• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: India Price Rise

బక్కచిక్కుతున్న రూపాయి పాపాయి జనంపై మోయలేని భారం : పదేండ్లుగా పల్తెత్తు మాట్లాడని నరేంద్రమోడీ !!

08 Sunday Dec 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Causes of Inflation, CORRUPTION, India Price Rise, Inflation in India, Narendra Modi Failures, Rupee depreciation, Rupee fall under Modi rule

ఎం కోటేశ్వరరావు

మన జనానికి నిజంగానే మతిమరపు ఎక్కువా లేదా పట్టించుకోవట్లేదా ? కోరి చేసుకున్నోడు గనుక ఎగిరెగిరి తన్నినా కిమ్మనటం లేదనే సామెతను నిజం చేస్తున్నారా ? మనది కర్మభూమి అనుకుంటున్నాం గనుక తప్పదు ! పదేండ్ల క్రితం డాలరుతో మారకంలో రూపాయి విలువ పతనం గురించి నరేంద్రమోడీ మొదలు బిజెపి నేతలందరూ ఎన్ని మాట్లాడారు ! ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పతనమైనా పల్లెత్తు మాటల్లేవేమి ? రూపాయి పతనం, జిడిపి వృద్ధి రేటు పతనం, ఎగుమతుల్లో ఎదుగుదల పతనం ఇలా పదేండ్ల పాలనలో అవే ఎక్కువ. మరక మంచిదే అని ఒక వాణిజ్య ప్రకటనలో చెప్పినట్లుగా రూపాయి విలువ తగ్గటం మనకు మంచిదే అని కొంత మంది సమర్థిస్తారు. కొన్ని అంశాలలో వాస్తవమే, ఎగుమతిదార్లకు, విదేశాల నుంచి డబ్బు పంపేవారికి లబ్ది, దిగుమతిదార్లకు, తద్వారా జనాలందరికీ భారం. కానీ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్న లోకోక్తి తెలిసిందే. మన దేశంలో అదే జరుగుతోంది. మన కరెన్సీ పతనం కొంత మందికి కాసుల వర్షం కురిపిస్తుండగా అత్యధికుల జేబులు గుల్లవుతున్నాయి. ఏటా వేల కోట్ల డాలర్లను విదేశాలకు సమర్పించుకుంటున్నాము. ఉదాహరణకు 202223లో రు.21,45,690, 202324లో రు.19,54,060 కోట్లు విదేశాలకు సమర్పించుకున్నాము. దీనిలో ఎక్కువ చైనాకే రు.6,73,0006,97,000 చొప్పునవెళ్లింది. దీన్ని మరో విధంగా చెప్పాలంటే ఈ భారం మొత్తాన్ని మన జనం మీద మోపారు. కార్పొరేట్లు లేదా ప్రభుత్వ కంపెనీలు లాభాలతో సహా దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలను వినియోగదారులనుంచే కదా వసూలు చేసేది.


కొందరు వర్ణిస్తున్నట్లుగా ముచ్చటగానో లేదా మరికొందరంటున్నట్లుగా దేశానికి మూడిగానీ మోడీ పాలనలో పదకొండో ఏడులో ఉంది. 2014లో ఒక వస్తువు ధర రు.106 ఉంటే ద్రవ్యోల్బణం పెరిగిన కారణంగా అదే ఇప్పుడు రు.156 పెట్టి కొనాల్సి వస్తోంది.ద్రవ్యోల్బణం సగటున 5.12శాతం పెరిగిన ఫలితమే. ఈ నిర్వాకం సంగతేమిటి ? ఈ మేరకు జనానికి రాబడి పెరుగుతోందా ? 2024 అక్టోబరులో పద్నాలుగు నెలల గరిష్టం 6.21శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం అంతకు మించి 15నెలల గరిష్టం 10.87శాతానికి చేరింది.ఏడాది క్రితం అక్టోబరు నెలలో 6.61శాతమే ఉంది. వినియోగదారులు కొనేటట్లు లేదు కడుపు నిండాతినేట్లు లేదు. అన్నదాతల పరిస్థితి ఏమిటి ? ప్రస్తుతం రబీ సీజన్‌ నడుస్తున్నది, దేశమంతటా ఈ పంటలకు ముఖ్యమైన డిఏపి ఎరువుల కొరత, దాన్ని ఆసరా చేసుకొని అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.యూరియాయేతర ఎరువుల కోసం రబీ తరుణంలో ఎరువుల సబ్సిడీ నిమిత్తం రు.24,474 కోట్ల సబ్సిడీ ఇవ్వనున్నట్లు, అది గత ఏడాది కంటే పదిశాతం ఎక్కువ అని గొప్పగా కేంద్ర పెద్దలు చెప్పారు. డిఏపి మే నెలలో టన్ను దిగుబడి ధర 510 డాలర్లు ఉండగా నవంబరు మొదటి వారంలో 645కు పెరిగింది.అది రు.54,000కు సమానం. ఈ స్థితిలో కేంద్రం గరిష్ట ధరగా రు.27వేలు నిర్ణయించి సబ్సిడీగా రు.21.911గా ప్రకటించింది. కొరత ఏర్పడిన స్థితిలో మరో మూడున్నరవేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ ఏ వ్యాపారి 54వేలు చెల్లించి దిగుమతి చేసుకుంటాడు ? ఒకవేళ దిగుమతి చేస్తే అంత ధరలో రైతులు కొనుగోలు చేయగలరా ?

గతేడాది అక్టోబరు ఒకటి నాటికి 30లక్షల టన్నుల మేర నిల్వలుండగా ఈ ఏడాది 16లక్షలకు తగ్గింది. పోనీ దేశీయంగా ఉత్పత్తి పెరిగిందా అంటే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఏడు శాతం తగ్గింది. దిగుమతులను చూస్తే గతేడాది ఏప్రిల్‌సెప్టెంబరు మధ్య 34.5లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది అది 19.6లక్షలకు పడిపోయింది. ఏడాదికి 100 నుంచి 110లక్షల టన్నులు అవసరం కాగా దీనిలో 60శాతం దిగుమతి చేసుకుంటున్నాము. ఈ ఏడాది ఇప్పటి వరకు దిగుమతులు సగం తగ్గటానికి కేంద్రం ఎరువుల మీద సబ్సిడీలో భారీ కోత విధించటమే అసలు కారణం. 202223లో రు.2.51లక్షల కోట్లు కేటాయించిన మోడీ సర్కార్‌, 202324లో రు.1.88, 202425లో ఆ మొత్తాన్ని రు.1.64లక్షల కోట్లకు కోత పెట్టింది. యుపిఏ సర్కార్‌ 2010లో అమల్లోకి తెచ్చిన విధానం ప్రకారం నిర్ణీత మొత్తాన్ని మాత్రమే సబ్సిడీగా ఇస్తారు, దాన్ని విమర్శించిన నరేంద్రమోడీ తనదాకా వచ్చేసరికి దాన్నే అమలు జరిపారు. అయితే మధ్యలో అంతర్జాతీయంగా ధరలు విపరీతంగా పెరగటం, రైతాంగం ఏడాది పాటు ఢల్లీి శివార్లలో ఉద్యమించిన నేపధ్యంలో సబ్సిడీ మొత్తాన్ని పెంచారు. తిరిగి పైన పేర్కొన్న విధంగా కోత మొదలు పెట్టారు.ద్రవ్యోల్బణం అదుపులో ఉండాలంటే సబ్సిడీలకు కోతపెట్టి ప్రభుత్వ ఖర్చు తగ్గించటానికి పూనుకున్నారు. ఎరువుల సబ్సిడీ తగ్గటానికి దిగుమతి చేసుకొనే ఎరువులు, గ్యాస్‌ ధర తగ్గటమే అని కొందరు చెబుతున్నారు. అదే ప్రాతిపదిక అయితే అవసరాలకు అనుగుణంగా డిఏపి దిగుమతి చేసుకొని పంటలు పండేందుకు తోడ్పడాల్సిందిపోయి, ధరలు పెరిగాయనే పేరుతో దిగుమతులు ఎందుకు తగ్గించినట్లు ?


