• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: # Anti Muslims

హిందూత్వ శక్తుల అడ్డగోలు వాదనలు – ముస్లింలే కదా అని మౌనంగా ఉంటే మహిళలు, బడుగులకూ ముప్పు !

22 Saturday Nov 2025

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

# Anti Muslims, BJP, Hindu Fundamentalism, hindutva, mata vaishno devi medical college, Muslims in Higher Education, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన జమ్మూ -కాశ్మీరు రాష్ట్రంలో మాతా విష్ణుదేవి పేరుతో కొత్తగా ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటయింది.నేషనల్‌ ఎలిజబులిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ ) ప్రతిభ ఆధారంగా ఆ రాష్ట్రంలోని వారికి సీట్లు కేటాయిస్తారు. ఇటీవలనే జమ్మూ ప్రాంతంలో ప్రారంభమైన ఆ కాలేజీలో 2025-26 సంవత్సరానికి తొలి బ్యాచ్‌ సీట్ల కేటాయింపు జరిగింది. యాభై సీట్లకు గాను 42 మంది ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారు సీట్లు పొందారు. దాని అనుబంధ ఆసుపత్రిలో వైద్యులు కూడా ముస్లింలే ఎక్కువగా ఉన్నారట. ఇంకేముంది అక్కడి హిందూత్వ వాదులు గుండెలు బాదుకుంటూ సీట్ల కేటాయింపు విధానాన్ని తాము అంగీకరించటం లేదని, మార్చాల్సిందే అని ఆందోళనకు దిగారు. షరా మామూలుగా బిజెపి వారు కూడా వారితో చేరారు. వారి వాదన ఏమిటి ? సీట్ల కేటాయింపు మత సమతూకం ప్రకారం లేదట. ఆ కాలేజీ నిర్వహణ మాత వైష్ణదేవి ఆలయానికి చెందిన బోర్డుది గనుక హిందూ భక్తులు ఇచ్చిన నిధులతో ఏర్పాటు చేసినందున మెజారిటీ సీట్లు, సిబ్బంది హిందువులతోనే నింపాలని రభస చేస్తున్నారు. మత ప్రాతిపదికన సీట్లు కేటాయించాలంటున్నారు. చిత్రం ఏమిటంటే దేశంలోని ఇతర ప్రాంతాల్లో వీరు మరోవిధంగా రెచ్చగొడుతున్నారు. వెనుకబాటు తనం ఆధారంగా ముస్లింలను ఓబిసి, బిసి జాబితాలో చేర్చి విద్య,ఉపాధి రంగాలలో రిజర్వేషన్లను కల్పించాలంటే ఇదే హిందూత్వ శక్తులు బరాబర్‌ వ్యతిరేకిస్తూ మత ప్రాతికన రిజర్వేషన్లు ఉండకూడదని రచ్చ చేస్తున్నాయి. ఏ రోటి దగ్గర ఆ పాట పాడుతున్నారు. వీరికి రాజ్యాంగం, చట్టాలు, నిబంధనల పట్ల నిబద్దత లేదు, వారు చెప్పిందే అమలు జరగాలి. ఈ అడ్డగోలు వాదన ఒక్క మాత వైష్ణదేవి సంస్థకే, ముస్లింలకే పరిమితం అవుతుందా ? దేశంలో పన్నులు చెల్లిస్తున్నవారిని మత, కుల ప్రాతిపదికన లెక్కించి అన్నీ ఆ ప్రకారమే చేయాలని కూడా రోడ్లెక్కరన్న గ్యారంటీ ఏముంది ?

ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మైనారిటీ మతాలకు చెందిన వారు నిర్వహించే సంస్థలలో ఆ మతాలకు చెందినవారికే పెద్ద పీట వేస్తారని, అలాంటిది హిందువులు నిర్వహించే సంస్థలకు ఎందుకు వర్తించదని అమాయకత్వాన్ని నటిస్తున్నారు. మన రాజ్యాంగం మైనారిటీ సంస్థల నిర్వహణకు అలాంటి వెసులుబాటు కల్పించింది. వాటికీ నిబంధనలు ఉన్నాయి తప్ప అడ్డగోలు తనం కుదరదు. దేశంలో హిందువులు మైనారిటీలు కాదు.వైష్టదేవి ఆలయ బోర్డు తన విధానాలను మార్చుకొని మతానికే మాత్రమే పరిమితం కావాలని, హిందువులకు మాత్రమే సీట్లు, ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్లను కూడా కొందరు ముందుకు తెచ్చారు. మరికొందరైతే దేవాలయాలకు వెళ్లని వారిని ఆ కాలేజీలో పనిచేయనివ్వకూడదని కూడా డిమాండ్‌ చేశారు. వైద్యసేవలు అందించటానికి-దేవాలయాల సందర్శనకు అసలు సంబంధం ఏమిటి ? ఈ ఉన్మాదం అంతటితో ఆగుతుందా ? అడ్డబొట్లు, నిలువు బొట్ల వివాదాన్ని, చివరకు మనువాద చాతుర్వర్ణ వ్యవస్థను కూడా ముందుకు తీసుకువస్తుంది. మొగ్గగా ఉన్నపుడే మహిళలు, వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు ఈ ప్రమాదకర ధోరణుల గురించి ఆలోచించాలి. ముస్లింలే కదా మనకెందుకులే అనుకుంటే చివరికి ఈ తరగతుల వరకు వచ్చినపుడు అయ్యో అనేవారు ఉండరు. ఎందుకంటే చరిత్రలో మనువాద బాధితులు వీరే. హిందూత్వ శక్తుల ఆరాధ్య దైవం హిట్లర్‌ జర్మనీలో చేసింది అదే. ముందుగా కమ్యూనిస్టులను అణచివేస్తే, యూదులను ఊచకోత కోస్తే జనం పట్టించుకోలేదు, చివరికి తమదాకా వచ్చిన తరువాత ఎవరూ మిగల్లేదు.

మన రాజ్యాంగం దేశం మొత్తాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి మైనారిటీలను గుర్తించింది తప్ప రాష్ట్రాల్లో ఉన్న జనాభాను బట్టి కాదు. జమ్మూ కాశ్మీరులో మొత్తంగా చూసినపుడు మెజారిటీ ముస్లింలు, ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువ చోట్ల మెజారిటీ క్రైస్తవులు. అలాంటి చోట్ల ఇప్పుడు ఉనికిలో ఉన్న మన రాజ్యాంగం ప్రకారం హిందువులను మైనారిటీలుగా గుర్తించే అవకాశం లేదు. అందుబాటులో ఉన్న తాజా జనాభా జనాభా లెక్కలు 2011 ప్రకారం దేశ జనాభాలో 14.2శాతం మంది ముస్లిం మతానికి చెందిన వారు ఉన్నారు. విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ వంటి హిందూత్వ సంస్థలు కాశ్మీరులో డిమాండ్‌ చేస్తున్నట్లు మతప్రాతిపదికను తీసుకుంటే దేశమంతటా విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 14.2శాతం ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి ఏమిటి ? ఉన్నత విద్య గురించి 2020-21 సంవత్సరానికి సంబంధించి జరిపిన అఖిలభారత సర్వే(ఎఐఎస్‌హెచ్‌ఇ) ప్రకారం 4.326 కోట్ల మంది ఉన్నత విద్యలో చేరినట్లు నమోదు కాగా వారిలో ముస్లింలు కేవలం 4.87శాతమే(21,08,033) ఉన్నారు. ఇది హిందూ వ్యతిరేకులో కమ్యూనిస్టులో జరిపిన సర్వే కాదు. అంటే జనాభాకు అనుగుణంగా వారి శాతం ఉండాలంటే ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించాల్సి ఉంది. మన రాజ్యాంగాన్ని రాసుకున్న సమయంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్న కారణంగానే మైనారిటీ విద్యా సంస్థలద్వారా వారి స్థాయిని పెంచేందుకు సాధారణ రిజర్వేషన్లకు భిన్నంగా వారికి ఎక్కువ అవకాశం కల్పించారు. అయితే వాటిని దుర్వినియోగం చేసి ఆ సంస్థలను కొంత మంది వ్యాపారంగా మార్చివేశారన్నది వేరే అంశం.ఈ సర్వే ప్రకారం కొన్ని వివరాలను చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూ-కాశ్మీరు జనాభాలో ముస్లింలు 68.8, హిందువులు 28.8శాతం ఉన్నారు. అన్ని రంగాలలో ఆ దామాషా ప్రతిబింబించాలి. కానీ సర్వే ప్రకారం అక్కడ నమోదైన విద్యార్ధుల్లో 34.5శాతమే ముస్లింలు ఉన్నారు. మరి జమ్మూలోని హిందూత్వ వాదులు, దేశంలో వారిని సమర్ధించేవారు దీనికి ఏం చెబుతారు ? లడఖ్‌ ప్రాంతంలో 25.8శాతం ముస్లింలు ఉన్నారు. రాష్ట్రాల వారీ ఉన్నత విద్యారంగంలో ముస్లింల శాతం దిగువ విధంగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభాకు అనుగుణంగా ఎక్కడా ప్రాతినిధ్యం లేదు. బ్రాకెట్లలోని అంకెలు 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లిం శాతాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2014లో విడిపోయిన కారణంగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రస్తుత ముస్లిం జనాభా శాతం అంచనాలుగా గమనించాలి)

