• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Joseph Stalin

ఉక్కుమనిషి స్టాలిన్‌ 70వ వర్ధంతి : రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌తో చేతులు కలిపాడా ? నిజాలేమిటి ?

12 Sunday Mar 2023

Posted by raomk in Current Affairs, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Adolf Hitler, anti communists, Joseph Stalin, Joseph Vissarionovich Stalin, USSR, world war 2


ఎం కోటేశ్వరరావు


” జర్మనీ గెలుస్తున్నట్లు మనకు కనిపించిందనుకోండి మనం రష్యాకు తోడ్పడాల్సి ఉంటుంది, ఒక వేళ రష్యా గెలుస్తున్నదనుకోండి మనం జర్మనీకి సాయం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎంత మందిని పరస్పరం హతమార్చుకుంటారో అంతవరకు వారిని చంపుకోనిద్దాం ” తరువాత కాలంలో హిట్లర్‌ను దెబ్బతీశాం అని తన జబ్బలను తానే చరుచుకున్న అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్‌ 1941లో చెప్పిన మాటలివి. డెబ్బయి నాలుగు సంవత్సరాల వయసులో 1953 మార్చి ఐదున గుండెపోటుతో హిట్లర్‌ పీచమణచిన స్టాలిన్‌ మరణించాడు. డెబ్బయి సంవత్సరాలు గడచినా స్టాలిన్‌ ముద్ర చెరగలేదు. ఈనెల ఐదున మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో వేలాది మంది స్టాలిన్‌కు నివాళి అర్పించారు. అనేక చోట్ల పలు కార్యమాలను నిర్వహించారు. పలు చోట్ల విగ్రహాలను ఆవిష్కరించారు. అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు రష్యాను దెబ్బతీసేందుకు పూనుకున్న పూర్వరంగంలో వాటిని ఎదుర్కొనేందుకు స్టాలిన్‌ వంటి వారు కావాలని జనం కోరుకొంటున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచానికే ముప్పుగా మారిన నాజీ మూకలను దెబ్బతీసి చివరికి బంధించేందుకు ఎర్ర సైన్యం చుట్టుముట్టటంతో బెర్లిన్‌లోని ఒక నేళమాళిగలో హిట్లర్‌ తన సహచరితో కలసి ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు. అలాంటి మహత్తర పోరుకు మార్గదర్శి సోవియట్‌ నేత స్టాలిన్‌. తన పెద్ద కుమారుడు ఎకోవ్‌ స్టాలిన్‌ 1941లో హిట్లర్‌ మూకలకు పట్టుబడినపుడు తమ కమాండర్‌ను వదిలితే ఎకోవ్‌ను అప్పగిస్తామని నాజీ మిలిటరీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన స్టాలిన్‌ వంటి వారు చరిత్రలో అరుదు.చివరికి ఎకోవ్‌ను హిట్లర్‌ మూకలు చిత్రహింసలపాలు చేసి హతమార్చాయి.


ఎర్రజెండా చరిత్రలో స్టాలిన్‌ది ఒక ప్రత్యేక స్థానం. మరణం తరువాత సోవియట్‌ నేతలే స్వయంగా తప్పుడు ప్రచారానికి పూనుకోవటంతో కమ్యూనిస్టు వ్యతిరేకుల సంగతి చెప్పేదేముంది.స్టాలిన్‌ మీద దుమ్మెత్తి పోసిన వారు చరిత్ర చెత్తబుట్టలో కలిశారు. రష్యాలో స్టాలిన్‌ అభిమానులు పెరుగుతున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీన ఓల్గా గ్రాడ్‌లో కార్పొరేషన్‌ స్టాలిన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.నాజీజంపై విజయం సాధించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ కొన్ని దేశాలు ఈ రోజున సోవియట్‌ మిలిటరీ సాధించిన విజయాన్ని కనుమరుగు చేసేందుకు చూస్తున్నాయి, దాన్ని సాగనివ్వం అన్నాడు.డెబ్బయ్యవ వర్ధంతి సందర్భంగా అనేక మంది విశ్లేషకులు పత్రికల్లో స్టాలిన్‌ మీద దాడి చేస్తూనే జనంలో వెల్లడౌతున్న సానుకూల వైఖరిని కూడా చెప్పకతప్పలేదు. గతేడాది జరిపిన ఒక సర్వేలో నాజీలను ఓడించటంలో స్టాలిన్‌ పాత్ర గురించి 70 శాతం మంది రష్యన్లు సానుకూలంగా ఉన్నట్లు తేలింది.2015 సర్వేలతో పోలిస్తే సానుకూలంగా స్పందించిన వారు పెరిగారు.కమ్యూనిస్టులు కానివారిలో కూడా పెరుగుదల ఉండటం గమనించాల్సిన అంశం.


చరిత్ర కారులు రెండవ ప్రపంచ యుద్దం గురించి భిన్నమైన పాఠాలు తీశారు. స్టాలిన్‌ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు అనేక ఉన్నాయి. స్టాలిన్‌ గురించి ఎక్కువగా తప్పుడు పాఠాలు తీసేవారు 1939లో సోవియట్‌-నాజీ జర్మనీ మధ్యకుదిరిన మాల్టోవ్‌-రిబ్బెన్‌ట్రాప్‌ ఒప్పందాన్ని చూపుతారు. కమ్యూనిస్టులు-నాజీలు ఒకటే అని చెప్పేవారు కూడా దీన్నే పేర్కొంటారు. ఇది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఎన్నడూ హిట్లర్‌తో స్టాలిన్‌ చేతులు కలపలేదు. పరస్పరం దాడులు జరుపుకోవద్దు అన్నదే ఆ ఒప్పందసారం. అసత్యాలు, అర్ధ సత్యాలను పక్కన పెట్టి దీనికి దారితీసిన పరిస్థితులను మదింపు చేయటం అవసరం.జర్మనీలో 1930దశకం మధ్యనుంచి మిలిటరీని పటిష్టపరచటం ప్రారంభించారు.ఇథియోపియా(గతంలో దాన్ని అబిసీనియా అని పిలిచేవారు)ను ఆక్రమించేందుకు ఇటలీ ముస్సోలినీకి, స్పెయిన్లో నియంత ఫ్రాంకో పాలన రుద్దేందుకు జర్మనీ తోడ్పడింది. ఇదంతా నాజీ జర్మనీని పటిష్టపరిచే పధకంలో భాగమే.1938లో ఆస్ట్రియాను జర్మనీ ఆక్రమించింది.తరువాత చెకొస్లోవేకియాలోని జర్మన్లు నివశించే ప్రాంతాన్ని ఆక్రమించేందుకు పూనుకుంది. దాంతో బ్రిటన్‌, ఫ్రాన్స్‌,జర్మనీ, ఇటలీ ఒక ఒప్పందానికి వచ్చి హిట్లర్‌ను సంతృప్తిపరచేందుకు ఆ ప్రాంతాన్ని జర్మనీకి అప్పగించేందుకు అంగీకరించాయి. దీన్నే 1938 సెప్టెంబరు 30 మ్యూనిచ్‌ ఒప్పందం అన్నారు. ఇది నాజీలు తూర్పు ఐరోపాను ఆక్రమించేందుకు దోహదం చేసింది. ఒకవేళ జర్మనీ గనుక దాడి చేస్తే తాము రక్షణ కల్పిస్తామని పోలాండ్‌తో మరుసటి ఏడాది మార్చి 31వ తేదీన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ ఒప్పందం చేసుకున్నాయి. ఏప్రిల్‌ ఏడున ఇటలీ దళాలు అల్బేనియాను ఆక్రమించాయి.సెప్టెంబరు ఒకటవ తేదీన హిట్లర్‌ మూకలు పోలాండ్‌ను ఆక్రమించాయి. ఎలాంటి మిలిటరీ చర్యల్లేకుండా బ్రిటన్‌,ఫ్రాన్స్‌ దేశాలు జర్మనీ మీద యుద్దాన్ని ప్రకటించాయి.తాను తటస్థమని అమెరికా చెప్పింది.


బ్రిటన్‌-ఫ్రాన్స్‌-పోలాండ్‌ రక్షణ ఒప్పందం చేసుకోక ముందు తెరవెనుక జరిగిన పరిణామాలను చూడాలి. సోవియట్‌ మీద దాడి చేసేందుకు తమతో ఒప్పందం చేసుకోవాలని పోలాండ్‌ మీద హిట్లర్‌ వత్తిడి తెచ్చాడు. అదే తరుణంలో పరస్పర రక్షణ ఒప్పందం చేసుకుందామని సోవియట్‌ కూడా పోలాండ్‌కు ప్రతిపాదించింది. రెండింటినీ తిరస్కరించిన పోలాండ్‌ పాలకులు బ్రిటన్‌,ఫ్రాన్స్‌తో రక్షణ ఒప్పందం చేసుకున్నారు. హిట్లర్‌తో కలసి ప్రపంచాన్ని పంచుకొనేందుకు ఈ దేశాలు సిద్దం కాదు, అదే సమయంలో సోవియట్‌ బలపడటం కూడా వాటికి సుతరామూ ఇష్టం లేదు.తమ బలాన్ని అతిగా ఊహించుకోవటం కూడా ఒక కారణం. అప్పటికే సోవియట్‌ గురించి అమెరికా భయపడుతోంది.అమెరికా సెనెటర్‌ రాబర్ట్‌ ఏ టాఫ్ట్‌ చెప్పినదాని ప్రకారం ” అమెరికాకు సంబంధించినంతవరకు ఫాసిజం విజయం కంటే కమ్యూనిజం గెలుపు ఎక్కువ ప్రమాదకరం (1941 జూన్‌ 25 సిబిఎస్‌) ”. అంతేకాదు ఐరోపాలో ప్రజాస్వామ్య ముసుగువేసుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు సోవియట్‌ను అడ్డుకొనేందుకు నాజీలను ఒక ఆయుధంగా వాడుకోవాలని ఆలోచించాయి. ఈ కారణంగానే హిట్లర్‌ మూకలు ఆస్ట్రియాను ఆక్రమించగానే నాజీల దురాక్రమణలను అడ్డుకొనేందుకు రక్షణ ఒప్పందాలను చేసుకుందామని, ఒక అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న సోవియట్‌ ప్రతిపాదనను అవి తిరస్కరించాయి.జర్మన్ల దాడిని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ఒక రక్షణ ఒప్పందం చేసుకుందామని సోవియట్‌ 1939 జూలై 23న చేసిన ప్రతిపాదన గురించి ఎటూ తేల్చకుండానే జర్మనీతో పరస్పరం దాడులు జరుపుకోకుండా ఒప్పందం చేసుకోవాలని లోపాయికారీ చర్చలకు బ్రిటన్‌ తెరతీసింది.లండన్‌లో హిట్లర్‌ ప్రతినిధితో చర్చలు జరిపారు.