రూపాయి పతనం అన్నది ఆర్థిక స్థిరత్వం మీద పెద్ద ప్రభావం చూపుతుంది.అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది.యుపిఏ పాలన మీద ధ్వజమెత్తటానికి బిజెపి ప్రచార కమిటీ నేతగా 2014 ఎన్నికలకు ముందు దీన్ని ఒక అయుధంగా వాడుకున్నారు. రూపాయి విలువ పతనమౌతుంటే గతంలో ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏమన్నారో తెలుసా ! ‘‘ ఆర్థికం లేదా రూపాయి విలువ పతనం గురించి ప్రభుత్వానికి ఎలాంటి చింత లేదు, తన కుర్చీని ఎలా కాపాడుకోవాలన్నదే దాని ఏకైక ఆందోళన. ఈ కారణంగా దేశం ఈ రోజు ఆశాభంగం చెందింది. గత మూడు నెలలుగా పతనం అవుతున్న రూపాయిని నిలబెట్టేందుకు ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదు. ఇలా పతనం అవుతుంటే ఇతర దేశాలు దాన్ని అవకాశంగా తీసుకుంటాయి. గడచిన ఐదు సంవత్సరాలుగా ధరలు తగ్గుతాయని, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెబుతున్నారు తప్ప జరిగిందేమీ లేదు ’’ (2013 ఆగస్టు 20, బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రికలో పిటిఐ వార్త). మోడీ ఈ ఆరోపణలు చేసిన రోజు డాలరుకు రూపాయి విలువ 64.11గా ఉంది. పదేండ్ల తరువాత ఇప్పుడు 84.73కు దిగజారింది.అడిగేవారు లేక గానీ పైన చెప్పిన అంశాలన్నీ మోడీకి వర్తించవా ? ఈ దిగువ ఆయా సంవత్సరాలలో రూపాయి సగటు విలువ ఎలా ఉందో చూడవచ్చు. 2024 విలువను రాసిన సమయానికి ఉన్నదిగా పరిగణించాలి.
సంవత్సరం = రూ.విలువ
2014 = 62.33
2015 = 62.97
2016 = 66.46
2017 = 67.79
2018 = 70.09
2019 = 70.39
2020 = 76.38
2021 = 74.57
2022 = 81.35
2023 = 81.94
2024 = 83.47
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు. యుపిఏ చివరి సంవత్సరాలలో ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం, ధరలు కూడా పెరిగాయి. మోడీ పదవిలోకి రాగానే ముడి చమురు ధర బాగాపడిపోయి దిగుమతి బిల్లు గణనీయంగా తగ్గింది, ఆ సమయంలో వినియోగదారులకు ఆ మేరకు లబ్ది చేకూరకుండా వివిధ సెస్సులను భారీగా విధించి, పెద్ద మొత్తంలో కేంద్రం రాబడిని పొందింది. రూపాయి విలువ తగ్గితే మన ఎగుమతులు పెరుగుతాయన్నది కూడా వాస్తవం కాదు. 2013లో మన ఎగుమతులు 472 బిలియన్‌ డాలర్లు కాగా 2023లో అవి 777 బి.డాలర్లకు పెరిగాయి. దీన్నే జిడిపిలో చూస్తే ఎందుకంటే దాన్ని పెంచిన ఘనత తమదే అని బిజెపి చెప్పుకొంటోంది గనుక25.43 నుంచి మధ్యలో 18.66శాతానికి పడిపోయినా 2023లో 21.89శాతంగా ఉంది. అంటే మొత్తంగా చూసినపుడు పతనం తప్ప పెరుగుదల లేదు. దిగుమతులు వినియోగదారులకు భారం కాకూడదు. వజ్రాలు, బంగారం వంటి వాటిని దిగుమతి చేసుకుంటే వాటి మీద పన్ను విధించవచ్చు, ఇబ్బంది లేదు, కానీ ముడిచమురు దిగుమతుల మీదకూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాభాలను పిండుకుంటున్నాయి.

నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాదికి ఇప్పటికీ తేడాను చూద్దాం. యుపిఏ పాలన చివరి ఏడాది నుంచి ఇప్పటి వరకు మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు పీపా సగటు ధరలు ఇలా ఉన్నాయి.
ఏడాది = డాలర్లు ——–ఏడాది = డాలర్లు
2013-14 =105.52 2014-15 = 84.16
2015-16 = 46.17 2016-17 = 47.56
2017-18 = 56.43 2018-19 = 69.88
2019-20 = 60.47 2020-21 = 44.82
2021-22 I 79.18 2022-23 = 93.15
2023-24 = 82.58

వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు 81.95 డాలర్లు ఉంది. దీనికి అనుగుణంగా ధరలు తగ్గించకుండా గడచిన రెండున్నర సంవత్సరాలుగా వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఆ ధరలను బట్టే రాష్ట్రాలు వ్యాట్‌ వసూలు చేస్తున్నాయి. కేంద్రం ధర తగ్గిస్తే ఆ మేరకు రాష్ట్రాలూ తగ్గిస్తాయి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత డీజిలు, పెట్రోలు మీద సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేశారు,గ్యాస్‌ మీద ముష్టి మాదిరి విదుల్చుతున్నారు. 201415 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 202021 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 202324 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు. 2024 ఆగస్టు ఒకటవ తేదీన ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన సమాచారం ప్రకారం 201920లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చమురు రంగంలో వచ్చిన పన్ను, తదితరాల రాబడి మొత్తం రు.5,55,370 కోట్లు కాగా దీనిలో కేంద్ర వాటా రు.3,34,315 కోట్లు, ఈ మొత్తాలు 202324 తాత్కాలిక అంచనాలో పెరిగిన మొత్తం రు.7,51,156 కోట్లు కాగా కేంద్ర వాటా రు.4,32,394 కోట్లు ఉంది. ఇంత మొత్తం సంపాదిస్తున్న కేంద్రం ఉజ్వల గాస్‌ పధకం పేరుతో ఒక్కొక్క వినియోగదారుకు ఏడాదికి ఇస్తున్న సబ్సిడీ రు.1,114 కాగా ఇతర వినియోగదారులకు ఇస్తున్న మొత్తం రు.670 మాత్రమే. దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచుతామంటూ కబుర్లు చెప్పే నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకం ఎలా ఉందో తెలుసా ? 201415లో ప్రభుత్వప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2023`24నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. ఇలాంటి పాలనతో 2047నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతున్నారు. అదుపులేని రూపాయి పతనం,ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరుగుతూ నడ్డి విరుస్తున్నాయి. పదేండ్ల క్రితం మోడీ చెప్పిన అచ్చే దిన్‌ ( మంచి రోజులు ) బిజెపి మద్దతుదార్లకైనా వచ్చాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెండేండ్ల వరకు ధరల పెరుగుదల తగ్గదన్న ఆర్‌బిఐ గవర్నర్‌ !

25 Thursday Aug 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Causes of Inflation, Consumer Price Index, India inflation, India Price Rise, Narendra Modi, Narendra Modi Failures, RBI, RBI governor


ఎం కోటేశ్వరరావు

నాలుగు శాతానికి ద్రవ్యోల్బణం రేటు తగ్గేందుకు రెండు సంవత్సరాలు పడుతుందని రిజర్వుబాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ 2022 ఆగస్టు 23న చెప్పారు. వృద్ధి రేటును పెద్దగా కోల్పోకుండానే ఈ లక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు. అంటే ఇప్పుడు పెరిగిన ధరల రేటు తగ్గేందుకు మరో రెండు సంవత్సరాలు పడుతుందని చెప్పటమే. నిజానికిది జనాలతో ధరల చేదు మాత్రను మింగించేందుకు, ఆందోళన చెందుతున్న నరేంద్రమోడీ సర్కార్‌కు ఊరట కలిగించేందుకు వెలిబుచ్చిన ఆశాభావం తప్ప పరిస్థితులు ఇప్పటి కంటే దిగజారితే ఏమిటన్నది ప్రశ్న. గవర్నరే చెప్పినట్లు ఇటీవలి గరిష్టం 7.8శాతానికి చేరుతుందని కూడా ఎంతో ముందుగానే ఆర్‌బిఐ చెప్పి ఉంటే విశ్వసనీయత ఉండేది. మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో ఇంతకంటే తీవ్ర స్థాయికి చేరినపుడు కూడా అప్పటి గవర్నర్లు ఇలాంటి మాటలే చెప్పారు. ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ ఎందుకు ఆందోళన చెందుతున్నది ? ఎనిమిది సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు, అందుకు ముందు గుజరాత్‌ సిఎంగా నరేంద్రమోడీ మహిమల మంత్రదండం గురించి మీడియా చెప్పిన కథలు, అన్నింటికి మించి మన్మోహన్‌ సింగ్‌ పాలన చివరి రోజుల్లో దిగజారిన పరిస్థితులు, అవినీతి అక్రమాల కారణంగా మోడీ అధికారానికి వస్తే తెల్లవారేసరికి అద్బుతాలు చేస్తారని నమ్మినవారికి ఎనిమిదేండ్లు గడిచినా రెచ్చిపోతున్న హిందూత్వ నూపుర్‌ శర్మలు, రాజాసింగ్‌లు తప్ప ఆర్ధికంగా జనానికి ఉపశమనం గురించి చెప్పాల్సిన వారు ఎక్కడా కనిపించటం లేదు. గత పదహారు నెలలుగా రెండంకెలకు పైగా నమోదవుతున్న టోకు ధరల ద్రవ్యోల్బణం ఐదు నెలల తరువాత జూలై నెలలో 13.93కనిష్ట స్థాయికి తగ్గింది. గత సంవత్సరం 11.57శాతం ఉంది. ఇంథనం, విద్యుత్‌ ద్రవ్యోల్బణం 43.75 స్థాయికి పెరిగింది.


