వాదం అంటే నాడు వుత్తేజం, నేడు వున్మాదం !

10 Sunday Mar 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion, Uncategorized

≈ Leave a comment

Tags

370 article, Aricle 370 myths and facts, article 35A, Hindutva nationalism, Kashmir problem, nationalism then and now, nationalism then inspiration now frenzy

Image result for nationalism india

ఎం కోటేశ్వరరావు

అడవారి మాటలకు అర్ధాలే వేరులే అని సినీ కవి చెప్పిన సందర్భం ఏదైనా కావచ్చు, మహిళలకు ఆ లక్షణాన్ని ఆపాదించటం గౌరవం ఇచ్చే వర్ణన కాదు. అయితే అలా అన్నవారి మీద మహిళలు వుడుక్కున్నారేమోగాని ఎక్కడా దాడులు జరిపినట్లు తెలియదు. ఇప్పుడు దేశంలో అనేక పదాలకు అర్దాలనే మార్చివేస్తున్నారు.కాదన్నవారిని వాదనల్లో ఖండించటం ఒక పద్దతి, భౌతిక దాడులకు తెగబడటమే ప్రమాదకరం. యుద్దం వద్దు అనటం, ఇరుగుపొరుగు దేశాలతో సామరస్యం కోరుకోవటం దేశద్రోహం, యుద్ధం కోరుకోవటం, రెచ్చగొట్టటం దేశభక్తి. పరమతం వారి మీద ద్వేషం వెలిబుచ్చటం దేశభక్తి, ప్రేమించకపోతే మానే వారి మానాన వారిని వుండనివ్వమనటం దేశద్రోహం. హిందుత్వమే ఇండియా, ఇండియా అంటే హిందుత్వమే కాదన్నవారి సంగతి చూస్తాం అనే బెదిరింపులు. ఒక నాడు జాతీయ వాది అంటే వుత్తేజానికి మారుపేరు. నేడు జాతీయ వాది అంటే వున్మాదానికి చిరునామా ! 1947ఆగస్టు 15 ముందు, తరువాతకు ఎంత తేడా ! కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించిన ఆర్టికల్‌ 370ని వ్యతిరేకించిన వారు జాతీయవాదులు, సమర్ధించిన వారు దేశద్రోహులు. అంటే ఎప్పటి నుంచో వున్న ప్రత్యేక రక్షణలు, సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు కోరి మన దేశంలో విలీనానికి కారకుడైన షేక్‌ అబ్దుల్లా ఇప్పటి నిర్వచనం ప్రకారం దేశద్రోహి. కాశ్మీర్‌ విలీనాన్ని వ్యతిరేకించి, స్వతంత్రరాజ్యంగా వుంటామని ప్రకటించిన నాటి కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌(తరువాత తప్పనిసరై అంగీకరించటం వేరే విషయం), ఆయనకు మద్దతు తెలిపిన ఆర్‌ఎస్‌ఎస్‌ వారు దేశభక్తులు. చరిత్ర తెలియకపోతే కొత్త తరాలు ఇదే నిజమనుకొనే ప్రమాదం వుంది.

