• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: chinese investments

తిరిగి చైనా పెట్టుబడులు : తొలి సంకేతాలు పంపిన భారత్‌ !

19 Friday Jan 2024

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, China, Chinese army, chinese investments, Indian army, Ladakh border clash, Narendra Modi Failures, RSS, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్‌-చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్‌ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి) కేంద్రశాఖ కార్యదర్శి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ చెప్పినట్లు, నాలుగేండ్లనాటి అంక్షల ఎత్తివేతకు ఇది సూచిక అని జనవరి పద్దెనిమిదవ తేదీన రాయిటర్స్‌ ఇచ్చిన వార్తకు అంతర్జాతీయ, జాతీయ మీడియా ఎంతో ప్రాధాన్యతనిచ్చింది.దవోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికవేదిక 54వ వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు రాజేష్‌ కుమార్‌ సింగ్‌ వెళ్లారు. అక్కడ రాయిటర్స్‌ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ వార్త చైనాతో సత్సంబంధాలు కోరుకొనే పౌరులు, లబ్దిపొందాలని చూస్తున్న పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ఆశలు రేకెత్తించేదైతే , కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకులకు మింగుడుపడనిదే. అయితే వెంటనే ఏదో అయిపోతుందని అనుకోనవసరం లేదు గానీ నరేంద్రమోడీ సర్కార్‌ మీద దేశీయ కార్పొరేట్‌ శక్తుల నుంచి వస్తున్న వత్తిడికి కూడా ఇది సూచికే. దిగుమతులను అనుమతించుతున్నట్లుగానే పెట్టుబడులను కూడా అంగీకరించకతప్పనట్లు కనిపిస్తోంది.


2020లో జరిగిన గాల్వన్‌లోయ వివాదాల తరువాత మన సరిహద్దులలో ఉన్న దేశాల పెట్టుబడులను తనిఖీ చేయకుండా అనుమతించరాదంటూ కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇవి పరోక్షంగా చైనా పెట్టుబడులను అడ్డుకొనేందుకే అన్నది స్పష్టం.ఎందుకంటే మన నుంచి తీసుకొనేవే తప్ప మరొక సరిహద్దు దేశమేదీ మనకు పెట్టుబడులు పెట్టే స్థితిలో లేదు. అనేక మంది నోటితుత్తర జనాలు చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపులు ఇచ్చినప్పటికీ మన దిగుమతిదారులు వాటిని ఖాతరు చేయకుండా రికార్డులను బద్దలు కొట్టి మరీ దిగుమతులు చేసుకున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. సరిహద్దు ఉదంతాల తరువాత రెండు దేశాల వాణిజ్యం 32శాతం పెరిగింది. నాలుగేండ్లుగా చైనా పెట్టుబడులు, అంతకు ముందు ప్రతిపాదనలు ఏ మాత్రం ముందుకు సాగలేదు.” ఒకసారి మా సంబంధాలు, సరిహద్దు సమస్యలు స్థిరపడితే మార్పు రావచ్చు. పరిణామాలు సక్రమంగా ముందుకు పోతే పెట్టుబడుల అంశంలో కూడా సాధారణ లావాదేవీలను పునరుద్దరించవచ్చని నేను చెప్పగలను. సరిహద్దులను ఎవరైనా కొద్ది కొద్దిగా అక్రమించుకుంటూ ఉంటే మనమేమీ చేయలేం, అటువైపు నుంచి పెట్టుబడులకు ఎర్రతివాచీ మర్యాదలు జరపలేము ” అని రాజేష్‌ కుమార్‌ చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో విదేశీ పెట్టుబడుల విషయంలో ఒక అడుగు వెనక్కు వేసి ఆటంకాలను తగ్గించినట్లు చెప్పారు. ” గతేడాది కాలంగా ఎలాంటి ఉదంతాలు లేవు గనుక సాధారణ ఆశ కనిపిస్తోంది, పరిణామాలు స్థిరపడతాయి, మెరుగుపడతాయి అనుకుంటున్నాను. అమెరికా, ఆస్ట్రేలియాల్లో మాదిరి అన్ని దేశాలకు సంబంధించిన విదేశీ పెట్టుబడుల సమీక్షకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాం, పెట్టుబడులకు స్వాగతం పలకాలనే పరిస్థితిని కొనసాగించాలని భారత్‌ కోరుకుంటున్నదని రాజేష్‌ కుమార్‌ చెప్పారు.


2020లో గాల్వన్‌ లోయలో జరిగిన పరిణామాల తరువాత చర్చల మీద చర్చలు కొనసాగుతున్నాయి. 2022లో రెండు సార్లు స్వల్ప ఘర్షణలు తప్ప ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగలేదు.చర్చలతో ఒక అవగాహనా కుదరలేదు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నారు. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. మనవైపున 50వేల మంది సైనికులు మోహరించి ఉన్నారు. వాస్తవాధీన రేఖ ఉల్లంఘనల గురించి పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నారు. రెండువైపులా సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణం, అభివృద్దీ జరుగుతున్నది. గాల్వన్‌ ఉదంతాలకు ముందు కూడా వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలలో చైనా సైనికులు మన వైపు చొచ్చుకు రావటం, మనవారు అటువైపు వెళ్లటం జరిగినప్పటికీ చేతులతో నెట్టుకోవటం తప్ప ఆయుధాలను ఉపయోగించలేదు. సగటున ఏడాదికి ఐదు వందల సార్లు చైనీయులు అతిక్రమిస్తున్నట్లు మన అధికారులు గతంలో వెల్లడించారు. ప్రతి ఉదంతమూ మీడియాలో రాదు. 2015లో చైనా వైపు నుంచి 428సార్లు అతిక్రమణలు జరగ్గా అవి 2019నాటికి 663కు పెరిగాయి. మనవైపు నుంచి జరిగేవి చైనా వారు చెబుతారు తప్పమనం చెప్పుకోం.


