• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: June 2020

రైతాంగ ఆదాయాల రెట్టింపు ఓ ప్రహసనం !

13 Saturday Jun 2020

Posted by raomk in AP NEWS, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

doubling the farmers income, doubling the farmers income in India a farce, Farmers in India


ఎం కోటేశ్వరరావు
తమ ప్రభుత్వం నిర్ణయించిన వ్యవసాయ పంటల కనీస మద్దతు ధర ప్రపంచ మార్కెట్‌కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్గరీ చెప్పారు. అరవై లక్షల టన్నుల పంచదార ఎగుమతికి కేంద్రం మరో ఆరువేల కోట్ల రూపాయల మేర సబ్సిడీ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల వరకు మనకు బియ్యం, గోధుమ మిగులు ఉంటుందని వాటిని నిల్వ చేసుకొనేందుకు స్దలం కూడా లేదని అన్నారు. ప్రస్తుతం ఆరు- ఏడులక్షల కోట్ల రూపాయల మేరకు చమురు దిగుమతి చేసుకుంటున్నామని, ప్రస్తుతం ఇరవై వేల కోట్ల రూపాయల విలువగల ఇథనాల్‌ తయారు చేస్తున్నామని దాన్ని లక్ష కోట్ల రూపాయలకు పెంచనున్నట్లు తెలిపారు. ఏటా 90వేల కోట్ల రూపాయల విలువగల ఖాద్య తైలాలను దిగుమతి చేసుకుంటున్నామని, అందువలన చమురు గింజల ఉత్పత్తి కూడా పెంచాలన్నారు. అమెరికా, బ్రెజిల్‌ దేశాలలో 30, 27-28 క్వింటాళ్ల మేరకు సోయా బీన్స్‌ దిగుబడి ఒక ఎకరానికి వస్తుండగా మన దేశంలో 4.5క్వింటాళ్లకు మించి లేదన్నారు.
దీనిలో మొదటిది అతిశయోక్తి లేదా ఆధారం లేని అంశం. ఏ దేశంలో ఎంత ఇస్తున్నారో మంత్రి చెప్పి వుంటే దానికి విశ్వసననీయత ఉండేది.రెండవది రైతాంగానికి మద్దతు ధర వేరు, గిట్టుబాటు ధర వేరు. మంత్రి చెప్పినట్లుగానే సోయా విషయాన్నే తీసుకుంటే అమెరికా కంటే మన రైతాంగానికి మద్దతు ధర ఎక్కువ ఇచ్చినా గిట్టుబాటు కాదు,ఎందుకంటే అమెరికాలో ఆరు రెట్లు దిగుబడి ఎక్కువ. అందువలన అక్కడ ధర తక్కువ ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చే ఇతర సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుంటే మన రైతుకంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. మూడు సంవత్సరాల వరకు బియ్యం, గోధుమలు మిగుల్లో ఉంటాయని చెప్పినందుననే ఈ ఏడాది రైతాంగానికి క్వింటాలు ధాన్యానికి కేవలం 53 రూపాయలు మాత్రమే మద్దతు ధర పెంచారు.రానున్న మూడు సంవత్సరాలలో కూడా ఇంతకు మించి ఎక్కువ పెంచే అవకాశం ఉండదనేందుకు ఈ వ్యాఖ్యలు ఒక సూచిక అని చెప్పవచ్చు. ఒక వేళ అనూహ్యంగా మధ్యంతర ఎన్నికలు వస్తే అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కరోనా వైరస్‌ ఆర్ధిక రంగంలో కలిగించే విపత్కర పరిస్ధితి ఆ వైపు నెట్టదని చెప్పలేము.
కుండలో కూడు కుండలోనే ఉండాలిాపిల్లాడు మాత్రం లడ్డులా తయారు కావాలన్నట్లుగా రైతుల పరిస్ధితి ప్రస్తుతం తయారైంది. గత ఆరు సంవత్సరాలుగా పెరుగుదల లేని ఒకే మొత్తం సబ్సిడీ. యూరియాకు మాత్రమే సబ్సిడీ ఇస్తాం. మిశ్రమ ఎరువుల ధరలు పెరిగితే ఉన్నదాన్నే సర్దుతాం తప్ప మాకు సంబంధం లేదు, మేము ఇవ్వాలనుకున్న మేరకే సబ్సిడీ ఇస్తాం లేదా తగ్గిస్తాం తప్ప పెంచేది లేదు. కనీస మద్దతు ధరలను ముష్టి మాదిరి విదిలించి 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తాం. స్ధూలంగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలివి.
డిఏపి, ఎంఓపి, ఎన్‌పికె వంటి ఎరువులకు సబ్సిడీని తగ్గిస్తున్నాం, మంచం పొట్టిదైతే కాళ్లు నరుక్కోవాల్సిందే తప్ప వేరే ఏర్పాటు చేయలేం, వర్తమాన ఆర్ధిక సంవత్సరానికి మిశ్రమ ఎరువులకు రూ.22,186 కోట్ల రూపాయలనే సబ్సిడీగా ఇస్తాం, దాంతో సర్దుకోవాల్సిందే ఈ విషయం మీకు ముందే చెబుతున్నాం అన్నట్లుగా ఏప్రిల్‌ మూడవ వారంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా మీడియా పెద్దగా వార్తలివ్వలేదు, జనం కూడా పట్టించుకోలేదు. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఆర్ధిక వ్యవహారాల కాబినెట్‌ కమిటీ ఈ నిర్ణయం చేసింది.
వ్యవసాయంలో ఎరువుల ప్రాధాన్యత గురించి పదే పదే చెప్పుకోనవసరం లేదు. అయితే ఏ పంటకు, ఏనేలలో ఏ ఎరువు ఎంత వేయాలనేది మాత్రం నిరంతరం చెప్పుకుంటూ ఉండాల్సిందే. లేనట్లయితే, నేల ఆరోగ్యం దెబ్బతింటుంది, పంట దిగుబడుల మీద ప్రతికూల ప్రభావాలు పడతాయి. గడచిన ఐదు దశాబ్దాల చరిత్రను చూస్తే మన వంటి వర్ధమాన దేశాల సాగులో ఎరువుల సబ్సిడీ ఒక ప్రధాన పాత్ర వహించింది. దాన్ని తగ్గిస్తే అది చిన్న,సన్నకారు రైతుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ధనిక దేశాల వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించేందుకు వాటి సాధనాలుగా ఉన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్ధలు వర్దమాన దేశాలకు రుణాలు కావాలంటే వ్యవసాయ సబ్సిడీలను రద్దు చేయాలనే ఒక షరతును 1980దశకంలో ముందుకు తెచ్చాయి. దొడ్డిదారిన ధనిక దేశాలు ఇచ్చే సబ్సిడీల గురించి మాట్లాడవు.
కరోనా వైరస్‌ నేపధ్యంలో వ్యవసాయ రంగం ఎలా ఉంటుందో తెలియని అనిశ్చితి ఏర్పడింది.ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలోకి జారిపోతోందని ప్రపంచ బ్యాంకుతో సహా అన్ని సంస్ధలూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. కరోనాకు ముందే దేశ వ్యవసాయరంగం కుదేలైంది. గత ఆరు సంవత్సరాలుగా వ్యవసాయ రంగ అభివృద్ధిలో మెరుగుదల లేదు, గిడసబారిపోయింది, ఈ ఏడాది కూడా అంతకు మించి పెరుగుదల ఉండదు, మూడుశాతం ఉంటుందని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది. యుపిఏ పాలనా కాలంలో దాదాపు పన్నెండుశాతం కనీస మద్దతు ధరలు పెరిగితే బిజెపి ఏలుబడిలో నాలుగున్నరశాతానికి మించి లేవు.
వివిధ దేశాలలో వ్యవసాయానికి పెద్ద ఎత్తున సబ్సిడీలను కొనసాగిస్తున్నారు. ఈ విషయమై ధనిక దేశాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు ఇంతవరకు ముగియ లేదు, ఒక కొలిక్కి వస్తాయనే ఆశలేదు. వ్యవసాయ సబ్సిడీలపై ధనిక దేశాల మధ్య పడిన చిక్కుముడే దీనికి కారణం. ప్రపంచం మరోసారి తీవ్ర ఆర్ధిక సంక్షోభానికి గురైతే అసలు ప్రపంచ వాణిజ్య సంస్దే కుప్పకూలినా ఆశ్చర్యం లేదు. దోహా చర్చలు ఇంకా ముగియ లేదు కనుక అటు ధనిక దేశాలు తమ రైతాంగానికి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నాయి. మరోవైపు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ సంస్దల ద్వారా వర్ధమాన దేశాల్లో సబ్సిడీల రద్దు లేదా నామమాత్రం చేయటానికి వత్తిడి పెంచుతున్నాయి. ఈ పూర్వరంగంలో చైనా నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అన్నది చూద్దాం. ఎందుకంటే రెండు దేశాలు తమ జనాభాకు అవసరమైన ఆహార భద్రతను సమకూర్చాల్సి ఉంది.
మన దేశంలో సాగుకు అనుకూలమైన భూమి 156మి.హె ఉంటే చైనాలో 120 మి.హె మాత్రమే ఉంది. సాగునీరు మన దేశంలో 48శాతం సాగుభూమికి ఉంటే చైనాలో 41శాతానికి ఉంది. దీని కారణంగా మొత్తం పంటలు సాగు చేసే ప్రాంతం చైనాలో 166 మి.హె, మన దేశంలో 198మి.హెక్టార్లు ఉంటుంది. చైనాలో సాగు భూమి తక్కువగా ఉన్నప్పటికీ అక్కడి వ్యవసాయ ఉత్పత్తుల విలువ 1,367 బిలియన్‌ డాలర్లు కాగా మన విలువ కేవలం 407 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఈ విషయంలో చైనా నుంచి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా ?
రెండు దేశాలూ పురాతన నాగరికత కలిగినవే, రెండూ స్వాతంత్య్రం వచ్చే నాటికి వ్యవసాయాధారిత దేశాలుగానే ఉన్నాయి. వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధి, వినూత్న పద్దతులను కనుగొనేందుకు 2018-19లో మన దేశం 140 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే చైనాలో 780 కోట్ల డాలర్లు ఉంది. మన దేశంలో జరిపిన విశ్లేషణ ప్రకారం వ్యవసాయ పరిశోధన-విస్తరణ పధకాలకు ఖర్చు చేసే ప్రతి రూపాయికీ జిడిపిలో రూ.11.20 పెరుగుదల ఉంటుంది. వీటి మీద చేసే ప్రతి పది లక్షల రూపాయల ఖర్చుతో 328 మంది దారిద్య్రం నుంచి బయట పడవేయవచ్చు. దేశ జివిఏ(గ్రాస్‌వాల్యూయాడెడ్‌- ఒక ప్రాంతం లేదా ఒక పరిశ్రమలో ఉత్పత్తి చేసే వస్తువులు మరియు సేవల విలువ)లో మనం కేవలం 0.35శాతమే ఖర్చు చేస్తుండగా చైనా 0.8శాతం ఉంది. అందువలన పరిశోధన, అభివృద్ధి, విస్తరణకు మన దేశం చేయాల్సిన ఖర్చు పెరగాల్సి ఉంది. ఈ ఖర్చు పెంచితే రైతాంగ ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ దిశగా నరేంద్రమోడీ సర్కార్‌ చర్యలు లేవు.
నాణ్యమైన విత్తన తయారీతో పాటు ఎరువుల వినియోగం కూడా పెరుగుతుంది.2016లో ఒక హెక్టారుకు చైనాలో 503కిలోల ఎరువులు వినియోగిస్తే మన దేశంలో 166కేజీలు మాత్రమే ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇక పంటల ఉత్పాదన విషయానికి వస్తే మన దేశంతో పోల్చితే చైనాలో 50 నుంచి వందశాతం వరకు ఎక్కువగా ఉన్నాయి. రైతాంగానికి వివిధ రూపాలలో ఇచ్చే సబ్సిడీని ఇప్పుడు ఆంగ్లంలో ప్రొడ్యూసర్‌ సపోర్ట్‌ ఎస్టిమేట్స్‌(పిఎస్‌ఇ) అంటున్నారు. అనేక దేశాల్లో ఈ భావనతో రైతాంగానికి ఇచ్చే పెట్టుబడి సబ్సిడీ లేదా దానికి సమానమైన వాటిని గణిస్తున్నారు. చైనాలో 2018-19కి మూడు సంవత్సరాలలో దేశ మొత్తం వ్యవసాయ ఆదాయంలో 15.3శాతం రైతాంగానికి సబ్సిడీ రూపంలో అందింది. ఇదే కాలంలో మన దేశంలో 5.7శాతం ప్రతికూలత ఉంది. అంటే రైతాంగానికి ఇచ్చే సబ్సిడీల కన్నా వారి మీద మోపిన పన్ను తదితర భారం పెరిగింది. మన దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవటానికి ఇదొక కారణం అన్నది స్పష్టం. దీన్ని సరిదిద్దటానికి బదులు 23 రకాల పంటలకు కనీస మద్దతు ధరలను పెంచటం ద్వారా రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామనే పేరుతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నది. పోనీ ఇదైనా స్వామినాధన్‌ కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణ్యంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నదా అంటే అదీ లేదు. పెరిగిన వ్యవసాయ పెట్టుబడులను కూడా పూర్తిగా మద్దతు ధరలకు ప్రాతిపాదికగా తీసుకోవటం లేదు. కనీస మద్దతు ధరల గురించి బిజెపి ఎన్నికబుర్లైనా చెప్పవచ్చు, అంకెలు నిజాలే చెబుతాయి. 2004-14 పదేండ్ల కాలంలో యుపిఏ హయాంలో సాధారణ ధాన్యం మద్దతు ధర క్వింటాలుకు రూ.560 నుంచి 1310కి (750) పెరిగింది. అదే ఎన్‌డిఏ హయాంలో ఏడు సంవత్సరాల కాలంలో (2014-15 నుంచి 2020-21) 1310 నుంచి రూ.1868కి (558) మాత్రమే పెరిగింది. శాతాల్లో చూస్తే మొత్తంగా యుపిఏ కాలంలో 133శాతం,ఎన్‌డిఏ కాలంలో 42.5శాతమే పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరలకంటే ఎంతో ఎక్కువ మొత్తాలను చెల్లించి చైనాలో రైతుల వద్ద పంటలను కొనుగోలు చేయటంతో ప్రభుత్వానికి కొన్ని సమస్యలు వచ్చాయి. తెలంగాణాలో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తాము నిర్దేశించిన పంటలను సాగు చేస్తేనే రైతు బంధు నిధులు ఇస్తామని ఒక షరతును పెట్టింది. కేంద్ర ప్రభుత్వం నేరుగా అందచేస్తున్న నగదుకు ఎలాంటి షరతులు లేవు. చైనాలో కూడా ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రైతులకు నిధులను బదిలీ చేస్తున్న పధకాన్ని అమలు జరుపుతున్నారు. అయితే చైనాలో రైతులకు, యావత్‌ ప్రజానీకానీకానికి అమలు జరుపుతున్న ఇతర సంక్షేమ పధకాలు, అన్నింటికీ మించి రైతులకు మనకంటే రెట్టింపు దిగుబడుల కారణంగా అక్కడ వ్యవసాయ రంగంలో ఎలాంటి సంక్షోభాలు రాలేదు. అందువలన చైనా నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రధాన అంశం పరిశోధన, అభివృద్ధి, విస్తరణ ఖర్చు గణనీయంగా పెంచటమే. అది కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా చేయాల్సి ఉంది.
2022 నాటికి అంటే మన స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచే నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని 2016లో నరేంద్రమోడీ ప్రకటించారు. అంటే ఆ రోజుకు ఉన్న ఆదాయాలు రెట్టింపు అని మనం అర్ధం చేసుకోవాలి. మోడీ అవగాహన ప్రకారం కనీస మద్దతు ధరలను రెట్టింపు చేస్తే ఆదాయం రెట్టింపు అవుతుందనా లేక ఖర్చులన్నీ పోను వచ్చే మిగులు రెట్టింపు అవుతుందా అన్నది స్పష్టత లేదు. వ్యవసాయ ఖర్చులు ఒక రాష్ట్రంలోనే ప్రాంతానికి ప్రాంతానికి మారుతున్నాయి. కాలువల ద్వారా నీరు పారే ప్రాంతానికి బోర్ల ద్వారా నీటిని అందించే లేదా వర్షాధారిత చోట్లకు ఎంత తేడా ఉంటుందో తెలిసిందే. మన వ్యవసాయ వృద్ధి రేటు నిలకడగా ఉండటం లేదు. ఒక రంగంలో ఉండే జివిఏకు మరో రంగానికి పోలిక ఉండటం లేదు. ఉదాహరణకు మత్స్యరంగంలో ఏడుశాతం, హార్టీ కల్చర్‌లో 4.5, పశుసంపదలో 6శాతం ఉంది.2019 వ్యవసాయంపై క్రిసిల్‌ అధ్యయన నివేదికలో ఖరీఫ్‌ దిగుబడి మూడున్నర శాతం తగ్గుతుందని అంచనా వేసింది. అంటే రైతుల లాభం 10-12శాతం తగ్గిపోతుంది. నీతి అయోగ్‌ 2017లో రూపొందించిన పత్రంలో వార్షిక వృద్ధి రేటు 10.4శాతం ఉండాలని పేర్కొన్నది. కానీ మన సగటు మూడుశాతానికి మించటం లేదు. రైతుల ఆదాయాలను ఐదు సంవత్సరాలలో రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం తీరిగ్గా రెండు సంవత్సరాల తరువాత ముఖ్యమంత్రులతో ఒక ఉన్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేసిందంటే ఆ వాగ్దాన అమలు తీరు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశ్రద్ధ వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు తిలోదకాలు ఇస్తున్న కారణంగా గత పాతిక సంవత్సరాలలో సగం రాష్ట్రాలలో ఒక్క ఎకరానికి కూడా నీటి పారుదల సౌకర్యం అదనంగా కలిగించలేదంటే అతిశయోక్తి కాదు. కొత్త ప్రాజెక్టులు పూర్తి కాకపోవటం లేదా పాత ప్రాజెక్టులలో పూడిక పెరిగిపోవటం, కాలువల చివరి భూములకు నీరందకపోవటం వంటి కారణాలతో కొన్ని చోట్ల వాస్తవ సాగు భూమి తగ్గిందనే వార్తలు కూడా వచ్చాయి.
ప్రపంచంలోనే మన మద్దతు ధరలు ఎక్కువగా ఉన్నాయనే గొప్ప గురించి చూద్దాం. ప్రపంచ దేశాలలో ధాన్యం ధరల గురించి మనకు సమాచారం అందుబాటులో లేదు. బియ్యం ధరలను ప్రాతిపదికగా తీసుకొని పరిశీలిద్దాం. ప్రపంచంలో బియ్యాన్ని ఎగుమతి చేయటంలో మనమే ప్రధమ స్ధానంలో ఉన్నాం. మన తరువాత స్ధానాల్లో థారులాండ్‌, వియత్నాం, పాకిస్ధాన్‌ ఉన్నాయి. బియ్యాన్ని దిగుమతి చేసుకోవటంలో చైనా తొలి స్ధానంలో ఉంది. చైనా జనాభా 140 కోట్లయితే మనం 135 కోట్లు ఉన్నాం. మన దేశంలో 2019-20లో 1,17,939 వేల టన్నుల బియ్యం ఉత్పత్తి చేయగా చైనా 1,46,730 వేల టన్నులని అంచనా. మన దేశంలో ఈ మొత్తమే మూడేండ్లకు మిగుల్లో ఉండగా మన కంటే జనాభా, ఉత్పత్తి ఎక్కువగా ఉన్న చైనా దిగుమతి చేసుకుంటోంది అంటే అక్కడ కొనుగోలు శక్తి ఎక్కువ, జనం మన కంటే ఎక్కువ తింటున్నారని అర్ధం.
ఐక్య రాజ్యసమితి ఆధ్వర్యంలోని ప్రపంచ వ్యవసాయ మరియు ఆహార సంస్ద (ఎఫ్‌ఏఓ) నిర్వహించే వివరాల ప్రకారం 2015 నుంచి 2019 సంవత్సరాలలో ఒక టన్ను ఎగుమతి చేసిన బియ్యానికి మన రకాలకు వచ్చిన ధర 337 నుంచి 361 డాలర్ల మధ్య ఉంది. ఏడాది సగటు 353 డాలర్లు. ఇదే కాలంలో థారులాండ్‌ బియ్యానికి వచ్చిన సగటు ధర 392 డాలర్లు, వియత్నాం బియ్యానికి 346, పాకిస్ధాన్‌ బియ్యానికి 336 డాలర్లు ఉంది. మనం పోల్చుకోవాల్సింది మన కంటే ఎక్కువ ధర వచ్చిన థారులాండ్‌తోనా తక్కువ వచ్చిన దేశాలతోనా ? అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టే దేశీయ మార్కెట్‌ ధరలు కూడా ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు.
ఎన్నికలను గమనంలో ఉంచుకొని ఆ ఏడాది పంటలకు మద్దతు ధరలను అంతకు ముందు-తరువాత సంవత్సరాల కంటే కాస్త ఎక్కువగా పెంచిన తీరు కాంగ్రెస్‌-బిజెపి పాలన రెండింటిలోనూ గమనించవచ్చు. ఉదాహరణకు ధాన్యం, పత్తి విషయాలు తీసుకుందాం. గడచిన ఐదు సంవత్సరాలలో 2019లో ఎన్నికలకు ముందు 2015-16 నుంచి 2017-18 వరకు మూడు సంవత్సరాలలో సాధారణ రకం ధాన్యం ధర క్వింటాలుకు రూ. 1410 నుంచి 1550కి(240) పెరగ్గా 2018-19లో రూ. 1750(200) పెరిగింది. తరువాత గత ఏడాది, ఈ సంవత్సరం రెండు సంవత్సరాలకు కలిపి పెంచింది రూ. 1868కి అంటే 118 మాత్రమే. పెరుగుదల రేటు తగ్గిపోయింది. పత్తి విషయం తీసుకున్నా ఇదే ధోరణి కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో పొడవు పింజ పత్తి ధర 2016-17కు రూ.4,160 నుంచి 2017-18లో రూ.4,320(120)కి పెరగ్గా 2018-19లో రూ.5,450(230) గత ఏడాది రూ100, ఈ ఏడాది రూ. 275 పెంచారు. నాలుగేండ్లలో ఏడాది సగటు 180 మాత్రమే ఉంది. ఈ తీరును గమనించినపుడు దిగుబడులు తక్కువగానూ పెట్టుబడులు ఎక్కువగా ఉన్న సమయంలో అన్ని రకాల ఖర్చులు, పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోకుండా పెంచుతున్న మద్దతు ధరలు రైతాంగ ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయంటే నమ్మే దెలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ట్రంప్‌తో మరిన్ని కౌగిలింతల కోసం మోడీ తహతహలాడుతున్నారా !