భారత్‌ విభజనకు నిర్ణయం జరిగిపోయింది. ఆ సమయానికి జమ్మూ కాశ్మీర్‌ బ్రిటీష్‌ వారి సార్వభౌమత్వానికి లోబడిన ఒక స్వయంప్రతిపత్తి కలిగిన ఒక సంస్ధానం.షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్సు పార్టీ కాశ్మీర్‌ సంస్ధానం భారత్‌లో విలీనం కావాలని కోరింది. రాజు హరిసింగ్‌ స్వతంత్రంగా వుంటామని ప్రకటించాడు. 1947 నవంబరులో ఏర్పడిన ఆల్‌జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ పార్టీ ( అంతకు ముందు ఆల్‌జమ్ము అండ్‌ కాశ్మీర్‌ రాజ్య హిందూ సభ పేరుతో పని చేశారు) రాజు హరిసింగ్‌ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తాము మద్దతుగా వుంటామని ప్రకటించింది. అంటే కాశ్మీరు వేర్పాటు వాదానికి సై అన్నట్లే కదా ! ఈ పార్టీని ఏర్పాటు చేసిన అపర దేశభక్తులు ఎవరంటే ఇంకెవరు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బలరాజ్‌ మధోక్‌ మహాశయుడే. అదే ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన జనసంఘ్‌తో అది వారే వీరుగా కలసి పని చేసింది, చివరకు 1963లో విలీనమైంది. నాటి కాంగ్రెస్‌ నాయకత్వం మన దేశంలో కాశ్మీర్‌ విలీనానికి అనుకూలంగా వున్న షేక్‌ అబ్దుల్లాతో మాట్లాడటం అంటే అబ్దుల్లా ఆ రాష్ట్రంలో అధికారానికి రావటమే కనుక అది ఆమోదంగాని ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘం మొదటి నుంచి కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్‌ను రాజ్యాంగంలో చేర్చటానికి మొదటి నుంచి వ్యతిరేకించింది తప్ప వేరే ఇతర కారణాలేమీ లేవు. ఆర్‌ఎస్‌ఎస్‌ షేక్‌ అబ్దుల్లాను వ్యతిరేకించటం వెనుక ముస్లిం విద్వేషంతో పాటు అది భూస్వాముల పక్షంలో వుండటం కూడా ఒక కారణం. కాశ్మీర్‌ సంస్ధానంలో భూస్వాములలో అత్యధికులు హిందువులే. షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్సు భూసంస్కరణలు అమలు జరపాలని కూడా కోరింది. అదేగనుక అధికారంలోకి వస్తే తమ భూములు ఎక్కడ పోతాయోనని భూస్వాములకు ప్రాతినిధ్యం వహించే కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ స్వతంత్రరాజ్యంగా వుంటామని చెప్పిన రాజు హరిసింగ్‌కు మద్దతు ఇచ్చింది. పాకిస్దాన్‌ గిరిజనుల ముసుగులో కాశ్మీర్‌ ఆక్రమణకు ఎప్పుడైతే పూనుకుందో అప్పుడు విధిలేని స్ధితిలో రాజు హరిసింగ్‌ కేంద్ర ప్రభుత్వ సాయం కోరాడు. దానికి అనుగుణంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా తన వైఖరి మార్చుకుంది. అయితే భారత్‌లో పూర్తిగా విలీనం కావటానికి మద్దతు ఇస్తాం తప్ప కమ్యూనిస్టులు ఎక్కువగా వున్న షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని డోగ్రా(హిందువులు) వ్యతిరేక ప్రభుత్వానికి తాము వ్యతిరేకమని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బలరాజ్‌ మధోక్‌ అన్నాడు. దానికి అనుగుణ్యంగానే షేక్‌ అబ్దుల్లా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 1949లో కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ ఆందోళనలు చేపట్టింది.ఎలాంటి షరతలు లేకుండా కాశ్మీరును దేశంలో విలీనం చేయాలని కోరింది. 1951లో ఏర్పాటయిన జనసంఘ్‌కు కాశ్మీరులో ప్ర జాపరిషత్‌ అనుబంధం అయింది. దాని డిమాండ్‌ మేరకు జనసంఘం కూడా కాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని ప్రారంభం నుంచీ వ్యతిరేకించింది. దాని వారసురాలు బిజెపి కనుక అదే డిమాండ్‌ను వదలకుండా పట్టుకుంది. 1963వరకు కాశ్మీర్‌లో జనసంఘం శాఖను ఏర్పాటు చేయలేదు. కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ పేరుతోనే కధ నడిపించారు.

కాశ్మీర్‌కు ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తే ఏమౌతుంది అని ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం, దాని ప్రచారాన్ని వెనుకా ముందు ఆలోచించకుండా బుర్రకు ఎక్కించుకున్న అమాయకంగా ప్రశ్నిస్తారు. వారికి ఒకటే సూటి ప్రశ్న వుంటే జరిగే నష్టం ఏమిటి, వున్నందువలన దేశానికి జరిగిన ఇప్పటి వరకు జరిగిన నష్టం ఏమిటి అంటే వారివద్ద కుంటిసాకులు తప్ప సరైన సమాధానం లేదు. రాజ్యాంగంలో కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక ఆర్టికల్స్‌, రక్షణలు కేవలం కాశ్మీర్‌కు మాత్రమే వున్నాయా ?

కాశ్మీర్‌కు వర్తించే ఆర్టికల్‌ 35ఏ అమలును సవాలు చేస్తూ చారు వాలి ఖన్నా అనే మహిళ పిటీషన్‌ దాఖలు చేశారు. తాను రాష్ట్ర నివాసినే అయినప్పటికీ తన పిల్లలు జమ్మూకాశ్మీరులో ఇల్లు కొనుక్కోవటానికి అవకాశం లేదని, ఇది కాశ్మీర్‌ మహిళల పట్ల వివక్ష కాదా అన్నది ఆమె ప్రశ్న. కాశ్మీరీ పండిట్‌ అయిన చారు వాలి ఖన్నా సుప్రీం కోర్టులో న్యాయవాది.కాశ్మీరేతర వ్యక్తిని వివాహం చేసుకొని ఢిల్లీలో స్ధిరపడ్డారు. తాను కాశ్మీరులోనే జన్మించినప్పటికి ఇప్పుడు అక్కడ ఇల్లు కొనుక్కోవటానికి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టిందని ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కు విరుద్దమని వాదిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో అమలులో వున్న ఆర్టికల్‌ 35ఏ ప్రకారం శాశ్వత నివాసుల జాబితాలో వున్నవారే ప్రభుత్వ వుద్యోగాలు చేయటానికి, ప్రభుత్వ లేదా ప్రభుత్వ సాయం పొందే విద్యా సంస్ధలలో చేరటానికి, భూమి, ఇతర ఆస్ధులను కొనుగోలు చేయటానికి అర్హులు. 1954రాష్ట్రపతి వుత్తరువుల ద్వారా ఇతరులకు హక్కులను నిషేధించారు. శాశ్వత నివాసి అయిన కాశ్మీరీ మహిళ వేరే రాష్ట్రానికి చెందిన పురుషుడిని వివాహం చేసుకుంటే ఆమె శాశ్వత నివాస అర్హత రద్దవుతుంది. కాశ్మీరీ పురుషుడిని వేరే రాష్ట్ర మహిళ వివాహం చేసుకుంటే ఆమెకు శాశ్వత నివాసి అర్హత వస్తుంది. మాజీ ముఖ్య మంత్రి ఫరూక్‌ అబ్దులా, ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా కాశ్మీరేతరులను వివాహం చేసుకున్నారు. వారి భార్యలకు శాశ ్వత నివాస అర్హత వచ్చింది. అదే ఫరూక్‌ అబ్దుల్లా కుమార్తె సారా అబ్దుల్లా కాంగ్రెస్‌ నేత రాజస్ధాన్‌కు చెందిన సచిన్‌ పైలట్‌ను వివాహం చేసుకొని అర్హతను కోల్పోయారు.

