• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: October 2020

పెట్టుబడిదారీ వ్యవస్ధ లోపాన్ని బయట పెట్టిన కరోనా : పోప్‌ ఫ్రాన్సిస్‌

06 Tuesday Oct 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

Capitalism’s flaws, COVID- 19 pandemic, Pope Francis, Pope Francis on Capitalism


ఎం కోటేశ్వరరావు


మహిమ గల సిద్దాంతంగా చెప్పే స్వేచ్చాయుత పెట్టుబడిదారీ విధానంలో ఉన్న లోపాలను కరోనా మహమ్మారి మరింతగా బయట పెట్టిందని పోప్‌ ఫ్రాన్సిస్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ” అందరూ సోదరీ సోదరులు ” అనే ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బిషప్పులకు రాసిన లేఖను విడుదల చేశారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ యుద్ధాలు రాకుండా చూసేందుకు అవసరమైన చర్చలు, సౌభ్రాత్వత్వాలను పెంపొందించే నూతన తరహా రాజకీయాలు ప్రపంచానికి అవసరమంటూ తాజాది మూడవది అయిన ఆ లేఖలో పేర్కొన్నారు. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ బోధనల నుంచి తానీ ఉత్తేజాన్ని పొందానని ప్రపంచం మీద కమ్మిన చీకటి మబ్బులతో సంఘర్షించాలని అన్నారు. ఆత్మరక్షణకు న్యాయ యుద్దం చేయవచ్చు అన్న కాథలిక్‌ చర్చి సిద్దాంతాన్ని శతాబ్దాల తరబడి విస్తారంగా వినియోగించారని అదింకేమాత్రమూ పనికిరాదని అన్నారు. దాన్ని సమర్దించుకోవటం ఈ రోజుల్లో కష్టమన్నారు.


తీవ్ర హాని కలిగించిన కరోనా వైరస్‌ పీడిత జనాల న్యాయమైన అవసరాలను తీర్చేందుకు ప్రస్తుతం రాజకీయ, ఆర్దిక వ్యవస్ధలను సంస్కరించాలని పోప్‌ చెప్పారు. వివిధ దేశాలు భిన్న మార్గాల్లో కరోనా సంక్షోభం మీద స్పందించినప్పటికీ కలసి పనిచేయటంలో వాటి అశక్తత ఎంతో స్పష్టంగా కనిపించిందన్నారు. మెరుగుపరచేందుకు ఇప్పుడు మనం చేస్తున్నది లేదా ఉన్న వ్యవస్ధను మరియు నిబంధనలను మెరుగుపరచేందుకు చేస్తున్నది గానీ వాస్తవాలను గుర్తించటం లేదనే ఏకైక గుణపాఠాన్ని నేర్చుకోవాలన్నారు. వైరస్‌ కారణంగా కోట్లాది మంది ఉపాధి కోల్పోవటాన్ని రుజువుగా తీసుకొని ప్రజాఉద్యమాలు, యూనియన్లు, ప్రధాన స్రవంతికి దూరంగా ఉన్న జన సమూహాలు చెప్పేవాటిని రాజకీయనేతలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రతి దాన్ని మార్కెట్‌ స్వేచ్చ పరిష్కరించలేదని కరోనా మహమ్మారి చూపిందన్నారు.


భూ వనరులు సామాజిక ప్రయోజనాలకు తప్ప వ్యక్తుల ఆస్ధి కాదని, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ కొంత మందిని ధనికులుగా మారుస్తూ పేదలను దూరంగానే ఉంచుతున్నదనే తన విమర్శను పోప్‌ పునరుద్ఘాటించారు. ఊటసిద్దాంతాన్ని చెప్పినంత సులువుగా అమలు చేయలేమని అన్నారు. ఊట సిద్దాంతం, మహత్తు గలవని చెప్పే సిద్దాంతాల పేరు చెప్పకుండానే నయా ఉదారవాదం వాటిని పునరుత్పత్తి చేస్తోందని, అది సమాజ వ్యవస్ధకే ముప్పు తెచ్చే హింసాత్మక ధోరణులు పెరిగేందుకు దోహదం చేసే అసమానతలను పరిష్కరించలేదని అన్నారు. మంచి ఆర్ధిక విధానం ఉద్యోగాలను కల్పిస్తుంది తప్ప కోత పెట్టదని పోప్‌ పేర్కొన్నారు. గౌరవ ప్రదంగా బ్రతకటానికి అవసరమైనవి ఒక వ్యక్తికి లేకపోవటానికి కారణం మరొక వ్యక్తి వాటిని అడ్డుకోవటమే అని తొలి రోజులలో ముందుకు వచ్చిన క్రైస్తవ భావన ఇప్పటికీ చెల్లుతుందని చెప్పారు. జాత్యంహంకారం గురించి చెబుతూ అది ఒక వైరస్‌, అంతర్ధానం కావటానికి బదులు వేగంగా రూపం, స్వభావం మార్చు కుంటుంది, దాగి అవకాశం కోసం ఎదురు చూస్తుంది అన్నారు.

పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రస్తావించిన పెట్టుబడిదారీ వ్యవస్ధ గురు పీఠమైన అమెరికాలో ” మహమ్మారి విషాదం వ్యాకులత ముగిసింది – మాంద్యం ఇప్పుడే ప్రారంభం అయిందని ” న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక తాజా పరిస్ధితి గురించి రాసిన విశ్లేషణలో పేర్కొన్నది. అనిశ్చితమైన భవిష్యత్‌కు ముప్పును తెచ్చే ఆర్ధిక వ్యవస్ధ దీర్ఘకాలికమైన, మెల్లగా కోలుకొనే స్ధితిలో ప్రవేశించినట్లు, సిద్దాంతం ప్రకారం మహమ్మారులతో పెద్దగా ప్రభావితం కావని చెప్పే రంగాలు కూడా ఇప్పుడు తీవ్ర మాంద్యానికి దగ్గరగా ఉన్నాయి. సాధారణంగా మాంద్యాల్లో మాత్రమే ఉండే లేఆఫ్‌ల హెచ్చరికలను వాణిజ్య వార్తల శీర్షికలు ప్రతిబింబిస్తున్నాయి. బడా చమురు కంపెనీ షెల్‌ తొమ్మిదివేలు, డిస్నీ 28, రక్షణ రంగ కంపెనీ రేథియాన్‌ 15వేల ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. వసంత రుతువులో ఈ రంగాలలో రద్దయిన ఉద్యోగాలు వేసవి వచ్చినా పూర్తిగా తిరిగి రాలేదు. 2008 నాటి మాంద్యంలో 2.4శాతం ఉద్యోగాలు తగ్గితే ఇప్పుడు 3.9శాతం తగ్గాయి. గత మాంద్యాల కంటే దారుణంగా మహమ్మారి కారణంగా ఉద్యోగాల నష్టం జరిగింది. ఆర్ధిక వ్యవస్ధ ఆరోగ్యం బాగుపడినప్పటికీ అనేక ఉద్యోగాలు ఉండవు, కొత్త రకాల కోసం కార్మికులు వెతుక్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఒక పరిశ్రమ దెబ్బతింటే అది అనేక ఇతర పరిశ్రమలను దెబ్బతీస్తుంది.


పెట్టుబడిదారీ వ్యవస్ధ దివాలాకోరుతనం కారణంగా కరోనా ముందు స్ధాయికి ఆర్ధిక వ్యవస్ధ కోలుకున్నప్పటికీ అది నిరంతరం కొనసాగుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ జనాభాలో నాలుగుశాతం కలిగిన అమెరికాలో కరోనా మరణాల్లో మాత్రం 21శాతం ఉన్నాయి. ప్రపంచ ధనిక దేశాల్లో నాలుగోవంతు మరణాలు అక్కడే సంభవించాయి. అమెరికాలో రోజుకు వెయ్యి మంది, ఐరోపా యూనియన్‌లో మూడు వందల మంది మరణిస్తుండగా ఆసియా ధనిక దేశాలలో దాదాపు మరణాలు లేవు. అమెరికా పక్కనే ఉన్న కెనడాలో వైరస్‌ కారణంగా మరణిస్తున్నవారు రోజుకు పదికి అటూ ఇటూగా మరణాలు ఉంటున్నాయి.
మరోవైపు సోషలిస్టు వ్యవస్ధలు కలిగిన చైనా కరోనా వైరస్‌ను పూర్తిగా అరికట్టటమే కాదు సాధారణ జనజీవనాన్ని తిరిగి ప్రారంభించింది. వియత్నాం, క్యూబా కూడా కరోనాను అరికట్టటంలో జయప్రదమయ్యాయి. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ మరియు సోషలిస్టు వ్యవస్ధ గొప్పతన ఆధిపత్యాన్ని పూర్తిగా ప్రదర్శించినట్లు చైనా అధినేత గ్జీ జింపింగ్‌ వర్ణించారు. పెట్టుబడిదారీ వ్యవస్ధలోని ధనిక దేశాలు 2008 ద్రవ్య సంక్షోభం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేని స్ధితిలో చైనా దాని ప్రభావాలను అధిగమించి ఒక ప్రధాన శక్తిగా ఎదిగింది. ప్రధాన ఆర్ధిక వ్యవస్దలన్నీ తిరోగమనంలో ఉండగా చైనా పురోగమనంలో సాగుతోంది. ఈ వాస్తవాన్ని విస్మరించటం అంత తేలిక కాదు.
అనేక మంది ఆర్ధిక పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ 2008 గాలివానకు తట్టుకొని నిలవటమే కాదు తదుపరి దశాబ్దిలో ప్రపంచ ఆర్దిక వ్యవస్ధలో మూడోవంతు ఆర్ధిక ప్రగతిని చైనా జోడించింది. అమెరికాకు సమీపంలో ఉంది. ఈ ఆర్ధిక శక్తి ప్రపంచంలో చైనా పలుకుబడి పెరిగేందుకు దోహదం చేసింది.బెల్ట్‌ మరియు రోడ్డు చొరవ పేరుతో చైనా నుంచి ఐరోపా వరకు లక్ష కోట్ల డాలర్ల పధకాన్ని చైనా అమలు జరుపుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ గురుత్వాకర్షణ కేంద్రం అట్లాంటిక్‌ నుంచి పసిఫిక్‌ సముద్రానికి మారుతోంది అని అమెరికా మాజీ మంత్రి హెన్రీ కిసింజర్‌ వ్యాఖ్యానించాడు.ఏదైనా ఉపద్రవం వచ్చినపుడు ఆదుకొనేందుకు ప్రతివారూ అమెరికా కోసం ఎదురు చూసేవారు. కానీ కరోనా మహమ్మారి తొలి రోజుల్లో జనానికి అవసరమైన ముఖతొడుగులు, ఇతర రక్షణ వైద్య పరికరాల కోసం ప్రపంచం చైనా వైపు చూసింది. ఒక్క జిడిపి విషయంలోనే కాదు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నుంచి అన్ని రంగాలలో చైనా తన సత్తా ఏమిటో ప్రపంచానికి చూపింది. ఇది అక్కడి సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకత తప్ప మరొకటి కాదు. అమెరికా రాజకీయ నాయకత్వం రోజు రోజుకూ చైనా వ్యతిరేకతను పెంచుకుంటున్నప్పటికీ ఆర్ధిక సేవలు అందించే అక్కడి కంపెనీలు చైనాలో కార్యకలాపాలను పెంచుతూనే ఉన్నాయి.చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా కంపెనీలన్నీ పొలోమంటూ స్వదేశానికి, మన దేశానికి వస్తున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగిన విషయం తెలిసిందే.అయితే అలాంటి ఆలోచన లేదా నిర్ణయం తీసుకున్న కంపెనీలు కేవలం నాలుగుశాతమే అని తాజా సర్వేలో వెల్లడైంది.