11 Thursday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald trump, G7, G7 summit, G7 Summit in Camp David, G7 to G12


ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే మోజు తీరలేదా ? మరిన్ని కౌగిలింతల కోసం తహతహలాడుతున్నారా ? అమెరికన్లకే మోజు తీరి రోజు రోజుకూ ట్రంప్‌ పలుకుబడి తగ్గిపోతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి, అదే నిజమైతే ఓడిపోయే ట్రంప్‌తో కలసి ఊరేగేందుకు మోడీని మన పాలకవర్గాలు అంగీకరిస్తాయా ? ఒక వేళ డెమోక్రాట్లు గెలిస్తే తమకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసిన నరేంద్రమోడీతో ఎలా వ్యవహరిస్తారు ? ఏడు ధనిక దేశాల(జి7) బృందంలో చేరినంత మాత్రాన మనది ధనిక దేశంగా మారుతుందా ? ఆ బృందం ఏర్పడిన నాటి కంటే నేడు ప్రభావం తగ్గిన నేపధ్యంలో దానిలో చేరినంత మాత్రాన మనకు ఒరిగేదేమిటి? మన కంటే పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కలిగిన చైనాను పక్కన పెట్టి డోనాల్డ్‌ ట్రంప్‌ మనమీద ఎందుకు శ్రద్ద చూపుతున్నాడు? ఆ బృందాన్ని చైనా వ్యతిరేక వేదికగా చేసేందుకు ట్రంప్‌ పూనుకున్నాడన్నది బహిరంగ రహస్యం, అలాంటి దానితో చేరి చైనాతో వ్యతిరేకతను కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా ?చేరినంత మాత్రాన మనకు ఒరిగేదేమిటి ? అటు జి7, ఇటు జి20 రెండింటిలో కొనసాగితే మిగిలిన దేశాల వైఖరి ఎలా ఉంటుంది ? ఇలాంటి ఎన్నో భట్టి విక్రమార్క ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి.
1973లో తలెత్తిన చమురు సంక్షోభ పర్యవసానాలతో ఏం చెయ్యాలా అన్న ఆలోచన తలెత్తి అమెరికా చొరవతో పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సమావేశానికి అమెరికా అధ్యక్షభవనంలోని గ్రంధాలయం వేదిక అయింది. దాంతో నాలుగు దేశాలను గ్రంధాలయ బృందం అని పిలిచారు. తరువాత జపాన్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. అలా అది జి5 అయింది. తరువాత ఇటలీ, కెనడాలను చేర్చుకున్న తరువాత జి7 అయింది.1977 నుంచి ఐరోపా యూనియన్‌ను శాశ్వత ఆహ్వానితురాలిగా చేర్చారు. సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత పూర్వపు రష్యా తిరిగి ఉనికిలోకి వచ్చింది.1998లో రష్యాను చేర్చుకోవటంతో జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియాను రష్యా తనలో విలీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి దాన్ని తొలగించారు.
తిరిగి ఇప్పుడు ట్రంప్‌ ఏలుబడిలో రష్యాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, భారత్‌లను చేర్చుకోవాలని జి11గా విస్తరించాలన్న ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. ఈ బృందంలో ప్రతి ఏటా ఒక దేశం అధ్యక్ష స్ధానంలో ఉంటుంది. ఆ దేశనేత ఎవరినైనా ఆ సమావేశాలకు అతిధులుగా ఆహ్వానించవచ్చు. గతేడాది ఫ్రాన్స్‌ అదే హౌదాతో, ఇప్పుడు ట్రంప్‌ మన ప్రధాని నరేంద్రమోడీని జి7 సమావేశాలకు ఆహ్వానించారు.(2006లో రష్యా సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన సమావేశానికి మన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. మన దేశం నుంచి ప్రధాని వెంట వెళ్లిన పాత్రికేయ బృందంలో ఈ రచయిత ఒకడు) 2005 నుంచి వరుసగా ఐదు సమావేశాలకు మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. జి7ను విస్తరించాలన్న ఆలోచన ట్రంప్‌లో తలెత్తిన సరికొత్త ఆలోచన కాదు. అంతకు ముందు నుంచీ ఉన్నది. పెరుగుతున్న మన దేశ జిడిపి, మార్కెట్‌ను గమనంలో ఉంచుకొనే అంతకు ముందు లేని విధంగా మన్మోహన్‌ సింగ్‌ను, ఇప్పుడు మోడీని ఆహ్వానిస్తున్నారు.
డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనతో ప్రపంచ మీడియాలో జి7 విస్తరణ వెనుక ఉన్న రాజకీయాల గురించి చర్చ జరుగుతోంది. ఆహ్వానం అందుకున్న దేశాలు ట్రంప్‌ ఆతిధ్యం స్వీకరిస్తే ఏమిటి ? లేకుంటే ఎలా అని తర్జన భర్జన పడుతున్నాయి. ఈ బృంద ప్రస్తుత రూపానికి కాలదోషం పట్టిందని, దీన్ని మార్చాలని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో ఇది సక్రమంగా ప్రాతినిధ్యం వహించటం లేదన్నాడు. ఈ బృంద సమావేశాలలో తీసుకొనే నిర్ణయాలను విధిగా అమలు జరపాలనే నిబంధనేదీ లేదు. ఒక నాడు ప్రపంచ జిడిపిలో అత్యధిక భాగానికి ప్రాతినిధ్యం వహించిన ఈ బృందం క్రమంగా ప్రాభవం కోల్పోయింది.
జి7 విస్తరణతో అమెరికాకు ఒరిగేదేమిటి అని సిఎన్‌బిసి టీవీ విశ్లేషణ చేసింది. మిగిలిన ఆరు దేశాలలో కూడా మనకేమిటి అని, ట్రంప్‌ ప్రతిపాదిత జి7 విస్తరణ కూటమిలో చేరితే దానితో తలెత్తే ముప్పు లాభాల గురించి ప్రతి దేశంలోనూ తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో ముందుకు వచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. చైనాను కట్టడి చేసే లక్ష్యంతో జరుగుతున్న సమావేశంలో ప్రాధాన్యత లేని పాత్రధారిగా ఆస్ట్రేలియా హాజరైతే కలిగే ప్రయోజనం ఏమిటి? ఓటమి అంచుకు చేరుతున్న ఒక అధ్యక్షుడితో చేతులు కలపటం అవసరమా ? అమెరికా కనుసన్నలలో ఆస్ట్రేలియా పని చేస్తోందనే చైనా ప్రచారం మరింతగా పాదుకుపోతుంది. చైనా వ్యతిరేకతను విధిగా వ్యక్తం చేసే అమెరికా ఎన్నికల ప్రచారానికి ఆస్ట్రేలియా అండనిస్తోందనే భావం కలుగుతుంది.
ఏ దేశమైనా ఇదే ప్రాతిపదికన ఆలోచించాల్సి ఉంటుంది. నరేంద్రమోడీ ఎన్నో అడుగులు ముందుకు వేసి ఆబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అంటూ గతేడాది హూస్టన్‌లో జరిగిన హౌడీమోడీ కార్యక్రమంలో మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది అమెరికా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, డెమోక్రాట్లకు వ్యతిరేకతను వ్యక్తం చేయటమే. ఆ సభలోనే ఆహ్వానం పలికి ఈ ఏడాది అహమ్మదాబాద్‌లో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయటం దాని కొనసాగింపే. మోడీ సర్కార్‌ లేదా ఆయనకు సాయంగా ఉన్న విధాన నిర్ణేతలు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారా ? చైనాకు వ్యతిరేకంగా ఒక సంయుక్త సంఘటన ఏర్పాటు. చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్‌ కరోనా వైరస్‌ నుంచి తైవాన్‌, హాంకాంగ్‌ వరకు వివిధ అంశాలపై చైనాకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నాడు. ప్రతిదానిలో రాజకీయాలను చొప్పిస్తున్నాడు. వాణిజ్య ఒప్పందాలు, ఇరాన్‌ అణు ఒప్పందం, పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికా వైదొలగటం, ఆ నిర్ణయాలకు ట్రంప్‌ బాధ్యుడు కావటంతో గత రెండు జి7 వార్షిక సమావేశాలలో తీవ్ర సెగ తగిలింది. తనకు అనుకూలమైన దేశాలను జత చేసుకోవటం ద్వారా ట్రంప్‌ తన విమర్శకుల నోరు మూయించాలన్న ఎత్తుగడ కూటమి విస్తరణ పిలుపు వెనుక ఉంది. అమెరికా తరువాత ఈ బృందంలో పలుకుబడి కలిగిన జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజలా మెర్కెల్‌ ఈ ఏడాది అమెరికాలోని కాంప్‌డేవిడ్‌ సమావేశాలకు హాజరు కావాలని లాంఛనంగా ట్రంప్‌ స్వయంగా పలికిన ఆహ్వానాన్ని తిరస్కరించటాన్ని బట్టి విబేధాలు ఏ స్ధాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.రెండవది గతంలో రష్యాను బహిష్కరించి తిరిగి ఇప్పుడు ఏ ప్రాతిపదికన చేర్చుకోవాలని ట్రంప్‌ కోరుతున్నాడో తెలియని గందరగోళం బృందంలో తలెత్తింది. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, రష్యాలను చేర్చుకొనేందుకు బ్రిటన్‌ విముఖంగా ఉంది.
ఏ దేశమైనా తన కార్పొరేట్‌ లేదా చైనా వంటి దేశాలైతే తన ప్రభుత్వ రంగానికి ఉపయోగపడేందుకు ఇలాంటి బృందాలను వినియోగించుకొనేందుకు ప్రయత్నిస్తాయి. మన బడా కార్పొరేట్‌ శక్తులు ముందుగా బలహీనమైన దేశాలలో ప్రవేశించాలని కోరుకుంటున్నాయి. అందుకుగాను భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, అణుదేశాల క్లబ్బులో సభ్యత్వాన్ని కోరుతున్నాయనే అభిప్రాయం ఉంది. వీటి వెనుక మన దేశ భద్రతా కారణాలు కూడా ఇమిడి ఉన్నాయి. అయితే ఈ లక్ష్యాలను సాధించటం ఎలా, అందుకోసం చైనాను శత్రువుగా చేసుకోవాలా ? ఒక వేళ ఆ వైఖరితో ముందుకు పోతే అది సాధ్యం అవుతుందా అన్నవి పెద్ద ప్రశ్నలు.
