• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Black Economy in India

నోట్ల రద్దు పర్యవసానాలపై నిరసన విఫలమైందా ? సఫలమైందా ?

28 Monday Nov 2016

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Black Economy in India, black money, Demonetisation, Demonetisation standoff, Narendra Modi, opposition protest on demonetisation, protest on demonetisation

కేరళ హర్తాళ్ దృశ్యమ్

ఎం కోటేశ్వరరావు

    పెద్ద కరెన్సీ నోట్ల రద్దు సందర్భంగా పౌరుల మీద రుద్దిన ఇబ్బందులకు నిరసనగా అనేక పార్టీలు విడివిడిగా ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నాడు (నవంబరు 28న) దేశ వ్యాపితంగా వచ్చిన స్పందన గురించి రకరకాల వార్తలు, వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అది ఏ రూపంలో జరిగింది ? జయప్రదమైందా విఫలమైందా అన్న లెక్కలు వేయబోవటం లేదు. జయప్రదమైంది అంటే దాని అర్ధం బిజెపి చిత్రిస్తున్నట్లు నిరసనకు మద్దతు ఇచ్చిన వారందరూ నల్లధనాన్ని, అవినీతిని సమర్ధించేవారు కాదు. విఫలమైంది అంటే ముందు చూపులేకుండా, అనాలోచితంగా నరేంద్రమోడీ చేసిన పిచ్చిపనిని ఆందరూ ఆమోదించినట్లూ కాదు. నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యను పక్కదారి పట్టించేందుకు గత కొద్ది రోజులుగా నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాణీగారి ప్రతిపక్షం, రాణీగారీ అనుకూల పక్షాల మాదిరి వ్యవహరిస్తున్న మీడియా సంస్ధలు, వాటిలో పనిచేసే షార్ట్‌ హాండ్‌ జర్నలిస్టులు ఈ సమస్యపై కూడా తమ పాత్రలను చక్కగా పోషిస్తున్నారు.

   గత ఇరవై రోజులుగా దేశ విదేశాల విశ్లేషకుల నుంచి వెలువడుతున్న వ్యాఖ్యలు, సమాచారం ప్రకారం నోట్ల రద్దు వలన నల్లధనం రద్దు పెద్ద ప్రహసనంగా మారనున్నట్లు కేంద్రంలోని పెద్దలు గ్రహిస్తున్న కారణంగానే దానినొక రాజకీయ అంశంగా ప్రతిపక్షాలపై దాడి చేసేందుకు, నగదు రహిత ఆర్ధిక లావాదేవీల పెంపుదల ప్రచార అంశంగా మార్చి వేస్తున్నారు. పార్లమెంట్‌లో ఎంత రచ్చ జరిగినా బయట తప్ప అక్కడ మాట్లేడేందుకు నరేంద్రమోడీ ఇప్పటికీ విముఖంగానే వున్నారు. అంటే అసలు సమస్య నుంచి జనం దృష్టిని వేరే వివాదంపైపు మార్చేందుకు చూస్తున్నట్లుగానే భావించాలి. నోట్ల రద్దును స్వాతంత్య్రానంతర తొలి విప్లవాత్మక చర్య అన్నంత గొప్పగా చెప్పుకుంటున్న నరేంద్రమోడీ దాని గురించి మాట్లాడటానికి, చర్చించటానికి పార్లమెంట్‌కు హాజరు కాకపోవటమే పెద్ద వైఫల్యం. ఎంతకాలం మౌనంగా వుంటారు, ఎంతకాలం తప్పించుకుంటారు ? గతంలో ఏదైనా ఒక అంశంపై పాలకపార్టీని నిలదీయాలంటే భిన్న ధృవాలుగా వున్న పార్టీలు సైతం పార్లమెంట్‌లో సమన్వయం చేసుకొనేవి. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్‌లో ఎవరికి వారు తమ అభిప్రాయాలు వెల్లడించటమే కాదు, నోట్ల సమస్యపై వెలుపల కూడా ఒకే రోజు వివిధ రూపాలలో విడివిడిగా ఆందోళనకు పిలుపు ఇవ్వటం బహుశా ఇదే మొదటి సారి అని చెప్పవచ్చు. నోరు వుంది కదా, మీడియాలో ఎక్కడ లేని ప్రచారం దొరుకుతోంది కదా అని పాలకపార్టీ నేతలు సంబర పడవచ్చు. ఎందుకైనా మంచిది, భవిష్యత్‌లో ఎటుబోయి ఎటువస్తుందో ఒక అవకాశం అట్టిపెట్టుకుందామని చంద్రబాబు నాయుడి వంటి వారు ఒకవైపు మంచిదని చెబుతూనే మరోవైపు అసంతృప్తి గళం వినిపించటం మామూలు విషయం కాదు.

    సమస్య తీవ్రత కారణంగా సామాన్యులే కాదు చివరికి ఆర్ధిక మంత్రి కుటుంబం కూడా ఎలా ఇబ్బంది పడుతుందో చూడండి అని నమ్మించేందుకు వండి వార్చిన కట్టుకధలలో భాగంగా కొన్ని పత్రికలలో ఒక వార్త వచ్చింది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ గారు ఒక వంద మందికి విందు ఏర్పాటు చేయమని తన సతీమణికి చెప్పారట. తీరా ఆమె తన, భర్త ఖాతాల నుంచి 24వేల చొప్పున తీసుకున్న డబ్బుతో 50 మందికి మాత్రమే ఏర్పాటు చేయవచ్చని చెప్పారట. సరే పెద్ద వారు అంత ఖరీదైన విందులు ఇస్తారు వదిలేద్దాం. నరేంద్రమోడీ, చంద్రబాబు గారు నగదుతో పని లేకుండా అంతా కార్డులతో ఎంత సులభంగా నడిపించవచ్చో జనానికి చెబుతున్నారు. కేంద్రమంత్రి కుటుంబం వంద మంది విందుకు సరిపడా అవసరమైన ఖర్చులకు నగదు లేక ఇబ్బంది పడ్డారంటే వారికి కూడా అలాంటి కార్డులు లేనట్లే కదా ? ఒక వేళ వుంటే ఇలాంటి కట్టుకధలు ఎందుకు పుట్టినట్లు ?