నరేంద్రమోడీ తొలిసారి ప్రధానిగా పదవి చేపట్టిన తరువాత, షీ జింపింగ్‌ మన దేశాన్ని తొలిసారి సందర్శించనున్న తరుణంలో 2014లో సెప్టెంబరు 16న లడఖ్‌ తూర్పు ప్రాంతంలోని చుమార్‌ గ్రామ సమీపంలో చైనా ఒక రోడ్డు నిర్మిస్తుండగా అది తమ ప్రాంతమంటూ మన సైనికులు అడ్డుకొన్నారు. ప్రతిగా దానికి సమీపంలోని డెమ్‌చోక్‌ వద్ద నిర్మిస్తున్న కాలువ పనులను చైనా మిలిటరీ అడ్డుకుంది. ఇలా రెండు దేశాల దళాలు 16 రోజుల పాటు మోహరించి తిష్టవేశాయి. చివరికి ఉన్నత స్థాయి చర్చల తరువాత ఉభయపక్షాలూ వెనక్కు తగ్గాయి. రోడ్డు నిర్మాణాన్ని చైనా విరమించుకుంటే దానికి ప్రతిగా మనదేశం పరిశీలక కేంద్రాన్ని కూల్చివేసేందుకు, బంకర్ల నిర్మాణాన్ని నిలిపివేసేందుకు అంగీకరించింది. తరువాత 2015లో లడఖ్‌ ఉత్తర ప్రాంతంలోని బర్టసే అనే గ్రామం వద్ద చైనా మిలిటరీ నిర్మించిన ఒక పరిశీలన కేంద్రాన్ని ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసులు కూల్చివేశారు. దాంతో చైనా మిలిటరీ రాగా పోటీగా మన సైనికులు కూడా వెళ్లటంతో వారం రోజుల వివాదం తరువాత ఇరుదేశాల స్థానిక మిలిటరీ అధికారులు సర్దుబాటు చేశారు.తరువాత రెండు దేశాల మిలిటరీల మధ్య పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు పన్నెండు రోజుల పాటు సంయుక్త మిలిటరీ విన్యాసాలు జరిపారు. చైనా-భూటాన్‌ మధ్య సరిహద్దు సమస్యలున్నాయి. వాటిలో డోక్లాం ఒకటి. ఆ ప్రాంతం మన దేశంలోని సిలిగురి కారిడార్‌కు దగ్గరగా ఉంటుంది. డోక్లాంలో చైనా మిలిటరీ రోడ్లు, తదితర నిర్మాణాలను చేపట్టడంతో అంతకు ముందు భూటాన్‌ చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా మన దేశం జోక్యం చేసుకొని చైనాను నిలువరించింది.2017లో 73 రోజుల పాటు ఆ వివాదం కొనసాగింది. తరువాత సద్దుమణిగింది. ఇలాంటివి జరుగుతున్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా మన ప్రధాని నరేంద్రమోడీ ఊహాన్‌ నగరానికి వెళ్లినట్లే చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ మహాబలిపురం వచ్చారు. రెండు దేశాల మధ్య ఎగుమతి దిగుమతులు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి.


1962లో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పటికీ తరువాత కాలంలో సంబంధాలను మెరుగుపరుచుకొనేందుకు సరిహద్దు వివాదం, చిన్న చిన్న ఘర్షణలు అడ్డం రాలేదు. కొంతకాలం ఎడముఖం పెడముఖంగా ఉన్నప్పటికీ సాధారణ సంబంధాలు ఏర్పడ్డాయి.గాల్వన్‌ ఉదంతం నిస్సందేహంగా మరోసారి సంబంధాలను దెబ్బతీసింది. తరువాత పెద్ద ఉదంతాలేమీ జరగలేదు గనుక సీనియర్‌ అధికారి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యల వెనుక ప్రభుత్వ ఆలోచనాధోరణి కనిపిస్తున్నది. చైనా తన వస్తువులను తక్కువ ధరలకు మనదేశంతో సహా ప్రపంచంలో కుమ్మరిస్తున్నదని కొంత మంది నిరంతరం ఆరోపిస్తుంటారు. అలాంటి వివాదాలను, సమస్యలను పరిష్కరించటానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది.చైనా మీద ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని అనేక దేశాలు అనుకుంటున్నట్లుగానే మనదేశంలో కూడా కొందరు సూచిస్తున్నారు. తప్పేమీ లేదు. చైనా బదులు ప్రపంచం మన మీదే ఆధారపడే విధంగా చేస్తానని ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర పిలుపులు ఇచ్చారు. మంచిదే, ఎవరూ కాదనటం లేదు.కానీ కొంత కాలానికి మనదేశం మీద ఆధారపడకూడదని ఇతర దేశాలు అనుకోవన్న గ్యారంటీ ఏమిటి? అసలు సమస్య అది కాదు. ఏ దేశానికి ఆదేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్దమయ్యే పరిస్థితి వచ్చేంత వరకు పరస్పరం ఆధారపడక తప్పదన్నది వాస్తవం.