ఈ పరిణామాలు, అంతరంగాల అర్ధం ఏమిటంటే నాజీ జర్మనీ, ఫాసిస్టు ఇటలీ, స్పెయిన్లకూ, ప్రజాస్వామిక ముసుగువేసుకున్న బ్రిటన్‌,ఫ్రాన్స్‌, అమెరికాలకు కావలసింది సోవియట్‌ నాశనం కావటం.బ్రిటన్‌,ఫ్రాన్స్‌తో హిట్లర్‌కు వ్యతిరేకంగా ఒప్పందాలు చేసుకొనేందుకు అనేక విఫల ప్రయత్నాలు చేసిన తరువాతనే జర్మనీతో పరస్పరదాడుల నివారణ ఒప్పందాన్ని స్టాలిన్‌ చేసుకున్నారు. ఎప్పుడైనా హిట్లర్‌ మూకలు దాడులకు దిగవచ్చన్న అంచనా లేక కాదు.కొద్ది పాటి వ్యవధి దొరికినా ఎర్ర సైన్యాన్ని పటిష్టపరచాలన్న ఎత్తుగడ దాని వెనుక ఉంది. చరిత్రను ఒక వైపే చూడకూడదు.1939లో పోలాండ్‌ మీద నాజీ మూకలు దాడి చేశాయి. దానితో రక్షణ ఒప్పందం చేసుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌ పత్తాలేవు. రష్యాలో బోల్షివిక్‌ విప్లవంలో లెనిన్‌ అధికారానికి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రతీఘాత శక్తులు పూనుకున్నాయి. అంతకు ముందు పోలాండ్‌ కూడా రష్యాలో భాగమే అని జార్‌ చక్రవర్తి చేసిన వాదనను బోల్షివిక్‌ సర్కార్‌ అంగీకరించలేదు. బాల్టిక్‌ ప్రాంతంలోని పశ్చిమ బెలారస్‌, పశ్చిమ ఉక్రెయిన్‌, లిథువేనియాలో కొంత ప్రాంతాన్ని మొదటి ప్రపంచ యుద్ధం నాటికే పోలాండ్‌ తన ఆధీనంలో ఉంచుకుంది.జారు చక్రవర్తితో కలసి బోల్షివిక్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు సెంట్రల్‌ పవర్స్‌ పేరుతో జర్మనీ,ఒట్లోమన్‌, ఆస్ట్రియా-హంగరీ, బల్గేరియాలతో కలసి పోలాండ్‌లోని అనేక ప్రాంతాల్లో ఉన్న నాజీ, ఫాసిస్టు శక్తులు కూడా చేతులు కలిపాయి.(ఇప్పుడు ఉక్రెయిన్‌లో ఉన్న నాజీశక్తులు రష్యన్‌ భాషమాట్లాడేవారు ఉన్న కొన్ని ప్రాంతాల మీద దాడులు చేస్తున్నారు) ఈ పూర్వరంగంలోనే సెంట్రల్‌ పవర్స్‌తో లెనిన్‌ శాంతి ఒప్పందం చేసుకున్నాడు. దాన్నే బ్రెస్ట్‌-లిటోవస్క్‌ ఒప్పందం అని పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌-స్టాలిన్‌ ఒప్పందం ఆ రెండు దేశాలకే పరిమితం తప్ప మూడో దేశ ప్రస్తావన లేదు. పోలాండ్‌ మీద నాజీమూకలు దాడి చేసిన వెంటనే దానికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న దేశభక్తులు నాజీదాడులను ప్రతిఘటించారు. వారికి మద్దతుగా సోవియట్‌ సేనలు పోలాండ్‌లో ప్రవేశించాయి. కొన్ని ప్రాంతాలను విముక్తి కావించాయి. దాన్నే కొందరు సోవియట్‌ దురాక్రమణగా చిత్రించి నాజీలకు-కమ్యూనిస్టులకు తేడా ఏముందని వాదిస్తారు.


హిట్లర్‌-స్టాలిన్‌ సంధిలో దేశాలను విభజించే అంశం లేదు.అలాంటి దుర్మార్గపు నిబంధనలు ముందే చెప్పుకున్నట్లు బ్రిటన్‌-ఫ్రాన్స్‌ దేశాలు హిట్లర్‌తో చేతులు కలిపి చెకొస్లొవేకియాను విడదీశాయి. రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత తూర్పు ఐరోపాలో సోవియట్‌ విముక్తి చేసిన అన్ని ప్రాంతాలూ స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి.(సోవియట్‌ పతనమైన తరువాత దానిలో ఉన్న రిపబ్లిక్కులు కూడా స్వతంత్ర దేశాలుగా మారిన సంగతి తెలిసిందే) ఒక్క జర్మనీలోనే తూర్పు ప్రాంతాన్ని ఎర్రసైన్యం విముక్తి చేస్తే పశ్చిమ ప్రాంతాన్ని ఇతర మిత్రదేశాలు ఆధీనంలోకి తెచ్చుకున్నందున దాన్ని విభజించి తరువాత విలీనం చేయాలని నిర్ణయించారు. కొరియా, వియత్నాం విభజన అలాగే జరిగింది. విలీనానికి అడ్డుపడిన అమెరికా, దాని తొత్తు ప్రభుత్వం మీద దక్షిణ వియత్నాం పౌరులు తిరగబడి అమెరికాను తరిమివేసి ఒకే దేశంగా ఏర్పడ్డారు. తూర్పు ఐరోపా దేశాల్లో సోషలిస్టు వ్యవస్థల కూల్చివేతలో భాగంగా తూర్పు జర్మనీలో ప్రభుత్వం పతనం కాగానే పశ్చిమ జర్మనీలో విలీనం చేశారు. రెండు కొరియాల విలీనానికి అడ్డుపడుతున్నది అమెరికా, జపాన్‌ అన్నది తెలిసిందే. అదే విధంగా చైనాలో అంతర్భాగమైన తైవాన్‌ విలీనానికి అడ్డుపడుతున్నది కూడా అమెరికా అన్నది తెలిసిందే.


లెవడా కేంద్రం జరిపిన ఒక సర్వే ప్రకారం 62శాతం మంది ఏది మెరుగైన ఆర్ధిక వ్యవస్ధ సరైనది అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సోవియట్‌ప్రణాళికా విధానం అని చెప్పారు. లెనిన్‌, స్టాలిన్లపై గత మూడు దశాబ్దాలుగా ఎంతగా బురద జల్లినా, విద్వేషాన్ని రెచ్చగొట్టినా ఏ సర్వేలో చూసినా 50శాతం మంది వారి పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టులు జరిపే ప్రతి ప్రదర్శనలోనూ వారి చిత్రాలు దర్శనమిస్తాయి. పార్టీ కూడా తన అభిప్రాయాలను దాచుకోవటం లేదు. సోషలిస్టు వ్యవస్ధను కూలదోసిన తరువాత ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్ధ మీద అనేక మంది భ్రమలు పెట్టుకున్నారు. పరిస్ధితి అంతకు ముందు కంటే దిగజారిపోవటాన్ని చూసి జనం అడిగే ప్రశ్నలకు సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే వారు ఏమార్చేందుకు చూస్తున్నారు. వారు ఇప్పటికీ చెబుతున్న సమాధానం ఏమంటే అనుకున్నదానికి బదులుగా తప్పుడు వ్యవస్ధ వచ్చిందని, మంచి పెట్టుబడిదారీ విధానం కోసం పని చేస్తున్నామని ఉదారవాదులుగా చెప్పుకొనే వారు జనాన్ని నమ్మిస్తున్నారు. గతేడాది కాలంగా ఉక్రెయిన్‌ మీద పుతిన్‌ ప్రారంభించిన సైనిక చర్యతో రాజకీయ చర్చంతా దాని మీదకు మళ్లింది.


కొంత మంది హిట్లర్‌ అనుకూలురు లేదా కమ్యూనిస్టు వ్యతిరేక చరిత్రకారులు అరే ఆ ఒక్క తప్పిదం చేయకుండా ఉంటే చరిత్ర గతి వేరుగా ఉండేది అని నిట్టూర్పులు విడుస్తారు.ఏమిటా తప్పిదం అంటే సోవియట్‌ శక్తిని, స్టాలిన్‌ ఎత్తుగడలను తప్పుగా అర్ధం చేసుకున్న హిట్లర్‌ తన మూకలను సోవియట్‌ మీదకు నడపటమే అని చెబుతారు. అది నిజానికి స్టాలిన్‌, కమ్యూనిస్టుల త్యాగాలను తక్కువ చేసి చూపే దుష్ట ఆలోచనే. తప్పుడు అంచనాలు వేసింది ఒక్క హిట్లరేనా ? ప్రపంచాన్ని తమ చంకలో పెట్టుకోవాలని చూసిన ప్రతివారూ అదే తప్పిదాలు చేశారు. తరువాత కాలంలో అమెరికా కూడా చేసి భంగపడిందని గ్రహించటానికి వారు సిద్దం కాదు.కొరియా, వియత్నాం, ఆప్ఘనిస్తాన్‌ అనుభవాలు చెబుతున్నది. అదే ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభంలో కూడా అదే జరగనుందని భావిస్తున్నారు.గర్హనీయమైన అంశం ఏమంటే తన మూకలను నడిపించి యూదులు, ఇతరులను లక్షలాది మందిని ఊచకోత కోయించిన హిట్లర్‌ను, వాడిని ఎదుర్కొనేందుకు జనాన్ని సమీకరించి ఎదురొడ్డిన స్టాలిన్ను ఒకే గాట కడుతున్నారు. సోవియట్‌ మిలిటరీ తమను ప్రతిఘటించి నాజీలు, వారితో చేతులు కలిపిన వారి సంగతి చూశారు తప్ప సామాన్య జనం మీద దాడులకు దిగలేదు. చరిత్రను వక్రీకరించగలరు తప్ప దాన్ని చెరపటం ఎవరి తరమూ కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బెలూన్‌ కూల్చివేత ఉదంతం : చైనా వ్యతిరేక ప్రచారానికి అమెరికాకు ఒక సాకు మాత్రమే !

08 Wednesday Feb 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Anti China Propaganda, BALLOON MANEUVERS, China's balloon over America, Joe Biden, Joseph Stalin, spying history, surveillance balloon


ఎం కోటేశ్వరరావు


తమ మీద నిఘాకోసం చైనా పంపిన పెద్ద బెలూన్ను కూల్చివేసినట్లు అమెరికా ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం ఫిబ్రవరి నాలుగవ తేదీ శనివారం మధ్యాహ్నం రెండు గంటల 39 నిమిషాలకు తీరానికి ఆరు నాటికల్‌ మైళ్ల దూరంలోని సముద్రం మీద పేల్చివేసింది. పరిసరాలలో కొద్ది గంటల పాటు విమానాల రాకపోకలను నిలిపివేసి అనేక ఫైటర్‌ జెట్‌ విమానాలను రంగంలోకి దింపినప్పటికీ ఒక్క విమానం నుంచి మాత్రమే బెలూన్‌పై కాల్పులు జరిపారు. సముద్రం మీద కొన్ని చదరపు కిలోమీటర్ల పరిధిలో పడిన శకలాలను సేకరించేందుకు పూనుకున్నారు. సముద్రంలో మునిగిన వాటిని తీసేందుకు కొన్ని రోజులు పట్టవచ్చు. వాటిలో దొరికినదేమిటి ? ఎలాంటి సమాచారాన్ని అవి నిక్షిప్తం చేసిందీ వెల్లడి కావాల్సి ఉంది. జనవరి 28న బెలూన్ను అమెరికా గుర్తించింది. అమెరికా గగనతలంలోని ఒక లక్ష్యాన్ని కూల్చివేసేందుకు స్వంత యుద్ద విమానాన్ని విని యోగించటం ఇదే ప్రధమం.


ఈ ఉదంతాన్ని సాకుగా చూపుతూ నిరసనగా ఫిబ్రవరి ఆరున జరపాల్సిన చైనా సందర్శనను వాయిదా వేసుకున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ ప్రకటించాడు. ఈ సందర్భంగా అమెరికాలో పెద్ద డ్రామా నడిచింది.దాన్నొక పెద్ద ఉదంతంగా అమెరికా, ప్రపంచం ముందు ఉంచేందుకు నానా హడావుడి చేసి, ముందుగా ప్రచారదాడికి పాల్పడ్డారు. వాతావరణాన్ని విశ్లేషించేందుకు తాము పంపిన బెలూన్‌ గాలి తీవ్రత కారణంగా అదుపు తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించింది తప్ప కావాలని పంపిందో మరొకటో కాదని, దాన్ని కూల్చివేసి అమెరికా అతిగా స్పందించిందని చైనా విమర్శించింది. దీన్ని గమనంలో ఉంచుకొని తాము కూడా చేయాల్సింది చేస్తామన్నట్లుగా హెచ్చరిక కూడా చేసింది. అది వాతావరణం కోసం కాదు తమ మీద నిఘా కోసమే పంపినందున కూల్చివేసినట్లు అమెరికా చెబుతోంది. ఏది నిజమో కాదో తరువాత ఎప్పుడో వెల్లడి అవుతుంది. అది మూడు బస్సులు లేదా లారీలకు సమానమైన పరిమాణంలో ఉన్న మానవరహిత బెలూన్‌, సముద్రం మీద కూల్చివేసినందున ఆస్తినష్టం కూడా జరగలేదు గనుక సుఖాంతంగా ముగిసిందని కొందరు చెప్పారు. నిజానికి ఈ ఉదంతం అమెరికా-చైనా మధ్య ఇప్పటికే ఉన్న వివాదాల పుస్తకంలో మరొక అధ్యాయానికి నాంది పలికింది. దానిలో ఎవరేమి రాస్తారో చూద్దాం !


