• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Asia

డోనాల్డ్‌ ట్రంప్‌రుద్దిన వాణిజ్య పోరు : చైనా గెలిస్తే అమెరికా పరిస్థితి ఏమిటి ?

23 Wednesday Apr 2025

Posted by raomk in Asia, BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

China, Donald trump, Narendra Modi Failures, Trade talks, TRADE WAR, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ప్రపంచం మీద తాను రుద్దిన వాణిజ్య పోరు డోనాల్డ్‌ ట్రంప్‌ పదవికి గండం తేనుందా ? దాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికన్లు సహిస్తారా ? ఈ పోరులో చైనా గెలిస్తే అమెరికా పరిస్థితి ఏమిటి ? ఇలా పరిపరి ఆలోచనలు ప్రారంభమయ్యాయి. రెండు దిగ్గజాల మధ్య కేంద్రీకృతమైన వివాదాన్ని ఆసరా చేసుకొని లబ్దిపొందాలని కొన్ని దేశాలు చూస్తున్నాయి. తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఒప్పందాలు కుదుర్చుకుంటే అలాంటి దేశాలపై తాము గట్టి ప్రతి చర్యలు తీసుకుంటామని సోమవారం నాడు చైనా హెచ్చరించింది. వాణిజ్య పోరులో విజేతలు ఉండరన్నది సాధారణ అభిప్రాయం, అది నిజమేనా ? ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి ? మన దేశం బ్రిటీష్‌ వలస పాలనలోకి వెళ్లక ముందు చేనేత వస్త్రాలకు ఎంతో ప్రసిద్ధి. బ్రిటన్‌తో సహా అనేక దేశాలకు అవి ఎగుమతి అయ్యేవి. అలాంటి వాటిని బ్రిటన్‌ పారిశ్రామిక విప్లవం మింగేసింది. ఇప్పుడు ట్రంప్‌ దిగుమతి పన్ను విధించినట్లుగా మన చేనేత వస్త్రాల మీద నాటి బ్రిటన్‌ కూడా పన్ను విధించి అడ్డుకుంది, చౌకగా తయారయ్యే తన మిల్లు వస్త్రాలను మనదేశంలో కుమ్మరించింది. మన మార్కెట్‌ను ఆక్రమించింది. పత్తి ఎగుమతి దేశంగా మార్చింది. నాడు భారత్‌ పరాధీన దేశం, వ్యతిరేకించిన వారు లేరు. ఇప్పుడు అమెరికా పన్నులతో చైనా వస్తువులను అడ్డుకోవాలని చూస్తోంది. చైనా సర్వసత్తాక స్వతంత్ర దేశం, అమెరికాను ఢీ అంటే ఢీ అనే స్థితిలో ఉంది, ఆట కట్టించాలని చూస్తోంది.చిత్రం ఏమిటంటే అసలైన దేశభక్తులం అని చెప్పుకుంటున్న మన పాలకులు మా ఆయుధాలు, వస్తువులు కొంటారా లేదా అని అమెరికా కొరడా రaళిపిస్తే కంటి చూపులేదు, నోట మాట లేదు.ఏం జరుగుతోంది మహాత్మా ఓ మహాత్మా !


డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు తమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఒప్పందాలు చేసుకొనే దేశాల మీద చర్యలు తప్పవని చైనా తీవ్ర హెచ్చరిక చేసింది.తమతో వాణిజ్యం చేసే దేశాలు చైనా మీద ఆంక్షలు విధించాలని, దానికి ప్రతిగా అలాంటి వాటికి పన్నులను మినహాయిస్తామని అమెరికా చెబుతున్నదని, సంతుష్టీకరణ శాంతిని, రాజీ గౌరవాన్ని తీసుకురాదని చైనా పేర్కొన్నది.అమెరికా చర్యలు చర్మం ఇమ్మని పులిని కోరటంగా వర్ణించింది. ప్రస్తుతం జపాన్‌, దక్షిణ కొరియా, భారత్‌ మరికొన్ని దేశాలు ట్రంప్‌ యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నాయి. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ ప్రస్తుతం ఢల్లీి పర్యటనలో ఉన్నాడు. చైనా వస్తువులపై 145శాతంగా విధించిన పన్ను, కొన్ని వస్తువులపై 245శాతం వరకు పెంచుతామని అమెరికా బెదిరించింది. తమ మీద విధించిన పన్నుల కారణంగా తీసుకోలేమంటూ అమెరికా కంపెనీ బోయింగ్‌ జెట్‌ను చైనా తిప్పి పంపింది. అమెరికాతో కలసి చైనాను దెబ్బతీయాలని మనదేశంలో కొందరు యాంకీల ఏజంట్లు నూరిపోస్తున్నారు.చైనా సరఫరా గొలుసులో మనం చేరి దాని స్థానాన్ని ఆక్రమించాలని కొందరు చెబుతున్నారు. నిజానికి స్వంత సత్తాతో ఆస్థాయికి చేరాలని ఎవరైనా కోరుకోవటం తప్పు కాదు. కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదలేరు, అలాగే అమెరికా వెంట నడచిన ఏ దేశమూ చరిత్రలో బాగుపడిన దాఖలా లేదు. కాసేపు దీని గురించి పక్కన పెట్టి వాణిజ్య పోరు గురించి జరుగుతున్న మధనం ఎలా ఉందో చూద్దాం. అమెరికా తాను చేస్తున్న ప్రతిదీ సరైనదే అనుకుటుంది కానీ సమస్య ఏమిటంటే ట్రంప్‌ ప్రతినిర్ణయం తప్పుగా తేలుతోంది.ఏప్రిల్‌ ఐదున జనం 20లక్షల మంది వీధుల్లోకి రాగా 19వ తేదీన మరోసారి పెద్ద ఎత్తున రాజరికం లేదు, రాజులేడు అంటూ నినదించారు. రెండువందల యాభై సంవత్సరాల క్రితం 1775 ఏప్రిల్‌ 19న బ్రిటన్‌ రాజరికానికి వ్యతిరేకంగా అమెరికన్లు పోరు ప్రారంభించిన రోజది. చైనా కమ్యూనిస్టులను అణచివేయాలని చూసింది అమెరికా. అయితే లాభాల కోసం అదే చైనా మార్కెట్‌ను ఉపయోగించుకోవాలనే ఎత్తుగడతో కమ్యూనిస్టు చైనాను భద్రతా మండలిలో శాశ్వత దేశంగా ఆమోదించింది.తరువాత కూడా ఒక వైపు లాభాలు పొందుతూనే మరోవైపు చైనా ఎదగకుండా కేవలం తనమీదే ఆధారపడే ఒక ఎగుమతిదేశంగా పరిమితం కావాలని చూసింది. తియన్మెస్‌ మైదానంలో విద్యార్ధుల ప్రదర్శనలు, హాంకాంగ్‌లో స్వాంత్య్రం పేరుతో జరిగిన ప్రదర్శనలు, తైవాన్‌ వేర్పాటు వాదం వెనుక దాని హస్తం గురించి తెలిసిందే. మొత్తంగా చెప్పాలంటే గత ఐదు దశాబ్దాలలో అమెరికా అనుసరించిన ప్రతిప్రతికూల విధానమూ చైనాను మరింతగా పటిష్టపరిచాయి తప్ప బలహీనపరచలేదు, దీని అర్ధం కొన్ని తాత్కాలిక సమస్యలూ, ఎదురుదెబ్బలూ లేవని కాదు. డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలతో భౌగోళిక రాజనీతిలో చైనా స్థాయి మరింత బలపడుతుందని అమెరికాను ఆర్థికంగానూ, రాజకీయంగా దాటిపోతుందని కమ్యూనిస్టు వ్యతిరేకులు వాపోతున్నారంటే అతిశయోక్తి కాదు.


చిత్రం ఏమిటంటే అమెరికన్లు, వారి చెప్పుల్లో కాళ్లు పెట్టి నడవాలని చూసే కాషాయ తాలిబాన్ల ఆలోచన ఒకే విధంగా ఉంది. గాల్వన్‌ ఉదంతం జరిగినపుడు మనం గనుక చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే డ్రాగన్‌ మన కాళ్ల దగ్గరకు వస్తుందని చెప్పినట్లే ఇప్పుడు ట్రంప్‌ గాంగ్‌ అంటోంది. చైనా మనకు చేసే ఎగుమతులతో పోల్చితే మనం చైనాకు ఐదోవంతు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం, అందువలన మన దిగుమతులు ఆగిపోతే నష్టం వారికే అని అమెరికా విత్తమంత్రి స్కాట్‌ బెసెంట్‌ చెప్పాడు. అమెరికా దిగుమతులు దాని పెద్ద బలహీనత తప్ప బలం కాదు.2018లో ఇదే ట్రంప్‌ చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించాడు.వారి వస్తువుల మీద ఆధారపడటం నిలిపివేయాలన్నాడు. జరిగిందేమిటి ? గత ఏడు సంవత్సరాల్లో అమెరికాకు చైనా ఎగుమతులు 19.2 నుంచి 14.7శాతానికి మాత్రమే తగ్గాయి.పూర్తిగా నిలిపివేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు.జి 7 దేశాలకు చైనా ఎగుమతులు 2000 సంవత్సరంలో 48శాతం జరగ్గా 2024లో 30శాతానికి తగ్గాయి. ఇంత జరిగినా గత పదేండ్లలో ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 13 నుంచి 14శాతానికి పెరిగింది. దీని అర్ధం ఏమిటి ? చైనా తన సరకులకు ఎప్పటి నుంచో ప్రత్నామ్నాయ మార్కెట్లను వెతుక్కుంటోంది.చైనా అనే చెరువు మీద అమెరికా అలిగితే ఎండిపోయేది అమెరికన్లకే.ఎందుకంటే ప్రస్తుతం అది దిగుమతి చేసుకుంటున్న వస్తువులను తయారు చేసుకోవాలంటే దశాబ్దాలుగాకపోయినా సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. అప్పటిదాకా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న టాయిలెట్‌ పేపర్‌ వంటి వాటి దిగుమతి ఆపివేస్తారా ? ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే సరఫరా చేసే స్థితిలో ఎన్ని ఉన్నాయి ? అమెరికా బోయింగ్‌ జెట్‌ విమానాలు గాకపోతే చైనా ఐరోపా ఎయిర్‌బస్‌లను దిగుమతి చేసుకుంటుంది, లేదూ స్వయంగా తానే పూర్తిగా సమకూర్చుకొనేందుకు ఇప్పటికే ప్రారంభించిన కార్యక్రమాన్ని మరింతవేగవంతం చేస్తుంది. ఇతర వస్తువులను వేరే దేశాల నుంచి తెచ్చుకుంటుంది. మిషిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జాసన్‌ మిలెర్‌ పోగుచేసిన సమాచారం ప్రకారం ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే లిథియమ్‌ బ్యాటరీలు, ఎయిర్‌ కండీషనర్లు, వంటపాత్రల్లో 70, స్మార్ట్‌ ఫోన్లు, వంటగది పరికరాలు, బొమ్మల్లో 80, సూర్యరశ్మి పలకల్లో 90శాతాల చొప్పున చైనా తయారు చేస్తున్నది. కార్లు, ఫోన్లు, అనేక మిలిటరీ పరికరాలకు కీలకంగా అవసరమైన అపురూప ఖనిజాలు, లోహాలు కూడా చైనా దగ్గర గణనీయంగా ఉన్నాయి.

సకల దేశాలూ తన వస్తువులనే కొనాలని చైనా ఎవరినీ దేబిరించే స్థితిలో లేదు. విదేశాలకు అవసరమైన వాటిని కావాలనుకున్నవారికి ఉత్పత్తి చేస్తున్నది, మార్కెట్‌లేకపోతే నిలిపివేస్తుంది, నూటనలభై కోట్ల తనజనాభాకు అవసరమైన వాటి మీద కేంద్రీకరిస్తుంది.ఇప్పటికే ఆప్రక్రియ ప్రారంభమైంది. ఏండ్ల తరబడి సంపాదించిన వాణిజ్య మిగులులో కొంత భాగం సబ్సీడీగా ఇస్తే అంతర్గత మార్కెట్‌ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే సోయా,జొన్నలు, మొక్క జొన్నలను ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకోవచ్చు.పశ్చిమ దేశాల మీద ఆధారపడే రంగాలను గుర్తించి స్వయం పోషకత్వం సాధించేందుకు బీజింగ్‌ పూనుకుంది. దాన్లో భాగంగానే హరిత ఇంథనం, వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం, సెమీకండక్టర్ల రంగాలలో భారీ మొత్తాలను ఖర్చు చేస్తున్నది. విపరీత పరిస్థితులలో కూడా జాతీయ ఆర్థిక రంగం సాధారణ కార్యకలాపాలను సాగించే విధంగా చూడాలని అధ్యక్షుడు షీ జింపింగ్‌ విధాన నిర్ణేతలను కోరాడు. యుద్ధం అన్న తరువాత ఓడిన వారికే కాదు విజేతలకూ దెబ్బలు తగులుతాయి, నష్టాలు సంభవిస్తాయి, వాణిజ్య యుద్ధమూ అంతే.


ఎదురుదాడిలో భాగంగా అమెరికాకు ఎగుమతి అవుతున్న అపురూప ఖనిజాల ఎగుమతులను చైనా నిషేధించింది. అవి జలాంతర్గాములు, ఫైటర్‌ జెట్ల తయారీలో కీలకంగా ఉంటాయి.తన అంబుల పొదిలో ఉన్న అస్త్రాలను అవసరాన్ని బట్టి బయటకు తీస్తున్నది.ఇప్పటికే బోయింగ్‌ విమానాల కొనుగోలు నిలిపివేసింది, కొన్ని కంపెనీలను నిషేధిత జాబితాలో చేర్చింది.యాపిల్‌,గూగుల్‌, డ్యూపాంట్‌్‌, టెస్లా వంటి కంపెనీలు తరువాత వరుసలో ఉన్నాయి.జపాన్‌ తరువాత భారీ మొత్తంలో డాలర్ల నిల్వలున్న దేశం చైనా. వాటి నుంచి అమెరికాకు 760 బిలియన్‌ డాలర్ల మేర అప్పులిచ్చింది. ట్రంప్‌ పిచ్చిపనులు కొనసాగిస్తే ఆ బాండ్లను ఒక్కసారిగా విక్రయిస్తే అమెరికాలో వడ్డీ రేట్ల పెరుగుదల, ద్రవ్య సంక్షోభానికి దారి తీస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఇలాంటి ఆర్థిక పరమైన దెబ్బతీసే పద్దతులను చైనా పరిశీలిస్తున్నది.అమెరికా దగ్గర కూడా కొన్ని ఆయుధాలు లేకపోలేదు. ఐరోపా, ఆసియాలో తన మిత్రదేశాలను చైనాపైకి ఉసిగొల్పేందుకు పూనుకుంది. అయితే ప్రతికూల పన్నుల విధింపులో ఏ దేశాన్నీ వదలని కారణంగా అవన్నీ జతకట్టటం సందేహమే. తమ కోసం అన్ని దేశాలూ కాస్త నొప్పి భరించాల్సిందే అంటున్నాడు ట్రంప్‌. ఎవరి సంగతి వారు చూసుకోవాలనే రక్షణాత్మక వైఖరులు పెరుగుతున్న తరుణంలో ఎంత మేరకు ఇతర దేశాలు అంగీకరిస్తాయో తెలియదు. అయినప్పటికీ ముందే చెప్పుకున్నట్లు ఇతర దేశాలను చైనా సోమవారం నాడు ముందస్తుగా హెచ్చరించింది. మారిన పరిస్థితులను ట్రంప్‌ గమనిస్తున్నట్లు లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిపిన సర్వేల్లో మెక్సికో, కెనడా, ఐరోపా దేశాల మీద పన్నులు విధించటాన్ని వ్యతిరేకించినప్పటికీ చైనా మీద దాడిని 56శాతం మంది సమర్ధించినట్లు సిబిఎస్‌ తెలిపింది.కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎక్కించుకున్న వారు సహజంగానే చైనా మీద దాడిని అంగీకరిస్తారు. కానీ అదే ట్రంప్‌ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలేమిటి ?ద్రవ్యోల్బణం, ధరలను, పన్నుల భారం తగ్గిస్తానని చెప్పాడు. గద్దె నెక్కగానే విముక్తి పేరుతో ఎడాపెడా పన్నులు విధింపు ప్రకటన చేయగానే అమల్లోకి రాక ముందే ధరలు పెరిగి జనం కొనుగోళ్లకు ఎగబడ్డారా లేదా ? కొత్తగా అన్న వస్త్రాలు వస్తాయనుకుంటే ఉన్న వస్త్రాలను ఊడగొట్టినట్లుగా భరించలేని భారాలను మోపితే జనం సహిస్తారా ? ఇప్పటికే రెండుసార్లు లక్షలాది మంది వీధుల్లో ప్రదర్శనలు చేశారు. అందుకే తేడా వచ్చేట్లు ఉందని ఆలోచించుకోవటానికి మూడు నెలల పాటు పన్నుల పెంపుదల పదిశాతానికే పరిమితం చేసి మిగతా వాటిని వాయిదా వేయాల్సి వచ్చింది. గతంలో మాదిరి ధరలు, నిరుద్యోగం పెరుగుదల సంభవించవచ్చనే హెచ్చరికలు వెలువడ్డాయి.ట్రంప్‌ మొరటుగా ముందుకు పోతాడా తెలివి తెచ్చుకొని వెనక్కు తగ్గుతాడా అన్నది చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

దక్షిణ కొరియాలో కుట్ర : అధ్యక్ష కార్యాలయంపై పోలీసు దాడి, మిలిటరీ పాలన పత్రాల స్వాధీనం !

11 Wednesday Dec 2024

Posted by raomk in Asia, Current Affairs, History, INTERNATIONAL NEWS, Uncategorized

≈ Leave a comment

Tags

South Korea martial law, South Korea’s Six-Hour Coup, South Korean president, Yoon Suk Yeol


ఎం కోటేశ్వరరావు


అత్యవసరపరిస్థితి పేరుతో సైనిక పాలనకు తెరతీసి కేవలం ఆరుగంటల వ్యవధిలో అనివార్య పరిస్థితుల్లో ఎత్తివేసిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ దేశం విడిచి పోకుండా అక్కడి అవినీతి నిరోధకశాఖ ప్రధాన కార్యాలయం ఆంక్షలు విధించింది. అధ్యక్ష కార్యాలయం, ఇతర భద్రతా విభాగాల ఆఫీసులపై కూడా పోలీసులు దాడి చేసి సైనిక పాలన విధింపు సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారని బుధవారం నాడు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో అధ్యక్షుడు కార్యాలయంలో లేడని చెబుతున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న మాజీ రక్షణ మంత్రి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడని అధికారులు వెల్లడిరచారు. దీంతో అక్కడ సంక్షోభం ఏ మలుపు తిరిగేదీ ఆసక్తి కలిగిస్తోంది. 1987 తరువాత తొలిసారిగా దక్షిణ కొరియాలో మిలిటరీ పాలన రుద్దేందుకు చూశారు.2024 డిసెంబరు మూడవ తేదీ మంగళవారం రాత్రి సైనిక పాలన విధించి బుధవారం తెల్లవారు రaామున రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర పరిస్థితి ప్రకటన, మిలిటరీకి అధికారాలు అప్పగింత, పార్లమెంటు వ్యతిరేక తీర్మానం, ఉపసంహరణ నాటకీయంగా జరిగాయి. అనేక అనుమానాలకు తావిచ్చే ఈ పరిణామం ఎందుకు, ఎలా జరిగింది, తెరవెనుక కథ ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది. కారణాలేమైనా తాత్కాలికంగా అయినా జనం ఊపిరి పీల్చుకున్నారు. అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ మీద ప్రతిపక్షాలు పెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. మరోసారి పెట్టేందుకు చూస్తున్నారు. తప్పు చేసినట్లు యూన్‌ ప్రకటించాడు. తనపై ఏదో ఒక నిర్ణయం తీసుకొనే బాధ్యతను పార్టీకి అప్పగిస్తున్నట్లు జాతీయ టీవీలో ప్రసంగిస్తూ చెప్పాడు. అయితే అధ్యక్షుడు ఏ కార్యకలాపాలు నిర్వహించకూడదని నిర్ణయించినట్లు ప్రధాని హాన్‌ డక్‌ సూ. అధికార పీపుల్స్‌ పవర్‌ పార్టీ (పిపిపి) నేత హాన్‌ డాంగ్‌ హూ ప్రకటించారు. మరోవైపు యూన్‌ మీద విచారణ జరుపుతున్నట్లు ప్రత్యేక దర్యాప్తు అధికారి ప్రకటించాడు. అధ్యక్షుడు రాజీనామా చేస్తే లేదా నేరాలకు పాల్పడినపుడు అరెస్టయితే తప్ప విధులు నిర్వహించటానికి ప్రధానికి అవకాశం లేదు. మిలిటరీ కమాండర్‌ ఎవరనే ప్రశ్న కూడా తలెత్తింది. సాంకేతికంగా అధ్యక్షుడు ఉన్నా అధికారాలు లేనట్లు ప్రకటించిన తరువాత హోం మంత్రి రాజీనామాను ఆమోదించిన తీరు చూస్తే తెరవెనుక ఏదో జరుగుతోందన్న భావన కలుగుతోంది. అధ్యక్షుడికి అధికారాలు లేకుండా చేసి పదవి నుంచి తొలగించకుండా కొనసాగించటం దేశంలో జరిగిన రెండవ కుట్రగా ప్రతిపక్షాలు వర్ణించాయి.


