• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Republican party

ఎడారిలో ఇసుక అమ్మకం – ఎలన్‌ మస్క్‌ అమెరికా పార్టీ !

12 Saturday Jul 2025

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

America Party, BILLIONAIRE RAJ, Democratic party, Donald trump, Elon Musk, MAGA Republicans, Republican party

ఎం కోటేశ్వరరావు


ప్రపంచ ధనికుడు ఎలన్‌ మస్క్‌ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మీద ఆగ్రహంతో ‘‘ అమెరికా పార్టీ ’’ పేరుతో రాజకీయ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించేశాడు. దాని మీద రాజకీయ పండితులు చర్చలు చేస్తున్నారు. తమకు ప్రయోజనం కలిగించని లేదా వ్యతిరేకించిన పాలకుల మీద ఆగ్రహించిన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు డబ్బుమదంతో తెల్లవారేసరికి పార్టీ పెట్టి తడాఖా చూపుతామంటూ హడావుడి చేయటం అన్ని దేశాలలో జరిగేదే. అమెరికాలో కూడా అదే జరిగింది. ఇప్పుడున్న స్థితిలో అతగాడి ప్రయత్నం ఎడారిలో ఇసుక అమ్మటమే అవుతుందన్నది ఒక వ్యాఖ్య. ట్రంప్‌తో ప్రేమాయణానికి కటీఫ్‌ చెప్పిన తరువాత తన ఫ్యాక్టరీలు, వ్యాపారాలను చూసుకుంటానని చెప్పిన పెద్దమనిషి బిగ్‌, బ్యూటీఫుల్‌( పెద్దది, అందమైన) బిల్లుగా వర్ణించినదానిని పార్లమెంటు గనుక ఆమోదిస్తే తాను రాజకీయ పార్టీని పెడతానని ప్రకటించాడు.ఆమోదం పొందటం, రాజకీయ పార్టీ ప్రకటన వెంటనే జరిగాయి.మఖలో పుట్టి పుబ్బలో అంతరించే పార్టీలు ప్రపంచమంతటా ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే అవుతుందా, 24.7బిలియన్‌ డాలర్ల వ్యక్తిగత సంపదతో ప్రపంచ ధనికుడిగా ఉన్న మస్క్‌ డబ్బును వెదజల్లి అమెరికా రాజకీయాలను మలుపుతిప్పుతాడా, అక్కడ ఇప్పటికే తిష్టవేసిన రిపబ్లిన్‌, డెమోక్రటిక్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలుపుతాడా ? ఇలా పరిపరి విధాలుగా ప్రపంచ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు ముద్దులాడుకున్న వారు నేడు దెబ్బలాడుకుంటున్నారు. రేపేం చేస్తారో తెలియదు, రాజకీయాలు, వ్యాపారాల్లో ఏదైనా జరగవచ్చు.


అసలు వారెందుకు విడిపోయారు ? తాను తయారు చేసే టెస్లా విద్యుత్‌ కార్లతో అమెరికాను ప్రపంచాన్ని నింపాలని ఎలన్‌ మస్క్‌ ఆశపడ్డాడు. అందుకు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఉంటే తన ఆటలు సాగించుకోవచ్చనుకున్నాడు. ట్రంప్‌ పలుకుబడితోనే నరేంద్రమోడీపై వత్తిడి తెచ్చి మనదేశంలో స్టార్‌లింక్‌ను సాధించిన సంగతి తెలిసిందే, టెస్లా కార్లను కూడా మార్కెటింగ్‌ చేస్తానని ప్రకటించాడు.మస్క్‌ కంపెనీకి స్థానిక మార్కెట్‌ మొత్తాన్ని అప్పగిస్తే అమెరికాలో పెట్రోలు, డీజిలు, గ్యాస్‌ వ్యాపారం చేసేవారు, వాటితో నడిచే కార్లు తయారు చేసేవారు చేతులు ముడుకు కూర్చుంటారా ? రంగంలోకి దిగి ట్రంప్‌కు వార్నింగ్‌ ఇవ్వటంతో అతగాడు వెనక్కు తగ్గాడు.అక్కడే మొదలైంది రచ్చ. దాన్ని బయటకు చెప్పుకోలేడు గనుక ట్రంప్‌ యంత్రాంగం రూపొందించిన పొదుపు బిల్లు ఆమోదం పొందితే అమెరికా సర్వనాశనం అవుతుందంటూ ధ్వజమెత్తాడు. ట్రంప్‌ ఊరుకుంటాడా ఇలాగే వాగితే నీ కార్లకు ఇస్తున్న సబ్సిడీల మొత్తాన్ని ఎత్తివేస్తా ఆలోచించుకో అన్నాడు. కాస్త మెత్తబడినప్పటికీ ఆవిరైన ప్రేమ తిరిగి చిగురించలేదు, ఛీ పో అంటే ఛా పో అనుకున్నారు. ఇప్పుడేం జరుగుతుందన్నది ఆసక్తి కలిగించే అంశం.


అమెరికాను మరోసారి గొప్పదాన్ని చేయాలనే పిలుపును సమర్ధించిన వారందరికీ మస్క్‌ నిర్ణయం రుచించలేదు.ట్రంప్‌ ద్వారా గరిష్టంగా లబ్దిపొందాలని చూసిన బడాబాబులకు అమెరికా పార్టీ గురించి భయం లేదుగానీ మస్క్‌ తెస్తున్న వత్తిడి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. పార్లమెంటు ఆమోదించి ట్రంప్‌ సంతకం అయిన పొదుపు చట్టం అమలు జరిగితే కార్మికవర్గ సంక్షేమ కార్యక్రమాల మీద తొలివేటు పడుతుందనే భయంతో ఇప్పటికే జనం భారీ ఎత్తున రెండుసార్లు నిరసన ప్రదర్శనలు చేశారు.ప్రాధమిక వార్తల ప్రకారం ఇది అమల్లోకి వస్తే కోటీ 30లక్షల మందికి ఆరోగ్యబీమా గల్లంతు లేదా ఉన్నప్పటికీ నిరుపయోగంగా మారుతుందనే విశ్లేషణలు వచ్చాయి.జనాల నుంచి ఎదురయ్యే నిరసనలను ఎలా అణచివేయాలా అని చూస్తుంటే మధ్యలో మస్క్‌ గొడవేంటని ఇతర కార్పొరేట్‌ శక్తులు చిరాకు పడుతున్నాయి. ట్రంప్‌ చట్టంతో ఇప్పటికే ఉన్న దేశ రుణానికి మరో నాలుగున్నరలక్షల కోట్ల డాలర్లు తోడవుతుందని మస్క్‌ ధ్వజమెత్తాడు. ఇప్పటికే జిడిపిలో 122శాతం 36.2లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉంది. దాన్ని మరో నాలుగులక్షల కోట్ల డాలర్లు పెంచుకొనేందుకు మే నెలలో అనుమతి ఇచ్చారు, ఇప్పుడు మరో ఐదు లక్షల కోట్లడాలర్ల వరకు పెంచాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాలో జన్మించి 2002లో అమెరికా పౌరసత్వం పొందిన మస్క్‌కు కెనడా పౌరసత్వం కూడా ఉంది. నిబంధనల ప్రకారం అమెరికా గడ్డమీద పుట్టిన వారు మాత్రమే అధ్యక్షపదవికి అర్హులు. ప్రస్తుతం రెండు పార్టీలు పోటాపోటీగా పార్లమెంటు ఉభయ సభల్లో సీట్లు తెచ్చుకుంటున్న పూర్వరంగంలో తనకున్న ధనబలంతో సెనెట్‌లో రెండు మూడు, ప్రజాప్రతినిధుల సభలో 8 నుంచి 10 తెచ్చుకుంటే చక్రం తిప్పవచ్చన్నది మస్క్‌ ఎత్తుగడ.తాజాగా మస్క్‌ వ్యతిరేకించిన ట్రంప్‌ ముందుకు తెచ్చిన బిగ్‌, బ్యూటీఫుల్‌ బిల్లు పార్లమెంటులో చావుతప్పి లొట్టపోయినట్లుగా నెగ్గింది. వంద మంది ఉన్న సెనెట్‌లో వ్యతిరేక, అనుకూల ఓట్లు 50 చొప్పున రాగా ఉపాధ్యక్షుడిగా ఉన్న జెడి వాన్స్‌ తన నిర్ణయాత్మక ఓటుతో బిల్లును గట్టెక్కించాడు. ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 220 ఓట్లు ఉన్నప్పటికీ బిల్లుకు అనుకూలంగా 218 మాత్రమే రాగా 212 ఉన్న డెమోక్రాట్లతో మరో ఇద్దరు అధికారపక్ష సభ్యులు చేతులు కలపటంతో వ్యతిరేకంగా 214 వచ్చాయి. ఇలాంటి సమయాల్లో మూడో పక్షానికి ఎంపీలు ఉంటే కింగ్‌ మేకర్‌లుగా మారతారు. ఎలన్‌ మస్క్‌ ఆకాంక్ష, యత్నం అదే. రెండు పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయం గురించి కాదు. గతంలో డెమోక్రటిక్‌ పార్టీకి, గత ఎన్నికల్లో రిపబ్లికన్‌ ట్రంప్‌కు మద్దతు ఇచ్చాడు. ఎవరికి బాసటగా ఉన్న తన లాభమే పరమావధి.

రెండు పార్టీలకు పరిష్కారం తన పక్షమే అని, అమెరికన్లు కోల్పోయిన స్వాతంత్య్రాన్ని తిరిగి ఇస్తానని మస్క్‌ చెప్పాడు. మూడిరట రెండు వంతుల మంది కొత్త పార్టీ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ట్రంప్‌ ఏలుబడిలో ప్రభుత్వ సిబ్బంది సామర్ధ్యం పెంచే పేరుతో ఎలన్‌ మస్క్‌ చేపట్టిన డోజ్‌ ఉద్యోగులను తొలగించేందుకు పని చేసింది తప్ప మరొకటి కాదు. ట్రంప్‌ తెచ్చిన చట్టం కార్పొరేట్లకు పన్నుల తగ్గింపు, సామాన్యుల సంక్షేమం కుదింపుకు ఉద్దేశించింది. ప్రస్తుతం 7.1 కోట్ల మంది ఆరోగ్యబీమాపై ఆధారపడి ఉన్నారు. రానున్న పది సంవత్సరాల్లో కోటీ 70లక్షల మంది ఈ పథకానికి దూరం అవుతారు. మనదేశంలో ఆహార భద్రతా పథకం కింద 80 కోట్ల మందికి ఉచిత బియ్యం, గోధుమలు ఇస్తున్నట్లుగానే అమెరికాలో అదనపు పోషకాహారం పేరుతో 4 కోట్ల మంది ఆహార కూపన్లు ఇస్తున్నారు. వీరిలో 47 లక్షల మంది వాటిని కోల్పోతారు. కొత్త చట్టం అమలుచేస్తే సంక్షేమ పథకాలకు లక్ష కోట్లడాలర్లు కోతపడుతుందని అధ్యక్ష భవనం రూపొందించిన పత్రమే చెప్పింది. ఈ సొమ్మును దేనికి ఖర్చు చేస్తారో తెలుసా ! అక్రమంగా సరిహద్దు దాటకుండా ఉండేందుకు మెక్సికో సరిహద్దులో ఏర్పాటు చేసిన ఇనుప గోడకు 46బిలియన్‌ డాలర్లు, వలస వచ్చిన వారికి నిర్బంధ శిబిరాల్లో పడకలకు 45బి.డాలర్లు, వలస వచ్చిన వారిని గుర్తించి 2029 నాటికి దేశం నుంచి తరిమివేసేందుకు అవసరమైన మరో పదివేల మంది సిబ్బంది నియామకానికి ఇలా మొత్తం 350 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనున్నారు. కొత్త లేదా పాత విద్యుత్‌ కార్లు కొనుగోలు చేసే వారికి ఇస్తున్న పన్ను రాయితీలు సెప్టెంబరు 30తో ముగుస్తాయి, వాటిని 2032వరకు పొడిగిస్తారు. పార్లమెంటు అనుమతి లేకుండా ప్రభుత్వం అప్పులు చేయటానికి లేదు, ఒక పరిమితి ఉంటుంది. అయితే 1960 నుంచి ఇప్పటికి 78 సార్లు నిబంధనలను సవరించారు. ట్రంప్‌ తొలిసారి పాలనా కాలంలో 8లక్షల కోట్ల మేర కొత్త అప్పు చేసేందుకు నిబంధనలు సడలించారు. ఇలాంటి సవరణలకు రెండు పార్టీలూ సై అంటాయి.


అమెరికా రాజకీయాల్లో బ్లాక్‌మెయిల్‌ చేయటం కూడా మామూలే, పెరోట్‌ కుమార్తె గురించి బుష్‌ తప్పుడు ప్రచారం చేయటం, అదివాస్తవం కాదని నిరూపించుకోలేని స్థితిలో 1992 ఎన్నికల్లో తొలుత పోటీ నుంచి వెనక్కు తగ్గాడు, తరువాత తిరిగి రంగంలోకి వచ్చాడు. బుష్‌ కుటుంబం మీద ఉన్న ఆగ్రహంతో రాస్‌ పెరోట్‌ అనే బిలియనీర్‌ 1992 అధ్యక్ష ఎన్నికలలో రిఫామ్‌ పార్టీ పేరుతో పోటీ చేశాడు. బిల్‌ క్లింటన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (43) జార్జి బుష్‌ రిపబ్లికన్‌ పార్టీ 37.5 శాతం ఓట్లు తెచ్చుకోగా పెరోట్‌కు 18.9శాతం ఓట్లు వచ్చాయి. అయితే అధ్యక్ష ఎన్నికకు కావాల్సిన ఎలక్టరల్‌ కాలేజీలో ఒక్క ఓటూ రాలేదు. ఎలన్‌ మస్క్‌ కూడా బ్లాక్‌మెయిలింగ్‌లో తక్కువ తినలేదు. ఎప్‌్‌స్టెయిన్‌ అనేవాడు బడాబాబులకు పిల్లల్ని తార్చి డబ్బుగడిరచటంలో పేరు మోశాడు. అతగాడి జాబితాలో డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఉన్నట్లు విమర్శలు వచ్చాయి. అనుమానాస్పద స్థితిలో వాడు జైల్లో చచ్చాడు. దాంతో ఎప్‌స్టెయిన్స్‌ ఫైల్స్‌ గురించి దర్యాప్తును మూసివేసి పెద్దలను కాపాడారని గుప్పు మంది. అందే అంశాన్ని ట్రంప్‌తో చెడిన తరువాత మస్క్‌ ముందుకు తెచ్చాడు. ఆ విషయాలు అతగాడికి ఎప్పుడో తెలిసినప్పటికీ గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా సర్వశక్తులూ వడ్డాడు, తన సామాజిక మాధ్యమం ఎక్స్‌ను ఉపయోగించాడు, పెద్ద మొత్తంలో స్వంతంగా సొమ్ము ఖర్చు చేశాడు. అందువలన పార్టీ పెట్టి తమను దెబ్బతీస్తాడనుకుంటున్నటున్న మస్క్‌ను వేరే రూపంలో దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదు.