ఆంధ్రప్రదేశ్‌ × 2.92(9.56), అరుణాచల్‌ ప్రదేశ్‌××0.16(1.95), అసోం ××12.5(34.22),బీహార్‌ ×× 6.58(16.87),చండీఘర్‌ ×× 0.62(1.95), చత్తీస్‌ఘర్‌ ×× 0.78(2.02),జమ్ము-కాశ్మీర్‌ ×× 34.50(68.31)ఢిల్లీ ×× 2.47(12.86), గోవా ×× 4.72(8.33),గుజరాత్‌ ×× 2(9.67), హర్యానా×× 0.99(7.03),హిమచల్‌ ప్రదేశ్‌×× 0.41(2.18)ఝార్ఖండ్‌×× 4.34(14.53)కర్ణాటక×× 6.05(2.18)కేరళ ×× 14.36(26.56)మధ్య ప్రదేశ్‌ ×× 1.4 (6.57)మహారాష్ట్ర ×× 3.38(11.54)మణిపూర్‌×× 1.5(8.40)మేఘాలయ××.2(4.40)మిజోరామ్‌ ×× 0.28(1.35)నాగాలాండ్‌ ×× 0.49(2.47)ఒడిషా ×× 0.79(2.17)పుదుచ్చేరి ×× 3.45(6.05)పంజాబ్‌ ×× 2.32(1.93)రాజస్థాన్‌ ×× 1.73(9.07)సిక్కిం ×× 0.48(1.62)తమిళనాడు ××3.50(5.86)తెలంగాణా ×× 7.60(12.56)త్రిపుర ×× 2.98(8.60)ఉత్తర ప్రదేశ్‌ ×× 4.68(19.26)ఉత్తరాఖండ్‌ ×× 2.96(13.95)పశ్చిమబెంగాల్‌×× 12.33(27.01)

పైన పేర్కొన్న వివరాల ప్రకారం విద్యా సంస్థలలో చేరిన వారు రెండంకెలు దాటిన రాష్ట్రాలు జమ్ము-కాశ్మీరు, కేరళ, పశ్చిమబెంగాల్‌, అసోం మాత్రమే.వీటిలో జనాభా రీత్యా ముస్లింలు మెజారిటీగా ఒక్క జమ్ము-కాశ్మీరు, కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌ మాత్రమే ఉన్నాయి. గణనీయ సంఖ్యలో ఉన్న వాటిలో 34 నుంచి 16.87శాతం వరకు ఉన్న రాష్ట్రాలు అసోం, పశ్చిమబెంగాల్‌, కేరళ,ఉత్తర ప్రదేశ్‌,బీహార్‌, మైనారిటీలుగా 14.53 నుంచి 5.86 శాతం మధ్య ఉన్న రాష్ట్రాలు ఝార్కండ్‌,ఉత్తరాఖండ్‌, కర్ణాటక,ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌,తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌,రాజస్తాన్‌,త్రిపుర,మణిపూర్‌, గోవా, హర్యానా,మధ్య ప్రదేశ్‌, పుదుచ్చేరి, తమిళనాడు ఉండగా మిగిలిన రాష్ట్రాలు 4.87 శాతం కంటే తక్కువగా ఉండి పెద్దగా లేనివిగా ఉన్నాయి. ఈ లెక్కలను గమనించినపుడు ముస్లింలు ఉన్నత విద్యలో ఎంత వెనుకబడి ఉన్నదీ కనిపిస్తున్నది. ముస్లింలను సంతుష్టీకరించేందుకు కాంగ్రెస్‌ పాలనలో వారికి అంతా దోచిపెట్టారన్న ప్రచారాన్ని చూసినపుడు అదంతా తప్పుడు ప్రచారం తప్ప వాస్తవం కాదని తేలుతున్నది. ఓట్ల కోసం మెజారిటీ ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ఎత్తుగడలో ఇది భాగం తప్ప వేరు కాదు. జమ్మూలో ఒక మెడికల్‌ కాలేజీలో అత్యధికులు ముస్లిం విద్యార్ధులు ఉన్నందుకే అదీ ప్రతిభ ఆధారంగా పొందినందుకే అంతగా యాగీ చేస్తున్న పెద్దలు దేశమంతటా నెలకొన్న పరిస్థితి గురించి ఏమంటారు ? సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ కేవలం మాటలకేనా ? పోనీ హిందువులను వీరు ఉద్దరించారా ? ఏం చేశారో చెప్పమనండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

న్యాయవ్యవస్థలో హిందూత్వ శక్తుల చొరబాటు : ముస్లింలపై విద్వేషం-అలహాబాద్‌ హైకోర్టు జడ్జి వివరణ కోరిన సుప్రీం !

11 Wednesday Dec 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

# Anti Muslims, #Hindutva, Anti Muslim propaganda in India, BJP, Gujarat hindutva rapist files, HC Judge Shekhar Kumar Yadav, Hindutva And the Higher Judiciary, Hindutva fanatics, Narendra Modi Failures, RSS, Supreme Court, VHP

ఎం కోటేశ్వరరావు

ఆ పెద్దమనిషి దేశంలోనే పురాతన కోర్టులలో ఒకటైన అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి. పేరు శేఖర్‌ కుమార్‌ యాదవ్‌, 2026లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. కాషాయ తాలిబాన్ల మాదిరి ముస్లిం విద్వేషాన్ని వెళ్లగక్కిన ఆ పెద్దమనిషిని జడ్జిగా తొలగించాలని తీర్మానం పెట్టేందుకు ఎంపీల నిర్ణయం, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పలువురి ఫిర్యాదు. విశ్వహిందూ పరిషత్‌ సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరిన సుప్రీం కోర్టు. దేశవ్యాపితంగా సంచలనం కలిగించిన ఈ ఉదంతానికి వస్తే..... 2024 డిసెంబరు ఎనిమిదవ తేదీన కోర్టు ప్రాంగణంలోని గ్రంధాలయ హాలులో వివాదాస్పద హిందూత్వ ఉగ్రవాద సంస్థగా కొందరు పరిగణించే విశ్వహిందూపరిషత్‌ న్యాయవాదుల విభాగం నిర్వహించిన సభను అలహాబాద్‌ హైకోర్టు జడ్జి దినేష్‌ పాథక్‌ ప్రారంభిస్తే అదే కోర్టుకు చెందిన మరో జడ్జి శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ రాజ్యాంగవిరుద్దమైన, విద్వేషపూరిత ప్రసంగం చేశారు. చేసిన ప్రమాణానికి విరుద్దంగా మాట్లాడినందున న్యాయమూర్తిగా అనర్హులని ఆ మేరకు చర్య తీసుకోవాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. న్యాయవ్యవస్థ జవాబుదారీతనం మరియు సంస్కరణల ప్రచార సంస్థ(సిజెఎఆర్‌) కన్వీనర్‌, ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషన్‌ కూడా సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఉత్తరం రాశారు. సదరు జడ్జి ప్రసంగం న్యాయవ్యవస్థకు అపచారమని, ప్రసంగ అంశాలపై విచారణ జరపాలని కోరారు. రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబాల్‌ కూడా పదవి నుంచి తొలగించాలని కోరారు. ఈ ఉదంతం దేశంలో పెద్ద సంచలనం సృష్టించింది. సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మరోసారి న్యాయవ్యవస్థలో ఆవాంఛనీయ ధోరణులు, హిందూత్వ శక్తుల ప్రవేశం, ముస్లిం వ్యతిరేక విద్వేష ప్రచారం తదితర అంశాల గురించి చర్చకు దారితీసింది. ఒక వివాదాస్పద సంస్థ హైకోర్టు ప్రాంగణంలో సభకు అనుమతించటం, దానిలో న్యాయమూర్తులు పాల్గొని అనుచిత ప్రసంగం చేయటం మన న్యాయవ్యవస్థకు ముంచుకువస్తున్న ముప్పుగా అనేక మంది భావిస్తున్నారు.