– ద్రవ్యోల్బణం ఎందుకు సంభవిస్తుంది అన్నదాని మీద ఎవరి భాష్యం, కారణాలు వారివే. ప్రతికూల ప్రభావాలను జనం అనుభవిస్తున్నారు గనుక ఎవరు చెప్పేది వాస్తవానికి దగ్గరగా ఉందో ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. ఆర్ధిక రంగంలో నగదు చెలామణి పెంపుదల కూడా దవ్యోల్బణానికి దారితీస్తుంది.1951 నుంచి 2022 వరకు దేశంలో నగదు సరఫరా నెలవారీ సగటున రు. 26,168.65 బిలియన్లు.1952అక్టోబరులో కనిష్ట రికార్డు రు.20.57 బిలియన్లు కాగా 2022 జూలై గరిష్ట రికార్డు 2,09,109.47 బి. రూపాయలు. సరఫరా పెరిగితే దవ్యోల్బణం పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఆర్ధిక రంగంలో ద్రవ్య సరఫరాకు అనుగుణంగా ఉత్పత్తి, సేవలు, వస్తు సరఫరా లేకపోతే ద్రవ్యోల్బణం పెరుగుతుంది అన్నది ఒక సూత్రీకరణ. ట్రేడింగ్‌ ఎకనమిక్స్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 2000 సంవత్సరంలో పదివేల బిలియన్లు కాగా 2010నాటికి 50వేలకు, 2015కు లక్ష, 2020కి 160వేలకు, 2022 జూలైలో 2,09,109.47 బి. రూపాయలకు చేరింది.


ఉద్యోగుల వేతనాలు పెరిగితే ధరలు పెరుగుతాయని చాలా మంది అనుకుంటారు. అసలు వేతన పెరుగుదల లేకున్నా ధరలు పెరుగుతాయని కొన్ని బుర్రలకు ఎక్కదు.2020-21 మూడవ త్రైమాసిక ఆదాయంలో గృహ పొదుపు అమెరికా, బ్రిటన్‌, కెనడా, జపాన్‌,ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో పది నుంచి ఇరవై శాతం ఉంది. అదే మన దేశంలో 2.8శాతం, ఇండోనేషియాలో రెండు శాతం తిరోగమనంలో ఉంది.అలాంటపుడు రెండు చోట్లా ఒకే కారణంతో ద్రవ్యోల్బణం పెరగకూడదు. మన దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు వేతనాలు ఎంతవరకు కారణం ? దేశంలో 2014 నుంచి ద్రవ్యోల్బణ వార్షిక పెరుగుదల ఇలా ఉంది.
ఏడాది×× ద్రవ్యోల్బణ శాతం
2014 ×× 6.6
2015 ×× 4.9
2016 ×× 4.9
2017 ×× 3.3
2018 ×× 3.9
2019 ×× 3.7
2020 ×× 6.6
2021 ×× 5.1
2022 ×× 6.8(ఏడునెలల సగటు)
ఈ ఎనిమిది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ ఏడవ వేతన కమిషన్‌ సిఫార్సులు 2017లో అమల్లోకి వచ్చాయి.కరోనా కాలంలో కొన్ని నెలలు అసలు ప్రైవేటు రంగంలో ఉపాధి, వేతనాల్లేవు, అనేక చోట్ల వేతన కోతలు ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం పెరిగింది. దేశంలో 70శాతం కార్మికశక్తి గ్రామాల్లోనే ఉంది.2020లో గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు 3.5శాతం తగ్గాయి, మరుసటి ఏడాది అరశాతం పెరగ్గా, 2021-22 తొలి తొమ్మిది నెలల్లో వ్యవసాయ పెరుగుదల 1.6శాతం, గ్రామీణ ఇతర కార్మికుల వేతనాలు 1.2శాతం తగ్గాయి.ఈ కాలంలో అసంఘటిత రంగ కార్మికులకు కనీసవేతనాలేమీ పెరగలేదు.కొన్ని రంగాల్లో కాస్త పెరిగినప్పటికీ మొత్తం మీద చూసినపుడు దేశంలో వేతనాలు పెద్దగా పెరగకున్నా ద్రవ్యోల్బణం పెరిగిందంటే దానికి వేరే కారణాలు దోహదం చేస్తున్నట్లే. పశ్చిమ దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుదలకు గృహస్తుల కోసం కరోనా సందర్భంగా పెద్ద ఎత్తున చేపట్టిన ద్రవ్య ఉద్దీపన పధకాలు కారణంగా చెబుతున్నారు.మన దేశంలో పేదలకు నెలకు ఐదు కిలోల బియ్యం, కిలోపప్పులు, జనధన్‌ ఖాతాలున్న వారికి మూడు నెలలు ఐదేసి వందల నగదు, కొన్ని గాస్‌ బండలు తప్ప ఇచ్చిందేమీ లేదు. కరోనాతో నిమిత్తం లేని కిసాన్‌ నిధులు కూడా కలుపు కొని మొత్తం పాకేజి విలువ రు.1.76వేల కోట్లు మాత్రమే. మన దేశంలో కరోనా గృహస్తుల పొదుపు మొత్తాలను హరించటమే కాదు అప్పులపాలు చేసింది.
కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ల వల్ల ఖర్చు చేసేందుకు వీలులేక బలవంతపు పొదుపు పెరిగిందని చెబుతున్నారు. పరిస్థితి చక్కబడిన తరువాత కొనుగోళ్లకు పూనుకోవటంతో అలాంటి చోట్ల అధిక ద్రవ్యోల్బణం తలెత్తిందని ఐఎంఎఫ్‌ చెప్పింది. ధనికులుగా ఉన్నవారి కొనుగోళ్లు పెరిగినప్పటికీ మొత్తం మీద ఇది మన దేశానికి వర్తించదు.

మాక్రోట్రెండ్స్‌ సంస్థ సమాచారం ప్రకారం కరోనాకు ముందు మన వినియోగదారుల 2018,19 రెండు సంవత్సరాల వార్షిక సగటు ఖర్చు 1,664.28 బిలియన్‌ డాలర్లు కాగా 2020,21 వార్షిక సగటు 1,751.73 బి.డాలర్లు అంటే 5.25 శాతం మాత్రమే పెరిగింది. ఇది ద్రవ్యోల్బణ పెరుగుదల రేటు 5.85 శాతం కంటే తక్కువ, అంటే వాస్తవ ఖర్చు తగ్గింది. ఇదే అమెరికాను చూస్తే 2021 మే నుంచి 2022 మార్చినెల మధ్య ద్రవ్యోల్బణం 8.5 శాతం ఉండగా 2022 మార్చినెలలో అక్కడి వినియోగదారుల ఖర్చు 18శాతం పెరిగింది. అంతకు రెండు సంవత్సరాల ముందు పన్నెండు శాతమే ఉండేది.2019తో పోలిస్తే అమెరికన్ల వద్ద ఉన్న పొదుపు మొత్తం 2.8లక్షల కోట్ల డాలర్లు ఎక్కువ. వారంతా ఆ మూటలను విప్పి కొనుగోళ్లకు పూనుకోవటంతో వస్తువులకు డిమాండ్‌ పెరిగి ద్రవ్యోల్బణం పెరిగింది. మన దేశంలో ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో పట్టణాల్లో 16శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 16.6శాతం అమ్మకాలు పడిపోయాయినా ద్రవ్యోల్బణం ఎందుకు తగ్గటం లేదు ? కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితి నుంచి ఆర్ధిక రంగాలను కాపాడుకొనేందుకు అనేక ధనిక దేశాలు పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లను ముద్రించి జనానికి నగదు అందచేశాయి. అక్కడ ద్రవ్యోల్బణం పెరుగుదలకు అదొక కారణమైతే, జనాలు ఆ సొమ్ముతో కొనుగోళ్లకు పూనుకోవటంతో సరకుల కొరత ఏర్పడటం, దిగుమతుల ధరలు పెరగటం వంటి కారణాలు దానికి ఆజ్యం పోశాయి.


