• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: beef

హిందూత్వ బాటలో బ్యాంక్‌ మేనేజర్‌ – పెద్ద కూర నిషేధంపై బెఫి నిరసన ! బిజెపి ఎంఎల్‌సిపై గోరక్షకుల దాడి !!

05 Friday Sep 2025

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, Farmers, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

beef, Beef eating in Vedas, BEFI, BJP, Cow vigilantes, Food Ban, Food- A Symbol Of Identity, Gau Rakshaks, Politicisation of Beef, RSS


ఎం కోటేశ్వరరావు


ఆహార వ్యవహారాల్లో జోక్యం అంటే ఫలాన తినకూడదు అని ఆంక్షలు పెట్టటం వ్యక్తిగత స్వేచ్చలో మితిమీరిన జోక్యం చేసుకోవటం తప్ప మరొకటి కాదు. ఆహారం, ఆహార్యం కొన్ని సమూహాలకు అస్థిత్వ సూచికలుగా ఉన్నాయి. పెద్ద కూర, దీన్ని ఆంగ్లంలో బీఫ్‌ , అచ్చతెలుగులో గొడ్డు మాంసం అంటారు. తక్కువ ఖర్చుతో జనాలకు అవసరమైన ఎక్కువ ప్రొటీన్లు అందచేసే ఆహారం ఇది. ఇటీవలి కాలంలో హిందూత్వశక్తులు, సనాతనులుగా ముద్రవేసుకున్నవారు దీని మీద పెద్ద రాద్దాంతం, దాడులు, హత్యలకూ పాల్పడటాన్ని చూశాం. మేం శాకాహారులం మా మనోభావాలను గాయపరచవద్దు అనేవారు తయారయ్యారు. మాంసాహారులకు కూడా మనోభావాలు ఉంటాయి. తాజాగా కేరళలోని కోచ్చి నగరంలో కెనరా బ్యాంక్‌ ప్రాంతీయ కార్యాలయానికి బీహార్‌ నుంచి అశ్వనీ కుమార్‌ అనే మేనేజర్‌ బదిలీ మీద వచ్చారు. అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా బ్యాంకు క్యాంటీన్‌లో పెద్ద కూర కూడా వారంలో కొన్ని రోజులు అందుబాటులో ఉండేది. ఆ పెద్దమనిషి రాగానే ఆహార జాబితా నుంచి దాన్ని తొలగించి నిషేధం విధించారు.ఎందుకంటే నేను తినను అని చెప్పారట. నాకు దక్కనిది ఎవరికీ దక్క కూడదు అనే సినిమా మాటలు బాగా వంటబట్టి ఉంటాయి. దేశంలో అనేక ప్రాంతాలలో ఇలాంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపిన సంగతి తెలియనంత అమాయకంగా సదరు అధికారి ఉంటారని అనుకోలేం. ఉద్యోగులు ప్రశ్నించిన తరువాత అయినా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఉంటే ఆ పెద్దమనిషి ఇప్పుడు మీడియాకు ఎక్కి ఉండేవారు కాదు. విధిలేని స్థితిలో బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫి) నాయకత్వంలో సిబ్బంది నిరసన తెలుపుతూ బ్యాంకు ప్రాంగణంలో పెద్ద కూర, పరోటాల పండగచేసి నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏ ఆహారం తీసుకోవాలన్నది వ్యక్తిగత ఎంపిక అంశమని, కొన్నింటి మీద నిషేధం విధించటం రాజ్యాంగహక్కులను ఉల్లంఘించటమే అని స్పష్టం చేశారు. బ్యాంకు అధికారి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక ఉన్నతాధికారి ఇష్టా ఇష్టాలకు అనుగుణంగా ఇతరులు ఆహార అలవాట్లను ఎందుకు మార్చుకోవాలని వారు ప్రశ్నించారు. మాంసాహారం తినాలని తామెవరినీ బలవంతం చేయటం లేదని బెఫి నేత చెప్పారు.


మాంసం, చేపలు, గుడ్లు తినరాదంటూ బలవంతం చేయటాన్ని బ్రాహ్మణీయ జాతీయవాదం(భావజాలం) అంటున్నారు. అనేక మంది బ్రాహ్మలు మాంసాహారాన్ని తింటారన్నది అందరికీ తెలిసిందే. తిరోగామి జాతీయవాదం ఏ రంగంలో, ఏ సమస్యపై తలెత్తినా దాన్ని వ్యతిరేకించాల్సిందే. మన దేశంలో ఆవును పూజించటానికి, గొడ్డు మాంసం తినటానికి లంకె పెడుతున్న కారణంగా తలెత్తిన భావజాల ఘర్షణను భౌతిక దాడులకు తీసుకుపోయేందుకు కొన్ని శక్తులు పనిగట్టుకు పనిచేస్తున్నాయి. బిజెపి పాలిత ఒడిషా రాష్ట్రంలో ఇద్దరు దళితులు చచ్చిన ఆవు కళేబరం నుంచి చర్మాన్ని వేరు చేయటాన్ని చూసిన కొందరు గోవధకు పాల్పడ్డారంటూ వారి మీద దాడి చేయగా ఒక వ్యక్తి మరణించాడు. ఉన్మాదాన్ని ఎలా ఎక్కించారో చూస్తున్నాం. దళితుల మీద దాడులకు ఆవునొక సాకుగా కూడా చూపిన ఉదంతాలు ఉన్నాయి. తమ ఇంట ఆవు చనిపోతే దాన్ని పూడ్చిపెట్టేందుకు ఏ సనాతనవాదీ ముందుకు రారు. ఇదీ గోవుల మీద ప్రేమ బండారం. చివరకు ఆ దళితులే కావాలి. సాంస్కృతిక గురుపీఠాల సృష్టికి ఆహారం ఒక ఉత్ప్రేక్షగా( ప్రస్తుతాన్ని అప్రస్తుతమైనదిగా మార్చటం) మారి చివరకు అవమానించేందుకు దారితీస్తున్నదని ప్రముఖ మేథావి, జెఎన్‌యు ప్రొఫెసర్‌ గోపాల్‌ గురు చెప్పారు. నైతిక పోలీసుల మాదిరి ఇలాంటి గురుపీఠాలు సాంస్కృతిక పోలీసులుగా బ్రాహ్మణ భావజాలాన్ని రుద్దే నిరంకుశ శక్తులుగా మారుతున్నాయి. వాటి ప్రభావానికి లోనైన కారణంగానే కెనరా బాంక్‌ కొచ్చి మేనేజర్‌ వంటి వారు తమ అధికార స్థానాలను ఉపయోగించుకొని నిషేధాలకు దిగటం సహించరానిది. నిజానికి సదరు మేనేజరుకు హిందూత్వ సంస్థలతో సంబంధాలు ఉన్నాయో లేవో తెలియదు. లేనప్పటికీ వాటి ప్రభాంతో తెలియకుండనే హిందూత్వ అజెండాను అమలు జరిపే ఒక పరికరంగా మారటాన్ని గమనించాలి. ఇలాంటి చర్యలకు ప్రతిఘటన తప్పదు. చిత్రం ఏమిటంటే దేశంలో 81శాతం మంది మాంసాహారులు ఉన్నట్లు కొన్ని సర్వేలు చెప్పగా 39శాతం శాకాహారులని కొన్ని సర్వేలు చెప్పాయి. ఒకటి మాత్రం వాస్తవం, ఏ విధంగా చూసినా మాంసాహారులే అత్యధికంగా ఉన్నప్పటికీ మైనారిటీలుగా ఉన్న శాకాహారులు తమ అలవాట్లను మెజారిటీ మీద రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. గోవధ గురించి దేశంలో ఎంతో చర్చ జరిగిన తరువాత దాని గురించి రాష్ట్రాలకు నిర్ణయాన్ని వదలివేస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్‌ 48లో పేర్కొన్నారు. దాన్ని విధి గాక ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. కొన్ని రాష్ట్రాలలో బిజెపి తన హిందూత్వ అజెండాలో భాగంగా గోవధ నిషేధ చట్టాలు చేసింది. అది కొత్త సమస్యలను ముందుకు తెస్తున్నది.