తాత్కాలిక రక్షణ మంత్రి, సైనిక దళాల జాయింట్‌ చీఫ్‌ కమాండర్‌ ఒక ప్రకటన చేస్తూ యూన్‌ మరోసారి అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే ఆమోదించేది లేదని చెప్పటం విశేషం. అత్యవసర పరిస్థితి ఎత్తివేత తరువాత రక్షణ మంత్రి రాజీనామా చేశాడు, అతనిపై దేశద్రోహనేరం మోపి అరెస్టు చేశారు. ప్రత్యేక దళాల, రాజధాని రక్షణ కమాండర్లు అనేక మందిని విధుల నుంచి తప్పించారు. దక్షిణ కొరియాలో మిలిటరీ నియంత పాలన అధికారికంగా అంతమైనప్పటికీ పాలనలో మిలిటరీ ప్రమేయం కొనసాగుతూనే ఉంది.1961లో జరిగిన తొలి మిలిటరీ తిరుగుబాటు తరువాత 1987నుంచి పౌరపాలన ఉన్నప్పటికీ పౌర భద్రతా వ్యవహారాలన్నీ మిలిటరీ మాజీ నేతలే ఎక్కువగా చూస్తున్నారు. ఇంతవరకు రక్షణ మంత్రిగా ఒక్కరంటే ఒక్కరు కూడా మిలిటరీయేతరులు లేరు. అనేక ముఖ్య బాధ్యతల్లో ఉద్యోగవిరమణ చేసిన మిలిటరీ అధికారులే ఉంటున్నారు. అందువలన పౌర నేతలు తమ రాజకీయ అవసరాల కోసం మిలిటరీ నేతల మీదనే ఆధారపడుతున్నారు. మిలిటరీ అధికారుల తీరుతెన్నులు చూసినపుడు వారు రాజకీయాల్లోని మితవాద శక్తులతోనే బలమైన సంబంధాలు కలిగి ఉండటం ఆందోళన కలిగించే అంశం.ప్రజాస్వామ్యం కోసం జరిగిన ఆందోళన, ఉద్యమాలను అణచివేసిన చరిత్ర వారిది. తమతో చేతులు కలపని లేదా విబేధించే వారిని కమ్యూనిస్టులతో సంబంధాలు ఉన్నాయనో దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారనో ఆరోపించి అణచివేయటం పరిపాటిగా మారింది. డిసెంబరు మొదటి వారంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి విధిలేక వెనక్కు తీసుకున్న యాన్‌ కూడా అవే చిలుక పలుకులు వల్లించాడు. అక్కడ మిలిటరీ పాలన ముప్పు మెడ మీద కత్తిలా వేలాడుతూనే ఉంది. 2017లో దొడ్డిదారిన మిలిటరీ పాలన రుద్దేందుకు చూశారు. అవినీతికి పాల్పడినందుకు అధ్యక్షురాలు పార్క్‌ యున్‌ హై మీద పెట్టిన అభిశంసన తీర్మానం నెగ్గింది. దాంతో ఆమెను తిరిగి నియమించకూడదంటూ ఆందోళనకు సిద్దపడిన వారిని, మీడియాను అణచేందుకు వందలాది మిలిటరీ వాహనాలు, ఆరువేల మంది సైనికులను సిద్దం చేసి మిలిటరీ పాలన ప్రకటించేందుకు దాదాపు ఏర్పాట్లు చేశారు.


తాజా పరిణామాలకు వస్తే అత్యవసర పరిస్థితి విధింపును వ్యతిరేకిస్తూ పద్దెనిమిది మంది అధికార పక్ష సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయటంతో నెగ్గింది. అయితే అభిశంసన తీర్మానం సమయానికి వారు వెనక్కు తగ్గటంతో వీగిపోయింది. అయినప్పటికీ యూన్‌ రాజీనామా, అతగాడి అరెస్టు, అధికార పార్టీని రద్దు చేయాల్సిందేనంటూ ఆదివారం నాడు సియోల్లో పార్లమెంటు ముందు వేలాది మంది జనం ప్రదర్శన చేశారు. అధ్యక్షుడిని తప్పించకుండా ప్రధానికి అధికారాన్ని కట్టబెట్టటం రాజ్యాంగ విరుద్దమని పార్లమెంటు స్పీకర్‌ ఊ వన్‌ షిక్‌ ప్రకటించాడు. తక్షణమే యూన్‌ అధికారాన్ని సస్పెండ్‌ చేసేందుకు అవకాశాలను వెతికేందుకు ప్రతిపక్ష పార్టీలతో సమావేశం జరపనున్నట్లు ప్రకటించాడు. స్వల్ప మెజారిటీతో అధ్యక్ష పదవికి ఎన్నికైన యూన్‌ గత రెండున్నర సంవత్సరాలుగా ప్రతిపక్షాలు, మీడియా, కార్మికవర్గాన్ని అణచివేసేందుకు చూశాడు. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించాడు. 2023 ఆగస్టులో లిబరేషన్‌ డే ప్రసంగంలో కమ్యూనిస్టు నియంతృత్వశక్తులు ప్రజాస్వామ్యం, మానవహక్కుల కార్యకర్తలు లేదా పురోగామి శక్తుల ముసుగులో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అనైతిక ఎత్తుగడలను అనుసరిస్తున్నారని ఆరోపించాడు. నియంతల పాలనలో ప్రతివారూ ఇలాంటి చిలుక పలుకులే వల్లించారు. సైనిక పాలన విధించేందుకు అవసరమైన పద్దతుల్లో యూన్‌ ఏదో చేయబోతున్నట్లు ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ కిమ్‌ మిన్‌ ఒక ప్రకటనలో హెచ్చరించాడు. తన స్కూలు సహాధ్యాయులు, అనుచరులను పెద్ద సంఖ్యలో కీలకమైన మిలిటరీ, ఇతర భద్రతా అధికార పదవుల్లో నియమించాడని పేర్కొన్నాడు. తాజా పరిణామాల తరువాత కిమ్‌ చెప్పింది వాస్తవమే అని పచ్చి మితవాద పత్రిక చోసన్‌ ఇబో వ్యాఖ్యానించింది. యూన్‌ భార్య కిమ్‌ ఇవోన్‌ హి, అధ్యాత్మిక సలహాదారు మైయుంగ్‌, ఇతర అనుచర గణం అనేక అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. అధికార పార్టీలో తమ అనుచరులకు పెద్ద పీటవేశారు.


కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక వ్యతిరేకమైన చర్యలను యూన్‌ ప్రతిపాదించాడు. వారానికి 52గంటలకు బదులు 120 గంటలు పని చేయాలని, ఏడు రోజులూ 17 గంటల చొప్పున విధి నిర్వహించాలని పిలుపునిచ్చాడు. మార్చినెలలో కార్మిక శాఖ 69 గంటల పని వారాన్ని ప్రతిపాదించగా కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సైనిక పాలన విధించిన వెంటనే సైనిక జనరల్‌ ఆన్‌ సూ అన్ని రాజకీయ కార్యకలాపాలు, కార్మికుల సమ్మెలను నిషేధించాడు, పత్రికల మీద సెన్సార్‌షిప్‌ ప్రకటించాడు, ఎవరినైనా వారంటు లేకుండా అరెస్టు చేసే అధికారమిచ్చాడు. సమ్మెచేస్తున్న వైద్యులు విధుల్లో చేరాలని ఆదేశించాడు. కార్మిక సంఘాలలో లేని కార్మికుల రక్షణ కోసమంటూ ప్రతిపాదించిన చర్యలకు ప్రతిపక్షం మద్దతు ఇవ్వాలని ఈ ఏడాది మేనెలలో యూన్‌ కోరాడు. అలాంటి కార్మికులు పరస్పరం సహాయం చేసుకొనే విధంగా అసోసియేషన్లను ప్రోత్సహిస్తామని చెప్పాడు. ఇది కార్మికులను సంఘాలకు దూరం చేసే, విచ్చిన్నం చేసే ఎత్తుగడతప్ప మరొకటి కాదు. పార్లమెంటులో ప్రతిపక్షాలు మెజారిటీగా ఉన్నందున ఇలాంటి ప్రతిపాదనలు ఆమోదం పొందే అవకాశం లేదు. సంఘటిత కార్మిక సంఘాలంటే హింసాత్మక నేరాలకు పాల్పడే సంఘటిత శక్తులని యూన్‌ ఆరోపించాడు. నిర్మాణ రంగంలో తమ కార్మికులను మాత్రమే వినియోగించాలని కంపెనీల మీద సంఘాలు వత్తిడి చేస్తున్నాయని నిందించాడు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు కార్మిక సంఘాలను బూచిగా చూపి నిందిస్తే జనం హర్షిస్తారని భావించిన యూన్‌ ఇతర చర్యలతో అదే ప్రజల్లో పలుకుబడి కోల్పోయాడు. 2022లో జరిగిన ఎన్నికల్లో కేవలం 0.73శాతం ఓట్ల మెజారిటీతో మాత్రమే యూన్‌ ఎన్నికయ్యాడు.ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటులోని 300 స్థానాలకు గాను యూన్‌ నాయకత్వంలోని పీపుల్స్‌ పవర్‌ పార్టీ 108 స్థానాలను మాత్రమే తెచ్చుకోగా ప్రతిపక్షాలకు 192 వచ్చాయి. అందువలన తన అజెండాకు పార్లమెంటు ఆమోదం తెలిపే అవకాశం లేకపోవటంతో దాన్ని పక్కన పెట్టేందుకు కుంటి సాకులతో అత్యవసర పరిస్థితి లేదా మిలిటరీ పాలన రుద్దేందుకు ప్రయత్నించాడు. ఒక వైపు మిలిటరీ పాలన ప్రకటనకు క్షమించాలని అంటూనే తన చర్యను సమర్ధించుకున్నాడు. పార్లమెంటులో మెజారిటీగా ఉన్న పార్టీలు అసాధారణ రీతిలో తన యంత్రాంగాన్ని అభిశంసించేందుకు పూనుకొని బడ్జెట్‌తో సహా ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకొనేందుకు పూనుకున్నట్లు ఆరోపించాడు.


ఇప్పుడు దక్షిణ కొరియాలో ఏం జరగబోతోంది అన్న ఆసక్తి తలెత్తింది. యూన్‌ రాజీనామా చేయటం, అధ్యక్ష ఎన్నికలను ప్రకటించటం ఒకటి. అయితే గత ఎన్నికల్లోనే స్వల్ప మెజారిటీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరపరాభవం పాలైన అధికార పక్షం ఇంత జరిగాక ఎన్నికల్లో పోటీకి సిద్దపడుతుందా ? యూన్‌ మీద విచారణ తతంగం జరిపి తిరిగి ఓటర్లలో విశ్వాసం ఉంది అనుకుంటే అప్పుడు ఎన్నికలకు వెళ్లవచ్చు. దాన్లో భాగంగానే దేశ పౌరులకు టీవీలో క్షమాపణ కూడా చెప్పించారు. అధికార విధులేవీ నిర్వర్తించకూడదని, ఒక క్రమ పద్దతిలో తప్పుకుంటాడని ఆదివారం నాడు పార్టీ ప్రకటించినప్పటికీ మరోసారి సైనిక పాలన విధించేందుకు అవసరమైన అధికారాలన్నీ అతగాడి వద్ద ఉన్నాయి.శనివారం నాడు పార్లమెంటు వద్ద యూన్‌కు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో పదిలక్షల మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు ప్రకటించగా పోలీసులు లక్షా 49వేల మంది అని చెప్పారు.అనేక అంశాలతో పాటు ఆర్థిక దిగజారుడు అక్కడి కార్పొరేట్లను ఆందోళనకు గురిచేస్తున్నది.వృద్ధి రేటు 2010లో 6.8శాతం ఉండగా గతేడాది 1.4శాతానికి దిగజారింది. ఈ ఏడాది 2.2శాతంగా ఉండవచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది.అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదికల ప్రకారం 2022లో నిజవేతనాలు 0.2శాతం, 2023లో 1.3శాతం పడిపోగా ఈ ఏడాది 0.5శాతం ఉండవచ్చని అంచనా. ఈ కారణంగానే అనేక పరిశ్రమల, సంస్థల కార్మికులు ఇటీవలి కాలంలో ఆందోళనలు చేపట్టారు. దాని అణచివేత ప్రయత్నమే సైనిక పాలన అని చెప్పవచ్చు. వచ్చే రోజుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా లేదా సైనిక తిరుగుబాటు జరిగినా కార్మికవర్గానికి పోరుబాట తప్ప మరొక మార్గం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికన్‌ డాలరుకు ఎసరు వస్తోందా ! డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపులకు అర్ధమేమిటి !!

04 Wednesday Dec 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

america first, anti china, BRICS nations, China, dedollarization, Donald trump, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


తమ కరెన్సీ డాలరును పక్కన పెట్టి ప్రత్యామ్నాయ కరెన్సీతో వాణిజ్యం జరిపేందుకు బ్రిక్స్‌ కూటమి దేశాలు పూనుకుంటే వందశాతం పన్ను విధిస్తామని జనవరి 20న పదవీ బాధ్యతలు చేపట్టనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు.బ్రిక్స్‌ దేశాలని, వేరే కరెన్సీ అని చెప్పినప్పటికీ స్థానిక కరెన్సీలతో లావాదేవీలు జరిపే అన్ని దేశాలకూ వర్తింపచేస్తామనే హెచ్చరిక దీని వెనుక ఉంది.ప్రస్తుతం బ్రిక్స్‌లో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా, ఇరాన్‌,ఈజిప్టు, ఇథియోపియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యుఏయి) ఉన్నాయి.మరో 34 దేశాలు చేరేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. వాటిని నిరుత్సాహపరిచేందుకు కూడా ట్రంప్‌ ఈ ప్రకటన చేశాడు. నిజానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఏడాది మార్చి నెలలోనే దీని గురించి చెప్పాడు. ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ దువ్వూరు సుబ్బారావు వంటి వారు ట్రంప్‌ మాటలు ఊకదంపుడేనా, నిజంగా అమలు జరుగుతాయా, అమెరికా చట్టాలు అందుకు అనుమతిస్తాయా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. చైనా వస్తువుల మీద పదిశాతం, కెనడా, మెక్సికోల నుంచి వచ్చే వాటి మీద 25శాతం పన్ను విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. చర్యకు ప్రతిచర్య ఉంటుంది, అది ఏ రూపంలో అన్నది చూడాల్సిఉంది.


మొదటి ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచ మారకపు కరెన్సీగా బ్రిటీష్‌ పౌండు ఉన్నది.1920దశకం నుంచి డాలరు క్రమంగా పెరిగి పౌండ్‌ను వెనక్కు నెట్టింది. రెండవ ప్రపంచ యుద్ధ ముగింపులో ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్థల ఏర్పాటు తరువాత పూర్తిగా డాలరు పెత్తనం ప్రారంభమైంది. గతంలో ఒక ఔన్సు(28.35 గ్రాములు) బంగారం 35 డాలర్లకు సమానమైనదిగా మారకపు విలువ నిర్ణయించారు. 2024 డిసెంబరు రెండవ తేదీన ఒక ఔన్సు బంగారం ధర 2,626 డాలర్లు ఉంది. 1971లో డాలరుబంగారం బంధాన్ని తెంచిన తరువాత డాలరుకు ఎదురులేకుండా పోయింది. దాన్ని అడ్డుకొనేందుకు ఐరోపా ధనికదేశాలు యూరో కరెన్సీని ముందుకు తెచ్చినా డాలరుకు ప్రత్యామ్నాయం కాలేకపోయింది. గత పదిహేను సంవత్సరాలుగా డాలరు ప్రభావం క్రమంగా తగ్గుతోంది.రాజకీయంగా తమ పెత్తనానికి ఎదురు దెబ్బలు తగులుతున్న పూర్వరంగంలో ఆర్థికంగా నిలిచి ప్రపంచ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని అమెరికా చూస్తున్నది, అదే ట్రంప్‌ అజెండా, దానికి అనుగుణంగా ప్రకటనలు ఉన్నాయి.అయితే అది జరిగేనా ?

డాలరుకు ప్రత్యామ్నాయ కరెన్సీని ముందుకు తేవాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డిసిల్వా 2023లో ప్రతిపాదించాడు. అంతకు ముందు నుంచే దీని గురించి చర్చ ఉంది. డాలరును ఉపయోగించవద్దని ఏ దేశం మీద కూడా వత్తిడి తేవద్దని, బ్రిక్స్‌ మద్దతు ఇచ్చే కరెన్సీలో చెల్లింపులు పెరగాలని, దుర్బలత్వాలను తగ్గించుకోవాలని లూలా అన్నాడు. తనకు నచ్చని దేశాల మీద డాలరును అమెరికా ఆయుధంగా ఉపయోగిస్తున్నది. ఇరాన్‌తో లావాదేవీలపై అమెరికా నిషేధం విధించిన కారణంగా మనదేశం అక్కడి నుంచి చమురుకొనుగోలు నిలిపివేసింది. ఉక్రెయిన్‌ సంక్షోభానికి రష్యా ఒక్కదాన్నే బాధ్యురాలిగా చేస్తూ దాని మీద కూడ అమెరికా తీవ్రమైన ఆంక్షలు విధించింది. అక్కడి నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు మన ప్రభుత్వం ఇతర కరెన్సీలతో కొనుగోలు చేయాల్సి వచ్చింది.మరోవైపు మన కరెన్సీని అంగీకరించే విధంగా 23 దేశాలతో ఇప్పటికే అవగాహనకు వచ్చిన సంగతి తెలిసిందే. రూపాయితో లావాదేవీలు జరిగితే ఎగుమతి, దిగుమతిదార్లకు కరెన్సీ మారకపు విలువ హెచ్చు తగ్గుల ముప్పు ఉండదు. మన విదేశీ వాణిజ్యంలో మూడోవంతు ఈ దేశాలతోనే జరుగుతున్నది.అమెరికాతో ఉన్న రాజకీయ బంధం, డాలరుతో తెగతెంపులు చేసుకోవటం పూర్తిగా ఇష్టం లేని కారణంగా మనదేశం ఇరకాటవస్థలో ఉంది.తామెన్నడూ డాలరును దెబ్బతీసేందుకు లక్ష్యంగా చేసుకోలేదని మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ చెప్పారు. కొన్ని సందర్భాలలో తమ వాణిజ్య భాగస్వాములకు డాలర్లు ఉండటం లేదని, ఆ కారణంగా ప్రత్యామ్నాయాలను చూస్తున్నాం తప్ప ఎలాంటి దురుద్ధేశ్యాలు లేవని చెప్పారు.చైనాతో మన వాణిజ్యం లోటులో ఉండగా అమెరికాతో మిగులులో ఉంది. ఈ కారణంగానే దానితో సంబంధాల విషయంలో మనదేశం ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉమ్మడి కరెన్సీ పథకాలకు దూరంగా ఉంటోంది. కొన్ని లావాదేవీల్లో డాలర్లకు ఆటంకాలు ఉన్నందున స్థానిక కరెన్సీలతో ఏర్పాట్లు చేసుకుంటున్నది.డాలరుతో తెగతెంపులు చేసుకొనేందుకు, తద్వారా అమెరికా మార్కెట్‌ను కోల్పోయేందుకు మనదేశంలోని ఐటి, దాని అనుబంధ, సేవారంగాలలో, ఔషధ, వస్త్ర పరిశ్రమల కార్పొరేట్లు అంగీకరించే అవకాశం లేదు.