    మరొక కధ. ఇది స్వయంగా నరేంద్రమోడీ చెప్పిన పిట్ట కధ. తాను టీ అమ్మిన సమయంలో పేదలు స్ట్రాంగ్‌ టీ అడుగుతుండేవారట. అలాగే ఇప్పడు నల్లధనంపై గట్టి చర్య తీసుకున్నా అన్నారు. ఒకే. ఆయన టీ అమ్మినట్లు చెబుతున్న ప్రాంతాలు రైల్వే స్టేషన్‌, బస్టాండ్లలో అమాయకులు తప్ప రోజూ టీ తాగే వారు ఎవరైనా స్ట్రాంగ్‌ టీ అడుగుతారా ? అలాంటి చోట్ల స్ట్రాంగ్‌ టీ దొరకటం ఎంత నిజమో పెద్ద నోట్ల రద్దుతో గట్టి చర్య కూడా అంతే నిజం !

   సాంప్రదాయక మీడియా, సామాజిక మీడియాలో అనేక మంది ఈ నిరసనను భారత బంద్‌ పిలుపుగా వర్ణించారు. బంద్‌లు జరపకూడదని, కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కూడా 1997లో సమర్ధించిన తరువాత ఏ పార్టీ కూడా బంద్‌ పిలుపులు ఇవ్వటం లేదు. అయితే తరువాత మరొక కేసు సందర్భంగా బంద్‌లు జరపటం ప్రజాస్వామ్య బద్దమే అని అదే కోర్టు 2009లో చెప్పిందనుకోండి. సోమవారం నాడు స్ధానిక పరిస్థితులను బట్టి వివిధ రూపాలలో నిరసన తెలపమని వామపక్షాలు పిలుపు ఇచ్చాయి.http://cpim.org/pressbriefs/observe-november-28-all-india-protest-day ఈ లింక్‌లో సిపిఎం అధికారిక ప్రకటన వుంది. దానిలో ఎక్కడా బంద్‌ అన్న పదం లేదు.

    ఇక నిరసన రూపం గురించి పాక్షికం, విఫలం, తీవ్ర అంతరాయం ఇలా రకరకాలుగా వర్ణించటాన్ని చూడవచ్చు. తొంభై బస్‌లు ఆగిపోయి ప్రయాణీకులు లేకుండా పంతానికి పది తిప్పినా, రోజంతా మూసి సాయంత్రం కొద్ది సేపు దుకాణాలు తెరిచినా పాక్షికం అని చిత్రించ వచ్చు. స్వతంత్ర భారత చరిత్రలో అనేక బంద్‌లు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. అన్ని నిరసనలలోనూ అందరికీ సంబంధించిన సమస్యలు ఎప్పుడూ వుండవు. నోట్ల రద్దు అందుకు మినహాయింపు. సామాన్యుడైనా, ముకేష్‌ అంబానీ అయినా రోడ్డు మీదకు వచ్చి ఒక చాయ్‌ తాగాలంటే స్వయంగా లేదా డ్రైవర్‌ ద్వారా అయినా డబ్చిచ్చి తాగాలే తప్ప చెక్కు లేదా కార్డు గీక్కో మంటే కుదరదు. అందువలన ఇది అందరికీ సంబంధించిన సమస్య కనుక దీనికి ఒక ప్రత్యేకత వుంది. చిత్రం ఏమంటే తాను పేదలకు టీ అమ్మానని చెప్పిన మోడీ ఆ పేదలు టీ డబ్బులను కార్డులు, చెక్కుల రూపంలో ఇవ్వలేరని అర్దం చేసుకోలేకపోయారు. అందువలన నిజంగా అమ్మారా అని ఎవరైనా సందేహించే ఆస్కారం కూడా వుంది.

   నోట్ల రద్దు నల్లధనం రద్దుకు అని చెప్పారు. తీరా ఇప్పుడు పెద్ద లందరూ అసలు నోట్లతో పని లేకుండా మీ చేతిలో ఆండ్రాయిడ్‌ ఫోనుంటే చాలు, దాని మీద మీటలు నొక్కటం నేర్చుకుంటే అంతా అయి పోతుందని వూదర గొడుతున్నారు. నోట్ల రద్దును వేల కోట్ల సంపదలున్న పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు సమర్ధిస్తూ ప్రకటనలు చేయటాన్ని చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

   ఒకటి. నోట్ల రద్దు మరుసటి రోజు నుంచి జరిగిన పరిణామాలను చూస్తే డబ్బుతో పని లేకుండా కార్డులు గీకి వస్తువులు అమ్మే చోట్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి, డబ్బుతీసుకొని అమ్మే దుకాణాలలో తగ్గాయి. అంటే పెద్ద దుకాణాల వారు ఈ నోట్ల రద్దు వెనుక చక్రం తీప్పారా ? కారణం ఏదైనా తనకు కూడా అలాంటి కార్డులు గీకే హెరిటేజ్‌ దుకాణాలు వున్నాయి కనుక ముందు చూపుతో పెద్ద నోట్లు రద్దు చేయాలని అందరి కంటే ముందే కేంద్రానికి లేఖ రాశారా ? చంద్రబాబు నాయుడు కార్డుల ద్వారా లావాదేవీలు జరిపించేందుకు నాలుగు కమిటీలను కూడా వేశామని ప్రకటించారు. మంచిదే. త్వరలో కార్డులు కూడా ఇప్పిస్తారు. ఫోన్లు కూడా ఇప్పిస్తామంటున్నారు కనుక సందేహం లేదు. ( వుద్యోగాలకు బదులు ఫోన్లు, గీకే కార్డులు కావాలని జనాన్ని తిప్పించుకోవచ్చు ) అవి వచ్చిన తరువాత ఏ రోజు పని చేస్తే వచ్చిన ఆరోజు కూలి డబ్బులతో వస్తువులను కొనుగోలు చేసే వారు పల్లె టూళ్ల నుంచి సాయంత్రానికి బ్యాంకులున్న పెద్ద గ్రామాలు లేదా పట్టణాలకు వెళ్లి తమ కూలి డబ్బులను బ్యాంకుల్లో వేయాలి. ఆ సమయానికి బ్యాంకులు మూసివేస్తారు కనుక ఆ రాత్రికి అక్కడ వుండి మరుసటి రోజు వుదయం లేదా వేరే వారికి ఇచ్చి తమ ఖాతాలలో వేయించుకొని మరుసటి రోజు సాయంత్రానికి కార్డుపై సరకులు కొనుక్కోవాలి. ప్రతి రోజు కూలి డబ్బులను అలానే చేయాల్సి వుంటుంది. లేదా కులానికొక కార్పొరేషన్‌ పెట్టినట్లుగా బ్యాంకులు కూడా పెట్టించి వాటి శాఖలను ప్రతి వూరిలో లేదా ఏ కులపు వారికి ఆ కులవీధులలో ఏర్పాటు చేసి అక్కడే వేయించవచ్చు.