ఇతర దేశాలపై నిఘా అంకానికి తెరతీసింది, ప్రపంచానికి నేర్పింది అమెరికానే. నూటికి నూరుశాతం ఖ్యాతి దానికే దక్కాలి. దొంగకళ్ల బెలూన్లను, విమానాలను పంపి వాటిని, ఎగిరే పళ్లాలు, గ్రహాంతర వాసులుగా ప్రపంచాన్ని నమ్మించటమే కాదు, పలు సినిమాలు తీసి జనం మీదకు వదిలింది కూడా అమెరికన్లే అన్నది దాచేస్తే దాగదు. పిల్లలు ఆడుకొనే బంతిని కూడా గగన తలం నుంచి స్పష్టమైన ఫొటోలను తీయగల ఉపగ్రహాలను నేడు అనేక దేశాలు తిప్పుతున్నది తెలిసిందే. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మన ప్రాంతంలో చైనా గ్రామాలను నిర్మిస్తున్నదంటూ అమెరికా పంపిని చిత్రాల సంగతి తెలిసిందే. ఆగ్రామాలను తమ ప్రాంతంలోనే చైనా నిర్మించినప్పటికీ వక్రీకరించి మనలను ఎగదోసేందుకు అమెరికా చూసింది. దేశాల మధ్య పరస్పరం విశ్వాస లేమి, ఆధిపత్యం కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న స్థితిలో బెలూన్లతో సహా రకరకాల నిఘా అన్నది బహిరంగ రహస్యం. రెండవ ప్రపంచ పోరు తరువాత అనేక దేశాల మీదకు అమెరికన్లు బెలూన్లు వదిలారు. వాతావరణం కోసం వదిలినవి కూడా వాటిలో కొన్ని ఉండవచ్చు. దేన్ని ఎందుకోసం వదిలిందీ ఇదమిద్దంగా చెప్పలేము.


ప్రపంచాన్ని తప్పుదారి పట్టించటంలో అమెరికాను మించింది లేదు. ఇరాక్‌లో లేని మారణాయుధాల గుట్టల గురించి ప్రచారం చేసి దాని మీద దాడికి దిగి అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ను హతమార్చింది. తరువాత ఎలాంటి మారణాయుధాలు లేవని ప్రకటించింది. తానే సృష్టించిన తాలిబాన్లనే మతోన్మాదులు ఏకుమేకుగా మారటం, తమ మీదకే ఎదురు తిరిగిందీ మన కళ్ల ముందే జరిగింది. అంతకు ముందు ఆప్ఘనిస్తాన్‌ విముక్తి వీరులుగా చిత్రించిందీ, ఆయుధాలు ఇచ్చిందీ, తరువాత ఉగ్రవాదులని ప్రచారం చేసి అణచివేసే పేరుతో రెండు దశాబ్దాల పాటు అక్కడ తిష్టవేసి, చివరికి వారితోనే రాజీ చేసుకొని పారిపోయింది అమెరికా అన్నది తెలిసిందే. అందువలన అమెరికా నందంటే నంది పందంటే పంది అని నమ్మాల్సినపని లేదు. ప్రతిదేశమూ తన జాగ్రత్తలను తాను తీసుకుంటున్నది.


వాతావరణం గురించి పరిశోధించేందుకు పంపిన యు-2 అనే తమ విమానం టర్కీలో కనిపించకుండా పోయిందని పైలట్‌ మరణించినట్లు 1960లో అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌ హౌవర్‌ ప్రకటించాడు. అందరూ నిజమే అని నమ్మారు. కానీ కొద్ది రోజుల తరువాత సదరు విమాన పైలట్‌ ప్రాన్సిస్‌ గారీ పవర్స్‌ తమ వద్ద ప్రాణాలతో ఉన్నాడని నాటి సోవియట్‌ నేత కృశ్చెవ్‌ ప్రకటించి అమెరికా గాలితీశాడు. ఆ నిఘా విమానాన్ని ఆ ఏడాది మే ఒకటవ తేదీన సోవియట్‌ క్షిపణులు కూల్చివేశాయి, పైలట్‌ బతికాడు. దాన్ని పంపింది నిజమే అని తరువాత ఐసెన్‌ హౌవర్‌ అంగీకరించినా కనీసం విచారం కూడా ప్రకటించలేదు. తరువాత రెండు దేశాల మధ్య విబేధాలు మరింత ముదిరాయి. ఇక్కడ ఒక ఆసక్తికర అంశం గురించి చూడాలి. అనేక రంగాల్లో ముందున్న అమెరికా తన దగ్గర ఎంత ప్రమాదకర అస్త్రం ఉందో ప్రపంచాన్ని బెదిరించేందుకు అవసరం లేకున్నా జపాన్‌పై అణుబాంబు వేసింది. దాన్ని సమర్దించుకొనేందుకు తమ పెరల్‌ హార్బర్‌ మీద దాడి జరిపిందనే కట్టుకథను ప్రచారం చేసింది. నిజానికి ఆ బాంబును చూపి సోవియట్‌ మీద పైచేయి తమదే అని ప్రదర్శించుకొనే ఎత్తుగడ కూడా ఉంది. సరే తరువాత స్టాలిన్‌ కూడా అణుబాంబును తయారు చేయించి, అంతరిక్ష విజయాలను చూపి అమెరికాను అదుపులో ఉంచాడనుకోండి.

స్టాలిన్‌ తరువాత కృశ్చెవ్‌ అధికారానికి వచ్చాడు. అణుబాంబు తరువాత ఆందోళన చెందిన అమెరికా ఇంకా సోవియట్‌ వద్ద ఉన్న అస్త్రాలేమిటో తెలుసుకొనేందుకు నిఘా విమానాలను దాని గగనతలం మీద తిప్పింది.అవి భూమికి 70వేల అడుగుల ఎత్తున ఎగురుతున్నట్లు సోవియట్‌ పసిగట్టింది.1956 నుంచి అలాంటి విమానాలను తిప్పుతున్నట్లు గమనించినప్పటికీ మౌనంగా ఉంది. వాటిని కూల్చగల క్షిపణి తయారు చేసి పైన పేర్కొన్న విమానాన్ని కూల్చివేసి తమ సత్తాను లోకానికి చాటింది. అమెరికా బండారాన్ని వెల్లడించింది. ఇప్పుడు అమెరికాను ఢ కొంటున్న చైనా నాటి సోవియట్‌ కంటే ఎంతో బలమైనది, కొన్ని రంగాల్లో అమెరికాకు ధీటుగా లేదా కాస్త పైచేయిగా ఉంది. అందువలన పాతబడిన బెలూన్‌ ప్రయోగాలతో అమెరికా మీద నిఘా పెట్టాల్సిన స్థితిలో లేదు. హీలియం వాయువుతో నింపిన బెలూన్లను గగన తలంలో 24 నుంచి 37 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగురవేయవచ్చు.యుద్ద విమానాలు 20, వాణిజ్య విమానాలు 12 కిలోమీటర్ల ఎత్తువరకు ఎగురుతాయి. వాటికి అవసరమైన ఇంథనాన్ని అందించేదుకు సూర్యరశ్మిని విద్యుత్‌గా మార్చే పరికరాలను అమర్చుతారు. వాటితో పాటు నిఘాకెమేరాలను కూడా పెడతారని చెబుతారు.


పరస్పర విశ్వాసం లేని కారణంగా 1983లో దక్షిణ కొరియా విమానం గూఢచర్యానికి పాల్పడుతున్నదనే అనుమానంతో సోవియట్‌ మిలిటరీ దాన్ని కూల్చివేసింది. తరువాత అది పౌర విమానం అని తేలింది. 2001లో దక్షిణ చైనా సముద్రం మీద నిఘా కోసం వచ్చిన అమెరికా విమానాన్ని చైనా విమానాలు వెంటాడి, తమ స్థావరంలో దిగేట్లు చేశాయి. చైనా సత్తాను తక్కువ అంచనా వేసిన ఆ విమాన సిబ్బంది, దాన్ని నడిపించిన విభాగానికి ఆ ఉదంతం పెద్ద ఎదురుదెబ్బ.మనం చైనా గుట్టు తెలుసుకోవటం సంగతి అటుంచి విమానాన్ని దారి మళ్లించకుండా, పేల్చివేయకుండా వారి స్థావరానికి పంపి మన ఆధునిక నిఘా సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనాకు సమర్పించుకున్నామని అమెరికన్లు లోలోపల కుమిలిపోయారు. ఏ దేశ గగన తలంలోనైనా అనుమతి లేకుండా ఇతర దేశాల విమానాలు ఎగరటం, అవీ నిఘా తరహా విమానాలైతే సదరు దేశాలపై దాడితో సమానమే. కంటికి కనిపించని వస్తువును కూడా పసిగట్టగల పరిజ్ఞానం అమెరికా వద్ద ఉందన్న సంగతి తెలిసి కూడా మూడు బస్సులంత పరిమాణం గల బెలూన్ను అనుమతి లేకుండా అమెరికా గగనతలం మీద నిఘాకోసం చైనా పంపిందని ఎవరైనా అంటే చేసేదేమీ లేదు. 1962లో భారత్‌-చైనా యుద్దం తరువాత కోపంతో చైనా మీద నిఘావేసేందుకు అమెరికా సిఐఏ-భారత గూఢచార సంస్థ ప్రతినిధులు హిమాలయాల్లోని నందాదేవి శిఖరం మీద ప్లుటోనియం ఇంథనంతో పని చేసే నిఘాపరికరాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా ఏర్పాటు చేసిన ఆ పరికరాలతో అటు చైనా ఇటు మనదేశం మీద కూడా నిఘావేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ అమెరికాను గుడ్డిగా నమ్మి నాటి మన పాలకులు అంగీకరించారు. తరువాత ఆ ప్లూటోనియం కారణంగా ఉత్తరాఖండ్‌ తదితర ప్రాంతాల్లో వరదలు వచ్చినట్లు కొందరు చెప్పారు. అదేమైందో ఇప్పటికీ రహస్యమే. నిఘా అంశంలో ఎవరూ తక్కువ తినటం లేదు.


సూదికోసం సోదికి పోతే పాత గుట్టులన్నీ బయటపడినట్లుగా బెలూన్‌ ఉదంతం మీద అమెరికా చేసిన రచ్చ ఒక విధంగా దానికే ఎదురుతన్నింది. డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో కూడా అమెరికా గగన తలం మీద చైనా బెలూన్లు కనిపించినా కూల్చివేత వంటి పనులకు పాల్పడలేదని వెల్లడైంది. అప్పుడెందుకు ఉపేక్షించారు, ఇప్పుడెందుకు రచ్చ చేసి కూల్చివేశారు అంటే అంతర్గత రాజకీయాల ప్రభావంతో పాటు చైనాతో వైరాన్ని కొనసాగించేందుకు ఒక సాకుగా దీన్ని తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. కూల్చివేత గురించి జో బైడెన్‌ తాత్సారం చేయటం చైనా పట్ల మెతకవైఖరే కారణమని ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ దాడికి దిగింది. అంతే కాదు తమకు మెజారిటీ ఉన్న ప్రజాప్రతినిధుల సభలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదిస్తామని బెదరింపులకు దిగింది. ప్రతిపక్షం చేసిన దాడిని ఎదుర్కొనేందుకు ట్రంప్‌ ఏలుబడిలో కూడా చైనా బెలూన్లు ఎగిరినప్పటికీ ఎందుకు మౌనంగా ఉన్నారని అధికారపక్షానికి చెందిన వారు ఎదురుదాడికి దిగారు. అంతేకాదు అది నిజమే అని అప్పుడు పెంటగన్‌ నివేదించినా గుట్టుగా ఉంచారని, ఎందుకు అలా చేశారో చెప్పాలని అనేక మంది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. చైనా పట్ల తమ నేత ట్రంప్‌ గట్టిగా ఉన్నారని రిపబ్లికన్లు చెబుతుంటే కాదు తమ నేత తక్కువేమీ కాదని బెలూన్‌ కూల్చివేత, మంత్రి బ్లింకన్‌ పర్యటన రద్దును అధికార డెమోక్రాట్లు చూపుతున్నారు. చైనాను ఎవరు గట్టిగా ప్రతిఘటిస్తే వారు అంత పెద్ద దేశభక్తులని అమెరికన్ల ముందు ప్రదర్శించుకొనే పోటీలో ఆ రెండు పార్టీలు ఉన్నాయి.