పార్టీలను ఏర్పాటు చేయటంలోనూ, రాజకీయాల్లో బిలియనీర్లు పాల్గొనటం ఎలన్‌ మస్క్‌తో ప్రారంభం కాలేదు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక అధ్యయనంలో ఫోర్బ్స్‌ రూపొందించిన జాబితా ప్రకారం ప్రపంచంలోని 2072 మంది బిలియనీర్లలో 11శాతం మంది రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు, తమ ప్రభావాన్ని చూపేందుకు ధనికులు ముందుకు వస్తున్నారనటానికి ఇదొక సూచిక. వారు ఎలాంటి విధానాలకు మద్దతు ఇస్తారో కూడా వేరే చెప్పనవసరం లేదు. వారికి ప్రపంచంలో బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ సైద్ధాంతికంగా పెద్దగా తెలియదని తేలింది. ప్రపంచ ధనికుల కేంద్రం అమెరికా అయినప్పటికీ ఇక్కడి బిలియనీర్లు ప్రపంచ సగటు కంటే తక్కువగా కేవలం 3.7శాతమే రాజకీయాల్లో ఉన్నారు. రెండు ప్రధాన పార్టీల్లో వీరు తమను అధ్యక్షపదవి అభ్యర్థులుగా ఎన్నుకోవాలని భారీ మొత్తాల్లో నిధులు ఖర్చు చేశారు.లాస్‌ ఏంజల్స్‌ నగర మేయర్‌ పదవి కోసమే రెండుసార్లు జెబి ప్రిట్జ్‌కర్‌ 35 కోట్ల డాలర్లు ఖర్చు చేశాడంటే అధ్యక్ష పదవికి స్వయంగా లేదా మద్దతు ఇచ్చేవారు ఎంత మొత్తాలు ఖర్చు చేస్తారో అర్ధం చేసుకోవచ్చు. 2022 మధ్యంతర పార్లమెంటు ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలకు బిలియనీర్లు ఇచ్చిన విరాళాల మొత్తం 88 కోట్ల డాలర్లు. అగ్రస్థానంలో ఉన్న ఇరవై మందిలో 14గురు రిపబ్లికన్‌ పార్టీకి ఇచ్చినట్లు తేలింది. వివిధ దేశాల ప్రభుత్వాలలో కొలువుదీరిన వారు 242 మంది కాగా సగటున 2.5 పదవులు చేపట్టారు. మనకు మిరేజ్‌, రాఫేల్‌ యుద్ద విమానాలు అమ్మిన కంపెనీ యజమాని సెర్గీ దసాల్ట్‌ ఫ్రాన్సులో ఏకంగా 16 పదవుల్లో పని చేశాడు. తన భార్య రాఫేల్‌ పేరునే విమానానికి పెట్టాడు. బిలియనీర్లు నిరంకుశ, నియంత పాలనలోనే ఎక్కువగా పదవుల్లో రాణించారట. అమెరికా బిలియనీర్లలో డెమోక్రాట్ల కంటే రిపబ్లికన్లను సమర్ధించిన వారు రెండున్నరరెట్లు ఎక్కువ, ఐరోపాలో అత్యధికులు మితవాద శక్తుల మద్దతుదార్లు. ఎలన్‌ మస్క్‌ కార్మికవర్గానికి వ్యతిరేకి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో అతగాడి పార్టీ గెలుస్తుందో లేదో చెప్పలేము గానీ ఓట్లను చీల్చితే రిపబ్లికన్‌ పార్టీ బలం తగ్గి డెమోక్రాట్లు లాభపడితే ట్రంప్‌కు అడుగుడుగునా ప్రతిఘటన తప్పదు !
 

Share this:

  • Tweet
  • More
Like Loading...

నియంతృత్వం దిశగా అమెరికా ! మిలిటరీ ముట్టడిలో లాస్‌ ఏంజల్స్‌ నగరం !!

11 Wednesday Jun 2025

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Opinion, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Democratic party, Donald trump, Immigrants, L.A. Mayor Karen Bass, L.A. Riots, Los Angeles, Republican party


ఎం కోటేశ్వరరావు


అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డిసి, ఆర్థిక రాజధాని న్యూయార్క్‌, ప్రపంచ సినిమా హాలీవుడ్‌ రాజధాని లాస్‌ ఏంజల్స్‌. ఇప్పుడు ఈ నగరంపై ముట్టడికి అమెరికా మిలిటరీలోని నేషనల్‌ గార్డ్స్‌, మెరైన్లను అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దించాడు. 1965లో పౌరహక్కుల ప్రదర్శకులను అడ్డుకొనేందుకు అలబామా రాష్ట్రానికి అక్కడి ప్రభుత్వ అనుమతి లేకుండా నాటి అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ కూడా ఇదే మాదిరి మిలిటరీని పంపాడు, ఆ తరువాత ఇదే ప్రధమం. అక్రమ వలసదారులను ఏరివేసే పేరుతో ఇమ్మిగ్రేషన్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసిఇ) సిబ్బంది నగరమంతటా వందలాది మందిని అరెస్టు చేయటాన్ని జనం నిరసిస్తున్నారు. వారిని అణచివేసేందుకు శనివారం నాడు రెండువేల మంది మిలిటరీ నేషనల్‌ గార్డులను పంపిన ట్రంప్‌ సోమవారం నాడు మరో రెండువేల మందితో పాటు , 700 మంది మెరైన్లను కూడా రంగంలోకి దించాడు. తమ అధికారాన్ని అతిక్రమించి మిలిటరీని దించటాన్ని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ న్యూసమ్‌ కోర్టులో సవాలు చేశాడు. నిరసనలను తెలుపుతున్నవారి సమీపంలో ఉన్న జర్నలిస్టులను మిలిటరీ దూరంగా తరిమివేస్తోంది, ప్రజాప్రతినిధులను కూడా ఆ ప్రాంతాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నది. తమ అధ్యక్షుడు వెనక్కు తగ్గేది లేదని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ మరింతగా రెచ్చగొడుతూ ప్రకటించాడు. విదేశీ వ్యతిరేకత, ఉన్మాదాలను రెచ్చగొడుతున్నారు. లాటినోలు ఎక్కువగా ఉన్న పారామౌంట్‌ వంటి చోట్ల నిరసనలు పెద్ద ఎత్తున చెలరేగాయి. స్థానికంగా ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తినపుడు అమెరికాలో మిలిటరీని దించటం అసాధారణం. అలాంటిది కేవలం నిరసన ప్రదర్శనలు జరిగిన వెంటనే ట్రంప్‌ తీసుకున్న ఈ అసాధారణ చర్య ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సి ఉంది. లాస్‌ ఏంజల్స్‌ పాత నగర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు, అనేక పట్టణాల్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి.


ట్రంప్‌ ప్రాజెక్టు 2025పేరుతో అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాల్లో భాగంగా అధికారంలోకి రాగానే అనేక అంశాల్లో వేలు పెట్టాడు, సాధారణ భాషలో చెప్పాలంటే కెలికాడు. అక్రమంగా వలస వచ్చిన వారిని స్వదేశాలకు పంపాలి లేకపోతే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ఇచ్చిన ఆదేశాలతో లాస్‌ ఏంజల్స్‌ నగరం ఇప్పుడు ఆందోళనలతో అట్టుడుకుతోంది. న్యూయార్క్‌ నగరంలో వలస వచ్చిన కుటుంబాలకు చెందిన వారు 59లక్షల మంది ఉండగా తరువాత 44లక్షల మందితో ఈ నగరం ఉంది. మొత్తం జనాభాలో వీరు 33శాతం మంది. కొద్ది రోజులుగా అక్రమ వలసదారుల పేరుతో కొంత మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టటంతో వారంతా వీధుల్లోకి వస్తున్నారు.వారిని అదుపు చేసేందుకు ట్రంప్‌ సర్కార్‌ మిలిటరీని పంపింది. వలసదారులు శత్రుదేశాల మాదిరి లాస్‌ ఏంజల్స్‌ను ఆక్రమించుకున్నట్లుగా చిత్రించి నగరాన్ని విముక్తి చేయాలని ట్రంప్‌ ఆదేశించాడు. ఒక నాడు గొప్పనగరంగా విలసిల్లిన దానిని విదేశీ చొరబాటుదార్లు, నేరగాండ్లు ఆక్రమించినట్లు ట్రంప్‌ వర్ణించాడు. అక్రమ వలసదారులుగా చెబుతున్నవారు అమెరికాలో కోట్లాది మంది ఉన్నారు. అక్కడ తలెత్తిన ఆర్థిక, ఉపాధి సమస్యలను పరిష్కరించటంలో విఫలమైన పాలకులు వలస వచ్చిన వారే అన్నింటికీ కారణమంటూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు, వారిలో ట్రంప్‌ ముందున్నాడు. ఐరోపా దేశాలలో కూడా ఇదే ధోరణి, ఎన్నికల సమస్యగా ఉంది.


ప్రస్తుతం లాస్‌ ఏంజల్స్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది, అణచివేత ఏ రూపం తీసుకుంటుందో, దానికి ప్రతిఘటనలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.చౌకగా పని చేయించుకొని లాభాలు పొందేందుకు అమెరికా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, వ్యవసాయ క్షేత్రాల వారు వలసలను ప్రోత్సహించారు. చట్టబద్దంగా వచ్చిన వారితో పాటు అక్రమంగా వచ్చిన వారిని చూసీ చూడనట్లు అధికార యంత్రాంగం వ్యవహరించింది. ఆర్థిక వ్యవస్థలో వారి పాత్ర తక్కువేమీ కాదు. వ్యవసాయం, సేవారంగం, నిర్మాణ రంగాలలో వారి పాత్ర పెద్దది.అధికారికంగా నమోదు కాని వారి సంఖ్య గురించి అంచనాలు మాత్రమే, కోటి మందికి పైగా ఉంటారని ఒక అంచనా. శ్రామిక శక్తిలో రికార్డుల్లో నమోదు కాని వారితో సహా విదేశాల్లో జన్మించిన కార్మికులు 18.6 శాతం లేదా 2.91 కోట్ల మంది అని 2023 కార్మిక శాఖ వివరాలు తెలిపాయి.అంతకు ముందు ఏడాది 18.1శాతం ఉన్నారు. వీరిలో 47.6 శాతం మంది మెక్సికో, ఇతర లాటిన్‌ అమెరికా దేశాల నుంచి వచ్చిన వారు కాగా25.1శాతం ఆసియా ఖండం నుంచి ఉన్నారు. అధికారికంగా నమోదు కాని వారు 83 లక్షల మంది ఉన్నట్లు, వారిలో 30శాతం మెక్సికో నుంచి మధ్య, దక్షిణ అమెరికా దేశాల నుంచి 20, ఆసియా నుంచి 15శాతం ఉన్నట్లు న్యూయార్క్‌ వలస అధ్యయనకేంద్రం అంచనా వేసింది. రానున్న సంవత్సరాల్లో వంట, ఇంటిపనివారు, డ్రైవర్లు, ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ వంటి పనులు చేసేందుకు డిమాండ్‌ పెరగనుందని చెబుతున్నారు.


కరోనా తరువాత ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు,ద్రవ్యోల్బణం తగ్గటానికి వలస కార్మికులు తోడ్పడ్డారని డల్లాస్‌ ఫెడరల్‌ రిజర్వుబ్యాంకు అధ్యయనం తెలిపింది. అమెరికాలో పుట్టి పెరిగిన వారు ఉద్యోగవిరమణ చేయటం, జననాలరేటు తగ్గిన కారణంగా 2019`21 మధ్య 20లక్షల మంది కార్మికులు తగ్గినట్లు, రానున్న పది సంవత్సరాలలో వలస కార్మికులు లేకపోతే వివిధ రంగాలలో ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణలో ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరికలు వెలువడ్డాయి.జనాభాలో వలస వచ్చిన వారు 13.8శాతం, వీరిలో కొందరు వాణిజ్యాలను కూడా ప్రారంభించారు, వారి ద్వారా 2022 ఒక్క ఏడాదే 110 బిలియన్‌ డాలర్ల రాబడి వచ్చింది.అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే ప్రకారం వలస వచ్చిన వారు ఫెడరల్‌ ప్రభుత్వానికి 2022లో 383 బిలియన్‌ డాలర్లు, రాష్ట్ర, స్థానిక సంస్థలకు 196 బిలియన్‌ డాలర్లు రాబడి చేకూర్చారు. నమోదు కాని కార్మికులు, ఆదాయ, సామాజిక భద్రత పన్నులే మొత్తం వందబిలియన్‌ డాలర్లకు పైగా ఉన్నాయి. చిత్రం ఏమిటంటే నిరుద్యోగ, ఆరోగ్యబీమా వారికి వర్తించకపోయినా పన్ను చెల్లించారు. 2033 నాటికి మరో 5.2శాతం వలస కార్మికులు పెరుగుతారని వారి వలన ఏడులక్షల కోట్ల డాలర్ల మేరతోడవుతుందని, జిడిపి 8.7లక్షల కోట్ల డాలర్లు పెరగటంతో పాటు ఫెడరల్‌ ప్రభుత్వానికి 1.2లక్షల కోట్ల పన్ను ఆదాయం పెరిగి, 900బిలియన్‌ డాలర్ల లోటు తగ్గుతుందని అంచనాలు వెలువడ్డాయి.వలస వచ్చిన వారి కారణంగానే స్థానికులకు అందాల్సిస సౌకర్యాలకు కోతపడుతున్నదని కొందరు సర్వేలు, బడ్జెట్ల పేరుతో రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. వలస వచ్చిన వారి గృహవసతి కోసం న్యూయార్క్‌ వంటి నగరాల్లో బడ్జెట్‌ కేటాయింపులు చేస్తూ ఇతరులకు కోతపెడుతున్నారని చిత్రిస్తున్నారు. నిజానికి పైనచెప్పుకున్నట్లుగా వలస వచ్చిన వారి నుంచి వచ్చే రాబడితో పోల్చుకున్నపుడు ఇవి పెద్ద మొత్తాలేమీ కాదు. వారు పని చేస్తున్న పరిశ్రమలు, వాణిజ్య, వ్యవసాయ రంగాల నుంచి వారి సంక్షేమానికి ప్రభుత్వం పన్నులు మరొక రూపంలో అదనంగా నిధులు సేకరించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ వారికి నానాటికీ మరిన్ని రాయితీలు ఇస్తున్నారు తప్ప అదనపు రాబడికి పూనుకోవటం లేదు తక్కువ వేతనాలకు పని చేసే నైపుణ్యం అంతగా అవసరం లేని కార్మికులు ఇప్పుడు అమెరికాకు అవసరమని తెలిసినప్పటికీ ట్రంప్‌ వారి మీద దాడి ప్రారంభించాడు, లబ్ది పొందే కార్పొరేట్లు సహిస్తారా ?

వలస కార్మికులను వెనక్కు పంపుతానని ట్రంప్‌ పెద్ద ప్రకటనలు చేస్తున్నాడు.అందరినీ పంపాలంటే ఏడాదికి 500 బిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతాయని, రానున్న పది సంవత్సరాలలో కార్మికుల కొరత ఏర్పడుతుందని, జిడిపి 5.1లక్షల కోట్ల డాలర్లు తగ్గుతుందని తెలిసినా వ్యాపారవేత్త, లాభనష్టాలు తెలిసిన ట్రంప్‌ అలాంటి పనులకు ఎందుకు పాల్పడుతున్నట్లు ?ఎన్నికలకు ముందే వలస కార్మికులను పంపివేస్తానని ట్రంప్‌ వాగ్దానం చేశాడు. ఇప్పుడు లాస్‌ ఏంజల్స్‌ నగరంలో చిచ్చు పెట్టాడు. సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ డిమాండ్‌ చేశాడు, ట్రంప్‌ చర్య రాష్ట్ర సార్వభౌమత్వాన్ని హరించటమే అన్నాడు. శాంతి భద్రతలకు విఘాతం కలగాలని వాంఛిస్తున్న ట్రంప్‌కు అలాంటి అవకాశం ఇవ్వవద్దని పౌరులను కోరాడు. నగర మేయర్‌ కరేన్‌ బాస్‌ కూడా గవర్నర్‌ను సమర్దిస్తూ ట్రంప్‌ చర్య అశాంతిని రెచ్చగొట్టినట్లు ఆమె వ్యాఖ్యానించారు. నగర కౌన్సిల్లోని 15 మంది సభ్యులు కూడా మిలిటరీ చర్యను ఖండిరచారు. వారి వైఫల్యం కారణంగానే తాను మిలిటరీని పంపినట్లు ట్రంప్‌ సమర్ధించుకున్నాడు.ట్రంప్‌ను సమర్ధించే మితవాద మీడియా నిరసన తెలుపుతున్నవారి మీద దుమ్మెత్తిపోస్తూ వార్తలు ఇస్తున్నది.