దోపిడీకి అవకాశం కల్పించే, సామాజిక పరంగా వివక్షాపూరితమైన మనువాదాన్ని సమర్ధించే శక్తులు ఇటీవలి కాలంలో రూటు మార్చి చిల్లి కాదు తూటు అన్నట్లుగా సనాతనం పేరుతో రాజకీయం చేస్తున్నాయి.అధునాతన కాలంలో సనాతనాన్ని పాటించటం ఎలా సాధ్యమో వారు చెప్పలేరు. రెండవది వేదకాలం గొప్పతనం గురించి ఒక వైపు చెబుతారు. పోనీ ఆ కాలానికి వెళ్లగలమా ? వేదకాలం గురించి చెప్పేవారు రెండో వైపున గోవధ నిషేధం గురించి మాట్లాడతారు. ఇది రెండిరటికీ పొసగని అంశం అని ఎంత మందికి తెలుసు? ఆవును పవిత్రంగా చిత్రించేవారు వేదకాలంలో ఆవు మాంసం తినటం గురించి ఎందుకు మాట్లాడరు ? వేదాలుగానీ, శాస్త్రాలు గానీ చరిత్రలు కావు.వాటిలో అనేక పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి. కారణం ఎవరికి తోచిన వాటిని వారు రాసి వాటిలో చేర్చారు. ఎవరి వాదనలకు అనువుగా ఉన్నవాటిని వారు ఉటంకిస్తూ జనాలను మభ్య పెడుతున్నారు. యజ్ఞయాగాదులలో ఆవు పాలు, పెరుగు, నెయ్యి లేకుండా నేడు గడవటం లేదు. వేదాలతో సమానమైనదిగా భావించే శతపథ బ్రాహ్మణంలో యాజ్జవల్క్యుడు తాను బాగా ఉడికించిన పెద్దకూరను తింటానని చెప్పినట్లుగా ఉంది. దేవతల చక్రవర్తిగా పరిగణించే దేవేంద్రుడు ఎద్దుమాంస వడ్డన గురించి చెప్పాడు. వేదకాలంలో పూజారులకు ఆవులను ఇవ్వాలని లేకుంటే కనీసం ఆవు మాంసమైనా అందచేసే సాంప్రదాయం ఉన్నట్లు రాతలను బట్టి తెలిసిందే. కొంత కాలం తరువాత ఆవు వలన ఉపయోగం ఉందని గ్రహించి దాన్ని చంపకూడదని భావించారు. ఆ మాట చెబితే వినే పరిస్థితి లేకపోవటంతో ఆవు గురించి అభూత కల్పనలు, పవిత్రతను అంటగట్టి నిరోధించేందుకు కావాల్సిన వాటినన్నింటినీ చేర్చారన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ క్రమంలో ప్రతి జంతువుకు పవిత్రతను ఆపాదించి పురాణాల్లో రాయటం కనిపిస్తుంది. కానీ వాటిని వధించి తినటానికి ఉన్న అనుమతి ఆవుకు ఎందుకు నిరాకరిస్తున్నారన్నదే ప్రశ్న. దీన్ని లేవనెత్తితే అనేక మంది తమ మనోభావాలను స్వయంగా గాయపరుచుకుంటున్నారు. రాజకీయ నేతలు ఒకే ప్రకటనకు విరుద్ధ భాష్యాలు చెప్పినట్లుగా పురాణాలు, వేదాలలోని వాటికీ ఈ మధ్య తమకు అనుకూలమైన అర్ధాలు, భాష్యాలు చెప్పటాన్ని చూస్తున్నాము. చెప్పుకోనివ్వండి ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ధర్మరక్షకుల పేరుతో సంఘటితం అవుతున్నవారు అంగీకరించనివారి మీద బలవంతంగా రుద్దే గూండాయిజం ఏమాత్రం సహించరానిది.


ఊరకుక్కల కాట్లకు బలవుతున్న పిల్లలు, పెద్దల గురించి తెలిసిందే. ఇప్పుడు వాటికి తోడు యజమానులు పట్టించుకోకుండా వీధుల్లోకి వదలివేస్తున్న ఆవులు కూడా సమస్యగా మారుతున్నాయి. సనాతనులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఉదయం లేవగానే రోడ్ల మీద తిరుగుతున్న వాటన్నింటినీ తమ ఇండ్లకు చేర్చుకొని ఆదరిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎందుకు ఆపని చేయటం లేదు. ఇటీవల ఢల్లీి ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రయాణిస్తుండగా ఆకస్మికంగా ఒక ఫ్లై ఓవర్‌ మీదకు ఆవులు రావటంతో ఆకస్మికంగా డ్రైవర్‌ బ్రేకులు వేసి వాహనాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.చిత్రం ఏమిటంటే ఆమె కూడా ఒక సనాతన వాదే, ఆవులు వెళ్లేంత వరకు వాహనం దిగి చూశారు తప్ప సిబ్బందిని ఆదేశించి వాటన్నింటిని తన ఇంటికో, కార్యాలయానికో తోలుకు రమ్మని చెప్పలేదు. దేశంలో 50లక్షలకు పైగా ఆవులను రోడ్ల మీద వదలివేసినట్లు అంచనా, నిజానికి ఇంకా ఎక్కువే ఉంటాయి. యోగి ఆదిత్యనాధ్‌, పవన్‌ కల్యాణ్‌ వంటి పక్కా సనాతనవాదులు అత్యధిక రాష్ట్రాల్లో పాలకులుగా ఉన్న ఈ దేశంలో అలా బాధ్యతా రహితంగా వదలివేయటం ఏమిటి ! ఉత్తర ప్రదేశ్‌లోనే పన్నెండున్నర లక్షలు ఉన్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. బిజెపి పాలిత మహారాష్ట్రలో గోశాలల్లో ఉన్న ఒక్కో ఆవుకు రోజుకు రు.50 చెల్లిస్తున్న ప్రభుత్వం వృద్దాప్య పెన్షన్‌గా నెలకు ఇస్తున్న మొత్తం రు.1,500 అంటే ఆవుతో సమానం.బీహార్‌లో రు.400గా ఉన్న వృద్ధాప్య పెన్షన్‌ మొత్తాన్ని ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 2025జూన్‌లో నితీష్‌ కుమార్‌ సర్కార్‌ రు.1,100కు పెంచింది. అత్యంత మానవీయ కోణం ఉన్న ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని సర్కార్‌ జాతీయ సామాజిక సహాయ పథకం కింద మన్మోహన్‌ సింగ్‌ హయాంలో నిర్ణయించిన రు.200, రు.500మొత్తాలనే ఇప్పటికీ మంజూరు చేస్తున్నది. ఈ మాత్రానికే తమ వాటా ఎంత ఉందో లబ్దిదారులకు తెలపాలని కేరళ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాము ఇస్తున్న రు.1,600లలో ఎవరి వాటా ఎంతో చెప్పటానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని అక్కడి వామపక్ష ప్రభుత్వం చురక అంటించింది.