   రెండు. బ్యాంకుల వద్దకు చలామణిలో వున్న సొమ్ము పెద్ద మొత్తంలో చేరింది. వెంటనే అనేక బ్యాంకులు తమ వద్ద సొమ్ము దాచుకున్నవారి డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటను తగ్గించేశారు. అంటే ఆ మేరకు సుజనా చౌదరి, రాజగోపాల్‌ వంటి పెద్దల కుటుంబాల పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు ఇచ్చే రుణాల రేట్లు కూడా తగ్గిపోతాయి. గత రెండున్నర సంవత్సరాలుగా ఇలాంటి కంపెనీలకు వడ్డీ రేట్లు తగ్గించాలని సుబ్రమణ్యస్వామి వంటి వారు వారందరూ పని గట్టుకొని రఘురామ్‌ రాజన్‌కు రెండోసారి అవకాశం ఇవ్వకుండా వుర్జిత్‌ పటేల్‌ను తెచ్చి పెట్టుకోవటం, ఆయన ఆధ్వర్యంలో పెద్ద నోట్ల రద్దు వెనుక పెద్దల హస్తం కూడా వుందా ?

   మూడు. బ్యాంకులలో దోపిడీలు జరుగుతున్నాయని ఎవరైనా బ్యాంకులను మూసి వేస్తారా ? ఎలుకలున్నాయని ఇంటినే తగుల పెట్టుకుంటారా ? రొట్టెను ముక్కలుగా కోయటానికి చాకు బదులు పెద్ద కత్తులను వాడతామా ? పెద్ద సుత్తులతో బాదుతామా ? నరేంద్రమోడీ సర్కార్‌ అదే చేసింది. అసలు మన దేశంలో పాకిస్థాన్‌ లేదా మరొక దేశం నుంచి గానీ వస్తున్న లేదా మన దేశంలో మేకిన్‌ ఇండియా ‘ముద్రణ పరిశ్రమల’ నుంచి వస్తున్న కోయంబత్తూరు నోట్లుగా పిలిచే దొంగ నోట్లు ఎన్ని వున్నాయి? నల్లధనం ఎంత?

    నల్లధనం ఎంత అనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద కూడా కచ్చితమైన సమాధానం లేదు. రెండవది నల్లధనం మొత్తం కూడా నగదు రూపంలో దొంగ నిల్వలుగా లేదు.అధిక భాగం నల్లధనం స్విట్జర్లాండ్‌, పనామా వంటి పన్నులు లేని ప్రాంతాలకు తరలిపోయింది. అక్కడి నుంచి కేవలం తపాల పెట్టె చిరునామా లేదా సూట్‌కేసు కంపెనీల పేరుతో వున్న వాటాల రూపంలో, రియలెస్టేట్‌, బంగారం తదితర రూపాలలో ప్రపంచమంతటికీ పోతోంది. అలాంటి చోట్ల, వివిధ రూపాలలో డబ్బు దాచుకున్న పెద్దలందరూ మోడీ చర్య మంచిదేనని పొగడటమే విషాదం. వారిని వదలి జనానికి ఇబ్బందులు కలుగుతున్నాయని, వాటిని పరిష్కరించాలని కోరుతున్న, విమర్శిస్తున్నవారిని నల్లధనులను బలపరిచేవారిగా బిజెపి, దాని మిత్రపక్షాలు చిత్రిస్తున్నాయి. మన దేశంలోకి విదేశీ పెట్టుబడుల రూపంలో వస్తున్న మొత్తాలలో కూడా నల్లధనం వుంది. ఎంత వంతే అంత ఎర్రతివాచీ పరచి ఆహ్వానించటం తప్ప వాటి మంచి చెడ్డలను కనుగొనేందుకు పాలకులు ప్రయత్నించటం లేదు.

    ఒక గీత పెద్దదా చిన్నదా పెద్దదా అని చెప్పటానికి మరో గీత అవసరం. అలాగే నల్లధనం సమస్య కూడా. షిండర్‌ అంచనా ప్రకారం ఖండాలవారీగా లాటిన్‌ అమెరికా, ఆఫ్రికాలలో నల్లధనం 41-44శాతం మధ్య వున్నది.ఆసియాలో అది 28-30శాతం. అధికారికంగా ప్రకటించిన జిడిపి లెక్కల ప్రకారం 96 అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు 38.7శాతం. అదే అంచనా ప్రకారం మన దేశంలో 23-26శాతం మధ్య వుంది. మన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడులలో 35శాతం మారిషస్‌ నుంచి 14శాతం సింగపూర్‌ కంపెనీల పేరుతో వస్తోంది. దీనిలో ఎక్కువ భాగం మన దేశం నుంచి తరలిన నల్లధనమే అని వేరే చెప్పనవసరం లేదు. చైనాకు ఒక్క హాంకాంగ్‌ నుంచే 73శాతం వస్తోంది. అది చైనా నుంచి తరలి వెళ్లిన నల్లధనం అనుకోవచ్చు లేదా హాంకాంగ్‌లో విదేశీయులు దాచుకున్నది కావచ్చు.