2024 నవంబరులో నగరపాలక సంస్థ వలసదారులను రక్షించేందుకు ‘‘ శరణ నగరం ’’ అని ఏకగ్రీవంగా తీర్మానించింది. వలస నిరోధ అధికారులను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం చేశారు. అంతకు ముందు వలసదారులను బహిష్కరిస్తామని ట్రంప్‌ వాగ్దానం చేశాడు. మిలిటరీని దించటాన్ని డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన 22 రాష్ట్రాల గవర్నర్లు ఒక ప్రకటనలో ఖండిరచారు. ట్రంప్‌ అధికార దుర్వినియోగం, దుర్మార్గమైన, విభజించే చర్య అన్నారు. మెక్సికన్లు లాస్‌ ఏంజల్స్‌ నగరంలో నివశించటాన్ని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్‌ సమర్ధించారు. వారు మంచి వారు, నిజాయితీ పరులు, నేరస్తులు కాదు, తమ కుటుంబాలకు తోడుగా ఉండేందుకు, మెరుగైన జీవితం కోసం వారంతట వారే వెళ్లారని ఆమె అన్నారు. నిరసనకారులు అమెరికా పతాకాలతో పాటు మెక్సికో జాతీయ జెండాలను కూడా ప్రదర్శించుతున్నారు. వాటిని చూపుతూ చూడండి విదేశీయులు మన దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారో వారిని బయటికి పంపవద్దా అంటూ రెచ్చగొడుతున్నారు. తాము అమెరికాకు వలస వచ్చామని, ఇక్కడే పిల్లలను కని పౌరులమయ్యామని తమ వారసత్వానికి చిహ్నంగా మెక్సికో పతాకాలను ప్రదర్శిస్తూ దమనకాండకు నిరసన తెలుపుతున్నట్లు ప్రదర్శకులు సమర్ధించుకుంటున్నారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిని రెచ్చగొట్టేందుకు ముసుగులు ధరించిన రహస్య పోలీసులను వినియోగించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిరసనకారులు అనుమానం వచ్చి ఎవరని ప్రశ్నిస్తే సమాధానం లేకపోగా బెదిరింపులకు దిగుతున్నారు.ముసుగులు ధరించిన ఐసిఇ సిబ్బంది ఒక రెస్టారెంటులో చొరబడి వంటవారిని అదుపులోకి తీసుకోవటంతో కస్టమర్లు అడ్డం తిరిగి ప్రశ్నించారు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో. అవాంఛనీయ చర్యలకు పాల్పడి ఆ నెపాన్ని వలస కార్మికులు మీద నెట్టే కుట్ర కనిపిస్తోంది. ఇలాంటి దుర్మార్గం ఫాసిస్టులు మాత్రమే చేయగలరన్నది చరిత్ర చెప్పిన సత్యం. తమకు అడ్డు పడితే గవర్నర్‌, నగర మేయర్లనూ అరెస్టు చేస్తామని ట్రంప్‌ యంత్రాంగం బెదిరించింది. ఈ దమనకాండకు నిరసనగా అనేక నగరాల్లో ప్రదర్శనలు జరపాలని పిలుపు నిచ్చారు. కార్మిక నేతల అరెస్టును కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిరది. వలస వచ్చిన వారిపై రాజ్యమే హింసాకాండకు పూనుకుందని కార్మిక సంఘాలు విమర్శించాయి. అనేక మంది స్థానిక అమెరికన్లు వలస వచ్చిన వారు తమ సోదరులే అంటూ మద్దతు తెలుపుతున్నారు. దమనకాండ అమెరికా విలువలకే వ్యతిరేకమని టీచర్స్‌ యూనియన్‌ ఒక ప్రకటనలో విమర్శించింది. ట్రంప్‌ జారీ చేస్తున్న ఆదేశాలను చూస్తుంటే నియంతృత్వంవైపు దేశాన్ని నడిపిస్తున్నట్లుందని డెమోక్రటిక్‌ సోషలిస్టు సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ విమర్శించాడు.ఒకవైపు ప్రతికూల పన్నులతో ప్రపంచ దేశాల మీద దాడికి దిగిన ట్రంప్‌ దేశీయంగా వలసలు వచ్చారనే పేరుతో మిలిటరీ దాడులకు దిగాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ముదురుతున్న సమస్యలకు ప్రతిరూపాలే ఈ దాడులు. అందువలన అమెరికా సాధారణ పౌరులతో పాటు యావత్‌ ప్రపంచమూ డోనాల్డ్‌ ట్రంప్‌ దుర్మార్గాలపై గళమెత్తాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా అధ్యక్ష ఎన్నికలు-డోనాల్డ్‌ ట్రంప్‌ ముందు పెను సవాళ్లు !

13 Wednesday Nov 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

#US Elections 2024, Democratic party, Donald trump, Kamala Harris, Republican party

ఎం కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్ష, పార్లమెంటు ఉభయ సభల మధ్యంతర ఎన్నికలు నవంబరు ఐదున జరిగాయి.అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టరల్‌ కాలేజీలో డోనాల్డ్‌ ట్రంప్‌ 312, కమలా హారిస్‌ 226 స్థానాలు తెచ్చుకున్నారు. ప్రజాప్రతినిధుల సభ సభ్యుల సంఖ్య 435కాగా మెజారిటీ 218, రిపబ్లికన్లు 217, డెమోక్రాట్లు 209స్థానాల్లో ముందంజ లేదా గెలిచారు. ఎన్నికలకు ముందు రిపబ్లికన్లు 222,డెమోక్రాట్లు 213 స్థానాలు కలిగి ఉన్నారు. ఎగువ సభ సెనేట్‌లో మెజారిటీకి 51స్థానాలు అవసరం కాగా రిపబ్లికన్లకు 53, డెమోక్రాట్లకు 45, ఇతరులు రెండు సీట్లు గెలుచుకున్నారు. గతంలో డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చిన ఇద్దరు స్వతంత్ర సెనెటర్లు ఈ సారి ఎన్నికల్లో పాల్గొనలేదు. ఆ స్థానాలను రిపబ్లికన్లు గెలుచుకున్నారు. ఇక రాష్ట్రాల వారీగా డెమోక్రాట్లు 23, రిపబ్లికన్లు 27 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ముందుకు వచ్చిన కొన్ని అంశాలను చూద్దాం.ఎన్నికల పండితులు చెప్పిన జోశ్యాలు నిజం కాలేదు.కృత్రిమ మేథను ఉపయోగించి కొందరు రూపొందించిన అంచనాలు కూడా తప్పాయి.ఈ పండితులంతా గతంతో పోల్చితే మా అంచనాలు దగ్గరగా ఉన్నాయనే కొత్త వాదనను ముందుకు తీసుకువచ్చారు.

సర్వేల అంచనాలకు భిన్నంగా ట్రంప్‌ గెలవటం గురించి మధనం జరుగుతున్నది. అతగాడు గెలిచినప్పటికీ ఓటింగ్‌ సరళిని చూసినపుడు కార్మికుల హక్కులు, అబార్షన్లకు వ్యతిరేకంగా, ఇతర పురోగామి విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా పరిగణించాల్సిన అవసరం లేదన్నది ఒక అభిప్రాయం.గత ఎన్నికల్లో జోబైడెన్‌కు 8.128కోట్ల ఓట్లు (51.3శాతం) రాగా ట్రంప్‌కు 7.422 కోట్లు(46.8శాతం) వచ్చాయి.ఈసారి 95శాతం లెక్కింపు పూర్తయ్యే సమయానికి ట్రంప్‌కు 7.54కోట్లు(50.2శాతం), కమలకు 7.23కోట్ల ఓట్లు(48.2శాతం) వచ్చాయి. గతంలో వచ్చిన వాటిలో కోటి ఓట్లను డెమోక్రటిక్‌ పార్టీ కోల్పోయింది. కార్మికులకు ప్రాధాన్యత, జాతి, లింగవివక్షకు వ్యతిరేకమైన విధానాలకు ఓటర్లు స్పష్టమైన ధోరణి, మద్దతు కనపరిచారని వివిధ రాష్ట్రాల ఓటింగ్‌ తీరుతెన్నులను విశ్లేషించిన ఎకనమిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ విశ్లేషణ పేర్కొన్నది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు విధానాలను రూపొందించే క్రమంలో ఈ ధోరణి ముఖ్యపాత్ర వహిస్తుందని చెప్పింది. ఐదు రాష్ట్రాలు వేతన సంబంధిత సమస్యల మీద ఓట్లు వేశాయి. 2009 నుంచి జాతీయ స్థాయిలో కనీసవేతనాలు పెంచకపోయినా 30 రాష్ట్రాలు, 63 స్థానిక సంస్థలు తమ ప్రాంతాల్లో కనీసవేతనాలను పెంచాయి. తాజా ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలలో కనీసవేతనం గంటకు 15డాలర్లు ఉండాలన్న వైఖరికి మద్దతు తెలిపారు. మహిళల్లో ఉన్న వాంఛలను ప్రతిబింబిస్తూ ఏడు రాష్ట్రాలు తమ రాజ్యాంగాల్లో అబార్షన్‌ హక్కును పొందుపరిచాయి. ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగాలని, తలిదండ్రులకు ఓచర్ల రూపంలో డబ్బులిచ్చి బాధ్యతను వదిలించుకోవాలని చూస్తున్న ధోరణులను మూడు రాష్ట్రాలలో తిరస్కరించారు. కార్మిక సంఘాల ఏర్పాటులో కంపెనీల జోక్యం ఉండకూడదని కోరేవారు విజయాలు సాధించటం కార్మికుల వైఖరిని వెల్లడిరచింది.

కొన్ని వైరుధ్యాలు కూడా ఈ ఎన్నికల్లో వెల్లడయ్యాయి.అబార్షన్‌ హక్కు లేదని సుప్రీం కోర్టు చెప్పినదానిని ట్రంప్‌ తలకెత్తుకున్నప్పటికీ మహిళలు ఓటు వేయటం, గంటకు కనీస వేతనంగా ఉన్న 7.5డాలర్లను స్వల్పంగా అయినా పెంచుతారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ట్రంప్‌ నిరాకరించినా కార్మికులు కొంత మంది మద్దతు ఇవ్వటం వంటి అంశాలు ఉన్నాయి. గతంలో పురోగామి విధానాలకు ఓటు వేసిన చోట కూడా ఈ సారి డెమోక్రాట్లను కాదని ట్రంప్‌కు వేశారని తేలింది. ఎలక్టరల్‌ కాలేజీ వ్యవస్థ కారణంగా స్వింగ్‌ స్టేట్స్‌ను తమవైపు తిప్పుకొనేందుకే డెమోక్రాట్లు కేంద్రీకరించటం, రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న రాష్ట్రాలను పెద్దగా పట్టించుకోలేదని తేలింది. అదే సమయంలో ట్రంప్‌ తనకు వ్యతిరేకంగా డెమోక్రాట్లు బలంగా ఉన్న రాష్ట్రాలను 2022లో, తాజాగా కూడా వదల్లేదు, దాంతో ప్రజాప్రతినిధుల సభలో కొన్ని స్థానాలను అక్కడ గెలిచినట్లు ఫలితాలు వెల్లడిరచాయి.ఈ రాష్ట్రాలలో గెలిచిన స్థానాలతో దిగువ సభలో మెజారిటీ సాధిస్తే అది డెమోక్రాట్ల లోపంగానే చెప్పాల్సి ఉంటుంది. ఈసారి కార్పొరేట్లు భారీ ఎత్తున ట్రంప్‌కు మద్దతుగా డబ్బు సంచులను దింపాయి. రాష్ట్రాల కార్మిక చట్టాల నుంచి తమ డ్రైవర్లను మినహాయించాలంటూ ఉబెర్‌,లిప్ట్‌ కంపెనీలు కాలిఫోర్నియాలో కోట్లాది డాలర్లను ఖర్చు చేశాయి. డబ్బు, సోషల్‌ మీడియా, టీవీలు, పత్రికలు పెద్ద ఎత్తున చేసిన ప్రచారానికి కూడా డెమాక్రాటిక్‌ పార్టీ మద్దతుదార్లుగా ఉన్న ఓటర్లు ప్రభావితమై కొందరైనా ట్రంప్‌కు ఓట్లు వేశారు. మరొక అభిప్రాయం ప్రకారం తమను విస్మరించిన డెమోక్రాట్లకు గుణపాఠం చెప్పేందుకు కసితో ట్రంప్‌కు మద్దతు ఇచ్చినట్లు చెబుతున్నారు.ఈ వ్యతిరేకతను గుర్తించటంలో ఆ పార్టీ నాయకత్వం విఫలమైంది. రిపబ్లికన్‌ పార్టీ నాయకత్వం పచ్చిమితవాదంతో, కార్మిక వ్యతిరేక వైఖరితో ఉంటుంది. ఎలాగైనా గెలవాలని అనుకున్న ట్రంప్‌ తన ఎత్తుగడలను మార్చాడు. ఒకవైపు అబార్షన్ల హక్కును సుప్రీం కోర్టు తిరస్కరించటాన్ని సమర్ధిస్తూనే మరో వైపు తాను అధికారానికి వస్తే ఫెడరల్‌ ప్రభుత్వం తరఫున అబార్షన్లపై నిషేధం విధించనని ప్రకటించి కొందరు మహిళలను ఆకట్టుకున్నాడు. అయితే అధికారానికి వచ్చిన తరువాత అతగాడి నిజస్వరూపం వెల్లడి అవుతుంది.మరోసారి పోటీ చేసే అవకాశం లేదు గనుక నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఎంతగా అణచివేస్తే అంతగా కార్మికవర్గం ప్రతిఘటిస్తుంది. డెమోక్రాట్లు కాడిపడవేసినంత మాత్రాన కార్మికవర్గం నీరుగారిపోతుందని అనుకుంటే పొరపాటు. అవసరమైతే కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుంటారు, కార్మికుల తరఫున రాజీలేకుండా పోరాడేశక్తులను ముందుకు తెస్తారు. అంతర్గత విధానాలు, విదేశీ విధానాలను జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాతే ట్రంప్‌ ప్రకటిస్తాడు. అప్పటి వరకు వివిధ దృశ్యాలను ఊహించుకుంటూ సాగించే విశ్లేషణలే వెలువడతాయి.