చారు వాలీ ఖన్నా, మరికొందరు ఇతరులు దాఖలు చేసిన పిటీషన్లను అన్నింటినీ కలిపి సుప్రీం కోర్టు విచారిస్తున్నది. 35ఏ ఆర్టికల్‌ను సమర్ధిస్తున్న వారు మహిళా వ్యతిరేకులని, వివక్షను సమర్ధిస్తున్నారంటూ సంఘపరివార్‌ సంస్ధలకు చెందిన వారు దాడి చేస్తున్నారు. ఈశక్తులకు నిజంగా మహిళా హక్కుల పట్ల అంతశ్రద్దే వుంటే చట్టసభలో మహిళకు మూడోవంతు రిజర్వేషన్ల గురించి గత ఐదు సంవత్సరాలలో ఎందుకు చర్యలు తీసుకోలేదు. అర్టికల్‌ 35ఏ సెక్షన్‌ రద్దు చేస్తామని బిజెపి వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఇలాంటి ఆంక్షలు, రక్షణలు అనేక రాష్ట్రాలలో వున్న అంశాన్ని వీరు విస్మరిస్తున్నారు. ఒక రాజకీయ అజెండాతో కేవలం ఈ అంశాన్నే ముందుకు తెస్తున్నారు. వుదాహరణకు 1-70 చట్టం పేరుతో వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆమోదించినదాని ప్రకారం ప్రస్తుతం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో షెడ్యూలు గిరిజన ప్రాంతాలుగా ప్రకటించిన చోట్ల గిరిజనేతరులు భూములు, ఇతర స్ధిర ఆస్ధులు కొనుగోలు చేయటానికి లేదు. చట్టం రాకముందు వున్న ఆస్ధులను అమ్ముకోవాలంటే గిరిజనులకు మాత్రమే విక్రయించాలి. ఆప్రాంతాలలోని గిరిజన యువతులు బయటి వారిని వివాహం చేసుకుంటే వారికి ఇతరులకు వర్తించే హక్కులు వర్తిస్తాయి. కానీ గిరిజన యువతులను వివాహం చేసుకున్న గిరిజనేతరులకు ఆ ప్రాంతాలలో అలాంటి హక్కులుండవు. ఇలాంటి పరిమితులే హిమచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, నాగాలాండ్‌ వంటి రాష్ట్రాలలో వున్నాయి. వాటి గురించి బిజెపి, సంఘపరివార్‌ మాట్లాడదేం. ఇదే విధంగా ప్రభుత్వ వుద్యోగాలు కూడా రాష్ట్రానికి సంబంధించిన వాటికి స్ధానికులే అర్హులు లేదా వారికి స్ధానికత అర్హత వచ్చిన తరువాతే అర్హులు అవుతారు.

హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేయబోయే ముందు హైదరాబాద్‌ రాష్ట్రానికి చెందిన వారు తమ ప్రాంతానికి రక్షణ కల్పించాలని కోరలేదా, ఆ మేరకు కల్పించిన విషయం తెలిసినదే.తమ ప్రాంతం వారు వెనుకబడి వున్నందున ముందున్న ఆంధ్రప్రాంతం వారు వుద్యోగాలను ఎక్కువగా పొందే అవకాశం వున్నందున రక్షణ కల్పించాలని కోరారు. దానికి అనుగుణంగా ముల్కీ నిబంధనలు వర్తిస్తాయని 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు అయినపుడు చెప్పారు. ముల్కీ నిబంధనల ప్రకారం పన్నెండు సంవత్సరాలు తెలంగాణాలో నివాసం వుంటే వారు స్ధానికులుగా మారిపోతారు. ఆ మేరకు 1968 నాటికి ముల్కీ నిబంధనలు రద్దయ్యే పరిస్ధితి ఏర్పడింది. తమ వారికి జరగాల్సిన న్యాయం జరగలేదని, ముల్కి నిబంధనలు రద్దవుతున్నందున న్యాయం జరగదంటూ తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే ఆందోళన ప్రారంభమైంది. ముల్కీ నిబంధనలు చెల్లుతాయని కోర్టు తీర్పు వచ్చిన తరువాత స్వంత రాష్ట్రంలో పరాయివారిగా వుండటమేమిటి ప్రత్యేక ఆంధ్రను ఏర్పాటు చేయాలంటూ 1972లో జై ఆంధ్ర ఆందోళన ప్రారంభమైంది. ప్రస్తుతం వుపరాష్ట్రపతిగా వున్న వెంకయ్య నాయుడు దాని నాయకులలో ఒకరు, రాజకీయ జీవితం దానితోనే ప్రారంభించారనే విషయం విదితమే. వుమ్మడి రాష్ట్రంలో స్ధానికులకు న్యాయం చేకూర్చేందుకు రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి వుత్తరువులతో ఆర్టికల్‌ 371డి ప్రకారం వుమ్మ డి రాష్ట్రంలో రక్షణ కల్పించి జోనల్‌ వ్యవస్ధను ఏర్పాటు చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత స్ధానికత సమస్య మరో రూపంలో ముందుకు వచ్చింది. జోనల్‌ వ్యవస్ధను రద్దు చేయాలనే ఆలోచన చేశారు. అంతకు ముందు ఆంధ్రప్రాంతం వారు తమ అవకాశాలను కొట్టివేస్తున్నారని చేసిన వాదన తెలంగాణాలో మరో రూపంలో ముందుకు వచ్చింది. అభివృద్ధి చెందిన హైదరాబాదు,వరంగల్‌,నల్లగొండ, ఖమ్మం జిల్లాల వారు వెనుకబడిన ప్రాంతాలలోని వుద్యోగావకాశాలను తన్నుకుపోయే అవకాశం వుందనే వాదనలు బయలు దేరటంతో జోనల్‌ వ్యవస్ధను కొనసాగించక తప్పలేదు.

ముల్కీ నిబంధనలను నైజాం నవాబు 1919లో అమలులోకి తెచ్చారు. దాని ప్రకారం నాటి హైదరాబాదు సంస్ధానంలో స్ధానికులకు రక్షణ కల్పించటమే లక్ష్యం. వుర్దూలో ముల్క్‌ అంటే ఒక దేశం. ఆ దేశ పౌరులు ముల్కీలు అవుతారు. సంస్ధానం వెలుపల నుంచి వచ్చేవారి కారణంగా స్ధానికుల్లో తలెత్తిన అసంతృప్తిని తగ్గించేందుకు నవాబు ఈ ఏర్పాటు చేశాడు. ఎవరైనా హైదరాబాదు సంస్ధానంలో 15సంవత్సరాల ప్రభుత్వ సేవ పూర్తి చేస్తే వారికి జన్మి ంచేవారికి పుట్టుకతోనే సంస్ధాన పౌరసత్వం వస్తుంది. లేదా ఎవరైనా 15సంవత్సరాలు నివశించి వుంటే వారు కూడా స్ధానికులు అవుతారు. ముల్కీ అయిన వ్యక్తిని వివాహం చేసుకొంటే ఆమెకూడా ముల్కీ అవుతుంది. పదిహేను హైదరాబాదులో నివాసం వున్న వారు పర్మనెంటు ముల్కీ కావాలంటే తన స్వస్ధాలకు తిరిగి వెళ్లాలనే వాంఛను వదులు కొంటున్నట్లు అఫిడవిట్‌ కూడా ఇవ్వాల్సి వుంది. అప్పుడే ముల్కీ సర్టిఫికెట్‌ ఇచ్చేవారు. అలాంటి ముల్కీ నిబంధనలు చెల్లుబాటవుతాయని సుప్రీం కోర్టు 1972లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఇదే మాదిరి 1927కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌ స్ధానికులకు రక్షణ కల్పిస్తూ చేసిన చట్టాన్ని కొనసాగింపుగా భారత్‌లో విలీనం అయిన తరువాత కొనసాగించాలన్నది సంప్రదింపుల్లో అంగీకరించారు. నాడు హరిసింగ్‌ ఆస్దానంలో కాశ్మీరీ పండిట్లు, డోగ్రాలదే ఆధిపత్యం. తమకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో పోటీని నివారించేందుకు రాజు చేత 35ఏలో వున్న నిబంధనలను చట్టంగా చేయించారు. అప్పుడు అంగీకరించిన పండిట్లు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు ? నైజాం నవాబు ముల్కీ నిబంధనలను సమర్ధించిన సుప్రీం కోర్టు అదే పద్దతుల్లో కాశ్మీర్‌ రాజు కల్పించిన రక్షణలను ఏ ప్రాతిపదికన రద్దు చేస్తుంది.