గో సంరక్షణ చట్టాలతో వట్టిపోయిన ఆవులను మేపటం రైతాంగానికి భారంగా మారుతున్నది. గతంలో వాటిని అమ్మివేస్తే వధశాలలకు తరలించేవారు. ఇప్పుడు ఆమ్ముకోవచ్చుగానీ కొనేవారెవరు ? మహారాష్ట్రలో ఉన్న జంతు సంరక్షణ చట్టాన్ని సవరించటం లేదా రద్దు చేయాలని ఏకంగా అక్కడి బిజెపి ఎంఎల్‌సి, మాజీ మంత్రి సదాశివ ఖోట్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అందుకుగాను మండిపడిన కాషాయదళాలు ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేయటమే కాదు దాడులకు పాల్పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. పోలీస్‌ స్టేషన్‌ ముందు నిరసన కూడా తెలిపారు. సతారా జిల్లాలో కొందరు రైతులు తమ గేదెలను విక్రయించారు.వారికి డబ్బు చేతికి అందక ముందే గోరక్షకులమంటూ కొందరు వచ్చి వాటిని బలవంతంగా పూనే తరలించారు. రైతులు కోర్టుకు ఎక్కటంతో వారి పశువులను వెనక్కు ఇవ్వాలని ఆదేశించింది. అయితే వాటికోసం ఒక గోశాలకు వెళ్లగా అవి కనిపించలేదు. రైతులతో పాటు ఎంఎల్‌సి అక్కడ ఉండగా గోరక్షకులమంటూ వచ్చిన వారు తన మీద దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సదాశివ ఖోట్‌ చెప్పారు. మహారాష్ట్రలో వట్టిపోయిన ఆవులు, గేదెలను విక్రయించటానికి వీల్లేకపోవటంతో రైతాంగానికి అవి భారంగా మారాయి. షేత్కారి రైతు సంఘ నేత శరద్‌ జోషి, మరికొందరు ఎప్పటి నుంచో చట్టాన్ని సవరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాను మూడు దశాబ్దాలుగా రైతుల సమస్యల మీద పని చేస్తున్నానని గోరక్షకులుగా చెప్పుకుంటున్నవారు కనీసం ఒక్కసారైనా పాలు పితికిన వారు కాదని ఎంఎల్‌సి విమర్శించారు. గత కొద్ది వారాలుగా సాంప్రదాయకంగా పశువ్యాపారం చేస్తున్నవారు గోరక్షకుల పేరుతో ఉన్నవారి ఆగడాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.వారికి సదాశివ ఖోట్‌ మద్దతు ప్రకటించారు. వట్టిపోయిన పశువులకు నెలకు తొమ్మిదివేల రూపాయల వంతున మేతకు ఖర్చు చేస్తే రైతులకు వచ్చేదేమీ ఉండదని అందువలన వాటిని అమ్ముకోవటం మినహా మరొక మార్గం లేదని, అయితే గోరక్షకులమంటూ బయలుదేరిన వారు ఆ లావాదేవీలను అడ్డుకుంటున్నారని, రైతాంగానికి నష్టం కలిగిస్తున్నారని చెప్పారు.హిందూత్వ నేత మిలింద్‌ ఎక్బోటే ఒక ప్రకటన చేస్తూ ఎంఎల్‌సి పశువులను వధించేవారి తరఫున మాట్లాడుతున్నారని, రాజకీయాలనుంచి గెంటివేయాలని డిమాండ్‌ చేశారు. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కూడా పశువధ చేసే వారికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. అనేక రాష్ట్రాలలో పశువధ, వ్యాపారం వృత్తిగా ఖురేషీ అనే ముస్లిం తెగకు చెందిన వారు ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ మతాన్ని కూడా ముందుకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది.మహారాష్ట్రలో వట్టిపోయిన పశువుల సమస్య ముందుకు రావటం ఇదే మొదటి సారి కాదు. నిజానికి ఇది ఒక్క ఆ రాష్ట్రానిదే కాదు, పశువధ నిషేధం ఉన్న ప్రతి చోటా గోరక్షకుల పేరుతో రైతాంగాన్ని దెబ్బతీసే శక్తులు పేట్రేగిపోతాయి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మరో జండా పండుగ-మన కర్తవ్యం !

16 Sunday Jul 2017

Posted by raomk in AP NEWS, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ 1 Comment

Tags

beef, cow politics, independence day, INDIA, india 71st independence day, India Independence Day, Mahatama Gandhi, pig politics, RSS

ఎక్కడో దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షను ఒక విధానంగా పాటించిన సమయంలో గాంధీ మొదటి తరగతి బోగీలో ప్రయాణించటానికి వీలు లేదంటూ 19వ శతాబ్దంలో రైలు నుంచి తోసి వేస్తే ఔరా తెల్లవారికి అంత కండకావరమా అనుకొని మన రక్తం వుడికి పోయింది. అదే మన ఢిల్లీ రైలులో 21వ శతాబ్దంలో అంతకంటే దారుణంగా జరిగిన దానిపై మనం అంతగా ఎందుకు స్పందించలేకపోతున్నాం? అలాంటిది ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, గిరిజనులు, మొత్తంగా జనం ఏది తినాలో ఏది తినకూడదో ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్దేశించే శక్తులు యధేచ్చగా చెలరేగుతున్న ‘స్వేచ్ఛా భారతాన్నా’ మన పెద్దలు కోరుకున్నది, త్యాగాలు చేసింది ?

ఎం కోటేశ్వరరావు

ఆగస్టు 15 సందర్భంగా మరోసారి టీవీలు, వీధులన్నీ దేశ భక్తి గీతాలతో మార్మోగనున్నాయి. జాతర్లలో పూనకం వచ్చినట్లుగా కొందరు దేశ భక్తితో వూగిపోతారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, సాంప్రదాయ గూండాలు, రౌడీలు, కొత్తగా వునికిలోకి వచ్చిన కాషాయ గో గూండాలు, కాషాయ, ఆకుపచ్చ తాలిబాన్లు, మనువాదులు, మెజారిటీ, మైనారిటీ మతవాదులు, భావ ప్రకటనా స్వేచ్చా, ప్రజాస్వామ్య వ్యతిరేకులు, స్వాతంత్య్ర వుద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన వారి అన్ని రకాల వారసులు, రాజకీయ ప్రవేశానికి సోపానంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రయత్నించే సకల అవాంఛనీయ శక్తులు ఆరోజున వీధుల్లో దర్శనమివ్వబోతున్నాయి. నిజమైన స్వాతంత్య్రపోరాటానికి, స్వాతంత్య్ర భావనలకు వారసులుగా వున్నవారు కూడా అక్కడక్కడా బిక్కుబిక్కు మంటున్నట్లుగా జెండా పండగలను నిర్వహిస్తారు. అవాంఛనీయ శక్తులను వ్యతిరేకించే లేదా ఇష్టపడని వారు వారితో మనకెందుకు గొడవ అనుకుంటూ వారి ఆధీనంలో జండా కార్యక్రమం జరిగే ప్రాంతం నుంచి తప్పుకొని వెళ్లిపోయే దృశ్యాలు మరోసారి చూడబోతున్నాం.

వందల సంవత్సరాల పాటు బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఆక్రమించుకొని తమ వలసగా చేసుకున్నారని, వారికి వ్యతిరేకంగా పోరాడి అశేష త్యాగాలు చేసిన ఫలితంగానే ఇప్పుడు సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా మన పాలన మనమే చేసుకుంటున్నాం అనే విషయం ఎంత మందికి తెలుసు ? అసలు ఏదేశానికైనా స్వాతంత్య్రం ఎందుకు ? ఎవరినైనా ఈప్రశ్న అడిగితే, స్వాతంత్య్రమా చట్టుబండలా 70 ఏండ్ల క్రితం మనం తెచ్చుకున్న స్వాతంత్య్రం కూడు పెట్టిందా, నీడ నిచ్చిందా అని నిట్టూర్పు లేదా ఈసడించుకోవటం కనిపిస్తుంది. ఇలాంటి భావం సమాజంలో వుండటం అంటే నిరంకుశత్వం పెరగటానికి అనువైన పరిస్థితులు ఏర్పడినట్లుగా భావించాల్సి వుంటుంది. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం, సోషలిస్టు చైతన్యం కలిగించటంలో చేసిన తప్పిదాలు లేదా లోపాల కారణంగా అంతకు ముందు తమ పూర్వీకులు కూల్చివేసిన పెట్టుబడిదారీ వ్యవస్ధను అక్కడి జనాలు కోరి పున: ప్రతిష్టించుకున్నారు. మొత్తంగా చూసినపుడు చరిత్ర ముందుకు పోయినప్పటికీ ఇలాంటి తిరోగమన వుదంతాలు కూడా జరుగుతాయని మన కళ్ల ముందు కనిపించిన పరిణామమిది. సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేస్తుంటే దాని వలన లబ్ది పొందిన జనం కూడా ప్రేక్షక పాత్ర వహించారు. నియంతృత్వశక్తులు ప్రజాస్వామిక, ప్రగతిశీల అవతారాలెత్తితే గుడ్డిగా నెత్తినెక్కించుకున్నారు. మబ్బులను చూసి చేతుల్లో వున్న ముంత నీళ్లు పారబోసుకున్నారు.