కార్పొరేట్‌ శక్తులు పశ్చిమదేశాల మార్కెట్‌ మీద కేంద్రీకరించిన కారణం కూడా విస్మరించరానిదే.మనదేశం డాలర్‌ పెట్టుబడులను ఆశిస్తున్నందున దాన్ని దెబ్బతీసేందుకు ముందుకు పోదన్నది అభిప్రాయం. బ్రిక్స్‌ కూటమి జిడిపిలో 70శాతం వాటా చైనాదే. ప్రత్యామ్నాయ కరెన్సీ రూపొందితే దానిలో ఆధిపత్యం ఉండే అవకాశం ఉంది, రాజకీయంగా దాన్ని ఎదుర్కోవాలని కోరుతున్న మనదేశంలోని చైనా వ్యతిరేకశక్తులు అంగీకరించే అవకాశం కూడా లేదు. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలరుకు బదులు మరొక కరెన్సీని వినియోగించే అవకాశం లేదని, ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేస్తే అమెరికాకు వీడ్కోలు చెప్పాల్సి ఉంటుంది, బ్రిక్స్‌ దేశాలు డాలరుకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుండటాన్ని మేము గమనించటం ముగిసిందని, అద్బుతమైన అమెరికా ఆర్థిక వ్యవస్థలో తమ వస్తువులను అమ్ముకోవటానికి స్వస్థి పలకాల్సి ఉంటుందని ట్రంప్‌ బెదిరించాడు. ప్రస్తుతం డాలర్‌దే ఆధిపత్యమైనా అన్ని దేశాలూ తమ విదేశీమారక ద్రవ్యంలో ఒక్క డాలరు మీదే ఆధారపడటం లేదు. ఇతర కరెన్సీలను కూడా నిల్వచేసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఎటుబోయి ఎటువస్తుందో అన్నట్లుగా బంగారం నిల్వలను కూడా పెంచుకుంటున్నాయి.ఇరాన్‌, రష్యా దేశాలపై ఆంక్షలు విధించి తన స్వంత చట్టాలను రుద్దుతోంది. దానిలో భాగంగా అంతర్జాతీయ అంతర బ్యాంకుల ద్రవ్య లావాదేవీల టెలికమ్యూనికేషన్‌ సమాజ (స్విఫ్ట్‌) వ్యవస్థ నుంచి వాటిని ఏకపక్షంగా తొలగించింది. రేపు తనకు నచ్చని లేదా లొంగని ఏ దేశం మీదనైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవచ్చుగనుక గత కొద్ది సంవత్సరాలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కరెన్సీల గురించి ఆలోచిస్తున్నాయి. బ్రిక్స్‌ దేశాలు ప్రపంచ వాణిజ్యంలో 23శాతం కలిగి ఉన్నాయి. ఇవి నూతన కరెన్సీని సృష్టించటం లేదా డాలరును పక్కన పెట్టే మరొక కరెన్సీకి మద్దతు ఇవ్వబోమని తమకు హామీ ఇవ్వాలని డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశాడు. మహావృక్షం వంటి డాలరుకు బదులు మరొక పిలక కోసం ప్రయత్నించినా ఫలితం ఉండదన్నాడు. సార్వభౌత్వం కలిగిన ఏ దేశమూ ఇలాంటి హామీ ఇవ్వదు. అమెరికా నాయకత్వంలోని జి7 కూటమిని ఎదుర్కోవాలంటే బ్రెజిల్‌,రష్యా,భారత్‌,చైనా చేతులు కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని గోల్డ్‌మన్‌ శాచస్‌ ప్రధాన ఆర్థికవేత్త జిమ్‌ ఓ నెయిల్‌ 2001లో ప్రతిపాదించాడు. తరువాత అది నిజంగానే 2011లో ఉనికిలోకి వచ్చింది. డాలరును తాము ఏకపక్షంగా తిరస్కరించటం లేదని, డాలరు లావాదేవీలపై పరిమితులు విధిస్తున్నందున ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సి వస్తోందని ఆంక్షలకు గురైన రష్యా అధినేత పుతిన్‌ ఇటీవల జరిగిన కజాన్‌ బ్రిక్స్‌ సమావేశాల్లో చెప్పాడు. ఇప్పటికే ఈ కూటమి ఏర్పాటు చేసిన న్యూ డెవలప్‌మెంట్‌ బాంక్‌(ఎన్‌డిబి)ని మరింతగా విస్తరించాలని కూడా నిర్ణయించారు.

ప్రస్తుతం అమెరికా ఖండాల్లో వాణిజ్యంలో 96శాతం, ఆసియాపసిఫిక్‌ ప్రాంతంలో 74, ఇతర చోట్ల 74శాతం డాలరు వినియోగంలో ఉంది. ఐరోపాలో మాత్రం 66శాతం యూరో ఆక్రమించింది. ప్రపంచ దేశాల విదేశీ మారకద్రవ్య నిల్వల్లో 60శాతం డాలర్ల రూపంలో, మిగిలింది ఇతర కరెన్సీలు, బంగారం రూపంలో ఉంటుంది. ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 1960దశకంలో ప్రపంచ జిడిపిలో అమెరికా వాటా 40శాతం కాగా 2023లో 26శాతానికి పడిపోయింది.చైనాను చూస్తే 2000 సంవత్సరంలో 3.6శాతంగా ఉన్నది 16.9శాతానికి పెరిగింది. మన జిడిపి ఇదే కాలంలో 1.4 నుంచి 3.4శాతానికి మాత్రమే పెరిగింది. దేశాల రిజర్వుబ్యాంకులు తమ వద్ద నిల్వ ఉంచుకొనే విదేశీ కరెన్సీలలో డాలరు వాటా 2002లో 70శాతం ఉండగా 2024 మార్చి ఆఖరులో 59శాతం ఉంది. ఇదే సమయంలో యూరో, ఎన్‌, పౌండ్‌ తప్ప ఇతర కరెన్సీల వాటా 1.8 నుంచి 10.9శాతానికి పెరిగింది. అనేక దేశాలు డాలరును క్రమంగా వదిలించుకుంటున్నాయి. ఎప్పుడు ఎలాంటి అస్థిరతకు గురికావాల్సి వస్తుందో అన్న భయంతో ఇటీవలి కాలంలో బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచుతున్నాయి.దేశాల రిజర్వుబాంకులు 2010లో 79.15 టన్నుల బంగారం కొనుగోలు చేయగా 2015లో 579.6 టన్నులు, 2023లో 1,037.1టన్ను కొనుగోలు చేశాయి. మన విషయానికి వస్తే ఆర్‌బిఐ ప్రతినెలా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నది.జనవరి నుంచి 43 టన్నులు కొనుగోలు చేయగా మొత్తం నిల్వ 846 టన్నులకు పెరిగింది. చైనా రిజర్వుబాంకు వద్ద అక్టోబరు ఆఖరులో 2,264 టన్నుల బంగారం ఉంది. గతేడాది అన్ని దేశాల కేంద్ర బాంకులు కొనుగోలు చేసిన 1,037 టన్నుల్లో 30శాతం చైనా పీపుల్స్‌ బాంకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది అంతకు మించి కొనుగోలు చేయనున్నట్లు జనవరిమార్చినెలల్లో లావాదేవీలు వెల్లడిరచాయి. ఎందుకు ఈ విధంగా కొనుగోలు చేస్తున్నదంటే డాలరుకు ప్రత్యామ్నాయంగా కరెన్సీని ముందుకు తెచ్చేందుకే అని పరిశీలకులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయా దేశాల్లో విదేశీమారక నిల్వల్లో పోర్చుగల్‌లో బంగారం వాటా 72శాతం, అమెరికా 70,జర్మనీ 69, ఫ్రాన్సు 67, ఇటలీ 66, నెదర్లాండ్స్‌ 58, టర్కీ 30, రష్యా 26శాతం భారత్‌ 9, చైనా నాలుగుశాతం మాత్రమే కలిగి ఉన్నాయి. శాతం రీత్యా చూస్తే మనం ఎగువన ఉన్నప్పటికీ విలువలో చూస్తే చైనాతో ఎంత తేడా ఉందో పైన పేర్కొన్న అంకెలు వెల్లడిస్తాయి.

మొత్తంగా బ్రిక్స్‌ దేశాల మీద ట్రంప్‌ దాడి ఉన్నప్పటికీ కేంద్రీకరణ అంతా చైనా మీదనే అన్నది స్పష్టం.అక్కడి మార్కెట్‌లో తన వస్తువుల విక్రయాలకే ఈ వత్తిడి. ఎవరు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ దాడి తీవ్రత పెరగవచ్చని ఊహించిన చైనా ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు గత ఆరు సంవత్సరాలుగా ప్రత్నామ్నాయ మార్గాలను వెతుకుతున్నది. దాని అమ్ముల పొదిలో కూడా అమెరికాను దెబ్బతీసే కొన్నిఅస్త్రాలు ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఉదాహరణకు చైనా వద్ద అమెరికా తీసుకున్న రుణం 734 బిలియన్‌ డాలర్లు ఉంది.2017 నుంచి క్రమంగా ఈ మొత్తాలను తగ్గిస్తున్నది. దాన్ని ఇతర దేశాలకు చైనా విక్రయిస్తే ప్రపంచ మార్కెట్ల మీద ప్రతికూల ప్రభావం, అమెరికా బాండ్ల మీద వచ్చే రాబడి తగ్గి ఆకర్షణ కోల్పోతుంది. తన దగ్గర ఉన్న 3.38లక్షల కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వదిలించుకుంటే చైనాకూ సమస్యలు వస్తాయి.అమెరికాను దెబ్బతీయాలంటే తన కరెన్సీ యువాన్‌ విలువ తగ్గింపు ఒక ఆయుధం. దానితో లాభంనష్టం రెండూ ఉన్నాయి. సెమీకండక్టర్లు, విద్యుత్‌ బాటరీలకు ఉపయోగించే అరుదైన ఖనిజాల ఎగుమతులు నిలిపివేయవచ్చు. తమ మార్కెట్లో ఆపిల్‌, టెస్లా వంటి అమెరికా కార్పొరేట్‌ కంపెనీల ఉత్పత్తులను బహిష్కరించి దెబ్బతీయవచ్చు.అయితే వాటిని ప్రయోగిస్తుందా లేదా అన్నది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో రికార్డులను తిరగరాసిన వామపక్షం !

21 Thursday Nov 2024

Posted by raomk in Asia, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

Anura Kumara Dissanayake, Sri Lanka JVP, Sri Lankan NPP


ఎం కోటేశ్వరరావు

సెప్టెంబరు 21న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా వామపక్ష నేత అనుర కుమార దిశనాయకే విజయం ఒక పెద్ద మలుపు.నవంబరు 14న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో గత అనేక రికార్డులను బద్దలు కొట్టి నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌(ఎన్‌పిపి) మూడిరట రెండువంతుల మెజారిటీతో 225కు గాను 159 సాధించి లంక చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు చేసింది.ఈ పార్టీకి గరిష్టంగా 130 స్థానాలు వస్తాయని ఎన్నికల పండితులు అంచనాలు వేశారు. జనతా విముక్తి పెరుమన(సంఘటన), దానితో పాటు మరో 27 వామపక్ష పార్టీలు, సంస్థలు, ప్రజాసంఘాలు కలసి నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌(ఎన్‌పిపి) పేరుతో ఒక కూటమిగా పోటీ చేశాయి. అన్నింటికంటే ముఖ్య అంశం తమిళ, ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీ చొచ్చుకుపోవటం ఎవరూ ఊహించని పరిణామం. సోమవారం నాడు కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. లంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని నూతన ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తుండగా వామపక్ష ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆశలు, విశ్వాసం ప్రజల్లో వ్యక్తమైంది. గత ప్రభుత్వం ఐఎంఎఫ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు ప్రజలలో వ్యతిరేకతను పెంచటం కూడా ఎన్‌పిపి విజయానికి దోహదం చేసిందని చెప్పవచ్చు.


అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమారకు 42.3శాతం ఓట్లు రాగా పార్లమెంటు ఎన్నికల్లో 61.68శాతం వచ్చాయి. 2010 ఎన్నికల్లో మహింద రాజపక్సే పార్టీకి 60.33శాతమే ఇప్పటి వరకు రికార్డు. అదే విధంగా పార్లమెంటులో 2020ఎన్నికల్లో అదే పార్టీకి 145 సీట్ల రికార్డును 159తో ఎన్‌పిపి బద్దలు కొట్టింది.ఇరవై రెండు జిల్లాలకు గాను 2010రాజపక్స 19చోట్ల ఎక్కువ సీట్లు సంపాదించగా ఈసారి ఎన్‌పిపి 21 జిల్లాల్లో మెజారిటీ సాధించింది. తమిళులు మెజారిటీగా ఉన్న బట్టికలోవాలో మాత్రమే రెండవ స్థానంలో ఉంది. వీటన్నింటిని చూసినపుడు కేవలం మెజారిటీ సింహళీయుల, మైనారిటీ వ్యతిరేకుల పార్టీ అన్న ముద్రను ఎన్‌పిపి పోగొట్టుకుంది. ఇది ఎలా జరిగింది, కారణాలేమిటి అన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. జాతుల పరంగా మెజారిటీ, మైనారీటీ సామాజిక తరగతుల ఛాంపియన్లుగా తరతరాలుగా ముద్ర పడిన పార్టీల మీద జనం విశ్వాసం కోల్పోవటమే దీనికి ప్రధాన కారణం. కరోనాకు ముందు దీర్ఘకాలం ఉన్న ఉగ్రవాద సమస్య, తరువాత తలెత్తిన ఆర్థిక సంక్షోభాలతో అందరూ దెబ్బతిన్నారు. దుర్భరపరిస్థితుల నుంచి సాంప్రదాయ పార్టీలేవీ గట్టెంకించలేవన్న భావన ఓటర్లలో బలంగా తలెత్తింది. అధ్యక్ష ఎన్నికల తరువాత ఎస్‌జెపి అనురకుమారను వ్యతిరేకించేశక్తులు చేతులు కలిపితే పార్లమెంటులో మెజారిటీ సాధిస్తారని వేసిన అంచనాలన్నీ తప్పాయి. లంక రాజ్యాంగం ప్రకారం 225 స్థానాలలో 196 మందిని నియోజకవర్గాల ప్రాతిపదికన ఎన్నుకుంటారు.మరో 29 స్థానాలను పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం వాటికి సీట్లు కేటాయిస్తారు. ఎన్‌పిపి 141నియోజవర్గాల్లో గెలవగా దామాషా ఓట్లతో 18 స్వంతం చేసుకుంది. 2020 ఎన్నికలలో ఎన్‌పిపికి కేవలం మూడు స్థానాలు మాత్రమే వచ్చాయి.


ఐదు సంవత్సరాల క్రితం కేవలం 3.16శాతం ఓట్లు తెచ్చుకున్న వామపక్ష నేత 42.3శాతం ఓట్లతో ప్రధమ స్థానంలో నిలవటం, రెండవ ప్రాధాన్యతా ఓట్లలెక్కింపులో 55.89శాతం ఓట్లతో విజయం సాధించటం తెలిసిందే.ఆ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీ ఎస్‌జెపి అభ్యర్థి సాజిత్‌ ప్రేమదాస 32.76శాతం, అధ్యక్షుడు రానిల్‌ విక్రమ సింఘే(ఎన్‌డిఎఫ్‌) స్వతంత్ర అభ్యర్ధిగా 17.27శాతం ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. మిగిలిన ఓట్లను 35 మంది ఇతర అభ్యర్థులు తెచ్చుకున్నారు. అక్కడి విధానం ప్రకారం అధ్యక్షపదవికి ఎందరైనా పోటీ పడవచ్చు. ప్రతి ఓటరూ ముగ్గురికి ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయవచ్చు.నిబంధన ప్రకారం 50శాతం పైగా ఓట్లు తెచ్చుకున్నవారినే విజేతగా ప్రకటిస్తారు. అలా రాని పక్షంలో మొదటి ఇద్దరిని మినహాయించి మిగిలిన వారిని పోటీ నుంచి తొలగిస్తారు. వారికి వచ్చిన ఓట్లలో రెండవ ప్రాధాన్యతా ఓట్లు ఎవరికి ఉంటాయో వారికి కలిపి 50శాతంపైగా తెచ్చుకున్నవారిని విజేతగా నిర్ధారిస్తారు. ఆ ప్రకారం వామపక్ష నేతకు 55.89 శాతం వచ్చాయి. శ్రీలంక నూతన రాజ్యాంగం ప్రకారం 1982 తరువాత జరిగిన ఎన్నికలన్నింటిలో గెలిచిన వారందరూ మొదటి రౌండులోనే 50శాతంపైగా సంపాదించుకొని గెలిచారు. తొలిసారిగా రెండవ ప్రాధాన్యత ఓటును పరిగణనలోకి తీసుకొని విజేతను నిర్ణయించారు. ముందే చెప్పుకున్నట్లు పార్లమెంటు ఎన్నికల్లో కూడా కొత్త రికార్డులు నమోదయ్యాయి. వామపక్ష ఎన్‌పిపికి వ్యతిరేకంగా సాజిత్‌ ప్రేమదాస, రానిల్‌ విక్రమసింఘే తమ విబేధాలను పక్కన పెట్టి ఒకే అభ్యర్థిని నిలిపారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.


అధ్యక్ష ఎన్నికలలో ఆ రెండు పార్టీలకు కలిపి 50శాతంపైగా ఓట్లు వచ్చాయి. అదే పార్లమెంటు ఎన్నికలలో ఎస్‌జెపికి 17.66. ఎన్‌డిఎఫ్‌కు 4.49శాతం చొప్పున ఓట్లు వచ్చాయి. ఎస్‌జెపికి అంతకు ముందు 54 సీట్లు ఉండగా ఈ సారి 40కి తగ్గాయి. ఎన్‌డిఎఫ్‌కు కొత్తగా ఐదు సీట్లు వచ్చాయి. తిరుగులేని సోదరులుగా పేరుతెచ్చుకొని, అత్యంత హీన చరిత్రను మూటగట్టుకున్న శ్రీలంక పొడుజన పెరుమన(ఎస్‌ఎల్‌పిపి)కి గత ఎన్నికల్లో 59శాతం ఓట్లు తెచ్చుకోగా తాజా ఎన్నికల్లో 2.57శాతం మాత్రమే తెచ్చుకొని పోటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అదే పార్లమెంటు ఎన్నికల్లో 3.14శాతం ఓట్లతో 145లో 142 పోగొట్టుకొని కేవలం మూడు సీట్లు మాత్రమే తెచ్చుకుంది. శ్రీలంక 74 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో 38 ఏండ్ల పాటు అధికారంలో ఉండి చరిత్ర సృష్టించిన యుఎన్‌పి 0.59శాతం ఓట్లు తెచ్చుకొని ఒక్క సీటుకు పరిమితమైంది.అనూహ్యమైన అనుర కుమార విజయం తరువాత ఎన్‌పిపిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న జనతా విముక్తి పెరుమన(జెవిపి) వైఖరిలో వచ్చిన మార్పు లేదా ఎత్తుగడల్లో భాగంగా అన్ని సామాజిక తరగుతులకు అది దగ్గరైంది. వారి విశ్వాసాన్ని చూరగొంది. అధ్యక్ష`పార్లమెంటు ఎన్నికల మధ్య ఉన్న రెండునెలల వ్యవధిని అది ఉపయోగించుకుంది.తమిళులు, ముస్లింలు గణనీయంగా ఉన్న ఉత్తర, తూర్పు ప్రాంతాలలో ఆ సామాజిక తరగతులకు చెందిన వారినే అభ్యర్థులుగా నిలిపారు. ఆ స్థానాల్లో అంతకు ముందు పాతుకుపోయిన నేతలందరినీ చిత్తుచిత్తుగా ఓడిరచారు. తమిళులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇలంకాయ్‌ తమిళ అరసు కచ్చి(ఐటిఎకె) పార్టీ 1949 నుంచి పని చేస్తున్నది. తమిళులు ఎక్కువగా ఉన్న జాఫ్నా జిల్లాలోని నాలుగు సీట్లలో దీనికి ఒక సీటు రాగా ఎన్‌పిపి మూడు తెచ్చుకుంది. ఇలాంటిదే మరో జిల్లా బట్టికలోవాలో ఎన్‌పిపికి ఒకటి, ఐటిఏకి మూడు వచ్చాయి. ఇక్కడ మాత్రమే ఎన్‌పిపి వెనుకబడిరది. పార్లమెంటు ఎన్నికల్లో 2.31శాతం ఓట్లు, ఎనిమిది సీట్లతో మూడవ స్థానంలో ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో తమిళులు ఉండే ప్రాంతాలలో కేవలం పదిశాతం అంతకంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఎన్‌పిపి పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి 25 నుంచి 42శాతం వరకు పెంచుకుంది.