ఇలాంటి వాటిని రద్దు చేస్తే పోలా అనే వారికి ఒక ప్రశ్న. చేయాల్సి వస్తే ఒక్క కాశ్మీర్‌ అంశాలనే ఎందుకు రద్దు చేయాలి? వుద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కూడా అలాంటివే. పదేండ్లకోసం చేసిన వాటిని వాటి లక్ష్యం ఇంకానెరవేరలేదనే కారణంగా ఇంకా కొనసాగిస్తున్నాము కదా, వీటిని కూడా అలాగే ఎందుకు పరిగణించకూడదు. చిత్తశుద్ధి వుంటే ఇలాంటి వాటన్నింటినీ కలిపి ఒక చర్చ పెడితే, వాటిమీద ఏకాభిప్రాయం వస్తే రాజ్యాంగ బద్దంగానే చేయవచ్చు. అలా జరగటం లేదే ! ఇప్పుడున్న పరిస్ధితుల్లో అది సాధ్యం అవుతుందా? వుదాహరణకు 1975 మే 16వరకు ప్రస్తుతం మన రాష్ట్రాలలో ఒకటిగా వున్న సిక్కిం ఒక రాజ్యంగా మన రక్షణలో వుంది. అక్కడి జనం రాజరికాన్ని కాదని మన దేశంలో విలీనం కావాలని కోరుకున్నారు. అందుకు అంగీకరించాము. దానికి ఒక షరతు ఏమంటే అప్పటి వరకు సిక్కింలో వున్న ప్రత్యేక రక్షణలను తరువాత కూడా కొనసాగించాలి. వాటిని ఆర్టికల్‌ 371ఎఫ్‌లో చేర్చి రాజ్యాంగాన్ని సవరించారు. ఇప్పుడు కళ్లు తెరిచిన వారు వాటిని అంగీకరించం, రద్దు చేయాలంటే ఎలా? దేశం సమగ్రంగా వుంటుందా ? ఆర్టికల్‌ 370ని సవరించి ఇప్పటికే నీరుగార్చారన్న విమర్శలున్నాయి. దానిని మరింతగా నీరుగార్చటం అంటే కాశ్మీరీల్లో అనుమానాలు, అభద్రతా భావాన్ని మరింత పెంచటమే. దాన్ని రద్దు చేసే అవకాశం లేదని తెలిసి కూడా బిజెపి నిరంతరం వ్యతిరేకంగా ప్రచారం చేయటం రెచ్చగొట్టే వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఈ అర్టికల్‌ను రద్దు చేయాలన్న ఆలోచన తమకు ఇప్పుడు లేదని ఎందుకంటే పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ లేదని రాజ్యసభలో ఒక ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. నిజానికి అంత మెజారిటీ వున్నప్పటికీ ఏ పార్టీ ప్రభుత్వానికి అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని రాజ్యాంగంలో చేర్చాలని చెప్పింది రాజ్యాంగ పరిషత్‌. అది ఇప్పుడు లేదు. అందువల్లనే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది. అందుకోసం అసలు రాజ్యాంగాన్నే రద్దు చేసి కొత్త రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేస్తే అన్న వూహాజనిత ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరు. అటు వంటి పనికి బిజెపితో సహా ఏ పార్టీ పూనుకొనే అవకాశం లేదు.

Image result for nationalism india

కాశ్మీర్‌ గురించి అనేక వక్రీకరణలు ప్రచారంలో వున్నాయి. వాటిలో కొన్నింటి తీరుతెన్నులను చూద్దాం.

ద్వంద్వ పౌరసత్వం: ఇది వాస్తవం కాదు, ముందే చెప్పుకున్నట్లు 35ఏ నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రానికి చెందిన కొన్ని ప్రత్యేక రక్షణల కోసం శాశ్వత నివాసులు అని కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశారు తప్ప అది పౌరసత్వం కాదు.వారు కూడా భారత పాస్‌పోర్టులనే కలిగి వుంటారు.

ప్రత్యేక రాజ్యాంగం: ఇది పాక్షిక సత్యం, ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక చట్టాలు చేసుకోవటానికి ఆర్టికల్‌ 370 అనుమతించింది. అందువలన రక్షణ, విదేశీవ్యవహారాలు, సమాచార రంగాలను వర్తింప చేయటానికి ఆ రాష్ట్ర అనుమతి అవసరం లేదు. మిగిలిన అంశాలను వర్తింప చేయాలంటే రాష్ట్రశాసనసభ అనుమతి అవసరం. మన రాజ్యాంగంలో రాష్ట్రాలు, కేంద్ర అధికారాలతో పాటు వుమ్మడి జాబితా కూడా వున్న విషయం తెలిసిందే. రాష్ట్రాల అధికారాలకు సంబంధించి దేనికది ప్రత్యేక చట్టాలు చేసుకొనేందుకు ఏరాష్ట్రానికి అయినా హక్కుంది. వుమ్మడి అంశాలపై రాష్ట్రాల ఆమోదం అవసరం అన్న విషయం తెలిసిందే.