సోషలిజమే కాదు, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, భావ ప్రకటన, జీవన స్వేచ్చలకు సైతం అలాంటి ముప్పే ముంచుకు వస్తోంది. అనేక దేశాలలో పచ్చి మితవాద శక్తులు ప్రజాకర్షక నినాదాలతో ఎన్నికలలో విజయాలు సాధిస్తున్నాయి. నిప్పును ముట్టుకుంటే కాలుతుందని తెలియని పసివారి సంగతి అటుంచుదాం. తెలిసిన వారు కూడా ఒకసారి పట్టుకొని చూద్దాం అన్నట్లుగా ఒక విధమైన వున్మాద స్ధితిలో వ్యవహరిస్తున్నారు. అదానీ, అంబానీల వంటి లాభాలే పరమావధిగా వున్న వారికి ఎవరైనా ఒకటే అనుకోండి. మంచి వాళ్లనుకున్నవారు ఏం ఒరగబెట్టారని, వీరికి కూడా ఒక అవకాశం ఇచ్చి చూస్తే పోయేదేముంది అన్నట్లుగా మితవాద, తిరోగామి శక్తుల గురించి తెలిసిన మేథావులు, సామాన్యులు కూడా వుదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

చరిత్ర పునరావృతం అవుతుంది. అంటే దాని అర్ధం హిట్లర్‌ లాంటి వాడే తిరిగి జర్మనీలోనే పుట్టి ఫాసిజాన్ని అమలు జరపనవసరం లేదు. ప్రతి చోటా కొత్త రూపాల్లో కొత్త శక్తులు పెరిగేందుకు ప్రయత్నిస్తాయి. ప్రపంచాన్ని ఆక్రమించుకోవటంలో జర్మన్లు వెనుకబడ్డారు కనుక తనదైన శైలిలో ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు హిట్లర్‌ ప్రయత్నించాడు. ప్రపంచంలో వలసరాజ్యాలు అంతరిస్తున్న దశలో చరిత్ర గతికి విరుద్దమది. అయినా అలా మొరటు పద్దతులలో నడపాలని చూసి ప్రపంచంలో అనేక కోట్ల మంది ప్రాణాలు పోవటానికి, జీవితాలు నాశనం కావటానికి కారకుడయ్యాడు. ఇప్పుడు అమెరికా తన కార్పొరేట్‌ శక్తులకు మార్కెట్‌ కోసం కొత్త పద్దతులు, కొత్త రూపాలలో యుద్ధాలు, అంతర్యుద్ధాలను, వుగ్రవాదం, వుగ్రవాదులను సృష్టించి మార్కెట్లను హస్తగతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచంలో తమతో కలసి వచ్చే దేశాలను కూడగట్టి ప్రతి అమెరికా అధ్యక్షుడు నిత్యం ఏదో ఒక మూలన యుద్ధాలు చేస్తూ జనం ప్రాణాలను బలిగొంటూ, జీవితాలను నాశనం చేస్తూనే వున్నాడు. దీన్ని చరిత్ర పునరావృతం కావటం అనిగాక మరేమనాలి ?

మన ఏడుపదుల స్వాతంత్య్రాన్ని కూడా ఈ నేపధ్యంలోనే అవలోకించాలి. బ్రిటీష్‌ వారు మన దేశం నుంచి తప్పుకున్న సమయంలో మన నేతలు ఏం చెప్పారు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించటం అవసరం. మన స్వాతంత్య్రానికి ముందే మన దేశంలో వుట్టిన అనేక సంస్ధలలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒకటి. వారేమి చెప్పుకున్నప్పటికీ స్వాతంత్య్ర వుద్యమానికి దాని నేతలు, అనుచరులు వ్యతిరేకంగా, దూరంగా వున్నారు. సావర్కర్‌ వంటి నాయకుడు బ్రిటీష్‌ వారికి లొంగిపోయి సేవలు చేసుకుంటానని లేఖలు రాశాడు.

సరిగా నిర్వహించారా లేదా అన్న చర్చ ఎలా వున్నప్పటికీ గాంధీ, నెహ్రూ వారి అనుచరులు స్వాతంత్య్ర వుద్యమానికి ప్రధానంగా నాయకత్వం వహించారు. వారి విధానాలతో ఏకీభవించని వారు కమ్యూనిస్టులుగా మారారు తప్ప కాషాయ శక్తుల మాదిరి బ్రిటీష్‌ వారి చంకనెక్కలేదు. మన పాలనను మనం చేపట్టిన తరువాత వారి నాయకత్వంలోని కాంగ్రెస్‌ అధికారంలో వుంది, అనేక అక్రమాలకు పాల్పడింది, స్వాతంత్య్ర లక్ష్యాలకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఒక బిడ్డ పుట్టిన తరువాత బతికి వయస్సు వచ్చిందా లేదా అంటే రాకుండా ఎలా వుంటుంది. అలాగే కాంగ్రెస్‌ వారు మా పాలనలో అసలేమీ అభివృద్ధి జరగలేదా అని అడ్డు సవాళ్లు విసురుతారు. పుట్టిన తరువాత బతికి వుంటే వయస్సు రావటానికి ఎవరూ తోడ్పడనవసరం లేదు. ఆ బతికిన బిడ్డ ఆఫ్రికాలో అకలితో మాడే జీవచ్చంలా వుందా ఆరోగ్యంగా పెరిగిందా లేదా అన్నది చూడాలి. అలా చూసినపుడు ఆఫ్రికా అంతగాక పోయినా మన దేశంలో మెజారిటీ జనజీవితాలు జీవచ్చవాలకు దగ్గరగానే వున్నాయి. పోషకాహారలేమితో గిడసబారిపోవటం, ఇరవైల్లోనే అరవై లక్షణాలు రావటం, శరీరాన్ని కప్పుకొనేందుకు తగినన్ని బట్టలు లేకపోవటం, వుండటానికి ఇళ్లు లేకపోవటం వంటి అనేక సమస్యలు ఏడుపదుల స్వాతంత్య్రం తరువాత కూడా వుండబట్టే అనేక మంది దానిని అభివృద్ధిగా చూడటం లేదు, అందుకే స్వాతంత్య్రం మనకేమి తెచ్చింది, మాకేమిచ్చింది అని అడుగుతున్నారు.

ఇన్ని అనర్ధాలకు కారణం కాంగ్రెస్‌, దానికి నాయకత్వం వహించిన గాంధీ, నెహ్రూ వారి అనుచరులే కారణమని ఆరోపించే బిజెపి దేశ చరిత్రలో వారి పాత్రను పూర్తిగా చెరిపివేసే లేదా వక్రీకరించేందుకు పూనుకుంది. తమకెలాగూ మంచి చరిత్ర లేదు కనుక వున్నవారిపై బురదజల్లి తమ నిజస్వరూపాన్ని కప్పిపుచ్చుకొనే యత్నమిదని విమర్శకులు భావిస్తున్నారు. మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేకు ఆర్‌ఎస్‌ఎస్‌తో వున్న సంబంధాల గురించి తెలిసిందే. ఒకవైపు మహాత్ముడిని పొగుడుతూనే మరోవైపు ఆయన ఒక చతురుడైన కోమటి అని సాక్షాత్తూ బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా చేసి వ్యాఖ్యను నరేంద్రమోడీతో సహా ఏ బిజెపి సీనియర్‌ నేతా తప్పు పట్టలేదు, గడ్డి పెట్టలేదు, ముసి ముసి నవ్వులతో చోద్యం చూశారు. ఇక నెహ్రూ గురించి చేస్తున్న ప్రచారం గురించి చెప్పనవసరం లేదు.

ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలు, అసమానతలు,అవినీతి, నిరుద్యోగం, దారిద్య్రం, సామాజిక న్యాయలేమి వంటి సకల అవలక్షణాలకు మహాత్ముడు అధికారంలో ఎన్నడూ భాగస్వామి కాలేదు కనుక, నెహ్రూ నుంచి మన్మోహన్‌ సింగ్‌ వరకు అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్‌ విధానాలు, వ్యవహరించిన తీరే కారణం అనటంలో ఎలాంటి పేచీ లేదు. అవన్నీ విధానాల కారణంగా వచ్చాయి తప్ప మరొకటి కాదు. వాటిని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న, ప్రత్యామ్నాయ విధానాలను సూచిస్తున్న వామపక్షాలు, శక్తులు నెహ్రూ లేదా ఆయన వారసుల విధానాలను విమర్శిస్తే అర్ధం వుంటుంది.అధికారం కోసం ఆరాటం తప్ప ఏనాడూ ప్రత్యామ్నాయ విధానాల వూసులేని, ఏ కాంగ్రెస్‌నైతే విమర్శిస్తున్నారో దాని విధానాలనే మక్కీకి మక్కీ అనుసరిస్తున్న బిజెపి,ఎన్‌డిఏ పక్షాలకు అర్హత ఏమిటి అన్నది ప్రశ్న.