అనుభవమైతే గానీ తత్వం తలకెక్కదంటారు పెద్దలు. గాల్వన్‌ ఉదంతం తరువాత దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేక ప్రచారం, వస్తు బహిష్కరణ పిలుపుల సంగతి, చైనాతో విడగొట్టుకోవాలన్న స్థానిక, అంతర్జాతీయ పెద్దల సలహాలు ఎరిగినవే. అయినప్పటికీ చైనా నుంచి దిగుమతులలో ఏడాదికేడాది స్వల్పతేడాలుండవచ్చుగానీ పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. చైనాకు మన ఎగుమతులు పెరగటం లేదు.చైనా కంటే ముందు గతంలో జపాన్‌, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌,మోటారు వాహనాలు, సెల్‌ఫోన్లు మన మార్కెట్‌ను ముంచెత్తాయి.ఇప్పటికీ గణనీయంగానే ఉన్నాయి. అవి కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చి ఎగుమతులు చేశాయన్నది తెలిసిందే. మన వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు వాటిని ఇక్కడే తయారు చేస్తే అనే ఆలోచన రాలేదనుకుంటే పొరపాటు. అందుకు అనువైన పరిస్థితి మనదేశంలో అప్పుడూ ఇప్పుడూ లేదు. గతంలో ఉన్న కాంగ్రెస్‌ పాలకులకూ, ఇప్పుడున్న నరేంద్రమోడీకి అది పట్టలేదు.చౌకగా వస్తూత్పత్తికి అవసరమైన పరిశోధన-అభివృద్ధికి భారీ మొత్తంలో ప్రభుత్వాలు ఖర్చు చేయకుండా వీలుకాదు. అందుకే ఉత్పత్తి కంటే దిగుమతి చేసుకుంటే వచ్చే లాభాలే ఎక్కువని అప్పుడూ ఇప్పుడూ మన కార్పొరేట్‌ శక్తులు భావిస్తున్నాయి. జపాన్‌ కంపెనీలు తమ మార్కెట్‌కోసం మన దేశంలోని స్థానిక కార్పొరేట్లతో సంయుక్త భాగస్వామ్య కంపెనీలను ఏర్పాటు చేశాయి గనుకనే మారుతీ సుజుకీ, హీరో హౌండా,స్వరాజ్‌ మజడా, వంటి కంపెనీలు రంగంలోకి వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ మోటారు వాహన రంగంలో చైనా ముందుంది.దానితో సంయుక్త భాగస్వామ్యానికి మన పాలకులు అంగీకరిస్తే జపాన్‌ మారుతీ కార్ల మాదిరి చైనా ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇతర ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తుతాయి.ఇప్పటికిప్పుడు ఆ రంగంలో మనం పోటీపడలేం గనుక ఆ లాభాల కోసం మన కార్పొరేట్లు చైనా పెట్టుబడులను అనుమతించాలని వత్తిడి చేస్తున్నాయా ? ప్రభుత్వం అంగీకరిస్తుందా? దానికి సూచికగానే మన ఉన్నత అధికారి రాజేష్‌ కుమార్‌ సింగ్‌ దవోస్‌లో మాట్లాడారా ? చూద్దాం ఏం జరుగుతుందో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా పెట్టుబడులు : ఆంక్షలు పెట్టింది కేంద్రం – నింద కమ్యూనిస్టుల మీద !

30 Tuesday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

China, chinese investments, Communists, FDI, India FDI, Restrictions imposed by NDA Government