ఈ నెలలో జరగాల్సిన సమావేశాన్ని సెప్టెంబరుకు వాయిదా వేయటం వెనుక ట్రంప్‌కు ఎదురైన తక్షణ సమస్యలేమిటన్నది ఆసక్తి కలిగిస్తున్నాయి. ఒకటి కరోనా వైరస్‌ తీవ్రత అమెరికాలో తగ్గే సూచనలు లేకపోవటం, ప్రపంచ నేతలు, ప్రతినిధి బృందాలు అమెరికా వచ్చేందుకు భయపడటం. తాను పాల్గొనేది లేనిదీ నిర్ధారించలేనని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రకటించటం ముఖ్యమైంది. సభ్యదేశాల నేతలందరూ హాజరు కావాల్సిందేనని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ పట్టుబట్టటం.జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ జి7 సమావేశాలకు హాజరుకాకపోవచ్చు అన్న వార్తల వెనుక తాము చైనా వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొనేందుకు సిద్దంగా లేమని, అమెరికా అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవటానికి సిద్దంగా లేమని చెప్పటంగా అర్ధం చెబుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరి ప్రయోజనాలకు అనుగుణ్యంగా వారు ఎత్తులు పైఎత్తులు వేయటం సహజం. అయితే అమెరికా ప్రయోజనాలు, రాజకీయ ఎత్తుగడలకు మన దేశాన్ని పావుగా చేసుకొనేందుకు జరుపుతున్న యత్నాలు ప్రమాదకరమైనవి. అమెరికా ప్రయోజనాలు అంటే అర్ధం అక్కడి కార్పొరేట్ల ప్రయోజనాలే ప్రధానం.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానం పలికిన ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా ప్రస్తుతం అమెరికా పాలేళ్ల వంటివి.భారత్‌, రష్యాలను ఆహ్వానించటం అంతర్జాతీయ రాజకీయాల్లో భాగం. చైనా వ్యతిరేకశక్తులను కూడగట్టటమే ప్రధాన లక్ష్యం అయితే దానిలో రష్యా భాగస్వామి అవుతుందా అన్నది ప్రశ్న. రెండు దేశాల మధ్య అనుమానాలు రేకెత్తించే ఎత్తుగడ కూడా ఉండవచ్చు. అనేక చోట్ల అమెరికాను నిలువరించటంలో రష్యా తనవంతు పాత్రను పోషిస్తున్నది. ఈ బృందంలో దాన్ని తిరిగి ఆహ్వానించటాన్ని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి కనుక తనకు ప్రయోజనమని ట్రంప్‌ భావిస్తూ ఉండాలి. ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నట్లు రష్యా అధినేత పుతిన్‌ ఇంతవరకు వెల్లడించలేదు. ఒక వేళ అంగీకరిస్తే కొన్ని దేశాల స్పందన ఎలా ఉంటుందో తెలియదు. రెండవది రష్యాను బుజ్జగించి అది ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను చూపి తమతో భాగస్వామిగా చేసుకోవచ్చన్న దూరాలోచన కూడా ఉండవచ్చు. ఒక బలమైన ప్రత్యర్ధితో దెబ్బలాటకు దిగటం కంటే సర్దుబాటు చేసుకుంటే లాభం అనుకుంటే ఎత్తుగడలు మారిపోతాయి. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న స్ధితిలో ఇలాంటి సభల కంటే దాన్ని ఎదుర్కొనేందుకే వాయిదా వేశానని చెప్పుకోవచ్చు. ట్రంప్‌ వాయిదా వేసిన సెప్టెంబరులో అయినా అసలు సమావేశాలు జరుగుతాయా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి సమావేశాలు ఉన్నాయి. నవంబరులో అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి, వాటిలో ఓటమి పాలైతే ట్రంప్‌ అసలు పాల్గొనే అవకాశాలే ఉండక పోవచ్చు.
రష్యాను తిరిగి కూటమిలోకి రావాలని ట్రంప్‌ ఆహ్వానించటం రష్యా-చైనా-అమెరికా మధ్య ఉన్న సమతూకాన్ని తీవ్రదశకు చేర్చుతాయి. అమెరికా యత్నం ఎదురుతన్నినా ఆశ్చర్యం లేదు. తన ఎన్నిక కోసం ట్రంప్‌ ఈ చర్యకు పాల్పడినట్లు కొందరు చూస్తున్నారు. ట్రంప్‌ ఆహ్వానాన్ని రష్యా పట్టించుకోకపోగా ఐరోపాయూనియన్‌, కెనడా, బ్రిటన్‌ వ్యతిరేకించాయి. ఇలాంటపుడు రష్యా హాజరయ్యే అవకాశాలు పరిమితం. అయితే క్రిమియా ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకున్న తరువాత రష్యా అటు అమెరికా, ఇటు ఐరోపా యూనియన్‌ దేశాల నుంచి ఆంక్షలు, తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నది, ఒంటరి పాటు అయింది. అమెరికాతో విబేధాలు ఉన్నప్పటికీ దాన్నుంచి బయట పడేందుకు ఇదొక అవకాశం అని రష్యా భావిస్తే జి7 సమావేశాలకు హాజరు కావచ్చు. చైనా దీన్ని సానుకూలంగానే పరిగణించవచ్చు.
ప్రస్తుతం చైనాతో ఉన్న స్నేహ సంబంధాలపై వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం గానీ, ట్రంప్‌ ఆహ్వానాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అగత్యం గానీ ప్రస్తుతానికి రష్యాకు లేదని రష్యన్‌ పరిశీలకులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోల్చితే గత రెండు దశాబ్దాలలో రష్యా-చైనా సంబంధాలు సజావుగానే కొనసాగుతున్నాయి. సరిహద్దు సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమయ్యాయి.చైనా మీద అమెరికా తెస్తున్న వత్తిడి కారణంగా సంబంధాలు మరింతగా బలపడ్డాయని చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో చైనా నుంచి రాయితీలను ఎక్కువగా పొందవచ్చని కూడా కొందరి అంచనా. ఆర్ధికంగా చూస్తే చైనాకు రష్యా అవసరం కంటే రష్యాకే చైనా అవసరం ఎక్కువగా ఉన్నందున ఒక వేళ అమెరికా-చైనా మధ్య ప్రచ్చన్న యుద్దమంటూ జరిగితే అమెరికాతో రష్యా కలిసే అవకాశాలు ఉండకపోవచ్చు. ఒక బూర్జువా రాజ్యంగా ఆ విబేధాలను తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నించవచ్చు.
జి7 దేశాలతో కలసి పని చేసేందుకు భారత్‌ ఎంతో సంతోషిస్తుందని అమెరికాలో మన రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంధు ఒక వార్తా సంస్ధతో చెప్పారు.జూన్‌ రెండవ తేదీన ట్రంప్‌-నరేంద్రమోడీ మధ్య ఫోన్‌ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంతోషం, కౌగిలింతల వెనుక ఉన్న రహస్యం అందరికీ తెలిసిందే. వాటిలో ఒకటి 2017-18లో మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చమురు 9.6 మిలియన్‌ పీపాలైతే 2019లో 93.34 మిలియన్‌ పీపాలకు పెరిగింది. ఫిబ్రవరిలో ట్రంప్‌ గుజరాత్‌ పర్యటన సందర్భంగా మరింతగా చమురు దిగుమతి చేసుకోవాలని ఒప్పందానికి వచ్చారు. ఇదంతా సాంప్రదాయంగా మనం పశ్చిమాసియా నుంచి చేసుకుంటున్న దిగుమతులను నిలిపివేసిన పర్యవసానం. ప్రభుత్వ రంగ ఐఓసి ఏటా 24మిలియన్‌ పీపాల చమురును అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని టెండర్లు పిలిచింది.
అమెరికా తరువాత రెండవ పెద్ద ఆర్ధిక శక్తిగా ఉన్న చైనా లేకుండా జి7 సాధించేదేమిటి? ఆ కూటమిలో చేరినంత మాత్రాన మన దేశానికి ఒరిగేదేమిటి అన్నది ప్రశ్న. జి7 కంటే జి20 దేశాలు ఒక కూటమిగా బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. అమెరికా తప్ప మిగిలిన జి7 దేశాల కంటే చైనా ఆర్ధిక ప్రభావం ఎక్కువ అన్నది జగమెరిగిన సత్యం.అమెరికా ఏకపక్షంగా అంతర్జాతీయ సంస్ధలు, ఒప్పందాల నుంచి వైదొలగటం ప్రారంభించిన తరువాత మిగిలిన ఆరు దేశాలపై దాని ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తుగడ మేరకు ఒక వేళ దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా జి7లో చేరినా అవి అమెరికాకు వంత పాత్ర తప్ప ఆర్ధికంగా, రాజకీయంగా ప్రపంచం మీద పెద్ద ప్రభావం చూపే స్ధితిలో లేవు. వర్తమాన బలాబలాల్లో అమెరికా నుంచి చైనా నుంచి రాయితీలు ఎక్కువగా పొందేందుకు భారత పాలకవర్గాలు ప్రయత్నిస్తాయి తప్ప పూర్తిగా అమెరికాకు లొంగిపోయే అవకాశం లేదన్నది ఒక అభిప్రాయం.మొత్తంగా చూసినపుడు తన ఎన్నిక నేపధ్యంలో ట్రంప్‌ జి7 విస్తరణను ఒక రాజకీయ ప్రదర్శనగా మార్చదలుచుకున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు 2018 నుంచి చైనా నుంచి ఆర్ధిక రాయితీలు పొందేందుకే అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించటం ఇతర వత్తిడులు అన్నది మిగతా దేశాలేవీ గ్రహించలేనంత అమాయకంగా లేవు. అందువలన అవి చైనా వ్యతిరేక కూటమిగా మారేందుకు ఎంత మేరకు ముందుకు వస్తాయి, వాటికి ఆ అవసరం ఏమిటన్నది ప్రశ్న.
ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చింది.ప్రస్తుతం మిగిలిన దేశాలలో ప్రస్తుతం జర్మనీ ఈ ఏడాది అధ్యక్ష స్ధానంలో ఉంది. సెప్టెంబరు నెలలో జర్మనీ నగరమైన లీప్‌జిగ్‌లో ఐరోపాయూనియన్‌-చైనా సమావేశం జరగాల్సి ఉంది. కరోనా కారణంగా దాన్ని వాయిదా వేశారు. డిసెంబరులోగా జరగవచ్చు.వైరస్‌ ప్రబలటానికి చైనాయే కారణమన్న అమెరికా ఆరోపణలను ఐరోపా దేశాలు కొన్ని నమ్ముతున్నాయి. అయినా కూటమిలోని జర్మనీ-ఫ్రాన్స్‌ దేశాలు చైనాతో సత్సంబంధాలనే కోరుకుంటున్నాయి. వైరస్‌ నేపధ్యంలో చైనాతో సంబంధాల గురించి ఐరోపా యూనియన్‌ దేశాలలో ఏకాభిప్రాయాన్ని సాధించటం కూడా ముఖ్యాంశమే. ఒకవైపు చైనా తమకు ఆర్ధికంగా ప్రత్యర్ధి అని భావిస్తున్నా మరోవైపు దానితో ఇప్పటికిప్పుడు శత్రువుగా భావించే స్ధితి లేదు. కమ్యూనిస్టు దేశమని మడిగట్టుకు కూర్చునేందుకు మెజారిటీ దేశాలు సిద్దంగా లేవు. రాజకీయంగా ఈ కూటమి అమెరికాకు పావుగా పని చేసేందుకు సిద్దం కాదని కూడా గతంలో వెల్లడైంది.
జార్జి ఫ్లాయిడ్‌ హత్యకు నిరసన ప్రతి రోజూ అధ్యక్ష భవనం ముందు నిరసన ప్రదర్శనలు, కరోనా వైరస్‌ అదుపులేకుండా కొనసాగుతుండటంతో జనంలో డోనాల్డ్‌ ట్రంప్‌ పలుకుబడి పడిపోతోందని సిఎఎన్‌ మీడియా సంస్ధ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ ప్రత్యర్ధి జో బిడెన్‌కు ఆదరణ పెరుగుతోంది. కరోనా, ఆర్ధిక దిగజారుడుతో పాటు ఇప్పుడు ఎన్నికల్లో జాత్యహంకారం కూడా ముందుకు వచ్చింది. ఈ ఏడాది జనవరి తరువాత ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన వారు 38శాతానికి పడిపోవటం, వ్యతిరేకించే వారు 57శాతం ఉండటం సహజంగానే ట్రంప్‌కు ఎదురు దెబ్బను సూచిస్తున్నది. జో బిడెన్‌-ట్రంప్‌ మధ్య తేడా 14పాయింట్లు ఉంది. బిడెన్‌ను 55శాతం మంది, ట్రంప్‌ను 41శాతం సమర్దిస్తున్నారు.ఫ్లాయిడ్‌ హత్యపై పెల్లుబికిన నిరసన పట్ల ట్రంప్‌ వ్యవహరించిన తీరు ట్రంప్‌ ఏలుబడిలోని మాజీ రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ వంటి రిపబ్లికన్లకే నచ్చలేదు. ట్రంప్‌ స్పందన నిరసనలు తగ్గటానికి బదులు పెరిగేందుకు తోడ్పడినట్లు 65శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారు. జాతి వివక్ష ఒక ప్రధాన సమస్యగా ముందుకు వచ్చినట్లు వెల్లడైంది. ఈ నేపధ్యంలో నరేంద్రమోడీ కలలు నెరవేరేనా, కల్లలవుతాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వైరస్‌ కట్టడికి చైనా కమ్యూనిస్టులు చేసిందేమిటి !