1991నాటి ప్రార్ధనా స్థలాల చట్టం ప్రకారం 1947 నాటికి ఏ మత ప్రార్ధనా స్థలం అలా ఉంటే దాన్ని అలాగే కొనసాగించాలి తప్ప వివాదాస్పదం చేయకూడదు. అయితే బాబరీ మసీదు లేదా రామజన్మభూమి వివాదం కోర్టులో ఉన్నందున దానికి మినహాయింపు ఇచ్చారు. దీన్ని సుప్రీం కోర్టు కూడా సమర్ధించింది. గతంలో పార్లమెంటుచేసిన అనేక చట్టాలను మార్చినందున దీన్ని కూడా సవరించాలనే వాదనలు ముందుకు వచ్చాయి. దీని మీద సుప్రీం కోర్టులో దాఖలైన కేసు ఈనెల 12న విచారణకు రానున్నది. గతంలో షాబానో కేసు తీర్పును వమ్ము చేస్తూ కాంగ్రెస్‌ హయాంలో పార్లమెంటులో చట్ట సవరణ చేయటాన్ని అనేక మంది పురోగామి వాదులు వ్యతిరేకించారు. బిజెపి దాన్ని ఒక ఆయుధంగా చేసుకొని ముస్లింలను కాంగ్రెస్‌ సంతుష్టీకరిస్తున్నదని దాడి చేస్తున్నది. చరిత్రలో జరిగిన తప్పులను సరిదిద్దే పేరుతో ప్రార్ధనా స్థలాల చట్టాన్ని ఎందుకు మార్చకూడదని కాషాయ దళాలు ప్రశ్నిస్తున్నాయి. ఆర్టికల్‌ 370ని రద్దు చేశారని, ఈ చట్టాన్ని కూడా ఎందుకు మార్చకూడదనే వాదనలను ముందుకు తెచ్చాయి. దీనికి కూడా సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పు వారికి ఆయుధంగా మారింది. ‘‘ ఉమ్మడి పౌర స్మృతిరాజ్యాంగ అనివార్యత ’’ అనే అంశంపై ముప్ఫై నాలుగు నిమిషాల ప్రసంగంలో దేశం మెజారిటీ వాంఛలకు అనుగుణంగా పని చేయాలని, ముస్లిం సమాజం నుంచి కీడు తలెత్తిందని అలహాబాదు జడ్జి చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా హిందూమతోన్మాదశక్తులు చేస్తున్న వాదనల సారాంశాన్ని శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ పునశ్చరణ చేశారు.బహుభార్యాత్వం,ఛాందసత్వం,కుహనా మతవాదులంటూ ముస్లింలోని ఒక తరగతిని కించపరుస్తూ ఉపయోగించే ‘‘కత్‌ముల్లా ’’ అనే పద ప్రయోగం చేశారు. అలాంటి వారు దేశానికి ముప్పు అన్నారు. హిందువులు పిల్లలకు చిన్నతనం నుంచి అహింసను బోధిస్తారని, సహనాన్నిచొప్పిస్తారని, అదే ముస్లింల పిల్లలు చిన్నతనంలోనే జంతువధ హింసను చూస్తారని ఆరోపించారు. ఇంకా అయోధ్యలో రామమందిరం కోసం పూర్వీకులు త్యాగాలు చేశారు. ఉమ్మడి పౌర స్మృతి కూడా త్వరలో సాకారం కానున్నది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మెజారిటీకి అనుకూలంగా చట్టం పని చేస్తుంది.ఇది చట్టం, ఒక హైకోర్టు న్యాయమూర్తిగా నేను ఇది చెబుతున్నానని మీరు చెప్పలేరు. అది కుటుంబ నేపధ్యమైనా సమాజ సంబంధమైనా మెజారిటీ ప్రకారమే జరగాలి.కేవలం మెజారిటీ సంక్షేమం, సంతోషాలకు తోడ్పడేదానినే అంగీకరించటమౌతుంది. నేను మాట్లాడుతున్నదంతా చెడ్డ కాదు, కానీ మీరు ఎవరినైతే కత్‌ముల్లాస్‌ అని పిలుస్తున్నారో….ఈ మాట అభ్యంతరకరమని నాకు తెలుసు, కానీ దీన్ని చెప్పటానికి నేను సంకోచించను, ఎందుకంటే దేశానికి ఇది వినాశకరమైనది. హిందువులు సహనం, దయతో ఉన్నారంటే పిరికి వాళ్లని పొరపాటు పడవద్దు. మీరు ఒక లాయరు, ఒక వ్యాపారి లేదా ఒక విద్యార్థి కావచ్చు గానీ ముందు నీవు ఒక హిందువు. ఇది తన మాతృభూమి అని ఎవరు చెప్పినా వారు దాని బిడ్డలే, వారు ఏ మతాన్ని పాటించినా హిందువులే. అలహాబాద్‌ జడ్జి ప్రసంగం సాగిన తీరు ఇది.


ఈ న్యాయమూర్తి గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2021లో సంభాల్‌కు చెందిన ఒక ముస్లిం వ్యక్తి తన అనుచరులతో కలసి ఆవును అపహరించి వధించినట్లు కేసు దాఖలైంది.సదరు నిందితుడికి బెయిలు ఇచ్చేందుకు నిరాకరించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, హిందువుల ప్రాధమిక హక్కుల్లో గోరక్షణ చేర్చాలని చెప్పారు. ఆక్సిజన్‌ పీల్చి దాన్నే బయటకు వదిలే ఏకైక జంతువు ఆవు అని శాస్త్రవేత్తలు నమ్ముతారని కూడా అన్నారు. రాముడు, కృష్ణుడిని అవమానిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడనే మరొక కేసులో హిందువుగా ఉన్న దళితుడికి బెయిలు ఇస్తూ వాల్మీకి, వేదవ్యాసులకు జాతీయ గౌరవాన్ని కల్పించాలని అన్నారు. సంఘపరివార్‌ ముందుకు తెచ్చిన హిందూత్వకు న్యాయవ్యవస్థ తనదైన శైలిలో భాష్యం చెప్పటంతో బిజెపి ఆ పేరుతో ఓట్లడగటానికి, మనోభావాలను రెచ్చగొట్టటానికి వీలు కలుగుతోంది.1995లో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జెఎస్‌ వర్మ, ఎన్‌పి సింగ్‌,కె.వెంకటసామి ఇచ్చిన ఒక తీర్పులో రాజకీయ నేతలు మతం, కులం,జాతి, తెగ లేదా భాష పేరుతో ఓట్లు అడగటాన్ని, పౌరుల్లోని భిన్న తరగతుల మధ్య శతృత్వం లేదా విద్వేషాన్ని పెంచటాన్ని అక్రమ పద్దతులుగా పేర్కొన్నారు. అయితే హిందూత్వ అనేది మతం కాదని, ఒక జీవన విధానం లేదా ఒక మానసిక స్థితి అని దాన్ని హిందూమత ఛాందసంతో సమానంగా చూడకూడదని కూడా ఆ తీర్పులో పేర్కొన్నారు. అందుకే బిజెపి నేతలు పదే పదే తాము హిందూత్వకు కట్టుబడి ఉన్నామని, అలాగే ఉంటామని చెబుతుంటారు. అందుకే నరేంద్రమోడీని హిందూ హృదయ సామ్రాట్‌గా పిలుచుకుంటారు.


మరికొన్ని కోర్టు తీర్పులు కూడా విమర్శలకు గురైన సంగతి తెలిసిందే.బాబరీ మసీదు కేసులో తమ ముందు ఉన్న సాక్ష్యాలను బట్టిగాక మతపరమైన మనోభావాల ప్రకారం తీర్పు ఇచ్చి రామాలయ నిర్మాణానికి వివాదాస్పద స్థలాన్ని అప్పగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. బాబరీ మసీదు కూల్చివేత రాజ్యాంగ విరుద్దం, అత్యంత చెడు చర్య అని గుర్తిస్తూనే తీర్పును వెల్లడిరచారు. ఆ బెంచ్‌లో తీర్పురాసిన, తరువాత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన చంద్రచూడ్‌ తన పదవీకాలం చివరిలో చెప్పిన మాటలతో అనేక మంది నిర్ఘాంతపోయారు. అయోధ్య కేసు తీర్పు రాజ్యాంగాన్ని బట్టిగాక దేవుడి ప్రమేయంతో ఇచ్చినట్లు, ఒక పరిష్కారం చూపాలని తాను ప్రార్దించినట్లు చెప్పారు.(తన జన్మ మామూలుగా జరగలేదని, దేవుని అంశంతో జన్మించినట్లు ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకున్న సంగతి తెలిసిందే) ఈ వివాదం రేకెత్తించినప్పటి నుంచి హిందువుల మనోభావాలను గౌరవించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థలు చేసిన వాదనలకు అనుగుణంగా ఆ తీర్పు ఉంది. కాశీలోని గ్యానవాపి మసీదు స్వభావాన్ని మార్చాలని హిందువులు అడగటం లేదని కేవలం దాని మత స్వభావాన్ని నిర్ధారించాలని మాత్రమే కోరుతున్నందున సర్వే చేయవచ్చంటూ ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్‌ ఇచ్చిన తీర్పు కొత్త వివాదాలకు తెరలేపింది. దాన్ని అవకాశంగా తీసుకొని సంభాల్‌లో ఉన్న పురాతన మసీదును సర్వే చేయాలని జిల్లా కోర్టు అనుమతివ్వటం, అనంతరం జరిగిన అవాంఛనీయ పరిణామాలు తెలిసిందే.అనేక మసీదులపై అలాంటి సర్వేలు చేయాలన్న డిమాండ్లను ముందుకు తేవటమే గాక చివరికి 1947 తరువాత ప్రార్ధనా స్థలాల స్వభావాన్ని మార్చకూడదన్న 1991నాటి చట్టాన్ని తిరగదోడేందుకు పూనుకున్నారు.