   ఇక నకిలీ నోట్ల విషయానికి వస్తే ఇది ప్రపంచవ్యాపిత సమస్య. అమెరికా డాలర్లనే పెద్ద ఎత్తున ముద్రిస్తున్నారు. అయినా డాలర్లను అమెరికా రద్దు చేయలేదు. మన దేశంలో చలామణిలో వున్న నోట్ల మొత్తం 16లక్షల కోట్లు. వాటిలో నకిలీ నోట్లు 400 కోట్లు. అంటే 0.03శాతం. అనేక దేశాలలో వాటి నివారణకు నిరంతరం చర్యలు తీసుకుంటూనే వుంటారు.అనుమానం వచ్చిన సిరీస్‌ నోట్ల వుపసంహరణ వాటిలో ఒకటి.మన దేశంలో కొద్ది నెలల క్రితం ఐదువందల నోట్లపై ముద్రించిన సంవత్సరం వుందా లేదా అని చూసుకోమని జనాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా తెచ్చిన రెండువేలు, ఐదు వందల నోట్లకు సైతం నకిలీలను తయారు చేయటం పెద్ద కష్టమేమీ కాదు. వాటిపై నిరంతర నిఘాతప్ప ఇప్పుడు చేసిన మాదిరి చర్యలు కాదు.

    సోమవారం వారం నాటి నిరసన సమర్ధనీయమా, కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే నోట్ల రద్దు చేసిన నాడు వున్న మద్దతు తరువాత క్రమంగా తగ్గిపోయిందన్నది వాస్తవం. ఒక వైపు మోడీని సమర్ధిస్తూనే చేసిన పని బాగాలేదని విమర్శించేవారి సంఖ్య పెరిగింది. ప్రతిపక్షాల విమర్శలకంటే సామాన్యుల్లో వచ్చిన విమర్శనాత్మక స్పందనే బిజెపి వారిని భయపెడుతోంది. దాన్ని దాచుకొనేందుకు నానా పాట్లు పడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నల్లధనంపై దాడులకు ఎవరు అడ్డు పడ్డారు మోడీ గారూ !

24 Monday Oct 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Black Economy in India, black money, black money unearth, Modi, surgical strikes

సత్య

     కొంత మంది రాజకీయ నాయకుల మాటలు చూస్తే నేను లేస్తే మనిషిని కాదు అన్న దివ్యాంగుడైన మా మల్లయ్య మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఒక ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన మల్లయ్య కాలక్షేపానికి అరుగుమీద కూర్చుంటే కొంటె పిల్లలు ఆట పట్టించేవారు. తన చేతిలోని కర్రను చూపుతూ రేయ్‌ నేను లేస్తే మనిషిని కాను జాగ్రత్త అని హూంకరించే వాడు. పిల్లలు భయపడినట్లుగా నటించే వారు. మరుసటి రోజు కథ మళ్లా మామూలే. నల్లధనంపై ప్రధాని నరేంద్రమోడీ మాటలు కూడా మల్లయ్య కథ మాదిరే వున్నాయంటే ఆయన భక్తులకు కోపం రావచ్చు. మంత్రసాని తనం ఒప్పుకున్నాక బిడ్డొచ్చినా, మరొకటొచ్చినా పట్టక తప్పనట్లే రాజకీయాలలో వున్నతరువాత పొగడ్డలు వచ్చినపుడు జబ్బలు చరుచుకోవటం లేదా రొమ్ము విరుచుకోవటమే కాదు విమర్శలు వచ్చినపుడు ‘సహించాలి ‘ మరి.

      నరేంద్రమోడీ రెండున్నర సంవత్సరాల క్రితం చేసిన అనేక బాసలు, వూసులతో పాటు నల్లధనం వెలికితీత వాగ్దానాన్ని కూడా జనం మరచిపోయిన సమయంలో దాని గురించి మౌనం దాల్చకుండా మాట్లాడటం ఎందుకు చెప్పండి ? అది కూడా సర్జికల్‌ దాడులతో ముడిపెట్టి ‘మేం కనుక ఈ విషయంలో కూడా సర్జికల్‌ దాడులు చేస్తే ఎంత బయటికి వస్తుందో మీరు వూహించుకోవచ్చు ‘ అని నల్లధనం గురించి గుజరాత్‌లోని వడోదరాలో ప్రధానే ఆశ్చర్యం వ్యక్తం చేశారట.http://indianexpress.com/article/india/india-news-india/pm-narendra-modi-warns-of-surgical-strikes-against-blackmoney-corruption-3097294/ ప్రధాని అంతటి వ్యక్తి ఏదైనా అనూహ్యమైన విషయాన్ని ప్రకటిస్తే జనం, ప్రతిపక్షం, పాకిస్థాన్‌ ఆశ్చర్యపోవాలి గానీ ఆయన చెప్పినదానికి ఆయనే ఆశ్చర్యపోవటం వింతైన విషయమే. తనే జోక్‌ వేసి తానే అందరికంటే ముందుగా పెద్దగా నవ్వే వారిని గుర్తుకు తెచ్చారు కదూ ! నల్లధనం సంగతేమోగానీ సర్జికల్‌ దాడుల ఘనత తమదే అని స్వయంగా ప్రధాని చెప్పుకోవటం దీనిలో స్పష్టమైంది. కాంగ్రెస్‌, ఇతర అధికార యావ రాజకీయ పార్టీల వారి మాదిరే విజయాలన్నీ తన ఖాతాలో వేసుకొనే తహ తహ, తపనలో మోడీ కూడా పోటీ పడుతున్నారనుకుందాం.