ద్రవ్యోల్బణాన్ని లెక్కించేందుకు అన్ని దేశాలూ ఒకే ప్రాతిపదికను అనుసరించటం లేదు. పరిగణనలోకి తీసుకొనే అంశాల ప్రాముఖ్యత దేశదేశానికీ మారుతుంది. ఉదాహరణకు అమెరికాలో ఆహార వస్తువులకు 7.8శాతం ఇస్తే చైనాలో అది 18.4శాతం, మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు మొత్తానికి 22.62శాతం కాగా వాటిలో ఆహార వస్తువులకు 15.26, పారిశ్రామిక ఉత్పత్తులకు ఇస్తున్న 64.23 శాతంలో ఆహార ఉత్పత్తులకు 19.12 శాతం ఉంది. అమెరికాలో రవాణా రంగానికి 15.1శాతం కాగా చైనాలో 10.1 మన దేశంలో 5.2 శాతం ఉంది. చైనాలో దుస్తులకు 6.2 శాతం, అమెరికాలో 2.8, మన దేశంలో 7.3 శాతం ఉంది. చైనా వస్తువులను ఎగుమతి చేస్తుండగా అమెరికా దిగుమతి చేసుకొనే దేశంగా ఉంది. కనుక వాటి ప్రాధాన్యతలు ఒకే విధంగా ఉండవు.


మన దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం-ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయకపోతే ఇబ్బందని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలప్పటికే అర్ధమైంది. వాటిలో లబ్ది పొందటంతో పాటు ధరల అదుపునకు ఇంథన ధరలను స్థంభింప చేశారు. ఎన్నికల తరువాత కూడా 2022 ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి అదే స్థంభన కొనసాగుతోంది. అదొక్కటే చాలదు కనుక కేంద్రం పెద్ద మొత్తంలో విధించిన సెస్‌ను కొంత తగ్గించారు. దాన్ని రాజకీయ అస్త్రంగా మార్చి ఇతర పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాట్‌ను ఎందుకు తగ్గించవంటూ దాడి చేశారు. పెట్రోలు మీద లీటరుకు రు.8, డీజిలు మీద రు.6 తగ్గించి దీని వలన కేంద్ర ప్రభుత్వం ఏడాదికి లక్ష కోట్ల మేరకు ఆదాయాన్ని ” త్యాగం ” చేస్తున్నట్లు చెప్పారు. దాన్ని పెంచినపుడేమో మిలిటరీకోసమని జనానికి దేశభక్తి కబుర్లు చెప్పారు, తగ్గించినపుడు కేంద్ర ప్రభుత్వానికి దేశభక్తి తగ్గిందని అనుకోవాలా ? ఈ తగ్గింపు ప్రక్రియను మరో విధంగా చెప్పాలంటే చమురుపై భారీగా పన్నుల పెంపుదల ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నదని అంగీకరించటమే. సత్యహరిశ్చంద్రుడివారసులమని, ఒకటే మాట ఒకటే బాణం అన్న రాముడి భక్తులమని చెప్పుకొనే వారికి నిజాన్ని అంగీకరించే ధైర్యం ఎందుకు లేదు ? 2021 ఏప్రిల్‌-మే మాసాల్లో ద్రవ్యోల్బణం రేటు 2.5శాతం కాగా అదే 2022లో మార్చి నెలలో ఆరుశాతానికి చేరింది.


2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ సంక్షోభం తలెత్తక ముందే పెరుగుదల బాటలో ఉన్న ద్రవ్యోల్బణం తరువాత ఈ కారణంగా మరికొంత పెరిగింది. డాలరు నిల్వలను పెంచుకొనేందుకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులతో పాటు మన స్టాక్‌ మార్కెట్లో వాటాల కొనుగోలుకు విదేశీ సంస్థలను ప్రభుత్వం అనుమతించింది.ఇదే విధంగా విదేశాల నుంచి తక్కువ వడ్డీలకు దొరుకుతున్న డాలరు రుణాలను కూడా ప్రోత్సహించింది. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవటంలో ఘోరవైఫల్యం, అమెరికాలో వడ్డీ రేటు పెరుగుదల కారణంగా మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి డాలరు పెట్టుబడులు వెనక్కు మరలాయి. ఇది కూడా ద్రవోల్బణం పెరుగుదలకు దారి తీశాయి.చమురు, ఇతర దిగుమతి వస్తువుల ధరల పెరుగుదలకు రూపాయి పతనం కూడా తోడైంది. దేశంలో ద్రవ్యోల్బణ పెరుగుదలకు విదేశీ ధోరణులే కారణమని తప్పించుకొనేందుకు కొందరు ప్రభుత్వానికి వంతపాడుతున్నారు. మన దేశాన్ని నయా ఉదారవాద చట్రంలో బిగించినందున ఆ విధానాలను అనుసరిస్తున్న దేశాల జబ్బులన్నీ మనకూ కొంతమేర అంటుకుంటాయి. జనాలకు చమురు, గాస్‌, ఇతర సబ్సిడీలను ఎత్తివేసి, పరిమితం చేసి, కోతలు పెట్టటం, కార్పొరేట్లకు పన్నురాయితీలు ఇవ్వటం, జనాల మీద పన్ను బాదుడు దానిలో భాగమే.పన్నుల పెంపుదల గురించి చట్ట సభల్లో చర్చకు తావులేకుండా జిఎస్‌టి మండలి, విద్యుత్‌ క్రమబద్దీకరణ మండళ్ల ఏర్పాటు, ప్రభుత్వ అదుపులేని ప్రైవేటు రంగానికి అన్నింటినీ అప్పగించటమూ అదే. జిఎస్‌టి విధానం రాక ముందు ధనికులు వాడే విలాస వస్తువులపై 30 నుంచి 45శాతం వరకు పన్నులు ఉండేవి. జిఎస్‌టి దాన్ని 28శాతానికి తగ్గించింది. ఆ మేరకు తాజాగా పెంచిన పన్నులు, విస్తరించిన వస్తువుల జాబితాను చూస్తే సామాన్యుల నడ్డి విరవటమే కాదు ద్రవ్యోల్బణ పెరుగుదలకూ దోహదం చేస్తున్నది. వస్తూత్పత్తిదారులు తమ మీద పడిన భారాన్ని జనం మీదకే నెడతారన్నది తెలిసిందే.


2020-21లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా సగటు ధర 44.82 డాలర్లు కాగా అది 2021-22కు 79.18కి పెరిగింది. 2022-23లో రష్యా తక్కువ ధరలకు చమురు ఇచ్చినప్పటికీ ఆగస్టు 23వ తేదీ వరకు ఏప్రిల్‌ నుంచి ఐదు నెలల సగటు 106.13 డాలర్లకు చేరింది. దీన్ని బట్టి మన దిగుమతుల బిల్లు పెరుగుతుంది, దానికి రూపాయి విలువ పతనంతో మరింత భారం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పాటు విదేశాల నుంచి వస్తువులనే కాదు ద్రవ్యోల్బణాన్ని కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాము. దేశంలో బొగ్గు నిల్వలున్నా వాటిని తవ్వకుండా ఖరీదైన బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్రం విద్యుత్‌ సంస్థల మీద రుద్దటం ద్రవ్యోల్బణ దిగుమతిలో భాగం కాదా ? ఇలాంటి వాటి కారణంగానే వెంటనే ద్రవ్యోల్బణాన్ని తగ్గించే మంత్రదండం లేదని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చెప్పారనుకోవాలి. –

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ తాత నుంచి సమాధానం వచ్చిందా కీర్తీ దూబే తల్లీ ?