న్యాయవ్యవస్థలో కాషాయ దళాలు తమ భావజాలం ఉన్న వారిని న్యాయమూర్తులుగా ప్రవేశపెట్టిన తీరును కూడా చూడవచ్చు.కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తన పదవీ విరమణ రోజునే ఆర్‌ఎస్‌ఎస్‌తో తన జీవితాంతం కొనసాగిన బంధాన్ని వెల్లడిరచారు, దానికి తాను రుణపడి ఉంటానని ప్రకటించారు.మరొక న్యాయమూర్తి లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాజీనామా చేసి బిజెపి అభ్యర్ధిగా పోటీచేసి గెలిచిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ఇద్దరు సభ్యుల బెంచ్‌ ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరటంపై ఇచ్చిన తీర్పు దారుణంగా ఉంది. ఒక కేసులో ఇచ్చిన తీర్పులో ప్రముఖ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలో నిషేధిత సంస్థలో చేర్చిన తప్పు కారణంగా ఐదు దశాబ్దాలపాటు అనేక మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనేక విధాలుగా దేశానికి సేవచేయాలనుకొని కూడా ఈ నిషేధం కారణంగా చేయలేక పరిమితమయ్యారని బెంచ్‌ వ్యాఖ్యానించింది. అంటే దేశానికి సేవచేయాలంటే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాలన్న సందేశం దీనిలో ఉంది.ప్రస్తుతం విధుల్లో ఉన్న అడ్వొకేట్‌ జనరల్స్‌, జడ్జీలు 33 మంది ఆర్‌ఎస్‌ఎస్‌ లాయర్ల విభాగం ఏర్పాటు చేసిన సభలు, సమావేశాలకు ప్రధాన అతిధులుగా హాజరయ్యారని, వారిలో తొమ్మిది మంది ఒకటి కంటే ఎక్కువ సభల్లో పాల్గొన్నట్లు కారవాన్‌ 2024 అక్టోబరు సంచికలో పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో విశ్వహిందూ పరిషత్‌ లాయర్ల విభాగం ఏర్పాటు చేసిన సమావేశంలో 30 మంది సుప్రీం కోర్టు, హైకోర్టులలో పనిచేసిన మాజీ న్యాయమూర్తులు పాల్గ్గొన్నారు. వారణాసి, మధుర వివాదం, వక్ఫ్‌ బిల్లు, మతమార్పిడుల గురించి చర్చించినట్లు విహెచ్‌పి అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ చెప్పారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ కూడా దీనిలో పాల్గ్గొన్నారు. ఇది తొలిసారి జరిపిన సమావేశమని తరువాత నిరంతరం జరపుతామని ఒక నేత చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది. గతంలో అనేక మంది ఇలాంటి సమావేశాల్లో పొల్గొనేందుకు సంకోచించేవారు. ప్రస్తుతం దేశంలో హిందూత్వశక్తుల హవా నడుస్తున్నందున నిజరూపాలను బయటపెట్టుకుంటున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ ఫాసిస్టు సంస్థ, ఊసరవెల్లి : సోషలిస్టు నేత మధు లిమాయే చెప్పిన వాస్తవాలేమిటి ?

17 Monday Jun 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

# Anti Muslims, Adolf Hitler, BJP, Guru Golwalkar, Hindu Rashtra, Madhu Limaye, Narendra Modi, Savarkarites, What is RSS


మధులిమాయే


నేను 1937లో రాజకీయ జీవితంలో ప్రవేశించాను. ఆ రోజుల్లో పూనాలో ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు సావర్కర్‌వాదులు( వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అనుచరులు) ఒక వైపు, మరోవైపు జాతీయవాదులు, సోషలిస్టులు మరియు వామపక్ష రాజకీయ సంస్థలు ఎంతో చురుకుగా ఉండేవి.1938 మే ఒకటవ తేదీన మే దినోత్సవాన్ని పాటించేందుకు మేము ఒక ప్రదర్శన జరిపాము. దాని మీద ఆర్‌ఎస్‌ఎస్‌, సావర్కర్‌వాదులు దాడి చేశారు. ఆ సందర్భంగా సుపరిచితులైన విప్లవవాది సేనాపతి బాపట్‌, మా సోషలిస్టు నేత ఎస్‌ఎం జోషి కూడా గాయపడిన వారిలో ఉన్నారు. హిందూత్వ సంస్థలతో అప్పటి నుంచి మాకు తీవ్రమైన విబేధాలు ఉండేవి. జాతీయవాద సమస్య మీద ఆర్‌ఎస్‌ఎస్‌తో మా తొలి విబేధం ఉంది. భారత దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని మేము నమ్మాము. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌, సావర్కర్‌ వాదులు హిందూ రాష్ట్ర అనే భావంతో వచ్చారు. మహమ్మదాలీ జిన్నా కూడా అలాంటి లోకపు భావన బాధితుడే. భారత్‌ రెండు – ముస్లిం, హిందూ దేశాలతో ఏర్పడిందని అతను నమ్మారు, సావర్కర్‌ కూడా అదే చెప్పారు.


మా మధ్య రెండో ప్రధాన విబేధం ఏమిటంటే మేము ఒక ప్రజాస్వామిక సర్వసత్తాక రాజ్యం ఉద్భవించాలని కలగన్నాము, ప్రజాస్వామ్యం పశ్చిమదేశాల భావన, భారత్‌కు పనికిరాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పింది. ఆ రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు అడాల్ఫ్‌ హిట్లర్‌ను ఎంతగానో పొగిడేవారు. గురూజీ(మాధవ సదాశివ గోల్వాల్కర్‌) ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగానే కాదు సైద్దాంతిక గురువుగా కూడా ఉండేవారు.గురూజీ మరియు నాజీల మధ్య ఆలోచనల్లో అద్భుతమైన సామీప్యతలు ఉన్నాయి. ఆయన ఉత్తమ రచనల్లో ఒకటిగా ఉన్న ” ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ ” అనే గ్రంధం అనేక ప్రచురణలు పొందింది. హిందువులు కాని వారిని పౌరులుగా పరిగణించకూడదని స్పష్టంగా దానిలో చెప్పారు.వారి పౌరసత్వహక్కులను రద్దుచేయాలని కోరారు. ఈ ఆలోచనలు కొత్తగా రూపుదిద్దుకున్నవి కాదు. మేము కాలేజీలో ఉన్న రోజుల నుంచి(1930 దశకం మధ్యలో) హిట్లర్‌ భావజాలం వైపు ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు మొగ్గుచూపేవారు. వారి దృష్టి ప్రకారం జర్మనీలో యూదుల పట్ల హిట్లర్‌ ఎలా వ్యవహరించాడో అదే మాదిరి భారత్‌లో ముస్లింలు, క్రైస్తవుల పట్ల వ్యవహరించాలి.నాజీ పార్టీ భావాల పట్ల గురూజీ ఎంతలా సానుకూలంగా ఉన్నారో ” ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ ” గ్రంధంలో దిగువ పేరాయే సాక్ష్యం.” తన జాతి, సంస్మృతిని పరిశుద్దంగా ఉంచేందుకు సెమిటిక్‌ జాతులను-యూదులను అంతమొందించి జర్మనీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జాతి ఔన్నత్యం దాన్ని ఉన్నతిని ఇక్కడ స్పష్టం చేసింది. జాతులు,సంస్కృతుల మధ్య ఉన్న విబేధాలకు కారణాలు తెలుసుకొంటే వాటిని తొలగించటం అసాధ్యం కాదని, ఐక్యంగా ఉంచటానికి సమీకృతం చేసేందుకు ప్రపంచానికి జర్మనీ దారి చూపింది, దాన్నుంచి నేర్చుకొనేందుకు, లబ్దిపొందేందుకు హిందూస్తాన్‌లో మనకు మంచి పాఠం ”


కుల సమస్య మీద గురూజీ మరియు ఆర్‌ఎస్‌ఎస్‌తో మా మూడో ప్రధాన విబేధం. ఒక సోషలిస్టుగా నా వంటి వారికి అది ఒక పెద్ద శత్రువు కాగా కుల వ్యవస్థ సమర్ధకులు వారు. కుల వ్యవస్థ దాని పునాదిగా ఉన్న అసమానతలను నిర్మూలించకుండా భారత్‌లో ఆర్థిక, సామాజిక సమానత్వం సాధ్యం కాదన్నది నా గట్టి వైఖరి. మేము విబేధించిన నాలుగో అంశం భాష. పౌరుల భాషలను ప్రోత్సహించేందుకు మేము అనుకూలం. అన్ని ప్రాంతీయ భాషలు దేశీయమైనవే. కానీ దీని మీద చెప్పిందేమిటి ? అందరికీ ఉమ్మడి భాషగా ప్రస్తుతానికి హిందీని, తరువాత అంతిమంగా జాతీయ భాషగా సంస్కృతాన్ని చేయాలని గురూజీ చెప్పారు. ఐదవది, స్వాతంత్య్రం కోసం తలెత్తిన జాతీయ ఉద్యమం ఫెడరల్‌ రాజ్యం అనే భావనను ఆమోదించింది. ఒక సమాఖ్య దేశంలో కొన్ని నిర్దేశిత విషయాలలో కేంద్రం కొన్ని తప్పనిసరి అధికారాలను కలిగి ఉంటుంది, ఇతర అన్ని అంశాలు రాష్ట్రాలకు చెందినవిగా ఉండాలి. కానీ దేశ విభజన తరువాత కేంద్రాన్ని పటిష్టపరిచేందుకు ఉమ్మడి జాబితాను నిర్దేశించారు. ఈ జాబితా ప్రకారం అనేక అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చారు. వాటి మీద కేంద్రం, రాష్ట్రాలకు సమానమైన అధికారపరిధి ఉంది.ఆ విధంగా సమాఖ్య రాజ్యం ఉనికిలోకి వచ్చింది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు దాని ప్రధాన సిద్దాంతవేత్త గురు గోల్వాల్కర్‌ ఈ మౌలిక రాజ్యాంగ ఏర్పాటును వ్యతిరేకించారు. రాష్ట్రాల సమాఖ్య భావననే వీరు అపహాస్యం చేశారు. రాష్ట్రాల సమాఖ్యను కోరిన రాజ్యాంగాన్నే రద్దు చేయాలన్నారు. తన ” బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ ” అనే గ్రంధంలో రాజ్యాంగాన్ని సమీక్షించాలని, కొత్త రాజ్యాంగంలో ఏక(యూనిటరీ) రాజ్య ఏర్పాటును లిఖించాలని పేర్కొన్నారు. ఏక లేదా మరో మాటలో చెప్పాలంటే కేంద్రీకృత రాజ్యాన్ని గురూజీ కోరారు.రాష్ట్రాల వ్యవస్థను వదిలించుకోవాలని చెప్పారు.