     నల్ల ధనాన్ని వెలికి తీసిన ఖ్యాతిని కూడా మూట కట్టుకోమనే కదా దేశం యావత్తూ ఎదురు చూస్తోంది. అందుకోసం సర్జికల్‌ దాడులు చేయకుండా మీ ప్రభుత్వానికి ఎవరు అడ్డుపడ్డారన్నదే ప్రశ్న. నల్లధనాన్ని స్వచ్చందంగా వెల్లడించండి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పధకం ఘోరంగా విఫలమైందని మీడియాలో విశ్లేషణలు వచ్చిన తరువాత బహుశా వాటిని జనం మరిచిపోయి వుంటారనే గట్టి నమ్మకంతో నరేంద్రమోడీ దానినొక పెద్ద విజయంగా చెప్పి తన భుజాన్ని తానే చరుచుకున్నారు. మన ప్రభుత్వాలు నిజాయితీగా వేతనం నుంచే పన్ను మొత్తాన్ని చెల్లించే వుద్యోగులకు రాయితీలు ఇవ్వటానికి ముందుకు రావన్నది అందరికీ తెలిసిన నిజం. కానీ ఎలాంటి పన్నులు చెల్లించకుండా గాదె కింది పందికొక్కుల్లా బలిసి పోతున్న వారికి మాత్రం క్షమాభిక్ష లేదా స్వచ్చందంగా ఆదాయ వెల్లడికి పధకాలను ప్రకటించి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు అవకాశమిస్తాయి. అందువల్లనే ప్రతి ఏటా పన్ను చెల్లించటం ఎందుకు? ప్రభుత్వం ఎర్ర తివాచీ పరచి పన్ను ఎగవేతదార్లకు అవకాశం ఇచ్చినపుడు ఎంతో కొంత చెల్లిద్దాము లెమ్మనే దేశ భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

   మెరిల్‌ లించ్‌ కంపెనీ వెల్లడించిన నివేదికల ప్రకారం 2007 నాటికి మన దేశంలో అధిక నిఖర సంపద వున్నవారి సంఖ్య లక్ష దాటింది. గతేడాది నాటికి ఆ సంఖ్య 4.2లక్షలకు చేరింది. 1997లో నల్లధనం దాచుకున్నవారికి క్షమా భిక్ష పేరుతో నాటి కాంగ్రెస్‌ పాలకులు ఒక పధకాన్ని ప్రకటించారు. దానిలో 33వేల కోట్ల రూపాయలను ప్రకటించి పది వేల కోట్ల రూపాయల పన్ను చెల్లించి గౌరవం పొందారు.అప్పటితో పోల్చితే ఇప్పుడు కనీసం పది రెట్లు దేశ ఆర్ధిక వ్యవస్ధ పెరిగింది. ఆ లెక్కన కనీసం మూడులక్షల కోట్ల రూపాయలకు పైగా నల్లధనాన్ని వెల్లడించి వుండాలి. కానీ 65వేల కోట్లే అదీ ఒక్కొక్కరు సగటున ఒక కోటి వంతున మాత్రమే వెల్లడించారంటే మోడీ గారి పధకం ఎంత ప్రహసన ప్రాయంగా మారిందో చెప్పనవసరం లేదు. నిబంధనల ప్రకారం 40శాతం పన్ను రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పాతికవేల కోట్ల రూపాయలకు పైబడే, దాన్నే పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు.

     బిజెపి, ఎన్‌డిఏ పక్షాలు కాంగ్రెస్‌ అవినీతిని గురించి నిత్య పారాయణం చేస్తుంటాయి. తప్పులేదు, ఆ పార్టీ అందుకు తగినదే. కానీ బిజెపి పాలనలో నరేంద్రమోడీ ఏలుబడి కుంభకోణం మాటేమిటి ? ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ము రాకుండా వ్యక్తుల జేబుల్లోకి పంపేందుకు తోడ్పటమే కదా అవినీతి అంటే.తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగవేసి దర్జాగా విదేశాలకు పారిపోతుంటే ఎటు పోతున్నాడో చూడండి తప్ప అరెస్టు చేయటం వంటి అమర్యాద పనులు చేయవద్దని ఆదేశించిన ఘనత నరేంద్రమోడీ సర్కార్‌ హయాంలోనే జరిగింది. ఆ మాల్యనే ఇంతవరకు పట్టుకోలేకపోయారు. అలాంటి మల్లయ్యలు బ్యాంకుల నుంచి తీసుకొని దాదాపు ఎగవేసిన సొమ్ము పదకొండులక్షల కోట్ల రూపాయలు. వారిలో ఏ ఒక్కడూ కూడా వ్యాపారంలో, పరిశ్రమలో నష్టం వచ్చిందని మన రైతుల మాదిరి ఆత్మహత్య చేసుకున్నవారు లేరు. వారి ఆస్థుల నుంచి కనీసం పదో వంతు వసూలు చేసినా లక్ష కోట్ల రూపాయల ఆదాయం వచ్చి వుండేది. ఆ పనేమీ చేయకపోగా గత రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ అనుమతితో బ్యాంకులు రద్దు చేసిన అలాంటి బాకీల మొత్తం 1.12లక్షల కోట్ల రూపాయలున్నదన్న సంగతి ఎంత మందికి తెలుసు. ఎందుకంటే ఈ విజయాన్ని ఎక్కడా మోడీ భక్తులు కీర్తించరు ! రైతుల రుణాలు రద్దు చేయమంటే డబ్బు లేదంటారు . మరి వీరికి ఎక్కడి నుంచి వచ్చింది ? గత సంవత్సరం ప్రభుత్వం అందచేసిన లెక్కల ప్రకారమే వివిధ పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు, ఎగుమతి దిగుమతులకు ఇచ్చిన రాయితీల వలన ప్రభుత్వానికి రావాల్సి రాకుండా పోయిన ఆదాయం ఆరులక్షల పదకొండువేల కోట్లు. ఈ మొత్తంలో లక్షా పదహారు వేల కోట్లరూపాయలు బంగారం, వజ్రాల దిగుమతులు చేసుకున్న మన దేశంలోని ‘ అత్యంత నిరుపేదలకు ‘ నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చిన రాయితీ అంటే ఎవరైనా నమ్ముతారా ? ఇలాంటి రాయితీలు కాంగ్రెస్‌ హయాంలో మొదలై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నరేంద్రమోడీ హయాంలో కూడా పెరిగాయి తప్ప తరగలేదు ! కానీ ఈ విషయంలో మాత్రం నరేంద్రమోడీకి ఆశ్చర్యం కలగలేదు, సర్జికల్‌ దాడులు గుర్తుకు రాలేదు !! చంద్రబాబు నాయుడి వూతపదం ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా ఈ పాలన ఇలా ముందుకు పోవాల్సిందేనా ? జనానికి కబుర్లు, కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వాల్సిందేనా ? అన్నింటి కంటే ప్రహసనం ఏమంటే నల్లధనాన్ని అరికట్టేందుకు గతంలో వంద రూపాయల నోట్లను రద్దు చేస్తే సగం అంతరిస్తుందనుకున్నారు. ఇప్పుడు ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయాలని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైన చంద్రబాబు నాయుడు బహిరంగంగానే సలహా ఇచ్చారు. కానీ కేంద్ర త్వరలో రెండువేల రూపాయల నోట్లను చలామణిలోకి తేనున్నదని వార్తలు అంటే నల్లధన కుబేరులకు మరింత సౌకర్యం కల్పించటమేనా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ నల్ల ధన వెలికితీత ఓ ప్రహసనం