22 Monday Aug 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, India Price Rise, Inflation in India, kriti dubey letter, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


అదుపుగాని ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం గురించి ప్రధాని నరేంద్రమోడీ ఆందోళన చెందుతున్నారా ? జనానికి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నా ఇంతవరకు వాటి గురించి ఎందుకు నోరు విప్పటం లేదు ? జూలై నెలలో చిల్లర ద్రవ్యోల్బణం గత ఐదు నెలల కనిష్ట స్థాయి 6.71శాతానికి తగ్గిందన్నది ప్రభుత్వ ప్రకటన. అనేక మంది హమ్మయ్య అని కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకు అంటే ఆహారం, మరికొన్ని వస్తువుల ధరలు కాస్త తగ్గటమే కారణం. ద్రవ్యోల్బణాన్నే ధరల పెరుగుదల సూచికగా కూడా తీసుకోవచ్చు. సూచిక తగ్గుదల-పెరుగుదలను ఎలా చూడాలి. జూన్‌ నెలలో ఇది 7.1శాతంగా ఉన్నది జూలైలో 6.71కు తగ్గింది. ద్రవ్యోల్బణం లెక్కింపుకు వంద వస్తువుల ధరలను ప్రమాణంగా తీసుకుంటే వాటి ధర రు 100 అనుకుంటే జూన్‌ నెలలో పెరుగుదల ప్రకారం రు.107.10కి పెరిగితే జూలైలో రు.106.70 ఉంటుంది. అంటే నలభై పైసలు తగ్గింది.వంద వస్తువుల్లో కొన్నింటి ధర సగటు కంటే తగ్గవచ్చు,కొన్ని పెరగవచ్చు. ఇలా పన్నెండు నెలల వివరాలను సగటుగా తీసుకొని వార్షిక ద్రవ్యోల్బణాన్ని ఖరారు చేస్తారు. ఈ మేరకు 2014 నుంచి 2021వరకు ఎనిమిదేండ్ల సగటు 4.87శాతంగా ఉంది. ప్రభుత్వం నిర్దేశించుకున్న నాలుగుశాతం లోపు మూడు సంవత్సరాల్లో మాత్రమే ఉంది. తగ్గుదలకు కారణం తమ ప్రతిభే అనుకుంటే పెరుగుదల కీర్తి కూడా వారిదే మరి !


ద్రవ్యోల్బణం నాలుగు శాతంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆర్‌బిఐని ఆదేశించింది. షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా దానికి రెండు శాతం అటూ ఇటైనా ఫరవాలేదని చెప్పింది. అంటే ఏటా నాలుగు నుంచి ఆరుశాతం మేరకు ధరలను పెరగనివ్వవచ్చు అన్నది ప్రభుత్వ విధానం. అది నరేంద్రమోడీ లేదా మరొకరు ఎవరున్నా సేమ్‌ టు సేమ్‌ అన్నట్లుగా అలాంటి లక్ష్యాలనే నిర్దేశిస్తారు. ఇప్పుడు మినహాయింపును కూడా దాటి జనాలకు దడపుట్టిస్తున్నది. జనం తమకు తామే లేదా ఏ పార్టీ, ప్రజాసంఘం కానీ పెద్దగా ఆందోళనలు చేయకుండానే నరేంద్రమోడీ సర్కార్‌ రెండుసార్లుగా పెట్రోలు, డీజిలు ధరల మీద పన్నులను తగ్గించింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నటిగా కాకుండా నిజజీవితంలో గాస్‌ బండలు పట్టుకొని ధరల పెరుగుదల మీద గత పాలకుల మీద తెగ ఆందోళన చేశారు. ఇప్పుడు అధికారంలో తమ పార్టీ ఉంది గనుక ఆమె అంతర్గతంగా పోరాటం జరిపి ఉండవచ్చు. లేదా ఆ పన్నులు ధరల పెరుగుదలకు దారి తీసి శ్రీలంక మాదిరి జనం ఆందోళనకు దిగుతారనే భయమే కావచ్చు. లేకపోతే అంతకు ముందు పన్నులు తగ్గించేది లేదని భీష్మించుకున్న వారు, రకరకాల వాదనలు, అవాస్తవాలు చెప్పిన వారు ఆకస్మికంగా ఎందుకు మారుమనసు పుచ్చుకున్నట్లు ?


ఇప్పుడు పెరిగిన ద్రవ్యోల్బణం ప్రపంచమంతటా ఉన్నదే తప్ప మా లోపం ఏమీ లేదు అని సరికొత్తగా సమర్ధించుకుంటున్నారు. ఎనిమిదేండ్ల క్రితం ఏం చెప్పారో వారు వెనక్కి తిరిగి చూసుకోవాలి. మన కాషాయ దళాలు, వాటికి వంతలుగా ఉన్న మీడియా ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం పెరుగుతోందని చెబుతాయి. ఇది జనాన్ని పూర్తిగా తప్పుదారి పట్టించటం తప్ప తర్కానికి నిలిచేది కాదు. దీనికి కారణాలేమిటి ? ఒక్కొక్క దేశంలో ఒక్కోకారణం తప్ప అన్ని దేశాలకూ ఒకే కారణం ఉండదు. బిజెపి వారు చెబుతున్నట్లు అంతటా ఒకటే అంటే శ్రీలంకలో మాదిరి మన దగ్గర కూడా పెరగాలి కదా ! గతేడాది జూలైతో పోలిస్తే లంకలో 2022 జూలై ద్రవ్యోల్బణం రేటు 60.8శాతం ఉంది.వెనెజులాలో కొన్ని సంవత్సరాలుగా తలెత్తిన ద్రవ్యోల్బణం కొన్ని వేలశాతం పెరిగి జూలై నెలలో 7.5శాతానికి తగ్గినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. కనుక అన్ని చోట్లా ఉంది కనుక మనదగ్గరా ఉంది అన్నది తప్పుడు వాదన. చైనా గురించి ఎందుకు మౌనంగా ఉంటున్నట్లు ? లాక్‌డౌన్ల వలన దాని ఆర్ధిక రంగం దెబ్బతిన్నదని, పురోగతిలో మన దేశం కంటే వెనుకబడినట్లు, అక్కడి పరిశ్రమలు వెలుపలికి తరలిపోతున్నట్లు ఇంకా ఇలాంటి కబుర్లు చైనా గురించి చాలా చెబుతున్నారుగాని అక్కడి ధరల పెరుగుదల అంశాన్ని మాత్రం చెప్పరు. తప్పనిసరైతే అక్కడ నిరంకుశంగా ధరలను అణిచివేస్తారు, ధరలను జైలుపాలు చేస్తారు,ధరల హక్కులను హరిస్తారు అని చెబుతారేమో !


ఈ ఏడాది తొలి ఆరుమాసాల్లో చైనాలో సగటున నెలవారీ ధరల పెరుగుదల 1.7శాతం, ఏడాదిలో మూడుశాతానికి పెరగవచ్చని అంచనా. ఒక్క ఈ సంవత్సరమే కాదు, గత పది సంవత్సరాల్లో ఒక్క ఏడాది తప్ప రెండు శాతానికి మించి ధరల పెరుగుదల లేదు. విత్త సంబంధమైన ఉద్దీపన పధకాలను పెద్ద ఎత్తున అమలు జరపకపోవటమే ద్రవ్యోల్బణం అదుపులో ఉండటానికి కారణం. ఆహార స్వయం సమృద్ధి, వస్తువుల దిగుమతులు లేకపోవటం మరో కారణం. అయినప్పటికీ చైనాలో పరిమితంగా ద్రవ్యోల్బణం ఉండటానికి లేదా పెరగటానికి అది దిగుమతి చేసుకొనే చమురు, కొన్ని పరికరాలు, ఇతర ముడివస్తువుల ధరలు ప్రపంచ మార్కెట్లో పెరగటమే కారణం. మన దేశ స్థితి గురించి ఎవరి అంచనాలు వారు చెబుతున్నప్పటికీ అందరూ చెబుతున్నది ఒకటే అదేమిటంటే ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు శాతానికి తగ్గే పరిస్థితి లేదు.