ప్రత్యేక, రాజ్యాంగం, జెండా : నిజమే, ఆర్టికల్‌ 370 ప్రకారం ప్రత్యేక రాజ్యాంగాన్నే ఏర్పాటు చేసుకొనే హక్కు దానికి వుంది.అది భారత రాజ్యాంగపరిధిలోనే వుంటుంది. ఆ రాష్ట్ర శాసనసభ కాలపరిమితి ఆరు సంవత్సరాలు, 1972లో ప్రత్యేక జండాను అధికారికంగానే ఏర్పాటు చేశారు. దేశంలో అనధికారికంగా సిక్కిం, కర్ణాటలకు ప్రత్యేక జండాలు వున్నాయి. ఒక దేశంలో వుంటూ ప్రత్యేక రాజ్యాంగాలను కలిగి వుండటమంటే అర్ధం స్వతంత్ర దేశాలని కాదు. బ్రిటీష్‌ వారి కౌలు గడువు ముగిసిన తరువాత తిరిగి చైనాలో విలీనమైన హాంకాంగ్‌కు ప్రత్యేక రాజ్యాంగాన్ని అనుమతించారు. అలాగే పోర్చుగీసు కౌలు గడువు ముగిసిన తరువాత చైనాలో విలీనమైన మకావో దీవులకు కూడా ప్రత్యేక పాలనా మండలి వుంది. చైనాలో విలీనమైనా చైనా చట్టాలు అక్కడ వర్తించవు. మన దేశంలో సిక్కిం విలీన సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఏ రాష్ట్రంలోనూ లేని ప్రత్యేక రక్షణలు కల్పించారు. అక్కడ అసెంబ్లీలో 32 స్ధానాలున్నప్పటికీ ప్రాదేశికంగా 32వ నియోజకవర్గం లేదు. సంఘ పేరుతో వున్న దానిలో సిక్కింలోని బౌద్ధ ఆరామాలలో వున్న సాధువులు దాని ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఆర్టికల్‌ 371ఎఫ్‌ ప్రకారం భుటియా, లెపాచా వంటి గిరిజన సామాజిక తరగతులకు అసెంబ్లీలో ప్రత్యేక సీట్లను కేటాయించారు. ఏ తరగతికి కేటాయించిన సీట్లలో వారే పోటీ చేయాల్సి వుంటుంది. మిగతా రాష్ట్రాలలో ఎక్కడా ఫలానా సామాజిక తరగతికి మాత్రమే ఆయా సీట్లలో పోటీకి అర్హత అనేది లేదు. వుదాహరణకు షెడ్యూలు కులాలు, తరగతులకు ఇన్ని సీట్లు, ఏఏ సీట్లు అనేది నిర్ణయం అవుతుంది తప్ప, వాటిలో ఏ కులం వారు పోటీ చేయాలనే అంశం లేదు.

జాతీయ చిహ్నాలను అవమానించటం నేరం కాదు: ఇదొక అవాస్తవం, 1971లో పార్లమెంట్‌ చేసిన చట్ట ప్రకారం జాతీయ చిహ్నాలైన జెండా, జాతీయ గీతం, రాజ్యాంగాన్ని దేశంలో, దేశం వెలుపల భారతీయ పౌరులు అవమానించటం నేరపూరితం. ఏ దైనా ఒక చట్టం కాశ్మీర్‌కు వర్తించనట్లయితే దాని పీఠికలోనే ముందుగా జమ్మూ కాశ్మీర్‌ మినహా అని వుంటుంది. పైన పేర్కొన్న చట్టానికి అలాంటిది లేదు. అలాగే సుప్రీం కోర్టు, కాగ్‌ పరిధి ఆ రాష్ట్రానికి వర్తించదు అనేది కూడా వాస్తవం కాదు.

బయటి వారు భూములు కొనుగోలు చేయకూడదు : ఇంతకు ముందే చెప్పినట్లు దేశంలో అనేక చోట్ల అలాంటి ఆంక్షలు వున్నాయి.1846లో జమ్మూకు చెందిన డోగ్రా రాజు గులాబ్‌ సింగ్‌ బ్రిటీష్‌ వారితో చేసుకున్న అమృతసర్‌ ఒప్పందం ప్రకారం అక్కడి భూమిని బయటి వారెవరూ కొనుగోలు చేయకూడు. భారత్‌లో విలీన సమయంలో అంతకు ముందు ఆ ప్రాంతాలలో వున్న చట్టాలను కొనసాగించాలన్నది షరతు. ఆ మేరకు ఇప్పుడు కూడా బయటి వారెవరూ భూములు కొనుగోలు చేయటానికి లేదు.

బయటి పెట్టుబడులను 370 ఆర్టికల్‌ అడ్డుకుంటున్నది: 1927 ఏప్రిల్‌26న కాశ్మీర్‌ రాజు జారీ చేసిన నోటిఫికేషన్‌లో రాష్ట్రానికి ఆర్ధిక లబ్ది చేకూరేట్లయితే దీనికి మినహాయింపు వుంటుందని పేర్కొనటం పెట్టుబడులకు అవకాశం కల్పించటమే కదా ! భూముల కొనుగోలుకు సంబంధించి అసోంలోని కొండ ప్రాంతాల్లో నిషేధాలు వున్నాయి. నాగాలాండ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చిన ఆర్టికల్‌ 371ఏ, అరుణాచల్‌ ప్రదేశ్‌కు ఇచ్చిన 371హెచ్‌, సిక్కింకు 371ఎఫ్‌, మిజోరాంకు 371జి ప్రకారం ప్రత్యేక హోదా రక్షణలు వున్నాయి. బిజెపి వాటన్నింటినీ ప్రస్తావించకుండా కాశ్మీర్‌నే ఎందుకు ముందుకు తెస్తున్నది. ముస్లింలు మెజారిటీ వున్నారనా ?