చైనా బెలూన్‌ ఎగిరిందని చెబుతున్న మోంటానా ప్రాంతంలో అమెరికా అణ్వస్త్రాలను మోసుకుపోగల ఖండాంతర క్షిపణులను నిలువ చేసే 150 సిలోస్‌( పురులు లేదా పాతర్ల వంటివి ) ఉన్నట్లు జనం భావిస్తున్నందున నిఘావేసినట్లు చెబుతున్నారు. అమెరికా వద్ద పెద్ద సంఖ్యలో అణుబాంబులు, క్షిపణులు ఉన్నది బహిరంగ రహస్యం. వాటిని దాచిన సిలోస్‌ ఎవరికైనా కనిపించేట్లు ఎవరూ పెట్టరు.వ్యూహాత్మక ప్రాంతాల్లోనే మోహరిస్తారన్నది అందరికీ తెలిసిందే. అంతరిక్షంలోని నిఘా ఉపగ్రహాలు అనేక అంశాలను పసిగట్టినప్పటికీ కొన్నింటిని తెలుసుకోవాలంటే బెలూన్లే అవసరమన్నది కొందరి వాదన.రేడియో, సెల్యులర్‌, ఇతర సంకేతాలను బెలూన్లకు అమర్చిన శక్తివంతమైన సెన్సర్లు మాత్రమే గ్రహిస్తాయని చెబుతున్నారు. చైనా పంపిన బెలూన్‌ దారి తప్పి వచ్చింది కాదని, వారి నియంత్రణ మేరకు అమెరికా మీద తిరిగిందని అంటున్నారు. అదేగనుక నిజమైతే, దానిలో నిఘాపరికరాలే ఉండి ఉంటే అమెరికాలో రచ్చ మొదలు కాగానే చైనా వారే దాన్ని పేల్చి ఆధారాలు దొరకకుండా చేసి ఉండేవారు కదా ? లేదూ నిజంగానే చైనా నిఘాపరికరాలను అమర్చిందని అనుకున్నా అలాంటి పని చేస్తున్నది చైనా ఒక్కటే కాదు కదా. అమెరికా సిఐఏ వద్ద కాంట్రాక్టరుగా పని చేసి దాని గుప్త పత్రాలను భారీ సంఖ్యలో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ వెల్లడి చేసిన వివరాల ప్రకారం నాసా ఇతర సంస్థలు నిరంతం చైనా మీద నిఘా పెడుతున్నాయి.చైనా టెలికమ్యూనికేషన్స్‌ సంస్థ హువెయిలో అమెరికా చొరబడి చైనా నేతలు, సైనికుల కదలికలు, అణ్వస్త్రాల సమాచారాన్ని తెలుసుకున్నదని స్నోడెన్‌ పత్రాల్లో ఉన్నది. అందువలన ప్రతి దేశం నిరంతరం తనను కాపాడుకోవటంతో పాటు ఎదుటి వారి బలం,బలహీనతలను పసిగట్టేందుకు నిరంతరం చూస్తూనే ఉంటాయి.అది వాటికి ఉన్న హక్కు, బాధ్యత.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టులు-నాజీలు ఒకటే అయితే పాండవులు-కౌరవులనేమనాలి ?

04 Monday Sep 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Anti communist, anti-communist fiesta, communist, Hitler, Joseph Stalin, Nazism, totalitarian regimes

ఎం కోటేశ్వరరావు

ఇప్పటి వరకు సమాజ చరిత్ర మొత్తం వర్గపోరాటాల మయమే అని కారల్‌ మార్క్స్‌ భాష్యం చెప్పారు. దాన్నే మహాకవి శ్రీశ్రీ నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని మరింత సుబోధకంగా జనం ముందు పెట్టారు. విజేతలే ఎప్పుడూ చరిత్రను రాశారు. రెండు సంస్కృతులు సంఘర్షించినపుడు పరాజితులు రూపుమాసిపోతారు. విజేతలు తమ గొప్పతనాన్ని పెద్దదిగా చూపుతూ చరిత్ర పుస్తకాలు రాస్తారు, ఓడిపోయిన శత్రువు గురించి వాటిలో అగౌరవంగా చిత్రిస్తారు అని డాన్‌ బ్రౌన్‌ అనే పెద్దమనిషి చెప్పాడు.

ప్రపంచంలో దోపిడీ వ్యవస్ధ సంక్షోభానికి గురైనపుడల్లా మితవాద శక్తులు పెరిగాయి. ఇప్పుడూ అదే జరుగుతోంది. అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా అన్నట్లుగా నాజీలైనా కమ్యూనిస్టులైనా ఒకటే ప్రాణాలు తీస్తారు, అలాంటపుడు నాజీలే మెరుగు అని జనం బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం జరుగుతోంది. దోపిడీ శక్తుల సమాచార యుద్ధంలో ఇదొక ప్రధాన ఆస్త్రం. నమ్మకం లేదా ప్రచారంలో వున్నదాని ప్రకారం పద్దెనిమిది రోజుల పాటు మహాభారత యుద్దం జరిగింది. దానిలో కౌరవులు, పాండవులూ కత్తులు దూశారు. యుధిష్టిరుడు నష్టాల గురించి ధృతరాష్ట్రుడికి చెప్పినదాని ప్రకారం ఇరువైపులా 166 కోట్ల 20వేల మంది మరణించగా, 2,45,165 మంది మాత్రమే మిగిలారు. ఇంత మందిని బలి తీసుకున్నప్పటికీ మన సమాజం ఆ యుద్ధంలో పాండవుల పాత్రను హర్షిస్తూ, కౌరవులను విమర్శిస్తున్నది. చెడుపై మంచి సాధించిన విజయంగా కీర్తిస్తున్నది. పెద్ద సంఖ్యలో జనం మరణించారు గనుక పాండవులు, కౌరవులు ఇద్దరిదీ తప్పే, ఇరు పక్షాలూ దుర్మార్గమైనవే అనటం లేదు. పాండవులు-కౌరవులను ఒకే గాటన కట్టకూడదన్నపుడు కమ్యూనిస్టులు-నాజీలను ఒకే గాటన ఎలా కడతారు.

1848లో వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళికతో దోపిడీ వర్గానికి సరికొత్త ప్రతిఘటన ప్రారంభమైంది. అది ఒక రాజుపై మరొక రాజు, ఒక అధికార(పాలకవర్గ) పార్టీపై మరొక పార్టీ మధ్య జరిగే పోరు, ప్రతిఘటన కాదిది. కనుకనే అప్పటి నుంచి చరిత్రను దోపిడీ వర్గమే కాదు, దోపిడీకి గురయ్యే వర్గం కూడా తన దృక్పధంతో సమాజం ముందుంచుతోంది. మార్క్స్‌కు ముందు, తరువాత చరిత్ర రచనలో వచ్చిన మౌలిక మార్పు ఇది. ప్రస్తుతం మన దేశంలో అధికార వ్యవస్ధలో పైచేయి సాధించిన కాషాయ దళాలు ఇప్పటి వరకు మన ముందుంచిన చరిత్రను నిరాకరిస్తూ తిరగరాసేందుకు, వాస్తవాల ప్రాతిపదికన కాకుండా మతం, విశ్వాసాల ఆధారంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఏది వాస్తవానికి దగ్గరగా వుందన్నదే జనం తేల్చుకోవాల్సింది.

ఐరోపాను ఒక దయ్యం వణికిస్తోంది, అదే కమ్యూనిజం అని మార్క్స్‌-ఎంగెల్స్‌ 168 సంవత్సరాల క్రితం చెప్పారు. సోషలిజం-కమ్యూనిజాలపై విజయం సాధించాం, అదింక కోలుకోలేదు అని పాతిక సంవత్సరాల క్రితం పెట్టుబడిదారీవర్గం ప్రకటించుకుంది. అదే నిజమైతే ఇన్ని సంవత్సరాల తరువాత కూడా కమ్యూనిస్టు భావజాలంపై దాడి, మ్యూనిస్టు వ్యతిరేక ప్రదర్శనలు, ప్రపంచ కమ్యూనిస్టు వ్యతరేక సమావేశాలు ఎందుకు జరుపుతున్నట్ల్లు ?

రెండవ ప్రపంచ యుద్ధం ముగస్తున్న దశలో ఐరోపా భవిత్యం గురించి 1945 ఫిబ్రవరి 4-11 తేదీలలో జరిగిన యాల్టా సమావేశంలో పొల్గొన్న చర్చిల్‌-రూజ్‌వెల్ట్‌- స్టాలిన్‌. నాజీజం-కమ్యూనిజం ఒకటే అయితే దానికి జర్మనీ నాజీ ప్రతినిధులను ఎందుకు పిలవలేదు ?

ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన నాజీజం, హిట్లర్‌ పీచమణిచి ఆ ముప్పు తప్పించిన శక్తులకు నాయకత్వం వహించింది స్టాలిన్‌. రెండవ ప్రపంచ యుద్దం సందర్భంగా నాటి సోవియట్‌ యూనియన్‌-హిట్లర్‌ నాయకత్వంలోని జర్మనీ మధ్య 1939 ఆగస్టు 23న నిర్యుద్ధ సంధి జరిగింది.అది సోవియట్‌-జర్మనీ మధ్య ఆ ప్రాంత ఐరోపా దేశాలను విభజించుకొనేందుకు జరిగిన ఒక చీకటి ఒప్పందం, దాని వలన కోట్లాది మంది జనం ప్రాణాలు కోల్పోయారంటూ సోషలిజం-నాజీశక్తులను ఒకే గాటన కడుతున్నారు. దానిలో భాగంగానే ఆ సంధి వలన ప్రాణాలు కోల్పోయినవారు, బాధితులను స్మరించుకొనే పేరుతో 2009 ఏప్రిల్‌ రెండున ఐరోపా పార్లమెంట్‌ చేసిన నిరంకుశపాలన వ్యతిరేక తీర్మానం మేరకు ని ప్రతి ఏడాది ఆగస్టు 23న ఐరోపాలోని కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ఎస్తోనియా రాజధాని తాలిన్‌లో కమ్యూనిస్టు పాలకుల నేరాల పేరుతో ఐరోపా దేశాల న్యాయశాఖల మంత్రుల సమావేశం జరిపారు. తమ దేశ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వున్నందున ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు గ్రీస్‌ మంత్రి ప్రకటించారు. ఐరోపా చారిత్రాత్మక జ్ఞాపకాన్ని అవమానించటం తప్ప మరొకటి కాదని ఐరోపా వామపక్ష పార్టీ పేర్కొన్నది. పూర్వపు సోషలిస్టు రిపబ్లిక్‌ అయిన ఎస్తోనియాను అటువంటి సమావేశానికి వేదికగా చేసుకోవటం సైద్ధాంతిక లక్ష్యం కోసమే అని పేర్కొన్నది. గ్రీకు మంత్రి బహిష్కరణ నిర్ణయాన్ని ఎస్తోనియా పార్లమెంట్‌ సభ్యురాలు వుడెక్కి లూనే సమర్ధిస్తూ ఒక లేఖ రాశారు. ఆ సమావేశాన్ని నిర్వహించటమంటే ప్రస్తుత ఎస్తోనియా రాజకీయాలు నాజీజాన్ని పరోక్షంగా సమర్ధించటమే అని పేర్కొన్నారు.రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్‌ విజయాన్ని మేతొమ్మిదవ తేదీన జరపాలన్న తన నిర్ణయంపై అనేక మంది జర్నలిస్టులు, రాజకీయవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారని, అదే సమయంలో మద్దతు కూడా లభించిందని లూనే పేర్కొన్నారు.