ఎం కోటేశ్వరరావు
చైనా నుంచి ఎఫ్‌డిఐల రాక మీద కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడితే దాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారంటూ ఒక పోస్టు సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది. అసలు వాస్తవం ఏమిటి ? తమ దేశాలలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద జర్మనీ, ఆస్ట్రేలియా,చెక్‌ వంటి దేశాలు నిబంధనలలో కొన్ని మార్పులు చేశాయి. అదే పద్దతులలో మన కేంద్ర ప్రభుత్వం కూడా నిబంధనలను సవరించింది. దాని ప్రకారం ” భారత్‌తో భూ సరిహద్దు ఉన్న దేశాలకు చెందిన సంస్ధలు లేదా పెట్టుబడుల ద్వారా లబ్దిపొందే యజమానులైన పౌరులు అటువంటి దేశాలకు చెందిన వారైనా పెట్టుబడులు పెట్టవచ్చు, అయితే అది ప్రభుత్వ మార్గాల ద్వారానే జరగాలి” అని పేర్కొన్నారు.
ప్రస్తుతం రెండు మార్గాల ద్వారా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం లేదా రిజర్వుబ్యాంకు అనుమతితో నిమిత్తం లేకుండా నేరుగా వచ్చేవి. ప్రభుత్వ అనుమతితో వచ్చేవి రెండవ తరగతి. మొదటి మార్గంలో వస్తున్న పెట్టుబడులతో మన దేశంలోని సంస్ధలను చైనా కంపెనీలు కబ్జా చేస్తున్నాయన్నది ఒక తీవ్ర ఆరోపణ. ఒక గూండా, పలుకు బడిన రాజకీయ నేత, అధికారో బలహీనులను అదిరించి బెదిరించి స్దలాన్నో పొలాన్నో రాయించుకుంటే అది అక్రమం. ఎవరైనా అలాంటి ఫిర్యాదు చేస్తే కేసు అవుతుంది. ఏ కంపెనీ అయినా తన సంస్ధను లేదా వాటాలను అమ్మకానికి పెట్టినపుడు ఎవరి దగ్గర సత్తా ఉంటే వారే కొనుక్కుంటారు. దానిలో బలవంతం ఏమి ఉంటుంది.1963లో భారతీయులు నెలకొల్పిన విద్యుత్‌ పరికరాల సంస్ధ యాంకర్‌ గురించి తెలియని వారు ఉండరు. ఆ కంపెనీని 2007లో జపాన్‌ కంపెనీ పానాసోనిక్‌ కొనుగోలు చేసింది. అది చట్టబద్దమే, అలాగే అనేక స్వదేశీయుల మధ్యనే చేతులు మారాయి. రుచి గ్రూప్‌ కంపెనీ రుచి సోయా దివాళా తీసింది. దాన్ని రామ్‌దేవ్‌ బాబా పతంజలి కంపెనీ కొనుగోలు చేసింది. అంకుర సంస్ధల ఏర్పాటులో అనేక మంది చైనాతో సహా పలుదేశాలకు చెందిన సంస్ధలు, వ్యక్తుల నుంచి పెట్టుబడులు తీసుకొని భాగస్వామ్యం కల్పిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో చైనా దూసుకుపోతున్నది. ఆర్ధికంగా, సాంకేతిక పరంగా ఎన్నో విజయాలు సాధిస్తున్నందున వచ్చిన అవకాశాలను మన వారు వినియోగించుకుంటున్నారు. అలాంటి వెసులు బాటు చైనా కంపెనీలకు ఉన్నది. తమ వ్యాపార విస్తరణ వ్యూహాల్లో భాగంగా అవి లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. మన దేశం విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్‌ నుంచి అమల్లోకి తెచ్చిన నిబంధనల్లో ఎక్కడా చైనా అనో మరో దేశం పేరో పేర్కొన లేదు. అయితే మన దేశంతో భూ సరిహద్దు ఉన్న దేశాలలో పెట్టుబడులు పెట్టగలిగింది ఒక్క చైనాయే గనుక ఆ సవరణ వారిని లక్ష్యంగా చేసుకున్నదే అని మీడియా లేదా వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. అది వాస్తవం. భారత ప్రభుత్వ చర్య వివక్షాపూరితం అని చైనా పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వ చర్యను భారత కమ్యూనిస్టులు వ్యతిరేకించినట్లు ఒక్క ఆధారం కూడా లభ్యం కాలేదు, ఎవరైనా చూపితే సంతోషం. ” బందీ అయిన వామపక్షం ” కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద ఎలాంటి వైఖరీ తీసుకోలేరు అంటూ రిపబ్లిక్‌ టీవీ వ్యాఖ్యాత 2020 ఏప్రిల్‌ 19న పేర్కొన్నారు. అయినా కమ్యూనిస్టులు వ్యతిరేకించినవి ఏవి ఆగాయి గనుక ?
చైనాతో సంబంధాలను ప్రోత్సహించి రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ లబ్ది పొందిందని కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌ రుస రుసలాడుతున్నారు. గత ఆరు సంవత్సరాలుగా రవిశంకర ప్రసాద్‌గారు మంత్రిగా ఉన్న మోడీ సర్కార్‌ నిర్వాకం ఏమిటి ? గత పాలకుల వైఖరిని కొనసాగించిందా ? నిరుత్సాహపరచిందా ? రవిశంకర ప్రసాద్‌కు మద్దతుగా బిజెపి ఐటి విభాగం అధిపతి అమిత్‌ మాలవీయ ట్వీట్‌ చేస్తూ 2003-04లో 101 కోట్ల డాలర్లుగా ఉన్న చైనా వాణిజ్యం 2013-14 నాటికి 362 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్‌ నిర్వాకమే అనుకుందాం. 2014 నాటికి మన దేశంలో చైనా పెట్టుబడులు 160 బిలియన్‌ డాలర్లు ఉంటే ప్రస్తుతం 2,600 కోట్లు, ఇవిగాక ప్రతిపాదనల్లో మరో 1,500 కోట్ల డాలర్లు, ఇవిగాకుండా సింగపూర్‌, మలేసియా తదితర మూడో దేశాల పేరుతో ఉన్న మరికొన్ని వందల కోట్ల డాలర్ల చైనా పెట్టుబడుల సంగతేమిటో బిజెపి మంత్రులు,నేతలు చెప్పాలి. ఇవన్నీ కమ్యూనిస్టులు చెబితే మన దేశానికి వచ్చాయా ? పోనీ బిజెపి నేతలకు తెలివితేటలు ఎక్కువ కనుక మనకు అవసరమైన పెట్టుబడులు తెచ్చుకొని మన వస్తువులను చైనాకు ఎగుమతి చేశారా అంటే అదీ లేదు. వాణిజ్య లోటు 36బిలియన్‌ డాలర్లు కాస్తా 63 బిలియన్‌ డాలర్లకు పెరిగిన తీరు చూశాము. ఇదిగాక హాంకాంగ్‌, ఇతర దేశాల ద్వారా మన దేశంలో ప్రవేశిస్తున్న చైనా వస్తువులను కూడా కలుపుకుంటే మన వాణిజ్యలోటు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ నిర్వాకాన్ని ఏమనాలి ? ఇన్ని సంవత్సరాలుగా లేని ఈ చర్చను, ఇలాంటి తప్పుడు ప్రచారాలను బిజెపి ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నట్లు ? లడఖ్‌ లడాయి కారణం. చైనా వారు మన భూభాగంలోకి రాలేదు, మన సైనికపోస్టులను ఏమీ చేయలేదు అని ప్రధాని మోడీ చెప్పటంతో పోయిన పరువు నుంచి జనాన్ని తప్పుదారి పట్టించేందుకు బిజెపి ముందుకు తెచ్చిన ప్రచారదాడి. చైనా గురించి అలా చెప్పాలని ఏ కమ్యూనిస్టు పార్టీ లేదా నేతలు ఎవరైనా ప్రధాని నరేంద్రమోడీ గారికి చెప్పారా ? చైనా మన ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చిందని చెప్పింది మోడీ మంత్రులు, మోడీగారేమో అలాంటిదేమీ లేదు అని చెబుతారు. అసలు కేంద్ర ప్రభుత్వంలో సమన్వయం ఉందా ? దేశ ప్రజలను గందరగోళ పరచటం తప్ప ఒక పద్దతి ఉందా ?
జూలై ఒకటి తరువాత బంగ్లాదేశ్‌ నుంచి ఎగుమతి చేసే 97శాతం వస్తువులపై చైనా దిగుమతి పన్ను రద్దు చేసేందుకు రెండు దేశాల మధ్య కొద్ది రోజుల క్రితం ఒప్పందం కుదిరింది. ఇదే సమయంలో భారత్‌-చైనాల మధ్య లడక్‌ వాస్తవాధీన రేఖ వద్ద వివాదం తలెత్తింది. ఈ నేపధ్యంలో ఇంకే ముంది భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌ను బుట్టలో వేసుకొనేందుకు చైనా ఈ రాయితీలు ప్రకటించిందంటూ మీడియాలో టీకా తాత్పర్యాలు వెలువడ్డాయి. గత కొద్ది సంవత్సరాలుగా చైనా అనేక దేశాలతో తన వాణిజ్య సంబంధాలను విస్తరించుకుంటున్నది. అవి ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలకు వ్యతిరేకం అయితే ప్రభావితమైన ఏదేశమైనా దానికి ఫిర్యాదు చేయవచ్చు, కేసు దాఖలు చేయవచ్చు.
అసలు ఇది ఎంత వరకు నిజం ? మీడియా పండితులకు వాస్తవాలు తెలిసి ఇలాంటి ప్రచారానికి దిగారా లేక తెలియక దిగారా ? తెలిసి చేస్తే జనాన్ని తప్పుదారి పట్టించే యత్నం, తెలియకపోతే తమ విశ్వసనీయతను తామే దెబ్బతీసుకోవటం. ఆసియా ఫసిపిక్‌ వాణిజ్య ఒప్పందం(ఆప్టా) కింద ఇప్పటికే 3,095 బంగ్లా ఉత్పత్తులకు చైనాలో పన్నులు లేవు. వాటిని ఇప్పుడు 8,256కు పెంచారు.