పాకీస్తానీని వివాహం చేసుకుంటే : కాశ్మీరీ శాశ్వత నివాసి అయిన ఒక యువతి వేరే రాష్ట్రానికి చెందిన వారిని వివాహం చేసుకుంటే శాశ్వత నివాస హక్కు రద్దవుతుంది, అదే పాకిస్తానీని చేసుకుంటే కాదు అన్నది ఒక తప్పుడు ప్రచారం. భారత రాజ్యాంగం ప్రకారం ద్వంద్వ పౌరసత్వం లేదు. పాక్‌ యువకుడు కాశ్మీర్‌ లేదా ఇతర భారత రాష్ట్రాల యువతులను వివాహం చేసుకుంటే వారికి పాక్‌ సౌత్వం వస్తుంది తప్ప పాక్‌ యువకులకు మన పౌరసత్వం రాదు. చట్టంలో శాశ్వత నివాసి అన్న పదానికి స్త్రీ, పురుష తేడా లేదు. అయితే పాలనాపరమైన నిబంధనల ప్రకారం మహిళలకు వివాహమయ్యేంత వరకు వుంటుంది. కాశ్మీరీనే వివాహం చేసుకుంటే శాశ్వతనివాస హోదా కొనసాగుతుంది.అదే వేరే రాష్ట్రాల వారిని చేసుకుంటే రద్దవుతుంది. అయితే 2004లో అలా రద్దు కావటానికి ఎలాంటి చట్టబద్దత లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. దాన్ని చెల్లకుండా చేసేందుకు కాశ్మీర్‌ అసెంబ్లీ అదే ఏడాది ఒక బిల్లును ఆమోదించింది. అయితే వివిధ కారణాలతో అది ఇంకా చట్ట రూపం దాల్చలేదు.

కాశ్మీర్‌ మహిళలు షరియత్‌ చట్టం కింద వున్నారు: ఇది వాస్తవం కాదు, కాశ్మీరీ ముస్లిం మహిళలే కాదు దేశంలోని యావత్తు మహిళలు ఆయా మతాల వ్యక్తిగత చట్టాల కిందనే వున్నారు.

హిందు, సిక్కు మైనారిటీలకు రిజర్వేషన్‌ లేదు:2011 జనాభా లెక్కల ప్రకారం కాశ్మీర్‌లో 68.31శాతం ముస్లింలు, 28.43శాతం హిందువులు ఇతరులందరూ 3.26శాతం వున్నారు. హిందువులను మైనారిటీలుగా ఎక్కడా గుర్తించలేదు.2005 రాష్ట్ర రిజర్వేషన్‌ చట్టం ప్రకారం వెనుబడిన ప్రాంతాల(తరగతులు కాదు) వారికి 20, షెడ్యూలు తరగతులకు 10, షెడ్యూలు కులాలకు 8, మాజీ సైనికులకు 6, వికలాంగులు 3, వాస్తవాధీన రేఖ సమీపంలో వుండే వారికి 3, వెనుకబడిన తరగతులకు 2 శాతం చొప్పున రిజర్వేషన్లు వున్నాయి. మత ప్రాతికన ముస్లింలకు రిజర్వేషన్లు వద్దంటున్న వారు కాశ్మీర్‌లో హిందువులు, సిక్కులకు మత ప్రాతిపదికన రిజర్వేషన్‌ లేదనటం గమనించాల్సిన అంశం. దేశంలో ఎక్కడా లేని విధంగా వెనుకబడిన ప్రాంతాల వారికి అంటే కుల మత ప్రసక్తి లేకుండా రిజర్వేషన్‌ కలిగించటం ఇక్కడ మాత్రమే వుంది.

మన మాపుల్లో చూపుతున్న ప్రాంతాలన్నీ మన ఆధీనంలో లేవు. కాశ్మీర్‌లోని కొంత భాగం పాకిస్ధాన్‌ ఆక్రమణలో వుంది, మరికొంత ప్రాంతం చైనా కింద వుంది. అరుణాచల్‌ తమదే అని చైనా అంటున్నది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాల్సి వుంది. ఇప్పుడున్న ఆర్టికల్‌ 370ను తొలగిస్తే తలెత్తే చట్టపరమైన సమస్యలు, సంక్లిష్టతల గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాలలో తీవ్ర ఆందోళనలకు కారణమైన విషయం తెలిసిందే. అది అసోం ఒప్పందాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అందువలన గతంలో ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలను విస్మరించి కేవలం ఓట్ల దృష్టితో బిజెపి తన నిర్ణయాన్ని రుద్దేవందుకు పూనుకుంది. వ్యతిరేకతను గమనించి ఆ బిల్లును మురిగిపోయేట్లు చేసింది. అందువలన కాశ్మీర్‌తో సహా ఈ పూర్వరంగంలో ఇప్పటి పీటముడులను విప్పటమే ఒక సమస్యగా మన ముందున్నపుడు వాటిని మరింతగా బిగిసేట్లు, కొత్త ముడులు వేసేందుకు ప్రయత్నించటం నిజమైన దేశభక్తులు, జాతీయ వాదులు చేయాల్సిన పని కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Statement of the All Party Delegation on Kashmir

08 Thursday Sep 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Political Parties

≈ Leave a comment

Tags

All Party Delegation on Kashmir, Kashmir, Kashmir problem

The Union Home Minister Shri Rajnath Singh today chaired the follow-up meeting of the All Party delegation that visited Jammu and Kashmir on September 04-05, 2016.