అమెరికా ఎన్నికల గురించి సర్వేలు ఎందుకు విఫలమయ్యాయి అనే చర్చ కూడా ప్రారంభమైంది.పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుందని, ఓడిపోతే కేసులు దాఖలు చేసేందుకు ట్రంప్‌ మద్దతుదారులు అన్నీ సిద్దం చేసుకున్నారని చెప్పారు, తీరా చూస్తే ట్రంప్‌ తిరుగులేని మెజారిటీతో నెగ్గాడు. సర్వేలు, పండితులు అతగాడిని ఎందుకు తక్కువ అంచనా వేశారంటూ ఇప్పుడు మరో చర్చ మొదలైంది. ఎందుకు తప్పుడు ఫలితాలు వచ్చాయంటే సర్వేల్లో డెమోక్రాట్లు ఎక్కువగా పాల్గొన్నందున అని ఒక సాకు చెబుతున్నారు. సర్వేలన్నీ పోటాపోటీ ఉందని, స్వల్ప మెజారిటీతో కమలాహారిస్‌ గెలుస్తారని, పోటీ తీవ్రంగా ఉన్న స్వింగ్‌ స్టేట్స్‌లో కూడా నాలుగింట ఆమెకే మెజారిటీ ఉందని కొద్ది గంటల్లో ఓటింగ్‌ ప్రారంభానికి ముందు కూడా చెప్పాయి. ఈ సారే కాదు, 2016, 2020,2022 ఎన్నికల్లో కూడా అంచనాలు తప్పాయి.కోల్పోయిన తమ విశ్వసనీయతను పునరుద్దరించుకొనేందుకు ఈ సారి తమ పద్దతులను సవరించుకొని కచ్చితంగా ఉండేట్లు చూస్తామని సర్వే సంస్థలు ప్రకటించాయి. ఆచరణలో అదేమీ కనిపించలేదు. అన్ని స్వింగ్‌ స్టేట్స్‌లో ట్రంప్‌ ఆధిక్యతలో ఉన్నాడు.ఒక విశ్వవిద్యాలయంలో చరిత్రకారుడిగా పనిచేస్తున్న అలాన్‌ లిచ్‌మన్‌ తాను 13అంశాలను పరిగణనలోకి తీసుకొని గత పన్నెండు అధ్యక్ష ఎన్నికల గురించి చెప్పిన జోశ్యాల్లో 11సార్లు నిజమైందని ఈ సారి కమలాహారిస్‌ గెలుస్తారని తాను చెప్పింది తిరగబడిరదని అంగీకరించాడు. తన పద్దతి గురించి మరోసారి సరిచూసుకుంటానని చెప్పాడు. రెండు వారాల క్రితం ట్రంప్‌ గెలుస్తాడని చెప్పిన 538 సంస్థ అధిపతి సిల్వర్‌ అనే మరో ఎన్నికల పండితుడు ఎన్నికలకు కొద్ది గంటల ముందు స్వల్పతేడాతో కమల గెలుస్తారని చెప్పాడు. అమెరికా ఎన్నికల్లో బెట్టింగ్‌ బంగార్రాజులు కాసిన పందేల విలువ 360కోట్ల డాలర్లని ఒక అంచనా. ఇవి బహిరంగంగా ప్రకటించిన మేరకు వచ్చిన వివరాలు మాత్రమే, ఇంకా ఇంతకంటే భారీ మొత్తాల్లోనే పందాలు ఉన్నాయి. వెల్లడైన సమాచారం మేరకు ఎక్కువ మంది ట్రంప్‌ గెలుపు మీదనే పందాలు కాశారు. అంటే ఎన్నికల పండితుల కంటే జూదగాండ్లే జనం నాడిని బాగా పసిగట్టినట్లు తేలింది. ఎన్నికల రోజున ఐదు జూద కంపెనీలు ట్రంప్‌ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేల్చాయి. ఓటింగ్‌ ముగిసిన తరువాత ట్రంప్‌ మీద పందాలు విపరీతంగా పెరిగాయి.

ఎన్నికల పండితులు, కృత్రిమ మేథకంటే ఒక పిల్ల హిప్పోపోటోమస్‌ ఎన్నికల ఫలితాన్ని కచ్చితంగా చూపిందని సామాజిక మాధ్యమంలో సందేశాలు వెల్లువెత్తాయి. థాయ్‌లాండ్‌లోని ఒక జంతు ప్రదర్శనశాలలో ఉన్న మూ డెంగ్‌ అనే పిల్ల హిప్పోపోటోమస్‌కు భవిష్యత్‌ను చెప్పే అద్భుతశక్తులు ఉన్నట్లు ప్రచారం జరిగింది. అమెరికా ఎన్నికల్లో గెలిచేది ఎవరో తేల్చాలంటూ దాని ముందు రెండు పళ్లాలలో కేకుతోపాటు పుచ్చకాయలు పెట్టి ఒకదాని మీద కమల హారిస్‌, మరొకదానికి మీద డోనాల్డ్‌ ట్రంప్‌పేరు రాసి పెట్టారట.ఏ పళ్లంలోని కేకును తింటే ఆ పేరుగల అభ్యర్థిగెలుస్తారన్న నమ్మకం దాని వెనుక ఉంది. పెద్దగా ఆలోచించకుండా ట్రంప్‌ పేరు రాసిన పుచ్చకాయ కేకును మూ డెంగ్‌ తినటంతో ట్రంప్‌ గెలుస్తాడంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పిల్ల హిప్పోపోటోమస్‌ తల్లి మాత్రం కమల పేరున్న పుచ్చకాయ తిన్నదట. పిచ్చి ఎంత పతాకస్థాయికి చేరిందంటే ఆ పిల్ల జంతువును చూసేందుకు ఒక అమెరికన్‌ మహిళ 20గంటలు ప్రయాణించి ఆ జంతు ప్రదర్శనశాలకు వచ్చి పులకించిపోయిందట. దరిద్రం ఏమిటంటే తమ నాయకురాలి పేరున్న ప్లేట్‌వైపు చూడనందుకు మూ డెంగ్‌ గురించి డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదార్లు పెద్ద ఎత్తున ప్రతికూల ప్రచారం చేశారట. మరొక పిచ్చి చర్య ఏమంటే కృత్రిమ మేథతో పనిచేసే చాట్‌ జిపిటిని ఎవరు గెలుస్తారని అడిగితే ట్రంప్‌ లేదా కమల ఇద్దరూ అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టరని చెప్పిందట. మూడవ పక్షం కింగ్‌ మేకర్‌ అవుతుందని కూడా సెలవిచ్చింది. ఆన్‌లైన్‌ ఒరాకిల్‌ అయితే పట్టణాల్లో హింసాకాండ చెలరేగుతుందని జోశ్యం చెప్పింది.

అమెరికాలో ఎన్నికల జోశ్యాలు 1880దశకం నుంచి ప్రారంభమయ్యాయి.ఎక్కువ భాగం వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో బోల్తాపడ్డాయి.2016లో హిల్లరీ క్లింటన్‌కు ఓట్లు ఎక్కువగా వస్తాయని, ఆమేరకు ఎలక్టరల్‌ కాలేజీలో కూడా మెజారిటీ తెచ్చుకుంటారని సర్వే సంస్థలన్నీ చెప్పాయి. మొదటిది మాత్రమే నిజమైంది, రెండవదానిలో అంచనాలు తప్పాయి. డోనాల్డ్‌ ట్రంప్‌కు ఓట్లు తక్కువ, ఎలక్టరల్‌ కాలేజీలో గెలుపుకు అవసరమైన ఓట్లు ఎక్కువ వచ్చాయి. 2020 ఎన్నికల్లో జో బైడెన్‌ గెలుస్తాడని చెప్పినప్పటికీ అసాధారణ మెజారిటీ తెచ్చుకుంటారని చెప్పిన జోశ్యాలు తప్పాయి.2022లో జరిగిన పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఉభయ సభల్లోనూ రిపబ్లికన్లు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారని చెప్పినప్పటికీ అలా జరగలేదు.సాధారణ మెజారిటీ 2018 కాగా రిపబ్లికన్లకు 222 మాత్రమే వచ్చాయి. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో డెమోక్రాట్లు సెనెట్‌ను 5149 మెజారిటీతో గెలుచుకున్నారు. మరింత శాస్త్రీయ పద్దతిలో సర్వేలు నిర్వహించాలని అనేక మంది చెప్పారు, రానున్న రోజుల్లో ఏ పద్దతిని అనుసరిస్తారో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హత్యాయత్నం ట్రంప్‌కు కలసివచ్చింది : అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పు ఎవరి నుంచి ?

17 Wednesday Jul 2024

Posted by raomk in COUNTRIES, Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#US Elections 2024, Donald trump, JD Vance, Joe Biden, Profits from Terror, Republican party, Threat to democracy



ఎం కోటేశ్వరరావు


” అమెరికా మీద దాడి జరుగుతోంది, ముట్టడిలో ఉంది, ప్రజాస్వామ్యాన్ని హతమార్చేందుకు చూస్తున్నారు.చీకటి అధ్యాయానికి నాంది ” మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హత్యాయత్నంపై వెలువడిన తక్షణ వ్యాఖ్యలివి.అతగాడు ప్రాణాపాయం నుంచి కొద్దిలో తప్పించుకున్నాడు.శనివారం నాడు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం బట్లర్‌ అనే పట్టణంలో ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా ఒక దుండగుడు జరిపిన కాల్పులో ట్రంప్‌కు కుడి చెవి దగ్గర బుల్లెట్‌ గాయం తగిలింది.దుండగుడి కాల్పుల్లో సభికుల్లో ఒకరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హంతకుడిని వెంటనే భద్రతా దళాలు కాల్చి చంపాయి. సభ సమీపంలోని ఒక భవనంపై మాటువేసి కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. ఈ ఉదంతం తరువాత అమెరికా రాజకీయాలు, ఎన్నికల్లో ఏం జరగనుందనే చర్చ మొదలైంది.దీనికి ముందు డెమోక్రటిక్‌ అభ్యర్ధి జోబైడెన్‌ వృద్దాప్యం గురించి, పోటీ నుంచి తప్పుకొని ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ లేదా మరొకరికి అవకాశం ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. హత్యాయత్నంతో సానుభూతి తలెత్తి ట్రంప్‌ విజయావకాశాలు మెరుగుపడినట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యంలో పార్టీల నేతలు, ఎన్నికల్లో అభ్యర్థులపై ౖ జరిగేదాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఎన్నికల్లో ప్రత్యర్థి జో బైడెన్‌ వెంటనే ఖండించాడు. ట్రంప్‌పై దాడిని వివిధ దేశాల నేతలు ఖండించారు. దుండగుడు ఇరవై ఏండ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారుగా నమోదై ఉన్నాడు. గతంలో డెమోక్రటిక్‌ పార్టీకి విరాళం ఇచ్చిన దాఖలా కూడా వెల్లడైంది. ఎందుకు కాల్పులు జరిపాడో వెంటనే తెలియలేదు. క్రూక్స్‌కు తొలిసారిగా ఓటు హక్కు వచ్చింది. తాను ట్రంప్‌ను, రిపబ్లికన్‌ పార్టీని కూడా వ్యతిరేకిస్తున్నట్లు అతడు చెప్పాడన్న వార్తలు కూడా వచ్చాయి. కేవలం ఈ మాత్రానికే దాడికి పాల్పడతాడా ? దీని వెనుక డెమోక్రటిక్‌ పార్టీ,ట్రంప్‌ మరోసారి అధికారానికి రాకూడదని కోరుకుంటున్న ప్రభుత్వంలోని వారు, రష్యా, చైనా, ఇరాన్‌, ఉత్తర కొరియా దేశాల హస్తం ఉండవచ్చా అనే సందేహాలను కూడా కొందరు లేవనెత్తినట్లు చెబుతున్నారు. దుండగుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది.ఉగ్రవాదం నుంచి కూడా పెట్టుబడిదారులు ఎలా లాభాలు పొందుతారో ట్రంప్‌పై కాల్పుల ఉదంతం వెల్లడించింది. ఈ ఉదంతం తరువాత ట్రంప్‌ మీడియా మరియు టెక్నాలజీ గ్రూపు కంపెనీల వాటాల ధరలు సోమవారం నాడు 55శాతం పెరిగాయి, ఒక దశలో 71శాతాన్ని తాకాయి. ఈ కారణంగా ట్రంప్‌ సంపద విలువ ఒక్క రోజులోనే రెండు బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఈ కంపెనీ ట్రంప్‌ సామాజిక మాధ్యమ ప్రచారాన్ని నిర్వహించే ట్రూత్‌ సోషల్‌ వేదికను కూడా నిర్వహిస్తున్నది. అనేక కంపెనీల వాటాల ధరలు కూడా పెరిగాయి. దీని అర్దం ఏమిటి ? ట్రంప్‌ ఎన్నిక అవకాశాలు పెరిగినట్లు పెట్టుబడిదారులు భావించటమే దీనికి కారణం. ట్రూత్‌ సోషల్‌ను అనుసరించే వారు కూడా గణనీయంగా పెరగటంతో నష్టాల్లో ఉన్న ఈ కంపెనీ రానున్న రోజుల్లో లాభాల బాట పట్టినట్లే. తుపాకులు, తూటాలు తయారు చేసే కంపెనీల వాటాల ధరలు కూడా పెరిగాయి. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిగా డోనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్ష అభ్యర్థిగా ” ఆంధ్రా అల్లుడు ” జెడి వాన్స్‌(39) ఎంపికయ్యారు.(ఎగువ చిత్రంలో ట్రంప్‌తో కలసి ఉన్నవ్యక్తి) వాన్స్‌ ఆంధ్రప్రదేశ్‌ మూలాలున్న ప్రవాస భారత కుటుంబానికి చెందిన న్యాయవాది ఉషా చిలుకూరిని వివాహం చేసుకున్నాడు.


ట్రంప్‌పై దాడి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిలో కొందరు మూడు సంవత్సరాల క్రితం 2021జనవరి ఆరవ తేదీన అమెరికా అధికార కేంద్రంపై దాడికి తన మద్దతుదార్లను పంపిన డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్వాకాన్ని విస్మరించారు. ట్రంప్‌పై దాడి వ్యక్తిగతం, కానీ అతగాడి మద్దతుదార్ల చర్య మొత్తం అమెరికా అధికార, ప్రజాస్వామిక వ్యవస్థనే అపహాస్యం పాలు చేసిందనే అంశాన్ని మరిచిపోరాదు. అమెరికా, దాని ప్రజాస్వామ్యం మీద అసలైన దాడి అది.అమెరికాలో నలుగురు అధ్యక్షులను తుపాకి తూటాలు బలితీసుకున్నాయి. కొంత మంది అధ్యక్షులు తృటిలో తప్పించుకున్నారు, ఇటీవలి కాలంలో రాజకీయపరమైన దాడులు మరింతగా పెరుగుతున్నాయి. కానీ దేశ అధికార కేంద్రంపై ట్రంప్‌ నాయకత్వంలో జరిగిన దాడి చరిత్రలో అదే మొదటిది. తాను ఓడిపోతే ఫలితాలను అంగీకరించేది లేదని ముందుగానే అపర ప్రజాస్వామికవాది ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓడిపోయిన తరువాత విజేతను అధికారికంగా ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని జరగకుండా చూసేందుకు, జో బైడెన్‌ గద్దెనెక్కకుండా చేసేందుకు ట్రంప్‌ చేసిన కుట్రలో భాగమది. అంతే కాదు దేశీయ ఉగ్రవాదం అనే కోణంలో ఎఫ్‌బిఐ, ఇతర చట్టాన్ని అమలు జరిపే సంస్థలు చూశాయి. దాడికి ముందు అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు కొద్ది దూరంలో తన మద్దతుదారులతో సమావేశం జరిపిన ట్రంప్‌ కాపిటోల్‌ను ఆక్రమించాలని, ఎన్నిక నిర్దారించే పత్రాన్ని ఇవ్వకుండా అడ్డుకోవాలని రెచ్చగొట్టి పంపించాడు.ఈ కేసులో కొంత మందికి శిక్షలు పడినప్పటికీ డోనాల్డ్‌ ట్రంప్‌పై విచారణ కొనసాగుతూనే ఉంది. ఎన్నికలలోపు పూర్తయ్యే అవకాశం లేదు, ఒకవేళ ట్రంపు గెలిస్తే అసలు విచారణే ఉండకపోవచ్చు, ఓడితే వచ్చే ఏడాది జరగవచ్చు.