ఇంతకీ ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1975లో జరిగిన ఆప్టాలో భారత్‌, బంగ్లాదేశ్‌,దక్షిణ కొరియా, శ్రీలంక, లావోస్‌ మధ్య జరిగిన బ్యాంకాక్‌ ఒప్పందం ఇది. తరువాత 2005లో ఆసియా ఫసిపిక్‌ వాణిజ్య ఒప్పందం అని పేరు మార్చారు. 2001లో చైనా, 2013లో మంగోలియా ఒప్పందంలో చేరాయి. సభ్య దేశాల మధ్య దిగుమతులపై పన్నులు తగ్గించుకోవటం ప్రధాన లక్ష్యం. ఈ ఒప్పంద లక్ష్యానికి ఇది విరుద్దమైతే మన ప్రభుత్వమే బహిరంగంగా అభ్యంతరం చెప్పవచ్చు. రెండు దేశాల సంబంధాలను మరింతగా పెంచుకోవాలని షేక్‌ హసీనా-గ్జీ జింపింగ్‌ నిర్ణయించుకున్న నెల రోజుల తరువాత జూన్‌లో జరిగిన పరిణామమిది. ఈ ఒప్పందం ప్రకారం చైనా తీసుకున్న చర్య నిబంధనలకు విరుద్దం అయితే కేంద్ర ప్రభుత్వమే తన అభ్యంతరాన్ని ఎందుకు చెప్పలేదు ? లేదా ఇలాంటి పనులు చేస్తే తాము ఒప్పందం నుంచి వైదొలుగుతామని అయినా హెచ్చరించాలి కదా ?
భారతదేశంతో తన సరిహద్దులతో కూడిన చిత్రపటానికి చట్టబద్దత కల్పించేందుకు నేపాల్‌ పార్లమెంట్‌ ఒక రాజ్యాంగ సవరణను ఆమోదించింది. కాళీ నది తూర్పు ప్రాంత భూమి తమది అని అక్కడి నుంచే తమ పశ్చిమ సరిహద్దు ప్రారంభం అవుతుందని నేపాల్‌ చెబుతోంది. కాళీ నది నేపాల్‌ చెబుతున్న ప్రాంతం కంటే బాగా దిగువన ప్రారంభమైనందున ఆ ప్రాంతంతో నేపాల్‌కు సంబంధం లేదని నది ప్రారంభ స్ధానం గురించి నేపాల్‌ చెబుతున్నదానిని అంగీకరించటం లేదని మన దేశం చెబుతున్నది. ఈ వివాదం గురించి నేపాల్‌తో చర్చించవచ్చు, పరిష్కరించవచ్చు. నేపాల్‌ తన దేశ చిత్రపటాన్ని రాజ్యాంగంలో చేర్చటం వెనుక చైనా ఉన్నది అంటూ ఈ సమస్యలో కూడా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది.
స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు మన లాభదాయకమా? నష్టమా ? నష్టం అయితే నరేంద్రమోడీ సర్కార్‌ ఆరు సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా సమీక్షించిందా ? నష్టం అని తేలితే గతంలో చేసుకున్న ఒప్పందాలన్నింటి నుంచి వైదొలిగేందుకు తీసుకున్న చర్య లేమిటి ? పది దేశాలతో కూడిన ఆగేయ ఆసియా దేశాల అసోసియేషన్ను ” ఆసియన్‌” అని పిలుస్తున్నాము. వీటితో మరో ఆరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. మన దేశం 2010జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఒక స్వేచ్చా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంది. మన ఉత్పతులను ఆదేశాల మార్కెట్లలో నింపాలన్నది మన ఆలోచన. కానీ దానికి బదులు వాటి ఉత్పత్తులే మన మార్కెట్లో ఎక్కువగా వచ్చి చివరకు మనకు వాణిజ్యలోటును మిగిల్చాయి. ఆ ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న సిపిఎం నేత విఎస్‌ అచ్యుతానందన్‌ నాటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకతను తెలిపారు. రబ్బరు, సుగంధ ద్రవ్యాల వంటి తోట పంటల ఉత్పత్తులు మన మార్కెట్లోకి వస్తే కేరళ రైతాంగానికి నష్టదాయకమని నాడు చెప్పారు. అదే జరిగింది.
2019 సెప్టెంబరు నెలలో బాంకాక్‌లో జరిగిన ఆసియన్‌-భారత్‌ సమావేశంలో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షించాలని నిర్ణయించారు. అనేక దేశాలు, అసోసియేషన్లతో చేసుకున్న స్వేచ్చావాణిజ్య ఒప్పందాలు తమకు పెద్దగా ఉపయోగపడటం లేదని, వాటిని సమీక్షించాలని మన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు గత కొంతకాలంగా ప్రభుత్వం మీద వత్తిడి తెస్తున్నారు.యుపిఏ అయినా ఎన్‌డిఏ అయినా అనుసరిస్తున్నది దివాలా కోరు విధానాలే. స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు మన దేశానికి హానికరం అనుకుంటే వాటిని చేసుకోబోయే ముందు బిజెపి ఎలాంటి వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు. ఆసియాలో గరిష్ట సంఖ్యలో అలాంటి వాటిని చేసుకున్నది మనమే అని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం 42 ఒప్పందాల మీద అవగాహనకుదిరితే వాటిలో 13 అమల్లో, 16 సంప్రదింపుల్లో , 12 పరిశీలనలో ఉన్నాయి. మొత్తం మీద అమలు జరిగిన వాటి సారం ఏమిటంటే అవి లేకపోతే మన వాణిజ్య పరిస్ధితి ఇంకా దిగజారి ఉండేది. దక్షిణాసియా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం( సాఫ్టా) 2006 నుంచి అమల్లో ఉంది. అప్పుడు 680 కోట్ల డాలర్లుగా ఉన్న వాణిజ్యం 2018-19 నాటికి 2850 కోట్ల డాలర్లకు పెరిగింది. మన వాణిజ్య మిగులు 400 నుంచి 2100 కోట్లడాలర్లకు పెరిగింది. ఆసియన్‌ దేశాలతో కుదిరిన ఒప్పందం లావాదేవీలు గణనీయంగా పెరగటానికి తోడ్పడింది గానీ మన ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి. వాణిజ్యలోటు పెరిగింది. దక్షిణ కొరియాతో మన దేశం కుదుర్చుకున్న ఒప్పందం ఫలితంగా మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా పెరిగాయి. జపాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం తీరు తెన్నులు చూస్తే ఎగుడుదిగుడులు ఉన్నా మన దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో వాణిజ్య లావాదేవీలు పెరిగాయి. ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువ. ఒక్క సాఫ్టా తప్ప మిగిలిన వన్నీ మనకు పెద్దగా ఉపయోగపడలేదు. అందువలన వాటిని సమీక్షించటానికి కమ్యూనిస్టులు లేదా కాంగ్రెస్‌ వారు గానీ ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదు. అధికారానికి వచ్చినప్పటి నుంచి జనాన్ని మత ప్రాతిపదికన చీల్చి మెజారిటీ ఓటు బ్యాంకును ఎలా పెంచుకోవటమా అన్న యావతప్ప దేశ అభివృద్ధి గురించి పట్టించుకొని ఉంటే నేడు ఈ పరిస్ధితి ఉండేదా అని అందరూ ఆలోచించాలి.
పదమూడు సంవత్సరాల పాటు పారిశ్రామికంగా ముందున్న గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్నందున ఆ నమూనాను దేశమంతటా అమలు జరుపుతామని నరేంద్రమోడీ ఎన్నికల్లో చెప్పారు. గత పాలనా అనుభవం కారణంగా ప్రధానిగా నేరుగా రంగంలోకి దిగుతానని చెప్పిందీ మోడీ గారే. అలాంటి వ్యక్తి పాలనలో ఆరేండ్లు తక్కువేమీ కాదు. దక్షిణాసియాలో అగ్రరాజ్యం మనదే. సాఫ్టా ఒప్పందం కూడా ఉంది. అయినా ఏమి జరిగింది ?
ఆప్ఘనిస్తాన్‌, పాకిస్దాన్‌, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్‌, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లతో 2014-18 మధ్య చైనా తన ఎగుమతులను 41 నుంచి 51.7 బిలియన్‌ డాలర్లకు పెంచుకున్నది. ఇదే సమయంలో తన దిగుమతులను 19.4 నుంచి 8.3 బిలియన్‌ డాలర్లకు తగ్గించుకుంది.2018లో ఈ దేశాలతో చైనా వాణిజ్యం 55.99 బిలియన్‌ డాలర్లు కాగా మన దేశం 30.95బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉంది. చైనాకు ఒక్క పాకిస్ధాన్‌తో మాత్రమే స్వేచ్చావాణిజ్య ఒప్పందం ఉంది. నేపాల్‌, భూటాన్‌, ఆఫ్‌ఘనిస్తాన్‌తో మన వాణిజ్యం 9.88 బిలియన్‌ డాలర్లు ఉంటే ఈ దేశాలతో చైనా 1.8 బిలియన్‌ డాలర్లు మాత్రమే. మొత్తం మీద ఈ పరిణామాన్ని మోడీ సర్కార్‌ వైఫల్యం అనాలా లేక చైనా విజయం అనాలా ? మన వైపు నుంచి లోపం ఎక్కడుందో ఆలోచించుకోవాలా వద్దా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా పెట్టుబడులపై కాషాయ దళాల ఆత్మవంచన, పరవంచన ?