09 Tuesday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

china communists action to fight against covid-19, China Covid-19, COVID-19 China white paper



ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ను చైనాయే సృష్టించిందనో, దాని ప్రయోగాల్లో పొరపాటున బయటకు వచ్చిందనో రకరకాలుగా ఏదో విధంగా బాధ్యతను అంట కట్టి దోషిగా నిలిపేందుకు ఇప్పటికీ అమెరికా వంటి దేశాలూ, వాటి కనుసన్నలలో నడిచే మీడియా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. మన దేశంతో సహా అనేక చోట్ల కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తమ ప్రభుత్వం కరోనా నిరోధానికి కఠినంగా వ్యవహరించినట్లు కొందరు తొలి రోజుల్లో భావించినా అమెరికా, ఐరోపా దేశాలు, బ్రెజిల్‌ తదితర దేశాల్లో పెరుగుతున్న కేసులు, మరణాలను చూసి తమ ప్రభుత్వం చేసింది సరైనదే అని పార్టీ, ప్రభుత్వం పట్ల మరింతగా చైనీయులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల గురించి నివారించిన చైనా అనుభవాలను పరిగణనలోకి తీసుకోకపోతే నష్టం ఆయా దేశాల జనాలకే. మహమ్మారులు ప్రబలిన సమయంలో సుభాషితాలు చెప్పటం, చప్పట్లు కొట్టించటం, దీపాలు ఆర్పటం-హారతులు వెలిగించట కాదని, తమ సభ్యులను కదన రంగంలోకి దింపటం ముఖ్యమని చైనా కమ్యూనిస్టు పార్టీ వెల్లడించింది. ఈ నేపధ్యంలో కరోనాను ఎలా కట్టడి చేసిందీ వివరిస్తూ చైనా సమాచారశాఖ ఈనెల ఏడవ తేదీన ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. అరవై అయిదు పేజీలు ఆ పత్రంలోని అంశాల సారాంశం దిగువ విధంగా ఉంది.(పూర్తి పాఠం చదవాలని ఆసక్తి కనపరిచే వారి సౌకర్యం కోసం దాని లింక్‌ను చివరిలో చూడవచ్చు)
1949లో చైనా ప్రజారిపబ్లిక్‌ను స్ధాపించిన తరువాత కోవిడ్‌19 ఒక పెద్ద ప్రజారోగ్య అత్యవసర పరిస్దితిగా ముందుకు వచ్చింది. మరొకటేదీ ఇంత వేగంగా వ్యాపించలేదు, నిరోధించటం ఎంతో కష్టం అని రుజువు చేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం దీనికి అగ్రశ్రేణి ప్రాధాన్యత ఇచ్చాయి.అది చైనీయుల విశ్వాసాన్ని పదిలపరచింది.బాధాకరమైన ప్రయత్నాలు, ఎంతో మూల్యం చెల్లించాల్సి వచ్చినా చైనా తన పౌరులను రక్షించుకుంది. ఏ తేదీన ఏమి జరిగిందీ అని చైనా చెబుతున్నప్పటికీ అనేక మంది ఆ సమాచారాన్ని అనుమానంతో చూస్తున్నారు. మరి కొందరు చూస్తూనే ఉంటారు. గతంలో తాము సాధించిన అభివృద్ది గురించి చైనా ప్రకటిస్తే అదంతా అంకెల గారడీ అని చెప్పిన వారున్నారు. ఇప్పటికీ నమ్మని వారి సంగతి సరే సరి. తీరా నమ్మక తప్పని పరిస్ధితి వచ్చినపుడు ఆ అక్కడ కమ్యూనిస్టు నియంతృత్వం కనుక సాధ్యమైంది, మనది ప్రజాస్వామ్యం అని వైఫల్యాన్ని సమర్దించుకుంటున్నారు. కరోనా విషయంలో కూడా అదే జరుగుతోంది. వైరస్‌ కట్టడికి అక్కడి కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం ఏ చర్యలను ఎలా అమలు జరిపిందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోని కారణంగా అనేక దేశాల పాలకులు తమ పౌరుల ప్రాణాలను ఫణంగా పెట్టారు. ఇప్పటికీ నేర్చుకొనేందుకు ముందుకు రావటం లేదు. అభివృద్ధి వైఫల్యాన్ని ప్రజాస్వామ్య ముసుగులో దాచి పెడుతున్న మేథావులమని చెప్పుకొనే వారు ప్రాణాలను బలి పెట్టకుండా మీరు చెప్పే నియంతృత్వ చైనాలో ఎలా కట్టడి చేశారో కనీసం తెలుసుకొనేందుకు పూనుకుంటారా ? మేథావులు అనేక మంది ప్రతిసారీ బస్సు మిస్సవుతున్నారు కనుక వారిని వదలి వేద్దాం. సామాన్యుల కోసం చైనా ప్రభుత్వం వెల్లడించిన శ్వేతపత్రంలోని అంశాల సారాంశం దిగువ విధంగా ఉంది.(స్ధలాభావం రీత్యా ఏ రోజు ఏమి జరిగిందీ అనే సమాచారాన్ని ఇవ్వటం లేదు. ఎలా అరికట్టారనే భాగానికే ఇది పరిమితం)
వైరస్‌ తొలుత బయటపడిన ఊహాన్‌ నగరంలోని 4.21 మిలియన్ల కుటుంబాలలో ఏ ఒక్కదానిని, కుటుంబంలో ఏ ఒక్కరినీ వదల కుండా వైరస్‌ పరీక్షలు చేశారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష వ్యవధిని రెండు రోజుల నుంచి 4-6 గంటలకు తగ్గించారు. తొలి రోజుల్లో రోజుకు 300 పరీక్షలు చేస్తే ఏప్రిల్‌ మధ్యనాటికి 50వేలకు చేరింది. నివాసులందరూ ప్రతి రోజూ ఆరోగ్య పరిస్ధితి ఎలా ఉందో అధికారులకు తెలియచేయాలని కోరారు. మరోవైపున సామాజిక కార్యకర్తలు ఆ సమాచారాన్ని నిర్ధారించుకొనేందుకు ఇంటింటికీ తిరిగారు. జ్వరాల ఆసుపత్రులలో పరీక్షలు చేసిన సమాచారాన్ని రెండు గంటల్లోగా ఉన్నతాధికారులకు చేరవేయాలని కోరారు. పరీక్షా ఫలితాలను పన్నెండు గంటలలో వెల్లడించారు. ఇరవైనాలుగు గంటలలో నిర్ధారిత పరీక్షలను పూర్తి చేసి రోగులను గుర్తించి ఆసుపత్రులకు తరలించారు.
ఉహాన్‌ నుంచి వచ్చిపోయే అన్ని రకాల దారులను పూర్తిగా మూసివేశారు.హువెరు రాష్ట్రం, వెలుపల ఉన్న ప్రాంతాలలో కేసుల తీవ్రతను బట్టి ఆంక్షలను అమలు జరిపారు. వైద్యపరమైన అత్యవసరాలకు మినహా గృహస్తులు ఇతర అవసరాలకు బయటకు రాకుండా కట్టడి చేశారు. సామాజిక కార్యకర్తలు వారికి అవసరమైన రోజు వారీ అవసరాలను తీర్చే ఏర్పాట్లు చేశారు. పరిమిత రాకపోకలను అనుమతించిన ఇతర ప్రాంతాలలో రాక-పోక సమయాల్లో శరీర ఉష్ణ్రోగ్రతలను విధిగా నమోదు చేశారు. దేశవ్యాపితంగా నిరోధ చర్యల్లో భాగంగా వీటితో పాటు ఇతర చర్యలను అమలు జరిపారు, అందుకు అవసరమైన వైద్య, ఇతర సదుపాయాలను అత్యవసర ప్రాతిపదికన మెరుగుపరిచారు.
దేశవ్యాపితంగా పదివేల ఆసుపత్రులను కోవిడ్‌-19 చికిత్సకు ప్రత్యేకించి అవసరమైన వసతులు కల్పించారు.ఆన్‌లైన్‌ ద్వారా అవసరమైన సాంకేతిక మద్దతు అందించారు. ప్రధాన కేంద్రమైన ఉహాన్‌లో 80శాతం కేసులు తీవ్రమైనవి కాదు. అయినా ఎటుపోయి ఎటు వస్తుందో అన్న ముందు జాగ్రత్తగా పద్నాలుగువేల పడకలతో స్టేడియాలు, ప్రదర్శన కేంద్రాలలో 16 తాత్కాలిక చికిత్స ఏర్పాట్లు చేశారు. నివారణలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. ఆరోగ్యవ్యవస్ధ మీద వత్తిడిని తగ్గించటంలో ఇవి కీలక పాత్ర పోషించినట్లు బ్రిటీష్‌ వైద్య పత్రిక లాన్‌సెట్‌ పేర్కొన్నది. రోగ నిర్ధారణ, చికిత్సలో సంప్రదాయ చైనా వైద్య పద్దతులు, ఔషధాలను, ఆధునిక వైద్య పద్దతులు, ఔషధాలను రెండింటినీ వినియోగించారు. కొన్ని సంప్రదాయ చైనా వైద్య ఆసుపత్రులలో పూర్తిగా రోగులకు చికిత్స చేశారు, దానితో పాటు ప్రతి ఆసుపత్రిలోనూ ఆ వైద్య నిపుణులను అందుబాటులో ఉంచారు. తీవ్రత తక్కువ ఉన్న కేసులను ఈ ఆసుపత్రులలో చికిత్స చేసి తీవ్రమైన వారిని ఆధునిక వైద్య ఆసుపత్రులకు పంపారు. ఇందుకోసం ఈ రంగ వైద్య నిపుణులతో ఒక జాతీయ సమన్వయ సంస్ధను ఏర్పాటు చేశారు. తొంభై రెండుశాతం నిర్ధారిత కరోనా కేసులలో చైనా మూలికా ఔషధాలను వినియోగించారు. హుబెరు రాష్ట్రంలో చికిత్స పొందిన 90శాతం కేసులలో అవి సమర్దవంతంగా పని చేసినట్లు తేలింది.
కేంద్ర, రాష్ట్ర, స్ధానిక ప్రభుత్వాలన్నీ కలసి మే31 నాటికి 162.4 బిలియన్‌ యువాన్లు మహమ్మారి నివారణ, చికిత్సకు కేటాయించారు. బీమా కంపెనీలు పరిష్కరించిన యాభై ఎనిమిది వేల మంది ఆసుపత్రి చికిత్స బిల్లులను విశ్లేషించినపుడు సగటున ఒక్కొక్కరికి 23వేల యువాన్లు కాగా, తీవ్ర పరిస్ధితికి చేరిన వారికి లక్షా 50వేలు దాటింది. ఒక యువాను మన కరెన్సీలో పది రూపాయలకు పైగా విలువ కలిగి ఉంది. కొన్ని సంక్లిష్ట కేసులలో పది లక్షల యువాన్ల వరకు ఖర్చయింది. వ్యక్తులకు అయిన ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించింది.
మే 31వ తేదీనాటికి చైనా కేంద్ర సమాచార మండలి 161 పత్రికా సమావేశాలను ఏర్పాటు చేసింది. పద్నాలుగు వందల ప్రశ్నలకు 50శాఖల అధికారులు సమాధానాలు చెప్పారు. ఇవిగాక హుబెరు రాష్ట్రంలో 103 పత్రికా గోష్టులు ఏర్పాటు చేయగా ఇతర చోట్ల మరో 1050 నిర్వహించారు.మరోవైపు వాక్సిన్‌తో సహా కరోనా వైరస్‌కు సంబంధించి వివిధ అంశాలపై పరిశోధన మరియు అభివృద్దికి గాను కొత్తగా 83 కార్యక్రమాలను ప్రారంభించారు.
పౌరుల ప్రాణాలు, ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఆర్ధికంగా ఖర్చు గురించి ఆలోచించకుండా అనేక కఠిన చర్యలు తీసుకున్నది.” భారీ సామాజిక, ఆర్ధిక నష్టంతో చైనా విజయం వచ్చింది.ఆరోగ్యం మరియు ఆర్ధిక రక్షణ మధ్య ఉండాల్సిన సమతూకాన్ని సాధించేందుకు చైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది” అని లాన్‌సెట్‌ సంపాదకీయం పేర్కొన్నది. ఒకటిన్నర రోజు పసి గుడ్డు నుంచి వంద సంవత్సరాల పండు ముదుసలి వరకు ఖర్చు ఎంతైనా సరే ప్రాణాలను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది.చికిత్సకు, మరణాలను తగ్గించేందుకు ప్రాధాన్యత ఇచ్చింది.కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు దేశంలోని నిపుణులైన వైద్యులు, సిబ్బందిని తరలించింది. ఊహాన్‌లో తీవ్ర స్ధితిలో ఉన్న 9,600 రోగులకు చికిత్స అందించారు.