ఎన్‌పిపికి తిరుగులేని మెజారిటీ వచ్చిన కారణంగా అనేక పార్టీల మాదిరి అది కూడా నిరంకుశంగా వ్యవహరిస్తుందా అన్న చర్చను కూడా కొందరు లేవనెత్తుతున్నారు. లంక అధ్యక్షుడికి కార్యనిర్వాహక అధికారాలు ఉన్న కారణంగా గత పాలకులు అడ్డగోలుగా వ్యవహరించారు. దానికి పార్లమెంటులో మెజారిటీ కూడా తోడైంది. ఈ కారణంగానే అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటంతో తలెత్తిన నిరసనకారణంగా అధ్యక్ష భవనంపై దాడితో మిలిటరీ రక్షణతో దేశం వదలి పారిపోవాల్సి వచ్చింది. నూతన రాజ్యాంగాన్ని తీసుకువచ్చి అధ్యక్షుడికి ఉన్న అపరిమిత అధికారాలను తొలగిస్తామని గతంలో వాగ్దానం చేసిన పార్టీలేవీ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఎన్‌పిపి కూడా అదే వాగ్దానం చేసింది.ఇది కూడా కొత్త రాజ్యాంగాన్ని తెస్తుందా , ఇతర పార్టీల బాటలోనే ఉన్నదాన్నే కొనసాగిస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయి.లాటిన్‌ అమెరికాలో వామపక్షాలు అధ్యక్ష, ప్రధాని పదవులు పొందుతున్నప్పటికీ పార్లమెంట్లలో మెజారిటీ తెచ్చుకోలేని కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు లంకలో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా స్పష్టమైన తీర్పు వచ్చింది. అందువలన ఎన్‌పిపి తన అజెండాను అమలు జరిపేందుకు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవు. లాటిన్‌ అమెరికా వామపక్షాల మాదిరే ఉన్న వ్యవస్థపునాదుల మీదనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందా లేక వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.2022లో అధికారానికి వచ్చిన ప్రభుత్వం ఐఎంఎఫ్‌, ఇతర అంతర్జాతీయ సంస్థల షరతులన్నింటికీ తలవూపి రుణాలు తీసుకుంది. దాని వలన పౌర సంక్షేమానికి నిధుల కోత ఒకటైతే భారాలు మరొకటి. ఐఎంఎఫ్‌ ఒప్పందాల నుంచి తక్షణమే వైదొలిగితే మరోసారి లంక చెల్లింపులతో పాటు ఇతర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. దాని షరతుల నుంచి ఉపశమనం కలిగించకపోతే జనంలో అసంతృప్త్తి తలెత్తటం అనివార్యం.


ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ షరతులను ఒకవైపు అమలు జరుపుతూ మరోవైపు సంక్షేమ చర్యలను కొనసాగించిన దేశాలు దాదాపు లేవు. ఐఎంఎఫ్‌ షరతుల నుంచి పేదలను రక్షిస్తానని అధ్యక్షుడు దిశనాయకే ప్రకటించినప్పటికీ నిలబెట్టుకుంటారా అన్నది ప్రశ్న. గత ప్రభుత్వం అంగీకరించిన మేరకు నాలుగు వందల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించటం లేదా పునర్‌వ్యవస్తీకరించాలి.ఏది జరిగినా లక్షల ఉద్యోగాలు పోతాయి.పౌరుల మీద పన్నులు పెంచాలి, ఉచిత విద్య, వైద్యం వంటి సేవల నుంచి ప్రభుత్వం వైదొలగాలి లేదా గణనీయంగా వాటి ఖర్చుకోత పెట్టాలి. మరోవైపు విదేశాంగ విధానం ఒక సవాలుగా మారనుంది. ఇప్పటి వరకు చైనా అనుకూల దేశంగా లంకకు ముద్రపడిరది. దాన్నుంచి తన ప్రభావంలోకి తెచ్చుకొనేందుకు భారత్‌ ప్రయత్నిస్తోందన్నది ఒక అభిప్రాయం. గత ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోడీ పలుకుబడితో అదానీ కంపెనీకి ఇచ్చిన విద్యుత్‌ ప్రాజెక్టును రద్దు చేస్తామని కూడా దిశనాయకే ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. అదే జరిగితే మనదేశ పెట్టుబడిదారులు అక్కడ పెట్టుబడులకు ముందుకు వెళ్లరు. మరోవైపు హిందూమహా సముద్రం మీద పట్టుకోసం అమెరికా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పశ్చిమదేశాలు వద్దు – మాతృదేశమే ముద్దు అంటున్న చైనా విద్యాధికులు !

06 Wednesday Nov 2024

Posted by raomk in Asia, CHINA, COUNTRIES, Current Affairs, Europe, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China, China AI, China education power, GenAI Patents, Narendra Modi Failures, STEM PhDs, WIPO, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

అంతరిక్ష రంగంలో అమెరికాకు ధీటుగా 2050నాటికి అగ్రదేశంగా మారేందుకు చైనా మూడు దశల ప్రణాళికలు రూపొందించింది.వివిధ గ్రహాల గురించి పరిశోధన, ఒక అంతర్జాతీయ లూనార్‌ పరిశోధనా కేంద్ర నిర్మాణం వంటివి దీనిలో ఉన్నాయి.చంద్రుడి మీదకు 2030నాటికి వ్యోమగాములను పంపే లక్ష్యం కూడా ఉంది. ఆర్థికంగా చైనా ఇబ్బందుల్లో ఉందని చెబుతున్నవారే ఈ పరిశోధనలకు భారీ మొత్తాలను ఎలా ఖర్చు పెడుతున్నదంటూ ఆశ్చర్యపోతున్నారు. దేశ చరిత్రను చూసినపుడు లక్ష్యాలను ప్రకటించిన నిర్ణీత కాలంలో పూర్తిచేసిన చరిత్ర ఉందని కూడా అంటున్నారు. తొలిసారిగా చంద్రుడికి ఆవలి వైపున రోవర్‌ను దించిన చైనా ఘనత తెలిసిందే.అంతరిక్ష లక్ష్యాల రోడ్‌ మాప్‌ను కేంద్ర కాబినెట్‌ స్థాయి కార్యాలయం పర్యవేక్షించనుంది.2028 నుంచి 2035వరకు మానవులను పంపే కార్యక్రమాలతో పాటు చంద్రుడిపై పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.మూడవ దశలో 30మిషన్‌లను ప్రయోగిస్తారు.ఐరోపా స్పేస్‌ ఏజన్సీతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తారు.తమ అంతరిక్ష పరిశోధన ఇప్పటికీ ప్రారంభదశలోనే ఉందని, ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో ముందుకు పోతున్నట్లు చైనా అధికారులు చెప్పారు.

పశ్చిమ దేశాల్లో పరిశోధనలు చేయటం, చేతి నిండా సంపాదించటం ఎంతో మంది కనేకల. అది తప్పేం కాదు. స్వదేశంలో తమ మేథకు పదును పెట్టే అవకాశాలు, దానికి తగిన ప్రతిఫలం పొందే పరిస్థితి లేనపుడు ఎవరైనా ఇదే విధంగా ఆలోచిస్తారు. గతంలో విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడి సంపాదించిన వారిని చూస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రపంచమంతటా ఇలాంటి ‘‘ డాలరు కలలు ’’ కనేవారు ఉన్నారు. దీన్నే మరో విధంగా మేథోవలస అనేవారు. ధనికదేశాలన్నీ ఇలాంటి వలసలను ప్రోత్సహించి సొమ్ము చేసుకున్నాయి. చైనా తాజాగా వెల్లడిరచిన సర్వే సమాచారం ప్రకారం ‘‘స్టెమ్‌’’ (సైన్సు,టెక్నాలజీ,ఇంజనీరింగ్‌,గణిత శాస్త్రాలకు పెట్టిన పొట్టి పేరు) పరిశోధనకు(పిహెచ్‌డి) విదేశాలకు వెళ్లిన చైనీయులలో 80శాతం మంది తిరిగి వస్తున్నారట. 1987లో కేవలం ఐదుశాతమే ఉండగా 2007లో 30.6శాతం నుంచి ఇప్పుడు 80శాతానికి చేరారు. ధనికదేశాల్లో అకడమిక్‌ అవకాశాల కోసం ఇప్పటికీ పెద్ద ఎత్తున పోటీ ఉంది.ఎందుకు చైనీయుల్లో ఇలాంటి మార్పు అని చూస్తే ప్రపంచ భూ భౌతికఆర్థిక శక్తిగా చైనా ఎదగటం తప్ప మరొక కారణం లేదు. స్టెమ్‌ గ్రాడ్యుయేట్లకు చైనాలో అవకాశాలు, ఆర్థిక ప్రతిఫలాలు కూడా ఏటేటా పెరుగుతున్నాయి.అయితే విదేశాల్లో ఇంకా ఆకర్షణ కొనసాగుతూ ఉంటే వలసలు మరోసారి కొనసాగవని చెప్పలేము.చైనాలో పెరుగుతున్న ఆర్థిక లబ్దితో పాటు, ఒకే బిడ్డ అన్న విధానం అమల్లోకి వచ్చిన తరువాత పుట్టిన తరానికి చెందిన వారు వృద్ద తలిదండ్రులను చూసుకోవాల్సిన కుటుంబ సంబంధాలు కూడా పరిశోధకులు తిరిగి రావటం వెనుక కారణాలుగా తేలాయి.పశ్చిమదేశాల్లో సంపాదించిన దానికి దగ్గరగా చైనాలో కూడా ఉండటంతో తిరిగి వచ్చేవారి వేగం పెరుగుతున్నది.


చైనాలో విద్య, పరిశోధనలకు పెద్ద పీటవేస్తున్న కారణంగా అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌(జన్‌ఏఐ) పేటెంట్లకు దరఖాస్తున్నట్లు ప్రపంచ పేటెంట్‌ సంస్థ(డబ్ల్యుఐపిఓ) తాజా సమాచారం వెల్లడిస్తున్నది. ఈ రంగంలో అగ్రశ్రేణిలో ఉన్న అమెరికా, దక్షిణ కొరియా,జపాన్‌, భారత్‌ను చైనా అధిగమించింది. 2023తో ముగిసిన దశాబ్దిలో దాఖలైన 54వేల దరఖాస్తుల్లో నాలుగోవంతు గతేడాదిలోనే ఉన్నాయి.చైనా నుంచి 201423 సంవత్సరాలలో 38వేల దరఖాస్తులు వచ్చాయి.వేగంగా దూసుకువస్తున్న కృత్రిమ మేథ సాంకేతిక పరిజ్ఞానం ఆటతీరునే మార్చివేయనుంది. ఇదే కాలంలో 54వేల పేటెంట్‌ దరఖాస్తులతో పాటు 75వేల శాస్త్రీయ పత్రాల ప్రచురణ కూడా చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో జారీచేసిన అన్ని రకాల పేటెంట్లలో ఏఐ వాటా కేవలం ఆరుశాతమే. పది అగ్రశ్రేణి సంస్థలలో టెన్‌సెంట్‌(2,074, పింగ్‌ యాన్‌ ఇన్సూరెన్స్‌(1,564), బైడు(1,234), చైనీస్‌ సైన్స్‌ అకాడమీ(607), అలీబాబా (571) శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ (468),ఆల్ఫాబెట్‌(443), బైట్‌డాన్స్‌(418), మైక్రోసాఫ్ట్‌ 377 ఉన్నాయి. మొత్తం దేశాల వారీ చూస్తే చైనా 38,210, అమెరికా 6,276, దక్షిణ కొరియా 4,155, జపాన్‌ 3,409, భారత్‌ 1,350 ఉన్నాయి. రంగాల వారీగా ఇమేజ్‌, వీడియో డేటా, 17,996,టెక్స్ట్‌ 13,494, మాటలు లేదా సంగీతం 13,480 ఉన్నాయి.విదేశాల్లో చదివి భారత్‌కు తిరిగి వచ్చే విద్యార్థులకు తగిన ఉపాధి అవకాశాలు ఉండటం లేదని కెనడా విద్యాసంస్థ ఎం స్క్వేర్‌ మీడియా (ఎంఎస్‌ఎం) తన సర్వేలో తేలినట్లు 2023 ఫిబ్రవరిలో ప్రకటించింది. విదేశీ డిగ్రీల గుర్తింపుతో సహా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని తెలిపింది. 2022లో 7.7లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకున్నారు.201519 మధ్య విదేశాల్లో చదువుకొని స్వదేశం తిరిగి వచ్చిన వారిలో 22శాతం మాత్రమే ఉపాధి పొందినట్లు తేలింది. విదేశీ డిగ్రీలు, డిప్లొమాలకు భారత్‌లో గుర్తింపు లేకపోవటం ఒక ప్రధాన సమస్య.


ప్రపంచ ఫ్యాక్టరీగా పేరు తెచ్చుకున్న చైనా తన సత్తాను ఇతర రంగాలకూ విస్తరిస్తున్నది.2035 నాటికి అగ్రశ్రేణి విద్యాశక్తిగా మారేందుకు పథకాలను రూపొందించింది. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన విద్యాకేంద్రంగా మారేందుకు చూస్తున్నట్లు చైనా విద్యామంత్రి హువెయ్‌ జిన్‌పెంగ్‌ ఇటీవల ప్రకటించాడు.సైన్సు, ఇంజనీరింగ్‌ రంగాలలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సంయుక్త డిగ్రీకోర్సులతో సహా వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పాడు. అనేక ఇబ్బందులు, సవాళ్లు ఉన్నప్పటికీ అధ్యక్షుడు షీ జింపింగ్‌ మార్గదర్శకత్వంలో రూపొందించిన ప్రణాళికను అమలు జరపనున్నట్లు వెల్లడిరచాడు. పెద్ద విద్యాశక్తిగా ఉన్న స్థితి నుంచి బలమైన శక్తిగా మారేందుకు 2010లో నిర్ణయించామని, తాజా లక్ష్యాన్ని 2020లోనే ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఆచరణలో పెట్టినట్లు జిన్‌ పెంగ్‌ చెప్పాడు.ఆర్థికంగా కొన్ని సమస్యలున్నప్పటికీ విద్యారంగ పథకాలను కొనసాగించాల్సిందేనని షీ జింపింగ్‌ నిర్దేశించాడు. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ సమాచారం 2024 ప్రకారం 207 దేశాల విద్యారంగ సమాచారాన్ని విశ్లేషించగా చైనా 13వ రాంక్‌లో ఉండగా భారత్‌ 101. మనకంటే ఎగువన శ్రీలంక 61,నేపాల్‌ 56, దిగువన మయన్మార్‌ 109, బంగ్లాదేశ్‌ 122,పాకిస్తాన్‌ 136 స్థానాలలో ఉన్నాయి. విద్యార్థుల్లో 1823 సంవత్సరాల వయస్సు వారిలో ఉన్నత విద్యకు వెళ్లే వారు ప్రస్తుతం చైనాలో(జిఇఆర్‌) 60శాతం దాటారు, ఇది ఉన్నత మధ్యతరగతి ఆదాయ దేశాలకు సమానం. 2012లో ఇది 30శాతం మాత్రమే ఉండేది. అందరికీ ఉన్నత విద్యలో చైనా ప్రపంచ స్థాయికి ఎదిగింది. రానున్న ఐదు సంవత్సరాల్లో అమెరికా నుంచి 50వేలు, ఫ్రాన్సునుంచి మూడు సంవత్సరాలల్లో పదివేల మంది విద్యార్థులను మార్పిడి కార్యక్రమం కింద ఆహ్వానించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. విశ్వవిద్యాలయాలు పరిశోధనా కేంద్రాలుగా మారేట్లు చైనా చూస్తున్నది. అక్కడ జరిగే పరిశోధన ఫలితాలను ఉత్పత్తి, సేవారంగాలలో వినియోగించే విధంగా వాణిజ్య స్థాయిలో విక్రయించేందుకు కూడా ప్రోత్సహిస్తున్నది తద్వారా ప్రభుత్వం కేటాయించే నిధులతో పాటు అదనంగా వచ్చే ఆదాయంతో మరింతగా పరిశోధకులను ప్రోత్సహించేందుకు వీలుకలుగుతుంది.ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు, సాంకేతిక పరిజ్ఞానం అమల్లో వచ్చే ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించటం, నవీకరించే పరిశోధలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.ఫలితంగా ఈ పరిశోధనల విలువ 201923కాలంలో 150 నుంచి 290 కోట్ల డాలర్లకు పెరిగింది.దీనికి అనుగుణంగానే వార్షిక నివేదికలను విడుదల చేసే విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల సంఖ్య 3,447 నుంచి 4,028కి పెరిగింది. మార్కెట్లో తమ పరిశోధన ఫలితాలను అందచేసేందుకు చేసుకున్న ఒప్పందాలు కూడా 3,34 నుంచి 6.4లక్షలకు పెరిగాయి. వీటిలో 60శాతం స్థానిక సంస్థలవే కావటంతో ప్రాంతీయ అభివృద్ధికి ఎక్కువగా దోహదం చేస్తున్నాయన్నది స్పష్టం.


చైనా విద్యను కూడా ఎగుమతి చేయాలని చూస్తున్నది.దీనిలో భాగంగా అనేక దేశాలలో ఇంటర్నేషనల్‌ స్కూళ్ల స్థాపనకు పూనుకుంది. చైనీయులు అనేక దేశాల్లో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు.వారి కుటుంబాలు తిరిగి రావాలంటే చైనా విద్య అవసరం ఎంతో ఉంది.చైనా స్కూళ్లలో ఏ పాఠ్యాంశాలనైతే బోధిస్తున్నారో వాటి నకలుతో దుబాయ్‌లో 500 చైనా కుటుంబాల విద్యార్థులతో స్కూలు నడుస్తున్నది. రానున్న రోజుల్లో అనేక దేశాల్లో ఇలాంటి వాటిని ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. దుబాయ్‌లో ప్రయోగాత్మకంగా 2020 నుంచి నడుస్తున్నది. అమెరికా,బ్రిటన్‌తో సహా 45 దేశాలలో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశాలను చూడాలని చైనా కమ్యూనిస్టు పార్టీ తన దౌత్యవేత్తలను కోరింది. ప్రపంచంలో కోటి మంది చైనీయులు ఆ దేశానికి చెందిన కంపెనీలలో పనిచేస్తున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత స్థానికులతో అలాంటి వారి పిల్లలు పోటీపడలేకపోతున్నారు. అందువలన చైనా భాష, సిలబస్‌తో ఆ లోపాన్ని అధిగమించేందుకు స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇతర దేశాల వారిని కూడా ఈ స్కూళ్లకు ఆకర్షించేలక్ష్యం కూడా దీని వెనుక ఉంది. ఉదాహరణకు విదేశాల్లో నడిపే ఫ్రెంచి స్కూళ్లలో కేవలం నలభైశాతం మందే ఆ దేశానికి చెందిన వారుంటుండగా మిగతావారందరూ ఇతర దేశీయులే. అమెరికన్‌ స్కూళ్లలో పరిస్థితి కూడా ఇదే. చైనాలో కొన్ని ప్రైవేటు సంస్థలు స్కూళ్లను నడుపుతున్నాయి. ఇవి విదేశాల్లో కూడా చైనా స్కూళ్లను ప్రారంభిస్తే ప్రభుత్వం మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
.

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సరిహద్దు ప్రాంతాన్ని చైనా మనదేశానికి అప్పగించిందా ? నరేంద్రమోడీ పరువు తీస్తున్న సోషల్‌ మీడియా భక్తులు !