Following is the statement of the All Party delegation after the follow-up meeting:

“The members of the All Party Parliamentary Delegation have expressed serious concerns of the prevailing situation in the State of Jammu and Kashmir. The members of the delegation are of the opinion that there is no place for violence in a civilized society. There can be no compromises on issue of National Sovereignty.

The members appeal to the people of the state to shun the path of Violence and resolve all the issues through dialogue and discussion. The members requested the central and state government to take steps for a dialogue with all stake-holders. The members asked the Central and State Government to take steps to ensure that educational institutions, Government offices and Commercial establishments start functioning normally at the earliest. They requested the government to take effective steps to ensure security for all citizens and provide medical treatment to citizens and security personnel injured in the agitation.”

Share this:

  • Tweet
  • More
Like Loading...

CPI(M) and CPI On the Current Events in the Kashmir Valley

04 Sunday Sep 2016

Posted by raomk in CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Article 370, CPI, CPI(M), India-Pakistan, Kashmir, Kashmir problem, Kashmir Valley, Left parties

The CPI(M)  General Secretary Sitaram Yechury  and the CPI General Secretary S.Sudhakar Reddy have issued the following statement On the Current Events in the Kashmir Valley

The state of Jammu & Kashmir has been a part of India ever since the
accession of the state to the Indian Union in October 1947. Throughout the
chequered history of the past six decades, Kashmir has been not just a
territorial dispute for India but a test of the secular, democratic and
federal nature of the Indian Republic.

For the past nearly two months Kashmir has been in turmoil.  Since the
killing of Burhan Wani, a Hizbul Commander, the people in the Valley have
been out on the streets in mass protests. More than 70 people have died in
the firing by the security forces and a few thousand have been injured. Two
security personnel have also lost their lives. Pellet guns used by the
security forces have blinded and maimed many.  Instead of quelling the
protesters, it only intensified with each death and injury in police firing.
The main force driving these protests are the youth. These mass protests
that have spread into rural Kashmir, graphically illustrate the deep sense
of alienation of the people from the Indian State. At no time has the gulf
between India and the Kashmiri people been so wide. This serious situation
calls for an examination of the entire Kashmir problem.

The consistent stand the Left parties have been taking is that Jammu &
Kashmir has a special status which was reflected in the adoption of Article
370 of the Indian Constitution. At the heart of the matter lies how in
letter and spirit its autonomy and special status, eroded over the years,
can be restored. A political agreement must be reached, which should be
acceptable to the people whereby the state of Jammu & Kashmir would remain
as part of the Indian Union but by fulfilling the commitment, made to the
state and the people in 1948.

The entire geo-political situation has changed in the post-independence
decades. A solution to the Kashmir problem has also the dimension of India
and Pakistan discussing to settle long standing disputes.

These immediate steps must begin by taking certain confidence building
measures:

*       The first of these must be the immediate cessation of the use of
pellet guns.
*       Secondly, withdraw the AFSPA and the army from the civilian areas.
*       Thirdly, order a judicial enquiry into all instances of excesses
committed by the armed forces against civilians.
*       Fourthly, adequate compensation to all families who have suffered
loss of lives and rehabilitation of the injured by ensuring their means of
livelihood must be undertaken immediately.
*       Fifthly, time bound projects for economic development and employment
generation, including transfer of Dulhasti and Uri power projects; opening
of an IIM and IIT in Srinagar.

Further, the initiation of the political dialogue must not be based on any
preconditions.  The earlier recommendations of the various working groups
and the report of the team of interlocutors appointed after the visit of the
all party delegation in 2010 following the then disturbances must be kept in
consideration.

The Left parties suggest the following necessary steps at for arriving
towards a political solution in the current concrete circumstances:

a.    The internal dialogue with all stakeholders in Jammu & Kashmir should
proceed on the basis reversing the erosion of Article 370. The three regions
of the state, Jammu, the valley and Ladakh, should have autonomous
structures within the State of Jammu & Kashmir. This will entail changes in
the constitutional and legal scheme which can begin by revising the existing
orders and laws. Ultimately, a fresh political framework should emerge.

b.    The second dimension is the India-Pakistan factor. Since 2014 India
has been adopting a blow hot-blow cold policy towards a comprehensive
dialogue with Pakistan. This Government of India had announced that this
dialogue will also deal with the question of Kashmir, the government must
carry forward this process safeguarding India’s interests and ensure that
Pakistan is brought to the discussion table.

The people in the rest of the country are being fed various stereotypes
about the Kashmiri people. Kashmiris are being depicted as secessionists,
terrorists and pro-Pakistan. This must be put to an end. Reports of attacks
on Kashmiri youth in other parts of the country must be immediately
investigated and culprits punished.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d