బతికేందుకు ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ ఖర్చుకు వెనుకాడకుండా వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. మే 31 నాటికి ఏడుగురు శతాధిక వృద్దులతో సహా 80 ఏండ్లు దాటిన మూడువేల మంది ప్రాణాలను రక్షించారు. వారిలో డెబ్బయి ఏండ్ల రోగి ఒకరికి పది మంది సిబ్బంది అనేక వారాల పాటు చికిత్సలో పాల్గొన్నారు. అందుకు పదిహేను లక్షల యువాన్లు ఖర్చు కాగా మొత్తం ప్రభుత్వమే భరించింది. వివిధ దేశాలలోని ప్రవాస చైనా విద్యార్ధులకు పదిలక్షల ఆరోగ్య కిట్లను చైనా పంపింది.
జనవరి 24 నుంచి మార్చి 8వ తేదీ వరకు హుబెరు రాష్ట్రంలోని ఊహాన్‌, మరో 16 పట్టణాలకు ఇతర ప్రాంతాలకు దేశమంతటి నుంచీ అన్ని రకాల వైద్య వనరులను సమీకరించారు, 346 జాతీయ వైద్య బృందాలలో 42,600 సిబ్బంది ఉన్నారు. వీరుగాక 900 మంది ప్రజారోగ్య నిపుణులు ఉన్నారు. చైనా ప్రజావిముక్త సైన్యం(పిఎల్‌ఏ) నుంచి నాలుగువేల మంది వైద్య సిబ్బందిని సమీకరించారు. ఆదేశాలిచ్చిన రెండు గంటల్లోనే బృందాలను ఏర్పాటు చేయటం, 24గంటల్లోగా నిర్దేశిత కేంద్రాలకు చేరటం ఏడు రోజులకు సరిపడా రక్షణ సామాగ్రితో వచ్చిన వెంటనే చికిత్స అందించటం ఆ బృందాల ప్రత్యేకత.
నలభైవేల మంది నిర్మాణ కార్మికులను రప్పించి వేయిపడకల ఆసుపత్రిని అన్ని రకాల పరికరాలతో పది రోజుల్లో, మరో 1600 పడకల ఆసుపత్రిని పన్నెండు రోజుల్లో నిర్మించారు.మరో 14వేల పడకల తాత్కాలిక ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేశారు.పది రాష్ట్రాల నుంచి 45వేల ఎర్ర రక్తకణ యూనిట్లు, 1762 ప్లేట్‌లెట్స్‌ డోస్‌లు, 1370 లీటర్ల గడ్డకట్టించిన ప్లాస్మాను సిద్ధం చేశారు. ఏ రకమైన వైద్య పరికరాలు, ముఖతొడుగులు,ఔషధాలకు కొరత రాకుండా ఉత్పత్తికి ఏర్పాటు చేశారు. చికిత్సా సమయంలో 17రకాల, వాక్సిన్లు, ఔషధాలను(క్లినికల్‌ ట్రయల్స్‌, వినియోగం) వినియోగించేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. దేశవ్యాపితంగా నిరాటంకంగా ఎక్కడకు అవసరమైతే అక్కడకు తరలించే సమన్వయ వ్యవస్ధలను ఏర్పాటు చేశారు.
ఉహాన్‌ నగరంలో కోటి మంది, ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లో ఉన్న జనాలకు అవసరమైన ధాన్యం, కూరగాయలు, నూనెలు, పాలు, గుడ్లు, మాంసం తదితర నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 500 సంస్దలతో సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు.
చైనా ప్రధాన భూభాగంలోనూ, తైవాన్‌, హాంకాంగ్‌, మకావు ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో ఉన్న చైనీయులు పెద్ద ఎత్తున స్పందించి 38.93 బిలియన్‌ యువాన్లు, 990 మిలియన్ల వస్తువులను విరాళంగా అందచేశారు. లాక్‌డౌన్‌తో పాటే చిన్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తల మీద భారాలు తగ్గించటం, ప్రభుత్వ సబ్సిడీల పెంపు, ఉపాధి స్ధిరీకరణ, ప్రభుత్వ సేవల మెరుగుదల వంటి అనేక చర్యలను తీసుకుంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత తమ పని స్ధలాలకు చేరేందుకు వలస కార్మికులకు ప్రత్యేక రైళ్లు, విమానాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ చివరి నాటికి ఏడాదికి రెండు కోట్ల యువాన్ల ఆదాయం వచ్చే కంపెనీలలో 99శాతం పనిలోకి వచ్చాయి. తీవ్రంగా ప్రభావితమైను హుబెరు రాష్ట్రంలో కూడా 98.2శాతం సంస్ధలు తిరిగి పని చేస్తుండగా 92.1శాతం కార్మికులు విధుల్లో చేరారు. ప్రజా రవాణా పూర్తిగా పునరుద్దరణ అయింది. యావత్‌ ప్రజాజీవనం సాధారణ స్ధాయికి చేరుకుంది.
హుబెరు రాష్ట్రంలోని 5,40,000 ఆరోగ్య కార్యకర్తలు, బయటి నుంచి వచ్చిన నలభైవేల మంది పౌర, మిలిటరీ వైద్య సిబ్బంది, మిలియన్ల కొలది ఆరోగ్య సిబ్బంది కరోనాను అడ్డుకొనేందుకు మరో గ్రేట్‌ వాల్‌ నిర్మించారు. పుట్టుకతో ఎవరూ వీరులు కాదు. ఈ పోరులో రెండువేల మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది, అనేక మంది మరణించారు. కరోనా పోరులో సామాన్య జనాన్ని సిద్దం చేసేందుకు, వారిని ఆదుకొనేందుకు 6,50,000 పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు, రోగులను గుర్తించేందుకు, పౌరుల రోజువారీ సమస్యల పరిష్కారానికి 40లక్షల మంది సామాజిక కార్యకర్తలు పని చేశారు. పద్దెనిమిది లక్షల మంది పారిశుధ్యకార్మికులు బహిరంగ స్ధలాలు, ముఖ్యమైన ప్రాంతాలను శుభ్రం చేయటంలోనూ, వైద్య, ఇతర చెత్తను సేకరించటంలోనూ పాలొన్నారు. పోలీసులు విధి నిర్వహణలో 130 మంది మరణించారు. వలంటీర్లుగా నమోదు చేసుకున్న 88లక్షల మంది 4,60,00 కార్యక్రమాల్లో 29కోట్ల గంటల పాటు సేవలు అందించారు.
చైనా కమ్యూనిస్టు పార్టీలో 46లక్షలకు పైగా ప్రాధమిక శాఖలు ఉన్నాయి.మహమ్మారిని ఎదుర్కోవటం,జనాన్ని సమీకరించటం, వారికి సేవ చేయటంలోనూ అవి గట్టిగా పని చేశాయి. మూడు కోట్ల 90లక్షల మంది పార్టీ సభ్యులు అగ్రగామి దళంగా ఉన్నారు. కోటీ 30లక్షల మంది వలంటీర్లుగా సేవలందించారు. సేవారంగంలో ముందున్న వారిని ఉన్నత స్ధానాల్లోకి ప్రమోట్‌ చేశారు,బాధ్యతా రహితంగా ఉన్నవారిని గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఉత్పాతాల నుంచి కాపాడటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం అత్యంత విశ్వసనీయంగా ఉంటుందని లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత సాధారణ జనం ఎంతగానో గ్రహించారు, రాజకీయ వ్య వస్ధ మీద తమ విశ్వాసాన్ని ప్రకటించారు. 170దేశాల నేతలు, 50 ప్రపంచ, ప్రాంతీయ సంస్దల అధిపతులు, 300 విదేశీ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చైనాకు బాసటగా నిలిచాయి. డెబ్బరు ఏడు దేశాలు, పన్నెండు అంతర్జాతీయ సంస్ధలు అత్యవసర విరాళాలు అందచేశాయి.84దేశాల నుంచి వివిధ సంస్ధలు సాయాన్ని పంపాయి. బ్రిక్స్‌ అభివృద్ధి బ్యాంకు, ఏఐఐబి ఏడు,2.48బిలియన్‌ యువాన్ల చొప్పున అత్యవసర రుణాలు అందచేశాయి. నూటపది దేశాలకు చెందిన 240 పార్టీలతో కలసి చైనా కమ్యూనిస్టు పార్టీ సంయుక్త విజ్ఞాపనలు చేసింది. యాభై మంది నేతలు, అంతర్జాతీయ సంస్ధల అధిపతులతో దేశాధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ స్వయంగా మాట్లాడి చైనా తీసుకుంటున్న చర్యలను వివరించారు.
శ్వేత పత్రంలోని ముఖ్యాంశాలను పైన చూశాము. గత నెలలో అమెరికా వ్యాపింప చేసిన 24 అబద్దాలను తిప్పి కొడుతూ చైనా ఒక పత్రాన్ని విడుదల చేసింది. ఇప్పుడు కరోనాను ఎదుర్కొన్న తీరు తెన్నులను వివరిస్తూ శ్వేత పత్రాన్ని ప్రకటించింది. ఇంతవరకు ఏ దేశమూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. తాము తీసుకున్న చర్యలను అధికారికంగా విడుదల చేసి జనం ముందుంచటం కనీస బాధ్యత. వాటి మంచి చెడ్డలను జనం స్వయంగా తెలుసుకుంటారు. ప్రపంచంలో గతంలో అనేక మహమ్మారులు వచ్చాయి. అవి ముందుగా బయటపడిన దేశాలను అందుకు బాధ్యులుగా చేసి రచ్చ చేసిన ఉదంతం ఇదొక్కటే అని చెప్పవచ్చు. కరోనా వైరస్‌ దెబ్బలను ఎదుర్కొన్న ఒక బాధిత దేశంగా ఉన్న చైనా దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని తానేమిటో, తన రాజకీయ వ్యవస్ధ ఔన్నత్యం ఏమిటో నిరూపించుకుంది. సాధారణ కార్యకలాపాలతో తిరిగి ముందుకు పోతున్నది.చైనా తీసుకున్న చర్యలను కూడా ఎవరైనా సహేతుకంగా విమర్శించవచ్చు, లోపాలను ఎత్తిచూపవచ్చు. ఇదే సమయంలో ఏ దేశం, ఏ పాలకులు బాధ్యతా రహితంగా వ్యవహరించి తమ పౌరుల ప్రాణాల మీదకు తెచ్చారో తెలుసుకోవటం పౌరుల హక్కులలో ఒకటి. అందుకే మిగిలిన దేశాలు కూడా తామేమి చేసిందీ ప్రపంచ జన కోర్టుకు చెప్పాలి. చైనాతో పోటీ పడుతున్నామని చెప్పుకుంటున్న, చైనా తరువాత జనాభా రీత్యా రెండవ స్ధానంలో ఉన్న మన పాలకుల మీద ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉందంటే ఏకీభవిస్తారా !
https://news.cgtn.com/news/2020-06-07/Full-Text-Fighting-COVID-19-China-in-Action-R7xr2aKsyA/index.html

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళ ఏనుగు మృతిపై బిజెపి పీనుగు రాజకీయాలు !