ఎస్తోనియా అధ్యక్షతన రెండవ సారి జరిగిన కమ్యూనిస్టు వ్యతిరేక సమావేశాన్ని సిపిఎం, సిపిఐతో సహా 83కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు ఒక ప్రకటనలో ఖండించాయి. ఫాసిజాన్ని కమ్యూనిజంతో సమంచేసి చెప్పటం రెచ్చగొట్టటం, పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్ద గర్బంలో జన్మించిన ఫాసిజాన్ని నిర్దోషిగా ప్రకటించటం తప్ప మరొకటి కాదని, ఈ కారణంగానే కమ్యూనిస్టులను ఖండించటం, హింసించటం, అనేక ఐరోపా దేశాలలో పార్టీలపై నిషేధం విధిస్తున్నారని అదే సమయంలో నాజీలతో కుమ్మక్కైన వారు, వారి రాజకీయ వారసులకు పెన్షన్లు ఇస్తున్నారని కమ్యూనిస్టుపార్టీల ప్రకటన పేర్కొన్నది. కమ్యూనిస్టు వ్యతిరేక చిహ్నాలు పెరగటం అంటే ప్రజావ్యతిరేక చర్యలను తీవ్రతరం చేయటం, కార్మికుల హక్కులను పరిమితం చేయటం, సామ్రాజ్యవాదుల నూతన యుద్ధాలకు తెరతీయటమే అని హెచ్చరించింది. మహత్తర అక్టోబరు విప్లవానికి వందేండ్లు నిండిన సందర్భంగా నిజాలు వెలుగులోకి వస్తాయని, టన్నుల కొద్దీ మట్టి చల్లి సోషలిస్టు వ్యవస్ధ గొప్పతనాన్ని మూసిపెట్టటం సాధ్యం కాదని, సంపదలను సౄష్టించే కార్మికులు దానిని తమ పరం చేసే సమాజం కోసం పోరాటాలు జరిపి సోషలిజం నుంచి కమ్యూనిజానికి పయనిస్తారని పేర్కొన్నది.

హిట్లర్‌ తమ పార్లమెంట్‌ భవనాన్నే తగుల బెట్టించి ఆ నెపాన్ని కమ్యూనిస్టులపై వేశాడు. ప్రజల హక్కులను హరించటంతో పాటు కమ్యూనిస్టులను అణచివేసేందుకు 1933లోనే ఆ దుర్మార్గానికి పాల్పడిన హిట్లర్‌ కమ్యూనిస్టు వ్యతిరేకత లోకవిదితం. తొలుత పక్కనే వున్న కమ్యూనిస్టు రష్యాను దెబ్బతీస్తే మిగతా ప్రపంచాన్ని చాపలా చుట్టి తన కింద వుంచుకోవచ్చని భావించిన హిట్లర్‌ అందుకు సన్నాహాలు చేసి సాకు, సమయం కోసం ఎదురుచూశాడు. ఆ తరుణంలో స్టాలిన్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టుపార్టీ బలాబలాలను మదింపు వేసి, తగిన బలాన్ని సమకూర్చుకొనేందుకు, నాటి సామ్రాజ్యవాదుల మధ్య వున్న విబేధాలను వుపయోగించుకొనేందుకు ఒక ఎత్తుగడగా హిట్లర్‌తో స్టాలిన్‌ నిర్యుద్ధ సంధి చేసుకుంది తప్ప ఐరోపాను పంచుకొనేందుకు కాదు. అదే హిట్లర్‌ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రెండు సంవత్సరాల తరువాత సంధిని వుల్లంఘించి గురించి సోవియట్‌పై దాడికి దిగటం, ఆ దాడిలోనే పరాజయం, ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే.అలాంటి హిట్లర్‌ – స్టాలిన్‌ను ఒకే గాటన కట్టటం దుర్మార్గం. ఐరోపాలోని బ్రిటన్‌, ఫ్రెంచి సామ్రాజ్యవాదులు ఒకవైపు జర్మన్‌ సామ్రాజ్యవాదంతో వివాద పడుతూనే కమ్యూనిస్టు రష్యాను కూల్చివేసేందుకు హిట్లర్‌కు ఏ విధంగా మద్దతు ఇచ్చిందీ తెలిసిందే. చివరకు తమకే ముప్పు రావటంతో చేతులు కలిపారు తప్ప కమ్యూనిస్టులపై ప్రేమతో కాదు. హిట్లర్‌, ముస్సోలినీ, టోజో వంటి నియంతలు,ఫాసిస్టులు తలెత్తటానికిి, బలపడటానికి అనుసరించిన విధానాల బాధ్యత నుంచి వారు తప్పించుకోలేరు. స్టాలిన్‌-హిట్లరూ ఇద్దరూ ఒకటే అయితే స్టాలిన్‌తో ఎందుకు చేతులు కలిపినట్లు? తొలుత జర్మనీలో, తరువాత హిట్లర్‌ ఆక్రమించుకున్న పోలాండ్‌ తదితర దేశాలలోనే యూదుల మారణకాండ జరిగింది తప్ప కమ్యూనిస్టుల ప్రాబల్యంలోకి వచ్చిన ప్రాంతాలలో అలాంటి వూచకోతలు జరగలేదు, దేశాలను ఆక్రమించుకోలేదు. అలాంటపుడు నాజీజం-సోషలిజం ఒకటే ఎలా అవుతాయి.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు ఐరోపా దేశాలను నియంతృత్వశక్తుల చేతుల్లోకి నెట్టారన్నది ఇంకొక ఆరోపణ. కమ్యూనిస్టులను నియంతలుగా చిత్రించటం అంతకు ముందు జరిగిందీ తరువాత కొనసాగిస్తున్న పాత చింతకాయ పచ్చడి ప్రచారం తప్ప వాస్తవం కాదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రత్యక్ష వలసలు అసాధ్యం కావటంతో తన పెరటితోట వంటి దక్షిణ(లాటిన్‌) అమెరికాలోని ప్రతి దేశంలో, ఆసియాలో తన కనుసన్నలలో వున్న దక్షిణ కొరియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌ వంటి చోట్ల మిలిటరీ నియంతలను నిలబెట్టి వాటిని దోచుకున్న అమెరికా చరిత్ర దాస్తే దాగుతుందా? ఆఫ్రికాలో అమెరికా మద్దతు లేని నియంత ఎవడైనా వున్నాడా ? గతంలో సోవియట్‌, తూర్పు ఐరోపా లేదా ఇప్పుడు చైనాగాని ఏ ఒక్క సైనిక నియంతకైనా మద్దతు ఇస్తున్న వుదంతం వుందా? అమెరికా, ఐరోపాలోని దాదాపు అన్ని దేశాలలో నయానాజీ శక్తులు తలెత్తుతున్నాయి, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయి.

ఆగస్టు నెలలో అనేక అమెరికా నగరాలలో నయా నాజీ, ఫాసిస్టు శక్తులు రెచ్చిపోయి భావ ప్రకటనా స్వేచ్చ పేరుతో జాత్యహంకారం, సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. వాటిని వ్యతిరేకించే శక్తులు కూడా వాటి ప్రచారం, ప్రదర్శనలకు పోటీగా వీధులలోకి వస్తున్నాయి. చార్లెటిసవిలేలో జరిగిన దానికి ఇరు వర్గాలూ బాధ్యులే అని అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించి నయానాజీలను వెనకేసుకు వచ్చాడు. స్వేచ్చాభిప్రాయ వెల్లడికి అవాకాశం ఇవ్వాలని కోరుతూ బర్కిలీలో జాత్యహంకారులు చేసిన ఒక ప్రదర్శన సందర్బంగా జాత్యంహంకారులు కొందరిని వామపక్ష ప్రదర్శకులు కొట్టారని, చూడండి వామపక్ష మద్దతుదారులు ఎలా దాడులకు పాల్పడుతున్నారో అంటూ వాషింగ్టన్‌ పోస్టు వంటి పత్రిలు గోరంతను కొండంతగా చిత్రించాయి.ముందే చెప్పుకున్నట్లు ప్రచార యుద్దంలో ఇదొక భాగం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అక్టోబరు విప్లవ ప్రాధాన్యత-ప్రపంచ పర్యవసానాలు

25 Tuesday Oct 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

communist, Joseph Stalin, Lenin, october revolution, october revolution it's implications, october revolution today's relevance

ఎం కోటేశ్వరరావు

     ప్రపంచ గతినే ఒక పెద్ద మలుపు తిప్పిన వుదంతం 1917 రష్యన్‌ అక్టోబరు విప్లవం.ఆ మహత్తర ఘటన జరిగి నూరు సంవత్సరాలు కావస్తోంది. ఆ సందర్భంగా ప్రపంచంలోని పలు కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలు నిర్వహించి ఆ విప్లవ ప్రాధాన్యతను నేటి తరాలకు పరిచయం చేసేందుకు పూనుకున్నాయి. ఒకవైపు ప్రపంచంలో కమ్యూనిజాన్ని ఏడు నిలువుల లోతున పాతివేసి విజయం సాధించామని చంకలు కొట్టుకుంటూనే అనేక చోట్ల పాలకవర్గాలు చివరికి చే గువేరా బొమ్మ, ఎర్ర రంగు టీషర్టులు, కమ్యూనిజానికి చెందిన పుస్తకాలు అమ్మటం కనిపించినా వులిక్కి పడటాన్ని ఇండోనేషియా వంటి అనేక చోట్ల చూస్తున్నాం. వూరంతా కావమ్మ మొగుడు అంటే కామోసనుకున్నాను, ఇప్పుడు కాదంటున్నారు కనుక నా కర్రా బుర్రా ఇస్తే నాదారిన నే పోతా అన్న మాదిరి 1991లో సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చి వేసిన తరువాత అనేక మంది కమ్యూనిస్టు జండాలు తిప్పేశారు.

   పాతిక సంవత్సరాలు గడిచిన తరువాత అనేక చోట్ల పూర్వపు సోషలిస్టు దేశాలలో అంతర్మధనం జరుగుతోంది. వున్న సంక్షేమ వ్యవస్ధ పోయింది, పెట్టుబడిదారీ విధానం అదనంగా అన్న వస్త్రాలు ఇవ్వకపోగా వున్న వస్త్రాలను లాగివేసుకుందని, కడుపు మాడుస్తోందని జనం గ్రహించారు. పెట్టుబడిదారీ వ్యవస్ధకు తలమానికమైన అమెరికాలో నిన్న మొన్నటి వరకు సోషలిస్టు, కమ్యూనిస్టు అని చెప్పుకోవాలంటేనే జనం వణికిపోయే పరిస్థితి. ఇప్పుడు అవును మేము సోషలిస్టులమే అయితే ఏమిటి అని మిలియన్ల మంది యువత ప్రశ్నిస్తున్నారంటే పరిస్థితిలో ఎంత మార్పు ! అమెరికాలో 2008లో ప్రారంభమైన ఆర్ధిక మాంద్యం అక్కడి కార్మిక, మధ్యతరగతి పౌరుల జీవితాలను అతలాకుతలం చేయటమే దీనికి కారణం, పెట్టుబడిదారీ వ్యవస్ధ విఫలమైందని అనేక మంది అంగీకరిస్తున్నారు. ప్రత్యామ్నాయం ఏమిటని శోధిస్తున్నారు. ఆ క్రమంలో అనేక మంది అటకెక్కించిన కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ గ్రంధాలను దించి దుమ్మదులిపి అసలు వాటిలో ఏం రాశారు ? మనకేమైనా పరిష్కారం చూపుతాయా అని అధ్యయనం చేస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది ?