అనేక ఆటంకాల మధ్య తనదైన శైలిలో వైద్య రంగంలో అనేక విజయాలను క్యూబా నమోదు చేసింది. కోటీ 15లక్షల జనాభా ఉన్న అక్కడ 90వేలకు పైగా వైద్యులు ఉన్నారు. అక్టోబరు రెండవ తేదీ నాటికి 5,670 కేసులు నమోదు కాగా 122 మంది మరణించారు, 626 మంది చికిత్సపొందుతుండగా తొమ్మిది మంది పరిస్దితి విషమ స్దితిలో ఉన్నారు.1981లో డెంగ్యూ జ్వరాలు ప్రబలిన సమయంలో నివారణకు తీసుకున్న చర్యల అనుభవం ఇప్పుడు కరోనా నివారణకు ఎంతగానో తోడ్పడింది.
అమెరికాలోని జార్జియా రాష్ట్ర జనాభా కూడా క్యూబాకు దగ్గరా కోటీ ఐదు లక్షల మంది. అక్కడ అక్టోబరు రెండవ తేదీనాటికి 3,19,334 నమోదు కాగా 7,063 మంది మరణించారు, 2,12,023 మంది చికిత్స పొందుతున్నారు. జనం పట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వానికి లేని పాలకులకు, సోషలిస్టు వ్యవస్దకు, పెట్టుబడిదారీ సమాజానికి ఉన్న తేడా ఇది. తన జనాన్ని కాపాడుకోవటమే కాదు 45దేశాలకు అవసరమైన ఔషధాలను, వైద్యులు, సిబ్బందిని పంపింది.క్యూబాలో 1960దశకం నుంచి అభివృద్ది చేసిన ప్రజారోగ్య వ్యవస్ధ జనాన్ని ఆరోగ్యంగా ఉంచటంతో పాటు తక్కువ ఖర్చుతోనే వైద్యాన్ని కూడా అందించగలుగుతోంది. అమెరికాలో ఒక రోజు ఆసుపత్రిలో ఉంటే 1,900డాలర్లు ఖర్చయితే క్యూబాలో ఐదు డాలర్లు, బుడ్డ(హెర్నియా) ఆపరేషన్‌కు 12వేల డాలర్లు అయితే 14, తుంటి ఎముక ఆపరేషన్‌కు 14వేలు అయితే క్యూబాలో 72 డాలర్లు మాత్రమే అవుతుంది. అమెరికాలో 2018లో తలకు 8,300 డాలర్లు ఖర్చు చేస్తే క్యూబాలో 400 డాలర్లు చేశారు. వైద్య సేవను ఆదాయానికి గాక బాధ్యతగా ప్రభుత్వం భావించటమే దీనికి కారణం.


వియత్నాంలో కరోనాను కట్టడి చేశారు. ఉత్తర వియత్నాంపై అమెరికా దాడి చేసిన సమయంలో జనాన్ని సిద్దం చేసేందుకు అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అనుసరించిన పద్దతులు ఎంతగానో అమెరికా వ్యతిరేకతను, దేశాన్ని రక్షించుకోవాల్సిన జాతీయ భావనలను జనంలో కలిగించటంలో జయప్రదమయ్యాయి. అమెరికన్లను అడ్డుకొనేందుకు ప్రతి పౌరుడు సాయుధుడు కావాలని ప్రతి ఇల్లు ప్రతిఘటన కేంద్రంగా మారాలని అప్పుడు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు కరోనా మీద యుద్దాన్ని కూడా అదే పద్దతుల్లో చేయాలని పిలుపు ఇచ్చారు. ఇది జనాన్ని కదిలించింది. దీనికి సోషలిస్టు చైతన్య స్ఫూర్తి, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే జాగ్రత్త అని వేరే చెప్పనవసరం లేదు.
చైనాలో వైరస్‌ అదుపులోకి వచ్చిన మే మాసం నుంచి నామ మాత్రంగా కేసులు నమోదు కాగా అమెరికాలో పది లక్షల నుంచి అక్టోబరు రెండు నాటికి 75లక్షలకు పెరిగాయి.25లక్షల మంది చికిత్స పొందుతున్నారు.

కరోనాకు ముందు ఎక్కువ మంది ఆర్ధికవేత్తలు 2020లో చైనా ఆర్ధిక వ్యవస్ధ ఆరుశాతానికి అటూ ఇటూగా వృద్ది రేటుతో ఉంటుందని అంచనా వేశారు. 2021 నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. నాటికి 2010లో ఉన్న జిడిపిని రెట్టింపు చేయాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇచ్చింది. దాన్ని చేరుకోవాలంటే ఆరుశాతం వృద్ధి రేటు ఉంటే సాధ్యమే అని అనేక మంది భావించారు. కరోనాతో అది కష్టం కావచ్చని అయినప్పటికీ ఆ దిశగా పని చేయాలని అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ పిలుపునిచ్చారు.2021నాటికి కాకున్నా ఆ ఏడాది చివరికి అయినా లక్ష్యాన్ని చేరాలనే పట్టుదలతో పని చేస్తున్నారు. అనేక విజయాలు సాధించిన చైనా ఈ లక్ష్యాన్ని సాధించటంలో కూడా జయప్రదం అవుతుందనటంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విశాఖ రైల్వేజోన్‌ ఎండమావేనా ?

04 Sunday Oct 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

Indian Railways, SCoR-Visakhapatnam, South Coast Railway (SCoR) zone


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ నిజంగా తలచుకోవాలేగానీ ఏదైనా క్షణాల్లో అయిపోతుంది. కోరుకున్నవాటిని మాత్రమే తలచుకుంటారు, అదే అవుతుంది. జూన్‌ ఐదున వ్యవసాయ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ తీసుకు వచ్చి సెప్టెంబరు మూడవ వారానికి పార్లమెంటులో ఆమోదం కూడా పొందారు. కరోనా అడ్డం రాలేదు. కాశ్మీరు రాష్ట్ర రద్దు అయితే ఒకే ఒక్క రోజులో పూర్తి చేశారు. అసెంబ్లీ అభిప్రాయం కూడా తీసుకోలేదు, ఎంత పట్టుదల, ఎంత వేగం ? ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కారు మూడురాజధానులు, ఇతర కొన్ని కేసుల మీద ఉన్న ఆత్రంతో వివాదాల విచారణను వేగవంతం చేయించాలని సుప్రీం కోర్టు తలుపులు తట్టటాన్ని చూశాము. రాష్ట్రానికి అది అత్యంత ప్రాముఖ్యత అంశంగా భావించారు. విశాఖ రైల్వే జోన్‌ సంగతేమిటి ? ఎవరికైనా పట్టిందా, వెంటనే ఉనికిలోకి తీసుకురావాలనే కోరిక ఉందా ?


కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు ప్రకటించిన విశాఖ రైల్వే జోన్‌ ఉనికిలోకి రావటం గురించి అటు కేంద్రానికి పట్టలేదు, ఇటు రాష్ట్రమూ పట్టించుకోలేదు. ఎంత సమయం తీసుకుంటారు ? ఏమిటి ఆటంకాలు ? రాష్ట్ర పునర్విభజన చట్టంలో వాగ్దానం చేసినమేరకు నిర్ణయం తీసుకొనేందుకు దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది. గతేడాది ఫిబ్రవరిలో ఎన్నికల ముందు ప్రకటించారు. పందొమ్మిది నెలలు గడుస్తోంది. ఇప్పుడు ప్రతిదానికి కరోనాను చూపుతున్నారు ? కరోనా కారణంగా ఏది ఆగింది ? రైల్వే జోన్‌ ఉనికిలోకి ఎందుకు రావటం లేదు ?