ట్రంప్‌పై దాడి ప్రపంచానికి చూపుతున్నదేమిటి ? అమెరికాలో రాజకీయ విభజన కారణంగా రాజకీయ హింస కూడా పెరుగుతున్నది. దాడి వెనుక మూడు కారణాలున్నట్లు ఒక అభిప్రాయం. ఒకటి, ట్రంప్‌ గెలవ కూడదని కోరుకుంటున్న ప్రభుత్వంలోని వారి హస్తం, ట్రంప్‌ వంటి పచ్చిమితవాది అధికారానికి రాకూడదని కోరుకుంటున్న వామపక్ష తీవ్రవాద శక్తులు, ఎవరితో ప్రమేయం లేకుండా ట్రంప్‌ మీద తలెత్తిన వ్యక్తిగత ఆగ్రహం కారణంగా కాల్పులు జరిపి వుండవచ్చని చెబుతున్నారు. ఈ కారణాలతో రానున్న రోజుల్లో మరిన్ని ప్రయత్నాలు జరగవచ్చన్న హెచ్చరికలు వెలువడ్డాయి. అమెరికా చరిత్రలో రాజకీయ హింసాకాండ నేతలపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. తొలి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్‌. 1865 ఏప్రిల్‌ 14న జాన్‌ విల్కెస్‌ బూత్‌ కాల్చి చంపాడు. నల్ల జాతీయుల హక్కులకు మద్దతు ఇవ్వడమే లింకన్‌ హత్యకు కారణం.బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలలకే అమెరికా 20వ అధ్యక్షుడైన అమెస్‌ గార్‌ఫీల్డ్‌ను హత్య చేశారు. 1881 జూలై 2న వాషింగ్టన్‌ రైల్వే స్టేషన్‌లో నడుస్తుండగా ఛార్లెస్‌ గిటౌ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ప్రజలతో కరచాలనం చేస్తుండగా అమెరికా 25వ అధ్యక్షుడైన విలియం మెకిన్లే 1901 సెప్టెంబర్‌ 1న న్యూయార్క్‌లోని బఫెలోలో హత్యకు గురయ్యారు. 28 సంవత్సరాల నిరుద్యోగ వైద్యుడు కాల్పులు జరిపాడు. 1965 నవంబర్‌లో 35వ అధ్యక్షుడైన జాన్‌ ఎఫ్‌ కెన్నడీ తన సతీమణి జాక్వెలిన్‌తో కలిసి డల్లాస్‌లో పర్యటిస్తుండగా హంతకుడు లీ ఆర్వీ ఆస్వాయిడ్‌ తుపాకీతో కాల్చి చంపాడు. ఈ హత్య గురించి తలెత్తిన అనుమానాలు ఇంతవరకు తీరలేదు, అదొక రహస్యంగా ఉండిపోయింది.
రెండుసార్లు దేశాధ్యక్షుడిగా పనిచేసి, మూడోసారి పోటీకి దిగిన థియొడోర్‌ రూజ్‌వెల్ట్‌పై ప్రచార సందర్భంగా 1912లో మిల్వాకీలో కాల్పులు జరిగాయి. అయితే ఆయనకు తీవ్రమైన గాయాలేవీ కాలేదు. అమెరికా 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ 1933 ఫిబ్రవరిలో మియామీలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిగాయి. ఈ ఘటన నుండి రూజ్‌వెల్ట్‌ తప్పించుకున్నప్పటికీ చికాగో మేయర్‌ ఆంటన్‌ సెర్మాక్‌ చనిపోయాడు. 1950లో 33వ అధ్యక్షుడు హారీ ఎస్‌. ట్రూమన్‌ నివసిస్తున్న బ్లార్‌ హౌస్‌లోకి ఇద్దరు సాయుధులు ప్రవేశించి కాల్పులు జరిపారు. ట్రూమన్‌ తప్పించుకున్నప్పటికీ ఎదురు కాల్పుల్లో అధ్యక్ష భవనం పోలీసు, ఒక దుండగుడు చనిపోయాడు.డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాబర్ట్‌ కెన్నడీని లాస్‌ ఏంజెల్స్‌ హౌటల్‌లో హత్య చేశారు. 1972లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడిన జార్జ్‌ వాలస్‌పై కాల్పులు జరిగాయి. 1975లో 38వ అధ్యక్షుడైన ఫోర్డ్‌ కొన్ని వారాల వ్యవధిలోనే రెండు హత్యాయత్నాల నుండి తప్పించుకున్నారు. 40వ అధ్యక్షుడైన రోనాల్డ్‌ రీగన్‌ 1981 మార్చిలో వాషింగ్టన్‌ డీసీలో జనంలో ఉన్న జాన్‌ హింక్లీ జూనియర్‌ కాల్పులు జరిపాడు. ఆయన కోలుకున్నప్పటికీ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాకు 43వ అధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్‌ బుష్‌ 2005లో జార్జియా అధ్యక్షుడు మిఖాయిల్‌ సాకష్వీతో కలిసి ఓ ర్యాలీకి హాజరు కాగా ఆయనపై చేతి గ్రెనేడ్‌ విసిరారు.అయితే అది పేలకపోవడంతో ఎవరూ గాయపడలేదు.

అమెరికా రాజకీయ ముఖచిత్రాన్ని చూసినట్లయితే కొన్ని అంశాలలో తేడాలున్నప్పటికీ డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీలు రెండూ అక్కడి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పాటుపడేవే. ఇటీవలి కాలంలో రెండు పార్టీల వైఫల్యాలు గతం కంటే ఎక్కువగా జనం నోళ్లలో నానుతున్నాయి. ప్రపంచంలో అమెరికా పెత్తనాన్ని సాగించేందుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి, పరువు పోతున్నది. ఎన్నికల సమయంలో వ్యక్తిగత బలహీనతలు, అవినీతి అక్రమాలను బయటపెట్టుకోవటం ఇటీవలి కాలంలో పెరుగుతున్నది. విధానపరమైన వైఫల్యాలు రెండు పార్టీల్లో ఉండటమే దీనికి కారణం. ఈ పూర్వరంగంలోనే మూడవ అభ్యర్థికి మద్దతు ఇవ్వటం గురించి అమెరికా సమాజంలో చర్చ ప్రారంభమైంది.కాల్పులు జరిగిన వెంటనే రక్తం కారుతున్న ట్రంప్‌ను భద్రతా సిబ్బంది తీసుకువెళుతుండగా ట్రంప్‌ చేయెత్తి తనకేమీ కాలేదన్న సంకేతం ఇచ్చిన ఫొటోను చూపి కొందరు ట్రంప్‌ అభిమానులు తమనేత దేశం కోసం ఒక హీరో మాదిరి నిలబడిన తీరును చూపుతున్నదని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు మరో నాలుగునెలల్లో జరగనున్నందున ప్రచారం మరింత తీవ్రం కానుంది. గురువారం నాడు జరిగే ఒక సమావేశంలో ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని లాంఛనంగా పార్టీ ప్రకటించనుంది. ప్రతిదాన్నీ సొమ్ము చేసుకొనేందుకు ఎదురు చూసే కొందరు గాయపడిన ట్రంప్‌ బమ్మను ముద్రించిన టీ షర్టులను అందుబాటులోకి తెచ్చారు.


ట్రంప్‌ ప్రాజెక్టు 2015పేరుతో ముందుకు తెస్తున్న అజెండా కార్మికవర్గం మీద దాడికి ఉద్దేశించిందని పురోగామి రాజకీయ బృందం హెచ్చరించింది. పౌరహక్కులకు ముప్పు ఏర్పడిందని ఆఫ్రో-అమెరికన్ల కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ట్రంప్‌ కోరిక మేరకు మితవాద హెరిటేజ్‌ ఫౌండేషన్‌ దీన్ని రూపొందించింది. దీన్ని అమలు జరిపేందుకు ట్రంప్‌ నియంతగా మారే అవకాశం ఉందని కూడా పేర్కొన్నది. తాను తిరిగి అధికారానికి వస్తే రాజ్యాంగంలోని కొన్నిసెక్షన్లను తొలగిస్తానని ఏడాది క్రితమే ట్రంప్‌ చెప్పిన అంశాన్ని గుర్తు చేసింది. తొమ్మిది దశాబ్దాల క్రితం చేసిన జాతీయ కార్మిక సంబంధాల చట్టాన్ని వెనక్కు తీసుకుంటామని ట్రంప్‌ తొలిసారి అధికారంలో ఉన్నపుడు నియమించిన బోర్టులో అత్యధికులు కార్మిక వ్యతిరేకులు ఉన్నారు.సోషలిజం విఫలమైందని గతంలో అమెరికా చెప్పింది. కానీ అదే అమెరికాలో ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే భావం విస్తరిస్తోంది.చైనా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాలతో పోల్చి వేస్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు. అక్కడ ధనిక-పేద వ్యత్యాసం పెరిగిపోతోంది. మధ్యతరగతి వర్గం కనుమరుగు అవుతోంది. ఆర్థిక, వలసకార్మికులను అనుమతించే విధానాలపై అసంతృప్తి పెరుగుతున్నది. ఈ పూర్వరంగంలోనే సామాజిక వైరుధ్యాలు పెరుగుతున్నాయి. ఎవరు ఎవరిని ఎప్పుడు ఎందుకు కాల్చిచంపుతారో తెలియదు. తుపాకి లేకుండా జనాలు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. తుపాకి సంస్కృతిని పెంపొందించటం, వాటిని తయారు చేసే కార్పొరేట్లకు లాభాలు సమకూర్చటంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరూ తక్కువ తినలేదు. పామును పాలుపోసి పెంచిన చేతినే అది కాటువేస్తుంది. అందువలన ఆ తుపాకులకు ఎప్పుడు ఎవరు బలౌతారో చెప్పలేని అయోమయ స్థితి నేడు అమెరికాలో ఉంది. ఒక దుండగుడు కాదు, అలాంటి వారిని తయారు చేసిన వ్యవస్థ, దాన్ని కాపాడుతున్నవారే ప్రజాస్వామ్యానికి అసలైన ముప్పు. 2021జనవరి ఆరున తన గుంపును అమెరికా అధికార కేంద్రం మీద దాడికి ఉసిగొల్పిన ట్రంప్‌ నుంచే అసలైన ముప్పుకు నాంది. ఇలాంటి ట్రంపు, అతగాడి ఇతర వెర్రి వేషాలను కూడా అక్కడి మీడియా జనానికి చెప్పటం లేదు. ఇది కూడా అమెరికాకు ముప్పు తెచ్చేదే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా పాలకవర్గాన్ని మరోసారి భయపెడుతున్న సోషలిజం-పార్లమెంటులో తీర్మానాలతో అడ్డుకోగలరా !

28 Tuesday Feb 2023

Posted by raomk in COUNTRIES, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

communism, Democratic party, Republican party, Socialism, US left politics, USA


ఎం కోటేశ్వరరావు


” అమెరికాలోని అనేక మంది జనం, ఐరోపా సోషలిస్టులు ప్రమాదకరంగా కమ్యూనిజానికి దగ్గర అవుతున్నారు.అమెరికా తరహా జీవనానికి ఒక ముప్పుగా మారుతున్నారు.” అమెరికా పత్రిక అట్లాంటిక్‌ 1951 ఫిబ్రవరి సంచికలో ఐరోపాలో సోషలిజం అనే పేరుతో ప్రచురించిన ఒక వ్యాఖ్యానం పై వాక్యాలతో ప్రారంభమైంది. అదే ఫిబ్రవరి రెండవ తేదీ( 2023) న అమెరికా ప్రజాప్రతినిధుల సభ (కాంగ్రెస్‌) సోషలిజం ఘోరాలను ఖండించే పేరుతో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది.సభలోని మొత్తం 219 రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు, 109 మంది డెమోక్రటిక్‌ పార్టీ వారు దానికి అనుకూలంగా ఓటు వేశారు.డెమోక్రాట్లు 86 మంది వ్యతిరేకించగా 14 మంది సభలో ఉన్నా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వ్యతిరేకించిన వారిలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన 86 మందిలో అలెగ్జ్రాండ్రియా ఒకాసియో కార్టెెజ్‌, రషీదా లాయిబ్‌, గోరీ బుష్‌, ఇల్హాన్‌ ఒమర్‌ ఉన్నారు. వీరిని డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీ బలపరిచింది. అక్కడి మీడియా కమ్యూనిస్టులు, సోషలిస్టులని చిత్రించి వారి మీద వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు గత ఎన్నికల్లో చూసింది.ఇల్హాన్‌ ఒమర్‌ గతంలో సామ్రాజ్యవాద, యూదు దురహంకారాన్ని విమర్శించినందుకుగాను ఆమెను పార్లమెంటు విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి తొలగించేంత వరకు రిపబ్లికన్‌ పార్టీ నిదురపోలేదు.


ప్రచ్చన్న యుద్ధంలో సోవియట్‌ను ఓడించాం, సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేశాం, కమ్యూనిజానికి కాలం చెల్లింది, దాన్ని ఏడు నిలువుల లోతున పూడ్చిపెట్టాం అంటూ తమ భుజాలను తామే చరుచుకుంటూ అమెరికా, ఐరోపా, ప్రపంచంలోని యావత్తు కమ్యూనిస్టు వ్యతిరేకులు మూడు దశాబ్దాల నాడే పండగ చేసుకున్నారు. సోషలిజం జరిపిన ఘోరాలను ఖండించాలంటూ అమెరికా పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది అన్నది ఆసక్తి కలిగించే అంశం. బ్రిటన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక 2022 ఆగస్టు 25న ” ప్రతివారూ ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తున్నారు: పెరిగిన యుగోస్లావియా బెంగ ” అనే శీర్షికతో ఒక విశ్లేషణను ప్రచురించింది.యుగోస్లావియా సోషలిస్టు దేశ స్థాపకుడు మార్షల్‌ టిటో ”ఐక్యత, సోదరత్వం ” అనే నినాదం కింద భిన్నమైన తెగలు, మతాల వారితో ఐక్య దేశాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని,1980 టిటో మరణం తరువాత తలెత్తిన జాతీయవాదంతో అది 1992 విచ్చిన్నానికి దారి తీసిందని ఆ పత్రిక పేర్కొన్నది. టిటో కాలంలో అనుసరించిన కొన్ని విధానాలు, వైఫల్యాలు వాటి మీద జనంలో తలెత్తిన అసంతృప్తి, దాన్ని ఆసరా చేసుకొని అమెరికా, ఐరోపా దేశాల గూఢచార సంస్థలు, క్రైస్తవమత పెద్దల కుమ్మక్కు, కుట్రలతో దాన్ని, ఇతర తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన చరిత్ర, దాన్ని రక్షించుకోవాలని జనం కూడా అనుకోకపోవటం మన కళ్ల ముందు జరిగిందే. ఆకాశంలో మబ్బులను చూసి చేతిలోని ముంతనీళ్లు పారబోసుకున్నట్లు ఆ దేశాల్లో పరిస్థితి తయారైంది. ఆకాశంలో కనిపించిన వెండి మబ్బులు వర్షించలేదు. పూర్వపు పెట్టుబడిదారీ వ్యవస్థను జనాల నెత్తిన రుద్దారు. దానికి తోడు యుద్దాలు, అంతర్యుద్ధాలను బోనస్‌గా ఇచ్చారు. ఈ నేపధ్యంలో మూడు దశాబ్దాల తరువాత గార్డియన్‌ పత్రిక 2022 ఆగస్టు 25న చేసిన విశ్లేషణలో ఉనికిలో లేని యుగోస్లావియా గురించి బెంగను, విచ్చిన్నంపట్ల విచారాన్ని వెల్లడించారని పేర్కొన్నది.విడిపోయిన సెర్బియాలో 81శాతం, బోస్నియాలో 77, తొలుతగా ఐరోపా సమాఖ్యలో చేరిన స్లోవేనియాలో 45, కొసావోలో పదిశాతం మంది విచ్చిన్నాన్ని తప్పుపట్టారని వెల్లడించింది.పూర్వపు సోషలిస్టు వ్యవస్థను వర్తమాన పెట్టుబడిదారీ విధానాన్ని పోల్చుకొని నిట్టూర్పులు విడిచేవారిని గురించి కూడా ఉటంకించింది. దీని అర్ధం ఆ దేశాల్లో ఉన్నవారందరూ తిరిగి సోషలిజాన్ని కోరుకుంటున్నారని చెప్పలేము.పెట్టుబడిదారీ ప్రపంచం గురించి కన్న కలలు కల్లలౌతున్నపుడు ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఒక మధనం జరుగుతోంది. సోషలిజం పేరెత్తితే అణచివేసేందుకు ప్రజాస్వామ్యముసుగులో నిరంకుశపాలకులు వారి కళ్ల ముందు ఉన్నారు.