జాతీయోద్యమం ఎంచుకున్న త్రివర్ణ పతాకం మరొక సమస్య. మనం ఎంచుకున్న జాతీయ పతాక గౌరవం, ఔన్నత్యం కోసం వందలాది మంది భారతీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారు, వేలాది మంది లాఠీ దెబ్బలను తిన్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆర్‌ఎస్‌ఎస్‌ త్రివర్ణాన్ని జాతీయ జెండాగా ఎన్నడూ ఆమోదించలేదు. అది ఎల్లవేళలా కాషాయపతాకానికే వందనం చేస్తుంది.స్మృతికందని కాలం నుంచీ అది హిందూ రాజ్య పతాకంగా ఉందని చెబుతుంది.ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల గురూజీకి విశ్వాసం లేదు. ప్రజాస్వామ్య భావన పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదనే ధృడ వైఖరిని కలిగి ఉన్నారు. భారతీయ నాగరికత, ఆలోచనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తగినది కాదన్నారు. ఏక నాయకత్వ సూత్రాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నమ్ముతుంది.ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక మానసిక దృక్పధాన్ని సృష్టిస్తుందని అది పూర్తిగా క్రమశిక్షణతో కూడుకున్నదిగా ఉంటుందని అది ఏం చెబితే దాన్ని జనం అంగీకరిస్తారని గురూజీ కూడా స్వయంగా చెప్పారు. ఈ సంస్థ ఏక వ్యక్తి నాయకత్వ సూత్రం మీదనే పనిచేస్తుంది. సోషలిజం గురూజీ దృష్టిలో పూర్తిగా వెలుపలి భావజాలం, సోషలిజం, ప్రజాస్వామ్యంతో పాటు అన్ని ఇజాలూ విదేశీ ఆలోచనలే, వాటిని తిరస్కరించాలని, భారతీయ సమాజాన్ని భారతీయ సంస్కృతి ఆధారంగా నిర్మించాలని అతను పదే పదే చెప్పారు. మా గురించి చెప్పాలంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం,సోషలిజం పట్ల మాకు విశ్వాసం ఉంది. శాంతియుత పద్దతుల్లో గాంధియన్‌ సూత్రాలకు అనుగుణంగా సోషలిజాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. మరోవైపు ఒక ప్రత్యేక మూసలో యువ మెదళ్లను తయారు చేయటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక నైపుణ్యాన్ని సంతరించుకుంది. తొలుత అది పిల్లలు, యువత మెదళ్లలోకి ఏమీ ప్రవేశించకుండా ఘనీభవింపచేస్తుంది. ఆ తరువాత వారు ఇతర భావజాలాలకు స్పందించలేని అశక్తులుగా మారిపోతారు.


పేదల పట్ల కనికరం అవసరం లేదని గురూజీ భావించారు. తన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ గ్రంధంలో దేశంలో జమిందారీ వ్యవస్థ రద్దు పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆ వ్యవస్థ రద్దు పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేయటమే కాదు, తీవ్రంగా కలత చెందారు. ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని రుద్దినపుడు వీరితో(ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు జనసంఫ్‌ు) మేము ఒక కూటమి కట్టామన్నది ఒక వాస్తవం. ఒక పార్టీగా ప్రతిపక్షాలు ఐక్యంగాకపోతే ఇందిరా గాంధీని ఓడించలేమని లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ నమ్మారు.చౌదరి చరణ్‌ సింగ్‌ కూడా అలాంటి వైఖరినే కలిగి ఉన్నారు గనుక మేము ఒకే పార్టీగా ఐక్యమయ్యాము. మేము జైల్లో ఉండగా ఒక పార్టీని ఏర్పాటు చేయటం, ఎన్నికల్లో పోటీ చేయటం గురించి అబిప్రాయాలు చెప్పమని మమ్మల్ని అడిగారు. మనం తప్పనిసరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక సందేశాన్ని పంపిన అంశాన్ని గుర్తు చేసుకున్నాను. కోట్లాది మంది జనం ఎన్నికల్లో పాల్గొంటారు. ఎన్నికలు ఒక క్రియాశీల క్రమం. ఎన్నికల వాతావరణం పెరిగే కొద్దీ అత్యవసర పరిస్థితి సంకెళ్లు తెగుతాయి,జనం తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకుంటారు. అందువలన మనం ఎన్నికల్లో పాల్గొనాలని నేను గట్టిగా చెప్పాను. ఒకే పార్టీ పతాకం కిందకు అందరూ రాకపోతే విజయం సాధించలేమని లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ఇతర నేతల వైఖరి ఉన్న కారణంగా సోషలిస్టులంగా మా అంగీకారం తెలిపాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నొక్కి చెప్పదలచాను. రాజకీయ పార్టీలు-జనసంఫ్‌ు, సోషలిస్టు పార్టీ, కాంగ్రెస్‌(ఓ), భారతీయ లోక్‌దళ్‌(బిఎల్‌డి), కాంగ్రెస్‌ ముఠాలలోని కొన్ని అసంతృప్త తరగతుల మధ్య మాత్రమే అవగాహన కుదిరింది.ఆర్‌ఎస్‌ఎస్‌తో ఎలాంటి ఏర్పాటుకు మేము రాలేదు, దాని డిమాండ్లను వేటినీ అంగీకరించలేదు. ఇంకా చెప్పాల్సిందేమంటే జైల్లో ఉన్న మా మధ్య పంపిణీ అయిన మనూభారు పటేల్‌ లేఖ ద్వారా 1976 జూలై 7న మేము తెలుసుకున్నదేమంటే కొత్త పార్టీలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారు కూడా పార్టీ సభ్యులైతే ద్వంద్వ సభ్యత్వ వివాదం తలెత్తవచ్చని చౌదరి చరణ్‌ సింగ్‌ ఒక సమస్యను లేవనెత్తారు. దీని మీద అప్పుడు జనసంఫ్‌ు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఓమ్‌ ప్రకాష్‌ త్యాగి స్పందిస్తూ కొత్త పార్టీ సభ్యత్వాన్ని ఎలా కావాలంటే అలా రూపొందిచుకోవచ్చని స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నందున రద్దయినట్లేనని, ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వ సమస్య తలెత్తదని కూడా చెప్పారు.


తరువాత ప్రతిపాదిత జనతా పార్టీ నిబంధనావళిని రూపొందించేందుకు ఒక ఉపసంఘాన్ని నియమించారు. జనతా పార్టీ లక్ష్యాలు, విధానాలు, కార్యక్రమాలతో విబేధించే ఏ సంస్థకు చెందిన వారికీ జనతా పార్టీలో సభ్యత్వం ఇవ్వకూడదని ముసాయిదా నిబంధనావళిలో పెట్టారు. దీని అర్ధం ఏమంటే ఎవరూ ఈ నిబంధనను వ్యతిరేకించకూడదన్నది స్పష్టం.అయినప్పటికీ దీనికి వచ్చిన ఒకే ఒక అభ్యంతరం జనసంఫ్‌ుకు చెందిన సుందర్‌ సింగ్‌ భండారీ నుంచి వెలువడటం గమనించాలి. తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు 1976 డిసెంబరులో ఏర్పాటు చేసిన సమావేశానికి జనసంఫ్‌ు, ఆర్‌ఎస్‌ఎస్‌ తరఫున అతల్‌ బిహారీ వాజ్‌పాయి రాసిన లేఖలో ప్రతిపాదిత పార్టీలో ఒక తరగతి నేతలు జనతా పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్‌ సమస్యను లేవనెత్తకూడదని అంగీకరించినట్లు పేర్కొన్నారు. అయితే అనేక మంది నేతలు అలాంటి హామీ ఇవ్వలేదని నాకు చెప్పారు. ఎందుకంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీలు విలీనం కావాలని తలపెట్టినపుడు రంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎక్కడా లేదు గనుక అన్నారు. నేను ఒకటి స్పష్టం చేయదలచాను. ఆ సమయంలో నేను జైల్లో ఉన్నాను. ఒక వేళ ఒక రహస్య అవగాహనకు వచ్చి ఉండి ఉంటే దానిలో నాకు భాగస్వామ్యం లేదు.