స్వాతంత్య్రం సందర్భంగా 1947 ఆగస్టు 14 రాత్రి నెహ్రూ చేసిన ప్రసంగంలో ‘ఆమె బిడ్డలందరూ నివశించాల్సిన స్వేచ్చా భారతాన్ని మనం నిర్మించాల్సి వుంది’ అని చెప్పారు. ఏడు పదుల స్వాతంత్య్రం తరువాత రాజధాని ఢిల్లీ రైలులో గడ్డం, టోపీ పెట్టుకోవటాన్ని చూసి నువ్వు ముస్లిం, గొడ్డు మాంసం తింటావు, పాకిస్ధాన్‌ వెళ్లిపో అంటూ ఒక కుటుంబ సభ్యులపై వున్మాదంతో కొందరు దాడి చేసి రైలు నుంచి తోసి వేస్తుంటే దానిని అడ్డుకొనేందుకు ఒక్కరు కూడా ముందుకురాని ‘సహనపరుల’ సేచ్చా భారతంలో నేడు మనం వున్నాం. ఆ దాడిలో జునైద్‌ అనే 15 ఏండ్ల యువకుడు కత్తిపోట్లతో సోదరుడి ఒడిలో రైల్వే ఫ్లాట్‌ఫారంపై మరణించాడు. మతోన్మాద కోణాన్ని మూసి పెట్టేందుకు దాన్ని సీట్ల గొడవగా చిత్రించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తే దున్న ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా మన మీడియా దానిని జనానికి అందించిందంటే ఏమనుకోవాలి?

ఎక్కడో దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షను ఒక విధానంగా పాటించిన సమయంలో గాంధీ మొదటి తరగతి బోగీలో ప్రయాణించటానికి వీలు లేదంటూ 19వ శతాబ్దంలో రైలు నుంచి తోసి వేస్తే ఔరా తెల్లవారికి అంత కండకావరమా అనుకొని మన రక్తం వుడికి పోయింది. అదే మన ఢిల్లీ రైలులో 21వ శతాబ్దంలో అంతకంటే దారుణంగా జరిగిన దానిపై మనం అంతగా ఎందుకు స్పందించలేకపోతున్నాం? అలాంటిది ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, గిరిజనులు, మొత్తంగా జనం ఏది తినాలో ఏది తినకూడదో ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్దేశించే శక్తులు యధేచ్చగా చెలరేగుతున్న ‘స్వేచ్ఛా భారతాన్నా’ మన పెద్దలు కోరుకున్నది, త్యాగాలు చేసింది ? మన నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధలో పై మెట్టులో వున్నామనుకుంటున్న ప్రతివారూ కింది మెట్టులోని వారిని తక్కువగా చూస్తున్న స్ధితిలో పేరు,వేష భాషలను బట్టి అణచివేతకు పూనుకోరన్న గ్యారంటీ ఏమిటి ?

ఆధునికత విలసిల్లే ప్రాంతాలలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఒకటి. అలాంటి చోట గరగపర్రు అనే గ్రామంలో మిగతా నేతల విగ్రహాల సరసన అంబేద్కర్‌ విగ్రహాన్ని అనుమతించం వేరే చోట పెట్టుకోండి అంటూ కొంత మంది అడ్డుకోవటంలో అర్ధం ఏమిటి? అంబేద్కర్‌ విగ్రహాన్ని వేరే చోట పెట్టుకోమనటానికి ముస్లింలను చూసి పాకిస్ధాన్‌ పొమ్మనటానికి తేడా ఏముంది. ఈ రోజు ముస్లింలు అయితే రేపు దళితులు,గిరిజనులు, వెనుక బడిన వారూ, మహిళలకూ అదే గతి పడుతుంది. వూరి మధ్యలో ఎవరైనా దళితులు, గిరిజనులు వుంటే గొడ్డు మాంసం తినేవారు మీరు, ఖాళీ చేసి మీ వాడలకు పోండి అనరన్న గ్యారంటీ ఏముంది ?(గొడ్డు మాంసం తినని దళితులు, గిరిజనులను కూడా సహించరని మనవి) విగ్రహాన్ని అడ్డుకోవటాన్ని ప్రశ్నించినందుకు దళితులను సాంఘిక బహిష్కరణ చేయటమే గాక అందుకు పాల్పడిన వారే తమకు న్యాయం చేయండి అంటూ గరగపర్రులో మాదిరి పోటీ దీక్షలకు దిగే పరిస్దితికి, దానిని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించే పరిస్ధితికి కారకులెవరు ?నాడు అంబేద్కర్‌ అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడినపుడు దానిని పాటించే హిందువులలోని అనేకశక్తులు ఆ అనాచారానికి వ్యతిరేకంగా మద్దతుగా నిలిచాయి కనుకనే మనువాదులు మౌనంగా వున్నారు. అదే అంబేద్కర్‌ ఈ రోజు గరగపర్రులో అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడి వుంటే పోటీ దీక్షలకు దిగిన వారు సహించి వుండేవారా ? ఇలాంటి వుదంతాలు, ప్రశ్నలను 70 ఏండ్ల స్వాతంత్య్రం తరువాత చర్చించుకోవాల్సి రావటం గురించి ఆవేదన చెందటం కాదు, రానున్న ముప్పు గురించి ఆందోళనపడాలి. ఎదుర్కోవటానికి కార్యాచరణకు దిగాల్సిన తరుణం ఆసన్నం కాలేదా ?

దక్షిణాఫ్రికాలో ఎక్కడైతే రైలు నుంచి తోసివేశారో ఆ పట్టణ కేంద్రంలో అక్కడి ప్రభుత్వం మహ్మాతుడి విగ్రహాన్ని ప్రతిష్టించి వివక్షకు వ్యతిరేకంగా పోరాడినందుకు నివాళి అర్పించింది. మన రాజ్యాంగ నిర్మాతగా కీర్తించబడే అంబేద్కర్‌ విగ్రహాన్ని వూరి మధ్యలో ప్రతిష్టించి తెలుగుదేశం ప్రభుత్వం, దాడి అనంతరం రైలు నుంచి తోసివేతకు గురై మరణించిన జునైద్‌ విగ్రహం లేదా చిహ్నాలను రైల్వే ఫ్లాట్‌ఫారంపై ప్రతిష్టించి నరేంద్రమోడీ సర్కార్‌ తమకు కులం, మత వివక్ష లేదని ప్రదర్శించుకుంటాయా ?

ఆవు, పంది కొవ్వులను తుపాకి తూటాల తొడుగులకు(కాట్‌రిడ్జ్‌) పూసిన బ్రిటీష్‌ వారి చర్య హిందూ-ముస్లింలను ఏకం చేసి 1857లో ప్రధమ స్వాతంత్య్ర యుద్దానికి తిరుగుబాటు కారణాలలో ఒకటని చరిత్రలో చదువుకున్నాం. తూటాలను తుపాకిలో నింపాలంటే నోటితో తొడుగులను కొరికి తొలగించాల్సి వచ్చేది. అణుబాంబును కనిపెట్టాం, అంతరిక్షంలో జయప్రదంగా వుపగ్రహాలను ప్రయోగిస్తున్నాం, క్షిపణులను తయారు చేశాం, అయితేనేం

నూట అరవై సంవత్సరాల తరువాత కూడా అదే ఆవు, పంది సమస్యలను డెబ్బయి సంవత్సరాల స్వతంత్రభారతంలో పరిష్కరించుకోలేక వుద్రిక్తతలు, మారణకాండకు కారణం అవుతున్నాయి. అన్ని మతాలవారూ గొడ్డు మాసం తింటున్నది వాస్తవం, అయినా కొన్ని శక్తులు ఒక మతం వారిని వెంటాడి తరిమి దాడులు, హత్యలు చేస్తుంటే మనం చోద్యం చూస్తున్నామంటే ముందుకు పోతున్నట్లా తిరోగమిస్తున్నట్లా ? దేశంలోని అన్ని రాష్ట్రాలలో ముస్లింలు విదేశీయులు, విదేశీ మతం అంటూ ప్రచారం, దాడులు చేస్తున్న కాషాయ దళాల గురించి తెలియందెవరికి ? అదే ప్రచారం, దాడులు కాశ్మీరులో చేయగలరా ? గొడ్డుమాంసం, అలాగే క్రైస్తవ మతవ్యాప్తి గురించి రెచ్చగొట్టే ప్రచారం చేస్తున్న వారు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి అదే చేయగలరా ? నాడు బ్రిటీషు వాడిది రాజకీయం అన్నాం మరి నేడు చేస్తున్నదానినేమనాలి ?