ప్రచ్చన్న యుద్దం, సోవియట్‌ బూచిని చూపి దశాబ్దాల పాటు అమెరికన్లను ఏమార్చిన పాలకులకు 1991 తరువాత అలాంటి తమ పౌరులను భయపెట్టేందుకు వెంటనే మరొక భూతం కనిపించకపోవటంతో ఉగ్రవాద ముప్పును ముందుకు తెచ్చారు.అదీ అంతగా పేల లేదు. ఈ లోగా వారు ఊహించని పరిణామం మరొకటి జరిగింది.సోషలిస్టు చైనా పురోగమనం, దాని మీద అన్ని రకాల వినియోగ వస్తువులకు ఆధారపడటం అమెరికన్లలో కొత్త ఆలోచనకు తెరలేపింది. సోషలిస్టు దేశాల్లో అన్నింటికీ కరువే, ప్రభుత్వం కేటాయించిన మేరకు సరకులు తీసుకోవాలి, దుకాణాలన్నీ ఖాళీ అని చేసిన ప్రచారాన్ని నమ్మిన వారిలో కొత్త ప్రశ్నలు. అదే నిజమైతే అమెరికా, ఐరోపా ధనిక దేశాలన్నింటికీ చైనా వస్తువులను ఎలా అందచేస్తున్నది. అక్కడ ఉపాధిని, ఆదాయాలను ఎలా పెంచుతున్నది అనే మధనం ప్రారంభమైంది.దానికి తోడు అమెరికాలో ఉపాధి తగ్గటం, నిజవేతనాలు పడిపోవటం వంటి అనుభవాలను చూసిన తరువాత మనకు పెట్టుబడిదారీ విధానం వలన ఉపయోగం ఏమిటి ? చైనా, వియత్నాంలో ఉన్న సోషలిజమే మెరుగ్గా కనిపిస్తోంది కదా అన్న సందేహాలు మొగ్గతొడిగాయి. దీనికి తోడు తమ పెరటి తోట అనుకున్న లాటిన్‌ అమెరికాలో తమ ప్రభుత్వం బలపరిచిన నియంతలందరూ మట్టి కరిచారు. సక్రమంగా ఎన్నికలు జరిగిన చోట అమెరికాను వ్యతిరేకించే వామపక్ష శక్తులు అనేక దేశాల్లో ఒకసారి కాదు, వరుసగా అధికారంలోకి రావటాన్ని కూడా అమెరికన్‌ పౌరులు, ముఖ్యంగా యువత గమనిస్తున్నది. సోషలిజం విఫలం అన్న ప్రచారానికి విలువ లేదు గనుక పాలకులు దాన్ని వదలివేశారు. తమ జీవిత అనుభవాలను గమనించిన వారు సోషలిజం సంగతేమో గానీ పెట్టుబడిదారీ విధానం విఫలమైంది, అది మనకు పనికి రాదు అనే వైపుగా ఆలోచించటం ప్రారంభించారు.అనేక విశ్వవిద్యాలయాల్లో, పుస్తక దుకాణాల్లో మూలన పడేసిన కాపిటల్‌ తదితర మార్క్సిస్టు గ్రంధాల దుమ్ముదులిపినట్లు దశాబ్దాల క్రితమే వార్తలు వచ్చాయి. వరుసగా వచ్చిన ఆర్థిక మాంద్యాలకు పెట్టుబడిదారీ దేశాలు ప్రభావితమైనట్లుగా చైనాలో జరగకపోవటం కూడా వారిలో సోషలిజం పట్ల మక్కువను పెంచింది. చైనా తమకు పోటీదారుగా మారుతున్నదన్న అమెరికా నేతల ప్రకటనలూ వారిని ప్రభావితం చేస్తున్నాయి.


ఇదే తరుణంలో అమెరికా రాజకీయవేదిక మీద బెర్నీ శాండర్స్‌ వంటి వారు డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీని ప్రారంభించటం, అవును నేను సోషలిస్టునే అని ప్రకటించి మరీ సెనెట్‌కు గెలవటాన్ని చూసిన తరువాత ఇటీవలి కాలంలో మేమూ సోషలిస్టులమే అని చెప్పుకొనే యువత గణనీయంగా పెరిగింది. అమెరికా అధికార కేంద్రమైన కాపిటల్‌ హిల్‌ ప్రాంతం ఉన్న వార్డు నుంచి పెట్టుబడిదారుల కుంభస్థలం వంటి సియాటిల్‌ నగరంలో వరుసగా మూడు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికైన కమ్యూనిస్టు క్షమా సావంత్‌(49) అనే మహిళానేత ఇచ్చిన ఉత్తేజంతో పాటు, డెమోక్రటిక్‌ పార్టీ నుంచి కొంత మంది పురోగామివాదులుగా ఉన్న వారు అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఎన్నిక కావటం వంటి పరిణామాలు కూడా జరిగాయి.వారు కుహనా వామపక్ష వాదులు అంటూ వామపక్షం పేరుతో ఉన్న కొన్ని శక్తులు కార్పొరేట్‌ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే అందుకున్నాయి. ఎవరు ఎలాంటి వారు అన్నది చరిత్ర చెబుతుంది. ఒక వేళ నిజంగానే కుహనాశక్తులు వామపక్షం ముసుగులో వస్తే అలాంటి వారిని గమనించలేనంత అవివేకంగా అమెరికా కార్మికవర్గం, యువత లేదు.


అందుకే పాలకపార్టీలు రెండూ కంగారు పడుతున్నాయి. లేకుంటే సోషలిజం ఘోరాలను ఖండించేపేరుతో రెండు పార్టీలు ఒకే తీర్మానాన్ని ఎందుకు బలపరుస్తాయి ? కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని, అమెరికాకు తిరుగులేదు అని చేప్పే గొప్పలను నమ్మటానికి అమెరికన్లు సిద్దంగా లేరు.తమ పక్కనే ఉన్న కమ్యూనిస్టు క్యూబాను అమెరికాతో పోల్చితే ఎలుక పిల్ల-డైనోసార్‌ వంటివి. అలాంటి క్యూబా దగ్గర అణ్వాయుధాలు లేవు, స్వంత క్షిపణులు లేవు. నిజానికి అమెరికా తలచుకుంటే ఒక్క నిమిషంలో క్యూబా దీవిని నామరూపాల్లేకుండా చేసే శక్తి ఉంది. అయినప్పటికీ మేము మీకెంత దూరమో మీరు కూడా మాకంతే దూరం అని ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వాన ఉన్న కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. కాస్ట్రో వారసులు ఇప్పటికీ దాన్నే కొనసాగిస్తున్నారు. అమెరికాకు తిరుగులేదు అన్నట్లు చిత్రించే హాలీవుడ్‌ సినిమాల బండారం కూడా ఎరిగిందే. వియత్నాం నుంచి 1975లో బతుకు జీవుడా అంటూ హెలికాప్టర్లు, విమానాల వెంట పరుగులు తీసి పారిపోయి వచ్చిన అమెరికా సైనికులు మరోసారి ఆప్ఘనిస్తాన్‌ తాలిబాన్ల చేతుల్లో కూడా అలాంటి పరాభవాన్నే పొందారంటూ వచ్చిన వార్తలను,దృశ్యాలను అమెరికా యువతీయువకులు చూడకుండా ఉంటారా ?


అమెరికా దిగువ సభ ఆమోదించిన కమ్యూనిస్టు వ్యతిరేక తీర్మానాన్ని ఎగువ సభ సెనెట్‌ ఆమోదించటం లాంఛనమే, తిరస్కరిస్తే చరిత్ర అవుతుంది. తీర్మానంలో ఏముందో చెప్పనవసరం లేదు. వెనెజులా,క్యూబా తదితర దేశాలపై విధించిన ఆంక్షలు, ఆర్థిక దిగ్బంధనం గురించి పల్లెత్తు మాట లేదు. అక్కడ జనం ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అమెరికా పుణ్యమే అది.వ్యక్తిగత గౌరవార్హతల ప్రాతిపదిక మీద విశ్వాసం పునాదిగా అమెరికా ఏర్పడింది.సామాహిక వ్యవస్థగా నిర్మితమయ్యే సోషలిజం దానికి పూర్తి వ్యతిరేకం అని దానిలో పేర్కొన్నారు. ఇది ఎప్పటి నుంచో పాడుతున్న పాచిపాట, దాన్ని అమెరికా నూతన తరం అంగీకరించటం లేదని ముందే చెప్పుకున్నాం. ఉక్రెయిన్‌ వివాదానికి కారకులైన అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఇప్పుడు దాన్నుంచి గౌరవ ప్రదంగా బయటపడే దారి, పడాలనే చిత్తశుద్ది లేక మరింత తీవ్రంగా మార్చేందుకు పూనుకున్నాయి. తటస్థంగా ఉన్న చైనా పుతిన్‌ మిలిటరీకి మారణాయుధాలు ఇచ్చేందుకు పూనుకున్నదని ప్రచారం మొదలు పెట్టింది. ప్రస్తుతం జి20 దేశాల బృందం అధ్యక్ష స్థానంలో ఉన్న మన దేశాన్ని తమ వెంట నడవాలని బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది.


ప్రతి ఏటా అమెరికాలోని కొన్ని సంస్థలు అభిప్రాయాలను సేకరిస్తాయి. వాటిలో సోషలిజం, పెట్టుబడిదారీ విధానాలను సమర్ధించటం, వ్యరేకించటం గురించి కూడా ఉంటాయి. ఒక ఏడాది శాతాలు పెరగవచ్చు, తరగవచ్చు మొత్తం మీద గ్రాఫ్‌ ఎలా ఉందన్నదానినే పరిగణనలోకి తీసుకుంటే సోషలిజం పట్ల మక్కువ పెరుగుతోంది. అందుకే దాని మీద తప్పుడు ప్రచారం చేసేందుకు ఏకంగా పార్లమెంటునే వేదికగా ఎంచుకున్నారు.ఆక్సియోస్‌ సర్వే ప్రకారం 2019 నుంచి 2021వరకు చూస్తే రిపబ్లికన్‌ పార్టీని సమర్ధించే 18-34 సంవత్సరాల యువతలో పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు 81 నుంచి 66శాతానికి తగ్గారు. మొత్తంగా సోషలిజాన్ని సమర్ధించే వారు 39 నుంచి 41శాతానికి పెరిగారు. ” పూ ” సంస్థ సర్వే ప్రకారం 2019 మే నెలలో కాపిటలిజం పట్ల సానుకూలంగా ఉన్న వారు 65శాతం కాగా 2022 ఆగస్టులో వారు 57శాతానికి తగ్గారు.ప్రతికూలంగా ఉన్నవారు 33 నుంచి 39శాతానికి పెరిగారు. ఇదే కాలంలో సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్నవారు 42 నుంచి 36శాతానికి తగ్గినట్లు, ప్రతికూలంగా ఉన్నవారు 55 నుంచి 60శాతానికి పెరిగినట్లు కూడా పేర్కొన్నది. దేశంలో 3.4 కోట్ల మందికి ఆహార భద్రత లేదు. వారిలో 90లక్షల మంది పిల్లలు ఉన్నారు. వారంతా ప్రభుత్వం లేదా దాన ధర్మాలు చేసే సంస్థలు జారీ చేసే ఆహార కూపన్లు (మన దేశంలో ఉచిత బియ్యం వంటివి) తీసుకుంటున్నారు. అద్దె ఇండ్లలో ఉంటున్న వారిలో . 40శాతం మంది తమ వేతనాల్లో 30 శాతం అద్దెకే వెచ్చిస్తున్నారు. ఇలాంటి అంశాలన్నీ సర్వేల మీద ప్రభావం చూపుతాయి. దిగజారుతున్న పరిస్థితులు తమ జనాన్ని మరింతగా సోషలిజం వైపు ఆకర్షిస్తాయి అన్నదాని కంటే పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించే ధోరణులు పెరగటమే అమెరికా పాలకవర్గాన్ని ఎక్కువగా భయపెడుతున్నదంటే అతిశయోక్తి కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ ఓటమిని అంగీకరించకపోతే ఏమి జరగనుంది !

03 Tuesday Nov 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Democratic party, Donald trump trade war, Joe Biden, Republican party, US Election 2020


ఎం కోటేశ్వరరావు


ప్రపంచమంతా ఆసక్తితో ఎదురు చూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఫలితాల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. పెద్ద సంఖ్యలో పోస్టల్‌, మెయిల్‌ ఓట్లు పోలు కావటంతో లెక్కింపు పూర్తి కావటం ఆలస్యం కావచ్చు. తాను ఓడిపోతే కోర్టుకు ఎక్కుతానని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించిన నేపధ్యంలో ఏమి జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్‌ ఓడిపోతే ట్రంప్‌ మద్దతుదారులు అనేక చోట్ల వీధులకు ఎక్కటానికి సిద్ధం అవుతున్నారు. దానికి ప్రతిగా కార్మికులు కూడా సార్వత్రిక సమ్మెకు సిద్ధం కావాలని పిలుపులు వెలువడ్డాయి.


చివరి ఎన్నికల సర్వేలను బట్టి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జోబిడెన్‌కు 52శాతం ఓట్లు, ప్రస్తుత అధ్యక్షుడైన రిపబ్లికన్‌ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌కు 43శాతం వస్తాయని వెల్లడైంది. కీలక రాష్ట్రాలుగా పరిగణిస్తున్న చోట కూడా బిడెన్‌ స్వల్ప మెజారిటీలో ఉన్నట్లు సమాచారం. మొత్తం ఓట్లలో మెజారిటీ బిడెన్‌కు వచ్చినా విజేత నిర్ణయం 538 మంది ఉండే ఎలక్ట్రొరల్‌ కాలేజీలో మెజారిటీ (270) తెచ్చుకున్నవారే పీఠమెక్కుతారు. అయితే గత ఎన్నికలలో మెజారిటీ ఓట్లు హిల్లరీ క్లింటన్‌కు ఎలక్ట్రొరల్‌ కాలేజీలో మెజారిటీ ట్రంప్‌కు వచ్చాయి. ఈ సారి కూడా అదే పునరావృతం అవుతుందన్నది ట్రంప్‌ శిబిరపు ప్రచారం. ఈ విశ్లేషణ పాఠకులకు చేరే సమయానికి పోలింగ్‌ చివరి దశలో ఉంటుంది. వెంటనే ఓట్లు లెక్కింపు ప్రారంభించినా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం లేదు.


ఇది రాసిన సమయానికి ముందస్తుగా వేసిన ఓటర్లు 9.95 కోట్ల మంది ఉన్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత కూడా అందే పోస్టల్‌, మెయిల్‌ ఓట్లను కలుపుకుంటే పది కోట్లు దాట వచ్చని అంచనా.ఇంకా 2.82 కోట్ల మెయిల్‌ బాలట్లు రావాల్సి ఉంది. అందువలన సరికొత్త రికార్డు నమోదు కానుంది. గత ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లతో పోలిస్తే ఇప్పటికే 73శాతం మంది ఓటు చేశారు. మొత్తం 15 కోట్ల మంది ఓటు హక్కువినియోగించుకోవచ్చని అంచనా. మంగళవారం నాడు వేసిన ఓట్లను తొలుత లెక్కిస్తారు. తరువాత ముందస్తు, పోస్టల్‌ ఓట్లను తీసుకుంటారు. ఇవి పెద్ద సంఖ్యలో ఉన్నందున లెక్కింపు పూర్తి కావటానికి చాలా రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు. తొలి ఓట్ల లెక్కింపులో మెజారిటీ వస్తే తాను గెలిచినట్లే అని వెంటనే ప్రకటిస్తానని, పోస్టల్‌ బ్యాలట్లను పరిగణనలోకి తీసుకోనని, లేనట్లయితే ఫలితాలను న్యాయస్ధానంలో సవాలు చేసేందుకు వెంటనే న్యాయవాదులతో సమావేశమౌతానని ట్రంప్‌ ప్రకటించాడు. ఓటర్ల తీర్పును మీరు గౌరవిస్తారా అంటే ముందుగా తాను ఆమాట చెప్పలేనని సెప్టెంబరులోనే ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ఒక పెద్ద కుంభకోణమని, పోస్టల్‌ బ్యాలట్లలో అక్రమాలు జరుగుతాయని పదే పదే చెప్పాడు. ఓడిపోతే వివాదాన్ని రేపాలనే ఆలోచన ట్రంప్‌కు ముందు నుంచి ఉన్నట్లు స్పష్టం. ప్రజాతీర్పును వమ్ము చేసే పక్షంలో సమ్మెకు దిగేందుకు సిద్దంగా ఉండాలని డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన కార్మిక సంఘాలు కూడా పిలుపునిచ్చాయి. అనేక చోట్ల ట్రంప్‌ మద్దతుదారులు అల్లర్లు,ఘర్షణలకు పాల్పడాలనే యత్నాల్లో కూడా ఉన్నారనే వార్తలు వచ్చాయి. అందువలన ఫలితం తేలటం ఒకటైతే దాని పర్యసానాల గురించి యావత్‌ ప్రంచం ఎదురు చూస్తోంది. ఇలాంటి పరిస్ధితి గతంలో అమెరికాలో తలెత్తినట్లు లేదు.