   ప్రపంచ చరిత్రలో ఎన్నో రకాల విప్లవాలు సంభవించాయి. అనేక పరిణామాలు నాటకీయంగానే ప్రారంభమయ్యాయి. పైకి అలా కనిపించినప్పటికీ వాటికి తగిన భూమిక తయారై వున్నందునే అలా జరిగాయి. అయితే ఎక్కడ, ఏ రూపంలో, ఎలా జరుగుతుందన్నదే అనూహ్యం. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన బ్రిటన్‌, జర్మనీ వంటి చోట్ల సోషలిస్టు విప్లవం వస్తుందని కారల్‌మార్క్సు-ఎంగెల్స్‌ అంచనా వేశారు. అందుకు భిన్నంగా రష్యాలో వచ్చింది. లెనిన్‌తో సహా బోల్షివిక్‌ పార్టీ నాయకత్వం ఎక్కువ భాగం ప్రవాసంలో వుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో జారు చక్రవర్తుల పాత్రపై జనం ఆగ్రహంతో వున్నారు. ఈ స్ధితిలో బోల్షివిక్‌లకు అవకాశం ఇవ్వకుండా రష్యా పాలకవర్గం 1917ఫిబ్రవరిలో కెరెన్సీని రంగంలోకి దించి తిరుగుబాటు పేరుతో జారును తొలగించి బూర్జువా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. అయితే అక్టోబరు నాటికి బోల్షివిక్‌ నేత లెనిన్‌ ప్రవాసం నుంచి తిరిగి వచ్చి కెరెన్సీ ప్రభుత్వాన్ని తొలగించి సోషలిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచాన్ని కుదిపివేసిన పదిరోజులు అనే పేరుతో జాన్‌ రీడ్‌ అనే అమెరికన్‌ రచయిత ఈ మహత్తర విప్లవం పరిణామాలను గ్రంధస్ధం చేశారు.

   మొదటి ప్రపంచ యుద్ధం అనివార్యంగా కనిపిస్తున్న పరిస్ధితులలో 1914లో అంతర్జాతీయ సోషలిస్టు వుద్యమం ఒక విధంగా కుప్పకూలిపోయింది. నాటి కార్మివర్గ పార్టీలలో ముఖ్యమైన జర్మన్‌ మ్యూనిస్టుపార్టీ యుద్ధానికి అనుకూలంగా ఓటు చేసింది. కొద్ది మంది మైనారిటీలు మాత్రమే ఇది ప్రజల యుద్ధం కాదు, ప్రజలపై యుద్ధం అని వాదించారు. అలాంటివారిలో లెనిన్‌ నాయకత్వంలోని బోల్షివిక్‌ పార్టీ ఒకటి. ఆ కారణంగానే అది సరైన ఎత్తుగడలు అవలంభించి పాలకవర్గ బలహీనతను వుపయోగించుకొని మహత్తర సోషలిస్టు విప్లవాన్ని జయప్రదం చేయగలిగింది.

    అక్టోబరు విప్లవం గురించి 1918లో లెనిన్‌ ఒక సందర్బంగా రాసిన దానిలో ‘ సోవియట్‌ తరహా నూతన రాజ్యాన్ని సృష్టించి కష్టతరమైన సమస్యలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే పరిష్కరించగలిగాము. ప్రధాన ఇబ్బంది ఆర్ధిక రంగంలో వుంది’ అని చెప్పారు. విప్లవ సమయంలో మిగతా ఐరోపాతో పోల్చితే రష్యా అనేక విధాలుగా వెనుకబడే వుంది. అంతర్గతంగా భూస్వామిక శక్తులు, పెట్టుబడిదారులు సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించారు. బయట మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతలు, పరాజిత దేశాలూ రెండు కూటములూ సోవియట్‌ చుట్టూ దానిని నమిలి మింగేసేందుకు అవకాశం కోసం చూస్తున్న సామ్రాజ్యవాదులు, కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు చుట్టుముట్టి వున్నాయి. 1917లో సంభవించిన విప్లవం 1989 నాటికి సామ్రాజ్యవాదుల కుట్రలకు బలై ఎలా కూలిపోయిందీ తెలుసుకోకుండా దాని ప్రాధాన్యతను , నేటికీ దానికి వున్న విలువ ఏమిటో అర్ధం చేసుకోలేము.

    అక్టోబరు విప్లవానికి ముందు విదేశాంగ విధానమంటే సామ్రాజ్యవాదులు ఏ ప్రాంతాన్ని ఎలా ఆ క్రమించుకోవాలి, ఎవరైనా పోటీకి వస్తే వారిని ఎలా దెబ్బతీయాలనేదే తప్ప మరొకటి మనకు కనపడదు. ఆధునిక చరిత్రలో సామ్రాజ్యవాదాన్ని ఎదిరించే విదేశాంగ విధానానికి రూపకల్పన జరిపింది సోవియట్‌ యూనియన్‌ వునికిలోకి వచ్చిన తరువాతే. కమ్యూనిస్టు పార్టీలు, సామ్రాజ్యవాద వ్యతిరేక, జాతీయ వుద్యమాలు, వివిధ ప్రజా సంఘాలకు రూపకల్పన చేసింది కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ అన్నది తెలిసిందే. దాన్ని ఒక విధానంగా ఆచరణలోకి తెచ్చింది, అభివృద్ది చేసిందీ సోవియట్‌ యూనియన్‌. అక్టోబరు విప్లవం ఫలితంగా ఏర్పడిన సోవియట్‌ యూనియన్‌ అనేక దేశాలలో కమ్యూనిస్టు విప్లవ సంస్ధల ఏర్పాటుకు, జాతీయ విముక్తి, విప్లవాలకు తోడ్పాటునందించింది. చైనా విముక్తికి ప్రత్యక్షంగా తోడ్పడింది, సోవియట్‌ లేకుంటే చరిత్ర మరోవిధంగా వుండి వుండేది. సోవియట్‌లో కష్టజీవుల రాజ్యం ఏర్పడిందని, ఎలా వుంటుందో చూద్దామని అష్టకష్టాలు పడి వెళ్లిన వారు అనేక మంది కమ్యూనిస్టులుగా మారి తమ దేశాలలో కూడా అలాంటి వ్యవస్ధలను ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు, 1920 తాష్కెంట్‌ నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు ఆ విధంగా జరిగిందే . సంపూర్ణ స్వాతంత్య్రం కావాలనే డిమాండ్‌ను మన స్వాతంత్య్రం వుద్యమంలో ముందుకు తెచ్చింది కమ్యూనిస్టులే. ఈ కారణంగానే తమ దోపిడీకి రాగల ముప్పును గమనించి సామ్రాజ్యవాదులు సోవియట్‌ను మొగ్గలోనే తుంచేందుకు ప్రయత్నించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతలు, పరాజితులూ ఇరు పక్షాలూ సోవియట్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. దాన్ని గమనించే లెనిన్‌ ప్రారంభంలోనే జర్మన్‌ సామ్రాజ్యవాదులతో బ్రెస్ట్‌లిటోవస్కీ సంధి చేసుకొని విప్లవ ఫలితాన్ని రక్షించారు. అక్టోబరు విప్లవం జాతీయ స్వాతంత్య్ర, విముక్తి వుద్యమాలకు వూపునివ్వటంతో మన దేశంతో సహా అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీల పుట్టుకకు పురుడు పోసింది. పర్యవసానంగా రెండవ ప్రపంచ యుద్దం నాటికి సామ్రాజ్యవాదులు తమ వలసలను ఇంకేమాత్రం నిలుపుకోలేని పరిస్ధితులు ఏర్పడ్డాయి. దీంతో సోవియట్‌ను దెబ్బతీసేందుకు అమెరికాతో సహా అన్ని సామ్రాజ్యవాద దేశాలూ జర్మన్‌ నాజీ హిట్లర్‌ను అన్ని విధాలుగా ప్రోత్సహించాయి.ఈ కుట్రను ముందుగా పసిగట్టిన స్టాలిన్‌ హిట్లర్‌ వ్యతిరేక కూటమితో ఒప్పందాలు చేసుకొనేందుకు ప్రయత్నించారు. ముందుగా హిట్లర్‌ను సోవియట్‌పైకి పంపి దానిని పతనం చేసిన తరువాత తాము తేల్చుకోవచ్చని ఇతర సామ్రాజ్యవాదులు దురాలోచన చేశారు.

    అందుకే తగిన సన్నాహాలు చేసుకొనేందుకు మరోసారి 1939తో జర్మనీతో రష్యన్లు పరస్పర దాడుల నిరోధ ఒప్పందం చేసుకున్నారు. సోవియట్‌ను ఏక్షణంలో అయినా లేపివేయవచ్చు, ముందు గతంలో తమను ఓడించిన ఇతర సామ్రాజ్యవాదుల పని బట్టాలని నిర్ణయించుకున్న హిట్లర్‌ తన వ్యూహం అమలు జరిపాడు. వరుసగా విజయాలు సాధించిన వూపులో సోవియట్‌ను కూడా ఆక్రమించుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించిన హిట్లర్‌ 1941లో అంతకు ముందు చేసుకున్న ఒప్పందాన్ని వుల్లంఘించి సోవియట్‌పై దాడులకు దిగాడు. ఇది ప్రపంచగతిని మరోమలుపు తిప్పుతుందని ఎవరూ వూహించలేదు. ఐక్యరాజ్యసమితి ఏర్పడటానికి ముందు నానాజాతి సమితి వుండేది. దాని వైఫల్యాల తీరుతెన్నులను గమనించి రెండవ ప్రపంచ యుద్దానికి ముందు దురాక్రమణదారులకు వ్యతిరేకంగా ఒక భద్రతా వ్యవస్ధను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది నాటి సోవియట్‌ యూనియన్‌ మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి. ఆ తరువాత అంతకంటే పటిష్టమైన ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. అయితే ఇది కూడా నానాజాతి సమితి వైఫల్యాల బాటలోనే పయనిస్తున్నది, అందుకు బాధ్యత ఎవరిది, నిబంధనలను వుల్లంఘిస్తున్నది ఎవరంటే అమెరికా, దాని మిత్రరాజ్యాలే మనకు కనిపిస్తాయి.

    ఐరోపాను గడగడలాడించిన హిట్లర్‌ సేనలను మట్టుబెట్టటమే గాక, హిట్లర్‌ ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చావాల్సిన పరిస్ధితిని కల్పించిన మొనగాడుగా సోవియట్‌ ప్రపంచం ముందు నిలిచింది. అంతే కాదు తూర్పుఐరోపాను, ఆసియాలో వుత్తర కొరియాను విముక్తి చేసి సోషలిస్టు శిబరాన్ని విస్తరింపచేసింది. చైనాలో సోషలిస్టు విప్లవం జయప్రదమయ్యేందుకు ఎంతో తోడ్పడింది.రష్యాలో అక్టోబరు విప్లవం జరగపోయి వుంటే, అది బలపడి రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ మూకలను ఓడించకుండా వున్నట్లయితే ప్రపంచంలో ఏమి జరిగి వుండేది ? నాజీలు, ఫాసిస్టులు, ఇతర సామ్రాజ్యవాదులు మరో రూపంలో ప్రపంచాన్ని తిరిగి పంచుకొని వుండేవారు కాదా ? ఆ ముప్పును తప్పించింది, వలస రాజ్యాలన్నింటికీ స్వాతంత్య్రం వచ్చింది కమ్యూనిస్టుల వలనే కాదా ?