దీని గురించి ప్రధానిగా నరేంద్రమోడీ ఎందుకు మాట్లాడటం లేదు అన్నది ప్రశ్న. 2004 నుంచి 2013 వరకు పదేండ్లలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం 8.06 శాతం కాగా 2014నుంచి 2021వరకు మోడీ ఏలుబడిలో 4.87శాతం ఉంది. గత రెండు సంవత్సరాలుగా పెరుగుతోంది, ఈ ఏడాది ఇప్పటివరకు ఎక్కువగా పెరిగింది. ఇక్కడ 2014 ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ గుజరాత్‌ సిఎం లేదా బిజెపి నేతగా ఏం చెప్పారో గుర్తుకు తెచ్చుకోవాలి.నరేంద్రమోడీ డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌లో ఎవరైనా చూడవచ్చు. ” ఇది ద్రవ్యోల్బణాన్ని ఓడించే తరుణం, ఇది కాంగ్రెస్‌ను ఓడించే సమయం ” అనే శీర్షిక కింద నరేంద్రమోడీ చెప్పిన మాటలు, సమాచారాన్ని ఉంచారు. ” వంద రోజుల్లో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తానని కాంగ్రెస్‌ చెప్పింది. వారి వాగ్దానాన్ని నిలుపుకోలేదు. ప్రజావిశ్వాసాన్ని వమ్ము చేసిన వారిని నమ్మవద్దు. ప్రధాని వాజ్‌పేయి, మొరార్జీ దేశాయి ప్రభుత్వాలు ధరలను అదుపు చేసినపుడు మనమెందుకు చేయలేము ? 2014లో అధికారానికి వచ్చే బిజెపి ప్రభుత్వం ఆ పని చేస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. లోపభూయిష్టమైన విధానాలు, సరైన ప్రణాళిక లేకపోవటమే దీనికి కారణం ” అని నరేంద్రమోడీ చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఆ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం 1998లో అంటే వాజ్‌పేయి అధికారానికి వచ్చిన ఏడాది 13.1 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని ఓడిన 2004 నాటికి 3.76 శాతానికి తగ్గించగా తరువాత వచ్చిన మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ 10.92 శాతానికి పెంచినట్లు పేర్కొన్నారు. 2004 ఎన్నికలకు ముందు కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం చేరినందున వందరోజుల్లో దాన్ని ఇంకా తగ్గిస్థానని కాంగ్రెస్‌ చెప్పిందనటం ఒక పెద్ద అవాస్తవం. దేశం వెలిగిపోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన బిజెపి 2004 ఎన్నికల్లో దెబ్బతిన్నది.


ఇప్పుడు పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణాన్ని ఓడించాల్సిన అవసరం లేదని నరేంద్రమోడీ భావిస్తున్నారా ? ధరల పెరుగుదల నివారణకు 2011లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వినియోగదారుల వ్యవహారాల మీద ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. దానికి గుజరాత్‌ సింఎగా నరేంద్రమోడీ అధ్యక్షుడు. ఇతర సభ్యులుగా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు ముఖ్యమంత్రులున్నారు.ఆ బృందం ఆచరణాత్మక చర్యలంటూ 64 అంశాలు, ఇరవై సిఫార్సులను చేసింది. ఇప్పుడు అలాంటి కమిటీ లేదు, పదేండ్ల నాటి సిఫార్సుల కట్టమీద దుమ్ము దులిపి ఒక్కసారి చదువుకున్నట్లు కూడా లేదు. కావాలనే వాటిని కూడా విస్మరించారా ? లేక ఆ ఫైలు కనిపించలేదా ? పోనీ ఒకటవ తరగతి చదువున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆరేండ్ల పసిపిల్ల కీర్తి దూబే తన పెన్సిల్‌, ఎరైజర్‌ వాటిని పారవేసుకుంటే తన తల్లి కోప్పడటం, మాగీ ధరల పెరుగుదల గురించి రాసిన లేఖ గురించి తెలిసిందే. దాని మీద ప్రధాని ఇంతవరకు స్పందించిన దాఖలా నాకు గూగుల్‌ వెతుకులాటలో కనిపించ లేదు. ఎవరికైనా కనిపిస్తే సరి చేసుకుంటాను. ధరల గురించి ప్రధాని స్పందించలేదంటే రెండు కారణాలుండవచ్చు. ఒకటి చమురు ధరలు ఎంత పెరిగినా, పన్నులు ఎంత పెంచినా భరించిన జనం ఇతర వస్తువుల ధరలకు కూడా మెల్లగా అలవాటు పడతారు లెమ్మని కావచ్చు. తానే నోరు విప్పితే ధరల పెరుగుదలను అంగీకరించినట్లు అవుతుంది, ఒకసారి అంగీకరించిన తరువాత తగ్గించేందుకు తీసుకున్న చర్య లేమిటనే చర్చ జనంలో ప్రారంభం అవుతుంది. ప్రజల ఆందోళనల కన్నా వారిలో ఇలాంటి ఆలోచనలు ప్రమాదకరమని భావించి మౌనంగా ఉంటున్నారని అనుకోవాలి. వరల్డ్‌ డాటా డాట్‌ ఇన్‌ఫో సమాచారం ప్రకారం 1960 నుంచి 2021 వరకు ద్రవ్యోల్బణ సగటు 7.5శాతం కాగా కనిష్టం మైనస్‌ 7.6, గరిష్టం 28.6శాతంగా నమోదైంది. 1960లో వంద రూపాయలకు వచ్చే సరకుల కొనుగోలుకు 2021చివరిలో రు.7,804.85 చెల్లించాల్సి వచ్చింది.కనుక నరేంద్రమోడీ గారి అచ్చేదిన్‌ ఏలుబడిలో 2014లో రు.100 విలువ గల వస్తువులు ఇప్పుడు రు.146.66కు గానీ రావటం లేదు. ద్రవ్యోల్బణం అంటే జనాల జేబులకు చిల్లు లేదా జేబులు కొట్టేసినట్లే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ద్రవ్యోల్బణం అదుపులో బిజెపి వైఫల్యం : గరిష్ట ప్రభుత్వం – కనిష్ట పాలన !

13 Tuesday Jul 2021

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#Failed Narendra Modi, India inflation, India Price Rise, Narendra Modi Failures, narendra modi jumbo ministry


ఎం కోటేశ్వరరావు


అనేక అంశాల్లో మడమ తిప్పి మాట తప్పినట్లుగానే కనిష్ట ప్రభుత్వం- గరిష్ట పాలన అనే స్వయం ప్రకటిత ప్రవచనానికి నరేంద్రమోడీ తిలోదకాలిచ్చారు. గరిష్ట పాలన కూడా లేదనేది తేలిపోయింది. అధికారానికి రాక ముందు 2014 మార్చి 14న నరేంద్రమోడీ డాట్‌ ఇన్‌లో పోస్టు చేసినదాని ప్రకారం ” ఇది ద్రవ్యోల్బణాన్ని ఓడించాల్సిన తరుణం – ఇది కాంగ్రెస్‌ను ఓడించాల్సిన తరుణం ” అనే శీర్షికతో అనేక విషయాలు రాశారు. ” వందరోజుల్లో ద్రవ్యోల్బణాన్ని అరికడతామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. కానీ వారు వాగ్దానానికి కట్టుబడి ఉండలేకపోయారు.ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిన వారిని నమ్మవద్దు. వాజ్‌పారు గారు, మొరార్జీ దేశారు గారు ధరలను అదుపు చేయగా లేనిది మనమెందుకు చేయలేము ? 2014లో బిజెపి ఆ పని చేస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను ” అని చెప్పారు.

ఇప్పుడు నరేంద్రమోడీ గారు నిజంగా ఆ పని చేస్తున్నారా ? ద్రవ్యోల్బణం పెరిగితే ధరలు పెరుగుతాయన్నది ప్రాధమిక సూత్రం. గత ఏడు సంవత్సరాల్లో ఏమి జరిగిందో చూడండి. 2014-15లో 5.8, 2015-16లో 4.9, 2016-17లో 4.5, 2017-18లో 3.6, 2018-19లో 3.4, 2019-20లో 4.8, 2020-21లో 6.69 శాతం ఉండగా 2021-22లో 4.97శాతం ఉండవచ్చని అంచనా వేశారు,తరువాత 5.1శాతానికి పెంచారు. ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభ ఏప్రిల్‌ నెలలో ద్రవ్యోల్బణం 4.23శాతం కాగా మే నెలలో అది 6.3శాతానికి పెరిగింది. తాత్కాలిక అంచనా ప్రకారం జూన్‌లో 6.26శాతం అని ప్రకటించారు. మోడీ 1.0లో తగ్గిన ద్రవ్యోల్బణం ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నట్లు ? మోడీ గారి న్యాయం ప్రకారం వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించాల్సిన తరుణం వస్తున్నట్లేనా ?