ఒక వేళ ట్రంప్‌ ఓటమిని అంగీకరించకపోతే ఏమిటన్న ప్రశ్న ముందుకు వచ్చింది. కరోనా కారణంగా పోలింగ్‌ తేదీన ఓటు వేయటానికి వచ్చేవారికంటే ముందుగానే ఓటు వేసే వారు ఎక్కువగా ఉంటారని ట్రంప్‌ ముందే గ్రహించాడు. కరోనాతో నిమిత్తం లేకుండా గత మూడు ఎన్నికల సర్వేలను చూసినపుడు ముందుస్తుగా ఓట్లు వేసిన వారిలో డెమోక్రాట్లకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ సారి కూడా వారిదే పైచేయి అని వార్తలు వచ్చాయి. అందుకే పోస్టల్‌ ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని ట్రంప్‌ చెబుతున్నాడు. పోలింగ్‌ రోజు వేసినవే అసలైన ఓట్లు అంటున్నాడు.అయితే పోలింగ్‌ తరువాత అందిన పోస్టల్‌ ఓట్లను కూడా పరిగణించాలని సుప్రీం కోర్టు చెప్పింది. వీటిని పరిగణలోకి తీసుకోవటాన్ని రిగ్గింగ్‌ అని ట్రంప్‌ ఆరోపిస్తున్నాడు.
ట్రంప్‌ గనుక ఓడిపోతే పలుచోట్ల హింసాకాండ తలెత్తే అవకాశం ఉందని పది రోజుల ముందు ఒక నివేదిక వెలువడింది. పెన్సిల్వేనియా, జార్జియా, మిషిగాన్‌, విస్కాన్సిన్‌, ఓరేగాన్‌ రాష్ట్రాలలో మితవాద మిలిటెంట్‌, సాయుధ గ్రూప్‌లనుంచి ముప్పు ఎక్కువగా ఉందని హెచ్చరించింది. ఆ గ్రూప్‌లు ఇప్పటికే ఆందోళనలు, దాడులు ఎలా చేయాలో, ఎలా పోలీసులను తప్పించుకోవాలో శిక్షణ ఇచ్చాయి. మొత్తం 80 అలాంటి బృందాలను గుర్తించినట్లు నివేదికను తయారు చేసిన సంస్ధలు పేర్కొన్నాయి. వారు ఓటర్లను బెదిరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి శక్తులు అడ్డుకున్న కారణంగానే శుక్రవారం నాడు టెక్సాస్‌ రాష్ట్రంలోని ఆస్టిన్‌ నగరంలో డెమోక్రాట్‌ అభ్యర్ధి జోబిడెన్‌ ప్రచారం రద్దయింది. రిపబ్లికన్ల కంచుకోటగా చెప్పుకొనే ఇక్కడ ట్రంప్‌ స్వల్ప మెజారిటీతో ఉన్నాడని సర్వేలు వెల్లడించటంతో మద్దతుదారులు తెగబడ్డారు. బిడెన్‌ ప్రయాణిస్తున్న బస్‌, ఇతర వాహనాలను సాయుధులైన వ్యక్తులు చుట్టుముట్టారు. మరోవైపు ట్రంప్‌ ప్రచార పతాకాలతో ఉన్న అనేక వాహనాలు కూడా చుట్టుముట్టాయి. పోలీసులు జోక్యంతో బిడెన్‌ ముందుకు సాగాల్సి వచ్చింది. ఈ ఉదంతాల వెనుక ట్రంప్‌ కుమారుడు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న డెమోక్రాట్‌ అభ్యర్ధి కమలా హారిస్‌ ప్రచారం సందర్భంగా ట్రంప్‌ మద్దతుదారులందరూ రావాలని అతగాడు ముందురోజు పిలుపునిచ్చాడు. టెక్సాస్‌ ఇప్పటికీ ట్రంప్‌ కంచుకోట అని రుజువు చేయాలన్నాడు. బిడెన్‌ను అడ్డుకున్న వీడియోను ట్వీట్‌ చేస్తూ ఐ లవ్‌ టెక్సాస్‌ అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అంతకు ముందు ఒక ఆస్ట్రేలియన్‌ టీవి బృందాన్ని కూడా ట్రంప్‌ మద్దతుదారులు బెదిరించారు.
ట్రంప్‌ శ్వేతజాతి దురహంకారి మాత్రమే కాదు, మహిళా వ్యతిరేకి కూడా. విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని కెనోషా ఎన్నికల సభలో డెమోక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష పదవి అభ్యర్ధి కమలా హారిస్‌ గురించి మాట్లాడుతూ ఈ అద్బుతమైన మహిళ దేశ తొలి మహిళా అధ్యక్షురాలు కావాలని కోరుకొంటోది. అది జరుగుతుందని నేను అనుకోను. అందుకే మీరు అలసి నిద్రపోయే జోబిడెన్‌ కూడా ఓటు వేయవద్దు అని నోరుపారవేసుకున్నాడు.


ప్రతి పార్టీ తన స్వంత ఎన్నికల పరిశీలకులను ఏర్పాటు చేసుకోవటం తెలిసిందే. అయితే పరిశీలకుల పేరుతో ఏర్పాటు చేసే అనధికార శక్తులు ముఖ్యంగా అమెరికాలో మిలిటెంట్స్‌ బృందాలను ట్రంప్‌ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాడు. వారంతా ఎన్నికలను క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా పిలుపునిచ్చాడు. పరోక్షంగా డెమోక్రాట్‌ మద్దతుదార్లను అడ్డుకోమని చెప్పటమే. అలాంటి బృందం ఒకటి మిషిగన్‌ రాష్ట్ర డెమోక్రటిక్‌ పార్టీ గవర్నర్‌ వైట్‌మర్‌ను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించి అరెస్టయింది. పోలింగ్‌ బూత్‌లలో ఆయుధాలతో ప్రవేశాన్ని నిషేధించటమే దీనికి కారణంగా చెప్పారు. అయితే కోర్టు ఆయుధాలకు అనుమతి ఇచ్చింది.
పోలింగ్‌ కొద్ది సేపట్లో ప్రారంభం కానుండగా సిఎన్‌ఎన్‌ చివరి జోశ్యంలో బిడెన్‌కు 279, ట్రంప్‌కు 163 ఎలక్ట్రోరల్‌ ఓట్లు వస్తాయని పేర్కొన్నది. ఆరు రాష్ట్రాలలోని 96ఎలక్ట్రోరల్‌ ఓట్ల విషయంలో పోటాపోటీగా ఉన్నట్లు పేర్కొన్నది. ఎన్నికలను విశ్లేషించే వెబ్‌సైట్లలో ఒకటైన 538 చెప్పిన జోశ్యంలో బిడెన్‌కు విజయావకాశాలు నూటికి 89శాతం, ట్రంప్‌కు పదిశాతం ఉన్నట్లు పేర్కొన్నది. సెనెట్‌లో డెమోక్రాట్స్‌ మెజారిటీ సాధిస్తారని తెలిపింది. ప్రముఖ పత్రిక ఎకనమిస్ట్‌ అంచనా ప్రకారం బిడెన్‌కు 96శాతం విజయాకాశాలు ఉన్నాయని, 350 ఎలక్ట్రొరల్‌ కాలేజీ ఓట్లు వస్తాయని తెలిపింది.


భారతీయ కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు ఝామున(నాలుగవ తేదీ) 5.30కు తూర్పు రాష్ట్రాలైన జార్జియా, ఇండియానా, కెంటకీ, వర్జీనియా, సౌత్‌ కరోలినా, వెర్‌మౌంట్‌లో పోలింగ్‌ ముగుస్తుంది. పశ్చిమ తీరంలోని రాష్ట్రాలలో 9.30కు పూర్తి అవుతుంది.అలాస్కా, అడక్‌ వంటి చివరి చోట్ల తరువాత పూర్తి అవుతుంది. ఆ తరువాతే లెక్కింపు ప్రారంభం అవుతుంది.
మైనే,నెబరస్కాలలో మినహా మిగిలిన రాష్ట్రాలలో మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్ధికి ఆ రాష్ట్రానికి నిర్దేశించిన అన్ని ఎలక్ట్రరల్‌ ఓట్లు వస్తాయి. ఉదాహరణకు కాలిఫోర్నియాకు ఉన్న 55 ఓట్లు అక్కడ మెజారిటీ ఓట్లు తెచ్చుకున్నవారికే మొత్తం జమ అవుతాయి. 2000 ఎన్నికలలో అల్‌గోర్‌, 2016లో హిల్లరీ క్లింటన్‌ దేశం మొత్తం మీద మెజారిటీ ఓట్లు తెచ్చుకున్నా ఎలక్ట్రరల్‌ ఓట్లు తెచ్చుకోవటంలో విఫలం కావటంతో ఓడిపోయారు.నవంబరు మూడున ఎన్నికలు జరిగిన తరువాత డిసెంబరు 14న ఎలక్ట్రరల్‌ కాలేజీ సభ్యులు అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. జనవరి ఆరవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు పార్లమెంట్‌ సమావేశమై ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన చేస్తుంది. జనవరి 20న నూతన అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన వారు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.


తాను ఓడిపోయినట్లయితే అధికార మార్పిడి చేస్తానన్న హామీ ఇవ్వలేనని సెప్టెంబరు నెలలో ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసినదే. ఒక వేళ అదే జరిగితే ఏమిటి అన్న ప్రశ్న తలెత్తింది. ట్రంప్‌ ప్రకటన వివాదాస్పదం కావటంతో అధ్యక్ష భవనం పత్రికా అధికారి ఒక ప్రకటన చేస్తూ స్వేచ్చగా, న్యాయంగా జరిగిన ఎన్నికలను ట్రంప్‌ ఆమోదిస్తారు అని పేర్కొన్నది. డెమోక్రాట్లు మోసంతో మాత్రమే గెలుస్తారని ట్రంప్‌ పదే పదే ఆరోపించటం వెనుక కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. ఓటమిని తిరస్కరిస్తే, దానికొనసాగింపుగా నూతన అధ్యక్ష పదవీ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తే నిజానికి ఏమీ కాదు. దిగిపోతున్న అధ్యక్షుడు చివరి ఉపన్యాసం చేయటం ఒక సాంప్రదాయం తప్ప నిబంధనేమీ కాదు. అవినీతి జరిగిందని ఆరోపించిన వారు ప్రతి ఒక్క ఓటూ అక్రమంగా పడిందని నిరూపిస్తే అది అప్పుడు ఎన్నికల ఫలితాలు మారతాయి తప్ప ప్రకటనలతో జరిగేదేమీ ఉండదు. అయితే రిపబ్లికన్లు అధికారంలో ఉన్నచోట ఫలితాలను కోర్టుల్లో సవాలు చేయటం తప్ప చేసేదేమీ ఉండదని చెబుతున్నారు. ఒక వేళ ఫలితాన్ని ప్రకటించే పార్లమెంట్‌ ఉభయ సభలు ఆపని చేయకపోతే వివాదం సుప్రీం కోర్టు ముందుకు వెళుతుంది.అది జరుగుతుందా ? అలాజరిగిన ఉదంతం గతంలో లేదు. అదే జరిగితే గనుక ఆసక్తికరమనే చెప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గోడకు నిధులు – అక్రమవలసదార్లకు పౌరసత్వం : డోనాల్డ్‌ ట్రంప్‌ !

25 Thursday Jan 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Democratic party, Donald trump, Dreamers, Republican party, us government shutdown, US immigration deal

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలో శుక్రవారం రాత్రి పన్నెండు గంటల నుంచి అక్కడి ప్రభుత్వం పనిచేయటం ఆగిపోయింది. మూడు రోజుల తరువాత ముగిసింది. దీనికంటే ముఖ్యవిషయం ఏమంటే డోనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ పెద్దమనిషి పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది గడచిన సందర్భంగా లక్షలాది మంది మహిళలు అమెరికా అంతటా పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వం మూతపడినందువలన ఎక్కువగా ప్రభావితమయ్యేది మిలిటరీ గనుక తెరిచేందుకు ముందుకు రావాలని మూతకు కారకులైన డెమోక్రాట్లకు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశాడు. ఏడాది పాలనలో తన ఆర్ధిక విజయం, సంపదల సృష్టికి గాను పండుగ చేసుకొనేందుకు ఈ రోజు ప్రదర్శనలు మహిళలకు ఇది సరైన సమయం అంటూ ట్రంప్‌ వారిని రెచ్చగొట్టే విధంగా మరో ట్వీట్‌ద్వారా వ్యాఖ్యానించాడు. నిజానికి ప్రభుత్వ మూత అనేది పెద్ద్ద ప్రహసనం. డెమోక్రాట్లను బందీలుగా మార్చటంతో మరో మార్గం లేక దిగి వచ్చారని అధ్యక్షుడు ట్రంప్‌ తనదైన శైలిలో మూత ముగిసిన తరువాత ట్వీట్‌ చేశాడు. అధ్యక్షుడు తమతో తెరవెనుక ఒప్పందానికి వచ్చారని డెమోక్రాట్‌ సెనెటర్‌ ఒకరు వ్యాఖ్యానించారు. వలసదారుల సమస్యలపై తరువాత చర్చ జరిపేందుకు రిపబ్లికన్లు సమ్మతించారు గనుక డెమోక్రాట్లు మూత ఎత్తివేతకు అంగీకరించారని వార్తలు. అయితే అలాంటి చర్చ జరుగుతుందో లేదో హామీ లేదని, డెమోక్రాట్లు దేనిమీదా గట్టిగా నిలబడరని మరోసారి రుజువైందని అనేక విమర్శలు వచ్చాయి. రెండు రోజు తరువాత స్వయంగా ట్రంపే అసలు విషయాన్ని బయటపెట్టారు. అక్రమ వలసదారులను నిరోధించేందుకు మెక్సికో-అమెరికా సరిహద్దులలో నిర్మించతలపెట్టిన గోడ నిర్మాణానికి 25బిలియన్‌ డాలర్ల ఖర్చుకు బడ్జెట్‌లో డెమోక్రాట్లు ఆమోదం తెలిపితే పది పన్నెండు సంవత్సరాల వ్యవధిలో చిన్నవయస్సులో చట్టవిరుద్ధంగా అమెరికాకు వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తామని విలేకర్లతో చెప్పారు. ఇది సమస్యను మరోవైపు మళ్లించేయత్నం తప్ప పరిష్కారానికి చిత్తశుద్ది కనిపించటం లేదు.