Image result for 2nd world war ,stalin

   అక్టోబరు విప్లవంతో ఏర్పడిన సోవియట్‌ యూనియన్‌ ఒక కుట్ర ఫలితమని సామ్రాజ్యవాదులు వర్ణిస్తారు. ఒక ప్రయోగంగా కొందరు వర్ణిస్తే , మరికొందరు దానిని అంగీకరించరు. 1871 మార్చి 18 నుంచి మే 28వరకు వునికిలో వున్న పారిస్‌ కమ్యూన్‌ను దిగ్బంధం చేసి అణచివేసిన మాదిరి ప్రపంచంలో ఆరోవంతు వున్న సోవియట్‌ యూనియన్‌ను భౌతికంగా దిగ్బంధం చేయటం సాధ్యం కాదని పెట్టుబడిదారీ వర్గం ప్రారంభంలోనే గుర్తించింది.అందుకే తొలుత అంతర్గత తిరుగుబాట్లు, అంతర్యుద్ధ కుట్రల ద్వారా దానిని దెబ్బతీయాలని చూసింది. ఆ తొలి ఎత్తుగడ విఫలమైంది. అటువంటి వ్యవస్ధ రెండు దశాబ్దాలపాటు కొనసాగి స్ధిరపడటమేగాక అనేక విజయాలు సాధించి ప్రపంచ కార్మివర్గాన్ని ఆకర్షించింది. దీనికి తోడు రెండవ ప్రపంచ యుద్ధంలో అనూహ్యంగా హిట్లర్‌ను ఓడించి ప్రపంచ హీరోగా నిలబడింది. దీంతో భౌతికంగా అంతం చేయలేమని , కార్మిక వర్గం మొత్తంగా తమ దోపిడీకి చరమ గీతం పాడుతుందని పెట్టుబడిదారులు నిర్ధారణకు వచ్చి పన్నిన సుదీర్ఘకుట్ర ఫలితమే ప్రచ్చన్న యుద్దం.

   సోవియట్‌, తదితర దేశాల వ్యవస్ధలను కూల్చివేయటానికి, కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు సామ్రాజ్యవాదులు దాదాపు పది లక్షల కోట్ల డాలర్లను ఖర్చు చేశారని అంచనా. కమ్యూనిజం పనికిరాదు, అసంగతం అని చెప్పిన వారు దాన్ని దెబ్బతీసేందుకు ఇంత భారీ మొత్తం ఖర్చు చేయటాన్ని బట్టే దానికున్న ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. శ్రామికవర్గంతో ప్రత్యక్ష పోరు సల్పితే ప్రయోజనం లేదన్నది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత దోపిడీ వర్గం నేర్చుకున్న పెద్ద పాఠం. కొత్త పద్దతులను ఎంచుకుంది. ఎదుటి పక్షంలోని లోపాలు, బలహీనతలను ఎంచుకొని వాటిమీద కేంద్రీకరించటం ద్వారా సైద్ధాంతిక దాడి, కుట్రలు, అనుమానాలు, గందరగోళంలో పడవేయటం వంటి సకల చాణక్య ఎత్తుగడులను అమలు జరిపి తమ చేతికి మట్టి అంటకుండా దెబ్బతీయటం ప్రచ్చన్న యుద్ద లక్షణం. దాన్ని ఒక్క సోవియట్‌, తూర్పు ఐరోపాకే పరిమితం చేయలేదు. క్యూబాను భౌతికంగా అష్టదిగ్బంధనం గావించారు. కమ్యూనిస్టు చైనాను రెండు దశాబ్దాలకు పైగా అసలు గుర్తించేందుకు, ఐక్యరాజ్యసమితిలో ప్రాతినిధ్యం వహించేందుకే లేకుండా అడ్డుకున్నారు. వియత్నాం, కంపూచియా, లావోస్‌లపై దశాబ్దాల తరబడి యుద్ధాలు చేసి కమ్యూనిజాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.

    పుట్టిన దగ్గర నుంచి కూలిపోయే వరకు ఏడు దశాబ్దాల పాటు సోవియట్‌ వనరులలో ఎక్కువ భాగం దానిని కాపాడు కొనేందుకు ఖర్చు చేసిన ఫలితంగానే అది ఎలాంటి భౌతికదాడులకు గురికాలేదన్నది ఒక వాస్తవం. అయితే అదే సమయంలో పెట్టుబడిదారీ దేశాలు విసిరిన సవాలును స్వీకరించిన కమ్యూనిస్టులు సోవియట్‌ అభివృద్దికి అనుసరించిన కొన్ని పద్దతులు, ప్రయోగాలు ఎన్నో విజయాలతో పాటు కొన్ని వ్యతిరేక ఫలితాలనిచ్చాయన్న అభిప్రాయాన్ని కాదనలేము.వాటిలో కమ్యూనిస్టులు బ్యూరాక్రాట్లుగా మారటం ఒకటి. అనేక ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ సోవియట్‌ సాధించిన విజయాలను తక్కువ చేసి చూడలేము. స్టాలిన్‌ హయాంలో కొన్ని పొరపాట్లు జరిగినప్పటికీ సాధించిన అభివృద్ధి కారణంగానే ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఫాసిస్టు హిట్లర్‌ను మట్టుబెట్టటం సాధ్యమైంది. అణురంగంలో అమెరికాతో ధీటుగా వుండబట్టే మరో నాగసాకి, హిరోషిమాలు పునరావృతం కాలేదు. ప్రణాళికా బద్ధమైన ఆర్ధిక వ్యవస్ధను అమలు జరిపి అనేక విజయాలు సాధించి ఈనాడు అనేక దేశాలకు మార్గదర్శకంగా వున్నది కూడా సోవియట్‌ యూనియనే. సోవియట్‌ ప్రయోగాలు ప్రపంచానికి అనేక గుణపాఠాలు కూడా నేర్పాయి.

    లాభం లేనిదే వ్యాపారి వరదన పోడన్న సామెత తెలిసిందే.సోవియట్‌ యూనియన్‌ ఏర్పాటు, పురోగమనం, ఫాసిజంపై యుద్ధ విజయం కారణంగా జనం కమ్యూనిస్టులవైపు మొగ్గకుండా చూసేందుకే పాలకవర్గాలు జనానికి వెసులుబాటునిచ్చే కొన్ని సంక్షేమ చర్యలను చేపట్టకతప్పని పరిస్ధితులు ఏర్పడ్డాయని గ్రహించటం అవసరం. ఇదే క్రమంలో లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండంలో నియంతలకు మద్దతు ఇచ్చే విధానాలను అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాదులు విరమించుకోవాల్సి వచ్చింది. తమ లాభాల రేటు తగ్గకుండా చూసుకొనేందుకు మరోవైపు పెట్టుబడిదారీ వర్గం వుత్పత్తిని మరింతగా పెంచే, కార్మికుల సంఖ్యను తగ్గించే పరిజ్ఞానంవైపు కూడా దృష్టి సారించింది. అది సోషలిస్టు దేశాలకు విస్తరించకుండా ఇనుప తెరలను ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే సోవియట్‌తో సంబంధాలున్న మనవంటి దేశాలకు కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానం అందకుండా చూసింది. అయినా అంతరిక్ష రంగంలో సోవియట్‌ అమెరికా కంటే ఎంతో ముందుకు పురోగమించింది. గతంలో సోవియట్‌,తరువాత దాని వారసురాలిగా రష్యా మనకు అందించిన అంతరిక్ష ప్రయోగ పరిజ్ఞాన ఫలితమే ఈ రోజు మనం జయప్రదంగా అంతరిక్ష , క్షిపణి ప్రయోగాలు చేస్తూ ప్రపంచ అగ్రరాజ్యాల సరసన నిలబడగలుగుతున్నామన్నది మరిచి పోరాదు. ప్రచ్చన్న యుద్ధం పేరుతో సామ్రాజ్యవాదులు సాగించిన కుట్రల తీవ్రతను అర్ధం చేసుకోవటంలో, ఎదుర్కోవటంలో వైఫల్యం, వైరిపక్ష బలాన్ని తక్కువగా అంచనా వేయటం, సంస్కరణల అమలులో వైఫల్యం వంటి అంశాలు , రాజకీయంగా మితవాదానికి గురికావటం చివరకు బోరిస్‌ ఎల్సిన్‌ వంటి శక్తులు పార్టీ నాయకత్వ స్ధానాలలోకి ఎదగటంతో సామ్రాజ్యవాదులు తమ కుట్రలను సులభంగా అమలు చేసి సోవియట్‌ను కూల్చివేయగలిగారు.

    సోవియట్‌, తూర్పు ఐరోపా పతనం వలన ఆయా దేశాల పౌరులతో పాటు ప్రపంచం కూడా ఎంతో నష్టపోయింది. అమెరికా చెప్పిందే వేదం. సోవియట్‌ అంతరిస్తే తమ ఖండం నుంచి అమెరికా సేనలు తిరుగుముఖం పడతాయని ఆశించిన ఐరోపా ధనిక దేశాల ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్‌ పాలకవర్గ అంచనాలు తప్పాయి. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలకు వ్యతిరేకంగా నాటో కూటమిని ఏర్పాటు చేసిన అమెరికా అక్కడి సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన తరువాత దానిని రద్దు చేయకపోగా గత పాతిక సంవత్సరాలలో మరింతగా పటిష్ట పరుస్తున్నారంటే వారి ఎజండా ఇంకా మిగిలే వుందన్నది సుస్పష్టం. అంటే మిగతా సోషలిస్టు దేశాలు, కమ్యూనిస్టు భావజాలానికి వ్యతిరేకంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తూనే వున్నారు. ఐరోపా ధనిక దేశాలపై తన పట్టు కొనసాగాలంటే నాటో కూటమిని కొనసాగించటం అవసరం. సోవియట్‌ లేకపోయినా దాని స్ధానంలో వచ్చిన రష్యా నుంచి ఐరోపాకు ముప్పు తొలగలేదనే కొత్త పల్లవిని అమెరికన్లు అందుకున్నారు.

     సోవియట్‌ అంతరించిన తరువాత దాని బూచిని చూపితే నడవదు. అందుకు గాను వుగ్రవాదంపై పోరు పేరుతో సరికొత్త అజెండాకు తెరలేపింది. ఆ పేరుతో పశ్చిమాసియా ఆక్రమణకు పూనుకుంది. ఇజ్రాయెల్‌కు ఇంకా ముప్పు తొలగలేదనే పేరుతో ఆ ప్రాంతంలో కొనసాగేందుకు కొత్త సమస్యలను సృష్టిస్తున్నది. సోవియట్‌ను కూల్చివేసిన తరువాత పాతిక సంవత్సరాల పాటు ఒక చిన్న కమ్యూనిస్టు దేశం క్యూబాను దెబ్బతీసేందుకు ప్రయత్నించి సాధ్యంగాక దానితో అమెరికన్లు తాత్కాలికంగా అయినా రాజీపడి సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలలో ఎన్నికైన వామపక్ష ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఆసియాలో తమకు లాభదాయకంగా వున్న కారణంగా చైనాతో భారీ ఎత్తున వాణిజ్య లావాదేవీలు నడుపుతూనే మరోవైపున దానిని దెబ్బతీసేందుకు నిరంతరం కుట్రలు పన్నుతూనే వున్నాయి. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని చైనా ఆధీనంలో వున్న దీవులపై తమకు హక్కు వుందంటూ జపాన్‌, ఫిలిప్పైన్స్‌ తదితర దేశాలతో వివాదాలను రెచ్చగొడుతూ ఆ ప్రాంతంలో సైనిక విన్యాసాలు చేస్తున్నారు.

    ప్రపంచ మానవాళి సోవియట్‌కు, స్టాలిన్‌కు తీర్చలేని విధంగా రుణపడిందంటే అతిశయోక్తికాదు. స్టాలినే లేకుంటే తరువాత కాలంలో ఆయనను నియంత అని నిందించిన వారు, హిట్లర్‌తో మతిలేని పోలికలు తెచ్చిన వారు బతికి వుండేవారు కాదు, వారి వారసులు అసలు పుట్టివుండేవారు కాదు. ప్రపంచాన్ని హిట్లర్‌ అనే నియంత ఆక్రమించ కుండా కాపాడింది, తమ ప్రాణాలు అర్పించిన రెండు కోట్ల మంది సోవియట్‌ పౌరులు, వారిని అంతటి మహత్తర త్యాగాలకు సిద్దపరిచిన స్టాలిన్‌ నాయకత్వమే. ఒక దుర్మార్గుడు ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు పూనుకుంటే లొంగిపోయి సలాం కొట్టినవారిని, బానిసలుగా మారిన వారిని, గుడ్లప్పగించి చూసిన వారిని ప్రపంచ చరిత్ర చూసింది గానీ, ఆత్మగౌరంతో బతికేందుకు ఇలాంటి త్యాగాలు చేయటం మరొక వుదంతంలో ఎక్కడా కానరావు.