07 Tuesday Jun 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

BJP, Black Economy in India, black money unearth, Narendra Modi

సత్య

     తాను అధికారంలోకి వస్తే విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వంద రోజుల్లో బయటకు తెచ్చి ప్రతి ఒక్కరికి 15లక్షల వంతున బ్యాంకుల్లో వేస్తానని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి, దాని మిత్రపక్షాల నేతలు గత లోక్‌ సభ ఎన్నికలలో చేసిన వాగ్దానాలలో ఒకటి. దానికి అనుగుణంగానే డిపాజిట్లు లేకుండానే ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా పేరుతో కేంద్ర ప్రభుత్వం చేసిన హడావుడీ ఇంతా అంతా కాదు. తమ వాటా పదిహేనులక్షలు వేసేందుకే మోడీ తమ చేత ఖాతాలు తెరిపించారని అనేక మంది భ్రమ పడ్డారు, రెండు సంవత్సరాల తరువాత కూడా ఇంకా అనేక మంది అలాంటి వారు వున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలపుడు ఏదో మాట వరసకు ఎన్నో అంటాం మేడంటే మేడా కాదు, ఇల్లంటే ఇల్లూ కాదు, తలా పదిహేను లక్షలు వేస్తామంటే వేస్తామని కాదు అని తరువాత ఒక సందర్భంగా బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా అబ్బే వుట్టిదే అని తేల్చిపారేశారు. అయినా నల్లధనం గురించి పెద్ద డ్రామా నడుస్తూనే వుంది.

     అంబిట్‌ కాపిటల్‌ రీసర్చ్‌ అనే సంస్ధ తాజాగా భారత్‌లో 30లక్షల కోట్ల రూపాయల మేర నల్లధనం వున్నదని పేర్కొన్నది. ఇది నిజానికి పెద్ద వార్త కాదు, దీనిలో కొత్త విషయూ లేదు. కాకపోతే ప్రధాని నరేంద్రమోడీ నల్లధన ప్రపంచ రాజధానిగా పరిగణించబడే స్విడ్జర్లాండ్‌, ఇతర దేశాల పర్యటన సందర్భంగా దీనిని వదలటం, మీడియా ప్రముఖంగా ప్రచురించటంతో మరోసారి జనాన్ని ఆకర్షించింది. స్విడ్జర్లాండ్‌ వెళ్లిన తరువాత ప్రధాని నల్లధనంతో పాటు మా సినిమా పరిశ్రమ మీ దేశంలోనే షూటింగ్‌లు కూడా జరిపి అందాలను బందీ చేస్తోంది అని ఆదేశ అధ్యక్షుడు జాన్‌ షిండర్‌ అమన్‌తో కలిసి చెప్పారు. నల్లధనం గురించి మాట్లాడేందుకు ఒక అధికారిని భారత్‌కు పంపుతామని వారు హామీ ఇచ్చారు. తరువాత జరిగేదేమిటో మనం పెద్దగా వూహించుకోనవసరం లేదు.