బ్లాక్‌ మార్కెటీర్లను లైటు స్ధంభాలకు కట్టి వురి తీయాలని ఒక సందర్భంగా స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రధాని నెహ్రూ చెప్పారు. ఆయన లేదా వారసుల హయాంలో ఒక్క బ్లాక్‌ మార్కెటీరుకు కూడా ఆ గతి పట్టలేదు. ఆ నెహ్రూను నిత్యం విమర్శించే బిజెపి నేతల పాలనలో జరిగిందేమిటి ? 2015లో పప్పుల ధరలు ఆకాశానికి అంటినపుడు ఎవరూ నియంత్రించలేకపోయారు. ఆకస్మికంగా ధరలు రెట్టింపు కావటం గురించి ఆదాయపన్నుశాఖ చేపట్టిన దర్యాప్తులో విదేశీ-స్వదేశీ పప్పుధాన్యాల వ్యాపారులు, దిగుమతిదారుల కుమ్మక్కు ఇందుకు దారితీసినట్లు రెండువేల పేజీల నివేదిక వెల్లడించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పప్పులను ముంబై, చెన్నయ్‌ రేవుల్లో దొంగనిల్వలు చేసినట్లు తేలింది. అందుకు బాధ్యులపై ఇంతవరకు నరేంద్రమోడీ సర్కార్‌ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆయన హయాంలో జరిగిన అతి పెద్ద కుంభకోణమిది. పోనీ కాంగ్రెస్‌ హయాంలో జరిగిన కుంభకోణాలపై ఇంతవరకు తీసుకున్న చర్యలేమిటో కూడా మనకు తెలియదు.ఎవరు ఎవరిని రక్షిస్తున్నట్లు ?

1991లో కాంగ్రెస్‌ పాలనా కాలంలో ప్రవేశ పెట్టిన నూతన ఆర్ధిక విధానాలు అనేక అక్రమాలకు తెరతీశాయి. ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారు. శతకోటీశ్వరులు పెరిగారు, అదాయ అసమానతలు పెరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత వుంటాయి. ఇవన్నీ మన స్వాతంత్య్ర వుద్యమ ఆకాంక్షలకు విరుద్ధం. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వ్యవస్ధను అమలులోకి తీసుకు రావటం మరొక స్వాతంత్య్రం అన్నట్లుగా పాలకపక్ష నేతలు చిత్రిస్తున్నారు. గతంలో కూడా రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, గరీబీ హఠావో, భూసంస్కరణల బిల్లుల సందర్భంగా కూడా నాటి పాలకులు జనంలో ఇలాంటి ఆశలనే కల్పించారు. ఆ కోవకు చెందిందే ఇది తప్ప మరొకటి కాదు. విదేశీ, స్వదేశీ కంపెనీలు రాష్ట్రానికొక పన్ను చెల్లింపు విధానం లేకుండా వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు తీసుకున్న చర్య ఇది. ఏ విధానం అయినా జనానికి చేసే మేలు ఏమిటన్నదే గీటురాయి. జిఎస్‌టి వ్యాపారులకు వుద్ధేశించింది తప్ప జనంపై భారాలు తగ్గించేది కాదు.నిజానికి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్దే వుంటే పెట్రోలియం వుత్పత్తులను కూడా దాని పరిధిలో చేర్చి వుండాల్సింది. కనీసం గత మూడు సంవత్సరాలలో పెట్రోలియం వుత్పత్తులపై అదనంగా పెంచిన పన్ను మొత్తాన్ని తగ్గించినా ఎంతో మేలు జరిగేది. జిఎస్‌టి వలన సామాన్య మానవుడి కుటుంబ బడ్జెట్‌లో పెద్ద మార్పులేమీ లేవన్నది ప్రాధమిక పరిశీలన.వ్యాపారం చేసుకొనేందుకు అనుమతి పేరుతో మన గడ్డపై కాలు పెట్టి క్రమంగా రాజకీయ అధికారాన్నే తెల్లవారు స్వాధీనం చేసుకున్నారు. మన సంపదలను కొల్లగొట్టారు. సారం వారు పీల్చుకొని మనకు పిప్పి మిగిల్చారు. ఇప్పుడు ప్రపంచంలోని కార్పొరేట్‌ శక్తులన్నీ మనదేశంలో కాలు పెట్టేందుకు కాంగ్రెస్‌ పాలకులు తలుపులను కొద్దిగా తెరిస్తే బిజెపి పాలకులు బార్లా తెరిచి ఎర్రతివాచీ పరచి స్వాగతాలు పలుకుతున్నారు. ఇది తిరోగమనం తప్ప పురోగమనం కాదు. మన షరతులపై విదేశీ పెట్టుబడులను అనుమతిస్తే అది మన అధికారానికి చిహ్నం, అదే వారి షరతులకు అంగీకరిస్తే స్వాతంత్య్రాన్ని వారి కాళ్ల ముందు పెట్టటం తప్ప వేరు కాదు.

దీర్ఘకాలం పాటు అటు సోవియట్‌ కూటమిలోనూ ఇటు అమెరికా కూటమిలో చేరకుండా మన దేశం అవలంభించిన అలీన విధానం నుంచి మన ప్రభుత్వం క్రమంగా వైదొలుగుతూ క్రమంగా అమెరికా కౌగిట్లోకి చేరుతోంది. శకుని రాజకీయానికి కౌరవులు బలైనట్లుగా అమెరికాతో చేతులు కలిపిన ఏదేశం కూడా బాగుపడలేదు. మన పక్కనే వున్న పాకిస్ధాన్‌ ఎలా నియంతలపాలనలో మగ్గిందీ చూశాం, అప్పుడప్పుడు పౌరపాలకులు అధికారానికి వచ్చినా సైన్యం కనుసన్నలలోనే వారు పని చేయాలి. ఏడుపదుల స్వాతంత్య్రం తరువాత పాకిస్ధాన్‌ ఎంత దుస్ధితిలో వుందో చూశాము. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండాలలో అమెరికాతో చేతులు కలిపిన దేశాలన్నింటా సైనిక నియంతలు, ప్రజాద్రోహులు తప్ప మంచివారెవరినీ అధికారంలోకి రానీయలేదు. పాలస్తీనాను ఆక్రమించి అరబ్బులను వారి ప్రాంతాల నుంచి తరమివేసిన ఇజ్రాయెల్‌ను ఇప్పటికీ ప్రపంచమంతా చీదరించుకొంటోంది, అధికారికంగా ఐక్యరాజ్యసమితిలో దానిని వ్యతిరేకిస్తోంది. అలాంటి దేశంతో తొలిసారిగా మన ప్రధాని నరేంద్రమోడీ చేతులు కలపటం అంటే అమెరికాతో మన స్నేహం ఎక్కడికి దారితీయించిందో అర్ధం అవుతోంది. నువ్వు ఎలాంటి వాడివో చెప్పాలంటే నీ స్నేహితులను చూస్తే చాలు అన్న విషయం తెలిసిందే.

డెబ్బయి ఒకటవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గతాన్ని నెమరు వేసుకొంటే మన మహత్తర లక్ష్యాల నుంచి ఎలా వైదొలిగామో, దాని పర్యవసానాలేమిటో కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. వాటిని చూసి గుండెలు బాదుకోవటం గాక వర్తమానంలో కర్తవ్యాలను గుర్తెరగటం, అందుకోసం పని చేయటమే స్వాతంత్య్ర వుద్యమంలో అశేష త్యాగాలు చేసిన వారికి సరైన నివాళి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గోరక్షకులు మరియు వారి సమర్ధకులకు బహిరంగ లేఖ

29 Wednesday Mar 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Politics, RELIGION

≈ Leave a comment

Tags

ban oncow slaughter, beef, cow, cow slaughter, Cow Vigilante Groups, dalits, Gau Rakshaks, Muslims

Image result for Gau Rakshaks, and their apologists

వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ అక్రమ పశువధ శాలలను మూసివేయిస్తానంటూ ప్రకటించి మారోసారి బీఫ్‌ లేదా పశుమాంసం, గో సంరక్షణ సమస్యను ముందుకు తెచ్చారు. దీన్ని కావాలని తెచ్చారా లేక ఆయన సహజత్వానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నదాని గురించి చర్చించనవసరం లేదు. చర్చ ఎటు తిరిగి ఎటు ముగిసినా పర్యవసానం ఒకటే.ఈ పూర్వరంగంలో పర్హాన్‌ రహమాన్‌ ఆనే వ్యక్తి తన ఫేస్‌ బుక్‌ పేజీలో గో సంరక్షకులకు వారి సమర్ధకులకు ఒక బహిరంగ లేఖ రాశారు. దానిలో ఆసక్తి కలిగించే అంశాలు వున్నందున పాఠకుల కోసం అనువాదాన్ని దిగువ అందచేస్తున్నాం.ఈ లేఖలోని అంశాలలో అసంబద్ధత, వక్రీకరణలువుంటే ఎవరైనా వాటిని చర్చకు పెట్టవలసిందిగా కోరుతున్నాము.