02 Saturday Nov 2024

Posted by raomk in Asia, BJP, CHINA, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

anti china, BJP, fake news, Indo - China trade, Indo-China standoff, Narendra Modi Failures, RSS, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


ఫేక్‌ న్యూస్‌, కృత్రిమ మేథతో నకిలీ ఫొటోలతో సామాజిక మాధ్యమంలో జరిపే ప్రచారంలో మనదేశం ఎంతో ముందుంది. నకిలీ వార్తల ముప్పు ఎక్కువగా ఉన్న దేశాలలో మనం ప్రధమ స్థానంలో ఉన్నట్లు గతంలో ప్రపంచ ఆర్థికవేదిక నివేదిక హెచ్చరించింది. గడచిన పది సంవత్సరాలలో ఈ ప్రచారదాడికి గురికాని వాట్సాప్‌ ఉన్న ఫోన్‌ బాధితులు లేరంటే అతిశయోక్తి కాదు.అది నరేంద్రమోడీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ, మహాత్మాగాంధీ, మతం, విద్వేషం, తప్పుడు సమాచారం, వక్రీకరణ ఇలా పలు రూపాల్లో ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఫలానా కంపెనీ లేదా వ్యక్తి దివాలా తీసిన కారణంగా తమ దగ్గర మిగిలిపోయిన వస్త్రాలను కారుచౌకగా విక్రయించి సొమ్ముచేసుకోవాలనుకుంటున్నారు అంటూ పత్రికల్లో ప్రకటనలు వచ్చేవి, నాసిరకం సరుకు అంటగట్టి దుకాణం ఎత్తివేసేవారు. ఈ వార్త ఏ ప్రధాన పత్రికల్లో, టీవీల్లో రాదు అంటూ తప్పుడు సమాచారాన్ని వాట్సాప్‌లో ఉచితంగా అందించే సామాజికసేవకులను మనం చూస్తున్నాం. అలాంటిదే ఇప్పుడు ఒక ఫొటో, దాని కింద సమాచారం ఒకటి తిరుగుతోంది.

ఎక్కడైతే ఘర్షణ జరిగిందో అక్కడే నాలుగు సంవత్సరాల తరువాత తొలిసారిగా దీపావళి రోజు భారత్‌చైనా సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. ఇలాంటి దృశ్యం మరోసారి చూడాలని కోరుకుంటున్నవారికి సంతోషం, ఘర్షణ కొనసాగాలని చూసిన వారికి విషాదం కలిగించింది. సంవత్సరాల పాటు సాగిన చర్చల అనంతరం అక్టోబరు మూడవ వారంలో ఉభయ దేశాల ప్రతినిధులు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సడలించి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఒక ఒప్పందానికి వచ్చారు. దాన్ని రష్యాలోని కజాన్‌ నగరంలో జరిగిన బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా అక్టోబరు 23న మన ప్రధాని నరేంద్రమోడీచైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ నేతృత్వంలో ఉభయదేశాల ప్రతినిధి బృందాలు సమావేశమై తుదిరూపమిచ్చాయి. ఒక క్రమ పద్దతిలో గాల్వన్‌ లోయ ఉదంతాలకు ముందున్న పరిస్థితిని పునరుద్దరించేందుకు అంగీకరించారు, ఆ మేరకు అక్టోబరు చివరివారంలో సైనిక దళాల ఉపసంహరణ కూడా జరిగింది.ఈ తరుణంలో చైనా వ్యతిరేక మోడీ అనుకూల సోషల్‌ మీడియా మరుగుజ్జులు రంగంలోకి దిగారు. చైనా దేశ మాప్‌ నేపధ్యంలో నరేంద్రమోడీ ఒక సింహాసనం లాంటి కుర్చీలో ఠీవీగా కూర్చొని ఉంటే షి జింపింగ్‌ మోకాళ్ల మీద కూర్చుని భూమిని అప్పగిస్తున్నదానికి చిహ్నంగా చెట్లు ఉన్న ఒక పచ్చని పళ్లెంలాంటి దాన్ని సమర్పించుకుంటున్నట్లు తయారు చేసిన నకిలీ కృత్రిమ చిత్రాన్ని సోషల్‌ మీడియాలో వదిలారు. దాన్ని చైనా సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని, అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం సెన్సార్‌ చేసిందని, షేర్‌ చేస్తున్న వారి మీద కఠిన చర్యలకు దిగుతున్నట్లు సమాచారం వచ్చిందని రాశారు. తప్పుడు సమాచార వ్యాప్తిలో ఇదొక కొత్త టెక్నిక్‌, అబ్బే మనకేం సంబంధం లేదు చైనాలోనే అలాంటిది జరిగినట్లు నమ్మించే అతి తెలివి తప్ప మరొకటి కాదు. తప్పుడు చిత్రాలు, సమాచారాన్ని ప్రచారం చేసే వారు ఎక్కడో ఒక దగ్గర దొరికి పోతారు.

చైనా ఆక్రమించుకున్న 90వేల చదరపు మీటర్ల ప్రాంతాన్ని (22.23ఎకరాలు) తిరిగి మనదేశానికి అందచేసినట్లు రాశారు. నిజానికి రెండు దేశాల మధ్య వివాదం ఉన్న స్థల విస్తీర్ణం 90వేల చదరపు మీటర్లు కాదు కిలోమీటర్లు. ఆ ప్రాంతాన్ని నిజంగా చైనా అప్పగిస్తే అది ప్రపంచ వార్తగా మారి ఉండేది.సరిహద్దుల్లో గతంలో మాదిరి ఎవరి ప్రాంతాల్లో వారు ఉండటం గురించి, గస్తీమీద ఒక ఒప్పందానికి వచ్చారు తప్ప ఒక్క గజం స్థలం కూడా మార్పిడి జరగలేదు, అసలు దాని మీద చర్చలే జరగలేదు. అది మాది అంటే మాది అని మన ప్రభుత్వం, చైనా సర్కార్‌ ఎప్పటి నుంచో పరస్పరం వాదించుకుంటున్నాయి. మన ఆధీనంలో 84వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదని, టిబెట్‌ దక్షిణ ప్రాంతమని చైనా చెబుతుంటే వారి ఆధీనంలో ఉన్న ఆక్సాయ్‌ చిన్‌ ప్రాంతం 90వేల చదరపు కిలోమీటర్లు మనదని అంటున్న అంశం తెలిసిందే. రెండు దేశాల మధ్య వివాదం అదే కద. అసలేమీ జరగనిదాన్ని చైనా సోషల్‌ మీడియాలో ఎలా ప్రచారం చేస్తారు. అక్కడ మన మాదిరి దేన్నిబడితే దాన్ని జనం మీదకు వదలటానికి గూగుల్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌లు లేవు. వాటి మీద నిషేధం ఉంది. అవెక్కడా కనిపించవు. చైనా సర్కార్‌ అధికారికంగా నిర్వహించే బైడు వంటి సామాజిక మాధ్యమవేదికలు ఉన్నాయి.నిజంగా ఎవరైనా అలాంటి పిచ్చి పోస్టు వాటిలో పెడితే వెంటనే తొలగించే సాంకేతిక నైపుణ్యం చైనా దగ్గర ఉంది. అందువలన అలాంటి వాటిని వైరల్‌ చేసే అవకాశం అక్కడ లేదు. అలాంటి చిత్రాల గురించి నిజానిజాలు తేల్చేందుకు చూసిన వారికి మన సోషల్‌ మీడియాలో తిరుగుతున్న ఒక కృత్రిమ చిత్రంగా తేలింది తప్ప చైనాలో తయారైందిగా కనిపించలేదు. ఒకవేళ ఎవరికైనా అలాంటి సమాచారం ఉంటే ఆధారాలతో వెల్లడిరచవచ్చు. ఆ చిత్రం తీరుతెన్నులను చూస్తే నరేంద్రమోడీ గొప్పతనాన్ని కృత్రిమంగా పెంచేందుకు చూస్తున్న కిరాయిబాపతు సృష్టి తప్ప మరొకటి కాదు అన్నది స్పష్టం. వారికి అదొక తుత్తి(తృప్తి),చౌకబారుతనం తప్ప మరొకటి కాదు. నిజంగా అలాంటి వాటిని పదే పదే ప్రచారం చేస్తే నిజం చెప్పినా ఒకనాటికి మోడీ భక్తులు కూడా నమ్మని స్థితి ఏర్పడుతుంది.పరాయి దేశాల్లో అపహాస్యం పాలౌతారు.


2020లో గాల్వన్‌లోయ సరిహద్దులో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణ ఆసియా రాజకీయాల్లో భూకంపం అని కొందరు వర్ణించారు. ముఖ్యంగా అమెరికా మీడియా మాటలను చూస్తే భారత్‌చైనాల మధ్య మరో యుద్ధమే తరువాయి అన్నట్లుగా భ్రమపడిన వారున్నారు. ఇంకే ముంది మన చేతికి మట్టి అంటకుండా చైనాను నిరోధించే బాధ్యత నరేంద్రమోడీ నెత్తిన పెట్టవచ్చనుకున్నారు అమెరికన్లు. సరిహద్దులో లక్షల సైన్యం కొనసాగితే మరింతగా సొమ్ము చేసుకోవచ్చని అమెరికా, ఇతర ఐరోపా దేశాల ఆయుధ కంపెనీలు మన గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.మన మార్కెట్లో తమ సరకులను కుమ్మరించి లాభాలు పిండుకోవచ్చని కలలు కన్నాయి. ఇప్పుడవి కల్లలయ్యాయి. చైనా నుంచి గత నాలుగేండ్లుగా రికార్డు స్థాయిలో దిగుమతులు చేసుకోవటమే కాదు, నిషేధించిన పెట్టుబడులను కూడా పొందేందుకు మోడీ సర్కార్‌ నిర్ణయించింది. దీంతో ఇప్పుడు కుదిరిన సయోధ్య చైనా వ్యతిరేకులకు పిడుగుపాటుగా ఉంది. తమ ఎన్నికలకు పక్షం రోజుల ముందు కుదిరిన ఈ అవగాహనను అమెరికన్లు ఊహించినప్పటికీ పరిస్థితి తమ చేతుల్లో లేదన్న ఉక్రోషంతో ఉన్నారు. మనదేశంలోని కొన్ని శక్తులకు మింగుడు పడకపోయినా కార్పొరేట్ల వత్తిడి కారణంగా లోలోపల ఉడుక్కుంటున్నారు.

చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌పై పోస్టు పెట్టినందుకు, దాన్ని వైరల్‌చేసిన వారి మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందంటూ సంఘపరివార్‌ మరుగుజ్జులు గుండెలు బాదుకుంటున్నారు.లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి అమిత్‌ షా ఉపన్యాసమంటూ ఫేక్‌ వీడియోలు తయారు చేసిన వారి మీద పెట్టిన కేసులు, అరెస్టుల సంగతి వారికి తెలిసినా చైనాలో సామాజిక మాధ్యమాలలో స్వేచ్చ లేదనట్లుగా ఫోజుపెడుతున్నారు. మరి అపర ప్రజాస్వామికవాది అమిత్‌ షా తరఫున ఎందుకు కేసులు పెట్టినట్లు ? నిజానికి చైనాలో సదరు పోస్టు మీద కేసులు పెట్టారో అసలు అది అక్కడ వైరల్‌ అయిందో లేదో కూడా తెలియదు. అయిందని చెప్పేవారి దగ్గర ఎలాంటి నిర్ధారిత సమాచారమూ లేదు. ఒక్క అధ్యక్షుడి మీద వక్రీకరణ వార్తల మీదే కాదు, గంగానదిలో మునిగితే కరోనా రాదు, దీపాలు వెలిగిస్తే, చప్పట్లు కొడితే పారిపోతుంది అని బాధ్యతా రహితంగా ప్రచారం చేసి జనాలను తప్పుదారి పట్టించేవారి మీద కూడా అక్కడ కేసులు పెడతారు, స్వేచ్చగా వదలి జనాల బుర్రలను ఖరాబు కానివ్వరు. ఐదు సంవత్సరాల క్రితం షీ జింపింగ్‌ మహాబలిపురాన్ని సందర్శించినపుడు అక్కడ నరేంద్రమోడీ షీ ముందు వంగి నమస్కారం చేసినట్లు ఆ రోజుల్లో ఒక ఫొటో వైరల్‌ అయింది. తీరా అది ఫేక్‌ అని తేలింది. ఎప్పుడో 2014లో కర్ణాటకలోని తుముకూర్‌ మహిళా మేయర్‌ స్వాగతం పలికినపుడు నరేంద్రమోడీ వంగి అభివాదం చేసినప్పటి చిత్రాన్ని షీ జింపింగ్‌కు కలిపి వైరల్‌ చేశారు. ఇలా మోడీకి వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్ద ఎత్తున అనేక ఫేక్‌ చిత్రాలు, వార్తలను ప్రచారంలో పెట్టారు. ఇటీవల ఐరాస సమావేశాలకు మోడీ న్యూయార్క్‌ వెళ్లినపుడు చైనాను భద్రతా మండలి శాశ్వత సభ్యరాజ్యంగా తొలగించారని, భారత్‌కు చోటు కల్పించారంటూ మోడీ ప్రతిష్టను పెంచేందుకు ఒక తప్పుడు వీడియో, సమాచారాన్ని వైరల్‌ చేశారు. అది ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ఉంది. 1970దశకం వరకు కమ్యూనిస్టు చైనాను ఐరాసలో అసలు గుర్తించలేదు, దానికి అడ్డుపడిరది అమెరికా అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ నెహ్రూ కమ్యూనిస్టు చైనాకు భద్రతా మండలిలో సభ్యత్వానికి మద్దతుపలికారంటూ కాషాయదళాలు పచ్చి అబద్ద ప్రచారం చేస్తుంటాయి. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఐరాస స్థాపక దేశంగా 1945 నుంచీ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పేరుతో శాశ్వత సభ్యత్వ హోదా ఉంది. ఆ తరువాత నాలుగేండ్లకు 1949లో కమ్యూనిస్టులు చైనాలో అధికారానికి వచ్చారు. ఆ తరువాత కూడా 1971వరకు తైవాన్‌లో ఉన్న తిరుగుబాటు ప్రభుత్వాన్నే అసలైన చైనా పాలకులుగా గుర్తించి అదే హోదాను కొనసాగించారు.1971లో తైవాన్‌ పాలకులకు ఉన్న గుర్తింపును రద్దు చేసి కమ్యూనిస్టుల నాయకత్వంలోని పీపుల్స్‌ రిపబ్లిక్‌ చైనా పాలకులను గుర్తించారు. తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగం అని ఐరాస గుర్తించింది. నెహ్రూ 1964లో మరణించారని తెలిసిందే. 1971 నుంచి ఇప్పటి వరకు మనకు అత్యంత ఆప్తులు, భాగస్వాములు అంటున్న అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్సు గానీ మనకు శాశ్వత సభ్యత్వ హోదా ఇవ్వాలని ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఐరాసలో తీర్మానం పెట్టలేదు. ఇదంతా తెలిసినప్పటికీ మోడీ శాశ్వత సభ్యత్వాన్ని సాధించారంటూ తప్పుడు వీడియోలు తయారు చేసి జనంలోకి వదిలారు. ఫేక్‌ న్యూస్‌ చూసేవారికి బుర్ర ఉండదని వారికి ఎంత నమ్మకమో ! షీ జింపింగ్‌మోడీ గురించి పెటిన చిత్రం కూడా అంతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అధికారం పదిలం – అవినీతి సునామీలో జపాన్‌ పాలకపార్టీకి చావు దెబ్బ !

30 Wednesday Oct 2024

Posted by raomk in Asia, CHINA, COUNTRIES, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, USA

≈ Leave a comment

Tags

Japan Communist Party, Japan Elections 2024, Japan LDP, Shigeru Ishiba

ఎం కోటేశ్వరరావు

ఆదివారం నాడు జరిగిన పార్లమెంటు ఎన్నికలలో జపాన్‌ పాలక లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎల్‌డిపి)కి చావు దెబ్బ తగిలింది.అయితే దాని అధికారం పదిలంగా ఉంటుందని చెబుతున్నారు. పార్లమెంటులోని దిగువ సభలో ఉన్న 465 స్థానాలకు గాను గత ఎన్నికలలో 34.66శాతం ఓట్లు, 259 సీట్లు తెచ్చుకున్న ఎల్‌డిపి ఈ సారి 26.73శాతం ఓట్లు, 191 సీట్లతో సరిపెట్టుకుంది. మిత్రపక్షం కొమిటో పార్టీ పొందిన 24తో కలిపి 215 మాత్రమే తెచ్చుకుంది. సాధారణ మెజారిటీ 233 స్థానాలను ఏ పార్టీ కూడా గెలుచుకోలేకపోయింది. ఇరవై ఎనిమిది సీట్లు తెచ్చుకున్న డిపిపి కింగ్‌మేకర్‌గా మారిందని చెబుతున్నారు. దీంతో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం లేదా పార్టీలలో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది. మద్దతు కూడగట్టేందుకు వివిధ పార్టీలతో ప్రధాని షిగెరు షిబా మంతనాలు జరుపుతున్నాడు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని పాలకపార్టీ పెద్దలు పెద్ద మొత్తంలో విరాళాల వసూలు, వాటిలో కొంత నొక్కేయటం వంటి విమర్శల సునామీలో పాలకపార్టీ ఓడిపోయింది. ఎల్‌డిపి జపాన్‌లో అవినీతికి పెట్టింది పేరు, అయినప్పటికీ అక్కడి ఓటర్లు దానికి దశాబ్దాల పాటు పట్టంకడుతూనే ఉన్నారు. ఈ సారి ఓడిరచారంటే వారి సహనానికి అవినీతి పరులు పరీక్ష పెట్టినట్లుగా కనిపిస్తోంది. పాలకపార్టీకి చెందిన మాజీ ప్రధానులు షింజో అబే, ఫుమియో కిషిడాతో సహా 82 మంది ఎంపీలు స్వంత ఖాతాలకు నిధులు మళ్లించుకున్నట్లు విమర్శలు వచ్చాయి. దీనికి తోడు ఆర్థిక మాంద్యంతో దేశం కొట్టుమిట్టాడుతున్నది. దాన్నుంచి బయటపడవేసే మార్గం కనిపించటం లేదు. ఇవన్నీ పాలకపార్టీ, దాని మిత్ర పక్షాన్ని దెబ్బతీశాయి. అవినీతి ఆరోపణలు ఉన్నవారిని దూరంగా పెడతామని చెప్పినప్పటికీ కొద్ది మందినే పోటీ నుంచి తప్పించటం, ఎక్కువ మందికి నిధులు కూడా సమకూర్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. జనంలో అనుమానం, ఆగ్రహం తమను దెబ్బతీశాయని ప్రధాని షిబా చెప్పాడు. అవినీతి ఆరోపణల పూర్వరంగంలో ఆగస్టు నెలలో కిషిదా రాజీనామా చేయగా అధికారానికి వచ్చిన షిబా మరుసటి నెలలోనే పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు తెరతీశాడు. వ్రతం చెడినా ఫలం దక్కలేదు.1955 నుంచి వరుసగా గెలుస్తున్న ఎల్‌డిపి 2009లో ఒకసారి ఓడిపోయింది. తిరిగి ఇప్పుడు మెజారిటీని కోల్పోయింది.ఎల్‌డిపి మిత్రపక్షం కొమిటో పార్టీ బలం 32 నుంచి 24కు పడిపోయింది. అయితే రెండూ కలిసినప్పటికీ 215 మాత్రమే, మరో పద్దెనిమిది సీట్లు అవసరం. పార్లమెంటును నవంబరు 26వ తేదీలోగా సమావేశపరచాల్సి ఉంది, పదకొండవ తేదీన బలపరీక్ష జరుగుతుందని భావిస్తున్నారు. ఆ రోజు జరిగే ఓటింగ్‌లో సంపూర్ణ మెజారిటీ ఎవరికీ రాకపోతే తొలి రెండు స్థానాలలో ఉన్నవారితో రెండవ సారి ప్రధాని పదవికి ఓటింగ్‌ జరుగుతుంది. సంపూర్ణ మెజారిటీ వచ్చినా రాకున్నా ఎక్కువ ఓట్లు వచ్చిన వారు ప్రధాని అవుతారు.సబ్సిడీలు పెంచాలని, విద్యుత్‌ బిల్లులు తగ్గించాలనే అజెండాతో ఎన్నికలలో పోటీచేసిన ఆ పార్టీ నేతలు చర్చలకు సుముఖత వ్యక్తం చేశారు.చర్చలకు సిద్దపడితే తిరస్కరించాల్సిన కారణం కనిపించటం లేదని అయితే ఏ అంశాలను చర్చిస్తారన్నదాని మీద ఫలితం ఆధారపడి ఉంటుందని డిపిపి నేత యుచిరో తమాకీ చెప్పాడు.వివిధ పద్దతుల్లో చర్చలు జరుగుతున్నాయన్నాడు.ఎల్‌డిపి పైకి మాత్రం బెట్టు ప్రదర్శిస్తోంది.