విశాఖ రైల్వే డివిజన్‌ను రద్దు చేస్తారు, ఆ భవనాల్లో జోనల్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయవచ్చు. సిబ్బందిని కొత్తగా నియమించటం లేదు, ఉన్నవారినే సర్దుబాటు చేయవచ్చు, దానికీ ఇబ్బందీ లేదు.లాక్‌డౌన్‌ దశలవారీ ఎత్తివేస్తున్నారు.నామ మాత్రంగానే కొన్ని ఆంక్షలు ఉన్నాయి. మరి ఆటంకం ఏమిటి ? కొన్ని వసతులు ఏర్పాటు చేసేందుకు డబ్బు కొరతా ? అదేమీ వేల కోట్లు కాదే ! పోనీ అదైనా చెప్పాలి కదా ? రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపివేశారు. వస్తున్న వార్తలను బట్టి వచ్చే ఏడాది కూడా దేశ జిడిపి తిరోగమనంలో ఉంటుందని చెబుతున్నారు. పోనీ పురోగమనంలోకి వచ్చిన తరువాతే ఉనికిలోకి వస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఎవరూ ఏమీ మాట్లాడరు ? ఏమనుకోవాలి ?
వస్తున్న వార్తలను బట్టి సంస్కరణల పేరుతో ఇప్పుడు ఉన్న 17 రైల్వే జోన్లను తగ్గిస్తారా ? అందుకే 18వ జోన్‌ విశాఖను తాత్సారం చేస్తున్నారా ? రైల్వే సంస్కరణల్లో భాగంగా అసలు జోనల్‌ వ్యవస్ధలనే ఎత్తివేసి కార్యకాలపాల ఆధారంగా కొత్త సంస్ధలను ఏర్పాటు చేస్తారా ? అనేక ప్రశ్నలు ముసురుతున్నాయి.ఏమైనా జరగవచ్చు. రైల్వేలను కూడా దశలవారీ ప్రయివేటీకరించే ఆలోచనలో పాలకులు ఉన్నారు.దానికి అవసరమైన నియంత్రణ కమిషన్‌, ధరల పెరుగుదలకో మరొక పెరుగుదలకో చార్జీల పెంపును ముడిపెట్టి ప్రభుత్వ నిర్ణయంతో పని లేకుండా అధికార యంత్రాంగమే నిర్ణయించే ఏర్పాట్లు కూడా ఆలోచనలో ఉన్నాయి.


జపాన్‌లో రైల్వే వ్యవస్ధ ప్రయివేటీకరణ తరువాత సరకు రవాణాకు దేశం మొత్తాన్ని ఒక యూనిట్‌గానే పరిగణించారు, ప్రయాణీకుల విషయానికి వస్తే ఆరు ప్రాంతీయ కంపెనీలను ఏర్పాటు చేసి ఏ మార్గంలో రైళ్లు నడపాలో లేదో నిర్ణయించుకొనే స్వేచ్చ ఇచ్చారు. చైనాలో పునర్వ్యవస్దీకరణలో భాగంగా సరకు రవాణా, ప్రయాణీకులు, రైలు మార్గాల యాజమాన్యాలకు స్వతంత్ర సంస్దలను ఏర్పాటు చేశారు. ఆ మూడు విభాగాల్లో కూడా ఉప విభాగాలు ఉంటాయి. బ్రిటన్‌లో ప్రయివేటీకరణలో భాగంగా 25కంపెనీలను ఏర్పాటు చేసి ప్రయివేటీకరించారు. మన దేశంలో కూడా ప్రయివేటు రైళ్లను అనుమతించాలని నిర్ణయించిన విషయం తెలిసినదే. రైల్వే బోర్డు, జోనల్‌, డివిజన్లను రద్దు చేసి కొత్త వాటిని తీసుకు రారనే హామీ లేదు.


ఈ నేపధ్యంలోనే మూడులక్షల ఉద్యోగాలను రద్దు చేయాలని 55 ఏండ్లు దాటిన వారి జాబితాలను సిద్దం చేయాలని, సిబ్బంది పని తీరును సమీక్షించాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని జోన్లకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం 13-14 లక్షల మంది సిబ్బంది ఉన్నారు.రిటైరైన ఖాళీలను భర్తీ చేయకుండా ఉంచటం, పని తీరు బాగోలేదని భావించిన వారిని నిర్బంధంగా రిటైర్‌ చేయించే ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ విషయమై జోనల్‌ అధికారులకు రాసిన లేఖలు తీవ్ర సంచలనం, ఉద్యోగుల్లో వ్యతిరేకత తలెత్తటంతో వివరణ పేరుతో శాంత పరిచేందుకు మరొక ప్రకటన చేశారు.పని తీరుబాగో లేని వారిని తొలగించటం అంటే కొత్త ఉద్యోగాలు ఉండవని కాదన్నదే దాని సారాంశం. 2014-19 మధ్య 2,83,637 పోస్టుల భర్తీ కసరత్తు జరిగిందని వాటిలో 1,41,060పోస్టులకు పరీక్షలను పూర్తిచేశామని ఆ ప్రక్రియ త్వరలో పూర్తి అవుతుందని పేర్కొన్నది.


పొదుపు చర్యల్లో భాగంగా కొత్తగా రక్షణ సిబ్బందిని తప్ప కొత్తగా ఏ పోస్టును సృష్టించవద్దని ఆదేశించారు. ఉన్న సిబ్బందితో పలు రకాల పనులు చేయించాలి. కనీస సంఖ్యలో సిబ్బందితో పని చేయించేందుకు ఏర్పాటు చేయాలని, కొత్తగా నియామకాలు జరపవద్దని, గత రెండు సంవత్సరాల్లో సృష్టించిన పోస్టుల గురించి సమీక్ష జరపాలని, వాటిలో నియామకాలు జరపకపోతే నిలిపివేయాలని, సిబ్బందిని హేతుబద్దీకరించాలని, ఆర్ధికంగా లాభసాటి గాని శాఖలను మూసివేయాలని, ఇంకా అనేక పొదుపు చర్యలను ఆదేశించారు. 2014కు ముందు ప్రకటించిన గుల్బర్గ, జమ్ము, సిల్చార్‌ తప్ప కొత్త డివిజన్ల ఏర్పాటు ఆలోచన లేదని 2015లో కేంద్ర ప్రకటించింది.విశాఖను రద్దు చేస్తున్నారు కనుక రాయఘడ డివిజన్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు.


విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు గాను విశాఖ డివిజన్‌ను రద్దు చేసి దాని ఆధీనంలోని 30శాతం మార్గాలను విజయవాడ డివిజన్‌లో విలీనం చేసి మిగిలిన వాటితో రాయఘడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి విశాఖ జోన్‌ ఉనికిలోకి రానున్నదని సంకేతాలు ఇచ్చారు.వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్‌)ను గత ఆగస్టులో సమర్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరి లేదా ఏప్రిల్‌ ఒకటి నుంచి కొత్త జోన్‌ కార్యకలాపాలు ప్రారంభించవచ్చని దానిలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న రైల్వే మార్గాలన్నీ విశాఖ జోన్‌లో ఉంచాలని పలువురు కోరారు. కేంద్ర ప్రభుత్వం డిపిఆర్‌ మీద ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్న తరువాత కార్యకలాపాల ప్రారంభానికి నాలుగు నుంచి ఆరునెలల వ్యవధి అవసరం అవుతుందని అంచనా. డిపిఆర్‌ గురించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోనరెడ్డి లేదా ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు గానీ ఈ అంశం మీద కేంద్రాన్ని సంప్రదించినట్లు వార్తలు లేవు.


విశాఖ జోన్‌ ఉనికిలోకి వస్తే ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ పరిధి గణనీయంగా తగ్గిపోతుంది. ఇది ఒడిషాలో రాజకీయ సమస్యలకు దారి తీయవచ్చు. ఈ నేపధ్యంలో రెండు రాష్ట్రాలను ఒకేసారి సంతృప్తి పరచటం సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి కొత్తగా పోయేదేమీ లేదు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ప్రధాన కేంద్రం భువనేశ్వర్‌లో ఉంది. తమ జోన్‌ పరిధి తగ్గిపోనుందనే భయంతో బిజెపి, దాని మిత్ర పక్షం బిజెడి తెచ్చిన వత్తిడి మేరకు విశాఖ డివిజన్నే రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఒడిషాలో బిజెపి పరువును కాపాడేందుకు ఏదో ఒక సాకుతో విశాఖ జోన్‌ ఉనికిలోకి రాకుండా చూడాలని కేంద్రం చూస్తున్నదా ? రైల్వేజోన్ల తగ్గింపు అంశం కూడా పరిశీలనలో ఉన్నదని రైల్వే మంత్రి పార్లమెంట్‌లో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అదే వాస్తవమైతే ఆ పేరుతో విశాఖ రైల్వేజోన్‌ ఇచ్చినట్లుగానూ ఇవ్వనట్లుగానూ ఎటూ తేల్చకుండా ఉంచేందుకు పూనుకున్నారా ? ఏమో ! కేంద్ర పెద్దలు దేనికైనా సమర్ధులు. ఆంధ్రప్రదేశ్‌లో పాలకపార్టీ లేదా బిజెపి లేదా దాని మిత్ర పక్షాలకు ఇదేమీ పట్టినట్లు లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా ఒక దగా ! వి శాఖ రైల్వే జోన్‌ మరో దగా కాదు కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా కట్టడితో చైనాలో ఆనంద హేల – ముట్టడితో అమెరికాలో ఆరోపణల గోల !