గోరక్షకులు మరియు వారి సమర్ధకులకు బహిరంగ లేఖ

మార్చి 28,2017

ప్రియమైన గోరక్షకులకు

2014లో పాలకులలో వచ్చిన మార్పుతో ధైర్య భావనతో వున్న మీరు ప్రస్తుతం అధికార అలలపె సవారి చేయటాన్ని నేను అర్ధం చేసుకోగలను.ఈ ఆకస్మిక పరిణామం తెల్లవారేసరికి తయారైన రాజకీయ వాక్సూరత్వ వుత్పాదనకాదని, దీర్ఘకాలంగా అణచిపెట్టిన భావోద్వేగాల ఫలితమని కూడా నేను అర్ధం చేసుకోగలను.అనేక దశాబ్దాలుగా మీ పవిత్రమైన గోవును అపవిత్రం గావించిన, దూషించిన, హింసపెట్టిన వారిపై ప్రతీకారం చేయాలని మీరు వాంఛిస్తారు. ఇప్పటి వరకు రాజ్య రక్షణ పొందినవారికి ఒక గుణపాఠం చెప్పాలంటే ప్రతీకారం తీర్చుకోవాలనే వైపుగా వున్న మీ చర్యను నేను అర్ధం చేసుకోగలను.

మీకు బోధ చేయాలని గానీ లేదా మీ చర్యలు తగినవి కాదని గానీ చెప్పటానికి నేనీ లేఖ రాయటం లేదు.లేదా కపటత్వంతో కూడిన మీ చర్యలను హేళన చేయటానికి గానీ కాదు.అదేమంటే గోవధ సమస్యపై ఒకవైపున మీరు ముస్లింలు, దళితులపై దాడులు చేస్తున్నారు. మరోవైపు గొడ్డు మాంస ఎగుమతులలో ప్రపంచంలో విజయవంతంగా భారత్‌ను అగ్రస్ధానంలో నిలపాలని చూస్తున్న కొత్తగా వచ్చిన ప్రభుత్వం (దానికి మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుబంధమై వున్నారు) గులాబి విప్లవాన్ని ప్రోత్సహిస్తున్నది. మీరు కూడా నా మాదిరి వినమ్రులైన వ్యక్తులే. వుద్రేకం హేతువుపై ఆధిపత్యం చెలాయించటం ప్రారంభించినపుడు భావోద్వేగాలకు లోనవుతాము.మన శక్తిని సరైనదారిలో వుపయోగించగలిగితే అది మీకు అదే విధంగా దేశానికి ఎంతో ప్రయోజనకారి అవుతుంది.శక్తి పనిచేస్తే వుద్రేకంపై హేతువుది పైచేయి కావాలి.

Image result for Gau Rakshaks, and their apologists

నాలేఖలో కొన్ని ప్రశ్నలు వున్నాయి. వాటికి మీరు నాకు సమాధానం చెప్పనవసరం లేదుకానీ మీకు మీరు చెప్పుకోవాలి. మీ చర్యలు సరైనదారిలో వున్నాయా లేక తమ భౌతిక ప్రయోజనాల కోసం రాజకీయ, ఆర్ధిక రంగాల పెద్దలు దుర్వినియోగం చేస్తున్నారా అని మీకు మీరు హేతుబద్దంగా అలోచించండి.

మీ రోజువారీ కార్యకలాపాలతో ప్రారంభించనివ్వండి.

1.వుదయం లేవగానే మీరు వుపయోగించే టూత్‌ పేస్టు పవిత్రమైన ఆవు కొవ్వు నుంచి తీసిన గ్లిజరీన్‌తో తయారు చేసింది కాకూడదని మీరు కోరుకుంటారు. అవును గ్లిజరీన్‌ కొవ్వు నుంచి తీస్తారు. కాల్గేట్‌, క్లోజ్‌అప్‌ మరియు పియర్స్‌( లేదా ఈ విషయానికి వస్తే ఏ బ్రాండ్‌ అయినా) కేవలం మీ విశ్వాసాన్ని గౌరవించేందుకు కూరగాయ వనరులైన సోయాబీన్‌ లేదా ఆయిల్‌పామ్‌ నుంచి గ్లిజరీన్‌ తయారు చేసినట్లు చెప్పుకుంటాయి. మాంస వనరునుంచి తయారు చేసే దాని కంటే శాఖాహార వనరుల నుంచి తయారు చేసే గ్లిజరీన్‌ ఎంతో ఖర్చుతో కూడుకున్నదని మీరు నిజంగా నమ్ముతారా?

2.మీరు వుపయోగించే షేవింగ్‌ క్రీమ్‌, సబ్బు,హెయిర్‌ క్రీమ్‌, షాంపూలు, కండిషనర్లు, మాయిశ్చరైజర్‌ తదితరాలను పవిత్రమైన ఆవు నుంచి సేకరించినవి కాదని మీరెప్పుడైనా తనిఖీ చేశారా ?పాంథనోల్‌ అమినో యాసిడ్స్‌ లేదా విటమిన్‌ బిలను జంతు లేదా చెట్ల వనరుల నుంచి సేకరిస్తారు.వాటిని వుపయోగించబోయే ముందు దయచేసి తనిఖీ చేయండి. వస్త్రాలను సాపు చేసేందుకు వుపయోగించే వాటిలో డీహైడ్రోజనేట్‌ చేసిన కొవ్వు నుంచి తీసే డై మిథైల్‌ అమోనియం క్లోరైడ్‌ వుంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది?

3.మీ దంతాలను తోముకుంటారా? ఒక కప్పు టీ తాగుతారా ? అయితే కాస్త ఆగండి, మీరు వుపయోగించే పంచదారను తెల్లగా చేయటానికి ఆవు ఎముకలను వుపయోగించలేదని నిర్ధారించుకోండి.

4.మనం పొద్దునే వుపాహారం తీసుకుంటాం, ఏం కావాలని మీరు కోరుకుంటారు ?చోలేతో పూరీ, చపాతీయేనా ? మీరు వుపయోగించే అదానీ తయారు చేసే ఖాద్య తైలాలలో గొడ్డు కొవ్వు కలవలేదని నిర్ధారించుకోండి. మీ సమాచారనిమిత్తం తెలియచేస్తున్నదేమంటే కూరగాయల నుంచి ఖాద్యతైలం వనస్పతిని తయారు చేస్తున్న కంపెనీలు గొడ్డు కొవ్వును వినియోగిస్తున్నట్లు బయటపడిన తరువాత 1983లో ఇందిరాగాంధీ ప్రభుత్వం గొడ్డు కొవ్వు వినియోగంపై విధించిన నిషేధాన్ని 32 సంవత్సరాల తరువాత మీరు ఎన్నుకున్న దేశభక్త ప్రభుత్వం మోసపూరితంగా తొలగించింది.

5. సరే దీన్నుంచి బయటకు వద్దాం. మీకు కారు, మోటార్‌ సైకిళ్లలో దేనిని ఎంచుకుంటారు ? దయచేసి టైర్లను తనిఖీ చేయండి. గాలి వత్తిడి ఎంతవుందో చూసేందుకు కాదు. వుపరితల రాపిడిని తట్టుకొని ఆకృతి మారకుండా వుండేందుకు రబ్బరుకు సహాయపడే జంతు సంబంధిత స్టెయరిక్‌ యాసిడ్‌ను టైర్ల తయారీదార్లు వుపయోగించారో లేదో చూడండి.