రోజూ గంటల తరబడి ఓవర్‌ టైమ్‌ చేస్తే తప్ప కార్మికులకు గడవని స్థితి. దీంతో రెండవ ప్రపంచ యుద్దం నాటి నుంచి అలాంటి వాతావరణానికి జనాన్ని అలవాటు చేశారు. దేశం దుస్థితి నుంచి బయటపడాలంటే వ్యక్తిగత జీవితాలను త్యాగం చేయాలంటూ దేశభక్తి నూరిపోశారు. అయితే జపనీయులు ఎక్కువ గంటలు పని చేస్తారంటూ ముద్దుపేరు పెట్టి సమర్ధించుకుంటారు. అధిక పని కారణంగా మరణాలు కూడా అక్కడ సర్వసాధారణమే. వాటిని కరోషీ అంటున్నారు. ప్రతి పది మందిలో ఒకరు నెలకు 80గంటలు ఓవర్‌ టైమ్‌ చేస్తున్నారు. ప్రతి ఐదు మందిలో ఒకరు కరోషీ గుండెపోటు లేదా పనివత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఒకనాటి అద్భుతంగా వర్ణించిన అంశం ఇప్పుడు జాతీయ ఆరోగ్య సమస్యగా మారింది.ఈ పరిస్థితిని మార్చాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ కార్పొరేట్లు అందుకు అంగీకరించటం లేదు. ఓవర్‌ టైమ్‌ తగ్గించుకొనేందుకు కార్మికులే అంగీకరించటం లేదని, ఏడు గంటలకల్లా ఆఫీసు వదలాలని బలవంతం చేయాల్సి వస్తోందని కొన్ని సంస్థలు చెప్పుకుంటాయి. పని వత్తిడితో 2015లో ఆత్మహత్య చేసుకున్న 24 ఏండ్ల తకహషి ఉదంతం దేశ వ్యాపితంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.తాను రోజుకు 20గంటలకు పైగా పనిచేస్తున్నానని, ఎందుకు జీవిస్తున్నానో అర్ధం కావటం లేదని ఆమె ట్వీట్‌ చేసింది. ఆ తరువాత 50మందికి పైగా సిబ్బంది ఉన్న సంస్థలన్నీ స్వచ్చందంగా ఏడాదికి ఒకసారి తమ సిబ్బంది మానసిక ఆరోగ్య పరీక్షలు చేయించి నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయాల్సి వచ్చింది.అయితే ఎక్కువ కంపెనీలు తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు తేలింది. కార్మికులు నిజాలను దాస్తున్నట్లు కంపెనీలు చేతులు దులుపుకున్నాయి.అబెనోమిక్స్‌ పేరుతో మాజీ ప్రధాని షింజో అబె అనుసరించిన విధానాలు స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసిన వారికి లాభాలు తెచ్చాయి తప్ప కార్మికులకు ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదు. దీనికి తోడు ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ దిగజారుడు, నిరుద్యోగ సమస్య కూడా తోడు కావటంతో కార్మికవర్గం ఆగ్రహించింది.

ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ తన పదవికి ఎలాంటి ఢోకా లేదని ప్రధాని షిగెరు షిబా చెప్పాడు.ఏ పార్టీ లేదా కూటమికీ మెజారిటీ లేనందున ఎన్నికలు జరిగిన 30రోజుల్లోగా తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలకు అంత బలం లేనందున మైనారిటీ ప్రభుత్వాన్ని ఎల్‌డిపి కొనసాగించగలదని కొందరు భావిస్తున్నారు. ఇషిబా రెండవసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే సరి లేకుంటే రెండవ ప్రపంచ యుద్దం తరువాత అతి తక్కువ రోజులు అధికారంలో ఉన్న ప్రధానిగా చరిత్రకు ఎక్కుతాడు. రెండవ పెద్ద పార్టీగా అవతరించిన కానిస్టిట్యూషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ తన బలాన్ని 96 నుంచి 148కి మాత్రమే పెంచుకుంది. ఎల్‌డిపిలో మాజీ ప్రధాని షింజో అబే వర్గం ప్రస్తుత ప్రధాని షిబా పట్ల సానుకూలంగా లేదని, అధికార పార్టీలో చీలిక రావచ్చని కూడా జోశ్యం చెబుతున్నారు. వచ్చే ఏడాది జూలైలో ఎగువ సభ ఎన్నికలు జరగాల్సి వుంది. జపాన్‌ మిలిటరీ పాత్రను పెంచేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ తొమ్మిదిని సవరించాలని ఎల్‌డిపి ఎప్పటి నుంచో చెబుతున్నది.తద్వారా ప్రపంచ మార్కెట్లలో తనవంతు వాటాను పొందవచ్చని జపాన్‌ పాలకవర్గం భావిస్తున్నది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ప్రతిపాదిస్తున్న ‘‘ ఆసియన్‌ నాటో ’’ కూటమికి నాయకత్వం వహించాలని అది భావిస్తున్నది. అయితే అలాంటి సవరణను కమ్యూనిస్టు పార్టీతో సహా ప్రధాన ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు పాలక కూటమి మైనారిటీలో పడినందున ఆ అజెండాను పక్కన పెట్టవచ్చు. అమెరికాతో అంతకంతకూ దగ్గర అవుతూనే చైనాతో సంబంధాలను విడగొట్టుకొనేందుకూ జపాన్‌ పాలకవర్గం సిద్దం కావటం లేదు. ఎందుకంటే చైనాతో వాణిజ్యం వారికి ఎంతో అవసరం. ఎన్నికలు జపాన్‌ అంతర్గత వ్యవహారమని తాము దాని గురించి చెప్పాల్సిందేమీ లేదని చైనా ముక్తసరిగా వ్యాఖ్యానించింది. ప్రతిపక్షాల్లో 148 సీట్లు తెచ్చుకున్న సిడిపి, 38, 28 చొప్పున సీట్లు పొందిన జెఐపి, డిపిపి పార్టీలు తాము చేతులు కలిపే అవకాశం లేదని అంశాల వారీగా ప్రభుత్వానికి మద్దతు లేదా వ్యతిరేకతను వెల్లడిస్తామని పేర్కొన్నాయి. అయితే స్వతంత్రులు, చిన్న పార్టీలను కలుపుకొని ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమూ లేకపోలేదని భావిస్తున్నవారూ ఉన్నారు. అది జరగకపోతే మైనారిటీ ఎల్‌డిపి కూటమి అధికారంలో కొనసాగే అవకాశం ఉంది. అయితే ఎల్‌డిపిలోనే కుమ్ములాటలతో కొత్త నేత ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఏది జరిగినా అస్థిరత కత్తి వేలాడుతూనే ఉంటుంది.లాబీల బేరమాడే శక్తి పెరుగుతుంది. ఎవరు అధికారానికి వచ్చినా అటు కార్మికవర్గంఇటు కార్పొరేట్‌ వర్గమూ తమ సంగతేమిటని పాలకుల మీద వత్తిడి పెంచుతాయి. తక్షణ సవాళ్లుగా ఆర్థిక అంశాలే ఉంటాయని జపనీస్‌ బిజినెస్‌ ఫెడరేషన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నది.

అవినీతిపరులుగా ముద్రపడిన కొందరిని పక్కన పెట్టి ఓటర్లను సంతుష్టీకరించేందుకు షిబా ప్రకటించినప్పటికీ ఎక్కువ మందికి పెద్ద పీట వేయటంతో ఓటర్లు అతని నాయకత్వాన్ని విశ్వసించలేదు. అందరి మాదిరే అని భావించారు.అవినీతి నిరోధానికి కొత్తగా తీసుకున్న చర్యలేవీ ఓటర్లకు కనిపించలేదు. వారి ఆగ్రహాన్ని పసిగట్టటంలో ఎల్‌డిపి నాయకత్వం విఫలమైంది. పాత ముఖాలనే షీబా కూడా మంత్రులుగా తీసుకున్నాడు.కార్పొరేట్‌ కంపెనీల నుంచి విరాళాలు తీసుకోవటాన్ని గట్టిగా సమర్థించాడు. పాలకపార్టీకి వస్తున్న రాబడిలో 60శాతం వరకు కార్పొరేట్‌ విరాళాలే ఉన్నాయి. వాటి నిషేధం పగటి కల అన్నాడు.ఓటర్లు ఎన్నికల పట్ల ఆసక్తి కోల్పోయినట్లు కేవలం 53.85శాతం మాత్రమే పోల్‌ కావటం తెలుపుతున్నది. గత ఎన్నికలతో పోలిస్తే 2.08శాతం తక్కువ. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇంత తక్కువ మంది పాల్గొనటం ఇది మూడవసారి. జపాన్‌లో రెండు రకాల నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 465కు గాను 289 సీట్లలో నియోజకవర్గాల ప్రాతిపదికన ప్రతినిధులు ఎన్నికౌతారు. 176 చోట్ల ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం సీట్లను కేటాయిస్తారు. నియోజకవర్గాలలో డబ్బున్న పార్టీలు తప్ప మరొకరు పోటీపడలేరు. కమ్యూనిస్టు పార్టీ గెలిచిన ఎనిమిదింటిలో ఒకటి మాత్రమే నియోజకవర్గాల జాబితా నుంచి ఉంది. పార్టీ గతంకంటే రెండు సీట్లను, 7.25 నుంచి 6.16శాతానికి ఓట్లను కోల్పోయింది. సింగిల్‌ సీటు నియోజకవర్గాలలో కమ్యూనిస్టులు 213 చోట్ల పోటీ చేశారు.పాలకపార్టీ నిధుల కుంభకోణం గురించి కమ్యూనిస్టు పార్టీ, పార్టీ పత్రిక అకహటా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఎన్నికలలో ఇవి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వివిధ అంశాలపై విబేధాల కారణంగా ప్రతిపక్ష పార్టీల మధ్య సర్దుబాటు సాధ్యం కాలేదు. అనేక చోట్ల పరస్పరం పోటీపడ్డాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికార పార్టీ అభ్యర్దులున్న చోట ప్రతి పక్షాల తరఫున ఒకే అభ్యర్ధిని నిలపాలన్న ప్రతిపాదనను కమ్యూనిస్టు పార్టీ తిరస్కరించింది.భద్రతా చట్టాల రద్దు తదితర అంశాలపై ఏకాభిప్రాయం అవసరమని పేర్కొన్నది.అయితే రాజధాని టోకియో వంటి కొన్ని చోట్ల కమ్యూనిస్టు పార్టీ ప్రతిపక్ష అభ్యర్ధులను బలపరిచింది. ఒకినావా నియోజకవర్గంలో ఉన్న అమెరికా మిలిటరీ కేంద్రాన్ని ఎత్తివేయాలని కోరుతున్న శక్తులన్నీ అక్కడ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి అకామైన్‌ను బలపరచగా పాలక పార్టీపై విజయం సాధించాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎన్నికలకు ముందే కెనడా ప్రధానికి ఉద్వాసన ? విశ్వగురువు ఇప్పటికైనా కళ్లు తెరిచేనా !

25 Friday Oct 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

anti india, Donald trump, Joe Biden, Justin Trudeau, khalistan, Narendra Modi, war on terrorism

ఎం కోటేశ్వరరావు


అక్టోబరు నెల మధ్య నుంచి జరుగుతున్న పరిణామాలతో భారత్‌కెనడా సంబంధాలు తీవ్ర వత్తిడికి గురవుతున్నాయి. అమెరికా, దాన్ని అనుసరించే దేశాలన్నీ మన మీద కత్తిగట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇదే సమయంలో కెనడా పాలకపక్షంలో కొందరు ఎంపీలు ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ 2024 అక్టోబరు 28లోగా పదవి నుంచి తప్పు కోవాలని, మరోసారి ఎన్నికల గోదాలో దిగవద్దని 153 మంది పాలక పార్టీ ఎంపీల్లో 24 మంది డిమాండ్‌ చేసినట్లు కెనడా బ్రాడ్‌కాస్ట్‌ కార్పొరేషన్‌ వార్తను ప్రసారం చేసింది. ఇది ఏ రూపం తీసుకుంటుందో తెలియదు. అంతకు ముందు పరస్పరం కొందరు దౌత్యవేత్తల బహిష్కరణ మిగిలిన సిబ్బందిపై నిఘావంటి ప్రకటనలతో ఇరుదేశాల మధ్య దౌత్య యుద్దం, ప్రచారదాడి జరుగుతోంది. ఇది రాసిన సమయానికి 270కిపైగా భారత విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న సర్వీసులకు బాంబు బెదిరింపులు రావటం ఆందోళన కలిగించే పరిణామం. గురువారం ఒక్కరోజే 95 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. గతంలో ఇలాంటి పరిస్థితిని మనం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఏ విమానం ఎక్కితే బాంబు ఉన్నట్లు సమాచారం వస్తుందో తెలియని డోలాయమానంలోకి ప్రయాణీకులను నెట్టి భయాన్ని సృష్టించమే ఈ ఉదంతాల వెనుక ఉన్న శక్తుల ఎత్తుగడగా కనిపిస్తోంది. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నడిపితే, ఏదైనా విమానంలో నిజంగా బాంబుపెడితే జరిగే ఘోరాన్ని తలచుకోవాలంటేనే వణుకుపుడుతోంది. దేశం 1980 దశకం నాటి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పరిస్థితులకు వెళుతోందా అనే సందేహాలు వెల్లడవుతున్నాయి. ఉగ్రవాదాన్ని శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూడకూడదు. అలా పరిగణిస్తే దాన్ని నివారించే బాధ్యత, పోలీసు, ఇతర భద్రతా వ్యవస్థలపై పడుతుంది. అలాంటి సంస్థలు ప్రపంచ వ్యాపితంగా అనుసరించిన దగ్గరి దారి ఏమంటే జనం మీద దాడికి దిగటం. కిరాయికి లేదా ప్రత్యేక ముఠాలను రూపొందించి ఉగ్రవాదులు, ఇతర దేశవ్యతిరేకులను మట్టుబెట్టించటం. ఇది ఒక విధంగా అధికారిక ఉగ్రదళం వంటిదే. ఉగ్రవాదులు తలెత్తకుండా ఉండాలంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, అవాంఛనీయ చర్యలకు పాల్పడినపుడు అవసరమైతే ఆయుధ ప్రయోగం చేయవచ్చు.మన కళ్ల ముందే పాలస్తీనా దేశాన్ని విభజించి యూదుల మాతృభూమి పేరుతో ఇజ్రాయెల్‌ ఏర్పాటు జరిగింది.ఉనికిలో ఉన్న పాలస్తీనా అదృశ్యమైంది. దాని పునరుద్దరణకు ఏడు దశాబ్దాలుగా పోరాటం సాగుతున్నది.యావత్‌ పాలస్తీనియన్లు దానిలో పాల్గొంటున్నారు.వారిని కూడా ఉగ్రవాదులుగా అమెరికా చిత్రిస్తున్నది. ప్రపంచంలో వేర్వేరు కారణాలతో అనేక చోట్ల ఆందోళనలు సాగుతున్నాయి. ఈ పూర్వరంగంలో ఖలిస్తాన్‌ ఏర్పాటు అన్న భావనను మెజారిటీ సిక్కులు వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత స్థాయిలో సమర్ధించిన వారందరూ ఉగ్రవాదులు కాదు, దానికోసం ఆయుధాలు చేపట్టి, అవాంఛనీయ చర్యలకు పాల్పడిన వారు మాత్రమే తీవ్రవాదులు.

మనదేశంలో నాగాలాండ్‌, మిజోరాం, కాశ్మీరు, పంజాబ్‌ వేర్పాటు వాదం తలెత్తింది. ఆయుధాలు రంగంలోకి వచ్చాయి. వాటన్నింటికీ అమెరికా, కెనడా,బ్రిటన్‌, వంటి పశ్చిమదేశాలు మద్దతు ఇస్తున్నాయి, ఆ శక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఒక్క మనదేశమే కాదు శ్రీలంక వేర్పాటు వాదుల వెనుక, అనేక దేశాల్లో రకరకాల పేర్లతో ఉన్న శక్తులకు మద్దతు ఇస్తున్నదీ ఈ దేశాలే. దాని వెనుక తమను వ్యతిరేకించేదేశాలను అస్తిరపరచటం లేదా విచ్చిన్నం చేసే సామ్రాజ్యవాదులు ఎత్తుగడ ఉంది, దానికి ఉగ్రవాదం ఒక ఆయుధం. కొన్ని సందర్భాలలో ఉగ్రవాద చర్యలు నిలిచిపోయాయంటే దాని అర్ధం తెరవెనుక పశ్చిమదేశాలకు అనుకూలమైన పరిణామాలు జరిగినట్లే లెక్క. తిరిగి ప్రారంభమయ్యాయంటే పూర్తిగా తమకు లొంగలేదని అవి కథనడిపిస్తున్నట్లే. లేకుంటే ఆకస్మికంగా గత పదిరోజులుగా మాత్రమే మన విమానాలకు బాంబుల బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి ? అవి ఐరోపా ఖండ దేశాల నుంచే ఎలా వస్తున్నట్లు . ప్రపంచ ఉగ్రవాదుల అణచివేతకు తాయత్తు కట్టుకొని బరిలోకి దిగామని చెబుతున్న అమెరికా, కెనడా వంటి దేశాలు ఖలిస్తాన్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం ఎందుకు కల్పిస్తున్నట్లు, వారికి పౌరసత్వం ఎందుకు ఇస్తున్నాయి. పంజాబీలందరూ ఖలీస్తానీవాదులు కాదు, ఉగ్రవాదులూ కాదు. మనదేశాన్ని లొంగతీసుకోవాలని కోరుకొనే పశ్చిమదేశాలకు మేకపిల్లతోడేలు కథ మాదిరి ఏదో ఒకసాకుతో ఉగ్రశక్తులను రెచ్చగొట్టేందుకు అవకాశాలున్నాయనేది కెనడా ఉదంతం వెల్లడిస్తోంది.


అమెరికాకెనడా రెండు దేశాల్లోనూ పౌరసత్వం ఉన్న మనదేశానికి చెందిన గురుపత్వంత్‌ సింగ్‌ పన్ను అనే ఖలిస్తానీ ఉగ్రవాదిని హత్య చేసేందుకు చేసిన కుట్రలో మన గూఢచారి వికాస్‌ యాదవ్‌ ఉన్నట్లు అమెరికా కోర్టు ప్రకటించించింది. దాంతో యాదవ్‌ మీద అరెస్టు వారంట్‌ జారీచేసి ఎఫ్‌బిఐ జాబితాలో అత్యంత కీలక వాంఛనీయ వ్యక్తిగా బహిరంగంగా ప్రకటించారు. ఇలా మన పౌరుడి గురించి ప్రకటించటం ఇదే మొదటిసారి. అమెరికా మనకు అత్యంత కీలక భాగస్వామిగా ఉన్నదని నరేంద్రమోడీ గతంలో అనేకసార్లు గొప్పగా చెప్పారు. తమ అవసరాల రీత్యా డోనాల్డ్‌ ట్రంప్‌ పలు సందర్భాలలో నరేంద్రమోడీని పొగడ్తల వర్షంతో ముంచెతారు. చెట్టపట్టాలు వేసుకు తిరిగాడు, భారత దేశ పిత అంటూ కితాబులిచ్చాడు. జో బైడెన్‌ తక్కువ తిన్నాడా ‘‘ మోడీజీ మీరు నాకు పెద్ద సమస్య తెచ్చిపెట్టారు. నా కంటే మా దేశంలో మీ పలుకుబడి ఎక్కువగా ఉంది. మీతో కలసి భోంచేసేందుకు దేశమంతటి నుంచి ఎందరో ఎదురు చూస్తున్నారు. ఉన్న సీట్లన్నీ అయిపోయాయి. నేనేదో మిమ్మల్ని ఆటపట్టిస్తున్నా అనుకోవద్దు, ఇది నిజం, కావాలంటే నా బృందాన్ని అడగండి, రోజూఎన్నో ఫోన్లు వస్తున్నాయి నాకు.’’ గతేడాది మే నెలలో చైనాకు వ్యతిరేకంగా జరిగిన క్వాడ్‌(చతుష్టయ) సమావేశానికి ముందు మోడీని మునగ చెట్టు ఎక్కిస్తూ జోబైడెన్‌ పలుకులివి. వీటితో అనేక మంది అమెరికా అధినేతలనే మనకాళ్ల వద్దకు తెచ్చిన మొనగాడిగా నరేంద్రమోడీని పొగిడారు. రాముడు సీతను కోరినట్లుగా ఇప్పుడు దర్యాప్తుకు సహకరించి ఎలాంటి నేరం చేయలేదని నిరూపించుకోండి అంటూ నరేంద్రమోడీని అగ్నిపరీక్షకు పూనుకోవాలంటున్నా పశ్చిమదేశాలు.మరో ఖలిస్తానీ ఉగ్రవాది హరదీప్‌ నిజ్జర్‌ను 2023లో కెనడాలో హత్య చేశారు. దానిలో కూడా భారత అధికారుల హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. నిర్దిష్ట చట్టబద్ద ఆధారాలు లేవంటూనే తమ దగ్గర ‘‘ ఐదు కళ్ల ’’ నిఘా సమాచారం ఉందని చెబుతోంది. దాన్ని నిర్వహిస్తున్న దేశాలు కూడా దర్యాప్తుకు సహకరించాలని అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ గతేడాది కాలంగా వత్తిడి తెస్తున్నాయి. అమెరికా ఎలా కావాలంటే అలా నివేదికలు తయారు చేస్తే మిగిలిన దేశాలన్నీ సంతకాలు చేస్తాయన్నది తెలిసిందే. నిజానికి వాటి వద్ద ఎలాంటి సమాచారమూ లేదని వార్తలు.