03 Saturday Oct 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Blame game in US on Covid-19, Covid-19 two contrast scenarios, Revenge travel in China


ఎం కోటేశ్వరరావు


రెండు దృశ్యాలు ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకచోట ఆనంద హేల ! మరో చోట ఆరోపణల గోల !! కరోనా వైరస్‌ను కట్టడి చేసిన చైనాలో అక్టోబరు ఒకటవ తేదీన ప్రతి ఏటా జరుపుకొనే అరుణపతాక ఆవిష్కరణ ఎంతో ఆర్భాటంగా జరిగింది. 1949 అక్టోబరు ఒకటవ తేదీన చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఇదే సమయంలో శరత్కాల పండుగను కూడా జరుపుకుంటారు. అందువలన రెండింటికి కలిపి వారం రోజుల పాటు ఇచ్చే సెలవులు గడిపేందుకు దాదాపు 55 కోట్ల మంది వివిధ ప్రాంతాలకు పయనమై వెళ్లారు. కరోనాను కట్టడి చేసిన తరువాత చైనాలో సాధారణ జీవనం పునరుద్దరణ అయిందనేందుకు ఇది నిదర్శనం.


మరోవైపు కరోనా నిరోధాన్ని నిర్లక్ష్యం చేసి రెండు లక్షలకు పైగా ప్రాణాలు పోయేందుకు,75లక్షల మందికి కరోనా సోకేందుకు కారకుడైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన నేరం, వైఫల్య నెపాన్ని ఇతరుల మీద నెట్టేందుకు పూనుకున్నాడు. నిర్లక్ష్యంతో అధ్యక్షుడిగా యావత్‌ అమెరికా పౌరులను, చివరకు వ్యక్తిగతంగా తాను, సతీమణికి సైతం కరోనాను అంటించి క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిసారి జరిగిన అభ్యర్ధుల సంవాదంలో ట్రంప్‌ పచ్చి అబద్దాలు, అసత్యాలను పలికాడు. ప్రత్యర్ధి జో బిడెన్‌, మీడియా, ఇతరులు ట్రంప్‌ మీద విరుచుకు పడ్డారు. ఎన్నికలు జరిగే నాటికి కోటి మంది వరకు కరోనా బారిన పడే తీరులో వ్యాధి వ్యాపిస్తోంది. మరోవైపు చైనాలో అడపాదడపా కొన్ని కేసులు వెలుగు చూడటం -అదీ విదేశాల నుంచి దిగుమతి అయ్యేది – తప్ప మొత్తంగా వ్యాధి అదుపులో ఉంది.


మహమ్మారులను ఎదుర్కోవటం,కట్టడి చేయటంలో సోషలిస్టు ప్రభుత్వాల ప్రత్యేకతేమిటో చరిత్రలో తొలిసారిగా ప్రపంచం చూసింది. వంద సంవత్సరాల క్రితం స్పానిష్‌ ఫ్లూ వ్యాప్తి చెందిపెద్ద సంఖ్యలో జనం మరణించిన సమయానికి రష్యాలో బోల్షివిక్‌ ప్రభుత్వం పూర్తిగా నిలదొక్కుకోలేదు. కరోనా కేసులు తొలుత చైనాలో బయట పడిన కారణంగా అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వ జీవ ఆయుధాల తయారీలో భాగంగా బయటకు వదిలారని, ప్రమాదవశాత్తూ బయల్పడిందని ఏ కారణం చెప్పినప్పటికీ చైనా మీద ఆరోపణలు చేసేందుకు, కమ్యూనిస్టు సిద్దాంతం మీద దాడి చేసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. కరోనా పేరుతో అన్ని విధాలుగా ఒంటరి పాటు చేసేందుకు, ఆ పేరుతో ఆర్ధిక ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించిన దేశాలు ఏవో చూశాము. వాటన్నింటినీ తట్టుకొని తన దైన శైలిలో ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని కరోనా నుంచి బయటపడింది.


కరోనా కేసులు తొలుత బయట పడిన ఊహాన్‌ నగరం, హుబెయి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు జరిపిన తీరు ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగలేదు, అన్నింటికీ మించి జనం ఎక్కడా చైనా, వియత్నాంలో మాదిరి సహకరించలేదు. మహమ్మారి నుంచి చైనా సమాజాన్ని బయటపడవేసేందుకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం తీసుకున్న చర్యల మీద జనం అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించారు. దీనికి గత నాలుగు దశాబ్దాలలో సంస్కరణలు అమలు జరిపి జనజీవితాలను మెరుగుపరచిన వాస్తవాన్ని స్వయంగా గమనించటమే కారణం. పదేండ్ల క్రితం ధనికదేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా తమ ఆర్ధిక వ్యవస్ధ కూడా ప్రభావితం అయినప్పటికీ జనాన్ని ఆదుకున్న తీరును, మిగిలిన దేశాల్లో జనజీవితాలు అస్తవ్యస్ధం కావటాన్ని చూశారు గనుకనే కరోనా మహమ్మారిని జయించేందుకు ప్రభుత్వంతో కలసి జనం పోరాడారు.
దాదాపు తొమ్మిది నెలల పాటు క్వారంటైన్‌, లాక్‌డౌన్‌, అనేక ఆంక్షలను అనుభవించిన జనం గత రెండు నెలలుగా కొత్తకేసులు లేకపోవటంతో పంజరాల నుంచి బయట పడిన పక్షులు స్వేచ్చగా ఎగిరే మాదిరి బయటకు వచ్చారు. పరిస్ధితులన్నీ బాగుపడ్డాయనే ధైర్యం వచ్చిన తరువాత కసిగా విహార యాత్రలకు వెళుతున్నారని విశ్లేషకులు వర్ణించారు. ఇది చైనా ఆర్ధిక వ్యవస్దకు కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. సెప్టెంబరు30వ తేదీన 12 కేసులు నమోదు కాగా అవి కూడా విదేశాల నుంచి వచ్చిన వారివే. ఎనిమిది రోజుల పాటు సెలవులను ప్రకటించటం ఏ దేశంలో అయినా జరుగుతుందా ? చైనాలో మాత్రమే చూడగలం. నూటనలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒక్కసారిగా 55 కోట్ల మంది బయటకు వస్తే బహిరంగ స్ధలాలు ఎంత రద్దీ అవుతాయో ఊహించుకోవాల్సిందే. ప్రయాణ సాధనాల్లో, హౌటళ్లలో రిజర్వేషన్లు దొరక్క, ఒక రోజు ముందే వాహనరద్దీతో ఇండ్లకే పరిమితమైన వారెందరో. వాహనాలు నత్తనడక నడిచాయి. ఐదు వందలకు పైగా విహార కేంద్రాలలో ప్రవేశానికి రాయితీలు లేదా ఉచితంగా అనుమతిస్తూ ప్రకటించారు. అక్టోబరు ఒకటవ తేదీ ఒక్కరోజే 14,941 విమానాలు ఏర్పాటు చేశారు. రద్దీని తట్టుకొనేందుకు ప్రత్యేక విమానాలు కూడా సిద్దం చేశారు. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు ఎనిమిది వరకు రైల్వేశాఖ 10.8 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే చైనా సమాజం మీద ఆర్ధికంగా కరోనా ప్రభావం లేదా ? ఉంది కనుకనే గత ఏడాది 80 కోట్ల మంది ప్రయాణాలు చేస్తే ఈ ఏడాది 55 కోట్ల మందే చేస్తున్నారని వెల్లడైంది. గతేడాది 9.5బిలియన్‌ డాలర్ల మేరకు జనం ఖర్చు చేశారు. ఈ ఏడాది తగ్గనుంది.ఆగస్టు నుంచి సాధారణ వస్తుకొనుగోలు పెరిగింది.


కరోనా వైరస్‌ను అదుపు చేయటంలో ఒక్క చైనాయే కాదు, వియత్నాంతో పాటు సామ్రాజ్యవాదుల ఆంక్షల కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న క్యూబా,వెనెజులా కూడా ప్రపంచానికి మార్గంచూపాయి. వియత్నాంలో కరోనాను కట్టడి చేశారు. అయితే అదే పద్దతిని ఇతర దేశాల్లో ఎందుకు అనుసరించటం లేదు ? ఇబ్బందులేమిటి ? అనే చర్చ జరిగింది. చైనాతో వియత్నాంకు సరిహద్దు ఉన్న విషయం తెలిసిందే. ఊహాన్‌ నుంచి వియత్నాం వచ్చిన ఒక చైనా పౌరుడు, అతని కుమారుడిలో జనవరి 30న ఆ వ్యాధి లక్షణాలు బయట పడ్డాయి. 2003లో చైనాలో బయటపడిన సార్స్‌ సోకిన తొలి దేశం వియత్నాం కావటం, గత అనుభవాలను గమనంలో ఉంచుకొని అక్కడి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం వెంటనే కరోనా నివారణకు కఠినమైన చర్యలు తీసుకుంది.వాటికి జనం నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. వియత్నాంలో కేంద్రీకృత అధికార వ్యవస్ధ ఉండటం, వెంటనే నిర్ణయాలు తీసుకొనేందుకు, అమలు చేసేందుకు దోహదం చేసింది. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించటం, లాక్‌డౌన్‌ నిబంధనలను గట్టిగా అమలు జరపటం ఎంతో తోడ్పడింది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం మీద నిఘావేసే చర్యలు తీసుకున్నారు.అనేక దేశాల్లో ప్రభుత్వాలకు అలాంటి అధికారం ఉన్నప్పటికీ జవాబుదారీతనం, తగినన్ని నిధులు లేని కారణంగా ఆ పని చేయలేదు.