    నల్లధనం విషయానికి వస్తే 1970 దశకంలో కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న సమయంలో పన్నుల రేట్లు బాగా పెంచింది. దాంతో బ్లాక్‌ మనీ సమస్య కూడా అప్పటి నుంచే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగిపోయింది. తరువాత కాలంలో పన్ను రేటు గణనీయంగా తగ్గించినా, అనుసరించిన నూతన ఆర్ధిక విధానాలు కోటీశ్వరులను శత కోటీశ్వరులుగా మార్చటం, కొంత మంది చేతిలో నడమంత్రపు సిరి చేరటంతో దేశ, విదేశాలలో నల్లధనం దాచుకోవటం, సమాంతర ఆర్ధిక వ్యవస్ధ నడపటం గురించి చెప్పనవసరం లేదు.నల్లధనం అంటే ఏమిటి అంటే నిర్ధిష్ట నిర్వచనం లేదు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగవేయటం, వుత్పత్తిని, అమ్మకాలను తక్కువ చూపటం వంటి కార్యకలాపాల ద్వారా సమకూరే లెక్కలు లేని ఆదాయాన్ని నల్లధనం అంటున్నారు. ఇది ఇంకా దొంగరవాణా తదితర అనేక మార్గాలలో కూడా సమకూరుతుంది. ఇది ఎంత అంటే రెండు రెళ్లు నాలుగు అన్నట్లు ఎవరూ చెప్పలేరు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని అంచనా అంకెలను మాత్రమే చెబుతారు. ఈ విధంగా చూసినపుడు 1970-71లో జిడిపిలో 4.8 నుంచి 22.3 శాతం వరకు వున్నట్లు వివిధ అంచనాలు తెలిపాయి. పది సంవత్సరాల తరువాత 13.5 నుంచి 48శాతం వరకు పెరిగాయి. ప్రపంచబ్యాంకు పరిశోధనా బృందం 1999-2007 మధ్య 162 దేశాలలో పోటీ ఆర్ధిక వ్యవస్థల గురించి చేసిన పరిశోధనలో అధికారికంగా ప్రకటించే జిడిపిలో ప్రపంచ సగటు 31 నుంచి 34శాతం నల్లధనం వున్నట్లు పేర్కొనగా భారత్‌ అది 20.7 నుంచి 23.2 శాతం వరకు నల్లధనం వున్నట్లు తెలిపింది. అంబిట్‌ కాపిటల్‌ రీసర్చ్‌లో పేర్కొన్న అంకెలు దీనికి అనుగుణంగానే వున్నాయి. 2016లో మన జిడిపి రెండులక్షల 30వేల కోట్ల డాలర్లు అని అంచనా వేస్తే దానిలో 20శాతం 46వేల కోట్ల డాలర్లు, అది 30లక్షల కోట్ల రూపాయలకు సమానం. ఇదీ అంబిట్‌ లెక్క. దీనికంటే ఎంతో ముందే మన దేశ నల్ల ధనం విలువ 35లక్షల కోట్లని అంచనా వేసిన విషయాన్ని మరిచిపోరాదు. మరొక పద్దతి ప్రకారం ఒక దేశానికి ఎంత విదేశీ అప్పు వుంటే దానిలో 20శాతానికి సరిపడా ఆదేశ పెద్ద మనుషులు విదేశాల్లో నల్లధనాన్ని దాచుకుంటారట.మన దేశ నల్లధనం విషయానికి వస్తే అడ్డదారుల్లో దేశం నుంచి దాటించి తిరిగి దానినే పెట్టుబడులో మరో రూపంలోనో మన దేశానికి తరలించి రాయితీలు పొందుతున్నారన్నది బహిరంగ రహస్యం. ఒక డాలరు పెట్టుబడి పెడితే దానికి వివిధ రూపాలలో ఇస్తున్న రాయితీలు అంటే చౌకధరలకు భూమి, విద్యుత్‌, నీరు వంటి మౌలిక సదుపాయాలు, సంవత్సరాల తరబడి పన్ను రాయితీలను కలుపు కుంటే రెండున్నర డాలర్ల లాభాన్ని పెట్టుబడిదారులు పొందుతున్నారు. ఎవరైనా దీనిని ప్రశ్నిస్తే మన దేశంలో వాణిజ్యవేత్తల మనోభావాలు దెబ్బతింటాయి, అభివృద్ధి నిరోధకులు అని ముద్రవేసి దాడిచేస్తున్నారు.

   అంబిట్‌ కాపిటల్‌ రిసర్చ్‌ కధ విషయానికి వస్తే దీనిలో అనేక ఆసక్తికర అంశాలు వున్నాయి.ఈ నల్లధనాన్ని ఎక్కువ భాగం రియలెస్టేట్‌, బంగారం కొనుగోళ్ల రూపంలో దాచుకుంటున్నారని అంబిట్‌ తెలిపింది. నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకున్న వివిధ చర్యల కారణంగా బంగారం, ఆభరణాల రూపంలో నల్లధనం దాచుకోవటం కష్టంగా మారిందని, వాటి కొనుగోలు తగ్గిపోయిందని, భూమి, భవనాల ధరలు కూడా పడిపోయాయని పేర్కొన్నది. నల్లధనంపై గతేడాది కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనుకోని పర్యవసానాలకు దారితీసి పెట్టుబడి వ్యయం 24నుంచి 34శాతానికి పెరిగిందట. దాడుల కారణంగా జనం బ్యాంకుల ద్వారా కాకుండా నేరుగా డబ్బుతో లావాదేవీలు చేస్తున్నారట.బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోయాయట, వీటన్నింటి ఫలితంగా జిడిపి వృద్ధి రేటులో ఎలాంటి పెరుగుదల వుండదట. పెట్టుబడి ఖర్చు పెరిగినా తీసుకొని జనం లావాదేవీలు నిర్వహిస్తున్నపుడు జిడిపి వృద్ధి రేటులో పెరుగుల ఎందుకు ఆగిపోతుందో తెలియదు. మోడీ ప్రతిష్ట పెంచేందుకు సామాజిక మీడియాలో ఒక పోస్టు తిరుగుతోంది. దానిలో ఏం వుందంటే మోడీ ప్రభుత్వం 50వేల కోట్ల రూపాయల మేరకు పన్ను ఎగవేతలను వసూలు చేసిందట,మరో 21వేల కోట్ల రూపాయల లెక్కల్లో చూపని సంపదను కనుగొన్నదట.నాలుగువేల కోట్ల రూపాయల విలువగల నకిలీ వస్తువులను కనుగొన్నదట. వీటిలో వాస్తవ మెంతో తెలియదు. పోనీ నిజంగా పూర్తిగా వాస్తవమే అనుకున్నా దీన్నొక విజయంగా చెప్పుకోవటమే ఆశ్చర్యం. ఈ నేరాలకు పాల్పడిన వారిని ఎంత మందిని జైళ్లకు పంపిందో ఈ సర్కార్‌ వెల్లడించి వుంటే దానికి విలువ వుండేది.ఇన్నేసివ వేల కోట్ల రూపాయలను కనుగొన్ని మరో 36వేల కోట్ల రూపాయల సబ్సిడీ మొత్తాన్ని పొదుపు చేయటం తమ రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలని చెప్పుకున్న ప్రభుత్వం జిజియా పన్నుల మాదిరి వీధుల శుభ్రానికి జనం మీద పన్నేసిన మోడీ సర్కార్‌ తాజాగా కృషి కల్యాణ్‌ పేరుతో జనం మీద మరో అరశాతం పన్ను వడ్డించటాన్ని ఏమనుకోవాలి. వెలికితీస్తున్న డబ్బంతా ఏమౌతున్నట్లు ?