04 Sunday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, International, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

anti china, Anti communist, China, china boycott, chinese investments, RSS Outfits anti china, RSS Outfits anti china feets, saffron brigade hypocrisy

సత్య

    కాషాయ తాలిబాన్లకు దేశభక్తి గురించి ఆకస్మికంగా మెలకువ వచ్చిందా ? లేక ఎవరైనా వెనుకనుంచి పొడుస్తున్నారా ? కాషాయ పరంపరలో భాగమైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు వారం రోజుల క్రితం పేటిమ్‌ సంస్ధలో చైనా పెట్టుబడుల గురించి అధ్యయనం చేయాలని తన విభాగమైన స్వదేశీ జాగరణ మంచ్‌ (ఎస్‌జెఎం)ను కోరినట్లు వారం రోజుల క్రితం మీడియాలో ఒక వార్త వచ్చింది. ప్రభుత్వం ఈ విషయమై విచారణ జరపాలని కోరుతున్నట్లు తాజాగా ఆ సంస్ధ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ వెల్లడించారని ఒక వార్తా సంస్ధ ఆదివారం నాడు తెలిపింది. పద్నాలుగు నెలల క్రితం మన దేశానికి చెందిన పేటిమ్‌ కంపెనీలో 68కోట్ల డాలర్లకు 40శాతం వాటాను చైనా ఇ కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా కొనుగోలు చేసినట్లు లోకానికంతటికీ తెలిసిందే. అదేమీ రహస్యంగా జరగలేదు. ఇన్ని నెలల తరువాత ఆ లావాదేవీ, దాని పర్యవసానాలపై విచారణ జరపాలని కోరటమే విచిత్రం. ఇది వారికి కలిగిన ఆలోచనా , వేరే ఎవరినైనా సంతుష్టీకరించేందుకు ఇలా చేస్తున్నారా ? చైనా కంపెనీలు మన దేశ సంస్ధలలో పెట్టుబడులు పెట్టటం, వాటాలు కొనుగోలు చేయటం ఈ వారంలోనే ప్రారంభమైందా ?