ఉత్తర వియత్నాంపై అమెరికా దాడి చేసిన సమయంలో జనాన్ని సిద్దం చేసేందుకు అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అనుసరించిన పద్దతులు ఎంతగానో అమెరికా వ్యతిరేకతను, దేశాన్ని రక్షించుకోవాల్సిన జాతీయ భావనలను జనంలో కలిగించటంలో జయప్రదమయ్యాయి. అమెరికన్లను అడ్డుకొనేందుకు ప్రతి పౌరుడు సాయుధుడు కావాలని ప్రతి ఇల్లు ప్రతిఘటన కేంద్రంగా మారాలని అప్పుడు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు కరోనా మీద యుద్దాన్ని కూడా అదే పద్దతుల్లో చేయాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. ఇది జనాన్ని కదిలించింది. జనం కూడా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు.ఇలాంటి పరిస్ధితి మరేదేశంలోనూ కనిపించదు. సెల్‌ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్ధితిని ప్రభుత్వం వివరించింది. మీడియా సరేసరి. మిలిటరీని కూడా రంగంలోకి దించి జనాన్ని అప్రమత్తం గావించింది. ఈ కసరత్తు అంతా జనానికి పరిస్ధితి తీవ్రతను తెలియ చేసేందుకు కరోనా పోరులో వారిని భాగస్వాములను చేసేందుకు అన్నింటికీ మించి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేందుకు ఎంతగానో తోడ్పడింది. దీనికి సోషలిస్టు చైతన్య స్ఫూర్తి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే జాగ్రత్త అని వేరే చెప్పనవసరం లేదు. ఒక వైపు కరోనాను కట్టడి చేస్తూనే మరోవైపు ఆర్ధిక రంగంపై దాని ప్రభావం పడకుండా చూసిన కారణంగా ఈ ఏడాది ఎనిమిది నెలల్లో అమెరికాతో సహా అనేక దేశాలకు వియత్నాం ఎగుమతులు గత ఏడాది కంటే పెరిగాయి. అమెరికా ఖండ దేశాల నుంచి పెట్టుబడులు కూడా పెరిగాయి. దీనికి అమెరికా-చైనా మధ్య తలెత్తిన వివాదం కూడా తోడైంది.


క్యూబా మీద అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలకు ఆరుదశాబ్దాలు నిండాయి.1991లో సోవియట్‌ రిపబ్లిక్‌లను కూల్చివేసిన తరువాత కూడా అవి కొనసాగుతున్నాయి. అక్కడి కమ్యూనిస్టు పార్టీ జనానికి కలిగించిన చైతన్యం కారణంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలిచింది. అనేక ఆటంకాల మధ్య తనదైన శైలిలో వైద్య రంగంలో అనేక విజయాలను క్యూబా నమోదు చేసింది. కోటీ 15లక్షల జనాభా ఉన్న అక్కడ 90వేలకు పైగా వైద్యులు ఉన్నారు. అక్టోబరు రెండవ తేదీ నాటికి 5,670 కేసులు నమోదు కాగా 122 మంది మరణించారు, 626 మంది చికిత్సపొందుతుండగా తొమ్మిది మంది పరిస్దితి విషమ స్దితిలో ఉన్నారు.1981లో డెంగ్యూ జ్వరాలు ప్రబలిన సమయంలో నివారణకు తీసుకున్న చర్యల అనుభవం ఇప్పుడు కరోనా నివారణకు ఎంతగానో తోడ్పడింది.


అమెరికాలోని జార్జియా రాష్ట్ర జనాభా కూడా క్యూబాకు దగ్గరా కోటీ ఐదు లక్షల మంది. అక్కడ అక్టోబరు రెండవ తేదీనాటికి 3,19,334 కరోనా కేసులు నమోదు కాగా 7,063 మంది మరణించారు, 2,12,023 మంది చికిత్స పొందుతున్నారు. జనం పట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వానికి లేని పాలకులకు, సోషలిస్టు వ్యవస్దకు, పెట్టుబడిదారీ సమాజానికి ఉన్న తేడా ఇది. తన జనాన్ని కాపాడుకోవటమే కాదు 45దేశాలకు అవసరమైన ఔషధాలను, వైద్యులు, సిబ్బందిని పంపింది. క్యూబా ఔషధంగా పేరుగాంచిన ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా2బి తయారీ 2003నుంచి చైనాలో జరుగుతోంది. అది కరోనా చికిత్సకు ఉపయోగపడుతోంది.జనాన్ని చంపటానికైనా సిద్ధపడుతున్నాడు గానీ దాన్ని అమెరికాలో వినియోగించటానికి డోనాల్డ్‌ ట్రంప్‌కు అహం అడ్డువచ్చింది.


అనేక ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పరీక్షలన్నీ క్యూబా ప్రభుత్వం ఉచితంగానే చేసింది.వైద్యం అనేక దేశాల్లో బీమా కంపెనీల ఆదాయవనరుగా, వ్యాపారంగా మారిందంటే అతిశయోక్తి కాదు. క్యూబాలో 1960దశకం నుంచి అభివృద్ది చేసిన ప్రజారోగ్య వ్యవస్ధ జనాన్ని ఆరోగ్యంగా ఉంచటంతో పాటు తక్కువ ఖర్చుతోనే వైద్యాన్ని కూడా అందించగలుగుతోంది. అమెరికాలో ఒక రోజు ఆసుపత్రిలో ఉంటే 1,900డాలర్లు ఖర్చయితే క్యూబాలో ఐదు డాలర్లు, బుడ్డ(హెర్నియా) ఆపరేషన్‌కు 12వేల డాలర్లు అయితే 14, తుంటి ఎముక ఆపరేషన్‌కు 14వేలు అయితే క్యూబాలో 72 డాలర్లు మాత్రమే అవుతుంది. అమెరికాలో 2018లో తలకు 8,300 డాలర్లు ఖర్చు చేస్తే క్యూబాలో 400 డాలర్లు చేశారు. దీనికి అనుగుణ్యంగానే అమెరికాలో వైద్యులకు ఇచ్చే వేతనాలు క్యూబాలో లేవు అన్నది కూడా నిజం. వైద్యులకు వేతనాల కంటే జనానికి వైద్య ఖర్చు తగ్గించటమే సోషలిస్టు క్యూబా ప్రత్యేకత. మిగతావారితో పాటు వైద్యులు కూడా ప్రభుత్వం నుంచి సామాజిక భద్రతను పొందుతారు.


క్యూబా వైద్య విధానాన్ని చూసి ప్రపంచం చాలా నేర్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం వెనెజులాలో 20వేల మంది క్యూబన్‌ వైద్యులు,నర్సులు ఉన్నారు. స్ధానికులతో కలసి వారంతా ఇంటింటికీ తిరిగి కరోనా పరీక్షలు,చికిత్స, అవసరమైన సలహాలు అందించటం నిత్యకృత్యంగా చేస్తున్నారు.దేశంలో 15వేల క్లినిక్స్‌, 572 రోగనిర్దారణ పరీక్షా కేంద్రాలు, 586 చికిత్స కేంద్రాలు, 35 ఉన్నత సాంకేతిక వైద్య కేంద్రాలు గతంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిలో అత్యధిభాగాన్ని కరోనా నిరోధ కేంద్రాలుగా పని చేయిస్తున్నారు. మూడు కోట్ల జనాభా ఉన్న వెనెజులాలో అక్టోబరు రెండవ తేదీ నాటికి 76వేల కేసులు నమోదు కాగా 635 మంది మృత్యువాత పడ్డారు.పక్కనే ఉన్న కొలంబియాలో 8.35లక్షల కేసులు, 26వేల మరణాలు సంభవించాయి. వెనెజులా గురించి అక్కడి జనం పడుతున్న ఇబ్బందుల గురించి కట్టుకధలు చెప్పేవారు ఈ వివరాల గురించి ఏమంటారు? ఆమెరికా, ఇతర అనేక దేశాలు కల్పిస్తున్న ఇబ్బందులను తట్టుకుంటూ వెనెజులా జనాన్ని కరోనా బారిన పడకుండా కాపాడుతున్నది. అంతా సజావుగా ఉందని చెబుతున్న కొలంబియా సంగతి చూశాము. అదే ప్రాంతానికి చెందిన మరో దేశం బ్రెజిల్‌లో 48.5లక్షల కేసులు నమోదు కాగా 1.44లక్షల మంది మరణించారు.


కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన దేశాల్లో చైనా కూడా ఒకటి. వైరస్‌ను అక్కడే తయారు చేసి వదిలారు అని చెబుతున్నవారు మరి దీనికేమంటారు ? జనవరి-మార్చినెలల మధ్య జిడిపి 6.8శాతం తిరోగమనంలో పడగా ఎక్కడైతే మహమ్మారి ప్రారంభమైందో ఆ హుబెరు రాష్ట్రంలో నష్టం 39.2శాతం ఉంది. అయితే ఆ విపత్తును త్వరలోనే అధిగమించి ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో మూడశాతం పురోగమనాన్ని సాధించింది. ఫిబ్రవరి నాటికి 80వేలకు పైగా కేసులుండగా అక్టోబరు రెండున 85,424 కేసులు నమోద కాగా చికిత్స పొందుతున్న వారు 189 మంది, ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది, కొత్తకేసులు పది నమోదయ్యాయి. మే మొదటి వారానికే ఊహాన్‌తో సహా దేశమంతటా 80శాతం ఉత్పాదక కార్యకలాపాలు నమోదయ్యాయి. ఎక్కడికక్కడ పరీక్షలు చేస్తూ వైరస్‌ జాడను కనుగొన్నారు.