   గతంలో వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ సర్కార్‌ పదవీ కాలం చివరిలో భారత్‌ వెలిగిపోతోందంటూ ప్రచారం చేసి ఎన్నికలలో ఆరిపోయింది. తెలివి తేటలు ఎక్కువ వున్న మోడీ సర్కార్‌ ఎత్తుగడ మార్చి కొత్త అంకెల సీరీస్‌ను ప్రారంభించి పాలన ప్రారంభం నుంచే దేశం వెలిగిపోతోందని విజయగానాలు చేస్తోంది.కాంగ్రెస్‌ నుంచి దేశాన్ని విముక్తి చేశామని చెబుతున్నారు.కానీ ఆచరణలో ఆ కాంగ్రెస్‌ బూట్లలో కాళ్లు దూర్చారు. పెట్రోలు,డీజిల్‌పై పన్ను భారం, సేవా పన్ను పెంపు మచ్చుకు ఇవిచాలు. వంటగ్యాస్‌ సబ్సిడీ అనర్హులకు పోతోందంటూ కోత పెట్టారు. సంతోషం, కానీ ఏనుగులు దూరే కంతలను వదలి దోమలపై కేంద్రీకరించారని తెలుసుకోవాలి.

     వేళ్ల మీద లెక్కించదగిన ధనికులకు ఏటా ఆరులక్షల కోట్ల రూపాయలను వివిధ రూపాలలో సబ్సిడీలుగా ఇస్తోంది.ఇది గతంలో జరిగిందీ,ఇప్పుడు ఇంకా పెరిగింది. కోల్పోయిన ఆదాయం పేరుతో ఎంత మొత్తం రాయితీలు ఇచ్చిందీ ప్రతి ఏటా ప్రభుత్వం బడ్జెట్‌ పత్రాలలో సగర్వంగా ప్రకటించుకుంటోంది. నిత్యావసరాలలో ఒకటైన బంగారం మీద విధిస్తున్న పన్ను 1.6 శాతం కాగా, విలాస వస్తువులలో ఒకటైన పాల మీద మాత్రం 15-20 మధ్య వసూలు చేస్తున్నారు. జిడిపిలో బ్లాక్‌ మనీ 20శాతం అన్నట్లుగా బాంకులు విజయమాల్య వంటి నిరుపేదలకు ఇచ్చిన తొమ్మిదివేల కోట్ల రూపాయల వంటి రాని రుణాల మొత్తం కూడా మొత్తం బ్యాంకుల అప్పులలో 20శాతం వరకు అంటే 4.4లక్షల కోట్ల వరకు వున్నాయట.మోడీ అధికారానికి వచ్చిన తరువాత పన్ను ఎగవేతదారులు, లెక్కల్లో చూపని ఆదాయం వున్నవారిపై దాడులు ఎక్కువ చేసిన మాటలో ఎంత వాస్తవం వుందో గాని రెండు సంవత్సరాల క్రితంతో పోల్చితే నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చి బ్యాంకులను దగా చేసిన వుదంతాలు మాత్రం రెట్టింపై బ్యాంకులు కోల్పోయిన సొమ్ము 2015-16లో 13వేల కోట్ల రూపాయలకు చేరింది.

    సామాన్య వుద్యోగుల వద్ద గోళ్లూడగొట్టి వేతనాల్లోనే పూర్తి పన్ను మినహాయించుకుంటారు. కార్పొరేట్‌ కంపెనీలు చెల్లించాల్సిన పన్ను 30శాతం అని కాగితాల్లో మాత్రమే వుంటోంది, ఆచరణలో 23శాతానికి మించటం లేదు. ఈ మాత్రం కూడా చెల్లించకుండా నల్లధనంగా మార్చుతున్నారు. మెగా సిటీల నుంచి చిన్న పట్టణాల వరకు విస్తరిస్తున్న కార్పొరేట్‌ ఆసుపత్రులు జనాన్ని ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో ఒకసారి వాటిలో వైద్యం కోసం వెళ్లిన వారికి చెప్పనవసరం లేదు, వైద్యఖర్చులను తిరిగి పొందే సౌకర్యం వున్న వారికి తప్ప సామాన్యులను రోగాలు కూడా అప్పుల వూబిలో ముంచుతున్నాయి. కానీ వాటినే అభివృద్ధిగా చూపుతున్నారు. అమెరికా, ఐరోపా వంటి ధనిక దేశాలలో బ్యాంకులలో సొమ్ము దాచుకుంటే ఒకటి, రెండు శాతం మాత్రమే వడ్డీ లభిస్తోంది. అందువలన అక్కడి ధనికులు మన వంటి కార్పొరేట్‌ ఆసుపత్రులలో పెట్టుబడులు పెట్టి దానికి పది రెట్లు లాభాలు పొందుతున్నారంటే అతిశయోక్తి కాదు.

   కేంద్ర ప్రభుత్వం గతేడాది కోల్పోయిన 6.11లక్షల కోట్ల ఆదాయంలో లక్షా 16వేల కోట్ల రూపాయలు కేవలం బంగారం, ఆభరణాలపై ఇచ్చిన పన్ను రాయితీలే అన్నది నమ్మలేని నిజం.ఇవన్నీ పేదల అభ్యున్నతి కోసమే అంటూ దోచిపెడుతున్న సొమ్ము అంటే అతిశయోక్తి కాదేమో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d