ఇటీవలి కాలంలో విదేశాల్లో మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు, మరికొందరు వ్యక్తులు హత్యలకు గురవుతున్నారు. మనకు వ్యతిరేకంగా ఎవడైనా పని చేస్తూ వారికి ఇదే గతి, చూడండి మన తడాఖా, ఎలా లేపేస్తున్నామో అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్న సంగతి, ఆ ఘనతను ఎవరికి ఆపాదిస్తున్నదీ తెలిసిందే.మన సీనియర్‌ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు నెలకు ఇద్దరు ముగ్గురు చొప్పున ఖలిస్తానీ ఉగ్రవాదులను లేపేసేందుకు యాదవ్‌ అనే అతన్ని కేంద్ర కాబినెట్‌ సచివాలయం కింద నేరుగా కిరాయికి పని చేసేందుకు ‘‘రా’’ నియమించిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు యాదవ్‌ ప్రభుత్వానికి పనిచేయటం లేదని విదేశాంగశాఖ ప్రకటించటం ద్వారా నియామకం వాస్తవమే అని అంగీకరించినట్లయింది. ఇప్పుడు వచ్చిన ఆరోపణలపై మన ప్రభుత్వమే విచారణ జరుపుతుందా లేక అమెరికా దర్యాప్తు సంస్థలకు అతన్ని అప్పగిస్తుందా అన్నది తెలియదు. ఏది జరిగినా పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉండేది ఊహించలేము. విదేశాలలో ఉన్న తమ వ్యతిరేకశక్తులను మట్టుపెట్టేందుకు సిఐఏ,మొసాద్‌, ఐఎస్‌ఐల కిందపనిచేసే హంతక దళాలను ఆయా ప్రభుత్వాలు నియమించటం, వాటి దుర్మార్గాల గురించి మనకు తెలిసిందే. అయితే గతంలో ఎన్నడూ మన ప్రభుత్వం వినియోగించిన దాఖలాలు లేవు.ఇదొక ప్రమాదకరమైన క్రీడ.

కెనడాను మనం ఎంతగా కౌగిలించుకున్నా గతంలో ఎన్నడూ అది మిత్రదేశంగా చూడలేదు. దాన్ని కాదని మనల్ని ఎన్నడూ అమెరికా విశ్వాసంలోకి తీసుకోలేదు.ప్రస్తుతం కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్‌ ట్రుడేవ్‌ తండ్రి కూడా గతంలో ప్రధానిగా పనిచేశాడు. రెండు దేశాల మధ్య తాజా వివాదానికి 2018లో జరిగిన ఉదంతం నాంది అని చెప్పవచ్చు. కెనడాలో ఏడు లక్షల 70వేల మంది సిక్కులు ఉన్నారు. జనాభాలో వారి 2.1శాతమే అయినప్పటికీ అక్కడి రాజకీయాల్లో ఎంతో పలుకుబడి కలిగిన వారు. 2018లో ప్రధాని ట్రుడేవ్‌ మనదేశానికి రానున్న సందర్భంగా అతగాడి కార్యాలయం మనదేశానికి చెందిన వారితో సహా 423 మంది పేర్లతో ఒక అతిధుల జాబితాను రూపొందించి వారిని ఆహ్వానించాలని ఆదేశించింది. వారిలో జస్పాల్‌ సింగ్‌ అత్వాల్‌ అనే నేరగాడు ఒకడు.1986లో పంజాబ్‌ మంత్రిగా ఉన్న అకాలీ నేత మల్కాయిత్‌ సింగ్‌ సిద్దు మీద కెనడాలో హత్యాయత్నం జరిగింది. శిక్షపడిన వారిలో అత్వాల్‌ ఒకడు.ట్రుడేవ్‌ సతీమణి సోఫీతో ముంబైలో ఫొటోకూడా దిగాడు. దాంతో వివాదం చెలరేగి తదుపరి ఢల్లీి కార్యక్రమానికి ఆహ్వానాన్ని రద్దు చేశారు.2023 జూన్‌ 18 కెనడా నగరం వాంకోవర్‌ శివారు సురే గురుద్వారా దగ్గర హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ అనే కెనడా పౌరుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. మన గూఢచారులే ఆ పని చేసినట్లు అప్పటి నుంచి కెనడా ఆరోపిస్తోంది.తరువాత మనదేశంలో వాణిజ్య చర్చలను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించింది. గతేడాది సెప్టెంబరు నుంచి మనపౌరులకు వీసాల నిలిపివేత, దౌత్యవేత్తల బహిష్కరణ వంటి పనులు చేస్తున్నది.మనదేశం కూడా ప్రతి చర్యలు తీసుకుంది.తాజాగా అది మరింత ముదిరింది.

తాజా పరిణామాలపై మీడియాలో అనేక భాష్యాలు వెలువడుతున్నాయి. వాటిలో ఒకటేమంటే అమిత్‌ షా,అజిత్‌ దోవల్‌ను కెనడా లక్ష్యం చేసుకున్నదట.దీని అర్ధం నరేంద్రమోడీని, అన్నింటికంటే మించి దేశాన్ని సహిస్తున్నట్లా ? అమెరికా, కెనడా వాటిని అనుసరించే ధనికదేశాలన్నీ మొత్తంగా మన దేశాన్నే లక్ష్యంగా చేసుకున్నాయి.దానిలో భాగంగా పెద్ద గేమ్‌ ఆడుతున్నాయి. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న భారత వ్యతిరేక ఖలిస్తానీ శక్తుల కార్యకలాపాలు తీవ్ర ఆందోళనకరమేగాక దేశ భద్రత మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని సిపిఐ(ఎం) వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంటుందని ప్రకటించింది.ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని లారెన్స్‌ విష్ణోయ్‌ ముఠా పాత్రతో సహా అన్ని అంశాల మీద ప్రభుత్వం వ్యవహరించాలని కోరింది. మనదేశం పశ్చిమదేశాలతో ప్రస్తుతం ముద్దులాటదెబ్బలాటలాడుతున్నదని చెప్పవచ్చు. ఉక్రెయిన్‌ వివాదంలో పశ్చిమదేశాలకు లొంగటం లేదు, చైనా విషయంలో కొన్ని సార్లు అనుకూలంగా మరికొన్ని సార్లు వాటి వాంఛలకు భిన్నంగా వెళుతున్నది. మొత్తంగా చూసినపుడు తమకు తాన తందాన అనటం లేదనే ఉక్రోషం పశ్చిమదేశాల్లో నానాటికీ పెరిగిపోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికైనా కళ్లు తెరిచి గతంలో మాదిరి అలీన విధానాన్ని అనుసరించి దేశస్వతంత్ర వైఖరిని ప్రదర్శించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తైవాన్‌ అంశంలో గీత దాటితే అంతే సంగతులు-సైనిక విన్యాసాలతో అమెరికాకు చైనా హెచ్చరిక !

16 Wednesday Oct 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

anti china, China, China Drills, Joe Biden, Taiwan Matters, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

స్వాతంత్య్రం పేరుతో అమెరికా, ఇతర దేశాల అండచూసుకొని రెచ్చిపోతున్న తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ పాలకులను హెచ్చరిస్తూ సోమవారం నాడు చైనా భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. తొలిసారిగా తన తొలి విమానవాహక యుద్ద నౌక, పలు విమానాలు, మిలిటరీ నౌకలు,డ్రోన్లు, ఆయుధాలతో తన సత్తా ఏమిటో పశ్చిమ దేశాలకు వెల్లడిచేసింది.తైవాన్‌ స్వాతంత్య్రం, వేర్పాటు కోరుతున్న శక్తులకు, వాటికి మద్దతు ఇస్తున్న అమెరికాకు కూడా ఇది గట్టి హెచ్చరిక. జాయింట్‌ స్వోర్డ్‌ 2024బి పేరుతో జరిపిన విన్యాసాల్లో అవసరమైతే తైవాన్‌ దిగ్బంధం, దాడులు ఏలా చేయగలమో చూపింది. గతంలో కూడా విన్యాసాలు జరిపినప్పటికీ దీనికి ప్రాధాన్యత ఉన్నట్లు భావిస్తున్నారు. చైనా పిఎల్‌ఏ తూర్పు కమాండ్‌ ప్రతినిధి కెప్టెన్‌ లీ షీ మాట్లాడుతూ ఒకేసారి త్రివిధ దళాల సమన్వయంతో భూ, గగనతల, సముద్ర దాడులు, రేవులు, ఇతర ప్రాంతాల దిగ్బంధనం ఎలా చేయగలమో పరీక్షించి చూపినట్లు, ఇది గట్టి హెచ్చరిక అని చెప్పాడు. తైవాన్‌ నాయకత్వం పదే పదే తమ రక్షణ గగనతలం అని చెప్పుకుంటుందని, దాన్ని ఎలా చీల్చి చెండాడగలమో చూపటమే లక్ష్యంగా పలు వైపుల నుంచి దాడులను సమన్వయం ఎలా చేసేదీ చైనా త్రివిధ దళాలు చూపాయి. అందుకే ఉమ్మడి ఖడ్గం అని పేరు పెట్టారు. మెడ మీద వేలాడే ఖడ్గం లేదా సుత్తి మాదిరి రూపాందించారు. చైనాతైవాన్‌ మధ్య ఉన్న జలసంధిలో రెండు ప్రాంతాలు, తూర్పున రెండు, ఉత్తర, దక్షిణాన ఒక్కొక్క జోన్‌గా ఈ విన్యాసాలు జరిగాయి. గతం కంటే వీటిని విస్తరించారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాలో ఉన్న రేవుల ద్వారా తైవాన్‌ సహజవాయువు దిగుమతి చేసుకుంటున్నది. ఆ రేవులను దిగ్బంధనం కావించి ఆర్థిక లావాదేవీలను మిలిటరీ ఎలా దెబ్బతీయగలదో ఈ సందర్భంగా ప్రదర్శించారు.


తైవాన్‌ ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ తాము కూడా తమ దళాలతో గమనించామని, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు తాము 153 విమానాల గమనాన్ని పరిశీలించామని, 90సార్లు తమ గగన తలంలోకి ప్రవేశించాయని,కొన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చినట్లు చెప్పాడు. ఏడు నౌకలు, మరో నాలుగు ఇతర నౌకలు తైవాన్‌ దీవి చుట్టూ చక్కర్లు కొట్టాయని ఆరోపించాడు. ఈ ఏడాది మే నెలలో పిఎల్‌ఏ ఒకసారి విన్యాసాలు నిర్వహించింది.అక్టోబరు పదవ తేదీన తైవాన్‌ ప్రాంత ప్రభుత్వ అధ్యక్షుడు లాయ్‌ మాట్లాడుతూ చైనా పీపుల్స్‌ రిపబ్లిక్‌ తమకు ప్రాతినిధ్యవహించదని, దానికా హక్కు లేదంటూ తాము స్వతంత్రంగా వ్యవహరిస్తామని పేర్కొన్నాడు. విన్యాసాలు పౌరులకు వ్యతిరేకంగా కాదని, వేర్పాటువాద శక్తులను హెచ్చరించేందుకేనని, వారికి చీమ చొరబడేంత అవకాశం కూడా ఇచ్చేది లేదని, శాంతియుతంగా విలీనానికే ప్రాధాన్యత ఇస్తామని చైనా చెప్పింది. ఒకే చైనా విధానానికి అనుగుణంగా తైవాన్‌ దీవి చుట్టూ పహరాకు నౌకా దళాన్ని నిరంతర వినియోగిస్తూనే ఉంటామని కూడా స్పష్టం చేసింది.


తైవాన్‌ ప్రాంతంలో చైనా అంతర్భాగమే అంటూనే శాంతియుతంగా విలీనం చేసే సమయం ఆసన్నం కాలేదంటూ అమెరికా నాటకాలాడుతోంది. బలవంతం చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని పదే పదే ప్రకటిస్తోంది. చైనా అంటే తైవాన్‌లో ఉన్న ప్రభుత్వమే అని ఐరాస 1971వరకు గుర్తించింది. అంతకు ముందు దశకంలో సోవియట్‌ యూనియన్‌చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య తలెత్తిన వివాదాలను అవకాశంగా తీసుకొని చైనాను తమవైపు తిప్పుకోవచ్చు అనే రాజకీయ ఎత్తుగడతో అసలైన చైనాకు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ప్రధాన ప్రాంతాన్నే గుర్తించేందుకు అమెరికా పావులు కదిపింది. దాంతో భద్రతా మండలిలో 1971లో శాశ్వత సభ్యదేశంగా కమ్యూనిస్టు చైనాను గుర్తించారు. అయితే ఆ సమయంలో జరిగిన చర్చలు, నిర్ణయాల్లో తైవాన్‌ విలీనం శాంతియుతంగా జరగాలని పేర్కొన్నారు. దాన్ని సాకుగా చూపుతూ అలాంటి సమయం ఇంకా రాలేదని గత ఐదు దశాబ్దాలుగా అమెరికా భారీ ఎత్తున ఆయుధాలను అందచేస్తూ తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు చూస్తున్నది.బలవంతంగా విలీనం చేసుకుంటామంటే తైవాన్‌లో ఉన్న చిప్స్‌ పరిశ్రమలను పూర్తిగా ధ్వంసం చేస్తామని బెదిరించింది. తప్పనిసరైతే తప్ప రెండు కోట్ల 30లక్షల జనాభా ఉన్న తైవాన్ను బలవంతంగా విలీనం చేసుకోబోమని చైనా చెబుతున్నది. బ్రిటన్‌, పోర్చుగీసు కౌలు గడువు తీరిన తరువాత ప్రపంచ ఆర్థిక కేంద్రాలలో ఒకటైన హాంకాంగ్‌, ఆసియా లాస్‌వేగాస్‌గా పేరుమోసిన జూద కేంద్రం మకావు దీవులు చైనా ఆధీనంలోకి వచ్చాయి.వాటిని వెంటనే చైనా సమాజంలో కలిపితే వచ్చే సమస్యలను, అక్కడ ఉన్న విదేశీ పెట్టుబడులను గమనంలో ఉంచుకొని యాభై సంవత్సరాల పాటు 2047వరకు అక్కడ ఉన్న వ్యవస్థలను కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దాన్నే ఒకేదేశంరెండు వ్యవస్థలుగా పిలుస్తున్నారు. ప్రత్యేక పాలనా యంత్రాంగాలను అక్కడ ఏర్పాటు చేశారు. వాటికి ఎన్నికలను కూడా జరుపుతున్నారు. తైవాన్‌ పట్ల కూడా అదే విధానాన్ని అనుసరిస్తామని చెప్పినప్పటికీ అమెరికా ఇచ్చిన ఆయుధాలు, అవసరమైతే జోక్యం చేసుకుంటామన్న మాటలను నమ్మి అక్కడి పాలకులు పదే పదే ససేమిరా అంటున్నారు. చైనా తాజా మిలిటరీ విన్యాసాల పూర్వరంగమదే.


పాక్‌ ఆక్రమిత కాశ్మీరు ఎలా మన అంతర్గత అంశమో తైవాన్‌ కూడా చైనా స్వంత విషయమే. దానిలో జోక్యం చేసుకోవటం అంతర్జాతీయ సూత్రాలకు విరుద్దం. మన పాలకులు ఎప్పుడైనా ఆక్రమిత కాశ్మీరును విముక్తం గావిస్తామని ప్రకటిస్తున్న సంగతి విదితమే. అయితే గత ఏడున్నర దశాబ్దాలుగా అలాంటి చర్యకు పూనుకోలేదు. ఎందుకు అంటే కారణాలనేకం, తైవాన్‌ విషయంలో కూడా చైనా అదే మాదిరి బలప్రయోగానికి పూనుకోవటం లేదు. అది వారు తేల్చుకోవాల్సిందే. ఆక్రమిత కాశ్మీరు అంశంలో పాకిస్తాన్‌ జోక్యం చేసుకుంటున్నట్లుగానే తైవాన్‌ విషయంలో అమెరికా అంతకంటే ఎక్కువగా వేలు పెడుతోంది.పాక్‌ ఆక్రమిత కాశ్మీరుకు మిలిటరీ, ఆయుధాలు లేవు, అదే తైవాన్‌కు యుద్ద విమానాలు, క్షిపణులు, నౌకాదళం పూర్తి స్థాయి మిలిటరీ ఉంది. ప్రతి ఏటా అమెరికా సమకూరుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మిలిటరీ శక్తి ఉన్న 145 దేశాలలో తైవాన్‌ 24వదిగా ఉంది. సర్వీసులో మొత్తం 2.15లక్షల మంది సైనికులు, 50వేల మంది పారా మిలిటరీ, మిలిటరీలో 35వేల మంది వైమానిక దళ సిబ్బంది,40వేల మందితో నౌకాదళం ఉంది, 286 యుద్ధ విమానాలుండగా వాటిలో ఏ క్షణంలోనైనా దాడి చేసేందుకు 229 సిద్దంగా ఉంటాయి, ఇవిగాక కొన్ని హెలికాప్టర్లు ఉన్నాయి. నాలుగు జలాంతర్గాములతో సహా 93 రకాల మిలిటరీ నౌకలు ఉన్నాయి. ఇలాంటి శక్తితో తలపడితే ప్రాణనష్టం ఎక్కడ జరిగినా మరణించేది చైనా పౌరులే. అందుకే ప్రతి రోజూ రెచ్చగొడుతున్నా చైనా నాయకత్వం ఎంతో సంయమనంతో ఉంటోంది.


అమెరికా ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తాజా పరిణామాలపై మాట్లాడుతూ తైవాన్‌ జలసంధి, ఆ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాలకు ముప్పు రాకుండా చైనా సంయమనం పాటించాలని బోధ చేశాడు. తైవాన్‌ పాలకుడు లాయ్‌ చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలు, చర్యలు అక్కడి ప్రజలకు నష్టదాయకమని చైనా పేర్కొన్నది. రాజకీయ స్వప్రయోజనాల కోసం తైవాన్‌ జలసంధిలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టటమే తైవాన్‌ జాతీయ దినోత్సవం పేరుతో చేసిన లాయ్‌ ఉపన్యాసమని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ చెప్పారు. మే నెలలో లాయ్‌ బాధ్యతలు చేపట్టాడు, అతనొక ప్రమాదకర వేర్పాటు వాది అని అప్పుడు చైనా వర్ణించింది. అమెరికా కూడా తక్కువ తినలేదు. అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసి చైనా హెచ్చరికలను ఖాతరు చేయకుండా 2022లో తైవాన్‌ పర్యటన జరిపి తమ మద్దతు వారికే అన్న సందేశమిచ్చారు. చైనా నాయకత్వ తీరు తెన్నులను చూసినపుడు అనివార్య పరిస్థితుల్లోనే నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుంది తప్ప అనవసరంగా వ్యవహరించదు. రానున్న ఐదు సంవత్సరాల్లో చైనా ఎలాంటి దాడులు చేయదని తాము నమ్ముతున్నట్లు సెప్టెంబరు నెలలో చేసిన ఒక సర్వేలో 61శాతం మంది తైవాన్‌ చైనీయులు చెప్పినట్లు వెల్లడైంది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల తమ ఆర్థిక సమస్యల నుంచి జనాన్ని పక్కదారి పట్టించేందుకు, ఆయుధ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టటం తద్వారా ఆయుధ అమ్మకాలను పెంచుకోవటం చూస్తున్నదే. అందుకే ఏదో ఒక మూల అలాంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు.దాన్లో భాగంగానే దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తైవాన్‌, దీవులు, అంతర్జాతీయ సముద్రమార్గంలో స్వేచ్చగా రవాణా తదితరాల పేరుతో చిచ్చుపెట్టేందుకు పూనుకున్నారు.తాను అండగా ఉంటానంటూ దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలను నమ్మించేందుకు,చైనాను బెదిరించేందుకు అమెరికా కూడా పదిరోజుల పాటు సాగేమిలిటరీ విన్యాసాలను ప్రారంభించింది. చైనా విన్యాసాలు బాధ్యతారహితం, ఆ ప్రాంతాన్ని అస్థిరపరిచేవిగా, భారీ ఎత్తున జరిగినట్లు అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ ఆరోపించింది.తైవాన్‌కు 800 కిలోమీటర్ల దూరంలో దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌తో కలసి పదిరోజుల పాటు అమెరికా నౌకాదళ విన్యాసాలను నిర్వహిస్తోంది.