చైనాలో వైరస్‌ అదుపులోకి వచ్చిన మే మాసం నుంచి నామ మాత్రంగా కేసులు నమోదు కాగా అమెరికాలో పది లక్షల నుంచి అక్టోబరు రెండు నాటికి 75లక్షలకు పెరిగాయి.25లక్షల మంది చికిత్స పొందుతున్నారు. కరోనాకు ముందు ఎక్కువ మంది ఆర్ధికవేత్తలు 2020లో చైనా ఆర్ధిక వ్యవస్ధ ఆరుశాతానికి అటూ ఇటూగా వృద్ది రేటుతో ఉంటుందని అంచనా వేశారు. 2021 నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. నాటికి 2010లో ఉన్న జిడిపిని రెట్టింపు చేయాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇచ్చింది. దాన్ని చేరుకోవాలంటే ఆరుశాతం వృద్ధి రేటు ఉంటే సాధ్యమే అని అనేక మంది భావించారు. కరోనాతో అది కష్టం కావచ్చని అయినప్పటికీ ఆ దిశగా పని చేయాలని అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ పిలుపునిచ్చారు. 2021నాటికి కాకున్నా ఆ ఏడాది చివరికి అయినా లక్ష్యాన్ని చేరాలనే పట్టుదలతో పని చేస్తున్నారు.


కరోనా కారణంగా ఉద్దీపన పధకాలకు అమెరికా 2.3లక్షల కోట్ల డాలర్లు కేటాయించింది. చైనా 50వేల కోట్ల డాలర్లు కేటాయించింది. అమెరికా అంత మొత్తం ప్రకటించినా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ 2020లో 8శాతం తిరోగమనంలో ఉంటుందని, 2021లో 4.5శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ జూన్‌ అంచనాలో పేర్కొన్నది. అదే చైనా విషయానికి వస్తే ఒకటి, 8.2శాతాలుగా ఉంటుందని పేర్కొన్నది. ప్రపంచంలో ఒక్క చైనా మాత్రమే 2020లో పురోగమన వృద్ధి రేటుతో ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా. కరోనా విషయంలోనే కాదు, ఆర్ధిక రంగంలో చైనా తన సోషలిస్టు వ్యవస్ధ విశిష్టతను ప్రదర్శిస్తోందన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాతో వాణిజ్య ఒప్పందం – మన రైతాంగానికి పొంచి ఉన్న మరో ముప్పు !

01 Thursday Oct 2020

Posted by raomk in AP NEWS, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

Indian agriculture, indian farmers, minimum support price, Trade agreement with US, WTO-India


ఎం కోటేశ్వరరావు


కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లుగా మన దేశ రైతాంగానికి అనేక వైపుల నుంచి ముప్పు ముంచుకు వస్తోంది. ఏ కష్టం వచ్చినా కాచుకొనే ప్రభుత్వం ఉంటే అదొక తీరు. బాధ్యతల నుంచి తప్పుకొంటున్న పాలకులు ఒక వైపు ఉంటే రైతాంగాన్ని నిలువు దోపిడీ చేసే శక్తులు మరోవైపు కమ్ముకు వస్తున్నట్లుగా ఉంది. ప్రభుత్వ సేకరణ, కనీస మద్దతు ధరల విధానాన్ని ఎత్తివేయాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటిఓ) ద్వారా ధనిక దేశాల కార్పొరేట్‌ సంస్దలు తెస్తున్న వత్తిడికి ప్రధాని నరేంద్రమోడీ లొంగిపోయారా ? దాన్ని నీరుగార్చే చర్యల్లో భాగంగానే సంస్కరణల పేరుతో వ్యవసాయ, నిత్యావసర వస్తువుల చట్టాలలో సవరణలు చేశారా ? యావత్‌ వినియోగదారులు, రైతాంగ ప్రయోజనాలను ఫణంగా పెట్టారా ? మరోవైపు అమెరికాతో కుదరబోతోందని చెబుతున్న ఒప్పంద రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. ఒక వేళ కుదిరితే దాని బాటలోనే ఇంకా ఏ దేశాలు ఏ గొంతెమ్మ కోరికలు కోరతాయో తెలియదు. ఇవన్నీ చుట్టుముడుతున్న ప్రశ్నలు, సమస్యలు.


వ్యవసాయ ఉత్పత్తుల పన్నులలో మార్పులు చేర్పులు గురించి ముందుగానే తెలియచేయాలన్న కెనడా తదితర దేశాల ప్రతిపాదనను మన దేశం వ్యతిరేకించింది. అలా చేస్తే అది సట్టాబేరాలకు, ఇతర అక్రమ లావాదేవీలకు దారి తీస్తుందని, ఆహార ధాన్యాల నిల్వల మీద ప్రభావం చూపుతుందని పేర్కొన్నది. పారదర్శకత, వర్తించే పన్నుల గురించి అంచనాలకు వచ్చేందుకు వీలుగా ముందుగానే పన్నుల వివరాలు వెల్లడించాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్య దేశాలైన కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌ తరఫున కెనడా ప్రతినిధి ప్రపంచ వాణిజ్య సంస్ధలోని వ్యవసాయ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న వ్యవసాయ మంత్రుల సమావేశ అజండాను ఖరారు చేసేందుకు ఇటీవల జరిగిన సమావేశంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ముందుగానే పన్నుల వివరాలను వెల్లడిస్తే పండ్లవంటి తాజా ఉత్పత్తులకు ఎంతో మేలు జరుగుతుందని బ్రెజిల్‌ పేర్కొన్నది. ఈ మూడు దేశాల, అదేమాదిరి అభిప్రాయాన్ని ముందుకు తెచ్చిన రష్యా ప్రతిపాదనకు అమెరికా, అర్జెంటీనా, న్యూజిలాండ్‌, ఉరుగ్వే,ఉక్రెయిన్‌ కూడా మద్దతు తెలిపాయి. మనదేశంతో పాటు దక్షిణాఫ్రికా, ఈజిప్టు వ్యతిరేకించాయి.ఈ దేశాలు వ్యక్తం చేసిన కొన్ని అంశాలతో తాము కూడా ఏకీభవిస్తున్నట్లు చైనా పేర్కొన్నది.


ఈ సమావేశంలోనే మన ప్రభుత్వం ఇస్తున్న పంచదార రాయితీలు, రవాణా, మార్కెటింగ్‌ రాయితీల గురించి, ఆహార నిల్వల ప్రభావం ఏమిటంటూ మిగతా దేశాలు ఆరాతీశాయి. పందొమ్మిది బిలియన్‌ డాలర్ల పరిమితిని అతిక్రమించి అమెరికాలో ఇస్తున్న 34బిలియన్‌ డాలర్ల రాయితీల సంగతేమిటని మన దేశంతో సహా అనేక దేశాలు ప్రశ్నించాయి. మన ప్రభుత్వం అనుసరిస్తున్న కనీస మద్దతు ధరల విధానం రైతులకు రాయితీలు ఇవ్వటమేనని, ఇది ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలకు విరుద్దం కనుక ఆ విధానాన్ని ఎత్తివేయాలి లేదా ధరలను తగ్గించాలని అమెరికా, ఐరోపా యూనియన్‌ తదితర దేశాలన్నీ ఎప్పటి నుంచో వత్తిడి తెస్తున్నాయి. తమ చర్యలు నిబంధనలకు లోబడే ఉన్నాయని ఆ వాదనలను ఇప్పటి వరకు మన దేశం తిరస్కరిస్తూ వస్తోంది.


వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో కనీస మద్దతు ధరల కంటే తక్కువకు ఎవరూ కొనటానికి వీలులేదు. దీని ర్ధం వ్యాపారులు పోటీ పడి ఎక్కువకు కొనుగోలు చేయవద్దని కాదు. చమార్కెట్‌ యార్డుల పరిధిలో కొనుగోలు చేసే వారి మీద పర్యవేక్షణ ఉంటుంది. తాజాగా చేసిన సవరణల ప్రకారం యార్డుల పరిధిని కుదించారు. ఆ పరిధి వెలుపల ఎవరైనా ఎలాంటి సెస్‌ చెల్లించకుడా ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ధరలను పర్యవేక్షించే యంత్రాంగం ఉండదు. ఒప్పంద వ్యవసాయం చేసేందుకు కూడా అనుమతిస్తున్నందున రైతులు-వ్యాపార సంస్ధల మధ్య ఒప్పందంలో కనీస మద్దతు ధరల అంశం- ప్రస్తావనే ఉండదు. కంపెనీలు ఏదో ఒక సాకుతో ధరలు దిగ్గొస్తే అధికారులను ఆశ్రయించటం తప్ప న్యాయస్ధానాలకు వెళ్లే అవకాశం లేదు. అధికార యంత్రాంగం ఎవరివైపున ఉంటుందో తెలిసిందే.