ఆర్ధికశాస్త్రంలో చెప్పే ప్రాధమిక పాఠాల్లో గిరాకీ (డిమాండ్‌ ) తగ్గితే ధరలు తగ్గుతాయి. కానీ దానికి భిన్నంగా గిరాకీ తగ్గింది – ధరలు పెరుగుతున్నాయి. ఆర్ధిక రంగంలో కృషి చేసినందుకు గుర్తింపుగా దక్షిణ కొరియా నుంచి మన ప్రధానులెవరూ పొందని అవార్డును అందుకున్న నరేంద్రమోడీ పాలనలో ఇలా జరుగుతోందేమిటి ? అన్నీ రివర్సు గేరులో ఉన్నాయి. అధికారానికి రాగానే చమురు ధరలు గణనీయంగా తగ్గి ఆర్ధికంగా మోడీ సర్కార్‌కు వెసులు బాటు కలిగింది. అదంతా తన ఘనతే అని ప్రచారం చేసుకున్నారు. చమురు మీద పన్నుల, సెస్‌లు పెంచి గణనీయ మొత్తాలను ఖజానాకు చేర్చిన సర్కార్‌ వాటిని జనానికి కాకుండా రాయితీల రూపంలో కార్పొరేట్లకు కట్టపెట్టింది. గత మూడు సంవత్సరాలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి. దానికి తోడు 58గా ఉన్న రూపాయి విలువును 74కు దిగజార్చారు. ఇలాంటి చర్యలన్నీ ఇప్పుడు ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు దారి తీస్తున్నాయి. సామాన్య జనానికి తొలగించిన రాయితీలను పునరుద్దరిస్తే భారం తగ్గుతుంది. అయితే సామాన్య జనం దేశభక్తులు గనుక నరేంద్రమోడీ కూడా తోటి దేశభక్తుడే అని నమ్ముతున్నారు గనుక తమ రాయితీల కోత పెట్టినా, పన్ను భారం మోపినా కిమ్మనటం లేదు. కానీ కార్పొరేట్లకు అలవాటు చేసిన రాయితీలకు కోత పెడితే మరుక్షణమే నరేంద్రమోడీ ఉద్యోగానికి ఎసరు వస్తుంది. మోడీ సర్కార్‌ వైఫల్యం రానున్న రోజుల్లో మరింతగా వెల్లడి కానుంది. అందుకే అసాధారణ రీతిలో జనానికి మతిమరపు ఎక్కువ అనే గట్టి నమ్మకంతో గరిష్ట స్ధాయిలో మంత్రివర్గాన్ని పెంచారు. చెప్పింది చెయ్యకుండా చేసేది చెప్పకుండా గత ఏడేండ్లలో ఎప్పటి కెయ్యది అప్పటికా మాటలాడి నెట్టుకు వచ్చినట్లుగానే రాబోయే రోజుల్లో కూడా నెట్టుకు రాగలరా ? జనం నిద్ర నుంచి మేలుకోకుండా ఉంటారా ?


నరేంద్రమోడీ కొలువులో కొందరికి ఉద్వాసన, కొత్త మంత్రులు, పాత మంత్రులకు ప్రమోషన్ల పందారం ముగిసింది. పాత మంత్రులు పన్నెండు మందిని ఎందుకు తొలగించారో తెలియదు. వారిలో కొందరిని రాజకీయాలకు కూడా పనికి రారని కామోసు గవర్నర్లుగా నియమించారు. మొత్తానికి ఏడు సంవత్సరాల తరువాత నరేంద్రమోడీ గారు తన మాటను తానే ఖండించుకున్నారు లేదా దిగమింగారు. చేసేది చెప్పరు-చెప్పింది చెయ్యరు అని మరోసారి రుజువు చేసుకున్నారు. అంతకు ముందున్న జంబో మంత్రివర్గాన్ని చూసి ఏడు సంవత్సరాల క్రితం మోడీ గారు కనిష్ట ప్రభుత్వం – గరిష్ట పాలన అంటే జనం నిజమే కామోసు అనుకున్నారు. దానికి అనుగుణంగానే 43 మందితో కొలువు దీరితే హర్షించారు. ఇప్పుడు చేసిందేమిటి ? పన్నెండు మందిని తొలగించి నలభై మూడు మందిని కొత్తగా చేర్చుకొని ప్రస్తుతం ఉన్న 43 నుంచి 78కి పెంచారు. మొత్తం 81 మంది వరకు నియమించుకొనే అవకాశం ఉన్నా వినియోగించుకోలేదు చూశారా ఎంత ఆదర్శమో అన్నట్లుగా కొందరు చిత్రిస్తున్నారు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ హయాంలో 79 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం లేనందున అక్కడి నుంచి కూడా ఒకరికి ఇస్తే ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా సమానం అవుతుంది. ఇద్దరికి ఇస్తే కొత్త రికార్డు అవుతుంది.


కరోనా కష్ట కాలంలో ఖజానా నిండుకుందన్నది వాస్తవం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్లుగా పాలకులు ఏదో తమకు పొడి చేస్తారని చూడకుండా పైసా పైసా పొదుపు చేసి తప్పని అవసరాలకు జనం డబ్బు వాడుకుంటున్నారు. మరోవైపు నరేంద్రమోడీ గారు జంబో సర్కస్‌ను గుర్తుకు తెచ్చే విధంగా పెద్ద సంఖ్యలో మంత్రుల ఉద్యోగాలు ఇచ్చారు. ఇదే స్ధాయిలో యువతీ, యువకులకు ఉపాధి కల్పించి ఉంటే పరిస్ధితి భిన్నంగా ఉండేది. ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం తొలి మూడు నెలల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపదలను సృష్టించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఖర్చులో 42శాతానికి కోత పెట్టాయి. ఇది కనిష్ట పాలనకు నిదర్శనం అయితే మంత్రివర్గ విస్తరణ గరిష్ట ప్రభుత్వానికి తార్కాణం. తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినపుడు ప్రధాని మోడీ విమానాల్లోనే ఎక్కువ కాలం గడిపారనే జోకులు పేలాయి. ఇప్పుడు కొత్త, పాత మంత్రులు, వారి సిబ్బంది చేసేందుకు పనేమీ లేకుండా ఇలా ఖర్చుకు కోత పెడితే బుగ్గ కార్లేసుకొని పొలోమంటూ రాష్ట్రాలన్నీ తిరగటం ,మోడీ భజన చేయటం తప్ప వారేం చేస్తారు ?

మంత్రివర్గ విస్తరణ వెనుక అసలు కారణం రాజకీయం, ఓట్ల గాలమే. ఇప్పటి నుంచి 2024 లోక్‌సభ ఎన్నికలు జరగబోయే లోపల 16 రాష్ట్రాలలో ఎన్నికలు జరగాల్సి ఉంది, వచ్చే ఏడాది యుపి, పంజాబ్‌, గుజరాత్‌, గోవా, ఉత్తరాఖండ్‌, హిమాచల ప్రదేశ్‌ , మణిపూర్‌ , 2023లో రాజస్ధాన్‌, తెలంగాణా, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌, కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో లబ్ది పొందేందటంతో పాటు తదుపరి జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పట్టు కోసం అన్నది స్పష్టం.గరిష్టంగా ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఏడుగురు, కర్ణాటక నుంచి నలుగురిని తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో ఊహించని దెబ్బ తగిలినప్పటికీ ఉన్న బలాన్ని నిలుపుకొనేందుకు నలుగురికి చోటు కల్పించారు.