తైవాన్‌ భద్రత విషయంలో తీవ్రంగా ఆలోచించాలంటూ అమెరికా రక్షణశాఖ మాజీ అధికారి ఎల్‌బ్రిడ్జ్‌ కోల్బీ రాసిన విశ్లేషణను మే 11వ తేదీన తైపే టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. చైనా దురాక్రమణను అడ్డుకోవాలంటే మరింత ఎక్కువగా రక్షణ ఖర్చు పెంచాలని తైవాన్‌కు సూచించాడు.తమకు తైవాన్‌ అవసరం ఎంతో ఉన్నప్పటికీ దాని కోసం త్యాగాలు చేయాలని తమ నేతలు అమెరికన్లను అడిగే స్థితి లేదన్నాడు. తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలోని టోకియో, సియోల్‌ వంటి జనసమ్మర్ధం గల ప్రాంతాలకు సమీపంలోని అమెరికా సైనిక స్థావరాల మీద అణ్వాయుధాలను ప్రయోగించి ధ్వంసం చేస్తామని చైనా బెదరించిందని ఆరోపించాడు. అటువంటి పరిస్థితిలో తాము నేరుగా చైనా యుద్ధ విమానాలను ఎదుర్కోనేందుకు సిద్దం కాదని, రష్యాపై పోరుకు ఉక్రెయిన్‌కు ఇస్తున్న మాదిరిగానే పరోక్షంగా సాయం అందచేస్తామని తైవాన్‌ ఒంటరిగా పోరాడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
. ఐక్యరాజ్యసమితి 1949లో రూపొందించిన దేశాల హక్కులు, విధులకు సంబంధించిన ముసాయిదాలో ప్రతి దేశం అంతర్గత, విదేశీ వ్యవహరాలను ఎలా నిర్వహించాలో స్పష్టంగా పేర్కొన్నది. బయటి నుంచి ఎలాంటి జోక్యం, వత్తిడి లేదా మార్గదర్శనానికి తావు లేకుండా సాయుధ దళాల నియామకంతో సహా అనేక అంశాలు దానిలో పొందుపరిచారు. ఐరాస తీర్మానం ప్రకారం తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే, అది తిరుగుబాటు రాష్ట్రంగా ఉన్నప్పటికీ దాని మీద పూర్తి అధికారం చైనాదే. అందువలన అంతర్గతంగా వేర్పాటు వాదాన్ని అదుపు చేయటంతో పాటు తైవాన్‌ చుట్టుపక్కల ప్రాంతాల మీద కూడా అంతర్జాతీయ నిబంధనలు అనుమతించిన మేరకు ఆధిపత్యం చైనాకే ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గాజాలో మారణకాండకు ఏడాది : ఆయుధాలతో ఇజ్రాయెల్‌,తప్పుడు వార్తలతో మీడియా దాడి !

09 Wednesday Oct 2024

Posted by raomk in Asia, COUNTRIES, Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

fake news, Hamas Israel, Israel genocide, Joe Biden, media bias, media credibility, Netanyahu, Palestinians, Propaganda War, Western media propaganda


ఎం కోటేశ్వరరావు


తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని ధర్మంగా చెప్పాలన్న లోకోక్తి తెలిసిందే. వర్తమాన ప్రపంచంలో అలా జరుగుతోందా ? నూటికి నూరుశాతం లేదు. పక్షపాత తీర్పులు, వైఖరులే వెల్లడౌతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమై అక్టోబరు ఏడవ తేదీతో ఏడాది గడిచింది. ప్రపంచ ప్రధాన స్రవంతి మీడియా ఇజ్రాయెల్‌ మీద హమస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడికి సంవత్సరం నిండిరది అంటోంది. హమస్‌దాడిని ఎవరూ సమర్ధించటం లేదు. ఐక్యరాజ్య సమితి 1948లో ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసిన తరువాత అప్పటి వరకు ఉన్న పాలస్తీనా ఉనికిలో లేకుండా పోయింది. ఏదో ఒకసాకుతో దానికి కేటాయించిన ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకోవటంతో పాటు వేలాది మందిని చంపి, లక్షల మందికి నిలువనీడ లేకుండా చేస్తూ పాలస్తీనా దేశం ఏర్పడకుండా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికాతో సహా పశ్చిమదేశాలన్నీ మద్దతు ఇస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్న బృందాలలో హమస్‌ ఒకటి. దాని దాడులు గత ఏడాదే ప్రారంభం కాలేదు. కానీ అది చేసిన దాడి సాకుతో గాజాలో ఏడాది కాలంగా మారణకాండ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 42వేల మందిని చంపారు.పదివేల మంది జాడ తెలియటం లేదు, లక్ష మంది వరకు గాయపడ్డారు.లక్షలాది ఇండ్లను నేలమట్టం గావించారు. గాజాలోని 23లక్షల మందిని ఇండ్ల నుంచి వీధుల్లోకి నెట్టారు. మారణకాండ ఇంకా కొనసాగుతోంది. వెస్ట్‌బాంక్‌ ప్రాంతానికి విస్తరించారు. ఇదంతా ఎందుకు అంటే హమస్‌ జరిపిన దాడిలో 815 మంది సాధారణ పౌరులతో సహా 1,195 మంది ఇజ్రాయెలీలు మరణించారు, ఆ సందర్భంగా కొందరు విదేశీయులతో సహా 251 మందిని బందీలుగా పట్టుకున్నారు, వారిలో కొందరిని విడుదల చేశారు, మరికొందరు మరణించగా మరో 95 మంది హమస్‌ వద్ద బందీలుగా ఉన్నారు. దీనికి ప్రతీకారం అని చెబుతున్నారు. ఏ రీత్యా చూసినా ఇజ్రాయెల్‌ చర్య గర్హనీయం, అంతర్జాతీయ న్యాయస్థానంలో యుద్ధ నేరాల కింద దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలి.


ఈ దారుణకాండ గురించి ప్రపంచ మీడియా వార్తలు ఇస్తున్న తీరు కూడా సభ్యసమాజం ఆమోదించేదిగా లేదు. అంతర్జాతీయ వార్తా సంస్థలన్నీ పశ్చిమ దేశాలకే చెందినవి కావటంతో అవి అందచేసిన తప్పుడు సమాచారాన్నే వాస్తవాలుగా చెబుతున్నారు. అయితే తప్పుడు, వక్రీకరణ, కుహనా వార్తలను ఇవ్వటం కొత్తగా జరుగుతున్నది కాదు. ప్రపంచం మీద ప్రచారదాడి జరుగుతున్నది. గాజాలో తలెత్తిన మానవ సంక్షోభ తీవ్రత అక్కడి నుంచి వార్తలు పంపుతున్న పశ్చిమదేశాల విలేకర్లలో ఎక్కడా కానరాదు. ప్రపంచానికి వారు అందచేస్తున్నవి తప్ప ప్రత్యామ్నాయ సంస్థలు లేవు. గాజాలో మరణించిన, గాయపడిన వారిలో నూటికి 80శాతం మంది నిరాయధులైన మహిళలు, పిల్లలే ఎందుకు ఉన్నారో ఏ మీడియా అయినా చెబుతోందా? హమస్‌ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో చూడండి అంటూ అందచేస్తున్న వీడియోలలో ఒక శాతమైనా ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు సంబంధించి లేవంటే అతిశయోక్తి కాదు. వైమానికదాడులు, టాంకుల ఫిరంగి గుళ్లకు 128 మంది జర్నలిస్టులు మరణించగా వారిలో 123 మంది పాలస్తీనియన్లు, ఇద్దరు ఇజ్రాయెలీలు, ముగ్గురు లెబనీస్‌ ఉన్నారు. మరో 35 మంది గాయపడ్డారు. ఏకపక్షంగా జరుగుతున్న మారణకాండకు ఇది ఒక నిదర్శనం.ఎక్కడో ఏసి గదుల్లో కూర్చొని కంప్యూటర్‌ గ్రాఫిక్‌లు సృష్టిస్తున్నదెవరో, యుద్ధరంగంలో ప్రాణాలకు తెగించి వాస్తవాలను నివేదించేందుకు పని చేస్తున్నదెవరో అర్ధం అవుతోంది. మేము సైతం అన్నట్లుగా సాధారణ పౌరులతో పాటు పాలస్తీనా జర్నలిస్టులు పని చేస్తున్నారు, ప్రాణాలర్పిస్తున్నారు.


ఇజ్రాయెల్‌ మిలిటరీ, ప్రభుత్వ పెద్దలు అందిస్తున్న సమాచారాన్ని స్వయంగా చూసినట్లు పశ్చిమదేశాల విలేకర్లు, సంస్థలు చిత్రిస్తున్నాయి. ఐరోపాలో అతి పెద్ద మీడియా సంస్థ జర్మన్‌ యాక్సెల్‌ స్ప్రింగర్‌ అప్‌డే అనే ఒక యాప్‌ను రూపొందించింది. ఇజ్రాయెల్‌ ప్రతినిధులు చెప్పే కథనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాలస్తీనీయుల మరణాలను తగ్గించి చూపాలని తన సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు దాని అంతర్గత పత్రాల ద్వారా వెల్లడైందని ఇంటర్‌సెప్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది. అంతేకాదు మరీ తప్పనిసరైతే తప్ప పాలస్తీనియన్ల గురించి ప్రస్తావించవద్దని అమెరికా న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక కూడా తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. యజమానులే అలాంటి వైఖరి తీసుకున్నతరువాత నిజం రాసినా, చూపినా అవి పాఠకులు, వీక్షకుల వద్దకు చేరుకోవు అన్నది మీడియాలో పని చేసేవారందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే హమస్‌ను ఒక రాక్షసిగా, దాన్ని మట్టుపెట్టేందుకు పూనుకున్న అపరశక్తిగా, బాధిత దేశంగా ఇజ్రాయెల్‌ను చిత్రించారు. సెంటర్‌ ఫర్‌ మీడియా మోనిటరింగ్‌ ( మీడియా పరిశీలక కేంద్రం) అనే సంస్థ అంతర్జాతీయ మీడియా ఛానల్స్‌ ప్రసారం చేసిన లక్షా 80వేల వీడియోలు,బ్రిటీష్‌ మీడియా సంస్థలు రాసిన 26వేల వ్యాసాలను వడగట్టి తేల్చింది కూడా ఇదే. అక్టోబరు ఏడు నుంచి జరుగుతున్నదాడులకు ముందు కూడా మీడియా తీరు ఇలాగే ఉంది, పాలస్తీనా కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదులుగా చిత్రించించటం తెలిసిందే. ఇటలీ మీడియా 2019`21 సంవత్సరాల తీరుతెన్నులను ఐరోపా సమాఖ్య నిధులతో ఒక పరిశోధన చేశారు. మూడు పత్రికలను పరిశీలించగా అంతర్జాతీయ వార్తలలో 32శాతం ఇజ్రాయెల్‌ ప్రధాని, నరహంతకుడు నెతన్యాహు చుట్టూ తిరిగాయని తేలింది. గతేడాది కాలంగా సాగిస్తున్న మారణకాండ ఇటాలియన్‌ మీడియాకు పట్టలేదు. ‘‘ గాజా నుంచి రాకెట్ల ప్రయోగం, గాజా నుంచి 430 రాకెట్లతో దాడి, ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉంది ’’ ఇలాంటి శీర్షికలతో జనాన్ని తప్పుదారి పట్టించారు. దాని దుర్మార్గాలను సమర్ధించారు.


హమస్‌ దాడిచేసి 40 మంది పసిపిల్లల గొంతు కోసిందంటూ ఇజ్రాయెల్‌ అల్లిన అవాస్తవ కథనాన్ని యావత్‌ ప్రపంచ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఖండిస్తూ మాట్లాడాడు. ఇలాంటి ప్రకటనలు చేసే ముందు నిర్ధారణ చేసుకుంటే మంచిది లేకుంటే పరువు పోతుంది ముసలోడా అంటూ అతగాడి సిబ్బంది తరువాత జాగ్రత్త చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఈ కట్టుకథ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతూనే ఉంది, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు దాన్ని ఉదహరిస్తూనే ఉన్నారు. ముస్లింలు జీహాద్‌ ప్రకటించారు, ప్రపంచ మొత్తాన్ని కబళించేందుకు పూనుకున్నారు, తమ జనాభా సంఖ్యను పెంచుతున్నారు అంటూ సాగిస్తున్న అనేక కుట్ర కథనాలతో దశాబ్దాల తరబడి జరుపుతున్న గోబెల్స్‌ ప్రచారాన్ని బుర్రలకు ఎక్కించుకున్నవారిని ఇలాంటివి వెంటనే ఆకర్షిస్తాయి. అదేగనుక వాస్తవమైతే ఇజ్రాయెల్‌ చుట్టూ ఉన్నది ముస్లిం దేశాలే, అవన్నీ ఒక్కసారిగా దండెత్తి ఉంటే ఈ పాటికి అది అదృశ్యమై ఉండేది, పాలస్తీనియన్లు ఏడున్నర దశాబ్దాలుగా అష్టకష్టాలు పడి ఉండేవారు కాదు. కానీ అలా జరగలేదే ! అలాంటిది ముస్లింలు ప్రపంచం మొత్తాన్ని ఆక్రమిస్తారంటే నమ్మేవారికి బుర్రల్లో పదార్ధం లేదన్నది స్పష్టం.ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి ప్రపంచానికి ప్రమాదం తెచ్చిపెట్టాడన్న నాటి జార్జి డబ్లు బుష్‌, మీడియా ప్రచారాన్ని అమెరికాతో పాటు అనేక దేశాల్లో జనం నమ్మారు. తరువాత అది వాస్తవం కాదని అదే అమెరికా అంగీకరించాల్సి వచ్చింది. పాలకులతో పాటు మీడియా కూడా విశ్వసనీయతను కోల్పోయింది.


అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలను నిజంగా ఒక్కరిని చంపినా ఖండిరచాల్సిందే. ఆగస్టు 15నాటికి గాజాలో 42వేల మందిని ఇజ్రాయెల్‌ చంపితే వారిలో 17వేల మందికి పైగా పిల్లలు, పదకొండువేల మంది మహిళలు ఉన్నారు. ఏ పశ్చిమదేశాల మీడియా సంస్థలైనా దీన్ని గురించి ఎన్ని వార్తలను ఇచ్చాయి. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన తరువాత కూడా ఇంకా హమస్‌ గురించే అవి చెబుతున్నాయి.నలభై రెండువేల మందిని చంపి దాదాపు ఒక లక్ష మందిని గాయపరచి, పదివేల మందిని అదృశ్యం కావించిన యూదు దురహంకారులు పాలస్తీనియన్లను తిప్పికొట్టేందుకు చేసిన పనిగా అందమైన మాటలతో పచ్చి దుర్మార్గాన్ని పశ్చిమదేశాలు వర్ణిస్తున్నాయి. బిబిసి తీరును పరిశీలిస్తే గతేడాది అక్టోబరు 10 నుంచి డిసెంబరు రెండవ తేదీ వరకు 23సార్లు హమస్‌ సాయుధులు ఇజ్రాయెలీలపై మారణకాండ జరిపారని వర్ణిస్తే ఒక్కసారే పాలస్తీనియన్ల మీద మారణకాండ పద ప్రయోగం జరిగిందని తేలింది. అంటే దొంగే దొంగని అరచినట్లుగా బిబిసి తీరు ఉంది. ఈ తీరుకు నిరసనగా 2023 అక్టోబరులోనే ఇద్దరు ఆ సంస్థ జర్నలిస్టులు రాజీనామా చేశారు. గాజాపై దాడిని ఖండిస్తూ వెయ్యి మంది అమెరికా జర్నలిస్టులతో పాటు సంతకం చేసిన న్యూయార్క్‌ టైమ్స్‌ మాగజైన్‌ ఎడిటర్‌ జాజ్‌ హగ్స్‌ మీద యాజమాన్యం వత్తిడి తేవటంతో రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ జాబితానుంచి పేరు తొలగించాలని అసోసియేటెడ్‌ ప్రెస్‌ విలేకరిని యాజమాన్యం ఆదేశించింది. ఇలా లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ వంటి అనేక పత్రికలు, మాగజైన్లు కూడా ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వత్తిడి చేసి అనేక మంది జర్నలిస్టులను తొలగించటం, నోరు మూయించటం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డాయి. పాలస్తీనియన్ల మీద తప్పుడు వార్తలు ఒక ఎత్తయితే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే ప్రముఖ అమెరికా పత్రిక రాసిన ఒక ఆధారం లేని వార్త కారణంగా గాజాలో నిరాశ్రయులకు అందాల్సిన 45 కోట్ల డాలర్ల సాయం నిలిచిపోయింది. గాజాలో ఐరాస నిర్వహిస్తున్న శిబిరంలో పనిచేస్తున్న పన్నెండు మంది సిబ్బందికి హమస్‌తో సంబంధాలు ఉన్నాయని, వారంతా దాడుల్లో పాల్గ్గొన్నారని ఆ పత్రిక కేవలం ఇజ్రాయెల్‌ కట్టుకథనే తనదిగా రాసింది.నిజానికి దానికి ఎలాంటి ఆధారాలు లేవు.అమెరికా సిఎన్‌ఎన్‌, బ్రిటన్‌ బిబిసిలో పని చేస్తూ గాజా పరిణామాలపై వార్తలు ఇచ్చిన పది మంది విలేకర్లు ఇజ్రాయెల్‌ అనుకూల వైఖరితో పనిచేసినట్లు వెల్లడిరచారు.న్యూస్‌ రూముల్లో ఉన్న సీనియర్లు జోక్యం చేసుకొని ఇజ్రాయెల్‌ చేసిన దుర్మార్గాలను తక్కువ చేసి చూపాలని వత్తిడి చేసినట్లు వెల్లడిరచారు.ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన చిత్రం ద్వారా బిబిసి భాషలో పాలస్తీనీయన్ల మీద వ్యతిరేకతను ఎలా రెచ్చగొట్టారో జరిపిన ఒక పరిశీలన వచ్చింది. అదే మంటే మారణకాండకు గురైనట్లు 23సార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి మాత్రమే పాలస్తీనా పేరును ప్రస్తావించారు. ఊచకోతకు గురైనట్లు ఇరవైసార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి కూడా పాలస్తీనా పేరు రాలేదు.


తమ పత్రికలు ఎన్ని తప్పుడు కథనాలు, అవాస్తవాలు రాసినా అమెరికా యువత ముఖ్యంగా విద్యార్థులు పాలస్తీనా అనుకూల వైఖరి తీసుకోవటం గమనించాల్సిన అంశం. వారు మీడియా కతలను నమ్మటం లేదన్నది వాస్తవం. ఇజ్రాయెల్‌ మారణకాండకు పాల్పడుతున్నదని నమ్మిన కారణంగానే ఈ పరిణామం. ఇది అక్కడి పాలకవర్గాలకు ఆందోళన కలిగించే అంశం. ప్రచారదాడి ఎదురు తిరిగితే వారి పునాదులను కదలించే కదన శక్తిగా యువత మారుతుంది.ప్రపంచ ప్రఖ్యాతిగాంచి పర్యావరణ ఉద్యమ కార్యకర్త 21 సంవత్సరాల స్వీడిష్‌ యువతి గ్రేటా థన్‌బెర్గ్‌ పాలస్తీనా అనుకూల ప్రదర్శనలో పాల్గొన్నందుకు కోపెన్‌హాగన్‌ నగరంలో అరెస్టు చేశారు. మీడియా కూడా ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది.యువతలో వచ్చిన ఈ మార్పును కూడా మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఒకసారి నీవు బాధితుడవైనందుకు గాను ఇతరుల మీద నిరంతరం దాడి కొనసాగిస్తానంటే కుదరదు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి గాజాలో పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు పాల్పడుతున్నది. పశ్చిమ దేశాల మీడియా దానికి మద్దతు ఇస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d