2013లో నైరోబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్ధ మంత్రుల సమావేశ నిర్ణయం ప్రకారం 2023వరకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, రవాణా, మార్కెటింగ్‌ రాయితీలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. తరువాత రద్దు లేదా పరిమితం అయ్యే అవకాశం ఉంది. దీని పర్యవసానాలు రైతులకు హానికరంగా ఉంటాయి తప్ప మరో తీరులో ఉండే అవకాశం లేదు.
అమెరికాతో త్వరలో ఒక వాణిజ్య ఒప్పందం కుదరబోతోందని వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ నెల రోజుల క్రితం చెప్పారు. వచ్చిన వార్తలు, జరుగుతున్న చర్చల తీరుతెన్నులను చూస్తే ముందుగా ఒక పరిమిత ఒప్పందం తరువాత సమగ్ర ఒప్పందం జరగబోతున్నట్లు చెబుతున్నారు. ఒప్పందాలకు ముందే అమెరికా కార్పొరేట్లను సంతృప్తి పరచటం లేదా విశ్వాసం కలిగించటానికే కేంద్ర ప్రభుత్వం రెండు వ్యవసాయ చట్టాలు, నిత్యావసర వస్తువుల చట్టానిక సవరణలను ఆర్డినెన్సులుగా తీసుకు వచ్చి పార్లమెంటులో ఆమోదింప చేయించుకున్నట్లుగా స్పష్టం అవుతోంది. ఒక ఆర్డినెన్స్‌ అనేది అత్యవసర సందర్భాలలో మాత్రమే ఉపయోగించే అధికారం. వ్యవసాయ సంస్కరణలు అలాంటివి కాదు. ఉమ్మడి జాబితాలో అంశాల మీద రాష్ట్రాలను సంప్రదించకుండా, రైతు సంఘాలు, పార్టీలతో చర్చించకుండా అసలు పార్లమెంటుతో కూడా నిమిత్తం లేకుండా ముందే ఒక నిర్ణయం చేసి దానికి తరువాత పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేయించటం ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్దం. అమెరికాతో ఒప్పందం కుదరితే అది మన వ్యవసాయ రంగం మీద తీవ్ర ప్రభావం చూపనుందని చెబుతున్నారు. అనేక దేశాలతో అది కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ దాని కార్పొరేట్‌ ప్రయోజనాలకే అనుకూలంగా ఉన్నాయి తప్ప మరొకటి కాదు.


ప్రపంచంలో అడ్డదారి, దొడ్డిదారుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవసాయ సబ్సిడీలు ఇస్తున్నది అమెరికా అన్నది స్పష్టం. 2014లో అమెరికా ఆమోదించిన వ్యవసాయ చట్టం మేరకు పది సంవత్సరాల కాలంలో 956 బిలియన్‌ డాలర్ల సబ్సిడీలు ఇవ్వాలని నిర్ణయించారు. తరువాత 2019లో మరో పదేండ్ల పాటు 867 బిలియన్‌ డాలర్లు అదనంగా కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యంలో మన దేశం మిగులుతో ఉంది. దాన్ని సమం చేసేందుకు మన దేశం మీద వత్తిడి తెచ్చి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు బంద్‌ చేయించి తన చమురును మనకు విక్రయిస్తున్నది. త్వరలో వాణిజ్య ఒప్పందం కుదిరితే అమెరికా వ్యవసాయ సరకులు మన దేశాన్ని ముంచెత్తటం ఖాయం.
చైనాతో వాణిజ్య యుద్దం ప్రారంభించిన అమెరికన్లు దానిలో ముందుకు పోలేక- వెనక్కు రాలేక ఇతర దేశాలకు తమ వస్తువులను అమ్ముకొనేందుకు పూనుకున్నారు.2018లో అమెరికా 7,15,491 టన్నుల పాలపొడి, 5,45,890 టన్నుల పన్నీరు పొడి ( పాలవిరుగుడు), 3,48,561టన్నుల జున్ను, 3,92,166 టన్నుల పాలచక్కెర(లాక్టోజ్‌)ను ఎగుమతి చేసింది. చైనాతో లడాయి కారణంగా అమెరికా పదిశాతం ఎగుమతిని కోల్పోయింది. దీంతో అమెరికాలో రికార్డు స్ధాయిలో ఆరులక్షల టన్నులకు జున్ను నిల్వలు పేరుకుపోయాయి. ఇది మన దేశంలో పన్నెండు సంవత్సరాల జున్ను వినియోగానికి సమానమని అంచనా. ఇప్పుడు మన వంటి దేశాలకు పాడి ఉత్పత్తులను ఎగుమతి చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది.
దేశంలో పన్నీరు పొడి ధర కిలో రు.130-150 మధ్య ఉండగా 30శాతం దిగుమతి పన్ను ఉన్నప్పటికీ కిలో రు.70కంటే తక్కువ ధరకే ప్రతి నెలా వెయ్యి టన్నుల మేరకు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. పన్నీరు, జున్నుతో అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. పాల పొడి ధర మన దేశంలో రు.280-300 మధ్య ఉంది. కొందరు పన్నీరు పొడిని కూడా పాలపొడిగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు అమెరికా, ఇతర దేశాల నుంచి గనుక పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే మన పాల రైతాంగం పరిస్ధితి ఏమిటి ? దిగుమతి పన్ను 30శాతానికి మించి పెంచినా అమెరికా లేదా న్యూజిలాండ్‌ వంటి దేశాలు ఇస్తున్న సబ్సిడీల కారణంగా మన దేశంలో ఉన్న ధరల కంటే తక్కువ ధరకే దిగుమతి చేసుకోవచ్చు. దాంతో మన పాలరైతులు పాడి పరిశ్రమకు దూరం కావాల్సిందే. ప్రపంచ వ్యాపితంగా జున్ను తయారీలో దూడల పేగుల్లోంచి తీసిన పదార్దాన్ని తోడు కింద వినియోగిస్తారు. మన దేశంలో అలా వినియోగించటం చట్టవిరుద్దం. అయితే దిగుమతి చేసుకొనే దానిలో అలాంటి తోడు వినియోగించారా లేదా అన్నది తయారీదారులు చెబితే తప్ప తెలుసుకోవటం కష్టం.అమెరికా, ఐరోపా దేశాల్లో ఆవులకు వేసే దాణాలో జంతువుల ఎముకలతో తయారు చేసిందాన్ని వినియోగిస్తారు. అలాంటి వాటితో తయారు చేసిన పదార్ధాలు మన దేశానికి ఇప్పటికే దొడ్డిదారిన వస్తున్నాయి. ఇది ఒక విధంగా కొన్ని తరగతుల వినియోగదారులను మోసం చేయటం తప్ప మరొకటి కాదు. ఇలాంటి వాటిని కస్టమ్స్‌ సిబ్బంది గుర్తించలేరు.వ్యవసాయం తరువాత మన దేశంలో పాడి రైతులు ఎక్కువ. పాలకూ కనీస సేకరణ ధర నిర్ణయించాలని చాలా కాలం నుంచి రైతులు కోరుతున్నారు. అయితే తమకటువంటి ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం గతేడాది జూన్‌లో స్పష్టం చేసింది.


మన దేశంలో సోయాను గణనీయంగా ఉత్పత్తి చేస్తున్నారు. చైనాతో సాగిస్తున్న వాణిజ్య యుద్దం కారణంగా అమెరికా సోయా ఎగుమతులు పదకొండు శాతం పడిపోయాయి. దాన్ని మన దేశానికి ఎగుమతులు చేయటం ద్వారా భర్తీ చేసుకోవాలని అమెరికా ఆత్రంగా ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల మేరకు 2019-20లో టారిఫ్‌ రేటు కోటా కింద లక్ష టన్నులు, 2020-21లో మరో ఐదు లక్షల టన్నుల మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి కేవలం 15శాతం పన్నుతోనే దిగుమతులకు అనుమతించింది.ఇది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వత్తిడి మేరకు జరిగింది. ఈ కారణంగా మన దేశంలో రైతాంగం కనీస మద్దతు ధరలకంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. 2016 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం గోధుమల దిగుమతుల మీద పన్నులను తగ్గించింది దాంతో 5.9 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకున్నాము. తరువాత కాలంలో రైతాంగం గగ్గోలు పెట్టటంతో గత ఏడాది ఎన్నికల సమయంలో తిరిగి దిగుమతి పన్ను పెంచింది. అంటే పన్ను తగ్గింపు మన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక వైపు మనం గోధుమలను ఎగుమతి చేసే స్ధితిలో ఉన్నామని చెప్పే ప్రభుత్వం దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలని చెబుతున్నారు. మరి రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఏమిటి ? విదేశీ గోధుమలతో మన దేశంలో డిమాండ్‌ తగ్గి ధరలు తగ్గితే పరిస్దితి ఏమిటి ?