     స్వదేశీ జాగరణ మంచ్‌ వారు చెబుతున్న అభ్యంతరం ఏమిటి ? పేటిమ్‌ ద్వారా చైనా కంపెనీలు మన దేశ సమాచారాన్ని తెలుసుకొని దుర్వినియోగం చేసే అవకాశం వుందని, అసలు ఏ కంపెనీకి ఎంత వాటా వుందో, ఎలా ఇచ్చారో వెల్లడించాలని కోరటంతో పాటు పేటిమ్‌ తన వాణిజ్య ప్రకటనలలో ప్రధాని నరేంద్రమోడీ బొమ్మను వుపయోగించుకోవటం అభ్యంతరకరం అని మహాజన్‌ చెప్పారు. పది సంవత్సరాల పాటు అధికారంలో వున్న యుపిఏ సర్కారు సంస్కరణలను సంపూర్ణంగా అమలు జరపలేదని, తాము వాటిని పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నామని బాసలు చేసిన కారణంగానే విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీలు, వాటి కనుసన్నలలో మెలిగే మీడియా నరేంద్రమోడీకి మద్దతు ఇచ్చాయన్నది బహిరంగ రహస్యమే. దానిలో భాగంగానే విదేశీ పెట్టుబడులకు ద్వారాలు మరింతగా తెరిచిన ఖ్యాతి తమదే అని చెప్పుకుంటున్న కాషాయ ‘దేశ భక్తులు’ ఆ విదేశీ పెట్టుబడుల గురించి లబలబలాడటం ఎనిమిదో ప్రపంచ వింత.

    చైనా సంస్కరణలకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న డెంగ్‌ సియావో పింగ్‌ ఒక మాట చెప్పాడు. మనం కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమలూ కూడా ప్రవేశిస్తాయి, వాటి బెడదను వదిలించే శక్తి తమకు వుందన్నారు. మన దేశ పాలకవర్గం కూడా సంస్కరణల పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధ కిటికీని బాహాటంగా తెరిచింది. మన ప్రధాని నరేంద్రమోడీ పెట్టుబడుల కోసం తిరగని విదేశీ నగరం లేదు, కలపని చేయిలేదు. ఎక్కడా ఫలానా దేశాల నుంచి పెట్టుబడులు వస్తే తిరస్కరిస్తాం అని ఎన్నడూ, ఎక్కడా చెప్పలేదు. అందువలన అనేక దేశాల కంపెనీలు వచ్చిన మాదిరే చైనా కంపెనీలు కూడా అన్ని దేశాలలో ప్రవేశించినట్లుగానే మన దేశంలో కూడా కాలుపెడుతున్నాయి. మన దేశానికి చెందిన అనేక కంపెనీలు విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నాయి. అక్కడి సమాచారాన్ని తెలుసుకుంటున్నాయి. దుర్వినియోగం చేసినట్లు గమనిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఏ ప్రభుత్వానికైనా సర్వ హక్కులూ వున్నాయి. అలాంటిది కేవలం చైనా కంపెనీలే దుర్వినియోగం చేస్తాయని చెప్పటం వెనుక ఆంతర్యం ఏమిటి ?మన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తాయనుకుంటే అది ఒక్క చైనా కంపెనీయే చేస్తుందని, మిగతా కంపెనీలు చేయవనే గ్యారంటీ ఏముంది. తనకు మార్గదర్శనం చేసే, తన కార్యకలాపాలను సమీక్షించే స్వంత సంస్ధలే డిమాండ్‌ చేస్తున్నాయి గనుక చైనాతో సహా మన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అన్ని విదేశీ కంపెల గురించి గతంలో తీసుకున్న చర్యలేమిటి? భవిష్యత్‌లో ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో కేంద్ర ప్రభుత్వం ఒక శ్వేత పత్రం ద్వారా ప్రకటించటం అవసరం.

     పేటిమ్‌ కంపెనీ ఏ లావాదేవీలనైతే నిర్వహిస్తున్నదో వాటినే ముఖేష్‌ అంబానీ రిలయన్సు జియో మనీ పేరుతో నిర్వహించేందుకు తన ప్రణాళికలను ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు తరువాత పేటిమ్‌ లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయని మీడియా వార్తలు తెలుపుతున్నాయి. తాను వెనుకబడిపోతానని అంబానీ ఆందోళన చెందుతున్నారా ? సరిగ్గా ఈ సమయంలో స్వదేశీ జాగరణ మంచ్‌కు పేటిమ్‌ విదేశీ (చైనా) సంబంధాల గురించి గుర్తుకు వచ్చింది. నిత్యజీవితంలో మన సమాచారాన్ని తెలుసుకోని,తెలుసుకోలేని విదేశీ కంపెనీలు ఏమున్నాయి గనుక. మనం మాట్లాడే ప్రతి మాటా, పంపే ప్రతి ఎస్‌ఎంఎస్‌, ప్రతి ఇ మెయిల్‌ సమాచారాన్ని అవసరం వున్నా లేకపోయినా అమెరికా సిఐఏ ఎప్పటిప్పుడు సేకరిస్తున్నదని తెలిసిందే. ఆధార్‌ కార్డుల గురించి అందరికీ తెలిసిపోయింది. పాన్‌ కార్డుల ద్వారా ఎవరి నగదు లావాదేవీలేమిటో ఎవరైనా తెలుసుకోవచ్చు. టీవీలలో అమర్చిన సాధనాల ద్వారా మన ఇండ్లలో, చివరికి పడక గదుల్లో ఏం జరుగుతోందో కూడా తెలుసుకొనే రోజులు వచ్చాయి. మన సమాచార గోప్యత ఎక్కడుంది కనుక. వాటన్నింటినీ వదలి చైనా గురించి మాత్రమే సందేహాలు వెలిబుచ్చేవారి గురించి సందేహించాల్సిన అవసరం కలుగుతోంది. ఎవరికైనా ఏజంట్లుగా పని చేస్తున్నారా ? ప్రపంచంలో ఏ దేశం కూడా చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన వార్తలు మనకు తెలియదు. పాలస్తీనా అరబ్బులను ఇక్కట్ల పాలు చేస్తున్న ఇజ్రాయెల్‌ వస్తువులను బహిష్కరించాలని కొన్ని ముస్లిం సంఘాలు ఎప్పటి నుంచో పిలుపులు ఇస్తున్నాయి.