    ఐరోపాలో లేదా మన వంటి వర్ధమాన దేశాలలో ప్రభుత్వాలు సంక్షేమ చర్యలను చేపట్టటం రష్యాలో అక్టోబరు విప్లవం, సోవియట్ల ఏర్పాటు తరువాతనే ప్రారంభమైంది అని గుర్తించాలి. ఆ సోవియట్‌ కూలిపోయిన తరువాత గత పాతిక సంవత్సరాలలో ఆ సంక్షేమ చర్యలను ఒక్కొక్కటిగా పెట్టుబడిదారీ దేశాలన్నింటా వుపసంహరించటాన్ని గమనిస్తున్నాము. గతం మాదిరి జనం పోల్చుకోవటానికి ప్రత్యామ్నాయ వ్యవస్ధ లేదని, తమ లాభాల్లో జనానికి వాటా పెట్టాల్సిన అవసరం లేదని పెట్టుబడిదారులు భావిస్తుండటమే సంక్షేమ చర్యలకు కోత, వుపసంహరణ.

   ఇతరులకు జోస్యం చెప్పిన బల్లి కుడితిలో పడి గిలగిలా కొట్టుకున్నట్లు సోషలిస్టు వ్యవస్ధలు ఫలితాలు సాధించలేవని, ఆచరణ సాధ్యం కాదని ప్రచారం చేసిన పెట్టుబడిదారీ వ్యవస్ధలు తామే తీవ్ర సంక్షోభంలో పడి బయటకు రాలేక దిక్కుతోచకుండా వున్నాయి. మరోవైపున సంక్షుభిత పెట్టుబడిదారీ దేశాల మార్కెట్లపై ఆధారపడిన చైనా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాల ఎగుమతుల ఆర్ధిక లావాదేవీలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షోభంలో పడలేదు. విజయవంతంగా నడుస్తున్నాయి. దివాళాకోరు ఆర్ధిక విధానాలు అమలు జరుపుతున్న మనవంటి దేశాలు రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లుగా వాటి దుష్పలితాలను అనుభవిస్తున్నాయి. సోవియట్‌ కూలిపోయిన తరువాత ప్రపంచంలోని వామపక్షాలు కూడా నూతన సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

      కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతుల వుద్యమాలు వెనుకపట్టు పట్టాయి. యజమానులు తమ షరతులను ముందుకు తెస్తూ ఎదురుదాడులు చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు తమ వస్తువులను అమ్ముకొనేందుకు తెచ్చిన నూతన సాంకేతిక పద్దతులతో గొలుసుకట్టు ప్రపంచ మార్కెట్‌ను తమ అదుపులోకి తెచ్చుకుంటున్నాయి. దీంతో సరిహద్దులతో నిమిత్తం లేకుండా వస్తువులు ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుతున్నాయి. దీని అర్ధం ఏమంటే తమ ఆర్ధిక వ్యవస్థల మీద ఆయాదేశాలకు అదుపు వుండదు. కార్మికులు యూనియన్లు పెట్టుకోవటానికి, తమ న్యాయమైన హక్కులను సాధించుకొనేందుకు కష్టమౌతుంది. ఎక్కడ కార్మిక శక్తిని దోచుకొనేందుకు అవకాశం వుంటే అక్కడికి పరిశ్రమలను తరలించి లేదా కొత్తగా ఏర్పాటు చేసి వస్తువులను తయారు చేసి ఎగుమతులు చేస్తున్నాయి. ఈ కారణంగా మన ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా నినాదం ఇచ్చి, తమ దగ్గర ఎటువంటి అవకాశాలు వున్నాయో ప్రపంచదేశాలన్నింటా చెబుతున్నారు. అవసరమైతే కార్మిక చట్టాల రద్దు, నామమాత్రంగా చేసి యజమానుల ఇష్టారాజ్యానికి అవకాశం కల్పిస్తామని ప్రాధేయపడుతున్నారు. కార్మిక సంఘాల ఏర్పాటును కఠిన తరం చేసే నిబంధనలు చేరుస్తున్నారు.తక్కువ సంఖ్యలో కార్మికులున్న పరిశ్రమలలో వారిని తొలగించేందుకు, మూసివేసేందుకు యజమానులకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తున్నారు. అప్రెంటిస్‌ల పేరుతో ఏండ్ల తరబడి నామమాత్ర వేతనాలకు పనిచేయించుకొనే వెసులుబాటును కల్పిస్తున్నారు. చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖరరావు వంటి ముఖ్యమంత్రులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇవన్నీ పరోక్షంగా సోషలిస్టు వ్యవస్ధలు కూలిపోయిన పర్యవసానాలే అన్నది గమనించాలి.

    అక్టోబరు విప్లవం ప్రపంచంలో తెచ్చిన మార్పులు, దానికి తగిలిన ఎదురు దెబ్బల కారణంగా ప్రపంచంలో సామ్రాజ్యవాదుల ఆధిక్యం పెరిగిపోవటం, వారిని ఎదిరించేవారు లేకపోవటంతో వర్ధమాన దేశాలకు తిరిగి ముప్పు ఏర్పడటం, కార్మిక,కర్షక వుద్యమాలు వెనుకపట్టుపట్టం, యజమానుల దోపిడీ పెరగటం,సంక్షేమ చర్యలకు కోత ద్వారా ప్రజలపై భారాలు మోపటం వంటి పర్యవసానాల గురించి చెప్పుకున్నాము. సోవియట్‌ పతనం నుంచి గుణపాఠాలు తీసుకోవటమంటే పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం నుంచి వైదొలగి ఆ దుర్మార్గ విధానానికి సలాం కొట్టటం కాదు. అక్టోబరు విప్లవం గురించి మరింతగా మధనం చేయాలి. లోపాలను పునరావృతం కాకుండా చూసుకోవాలి. దానిని వర్తమాన పరిస్ధితులకు అన్వయించుకోవాలి. ప్రతి వైఫల్యం విజయానికి ఒక మెట్టు అని అంగీకరిస్తే అక్టోబరు విప్లవం, సోవియట్‌ ప్రయోగం కూడా అలాంటిదే. ప్రస్తుతం సాంప్రదాయ పెట్టుబడిదారుల స్ధానంలో ద్రవ్య పెట్టుబడిదారులు ప్రపంచంపై ఆధిపత్యం వహిస్తున్నారు. వారి నూతన ఎత్తుగడలను కార్మికవర్గం నూతన పద్దతులలో చిత్తుచేయటం తప్ప మరొక మార్గం లేదు. ఈ క్రమంలో పెట్టుబడిదారీ సిద్దాంత వేత్తలు ముందుకు తెచ్చే గందరగోళ సిద్ధాంతాలు లేదా వాదనలను వారి తీరుతెన్నుల నుంచే ఎండగట్టాలి. రెండు రెళ్లు నాలుగు అన్నది ఏ కాలంలో అయినా ఒకటే. అలాగే కార్మికులు, కర్షకులు దోపిడీకి గురవుతున్నంత వరకు దానిని ఎలా అంతం చేయాలన్నదానిలోనూ ఎలాంటి గందరగోళం, మార్పూ వుండకూడదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

స్టాలిన్‌పై రష్యన్లలో పెరుగుతున్న అభిమానం

06 Sunday Mar 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, RUSSIA

≈ Leave a comment

Tags

Communist Party, Joseph Stalin, Kremlin, Lenin, Moscow, stalin, Vladimir Putin

ఎంకెఆర్‌

      హిట్లర్‌ పీచమణిచి ప్రపంచానికి నాజీల ముప్పు తప్పించిన వుక్కు మనిషి కమ్యూనిస్టు స్టాలిన్‌. ఆయన మరణించి 63 సంవత్సరాలు గడిచాయి.చరిత్రలో ఆయన గురించి జరిగినంత తప్పుడు ప్రచారం మరొక ఏ నేత పట్లా జరగలేదంటే అతిశయోక్తి కాదు. శనివారం నాడు ఆయన వర్ధంతి సందర్బంగా ఒక చిన్న వార్తను మీడియా సంస్ధలు అందచేశాయి. స్టాలిన్‌ పోయినా రష్యాలో కమ్యూనిజం అంతరించలేదన్నది దానిలో ఒక వ్యాఖ్య. లెనిన్‌, స్టాలిన్‌ నాయకత్వంలో నిర్మితమైన పార్టీని కృశ్చెవ్‌, గోర్బచెవ్‌ లాంటి వారు ఎంతగా దెబ్బతీసినా పాతికేళ్ల క్రితం సోషలిస్టు వ్యవస్థను కూల్చివేసినా కమ్యూనిస్టుల వునికిని గుర్తించక తప్పలేదు.

     కమ్యూనిస్టు పార్టీ తిరిగి అభిమానం పొందటం పట్ల రష్యన్‌ పాలకులు ఆందోళన చెందుతున్నారన్నది మరొక వ్యాఖ్య. ప్రపంచ పెట్టుబడిదారీ విధానం తీవ్ర సంక్షోభంలో కూరుకు పోతున్న సమయంలో దానిని అమలు జరిపేందుకు పూనుకున్న రష్యాలో మంచి ఫలితాలు ఎలా వస్తాయి, ఏ విత్తనం వేస్తే ఆ కాయలే కాస్తాయి. ప్రస్తుతం రష్యా ఆర్ధిక వ్యవస్ధ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన ఒక సర్వేలో సగం మంది రష్యన్లు పాత సోవియట్‌ యూనియన్‌ రోజులే బాగున్నాయని అభిప్రాయపడ్డారని వెల్లడైంది.

    స్టాలిన్‌ హయాం నాటి కళా రూపాల ప్రదర్శనశాల సంరక్షకురాలు మరియా క్రెచొటోవా మాట్లాడుతూ స్టాలిన్‌ గురించి ఆసక్తి పెరగటాన్ని అర్ధం చేసుకోదగినదే. రెండవ ప్రపంచ యుద్ధ విజయం 70 వార్షికోత్సవాన్ని నిర్వహించామని, ఆ విజయం ఎవరి నాయకత్వంలో జరిగిందో మనం మరిచి పోకూడదని అన్నారు.

pg-31-stalin-1-getty.jpg

     ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలలో పాలక పక్షమైన యునైటెడ్‌ రష్యా పార్టీకి ప్రధాన సవాలు కమ్యూనిస్టుల నుంచే వుంటుందని ప్రధాని దిమిత్రి మెద్వెదెవ్‌ ప్రకటించారు.సోవియట్‌ యూనియన్‌ ఏర్పాటు ద్వారా లెనిన్‌ రష్యా కింద ఆణుబాంబును పెట్టారని అధ్యక్షుడు పుటిన్‌ తన వుక్రోషాన్ని వెల్లడించాడు.

  స్టాలిన్‌ మరణించిన మూడు సంవత్సరాల తరువాత స్వయంగా సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ నేత కృశ్చెవ్‌ ప్రారంభించాడు.1956 ఫిబ్రవరి 25న కమ్యూనిస్టు పార్టీ 20 మహాసభను అందుకు వేదికగా చేసుకున్నాడు.అది కూడా రహస్యంగా ప్రసంగించాడు. దాని కాపీని సంపాదించటానికి ఆరోజుల్లోనే అమెరికా సిఐఏ లక్ష డాలర్లు ఖర్చు చేసిందట.

    స్టాలిన్‌ హయాంలో సాధించిన విజయాలు గొప్పవని 2008లో 27 శాతం మంది రష్యన్లు భావిస్తే గతేడాది జూన్‌లో జరిగిన సర్వేలో 45శాతానికి పెరిగినట్లు వెల్లడైంది. క్రిమియాలో స్టాలిన్‌ ఇతర నేతలతో వున్న విగ్రహాన్ని పుతిన్‌ ప్రభుత్వం ప్రతిష్టించటం స్టాలిన్‌ పట్ల సామాన్య జనంలో వున్న ఆదరణ, అభిప్రాయానికి అద్దం పడుతోంది.రెండవ ప్రపంచ యుద్ద సమయంలో స్టాలిన్‌తో సమావేశమైన చర్చిల్‌, రూజ్వెల్ట్‌లతో కూడిన ఫొటోకు నకలుగా విగ్రహాన్ని తయారు చేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d