నేను ఒకటి విస్పష్టంగా చెప్పగలను. జనతా పార్టీ ఎన్నికల ప్రణాళిక ఏ రీత్యా చూసినా ఆర్‌ఎస్‌ఎస్‌ అంశాలను ప్రతిబింబించలేదు. వాస్తవానికి ప్రణాళికలోని ప్రతి అంశమూ స్పష్టంగా ఉంది. లౌకిక, ప్రజాస్వామిక, గాంధియన్‌ సూత్రాల ప్రాతిపదికగా సోషలిస్టు సమాజం గురించి జనతా పార్టీ ప్రణాళిక ఉంది.దానిలో హిందూ దేశం గురించిన ప్రస్తావన లేదు.మైనారిటీలకు సమానహక్కులకు హామీ ఇవ్వటమే కాదు, వారి హక్కులకు రక్షణ కల్పిస్తామని కూడా చెప్పింది. కుల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పిందా ? ఇతరుల సేవకు శూద్రులు తమ జీవితాలను అర్పించాలని చెప్పిందా ? దానికి విరుద్దంగా వెనుకబడిన తరగతుల పురోగమనానికి వాగ్దానం చేయటమే కాదు పూర్తి అవకాశాలు కల్పిస్తామని చెప్పింది, వారికోసం ప్రత్యేక విధానాలు తీసుకొస్తామని పేర్కొన్నది. వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 25-33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది. గురూజీ కేంద్రీకరణ జరపాలని గట్టిగా చెప్పగా వికేంద్రీకరిస్తామని జనతా పార్టీ అంగీకరించింది. రాష్ట్రాలను రద్దు చేయాలని, అసెంబ్లీలను, మంత్రివర్గాలను కూడా రద్దు చేయాలని అతను కోరగా మరింత వికేంద్రీకరణ జరగాలని జనతా పార్టీ నొక్కివక్కాణించింది. మరో విధంగా చెప్పాలంటే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని లాక్కోవాలన్న వాంఛ జనతా పార్టీకి లేదు.


పార్టీ ఎన్నికల ప్రణాళికలోని అంశాలను స్వచ్చందంగా అంగీకరించలేదన్నది నిజం. ఇది నా అభ్యంతరం, అంతే కాదు రాతపూర్వకంగా ఒకసారి కుష్‌భాహు థాకరేకు ఫిర్యాదు చేశాను. చర్చల సందర్భంగా మీవారు(ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఫ్‌ు) వెంటనే అంగీకరించినా హృదయపూర్వకంగా పూర్తిగా వ్యతిరేకించారని నేను చెప్పాను. అందుకే మీ ఉద్దేశ్యాలను అనుమానించాల్సి వస్తోంది.ఈ లేఖను నేను ఎంతో కాలం క్రితమే రాశాను, ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి నాకు ఎప్పుడూ సందేహమే.నిరంకుశత్వాన్ని వ్యతిరేకించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలన్న లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ వాంఛ, ఎలాంటి రాజీలు లేకుండా పార్టీ ఎన్నికల ప్రణాళిక ఉండటం వలన మన ఐక్యతకు నేను ఆమోదం తెలిపాను. అదే సమయంలో నేను ఒకటి చెప్పదలచుకున్నాను. ప్రారంభం నుంచి నాకు ఒక స్పష్టత ఉంది ఐక్య, విశ్వసనీయమైన జనతా పార్టీ ఆవిర్భవించాలంటే రెండు పనులు చేయాల్సి ఉంటుందని నా మనసులో ఉంది. ఒకటి, ఆర్‌ఎస్‌ఎస్‌ తన భావజాలాన్ని మార్చుకోవాలి మరియు లౌకిక,ప్రజాస్వామిక రాజ్య భావనను అంగీకరించాలి.రెండవది, సంఘపరివార్‌లో భాగంగా ఉన్న వివిధ సంస్థలు భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు, విద్యార్ధి పరిషత్‌ వంటివి తమను తాము రద్దు చేసుకొని లౌకిక భావజాలం ఉన్న కార్మిక సంఘాల్లో, జనతా పార్టీ విద్యార్థి విభాగంలో విలీనం కావాలి. జనతా పార్టీ కార్మిక విభాగం, విద్యార్థి విభాగాల వ్యవహారాలను పర్యవేక్షించమని పార్టీ నాకు విధి అప్పగించిన నాటి నుంచీ నేను దీని గురించి స్పష్టతతో ఉన్నాను. ఈ రెండు సంస్థలూ ప్రత్యేక ఉనికిని రద్దు చేసుకోవాలని నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. హిందువులను మాత్రమే సంఘటితపరచాలనే మీ భావజాలాన్ని వదలి వేసుకోవాలని, మీ సంస్థలో అన్ని మతాల వారికీ చోటు కల్పించాలని,జనతా పార్టీలో ఉన్న భిన్నమైన తరగతుల ప్రాతిపదికన ఉన్న సంస్థలలో విలీనం కావాలని నేను ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులకు చెప్పాను. అది వెంటనే జరిగేది కాదని, అనేక ఇబ్బందులు ఉన్నాయని, కానీ కొద్ది కొద్దిగా మారాలని కోరుకుంటున్నట్లు వారి స్పందన ఉంది. వారు అలా తప్పించుకొనే జవాబులను కొనసాగించారు.


వారి ప్రవర్తన చూసిన తరువాత వారిలో మార్పు ఉద్దేశ్యం లేదన్న నిర్దారణకు వచ్చాను.ప్రత్యేకించి 1977జూన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత వారు నాలుగు రాష్ట్రాల్లో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారానికి రాగలిగారు. అప్పటి నుంచి కొత్తగా వచ్చిన ప్రతిష్టతో మారాల్సిన అవసరం లేదని వారు ఆలోచించటం ప్రారంభించారు.ఇప్పటికే వారు నాలుగు రాష్ట్రాలను కైవశం చేసుకున్నారు. క్రమంగా ఇతర రాష్ట్రాలను, చివరకు కేంద్రాన్ని కూడా పట్టుకొనేందుకు చూస్తారు. జనతా పార్టీలోని ఇతర రాజకీయ నేతలు పెద్ద వారు, వారు ఎంతో కాలం జీవించలేరు. పార్టీలో ఉన్న ఉన్నత స్థానాలకు ఎదిగేట్లు ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘేతర నేతలను చేయలేరు. అయినప్పటికీ నేను ప్రయత్నించాను. ఒక సందర్భంగా అన్ని కార్మిక సంఘాలనేతల సమావేశం ఏర్పాటు చేశాను. జనతా పార్టీలోని అన్ని పక్షాల ప్రతినిధులు వచ్చారు, భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు సమావేశాన్ని బహిష్కరించింది. అంతే కాదు ఎలాంటి కారణం లేకుండానే వారు నన్ను దూషించారు. విద్యార్థి పరిషత్‌, యువమోర్చాలతో అలాంటి ప్రయత్నమే జరిగింది. విలీనం కోసం జరిగిన అన్ని ప్రయత్నాలకూ వారు దూరంగా ఉన్నారు. ఇదంతా ఎందుకు అంటే పార్టీ మీద పెత్తనం చేయాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వాంఛ కారణంగానే. ప్రజల ప్రతి జీవనరంగంలోకి ప్రవేశించాలన్నది వారి లక్ష్యం, అంతేకాదు దాన్ని అదుపు చేయాలన్నది కూడా. ఇలాంటి అభిప్రాయాలను గురూజీ తన ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్డ్‌ అనే గ్రంధంలో పదే పదే వక్కాణించారు. నిరంకుశ సంస్థ ఏదీ స్వేచ్చను అనుమతించదు. దాని వేర్లు కళలు, సంగీతం, ఆర్థికం, సాంస్కృతిక రంగం ప్రతిచోటా ఉంటాయి. ప్రతి ఫాసిస్టు సంస్థ సారం ఇదే. వీరు అరుదైన సందర్భాలలో చేసేదానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. గురూజీ బాటలో ఆలోచనలను వదలి వేస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ చెప్పలేదు. జైళ్లలో ఉన్నపుడు వీరు క్షమాభిక్ష కోసం ప్రార్ధించారు. రాజనారాయణ్‌ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇందిరా గాంధీకి అనుకూలంగా వచ్చినపుడు బాలాసాహెబ్‌ దేవరస్‌ ఆమెను అభినందించారు. అందువలన వీరి ఉద్ఘాటనల మీద నాకు నమ్మకం లేదు. నేను వీరిని (జనతా పార్టీలో పూర్వపు జనసంఫ్‌ు నేతలు) ఎప్పుడు నమ్ముతానంటే పార్టీ, కార్యవర్గ కమిటీల నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలను బహిష్కరించినపుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల మీద ఆంక్షలు విధించినపుడు, ప్రత్యేకించి నానాజీ దేశముఖ్‌, సుందర్‌ సింగ్‌ బండారీ వారి అనుచరులను బహిష్కరించినపుడే నమ్ముతాను.