06 Saturday Jun 2020

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP communal politics, bjp elephant corpse politics in kerala, Kerala pregnant elephant death, Menaka Gandhi


ఎం కోటేశ్వరరావు
ఆమె మేనకా గాంధీ. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపీ. ఏ నేత చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ఎన్నో పార్టీలు మారిన ఆమె రాజకీయ చరిత్రనుంచి యువతరం ఆదర్శంగా తీసుకోవాల్సిందేముందన్నది పెద్ద ప్రశ్న. ఇప్పుడు పెద్ద అబద్దాల కోరుగా తయారయ్యారు. కేరళలో మరణించిన ఒక ఏనుగు ఉదంతంలో మతవిద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తాను ఇంకా రాజకీయంగా జీవించే ఉన్నా అన్నట్లుగా మీడియాలో మరోసారి వెలుగులోకి వచ్చారు.ఆమె చేసిన వ్యాఖ్యల గురించి బిజెపి స్పందించలేదు గనుక వాటిని ఆమోదించినట్లే భావించాలి. దేశంలో అనేకం జరుగుతున్నా మిన్నువిరిగి మీద పడ్డా చలించని అనేక మంది ప్రముఖులు ఏనుగు విషయంలో అపూర్వ స్పందన కనపరిచారు. వారిని ఆ మేరకు అభినందించాల్సిందే. అసలు స్పందించని వారికంటే వీరు మేలు, మనుషుల విషయంలో మాకేం పట్టదన్నట్లు మౌనంగా ఉన్నా బోలెడంత జంతు ప్రేమ ఉందని లోకానికి తెలిపారు. అలాంటి వారి చర్మాలు ఎప్పుడైనా పలుచనై మనుషుల మీద కూడా జాలి చూపే అవకాశం ఉంటుందని ఆశిద్దాం.
ఏనుగు దారుణంగా మరణించిందనే దాని కంటే అది కడుపుతో ఉందన్న వార్తకు జనంలో స్పందన ఎక్కువగా వచ్చినట్లు అనిపించింది. మీడియా కూడా దాన్నే ఎక్కువగా చూపింది. దేనికి రేటింగ్‌ ఎక్కువగా ఉంటే అదే ముఖ్యం కదా మరి ! ఈ వార్త, స్పందన చూడగానే వెంటనే గుజరాత్‌ బాబు బజరంగీ గుర్తుకు వచ్చాడు. అడవి పందుల నుంచి పంటలను కాపాడుకొనేందుకు అటవీ సమీప ప్రాంత రైతులు తీసుకొనే అనేక చర్యల గురించి మనకు తెలిసిందే. వాటికోసం, పొలాల చుట్టూ విద్యుత్‌ తీగలను అమర్చటం, పేలుడు పదార్ధాలను వినియోగించటం సర్వసాధారణం. కేరళలో కూడా అలా అమర్చిన ఒక పైనాపిల్‌ను అడవి పందులకు బదులు తిన్న ఏనుగు వాటిలో అమర్చిన టపాసులు పేలి గాయపడి మరణించి ఉండవచ్చన్నది ఒక కథనం. జంతు ప్రేమికులు పందుల మీద ఒక ప్రేమ ఏనుగుల మీద మరొక ప్రేమ ప్రదర్శిస్తారని ఇప్పుడు అర్ధమైంది. ఇక బాబు బజరంగీ అనే మానవ రూపంలో ఉన్న ఒక కాషాయ జీవి గుజరాత్‌ మారణకాండ సమయంలో ఇతర కాషాయ తాలిబాన్లతో కలసి దాడుల్లో పాల్గొన్నాడు. సామూహిక హత్యలు, దహనకాండకు పాల్పడిన నర రూప రాక్షసుల్లో ఒకడు. కౌసర్‌ బాను అనే ఒక గర్భిణీ అతగాడి కంటపడింది. ఇంకేముంది చేతిలోని బాకుతో ఆమె పొట్టను చీల్చి కడుపులోని పిండాన్ని దానితో పైకి లేపి వికటాట్టహాసం చేసి ఉంటాడు. కేరళ ఏనుగు ఎంతబాధ పడి మరణించిందో ఊహించుకొని స్పందించిన వారి మాదిరే బజరంగీ కూడా చేసి ఉండాలి, లేకపోతే అలాంటి వారికి కిక్కు ఉండదు. తరువాత తామెలా చంపిందీ హవభావాలతో ఒక మీడియా సంస్ధకు వివరించాడు కూడా !
పంటలను కాపాడుకొనేందుకు పేలుడు పదార్ధాలను పెడితే ఆ పేలుడు శబ్దాలకు లేదా పేలుడుతో గాయపడి జంతువులు పంటల జోలికి రాకుండా పారిపోతాయని రైతులు భావిస్తారు. మరి బజరంగీ ఎవరిని రక్షించటానికి ఒక గర్భిణీపై అంతదుర్మార్గంగా వ్యవహరించాడు ? కేరళ ఏనుగు మరణానికి పరోక్ష కారకులుగా భావిస్తున్నవారందరూ తమ పదవులకు రాజీనామా చేయాలని మేనకా గాంధీ డిమాండ్‌ చేశారు. ఒక ఉదంతం జరిగినపుడు ఎవరైనా, దేన్నయినా డిమాండ్‌ చేసే హక్కు కలిగి ఉంటారు, మేనకా గాంధీ అందుకు మినహాయింపు కాదు. ఒక స్త్రీగా, తల్లిగా గర్భ సమయంలో ఎలా ఉంటుందో ఆమెకు చెప్పనవసరం లేదు. మరి కౌసర్‌బీని అత్యంత అమానుషంగా హత్య చేసిన ఉదంతంపై ఆమె స్పందన ఏమిటి ? దాన్ని ఖండించినట్లు, ఏవైనా డిమాండ్లు చేసినట్లు ఆధారాలుంటే ఏవరైనా తెలియచేయాలని మనవి. ఎందరినో అన్యాయంగా పొట్టన పెట్టుకున్న దారుణాలకు నైతిక బాధ్యత వహించి ముఖ్య మంత్రిగా ఉన్న నరేంద్రమోడీతో సహా ఎవరూ రాజీనామా కాదు కాదు కనీసం అయ్యోపాపం అని కూడా అనలేదు. గట్టిగా చెప్పే ధైర్యం లేక లేదా చిత్తశుద్ధి లేక గానీ నాడు ప్రధానిగా ఉన్న వాజ్‌పారు కేవలం రాజధర్మాన్ని పాటించమని మాత్రమే నరేంద్రమోడీకి చెప్పారు. ఈ రోజు గర్భంతో ఉన్న ఏనుగు మృతికి స్పందించిన వారు అప్పుడు తామెలా స్పందించిందీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటారా ?
కౌసర్‌బాను కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి జ్యోత్సా యాగ్నిక్‌ తన తీర్పులో గర్భిణి మీద బజరంగీదాడి చేశాడు గానీ ఆమె కడుపులోని పిండాన్ని కత్తితో బయటకు తీసి ఉండడు, ముస్లింల మీద ద్వేషంతో దాడి చేశాడు తప్ప పుట్టబోయే బిడ్డను అడ్డుకొనేందుకు కాదు అని చెప్పారు. తన సోదరి కడుపును బజరంగీ చీల్చాడని 14ఏండ్ల ఆమె సోదరుడు చెప్పిన సాక్ష్యాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అలాంటి పని శిక్షణ పొందిన వైద్యులు లేదా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలరని బజరంగీ అలా చేశాడని తాను నమ్మటం లేదని, కత్తితో పొడిచినపుడు బయటకు వచ్చిన రక్త మాంసాలను చూసి పిండం బయటకు వచ్చిందని అనుకొని ఉండవచ్చని, బజరంగీకి ఆ ఉద్దేశం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. కౌసర్‌బీ మీద దాడి తరువాత ఆమెను అక్కడే సజీవదహనం చేశారు కనుక పోస్టు మార్టం చేసే అవకాశం లేకుండా పోయింది. తెహల్కా రహస్య శోధనలో ఆ ఉదంతం గురించి బజరంగీ పూసగుచ్చినట్లు చెప్పాడు. ఈ దారుణం గురించి మేనకా గాంధీ లేదా ఏనుగు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేసినట్లు నాకు ఎక్కడా సమాచారం దొరకలేదు.
ఇక కేరళ ఏనుగు ఉదంతం జరిగింది పాలక్కాడ్‌ జిల్లాలో అని తెలిసిన తరువాత కూడా మలప్పురం జిల్లా, అక్కడి పౌరుల గురించి చేసిన దుర్మార్గ పూరితమైన వ్యాఖ్యల పట్ల కనీసం విచారం కూడా మేనకా గాంధీ నుంచి ఇంతవరకు వెలువడలేదు. ఆమె మీద ఒక కేసు దాఖలైనట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు ఆమె తన వ్యాఖ్యలను ఎలా సమర్దించుకుంటారో చూద్దాం. ఈ ఉదంతంలో బిజెపి మత రాజకీయాలకు ఎలా పాల్పడిందో విజ్ఞులైన వారు గ్రహిస్తారని అనుకుంటున్నాను. మలప్పురం దేశంలో అత్యంత హింసాత్మక,హీనమైన జిల్లా అని ఎఎన్‌ఐ అనే వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేనకా గాంధీ వర్ణించారు. అక్కడ మెజారిటీ పౌరులు ముస్లింలు కావటం, ఆమెలో వారి పట్ల ఉన్న విపరీత ద్వేషం తప్ప అంతటి సీనియర్‌ నేత వాస్తవాల ప్రాతిపదికన అలాంటి బాధ్యతా రహిత వ్యాఖ్య చేయలేదు.అత్యంత కల్లోల జిల్లాలో అదొకటని రోజూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందని, అక్కడ జరిగేవాటి మీద చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం భయపడుతుందని, అత్యంత బలహీనమైన అధికారులను అక్కడ నియమిస్తుందని ఇంకా అలాంటి అనేకం ఆమె నోటి నుంచి జాలువారాయి.(హైదరాబాదు పాతబస్తీలో మజ్లిస్‌ గురించి బిజెపి నేతలు నిత్యం చేసే విమర్శలు అచ్చం ఇలాగే ఉంటాయి) హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు,అత్యాచారాల వంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్లు కేంద్రం గుర్తించి మూడు వందల అగ్రశ్రేణి జిల్లాల్లో మలప్పురం లేదని మేనకా గాంధీకి, ఆమె తప్పుడు ప్రచారాన్ని గుడ్డిగా నమ్మిన వారికి ఎవరు చెబుతారు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన పిలిభిత్‌, ప్రస్తుతం ఎన్నికైన సుల్తాన్‌పూర్‌ జిల్లాల్లో నేరాల సంగతి అయినా ఆమెకు తెలిసి ఉంటే ఇలా మాట్లాడి ఉండేవారు కాదు.
కేరళలో ప్రతి ఏటా ఆరువందల ఏనుగులను చంపివేస్తున్నారని కూడా మేనక ఆరోపించారు.అది కూడా పచ్చి అబద్దమే. దేశం మొత్తంలో కూడా అన్నింటిని చంపలేదు. పార్లమెంట్‌లో తమ ప్రభుత్వం స్వయంగా వెల్లడించిన సమాచారం కూడా ఆమెకు తెలియదు.2016-17 నుంచి 2018-19 వరకు దేశంలో 314 అటవీ ఏనుగులను చంపివేసినట్లు ఈ ఏడాది మార్చి 20న పార్లమెంట్‌కు తెలిపారు. వాటిలో కేరళలో మూడు సంవత్సరాలలో కేవలం 21 మాత్రమే కాగా బిజెపి ఏలుబడిలోని అసోంలో అత్యధికంగా 90 ఏనుగులను చంపివేశారని ఆ పార్టీ వారికి ఎవరు చెబుతారు.
అంతే కాదు తరువాత ఆమె ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ మలప్పురంలో ఎక్కడో రెండు మూడు చోట్ల కొందరు బాంబులు తయారు చేస్తున్నారు.ఈ రోజు ఏనుగుకు బాంబు పెట్టిన వారు రేపు మనుషులకు పెడతారు అన్నారు. మేనకా గాంధీ అంటే ఉద్యోగం లేక నిరాశతో, వయసు పైబడి , మతి తప్పి కేరళలో ఏ జిల్లా ఏమిటో తెలియని స్ధితిలో ఉన్నారనుకుందాం,కేంద్ర అటవీ, వన్య ప్రాణిశాఖ మంత్రి ప్రకాష జవదేకర్‌ సైతం ఉదంతం ఏ అడవిలో జరిగిందో తెలుసుకోకుండా మలప్పురం అని నోరు పారవేసుకున్నారు.
2017లో జరిగిన ఏనుగుల సర్వే ప్రకారం దేశం మొత్తం మీద 29,964 ఉన్నాయి.వాటిలో కేరళలో 5,706 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌ ప్రకారం దేశంలో 2,454 మచ్చిక చేసుకున్న ఏనుగులు ఉన్నాయి. వాటిలో 1,809 ప్రయివేటు వ్యక్తులు, దేవాలయాలు, సర్కస్‌ కంపెనీలలో ఉండగా మిగిలినవి జంతు ప్రదర్శన శాలల్లో ఉన్నాయి. ఈ ఏనుగుల్లో రాష్ట్రాల వారీ అసోంలో 905, కేరళలో 518, కర్ణాటకలో 184, తమిళనాడులో 138 ఉన్నాయి. తరువాత కేంద్రం పార్లమెంట్‌కు సమర్పించిన సమాచారం ప్రకారం ప్రయివేటు వ్యక్తులు మచ్చిక చేసుకున్న ఏనుగులు 1,774 అని పేర్కొన్నారు. మరి కేరళలో ఏటా ఆరువందల ఏనుగులను చంపుతున్నట్లు పోసుకోలు సమాచారం తప్ప మేనకా గాంధీ ఏ ఆధారంతో చెప్పినట్లు ?
దేవాలయాల్లో ఉన్న ఏనుగులను కాళ్లను ఇరగ్గొట్టి, కొట్టి, ఆకలితో మాడ్చి, ఇతరంగా చంపుతున్నట్లు కూడా మేనకా గాంధీ పేర్కొన్నారు. అలాంటి ఉదంతాలు జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. జంతు ప్రేమికురాలిగా మేనకా గాంధీ అలాంటి దారుణాలకు పాల్పడిన దేవాలయ సిబ్బంది లేదా ప్రయివేటు వ్యక్తుల మీద ఎందుకు ఫిర్యాదు చేయలేదు. దేవాలయాల జోలికి పోవటానికి ఆమెకు భయమెందుకు ? ఒక్క ఉదంతంలో అయినా ఆమె మంత్రిగా ఉండగా, లేనపుడు ఒక వ్యక్తిగా తీసుకున్న చర్య ఏమిటో చెప్పగలరా ? ఇప్పుడెందుకు ఏనుగు మీద అంత ప్రేమ పుట్టుకు వచ్చింది, పీనుగు రాజకీయాల ద్వారా ఆమె ఏమి ఆశిస్తున్నట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా వస్తు బహిష్కరణ: వేయి వాట్సాప్‌లు – పదివేల పగటి కలలు !