6. దేన్నయినా అంటించాలనుకుంటున్నారా ? జిగురును వుపయోగించండి. అయితే మరగపెట్టిన జంతు ఎముకలు, సంధాన కణజాలము, లేదా పశువుల చర్మాల నుంచి దానిని తయారు చేయలేదని దయచేసి నిర్ధారించుకోండి. ఫెవికాల్‌ అంత గట్టిగా వుంటుంది, తెగదు.

7.ఇప్పుడు షాపింగ్‌కు వెళదాం. అయితే ప్లాస్టిక్‌ సంచులను వినియోగానికి దూరంగా వుండండి. ఎందుకని? షాపింగ్‌ బ్యాగ్స్‌తో సహా అనేక ప్లాస్టిక్స్‌ పదార్ధాలలో వత్తిడిని తగ్గించే స్లిప్‌ ఏజంట్స్‌ వుంటాయి.వాటిని దేని నుంచి తయారు చేస్తారు ? జంతు కొవ్వు నుంచి అని చెప్పనవసరం లేదనుకోండి.చమురును వుపయోగించి పోలిమర్స్‌ను తయారు చేసినప్పటికీ పదార్ధ గుణాలు, ధర్మాలను మెరుగు పరిచేందుకు జంతుసంబంధితమైన వాటిని ప్లాస్టిక్స్‌ తయారీదారులు తరచూ వుపయోగిస్తారు మరియు ముడి పోలిమర్స్‌ను ప్రాసెస్‌ చేసేందుకు కూడా వుపయోగిస్తారు.

8.దళితులు, ఆవు వ్యాపారులైన ముస్లింలపై దాడి చేసే మీ ప్రాధమిక పని గురించి చూద్దాం.దయచేసి ఆ కొట్లాటలో మీరు గాయపడకుండా చూసుకోండి. ఒకవేళ జరిగితే దయచేసి కాప్సూల్స్‌ కాకుండా టాబ్లెట్లు ఇవ్వమని డాక్టర్‌ను అడగండి. ఎందుకంటే కాప్సూల్‌ కవర్‌ మళ్లీ జంతు ప్రొటీన్‌ నుంచే తయారు చేస్తారు. మీకు కుట్లు వేయాల్సి వస్తే అందుకు వుపయోగించే దారాలు దేనితో తయారు చేసినవో దయచేసి డాక్టర్‌ను అడగండి. సాధారణంగా వాటిని పవిత్రమైన ఆవు పేగుల నుంచి తయారు చేస్తారు.

9.ఆశాభంగం చెందారా ? ఒకే ఐపిఎల్‌ మాచ్‌ చూద్దాం. అయితే ఆగండి. పరుగెట్టిస్తూ మిమ్మల్ని కట్టిపడవేసే ఆ క్రీడలో ఆవు ప్రమేయం వుందని మీకు తెలుసా ? పవిత్రమైన ఆవు. క్రికెట్‌లో వినియోగించే బంతిని కప్పి వుంచే తోలు ఆవు దూడ చర్మం నుంచి తీసిందే.

10.సరే.చలిగా వుంది. ఒక దమ్ము కొడదాం. అయితే సిగిరెట్‌ కూడా నాన్‌ వెజిటేరియన్‌ అయిపోయిందే. సిగిరెట్‌ బడ్‌లో పంది రక్తం కలుస్తుంది. అయితే ముస్లింలకు పంది అంటే ఇష్టం వుండదని తెలుసు కదా ? మీకు దానితో ఎలాంటి సమస్య లేదు. గుట్కా సంగతేమిటి? పశు చర్మాల శుద్ది తరువాత మిగిలిపోయే వక్క నుంచి సేకరించేదే గుట్కాలోని వక్క అని మీకు తెలుసా ?రెండు రూపాయల ఖరీదు చేసే పాకెట్‌ నుంచి మీరేమి ఆశిస్తారు? తాజా వక్కలా ? స్వయంగా పరిశీలించుకోండి, తయారీదారు చిరునామా కాన్పూరు, తోళ్ల పరిశ్రమ కేంద్రం, గ్రహించారా? కావాలంటే గూగుల్‌లో స్వయంగా తెలుసుకోండి.

11.సరే, వాటిని వదిలేయండి,ఎందుకంటే అవి ఆరోగ్యానికి హానికరం. అయితే మీరు ఎప్పుడైనా ఒకసారి పిల్లలకోసం ఇంటికి తీసుకు వెళ్లే జెల్లీ బీన్స్‌, కాండీ కూడా మాంసాహారమే. వాటిని జంతు ఎముకల నుంచి తయారు చేస్తారు. ఆరుద్ర పురుగుల నుంచి తయారు చేసే అద్దకపు ఎరుపు రంగుతో పాటు మహిళలు వుపయోగించే లిప్‌స్టిక్‌ కూడా జంతు కొవ్వు నుంచి తయారు చేసిందే.యగ్‌హర్టు(పెరుగు వంటి పుల్లటి తినే పదార్ధం) ఐస్‌క్రీమ్‌, కనుపాపలను తీర్చిదిద్దే క్రీములో కూడా అది వుంటుంది.

ఇలాంటి వందల వుత్పత్తుల గురించి నేను వివరించగలను.(నిజాయితీగా చెప్పాలంటే వీటిపై పరిశోధన చేసేందుకు అవసరమైన వుత్సాహ హేతువును మీరు నాకు అందించారు) కానీ నేను ఒక అంశాన్ని స్పష్టం చేయకతప్పదు. అదేమంటే మీ విశ్వాసాలను నాశనం చేస్తున్నది దళితులు, ముస్లింలు కాదు. కార్పొరేట్‌ ప్రపంచం మీ విశ్వాస వ్యవస్ధలు విముక్తి పొందలేనంత గట్టిగా బిగించి వేసింది. అందువలన కొద్దిపాటి మొత్తాలు వచ్చే సొమ్ముతో సర్దుబాటు చేసుకొని జీవించేందుకు ఆ జంతువులతో వ్యాపారం చేస్తున్నవారి మీద మీరు దాడులు చేయటం ఎందుకు ? నిజమైన వ్యాపారం చేస్తున్నది కార్పొరేట్స్‌, వారి మీద దాడి చేయటానికి మీకు ధైర్యమున్నదా ?

సరే మీరు గొడ్డు మాంసం తినటానికి వ్యతిరేకం. మీ నిత్య జీవితంలో వుపయోగించే వస్తువుల తయారీకి వుపయోగించే జంతువుల ఎముకలు, కొవ్వు, చర్మాలు తదితరాలను మీరు ఎక్కడి నుంచి తీసుకువస్తారు? కాబట్టి మీరు జీవించండి, ఇతరులను జీవించనివ్వండి. అందరికీ అవకాశం వుంది. మీ మతావేశంతో ఎప్పటి నుంచో వున్న బంధాలను నాశనం చేస్తున్నారు. దేనికోసమిది?

Image result for Gau Rakshaks, and their apologists

కలసిమెలసి జీవించండి. వాక్శూరనాయకుల చేతిలో బొమ్మలుగా మారకండి.మిమ్మల్ని సైనికులుగా వాడుకొనే వారు తమ రాజకీయలక్ష్యం తీరగానే చచ్చిన ఆవును పారవేసినట్లుగానే మిమ్మల్ని కూడా వదలివేస్తారు. ఎప్పటి నుంచో వున్న బంధాలను పున:జీవింపచేయండి.మీ ఇరుగుపొరుగు లేదా మీ స్నేహితులతో సంతోషంగా వుండండి, వారు మీ సామాజికతరగతికి చెందినవారే అయి వుండనవసరం లేదు. మీ దేశ ప్రజలను ప్రేమించండి. అయితే బాణసంచాపేల్చకండి.కాలుష్యం కావాలని ఎవరూ కోరుకోరు.బాణ సంచాలో అల్యూమినియం, ఇనుము వంటి లోహాల పౌడర్‌కు కోటింగ్‌ వేసేందుకు స్టియారిక్‌ ఆసిడ్‌ను ఎక్కువగా వాడతారు. అదిఆమ్లజనీకరణను నిరోధిస్తుంది.అందుకుదోహదం చేసేవాటిని దీర్ఘకాలం నిలువవుంచుతుంది.స్టియారిక్‌ యాసిడ్‌ను దేని నుంచి తయారు చేస్తారో ఎవరైనా వూహించారా?

పర్హాన్‌ రహమాన్‌

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d