గమనిక : మధు లిమాయే(1922 -1995 ) పూనాలో జన్మించారు. కాంగ్రెస్‌లో, కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ, తరువాత ప్రజా సోషలిస్టు పార్టీ నేతగా వ్యవహరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వంపై వివాదం కారణంగా జనతా పార్టీ నుంచి పూర్వపు జనసంఘనేతలు వేరు పడి బిజెపిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అధికారం కోసం అవసరాలకు అనుగుణంగా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఊసరవెల్లి మాదిరి రంగులు మార్చింది తప్ప మౌలిక స్వభావం, లక్ష్యాలలో ఎలాంటి మార్పు లేదు. నాలుగు దశాబ్దాల నాడు (1979) రాసిన ఈ వ్యాసంలో లేవనెత్తిన అంశాలు నేటికీ సంగతమైనవేే గనుక జనతా వార పత్రిక నుంచి సేకరించి అనువదించి అందించాను, : ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

తెగించిన వాడికి తెడ్డే లింగం :” సిగ్గులేనితనం, అసహ్యకరం ” విశ్వగురు మోడీ విద్వేష ప్రసంగంపై విదేశీ మీడియా !

25 Thursday Apr 2024

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

# Anti Muslims, BJP, Hate-Speech, Hindu Fundamentalism, Infiltrators, Manmohan Singh, Narendra Modi Failures, Narendra Modi Hate Speech, RSS


ఎం కోటేశ్వరరావు


దేశ వనరుల మీద తొలి హక్కుదారులు ముస్లింలని కాంగ్రెస్‌ చెప్పిందని, వారు చొరబాటుదారులు, కాంగ్రెస్‌ అధికారానికి వస్తే పుస్తెలతో సహా ఆస్తులన్నీ స్వాధీనం చేసుకొని వారికి పంచుతుందని ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల సభల్లో ఆరోపించారు. ఎప్పుడో 2006లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడారంటూ నరేంద్రమోడీ వేసిన నిందల గురించి మోడీ అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని అభిమానులే అంటున్నారు. అసలింతకీ అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ? దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితి గురించి మోడీకి అర్ధమైందా ? ప్రతి ఎన్నికలో ఏదో ఒక అంశాన్ని సంచలనంగావిస్తే తప్ప జనానికి కిక్కు ఎక్కదని, ఓట్లు రాలవని ఈ ఎన్నికల్లో దీన్ని ఎంచుకున్నారా ? మతాల వారీ జనాలను చీలిస్తే తప్ప గట్టెక్కలేననే భయం పట్టుకుందా ?ఇలా పరిపరి ఆలోచనలు. నిజం గడపదాటేలోగా అబద్దం ఊరంతా చుట్టి వచ్చి ఎదురుగా నిలుస్తుందన్న లోకోక్తి తెలిసిందే. నరేంద్రమోడీ చెప్పిన అంశాల్లో నిజానిజాలేమిటి అని ఎందరు జనం లోతుల్లోకి వెళతారు. రాందేవ్‌ బాబా క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చానని చెప్పారు. ఇచ్చారు సరే అవి ఎంత పెద్దవో, ఏ పత్రికల్లో ఇచ్చారో వివరాలు ఇవ్వండని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే ప్రధాని చెప్పిన మాటల నిజానిజాల గురించి కూడా ఉన్నత న్యాయస్థానం ఆదేశిస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం కదలదు. అలా జరుగుతుందా ?


విశ్వగురువుగా తనను తాను భావించుకుంటున్న లేదా భజన సమాజం చిత్రిస్తున్నప్పటికీ మోడీ పచ్చి అవాస్తవాలు చెప్పారని కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను నిర్ధారించుకొని ప్రచురించాయి. అసలు మోడీ ఏం చెప్పారు. ది క్వింట్‌ అనే పత్రిక వాస్తవాలను వెల్లడించింది.దాన్ని కాదని మోడీ చెప్పిందే నిజమని ఆధారాలతో చెప్పే దమ్ము కేంద్ర ప్రభుత్వానికి, బిజెపికి ఉందా ? రాజస్తాన్‌లోని బన్స్‌వారా ఎన్నికల సభలో మాట్లాడుతూ ” దేశ వనరుల మీద తొలి హక్కు ముస్లింలకే ఉందని అధికారంలో ఉండగా కాంగ్రెస్‌ చెప్పింది. దీని అర్ధం ఏమంటే సంపదలన్నింటినీ వారు సమీకరించి ఎవరికి పంచుతారు.ఎవరికి ఎక్కువ మంది పిల్లలుండే వారికి, అక్రమంగా చొరబడిన వారికి వారు పంచుతారు. కష్టపడి సంపాదించుకున్నదానిని చొరబాటుదారులకు ఇవ్వాలా? మీరు దీన్ని అంగీకరిస్తారా ? కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక చెప్పింది ఇదే. మన తల్లులు, సోదరిమణుల దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కుంటారు, వాటిని లెక్కించి పంపిణీ చేస్తారు ” అని చెప్పారు.దీనికి ఆధారంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన ప్రసంగాన్ని ఉటంకించారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో కమ్యూనిస్టులు అధికారానికి వస్తే మగవారిని సుత్తితో తల మీద మోది కొడవలితో గొంతు కోస్తారని, ఆడవారి మెడల మీద కాడి మోపి పొలాలు దున్నిస్తారంటూ కాంగ్రెస్‌ చేసిన తప్పుడు ప్రచారాన్ని మోడీ గుర్తుకు తెచ్చారు.


” వనరులను కోరే తొలి హక్కు ముస్లింలకే ఉండాలి: ప్రధాని ” అంటూ జాతీయ అభివృద్ది మండలి 52వ సమావేశంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పారంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక 2006 డిసెంబరు తొమ్మిదవ తేదీన తప్పుదారి పట్టించే శీర్షికతో ఒక వార్తను ప్రచురించింది. ఆ మరుసటి రోజే అది కావాలని చేసిన తప్పుడు భాష్యం, ఆధారాల్లేవంటూ ప్రధాని కార్యాలయం ఒక ఖండన ప్రకటన జారీ చేసింది. ప్రధాని మాట్లాడింది ఇది అంటూ ప్రసంగ పాఠాన్ని కూడా దానికి జత చేసింది.దాని ప్రకారం ” మన ఉమ్మడి ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. వ్యవసాయం, సాగునీరు, జలవనరులు,ఆరోగ్యం, విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాలకు అవసరమైన కీలక పెట్టుబడులు,దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన తరగతులు,మైనారిటీలు, మహిళలు, పిల్లల అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలతో పాటు ప్రజలందరికీ అత్యవసరమైన సాధారణ మౌలికవసతులు వీటిలో ఉన్నాయి.దళితులు, గిరిజనులకు ఉద్దేశించిన ఉప పథకాలను పునరుజ్జీవింప చేయాలి.మైనారిటీలు ప్రత్యేకించి ముస్లింలు అభివృద్ధి ఫలాలను సమంగా పొందేలా సాధికారత కల్పించేందుకు మనం కొత్త పధకాలను కనుగొనాల్సి ఉంది.వనరులను పొందే యోగ్యతను వెల్లడించే తొలి వారుగా ఉండాలి ” అని చెప్పారు.


దళితులు, గిరిజనుల ఉద్దరణకు ఉప ప్రణాళికలు ఉన్నట్లుగానే తమకూ ఉండాలని వెనుకబడిన తరగతులు, ముస్లింలూ ఎప్పటి నుంచో కోరుతున్నారు.మానవాభివృద్ధి సూచికలు, దారిద్య్ర వివరాలను చూసినప్పటికీ 2019లో మన దేశానికి సంబంధించి ఐరాస వెల్లడించిన వివరాల ప్రకారం 2018లో ప్రతి ఇద్దరు గిరిజనుల్లో ఒకరు, ప్రతి ముగ్గురు దళితులు, ముస్లిముల్లో ఒకరు పేదలుగా ఉన్నారని తేలింది.దేశ జనాభాలో 2011లెక్కల ప్రకారం 16.6శాతం దళితులు, 8.6శాతం గిరిజనులు, 14.2శాతం ముస్లింలు ఉన్నారు. మతాలు వేరు గావచ్చు తప్ప, పేదరికం, అన్ని రకాల వెనుకబాటులో వీరందరి పరిస్థితి ఒకే విధంగా ఉందని ప్రభుత్వ వివరాలే వెల్లడిస్తున్నాయి. ఇతర మైనారిటీలైన సిక్కులు, క్రైస్తవులు, జైనులు,బౌద్దులు ఇతరుల్లో పరిస్థితి ఇలా ఉందని ఎవరైనా చెప్పగలరా ? దేశంలో ఇప్పుడు 22 కోట్ల మంది పేదలున్నారని, వారందరినీ రానున్న పది సంవత్సరాల్లో ఉద్దరిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో చెప్పింది తప్ప మరొకటి కాదు.బిజెపి చెప్పే సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌లో ముస్లింలను మినహాయిస్తామని చెప్పగలదా ?