ప్రపంచంలో ఎక్కడా ఏ రోజూ, ఏక్షణం కూడా ప్రభుత్వ వ్యవస్ధలు మూతపడటం అనేది లేదు. అదొక మిధ్య అంటే అతిశయోక్తి కాదు. ట్రంప్‌ ఒక సామ్రాజ్యవాద ప్రతినిధి కనుక ఆ పెద్దమనిషి నోటి నుంచి ఆ భాషే వెలువడుతుంది. నిజానికి మూతపడిన రోజుల్లో పనికి దూరమైన ప్రభుత్వ వుద్యోగులు, కార్మికులు నష్టపోతారు, ఆమేరకు వారు చేసే ఖర్చు తగ్గుతుంది కనుక ఆమేరకు వ్యాపారలావాదేవీలు, వ్యాపారులకు లాభాలు తగ్గుతాయే తప్ప నష్టపోయేదేమీ వుండదు. సంక్షేమ పధకాలు నిలిచిపోతాయి. వుద్యానవనాలు, మ్యూజియంలు, ఇతర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దర్శనీయ స్ధలాలు మూతపడిన కారణంగా వచ్చే ఆదాయాన్ని కూడా నష్టంగా లెక్కవేస్తున్నారు. వాయిదా పడిన సేవలు తరువాత అయినా అందించేందుకు వీలుంటుంది కనుక వాటిని నష్టాలుగా చెప్పటం కొంతమేరకు అతిశయోక్తి అవుతుంది.

అసలు అమెరికా ప్రభుత్వం ఎందుకు మూతపడింది ? నాలుగు దశాబ్దాల క్రితం సవరించిన రాజ్యాంగం ప్రకారం బడ్జెట్‌ ప్రతిపాదనలను పార్లమెంట్‌లోని వుభయ సభలు నిర్ణీత మెజారిటీ ఓటుతో ఆమోదించాల్సి వుంది. సాధారణంగా మన పార్లమెంట్‌, అసెంబ్లీ సమావేశాలలో అలాంటి సందర్భాలు వచ్చినపుడు ఓటింగ్‌లో పాల్గనటం గురించి రాజకీయ పక్షాలు అవసరమైతే విప్‌లు జారీ చేస్తాయి. అమెరికాలో అలాంటి ఏర్పాట్ల గురించి, మన మాదిరి అక్కడ కూడా జరిగే అపహాస్యాలు, ప్రహసనాల లోతుల్లోకి పోలేదు కనుక వాటి గురించి పక్కన పెడదాం. పార్లమెంట్‌ ఎగువ సభసెనెట్‌లోని వంద స్ధానాలకు గాను రిపబ్లికన్లకు 51,డెమోక్రాట్లకు 47 మంది, ఇద్దరు స్వతంత్రులు వున్నారు. బడ్జెట్‌ ఆమోదానికి కనీసం 60మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రభుత్వఖర్చుల ఆమోదానికి శుక్రవారం నాడు (మన ఓట్‌ఆన్‌ అకౌంట్‌ మాదిరి) జరిగిన ఓటింగ్‌లో అనారోగ్యం కారణంగా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఒకరు గైర్హాజరు కాగా 50 మంది అనుకూలంగానూ 49 వ్యతిరేకంగానూ ఓటు చేశారు. ఐదుగురు అధికార పక్ష సభ్యులు ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఓటు చేయగా ఐదుగురు ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా తమ పార్టీ వైఖరికి విరుద్దంగా ఓటు చేశారు. దాంతో తగిన మద్దతు లేక బిల్లు వీగిపోయింది. నిధుల మంజూరు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి నిలిచిపోయింది. దీన్నే ప్రభుత్వ మూత అంటున్నారు. ఒప్పందం కుదిరిన తరువాత జరిగిన ఓటింగ్‌లో సెనెట్‌లో 81-18, దిగువ సభ కాంగ్రెస్‌లో 266-150 మెజారిటీతో ప్రతిష్టంభన ముగిసింది.

బడ్జెట్‌కు వుభయ సభల ఆమోదం, అదుపునకు సంబంధించి దశకలో నిబంధనలు సవరించిన తరువాత 1976 నుంచి ఇలాంటి మూతలు తాజా వుదంతంతో సహా పద్దెనిమిది సార్లు జరిగాయి. ఇవి ముగ్గురు రిపబ్లికన్లు, ముగ్గురు డెమోక్రాట్‌ పార్టీల అధ్యక్షుల హయాంలో జరిగాయి. పదకొండు సార్లు డెమోక్రాట్లు కారణంకాగా ఏడు రిపబ్లిక్‌ పార్టీ ఖాతాలో వున్నాయి. వీటిని స్ధూలంగా పరిశీలించినపుడు అత్యధిక సందర్భాలలో కార్మికవర్గానికి వ్యతిరేకమైన ప్రతిపాదనలను ముందుకు తెచ్చినపుడే జరిగాయని గమనించవచ్చు. రెండు పార్టీలు ఒకే వర్గానికి ప్రాతినిధ్యం వహించుతాయనే విషయంలో ఎలాంటి భ్రమలకు లోనుకానవసరం లేదు. వున్నంతలో ఏది తక్కువ హాని చేసే పార్టీ అని బేరీజు వేసుకొని మెజారిటీ కార్మికవర్గం,వలస కార్మికులు డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదారులుగా వుంటున్నందున వారిని నిలబెట్టుకొనేందుకు ఆ పార్టీ రిపబ్లికన్లతో పోల్చితే సంక్షేమ చర్యల గురించి ఎక్కువగా మాట్లాడుతోంది.

తాజా మూత విషయానికి వస్తే బాలలుగా వున్నపుడు అమెరికాకు అక్రమంగా తీసుకువచ్చి వారిచేత తక్కువ వేతనాలకు పని చేయించుకొని ఇప్పుడు పెరిగి పెద్దవారైన తరువాత మార్చినెలలో బయటకు గెంటివేయాలని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమస్యపై వారి సంక్షేమం కోసం నిధుల కేటాయింపు సక్రమంగా లేదంటూ డెమోక్రాటిక్‌ పార్టీ సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అక్రమంగా వలస వచ్చిన వారి బెదిరింపులకు లంగకూడదంటూ రిపబ్లికన్లు పట్టుబట్టారు. ఈ వివాదంపై రెండు పార్టీల మధ్య రాజీకుదిరి తిరిగి ఓటింగ్‌ జరిపి ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే అప్పుడు ఖర్చులకు నిధులను వినియోగించవచ్చు. అది జరగపోతే ఇటు సూర్యుడు అటు పొడుస్తాడా అంటే అంతసీనేమీ వుండదని గత అనుభవాలు రుజువు చేశాయి. నిజంగా అది ప్రతిబంధకమై ముందుకు పోలేని స్ధితి వుంటే అది పునరావృతం కాకుండా సాధారణ మెజారిటీతో ఆమోదం పొందే విధంగా రెండవ మూత సంభవించకుండానే నిబంధనల సవరణ చేసి వుండేవారు. ప్రతిసారీ అత్యధిక సందర్భాల్లో ఏదో ఒక రాజకీయంలో భాగంగానే జరుగుతోంది. ఇప్పుడు అమెరికాకు వలస వచ్చిన వారి గురించి అధికార ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

1976లో తొలి మూత పడటానికి కారణం రిపబ్లికన్‌ పార్టీకి చెందిన అధ్యక్షుడు గెరాల్డ్‌ ఫోర్డ్‌( ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ యజమాని). కార్మికులు,విద్య,వైద్యం,సంక్షేమ పధకాలకు గాను 56బిలియన్‌ డాలర్ల మేరకోత విధిస్తూ వీటో జారీచేసినపుడు దానికి వ్యతిరేకంగా అదే ఏడాది అమలులోకి వచ్చిన బడ్జెట్‌ అదుపు చట్టాన్ని వినియోగించుకొని డెమోక్రాట్లు ఖర్చులను అడ్డుకున్నారు. అది ఎన్నికల సంవత్సరం అని గమనించాలి. ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో అధికారానికి వచ్చిన డెమోక్రాట్‌ జిమ్మీకార్టర్‌ 1977లో అధికారానికి వచ్చిన తొలిఏడాదే మూడుసార్లు రిపబిక్లన్లు 12,8,8 రోజుల చొప్పున ప్రభుత్వాన్ని మూతవేయించారు. అబార్షన్లు చేయించుకున్నపుడు వైద్యసాయం చేసేందుకు నిధుల కేటాయిపునుఅ అసలు అబార్షన్లనే వ్యతిరేకించే రిపబ్లికన్లు అడ్డుకున్నారు. అవసరం లేని మిలిటరీ పరికరాల కొనుగోలుకు ప్రతిపాదన చేశారంటూ 37బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని కార్టర్‌ వీటో చేయటాన్ని వ్యతిరేకిస్తూ 26 రోజుల పాటు రిపబ్లికన్లు ప్రభుత్వాన్ని మూతవేయించారు.1979 ఎన్నికల సంవత్సరంలో పార్లమెంటు సభ్యులు మరియు వున్నతాధికారులకు 5.5శాతం వేతనాల పెంపు ప్రతిపాదనను, అబార్షన్లకు నిధులను రిపబ్లికన్లు అడ్డుకొని మరోసారి 11రోజుల పాటు మూతకు కారణమయ్యారు. తరువాత అధికారానికి వచ్చిన రిపబ్లికన్‌ రోనాల్డ్‌ రీగన్‌ తొలి నాలుగు సంవత్సరాల పదవీ కాలంలో ఆరుసార్లు (మొత్తం 12రోజులు) మూత వేయించి డెమోక్రాట్లు రికార్డు సృష్టించారు. తదుపరి నాలుగు సంవత్సరాల కాలంలో రెండుసార్లు, రెండురోజులు మూతపడవేయించి అత్యధిక మూతల అధ్యక్షుడిగా రికార్డులకెక్కించారు. తరువాత డెమోక్రాట్‌ బిల్‌క్లింటన్‌ హయాంలో మెజారిటీ దిగువసభలోని రిపబ్లికన్ల బిల్లును వీటోను చేయటంతో రిపబ్లికన్లు ప్రభుత్వాన్ని మూతవేయించారు. ఇది గరిష్టంగా 21రోజులు సాగి అత్యధిక ప్రతిష్టంభనగా నమోదైంది. చివరికి బిల్‌క్లింటనే రాజీపడి ప్రభుత్వ ఖర్చు తగ్గింపు, పన్నుల పెంపుదల ప్రతిపాదన ఆమోదానికి బాటవేశారు. తరువాత బరాక్‌ ఒబామా హయాంలో పేదలకు అందుబాటులోకి తెచ్చిన ఆరోగ్యబీమా చట్టాన్ని వ్యతిరేకించిన రిపబ్లికన్లు 2013లో 16రోజుల పాటు మూత వేయించారు. ఆ తరువాత తిరిగి మూతపడటం ఇదే ప్రధమం.

వారాంతంలో లేదా వరుసగా సెలవులు వున్నపుడు మూతపడిన సందర్భాలలో పెద్ద ప్రభావం చూపలేదుకనుక కొన్ని అసలు చర్చనీయాంశం కాలేదు, అసలు మూతపడినట్లే కొందరికి తెలియలేదు. ఎక్కువ రోజులు కొనసాగితే ప్రభుత్వ వుద్యోగులు, కార్మికులు పని లేకుండా ఇళ్లకు పోవటం లేదా తరువాత వేతనాలు తీసుకొనే ప్రాతిపదికన పని చేయటం ఇలాంటి సందర్భాలలో సర్వసాధారణం. మిలిటరీలో పనిచేసే పౌరవుద్యోగులకు కూడా ఇదే వ ర్తింస్తుంది. మిలిటరీ, గూఢచార, వుగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో వున్న సిబ్బందికి ఈ మూత వర్తించదు కనుక వారికి ఎలాంటి ఇబ్బంది వుండదు. అయితే ఈ సారి మిలిటరీ సిబ్బందికోసం ప్రసారాలు చేసే టీవీ నెట్‌వర్కు మూతపడినందున తమకు ఇబ్బంది కలిగిందని స్వదేశంలోనూ, విదేశాల్లో వున్న మిలిటరీ సిబ్బంది విమర్శలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి.కొన్ని కవాతులు, మిలిటరీలోకి తీసుకోవటం కొన్ని కార్యక్రమాలకు పరిమితంగా ఆటంకం కలుగుతుంది తప్ప అమెరికన్లు విదేశాల్లో జరిపే దాడులు, దుండగాలకు, పోలీసు, అత్యవసర సేవలుగా ప్రకటించిన వాటికి మాత్రం ఎలాంటి ఇబ్బంది వుండదు. గత నాలుగు సందర్భాలలో జరిగిన ఇలాంటి పరిణామాలను గమనంలో వుంచుకొనే అనేక తాత్కాలిక ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఐదు సంవత్సరాల క్రితం ఒబామా హయాంలో 16రోజుల మూత సమయంలో ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ వుద్యోగులను వేతనాలు లేకుండా ఇళ్లకు పంపివేశారు. అమెరికాలో పనిచేయకపోతే వేతనం ఇచ్చే విధానం లేని విషయం తెలిసినదే. ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతుంది. అందువలన ముందే చెప్పుకున్నట్లు జరిగే నష్టం కార్మికవర్గానికే.

నిజానికి మూసివేత సమస్యకు మూడు రోజుల వేతనం పోగొట్టుకున్న కార్మికులకు ఎలాంటి సంబంధం లేదు. ఆంబోతుల పోరులో లేగదూడల మాదిరి నష్టపోయారు. డోనాల్డ్‌ ట్రంపు చెప్పినట్లు అక్రమంగా వలస వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వాలంటే 25 బిలియన్ల డాలర్ల బడ్జెట్‌ కేటాయింపు అంటే అది మరోవిధంగా జనంపై భారమే. ట్రంపు ప్రతిపాదిత గోడను డెమోక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. అందువలన ప్రభుత్వ మూతను ఎత్తివేసి ఫిబ్రవరి 6వరకు బడ్జెట్‌ ఖర్చుల ఆమోదానికి గాను అధికార ప్రతిపక్షాలకు ఇరువురకూ ఇబ్బంది లేని రీతిలో కుదిరిన రాజీ అని చెప్పవచ్చు. అయితే ఏదన్నా నష్టం జరిగితే రిపబ్లికన్లకే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. గోడ నిర్మాణానికి ఆమోదం తెలపటం అంటే డెమోక్రాట్లకూ ఇబ్బందే. నిజానికి అక్రమవలసదారులతో తక్కువ వేతనానికి పనిచేయించుకున్న కార్పొరేట్‌ కంపెనీల నుంచే అవసరం అనుకుంటే ఈ మొత్తాన్ని వసూలు చేయాలి. ఎందుకంటే వారి లాభాలకోసమే ఎవరు అధికారంలో వున్న అక్రమవలసలను ప్రోత్సహించిన విషయం జగద్విదితం.

జనవరి 20నాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ పదవీకాలం ఏడాది పూర్తవుతుంది. దానికి ముందుగానే ఇటువంటిదేదో జరగనుందని కొన్ని సూచనలు వెలువడినా ప్రభుత్వ యంత్రాంగం అంత తీవ్రంగా తీసుకోలేదని వార్తలు వెలువడ్డాయి. జరిగిన నష్టం ఎంతో తరువాత వెల్లడి అవుతుంది. ప్రభుత్వం ఈ ఏడాది 4.1లక్షల కోట్ల డాలర్ల మేరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.దీనిలో సగానికిపైగా మిలిటరీకి ఇతర సంస్ధలకు కేటాయిస్తారు. మూడోవంతుకు అటూ ఇటూగా వున్న మొత్తానికి మాత్రమే పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి వుంటుంది. డెమోక్రాట్లు సృష్టించిన ఈ మూత, దానికి కారణమైన రిపబ్లికన్ల ప్రతిపాదనలు రెండూ ఈ ఏడాది నవంబరులో జరగనున్న పార్లమెంటు దిగువసభ ఎన్నికల దృష్టితోనే అన్నది గమనించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d