03 Wednesday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

anti china, Boycott of Chinese Products, China goods


ఎం కోటేశ్వరరావు
కేంద్రపాలిత లడఖ్‌ ప్రాంతానికి చెందిన ఒక ఇంజనీరు, విద్యా సంస్కరణవాదిగా వర్ణితమైన సోనమ్‌ వాంగ్‌చుక్‌ చైనా వస్తువులను బహిష్కరించి ఆ దేశాన్ని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలంటూ సామాజిక మాధ్యమంలో పెట్టిన ఒక వీడియో వైరల్‌ అవుతోంది.జూన్‌ రెండవ తేదీ నాటికి 20లక్షల మంది చూశారట. భారత-చైనా సరిహద్దులో ఒకటైన లడక్‌ ప్రాంతంలో ప్రస్తుతం ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపధ్యంలో పెట్టిన ఈ పోస్టుకు మీడియాలో కూడా పెద్ద ప్రచారమే వచ్చింది. మరోసారి చైనా వస్తువులను బహిష్కరించండి అనే వార్తలు దర్శనమిస్తున్నాయి.
బ్రిటీష్‌ వారు బెంగాల్‌ను విభజిస్తూ చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా 1905లో నాటి జాతీయోద్యమ నేతలు స్వదేశీ పిలుపునిచ్చి బ్రిటీష్‌ వారి వస్తువుల కొనుగోలును బహిష్కరించాలని కోరారు.ఆ చర్యతో ఆ నిర్ణయాన్ని వెనక్కు గొట్టవచ్చని భావించారు. నాడు పిలుపు ఇచ్చిన వారు తాము కాంగ్రెస్‌ వాదులం అని రొమ్మువిరుచుకొని వీధుల్లోకి వచ్చారు. ఇప్పుడు చైనా వస్తువులు కొనుగోలు చేయవద్దని పిలుపు ఇస్తున్నవారు, ప్రచారం చేస్తున్నవారు ముసుగులు వేసుకొని తమ గుర్తింపు బయటపడకుండా ఆ పని చేస్తున్నారు. నాడు కాంగ్రెస్‌ వాదులు బ్రిటీష్‌ వారితో చేతులు కలపలేదు. నేడు కొందరు ముసుగులు వేసుకొని ఒక వైపు ప్రచారం చేస్తుంటే మరోవైపు పాలకులు చైనా నేతలకు ఎర్రతివాచీ పరచి మర్యాదలు చేస్తున్నారు. ఆ ముసుగు వీరులు ఎక్కడా ఈ ఎర్రతివాచీలను పల్లెత్తు మాట అనరు. అంటే వారికీ వీరికీ చీకటి సంబంధం ఉందన్నది బహిరంగ రహస్యం. ఇద్దరూ కలసి జనాన్ని వెర్రివాళ్లను చేస్తున్నారా? చెవుల్లో కమలం పువ్వులు పెడుతున్నారా ?
ముసుగు లేదా మరుగుజ్జు వీరులు వాట్సాప్‌ద్వారా చేస్తున్న ప్రచారాన్ని అనేక మంది నిజమే అనుకుంటున్నారు. తామంతా చైనా వస్తువులను బహిష్కరించినట్లు, చైనా కమ్యూనిస్టులు తలుపుతట్టి తమ కాళ్ల మీద పడి తప్పయి పోయింది, మా వస్తువులను కొనటం మాని మా నోటి కాడ కూడును కొట్టకండి మహాప్రభో అని వేడుకుంటున్నట్లు చాలా మంది కలలు కంటున్నారు. వయసులో ఉన్న వారికి వచ్చే కొన్ని కలలు వారిని మంచాల మీద నుంచి పడవేస్తుంటాయి. కొందరికి చైనా కలలు కూడా అలాంటి కిక్కు ఇస్తూ ఉండవచ్చు.
కోట్లాది మంది చైనా యాప్స్‌ను తమ ఫోన్ల నుంచి తొలగిస్తే మన సరిహద్దులలోకి ప్రవేశిస్తున్న చైనా ప్రభుత్వానికి అదొక హెచ్చరికగా ఉంటుందని సోనమ్‌ వాంగ్‌చుక్‌ చెప్పాడు. మన సైన్యం ఆయుధాలను తీసి సమాధానం చెబుతుంటే జనం పర్సులను మూసి చెప్పాలన్నాడు. చైనా వస్తువులను బహిష్కరించితే దాని మూల్యం ఎంతో చైనాకు తెలిసి వస్తుందన్నాడు. చైనా వస్తువుల కొనుగోలుకు పెట్టిన ఆర్డర్లను వ్యాపారులు రద్దు చేసుకుంటే వ్యాపారంతోనే బతుకుతున్న తమ జనం తిరగబడతారని చైనా ప్రభుత్వం భయపడుతుంది. వ్యాపారం నిలిచిపోయి వారి ఆదాయం దెబ్బతింటే తిరుగుబాటే వచ్చే అవకాశం ఉంది. అందువల చైనా వస్తువులను బహిష్కరించాల్సి ఉంది అని కూడా చెప్పాడు. ఇలాంటి కలలు కనే వారు నిజంగానే తట్టుకోలేక మంచాల మీద నుంచి దభీమని పడతారు.మన సరిహద్దుల్లోకి చైనీయులు చొరబడినట్లుగా ప్రచారంలో ఉన్న వీడియోలు ప్రామాణికమైనవి కాదు, దుష్ట ఆలోచనతో రూపొందించినవి అని మరోవైపు మన సైన్యం ప్రకటించింది.
రెండుదేశాల మధ్య గత ఏడాది 93 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లావాదేవీలు జరిగాయి. రెండుచోట్లా ఆర్ధిక పరిస్ధితులు బాగోలేక అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే మూడు బిలియన్‌ డాలర్ల మేర తగ్గాయి. మన దిగుమతులు ఎక్కువ కావటంతో చైనా మిగులు 56.77 బిలియన్‌ డాలర్లు ఉంది. కలలు అవి పగలు, రాత్రి అయినా కనేందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య లావాదేవీల గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకోవటం అవసరం. బోగస్‌ వాట్సాప్‌ యూనివర్సిటీ మేథావుల సమాచారాన్ని నమ్మవద్దు. మన దేశం నుంచి 2019లో జరిగిన ఎగుమతులలో అమెరికాకు 15.91శాతం, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు 9.13, చైనాకు 5.08,హాంకాంగ్‌కు 3.93శాతం, సింగపూర్‌కు 3.51, మిగతా అన్ని దేశాలకు కలిపి 62.44శాతం ఉన్నాయి. ఇదే ఏడాది చైనా ఎగుమతులలో మన దేశ వాటా కేవలం మూడు శాతంతో ఏడవ స్ధానంలో ఉన్నాము. మొదటి స్ధానంలో ఉండి 16.8 శాతం దిగుమతి చేసుకుంటున్న అమెరికాయే రెండు సంవత్సరాల నుంచి వాణిజ్య యుద్దం చేస్తూ చైనాను వెంట్రుకవాసి కూడా కదిలించలేకపోయిందన్నది తెలుసుకుంటే సోనమ్‌ వాంగ్‌చుక్‌ లాంటి వారు కలలు కనటానికి అసలు నిదరే పట్టదు మరి.
చైనా నుంచి మనం మూడుశాతం దిగుమతులు నిలిపివేస్తే, మన ఎగుమతులు ఐదుశాతం నిలిచిపోతాయి. చైనా నుంచి మనం వస్తువుల దిగుమతిని నిలిపివేయాలని వాస్తవాల మీద ఆధారపడి పిలుపులు ఇస్తున్నారా లేక ఊహల్లో ఉండి చేస్తున్నారో తెలియదు. ఇవాళ అనేక వస్తువులు ఏవీ ఒక దేశంలో తయారు కావటం లేదు. ఒక్కో దేశంలో కొన్ని భాగాలు తయారైతే వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి సంపూర్ణ వస్తువును రూపొందిస్తున్నారు. ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రికల్‌ వస్తువులన్నీ అలాంటివే. ఈ నేపధ్యంలో మన ప్రధాని నరేంద్రమోడీ స్ధానిక వస్తువులనే అడగండి అన్న పిలుపు మేరకు ఎవరైనా దుకాణాలకు వెళ్లి పక్కా స్ధానిక వస్తువులను ఎన్నింటిని కొనగలమో ఆలోచించండి.
ఒక దేశ వస్తువుల మీద మరొక దేశం లేదా కొన్ని దేశాలు దిగుమతి పన్నులు విధించినట్లయితే వాటిని తప్పించుకొనేందుకు ప్రతి దేశం ప్రయత్నిస్తుంది. అదే పని చైనా కూడా చేస్తున్నది. కొన్ని వస్తువులను హాంకాంగ్‌ ద్వారా ఎగుమతి చేయిస్తున్నది, మరికొన్నింటిని మరికొన్ని దేశాల ద్వారా సరఫరా చేస్తున్నది. అనేక వస్తువుల మీద ఏ దేశంలో తయారైంది అన్న సమాచారమే ఉండదు. అలాంటపుడు ఫలానా వస్తువు చైనాది అని ఎవరు చెప్పగలరు ? చైనా నుంచి మన ఔషధ కంపెనీలకు, ఇతర పరిశ్రమలకు అవసరమైన బల్క్‌డ్రగ్స్‌, ముడిసరకులను కూడా దిగుమతి చేసుకుంటున్నాము. వినిమయ వస్తువులనే కాకుండా చైనా అంశ ఉన్న ప్రాణావసర ఔషధాలను కూడా కూడా బహిష్కరించాలా ?
మన ప్రధాని మేకిన్‌ ఇండియా అని పిలుపు ఇచ్చిన తరువాత కొన్ని చైనా కంపెనీలు మన దేశంలోనే పెట్టుబడులు పెట్టి సెల్‌ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఆ కంపెనీలను కూడా మూయిస్తారా, ఆ ఫోన్లను కూడా బహిష్కరిస్తారా ? చైనాగాక ఇతర దేశాలు తయారు చేస్తున్న అనేక వస్తువులను కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాము. వాటిలో ప్రతిదానిలో ఏదో ఒక భాగం చైనాలో తయారైనదిగా ఉంటుంది. మరి వాటి పట్ల వైఖరి ఏమిటి ? అమెరికా, జపాన్‌, మన దేశ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు కూడా అక్కడ సంస్ధలను స్ధాపించి వస్తువులను ఉత్పత్తి చేయించి ఎగుమతులు చేస్తున్నారు. వాటిని చైనా ఉత్పత్తులుగా పరిగణించాలా మరొక దేశానివిగా భావించాలా ?
చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో బాబా రామ్‌దేవ్‌ కూడా తక్కువ తినలేదు. చైనా వస్తువులను బహిష్కరించటం దేశానికి సేవ చేయటమేనని చెప్పారు. ఫోన్‌ నుంచి టిక్‌టాక్‌, షేర్‌ఇట్‌,విడ్‌మేట్‌ వంటి యాప్స్‌ను తొలగిస్తున్న ఒకవీడియోను ట్వీట్‌ చేశారు. చైనా వ్యతిరేకతలో భాగంగా జైపూర్‌కు చెందిన ఒక సంస్ధ ‘రిమూవ్‌ చైనా యాప్‌(చైనా యాప్‌లను తొలగించండి) అనే ఒక యాప్‌ను తయారు చేసి వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంచింది. దాన్ని తమఫోన్‌లో పెట్టుకున్నవారికి ఏవి చైనా యాప్‌లో అది తెలియ చేస్తుంది. కావాలనుకున్నవారు వాటిని తొలగించుకోవచ్చు.
ఈ యాప్‌ను తన దుకాణంలో అందుబాటులో ఉంచిన గూగుల్‌ ప్రస్తుతం దాన్ని తొలగించింది. అలాంటి యాప్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచటం దుకాణ విధానాలకు వ్యతిరేకమని పేర్కొన్నది. అందుబాటుల్లో ఉంచే ముందు దానికి తెలియదా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఇదే కాదు టిక్‌టాక్‌కు ప్రత్నామ్నాయ తయారీ అంటూ మిత్రోం పేరుతో విడుదల చేసిన యాప్‌ను కూడా గూగుల్‌ నిలిపివేసింది. కాపీ యాప్‌ల తయారీ, విక్రయం తమ విధానాలకు వ్యతిరేకమని పేర్కొన్నది. అయితే చైనా వత్తిడి కారణంగానే గూగుల్‌ ఈ చర్యకు పాల్పడిందని కొందరు నెటిజన్లు సంస్ధ సిఇఓ సుందర్‌ పిచరు మీద విరుచుకు పడ్డారు. ఆయన దేశద్రోహా, దేశభక్తుడా ?