పాలన మెరుగుదల కోసం విస్తరణ జరిగిందని కొందరు చిత్రిస్తున్నారు. ఇది సానుకూల కోణం, మరో విధంగా చూస్తే వైఫల్యాన్ని అంగీకరించటంగా ఎందుకు చెప్పకూడదు. ఇక్కడ ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ కరోనా మహమ్మారి గురించి పట్టించుకోలేదనో, రవిశంకర ప్రసాద్‌ ట్విటర్‌ విషయంలో సరిగా వ్యవహరించలేదనో ఏదో ఒక కారణం చెప్పటానికి చాలా రంజుగా ఉంటుంది. ఇదే ప్రాతిపాదిక అయితే కరోనాకు ముందే గుండెకాయవంటి ఆర్ధిక వ్యవస్ధ దిగజారిపోవటానికి మంత్రి నిర్మలాసీతారామన్‌ పని తీరు సంగతేమిటి ? లేదూ ఒక మంత్రి సరిగా పనిచేయకపోతే ప్రధాని, ఆయన కార్యాలయం ఏమి చేస్తున్నట్లు ? విజయాలకైనా, పరాజయాలు, వైఫల్యాలకైనా మంత్రివర్గ సమిష్టి బాధ్యత, దాని నేత ప్రధాని అయినపుడు నరేంద్రమోడీ గారి సంగతేమిటి ? కరోనా రెండవ తరంగాన్ని నిర్లక్ష్యం చేయటం, ఆక్సిజన్‌, వాక్సిన్‌ ఇలా చెప్పుకుంటూ పోతే తగిలిన ఎదురు దెబ్బలు, చీవాట్లు మంత్రులకు తప్ప ప్రధానికి తగలవా ?

మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని చూస్తున్న వారు కొందరు. బ్రాహ్మణ-బనియా పార్టీగా పేరున్న బిజెపి ఇంకేమాత్రం అలాంటి పార్టీ కాదని చెబుతున్నారు. దీనికి తార్కాణంగా ఇదిగో చూడండి పన్నెండు మంది దళితులు, ఎనిమిది మంది గిరిజనులు, 27 మంది ఓబిసి సామాజిక తరగతుల వారు ఉన్నారు అని లెక్కలు చెబుతున్నారు. మరి ఏడు సంవత్సరాల పాటు సామాజిక న్యాయం బిజెపికి గుర్తుకు రాలేదా ? గతంలో కాంగ్రెస్‌ పాలనలో కూడా ఈ సామాజిక తరగతుల వారికి పదవులు వచ్చాయి, అంత మాత్రాన ఆ తరగతుల సామాన్య జన జీవితాల్లో వచ్చిన మార్పేమిటి ? ఇప్పుడు బిజెపి వారు తెచ్చే దేమిటో ఎవరైనా చెప్పగలరా ?


సామాజిక న్యాయం పేరుతో ఇప్పటికే కాంగ్రెస్‌, వివిధ ప్రాంతీయ పార్టీలు కావలసినంత రాజకీయం చేశాయి. ఉత్తర ప్రదేశ్‌కు మూడు సార్లు ఎనిమిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన మాయావతి దళితులను ఉద్దరించింది ఏమిటి ? ములాయం సింగ్‌, అఖిలేష్‌ యాదవ్‌, లాలూ ప్రసాద్‌, రబ్రీదేవి, నితీష్‌ కుమార్‌ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితా అవుతుంది. వారంతా వెనుకబడిన తరగతులకు చేసిన మేలేమిటి ? అయితే ఇప్పటికే ఇలాంటి పెద్దలు పాతుకు పోయి ఉన్నందున దళితులు, వెనుకబడిన తరగతుల్లో దిగువన ఉన్న వారికి పెద్ద పీటవేయటం ద్వారా తనదైన ఓటుబ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు బిజెపి తాజా మంత్రివిస్తరణ చేసింది. ఉత్తరప్రదేశ్‌ విషయానికే వస్తే అది బిజెపికి కీలక రాష్ట్రం. దళితుల్లో జాతావు (మాయావతి అదే సామాజిక తరగతికి చెందిన వారు) ఓబిసిల్లో యాదవులది పైచేయి. అందుకే అక్కడ జాతావులు గాని దళితులు, యాదవులు గాని ఎంబిసిలను బిజెపి ఎంచుకుంది. అది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో, లేదా మిగతా రాష్ట్రాలలో కూడా కనిపిస్తుంది. మొత్తం మీద మిగతా పార్టీలు గతంలో అనుసరించిన విధానాలనే ఇప్పుడు బిజెపి అందిపుచ్చుకుంది. ఆ పార్టీలన్నీ ఎందుకు విఫలం అయ్యాయో సరైన గుణపాఠాలు తీసుకోలేదన్నది స్పష్టం. అన్నింటికీ మించి తన హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోవాలంటే బ్రాహ్మణ-బనియా సామాజిక తరగతుల నుంచి వచ్చిన నాయకత్వాన్ని ముందు పెడితే ప్రస్తుతం నెలకొన్న అస్ధిత్వభావనల తరుణంలో పని చేయవని సంఘపరివార్‌ గ్రహించింది. అందుకే ఇతర కులాలను ముందుకు తెస్తున్నది.

రాజకీయాల్లో నేర చరితుల ప్రమేయం పెరుగుతోందనటానికి మోడీ సర్కార్‌ మంత్రులే నిదర్శనం. అలాంటి ” సమరశీలురు ” ఉంటేనే దేనికైనా పాల్పడవచ్చు. డెబ్బయి ఎనిమిది మంది మంత్రులకు గాను 33 మంది ఎన్నికల కమిషన్‌కు స్వయంగా సమర్పించిన పత్రాల ప్రకారం వారి మీద క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ప్రజాస్వామ్య సంస్కరణల అసోసియేషన్‌(ఎడిఆర్‌) వెల్లడించింది. వారిలో 24 మంది మీద తీవ్రమైన కేసులు అంటే హత్య, హత్యాయత్నం, దోపిడీ వంటివి ఉన్నాయి. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి నిసిత్‌ ప్రమాణిక్‌ మీద హత్య, హత్యా యత్నం కేసులు ఉన్నాయి. మరో ముగ్గురి మీద హత్యాయత్నం కేసులున్నాయి. మతసామరస్యానికి భంగం కలిగించారనే కేసులున్న వారిలో అమిత్‌ షా, గిరిరాజ్‌ సింగ్‌, శోభా కరాండ్లజే, నిత్యానందరాయి, ప్రహ్లాద జోషి, ఇక ఎన్నికల ప్రచారంలో నిబంధనలు, లంచాలు, అక్రమ చెల్లింపుల వంటి కేసులున్నవారిలో నితిన్‌ గడ్కరీ, గిరిరాజ్‌ సింగ్‌, అశ్వనీ కుమార్‌ చౌబే, సత్యపాల్‌ సింగ్‌ బాగెల్‌, పంకజ్‌ చౌదరీ, భగవంత ఖుబా, కౌశల్‌ కిషోర్‌ ఉన్నారు.


మంత్రుల్లో 47 మంది బలహీన వర్గాల సామాజిక తరగతులకు చెందినప్పటికీ వారంతా సామాన్యులు కాదు. మొత్తం 78 మందిలో 70 మందికోటీశ్వరులు, ఒక్కో మంత్రి ఆస్తుల సగటు విలువ (అధికారికంగా ప్రకటించిన మేరకు ) రు.16.24 కోట్లు ఉన్నాయి. జ్యోతిరాదిత్య సింధియా, పియూష్‌ గోయల్‌, నారాయణ రాణే, రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆస్తులు 50 కోట్లకు పైనే ఉన్నాయి, సింధియా ఆస్తులు 379 కోట్లు. ఎనిమిది మంది తమ ఆస్దులు కోటి రూపాయలకు లోపే అని ప్రకటించగా ప్రతిమా భౌమిక్‌ ఆరు లక్షలని పేర్కొన్నారు. పదహారు మంది మంత్రులు కోటి రూపాయలకు పైగా అప్పులున్నాయని తెలుపగా వారిలో ముగ్గురికి పదికోట్లకు పైన ఉన్నాయట. ఇద్దరు మంత్రులు తాము ఎనిమిదవ తరగతి పూర్తి చేశామని తెలుపగా ముగ్గురు పదవ తరగతి అని పేర్కొన్నారు. అరవై నాలుగు మంది డిగ్రీ,డిప్లొమా ఆపైన చదివారు. పదకొండు మంది మహిళా మంత్రులున్నారు. యాభై ఎనిమిది మంది యాభై సంవత్సరాలు పైబడిన వారున్నారు. మంత్రులనే ఈ బోయీలూ పల్లకి ఎక్కిన నరేంద్రమోడీని గమ్యస్దానానికి సరిగా చేరుస్తారా ? చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d