Image result for boycott chinese products

    సదరు స్వదేశీ జాగరణ మంచ్‌ గత కొంత కాలంగా చైనా వస్తు బహిష్కరణ గురించి సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. నిజమే కదా అని అమాయకులు వీర సైనికుల్లా పని చేస్తున్నారు. అధికారంలో వున్న వారి ప్రతినిధులేమో చైనా వస్తు బహిష్కరణ సాధ్యం కాదని చెబుతుంటారు. అక్కడి వస్తువుల కొనుగోలుకు అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని కేటాయిస్తుంటారు ! డాలర్ల కేటాయింపు నిలిపివేస్తే చైనా వస్తువుల దిగుమతులు ఎప్పుడో ఆగిపోయి వుండేవి కదా ! మోడీ సర్కారు ఆపని ఎందుకు చేయదు ? దొంగతనంగా దిగుమతి అయితే పట్టుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారు ? ఏమిటీ నాటకం, ఎవరిని మోసం చేద్దామని ? ఎవరి చెవుల్లో పూలు పెడతారు ? ఇంతకాలం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ తమ ప్రతినిధులు సర్కారు పగ్గాలు చేపట్టి చైనాతో నానాటికీ బంధం పెంచుకుంటూ పోతుంటే మిన్నకుండటం ఆత్మవంచన కాదా ? వీధుల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటం పరవంచన కాదంటారా ? ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలు ?

    నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత మన దేశంలో చైనా పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడి అయ్యాయని మీడియా కోడై కూస్తున్నది.http://www.livemint.com/Politics/X9NBWqqs0JzkX0OQ3UaMQO/Chinese-investments-in-India-increased-sixfold-in-2015.html 2000 ఏప్రిల్‌ నుంచి 2016 మార్చి నెల వరకు మన దేశంలో చైనా పెట్టుబడుల మొత్తం 135 కోట్ల డాలర్లయితే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 230 కోట్ల డాలర్లు వచ్చాయట.http://www.vccircle.com/news/economy/2016/08/30/chinese-investment-india-shoots-23-bn-past-3-months-against-135-bn-2000-16 వీటి గురించి స్వదేశీ జాగరణ మంచ్‌ ఎందుకు మాట్లాడదు ? విచారణ జరపాలని ఎందుకు డిమాండ్‌ చేయదు ? ఈ ఏడాది అక్టోబరు 6-7 తేదీలలో ఢిల్లీలో స్వయంగా నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ చైనా ప్రభుత్వంతో కుదుర్చుకున్న పెట్టుబడుల సహకార ఒప్పందాల గురించి ఎందుకు ప్రశ్నించదు ?

    నల్ల ధనాన్ని వెలికి తీసే పేరుతో ఆ పని చేసిన వారు తరువాత బాణీ మార్చి నగదు రహిత లావాదేవీల గురించి ఎక్కువగా చెబుతున్నారు. చెప్పుకోలేని బాధ ఏమిటో సానుభూతి చూపుదాం. నోట్ల రద్దు తరువాత బిజెపి నేతలందరూ ఇప్పుడు చైనా భజన చేస్తున్నారు. మన కంటే పెద్ద దేశమైన చైనాలో నగదు రహిత కార్యకలాపాలు జయప్రదం అయినపుడు మన దేశంలో ఎందుకు కావు అన్నది వారి ఒక ప్రశ్న. చైనా చర్యలను సమర్ధించిన కమ్యూనిస్టులు అదే పని మన దేశంలో చేస్తే విమర్శిస్తారు ఎందుకు అని ఎదురుదాడికి దిగుతున్నారు. రోజంతా చైనా కమ్యూనిస్టు వ్యతిరేకతను నూరిపోయటం, సాయంత్రం కాగానే దాన్ని అడ్డం పెట్టుకొని తమ చర్యలను సమర్ధించుకోవటం. అవకాశవాదానికి హద్దులు లేవు. మేథోపరంగా ఎంతదివాళా స్ధితిలో వున్నారో కదా !

   నల్లధనాన్ని, నగదు రహిత లావాదేవీలను కమ్యూనిస్టులే కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించటం లేదు. చైనా ఆర్ధిక వ్యవస్ధ మన కంటే ఎన్నోరెట్లు పెద్దది. అక్కడ నగదు రహిత లావాదేవీలను మోడీ సర్కార్‌ మాదిరి బలవంతంగా రుద్దలేదు. తగినంత నగదు రాదని, నగదు రహితానికి మళ్లాలని తెలంగాణా ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి కె. ప్రదీప్‌ చంద్ర ప్రకటించటాన్ని బట్టి తగినన్ని నోట్లను ముద్రించేందుకు మోడీ సర్కార్‌ ముందుకు రావటం లేదని తేలిపోయింది. నగదు రహిత కార్యకలాపాలకు అవసరమైన ఏర్పాట్లు చేయని, కార్డులు గీకటానికి నిరాకరించే విద్యా, వైద్య సంస్ధలు, దుకాణాల తగిన గడువు నిచ్చి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. కార్డుల వినియోగం భారం కాదని జనాన్ని ఒప్పించగలిగితే వారే దుకాణాలలో డిమాండ్‌ చేస్తారు. ఒక పరిమితి దాటిన లావాదేవీలు కార్డుల ద్వారా మాత్రమే చేయాలని, అందుకు రెండున్నర శాతం రుసుం అదనం అని వసూలు చేస్తే శిక్షించటం వంటి చర్యలు తీసుకుంటే క్రమంగా అలవాటు పడిపోతారు. ఆ పని చేయకుండా పొమ్మనకుండా పొగపెట్టినట్లు నగదును అందుబాటులో లేకుండా చేసి బలవంతంగా అమలు చేయపూనుకోవటం ఏ ప్రజాస్వామిక లక్షణం ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d