చైనా వస్తువులను బహిష్కరించాలి అని ప్రబోధిస్తున్న వారు, దానిని సమర్ధిస్తున్నవారు కాస్త ఉద్రేకాన్ని తగ్గించుకొని ఆలోచించాలి. సరిహద్దుతో మనకు సమస్యలున్నాయి గనుక ఆ దేశ వస్తువులను వద్దంటున్నారా ? లేక స్వదేశీ వస్తువులనే అడగండి అని మోడీ పిలుపు ఇచ్చారు కనుక వద్దంటున్నారా ? మొదటి అంశం అయితే ఏదో ఉద్రేకం అని సరిపెట్టుకోవచ్చు. రెండవది అయితే ఒక్క మూడుశాతం చైనాయేం ఖర్మ, యావత్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న 97శాతం వస్తువులు నిలిపివేస్తే మన వస్తువులు మనం కొనుక్కున్నట్లు అవుతుంది. అవి తయారు చేసేందుకు అవసరమైన పరిశ్రమలు, వాణిజ్యాన్ని పెంచుకున్నట్లు ఉంటుంది. దాని ద్వారా మన యువతకు ఉపాధి లభిస్తుంది. రాజకీయంగా ఆ దేశాలన్నీ కూడా మన కాళ్ల బేరానికి వస్తాయి కదా ! మరి ఆ పిలుపు ఎందుకు ఇవ్వటం లేదు ? దీన్లో కూడా రాజకీయాలు ఉన్నాయా ?
చైనా వస్తువులను బహిష్కరించాలని చెప్పేవారు వాటిని మన దేశంలోకి అనుమతిస్తున్న పాలకుల సంగతి ముందు తేల్చాలి. వారు దేశభక్తులో, ద్రోహులో నిలదీయాలి.ఒక వేళ అక్రమంగా సరిహద్దులు, సముద్రాలు దాటి వస్తుంటే మన భద్రతా దళాలు, నిఘా సంస్ధలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించాలి. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్లుగా ఒకవైపు అనుమతించటం ఎందుకు, మరో వైపు బహిష్కరించమనటం ఏమిటి ? వాణిజ్యవేత్తల లాభాల కోసం దిగుమతులను అనుమతిస్తూ జనానికి దేశభక్తి, స్వదేశీ, ఓకల్‌ ఫర్‌ లోకల్‌ అని సొల్లు కబుర్లు చెబుతారా ? చైనా లేదా మొత్తం విదేశీ వస్తువులను కొన వద్దు అని ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు పిలుపు ఇవ్వరు ? యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉప్పొంగటం లేదా ? ఒక్క వస్తువులనేనా లేక చైనా పెట్టుబడులను కూడా వద్దంటున్నారా ?
గేట్‌వే హౌస్‌ అనే ఒక సంస్ధ ఇటీవల ఒక నివేదికను ప్రచురించింది. మన దేశంలోని టెక్‌ అంకుర సంస్ధలలో నాలుగు బిలియన్‌ డాలర్ల చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఒక బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి ఉన్న 30 పెద్ద అంకుర సంస్ధలలో 18లో చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఫిబ్రవరిలో వెల్లడైన ఆ నివేదిక ప్రకారం మొత్తం 92 సంస్ధలలో చైనా నిధులు ఉన్నాయి. నరేంద్రమోడీ గారు అధికారానికి వచ్చిన తరువాత ఆ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీలన్నింటికీ యజమానులు చైనీయులు లేదా అక్కడి మాతృసంస్ధలు కావు. అనేక మంది భారతీయులు, చైనీయులు కాని వారు మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. అంతే కాదు, మన దేశానికి చెందిన వారు తమ సంస్ధలలో పెద్ద ఎత్తున నష్టాలు వచ్చిన తరువాతనే విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇచ్చారు. వాటిలో చైనీయులు, కాని వారు అందరూ ఉన్నారు. పేటిమ్‌కు 2019లో రూ.3,690 కోట్లు, ఫ్లిప్‌కార్ట్‌కు రూ.3,837 కోట్ల నష్టం వచ్చింది. వాటిలో చైనీయులు పెట్టుబడి పెట్టారు. ఉన్న ఫళాన సోనమ్‌ వాంగ్‌చుక్‌ వంటి వారు వారిని తట్టాబుట్టా సర్దుకుపొమ్మంటారా ? లేదా స్వదేశీ రామ్‌దేవ్‌ బాబా చైనా పెట్టుబడులను తిరిగి ఇచ్చి ఆ వాటాలను తన పతంజలి సంస్ధద్వారా కొనుగోలు చేయాలి.
2019 నివేదిక ప్రకారం మన దేశంలో ఫోన్‌ వినియోగదారులు డౌన్లోడ్‌ చేసుకున్న అగ్రశ్రేణి 50శాతం యాప్‌లలో చైనా పెట్టుబడులు ఉన్నాయి. మరి వాటిని కూడా ఫోన్ల నుంచి తొలగిస్తారా ? 2019తొలి మూడునెలల్లో మన దేశంలోని స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో చైనా బ్రాండ్స్‌ 66శాతం ఆక్రమించాయి. వాటిని కొనుగోలు చేసిన వారెందరు తమ ఫోన్లను చెత్తబుట్టలో పడవేసి తమ దేశభక్తిని నిరూపించుకున్నారో ఎవరికి వారు పక్కవారిని పరిశీలించాలి. మార్కెట్లో ఏ దేశంలో తయారైందో ,బ్రాండ్‌లు తెలియని అనేక చైనా వస్తువులను ఇబ్బడి ముబ్బడిగా విక్రయిస్తున్నారు, జనం కొనుగోలు చేస్తున్నారు. మేడిన్‌ ఇండియా అనే ముద్రలేని వస్తువులన్నింటినీ మన ఇండ్ల నుంచి బయటపడవేద్దామా ? స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా స్వదేశీ నినాదం మేరకు అనేక మంది బ్రిటన్‌ గ్లాస్కో పంచెలు, చొక్కాలను ,కోట్లు సూట్లు తీసి వేసి జీవితాంతం ఖద్దరు ధరించారు. మహాత్మా గాంధీయే అందుకు నిదర్శనం. ఆయనకంటే గొప్ప దేశభక్తులం మేము అని చెప్పుకుంటున్నవారు ఆపని చేయలేరా ? మనకా పట్టుదల లేదా ? ఓకల్‌ ఫర్‌ లోకల్‌ నినాద మిచ్చిన నరేంద్రమోడీ, ఆయన మంత్రి వర్గ సహచరులు ముందు ఆపని చేశారా ? ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులా ?
ప్రపంచీకరణ యుగంలో ఒక దేశం మరొక దేశంలో కంపెనీలు ఏర్పాటు చేస్తోంది. అక్కడి నుంచి మూడో దేశంలో పెట్టుబడులు పెడుతోంది. వాటిని ఏ దేశానికి చెందినవిగా పరిగణించాలి. ఉదాహరణకు సింగపూర్‌, హాంకాంగ్‌, మలేషియా, మారిషస్‌ వంటి దేశాల్లో ఉన్న రాయితీలు, ఇతర సౌలభ్యాల కారణంగా అనేక సంస్ధలు అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. పెట్టుబడులు కూడా అక్కడి నుంచే పెడుతున్నట్లు చూపుతున్నాయి.ఉదాహరణకు పేటిమ్‌లో చైనాకు చెందిన ఆలీబాబా సింగపూర్‌ హౌల్డింగ్స్‌ ద్వారా పెట్టుబడులు పెట్టారు. మన నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని సింగపూర్‌ పెట్టుబడులుగా కాగితాల మీద చూపింది తప్ప చైనావిగా కాదు. మరి ఇలాంటి వాటి గురించి ఏమంటారు. ఇక్కడ చెప్పవచ్చేదేమంటే ఒక పిలుపు ఇచ్చేటపుడు, దాన్ని బలపరచే ముందు బాధ్యతాయుతంగా ఆలోచించాలి.ప్రతిపోసుకోలు కబురును భుజానవేసుకోకూడదు. భక్తి దేవుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్లుగా రామ్‌దేవ్‌ బాబా తన వస్తువులను మరింతగా అమ్ముకొనేందుకు ఇలాంటి పిలుపులను సమర్ధిస్తారు తప్ప మరొకటి కాదని గుర్తించాలి. ఈ రోజు ఉన్నఫళంగా చైనా వస్తువులను ఆపివేస్తే వాటి స్ధానంలో ఎవరి వస్తువులను కొనాలి. చైనా తప్ప మనకు అన్ని దేశాలూ మిత్రపక్షాలే అని చెబుతున్నవారు ముందు ఆ సంగతి తేల్చాలి. వారు చైనా ధరలకే మనకు అందచేస్తారా ? సోనమ్‌ వాంగ్‌ చుక్‌ చెప్పినట్లు చైనా కోసం పర్సుమూస్తే అధిక ధరలుండా మిగతాదేశాల వస్తువుల కోసం ఉన్న పర్సును ఖాళీ చేసుకొని అప్పులు చేయాలి. చిప్పపట్టుకు తిరగాలి. అందుకు సిద్దపడదామా ?
విదేశీ వస్తువులు అవి చైనావి అయినా మరొక దేశానికి చెందినవి అయినా వినియోగదారులు ఎందుకు కొంటున్నారు. కొన్నవారందరూ దేశద్రోహులు, విదేశీ సమర్ధకులు, తుకడే తుకడే గ్యాంగులు కాదు. దిగుమతి చేసుకొనే వస్తువుల మాదిరి చౌక ధరలు, నాణ్యతను మన దేశంలో తయారీదారులు అందిస్తే ఎవరూ విదేశీ బ్రాండ్లకు ఎగబడరు. చౌకగా వస్తువులు విక్రయించటానికి చైనా,జపాన్‌, దక్షిణ కొరియాకు సాధ్యమౌతోంది. అదే అమెరికా,బ్రిటన్‌లకు ఎందుకు కావటం లేదు? తమ అవసరాలకు మించి మిగతా దేశాలకు సరఫరా చేసేందుకు పెద్ద ఎత్తున సరకులు తయారు చేస్తున్న కారణంగా చైనా వంటి దేశాలకు ఉత్పాదక ఖర్చు తగ్గుతోంది. తమ జనాభా మొత్తానికి పని కల్పించాలి కనుక వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని సబ్సిడీల రూపంలో ఇచ్చి విదేశీ మార్కెట్‌ను పెంచుకొంటోంది. అన్నింటికీ మించి చౌకగా వస్తువులను ఎలా తయారు చేయాలి, ఉత్పాదకతను ఎలా పెంచాలి అనేందుకు అవసరమైన పరిశోధన, అభివృద్ది ఖర్చు చైనా, జపాన్‌, కొరియాల్లో ఎక్కువగా ఉంటోంది. గతంలో ఎవరి చేతుల్లో చూసినా కొరియా శాంసంగ్‌, ఫిన్లాండ్‌ నోకియా కనిపించేది. చైనా ఫోన్లు చౌకరకం, సరిగా పనిచేయవని అనే వారు. ఇప్పుడు ఎక్కడ చూసినా చైనా ఫోన్లే, పని చేయవు అనే ఫిర్యాదు లేదు. వాటి దెబ్బకు జపాన్‌ సోనీ, పానాసోనిక్‌, మన దేశానికి చెందిన మైక్రోమాక్స్‌ కనుమరుగయ్యాయి.ఇప్పుడు మన దేశంలో తయారవుతున్న అనేక ఫోన్లలో వాడుతున్నది చైనా విడిభాగాలే, వాటిని తయారు చేస్తున్నదీ మన దేశంలో ఏర్పాటు చేసిన చైనా కంపెనీలే మరి. వాటన్నింటినీ మూసివేస్తే మన ఆర్ధిక వ్యవస్ధకు, ఉపాధికి సైతం నష్టమే. పడవ నుంచి దూకాలనుకొనే ముందు పర్యవసానాలను ఆలోచించుకోపోతే ఏమౌతుందో తెలుసా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d