అమెరికా నుంచి ఇప్పటికే పండ్లు, కూరగాయలను మనం దిగుమతి చేసుకుంటున్నాము, అవి పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన వ్యవసాయ చట్టాల సవరణల్లో ఒప్పంద వ్యవసాయం గురించి చెప్పింది. భారీ ఎత్తున అమెరికా ఇస్తున్న సబ్సిడీలతో పోటీ పడి మన దేశం పండ్లు, కూరగాయలు, పూలను ఎగుమతి చేసే స్ధితిలో ఉందా ? మన రైతాంగాన్ని దెబ్బతీసే దిగుమతులు ఎందుకు, విదేశీ కొనుగోలుదారులకు సబ్సిడీలు ఇచ్చి మన దేశం నుంచి ఎగుమతులెందుకు ?
అమెరికా లేదా మరొక దేశంతో వ్యవసాయ ఉత్పత్తుల గురించి మన దేశం కుదుర్చుకోబోయే ఒప్పందంలో ఇప్పుడున్న దిగుమతి పన్నులను తగ్గించకుండా అమెరికా అంగీకరిస్తుందా ? తగ్గిస్తే మన రైతుల సంగతేమిటి ? ఉదాహరణకు యాపిల్‌ పండ్లపై మన దేశం విధిస్తున్న పన్ను 50శాతం ఉన్నపుడు 2018 జనవరి నుంచి జూన్‌ 15 మధ్య అమెరికా నుంచి 78లక్షల బాక్సులను దిగుమతి చేసుకున్నాము. పన్ను మొత్తాన్ని 70శాతానికి పెంచటంతో మరుసటి ఏడాది అదే కాలంలో దిగుమతులు 26లక్షల బాక్సులకు పడిపోయాయి. దిగుమతి పన్నులు ఎక్కువగా ఉంటేనే కాశ్మీర్‌, హిమచల ప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లోని యాపిల్‌ రైతులకు మేలు జరుగుతుంది. అదే తగ్గిస్తే ?


మనం పత్తిని ఎగుమతి చేస్తున్నాం-ఇదే సమయంలో భారీ సబ్సిడీలు ఇస్తున్న అమెరికా పత్తిని మన మిల్లు యజమానులు దిగుమతి చేసుకుంటున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న అనేక వ్యవసాయ ఉత్పత్తుల పరిస్ధితి ఇదే, పన్ను తక్కువగా ఉన్నపుడు ఇబ్బడి ముబ్బడిగా మన కార్పొరేట్‌ లేదా వాణిజ్య ” దేశభక్తులు ” దిగుమతి చేసుకొని మన రైతాంగాన్ని దెబ్బతీస్తున్నారు. రైతాంగం కన్నెర్ర చేయటంతో పాలకులు పన్నులు పెంచాల్సి వస్తోంది. దాంతా కాస్త ఊరట కలుగుతోంది. ఈ దోబూచులాట ఎంతకాలం ? రైతులు ఆరుగాలం పంటలు పండించాలా ? ప్రతిక్షణం పాలకుల విధానాల మీద కన్నువేసి వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయాలా ?


ప్రస్తుతం మన దేశం అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య సంప్రదింపుల స్వభావం ఏమిటి ? మన దిగుమతి పన్నులను తగ్గించేందుకు బేరమాడుతోంది. బెదిరింపులకు దిగింది. మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులకు ప్రాధాన్యత పధకం (జనరలైజ్‌డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ ాజిఎస్‌పి) కింద ఇస్తున్న పన్ను రాయితీలను డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తివేశాడు. అదే విధంగా మరికొన్ని ఉత్పత్తుల మీద అదనంగా దిగుమతి పన్ను విధించాడు. ఇవన్నీ మనలను లొంగదీసుకొనేందుకు అమెరికా అనుసరిస్తున్న బెదిరింపు ఎత్తుగడల్లో భాగమే.


బర్డ్‌ ఫ్లూ సమస్య తలెత్తినపుడు 2007లో మన దేశం అమెరికా నుంచి కోళ్ల ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించింది. మన కోళ్ల పరిశ్రమ రక్షణ కోసం ఆ సమస్య తొలగిన తరువాత కూడా అది కానసాగింది. అయితే ఆ చర్య నిబంధనలకు విరుద్దం అంటూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో కేసు వేసి 2014లో అమెరికా గెలిచింది. దాంతో నరేంద్రమోడీ సర్కార్‌ 2017లో నిషేధాన్ని ఎత్తివేసింది. దిగుమతులపై వందశాతం పన్ను విధించింది. అయినప్పటికీ మన మార్కెట్లో దొరికే వాటి కంటే చౌక కావటంతో కోడి కాళ్ల దిగుమతులు ప్రారంభం అయ్యాయి. ఆ పన్ను మొత్తాన్ని తగ్గించాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది. అదే జరిగితే మన బాయిలర్‌ కోళ్ల ఫారాలు, వాటికి రుణాలు ఇస్తున్న బ్యాంకులు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతాయి.


అమెరికా ఇప్పటికే మధ్య అమెరికాలోని చిలీ వంటి దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల ప్రాతిపదికనే మన దేశం కూడా ఒప్పందం చేసుకోవాలని వత్తిడి వస్తోంది. అదే జరిగితే వ్యవసాయ రంగం కుదేలు అవుతుంది. అది ఒక్క అమెరికాకే పరిమితం కాదు. మనతో వాణిజ్య సంబంధాలున్న మిగతా దేశాలు కూడా అదే విధమైన రాయితీలు కోరతాయి. విత్తన వాణిజ్యం మీద ప్రస్తుతం ఉన్న నియంత్రణలను మరింత సడలిస్తే మాన్‌శాంటో, కార్గిల్‌, సింజెంటా వంటి కంపెనీల దోపిడీకి అడ్డు ఉండదు. గుజరాత్‌లో పెప్సీ కంపెనీ తన అనుమతి లేకుండా తన పేటెంట్‌ హక్కు ఉన్న బంగాళాదుంప విత్తనాలను సాగు చేశారంటూ మన దేశానికి వర్తించని నిబంధనలతో పదకొండు మంది రైతుల మీద కేసులు వేసిన విషయం తెలిసిందే.
మన కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు నిర్ణయిస్తున్న కనీస మద్దతు ధర ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలకు వ్యతిరేకం కనుక ఆ విధానాన్ని రద్దు చేసేట్లు ఆదేశించాలని అమెరికా, కెనడా దాఖలు చేసిన కేసులు విచారణలో ఉన్నాయి. ఈ ధరల నిర్ణయం రాయితీగా వర్ణిస్తూ అవి అనుమతించిన దానికంటే 26 రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నది వాటి వాదన. ఉత్పత్తి విలువ లెక్కింపు పద్దతిలో తేడా ఉంది. అమెరికా, కెనడా వంటి దేశాలు మన రూపాయిని యూనిట్‌గా తీసుకొని లెక్కిస్తున్నాయి. మన దేశం డాలరు ప్రాతిపదికగా లెక్కవేస్తోంది. ఉదాహరణకు మన దేశం పప్పుదినుసుల విలువ రూ.2,677 కోట్ల రూపాయలుగా చూపుతుంటే అమెరికా రూ.69,923కోట్లుగా లెక్క చెబుతోంది. మన ప్రభుత్వం సేకరించే సరకునే పరిగణనలోకి తీసుకుంటే అమెరికా మొత్తం ఉత్పత్తి విలువను లెక్క వేస్తోంది. చైనా మీద కూడా అమెరికా ఇలాంటి కేసే వేసింది. వీటిని భారత్‌, చైనా రెండూ కలసి వ్యతిరేకిస్తున్నాయి.


భారత ఆహార సంస్ధ అనవసరంగా ధాన్య నిల్వలు చేస్తున్నదనీ, కనీస మద్దతు ధరల విధానం అసమర్దతకు ప్రోత్సాహం అనే దివాలాకోరు వాదనలు చేసే వారు కూడా ఉన్నారు. ఒక ఎకరానికి పది క్వింటాళ్ల ధాన్యం పండించే రైతుకూ, 15క్వింటాళ్లు పండించే రైతుకూ కనీస మద్దతు ధర ఒకటే ఉంటుందనే రీతిలో వారి వాదనలు ఉన్నాయి. తక్కువ ఉత్పత్తి ఖర్చు, తక్కువ నీటిని వినియోగించే వారికి ప్రోత్సాహం ఇవ్వటం లేదని చెబుతారు. ఇవన్నీ ఆ విధానాలను రద్దు చేయాలనే దుష్ట ఆలోచన ఉన్నవారు ముందుకు తెచ్చే వాదనలు. కనీస మద్దతు ధర ఎత్తివేస్తే ప్రయివేటు వ్యాపారులు అలాంటి రైతులను గుర్తించి వారికి అదనపు ధర లేదా మరో రూపంలో ప్రోత్సాహం అందిస్తారా ? ఏ దేశంలో అయినా అలా జరిగిందా ? ఉన్న వ్యవస్ధలో లోపాలను సరిదిద్దటాన్ని ఎవరూ వ్యతిరేకించటం లేదు. అంతకంటే మెరుగైన వ్యవస్ధ లేకుండా ఉన్నదాన్ని నిర్వీర్యం చేస్తే దిక్కేమిటి ? ఇదే రైతులు ముందుకు తెస్తున్న ప్రశ్న !


రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వచ్చేందుకు వీలుగా ముందు ఒక పరిమిత ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికాలో మన రాయబారిగా ఉన్న తరంజిత్‌ సింగ్‌ సంధు ఆగస్టు 21న ఫిక్కి సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం మన దేశం మన అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తుల మీద అమెరికా విధించిన అధిక పన్నులను వెనక్కు తీసుకోవాలని, జిఎస్‌పి కింద రద్దు చేసిన రాయితీలను పునరుద్దరించాలని కోరుతోంది. తాము ఆపని చేయాలంటే తమ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు భారత మార్కెట్‌ను తెరవాలని, ఐటి ఉత్పత్తుల మీద పన్నులు తగ్గించాలని వాణిజ్యలోటును తగ్గించాలని అమెరికా అంటోంది. తమకే అగ్రస్ధానం అన్నది అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నా అనుసరించే వైఖరి. నవంబరు ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఇదే సమస్య ముందుకు రానుంది. ఆ వత్తిడిని మన పాలకులు తట్టుకుంటారా ? మన రైతులు, పరిశ్రమలకు రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటారా ? ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మన ముందు ఉంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d