ఇక ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కని జనాభాను పెంచేస్తున్నారని, ముస్లిం మెజారిటీ దేశంగా మార్చనున్నారనే విద్వేష ప్రచారం ఎప్పటి నుంచో దేశంలో సాగుతోంది.ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ముస్లింల పాలన, తరువాత ఆంగ్లేయుల ఏలుబడి దేశంలో ప్రారంభమైంది. నిజానికి మెజారిటీగా మారేందుకు ఎక్కువ మంది పిల్లలను కన్నా, మతమార్పిడులు చేసినా ఎప్పుడో ముస్లిం, క్రైస్తవ దేశంగా మారి ఉండేది. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 79.8, ముస్లింలు 14.2శాతమే ఉన్నారు. పిల్లలను ఎక్కువగా కనటానికి కారణాల్లో దారిద్య్రం, విద్యలేమి వంటి అనేక అంశాలున్నాయి. కుటుంబ నియంత్రణ గురించి గడచిన ఆరున్నర దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నప్పటికీ హిందువుల్లో 54.4శాతం ఉండగా ముస్లింలలో 45.3శాతం ఉంది. సగటున ముస్లింలు 2.36, హిందువులు 1.94 మందిని కంటున్నట్లు తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. రెండు మతాల వారి మధ్య పెద్ద తేడా ఏముంది. గణాంకాలను చూసినపుడు ముస్లింలలో జనాభా పెరుగుదల రేటు తగ్గుదల ఎక్కువగా ఉంది.1961-91 జనాభా పెరుగుదల రేటు వివరాలను చూసినపుడు మధ్యలో పెరిగినా, తగ్గినా హిందువుల్లో 20.7 నుంచి 22.7శాతం ఉండగా ముస్లింలలో 32.7 నుంచి 32.9శాతం ఉంది. తరువాత కాలంలో 2011 నాటికి హిందువుల్లో 16.7శాతం ఉండగా ముస్లింలలో 24.7శాతం ఉంది. తగ్గుదల రేటు ముస్లింలలో ఎక్కువగా ఉంది.


ఇక నరేంద్రమోడీ చేసిన ఎన్నికల ప్రసంగంపై అంతర్జాతీయ మీడియాలో దేశ పరువు తీసే విధంగా వార్తలు వచ్చాయి.గతంలో రాహులు గాంధీ విదేశాల్లో మోడీ విధానాల గురించి మాట్లాడి దేశ పరువు తీశారని విమర్శించిన బిజెపి ఇప్పుడు నరేంద్రమోడీ దేశంలో ఉండే చేసిన వ్యాఖ్యలు దేశపరువును ప్రశ్నార్ధకం చేసినందున ఏం చెబుతుంది ? ఫ్రాన్స్‌ 24 టీవీ, వెబ్‌సైట్‌ ” ఆశ్చర్యం కలిగించని అసహ్యకర ప్రసంగం ” అన్న శీర్షికతో వార్తను ప్రసారం చేసింది. ఈ ప్రసంగం తరువాత మోడీ మీద చర్య తీసుకోవాలని పదిహేడు వేల మంది పౌరులు ఎన్నికల కమిషన్‌కు పంపిన వినతి మీద సంతకాలు చేసినట్లు పేర్కొన్నది. గత పది సంవత్సరాలుగా భారత్‌లో ఎన్నికలను పరిశీలిస్తున్నవారికి మోడీ ప్రసంగం ఆశ్చర్యం కలిగించలేదని, తన పునాదిని పెంచుకొనేందుకు విద్వేష ప్రసంగాలు చేయటంలో జయప్రదమైనట్లు పేర్కొన్నది. తాజాగా చేసిన అసహ్యకర ప్రసంగం గత పదిసంవత్సరాలలో చేసిన ప్రచారానికి అనుగుణంగా ఉందని, ప్రపంచ వేదికల మీద చెప్పే మాటలకు పూర్తి విరుద్దంగా స్వదేశంలో ప్రసంగాలు చేస్తున్నట్లు ఒక విశ్లేషకుడు చెప్పిన మాటలను ఉటంకించింది..


” భారతీయ ముస్లింలను చొరబాటుదారులని మోడీ ఎందుకు వర్ణించారు ?ఎందుకంటే అతను అనగలడు ” అంటూ అమెరికాలోని ప్రముఖ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన వార్తకు శీర్షిక పెట్టింది.భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీ సామాజిక తరగతిని నిందిస్తూ సిగ్గులేకుండా ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడటానికి దేశంలో లేదా బయటా తన అధికారానికి ఆటంకాలు ఏర్పడతాయని ఆయనకు కనిపిస్తున్నట్లు స్పష్టం చేయటమే అని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. దేశంలో అధికారం,హిందూ ధోరణలు లోతుగా నాటుకున్న తరువాత ఆర్థికంగా, దౌత్య పరంగా భారత ఎదుగుదలను అవకాశంగా తీసుకొని ప్రపంచ రాజనీతిజ్ఞుడిగా పాత్ర పోషించేందుకు దృష్టిసారించారు. ఆ క్రమంలో ఎన్నికల్లో లబ్ది పొందేందుకు స్వంత పార్టీ చేస్తున్న మతపరమైన విభజిత కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కానీ స్వదేశంలో తన అధికారానికి కొన్ని ఆటంకాలు ఏర్పడినట్లు మోడీకి కనిపిస్తున్నదని సిగ్గులేని తనం స్పష్టం చేసింది.స్వదేశంలో నిఘా సంస్థలు(మీడియా, అధికారిక, అనధికారిక నిఘా) మొత్తంగా భారతీయ జనతా పార్టీకి అనువుగా మారాయి.చైనాను నిలువరించేందుకు గాను భారత్‌ను నిలబెట్టాలని చూస్తున్నకారణంగా దేశంలో నరేంద్రమోడీ ఏం చేస్తున్నారో చూడనిరాకరణ విదేశీ భాగస్వాముల్లో పెరుగుతున్నదని పేర్కొన్నది.ప్రతిపక్షాలను అణచివేయటం, మైనారిటీలను లక్ష్యం చేసుకుంటున్న కొన్ని మోడీ చర్యల గురించి ఢిల్లీలోని పశ్చిమదేశాల దౌత్యవేత్తలు ప్రయివేటు సంభాషణల్లో దాచుకోవటం లేదు. చైనా, వాణిజ్య ఒప్పందాల గురించి కేంద్రీకరించటం తప్ప గతంలో మాదిరి సానుకూలంగా లేనప్పటికీ బహిరంగంగా మాట్లాడకపోవటాన్ని మోడీ సొమ్ము చేసుకుంటున్నారని రాసింది. అనేక కారణాలతో ప్రపంచ రాజకీయాల్లో చైనాకు పోటీగా నిలబెట్టేందుకు తన జాతీయ ప్రయోజనాల రీత్యా అమెరికా ప్రభుత్వం నరేంద్రమోడీ గురించి బహిరంగంగా మాట్లాడటం లేదని అమెరికా విశ్లేషకుడు మార్కే అన్న మాటలను న్యూయార్క్‌ టైమ్స్‌ ఉటంకించింది.మోడీని విమర్శించటం అమెరికాలో ఉన్న భారత సంతతితో వివాదం తెచ్చుకోవటమే అవుతుందని, తమకు వ్యతిరేకంగా మారవచ్చని అమెరికా రాజకీయవేత్తలు భావిస్తున్నారని కూడా మార్కే అన్నాడు.మోడీ అంతర్గత రాజకీయాలతో తమ ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నదని ఎంతకాలం పాటు భారత్‌ను విశ్వసిస్తుందన్నదే ప్రశ్న అని కూడా చెప్పాడు.

మోడీ ప్రసంగాల గురించి అంతర్జాతీయ ఎపి ఇచ్చిన వార్తను ప్రపంచ పత్రికలన్నీ ప్రచురించాయి, టీవీలలో చెప్పారు. మనదేశంలోని ముస్లింలు, హిందువులందరి జన్యువులు ఒకటేనని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గతంలో సెలవిచ్చారు.వసుధైక కుటుంబమని చెబుతారు.కుట్రతో విభజించారని అఖండ భారత్‌ను ఏర్పాటు చేస్తామని చెబుతారు. మరి నరేంద్రమోడీ ముస్లింలను చొరబాటుదారులని ఎలా వర్ణించారు? సాధారణ పరిస్థితుల్లో అక్రమంగా వచ్చిన వారిని అలా వర్ణిస్తారు, అంత్యరుద్దాలు, ఇతర విపత్తులు తలెత్తినపుడు వచ్చేవారిని చొరబాటుదారులు అంటారా ? శ్రీలంకలో ఉగ్రవాదుల దాడులు, ప్రభుత్వ ప్రతిదాడులు సమయంలో అనేక మంది అక్కడి తమిళులు మనదేశానికి ఆశ్రితులుగా వచ్చారు. వారిని చొరబాటుదారులుగా వర్ణించే ధైర్యం నరేంద్రమోడీకి ఉందా ? ఆ మాటకు వస్తే మన పూర్వీకులందరూ ఆఫ్రికా, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారే, రాజులు, రాజ్యాలు, సరిహద్దులు లేనపుడు జీవన పోరులో ఎక్కడో ఒక చోట స్థిరపడ్డారు. అంటే మోడీ భాష్యం ప్రకారం అందరూ చొరబాటుదారులే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d