• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: ndtv

చల్లేవారు పార్టీ ప్రతినిధులు-రాసే వారు ప్రచారకర్తలు !

12 Friday May 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Gandhi Peace Foundation, Indian media, journalism, journalists, Kuldip Nayyar Award, ndtv, NDTV anchor Ravish Kumar, Ravish Kumar

‘సిరా’ వినియోగంపై సుప్రసిద్ధ జర్నలిస్టు రవీష్‌ కుమార్‌ వ్యంగ్యాస్త్రం

జర్నలిజంలో విశిష్ట స్ధానం సంపాదించిన ఎన్‌డిటివీ యాంకర్‌ రవీష్‌ కుమార్‌కు కులదీప్‌ నయ్యర్‌ జర్నలిజం అవార్డు ప్రదానం సందర్భంగా మార్చి 19న చేసిన ప్రసంగ అనువాదమిది. జర్నలిస్టులలో ఆలోచన పాదుకొల్పేదిగా వున్నందున పాఠకుల కోసం దీనిని అందచేస్తున్నాం

ప్రపంచ వ్యాపితంగా చులకనగా చూస్తున్న తరుణంలో సత్కారం పొందటం ఒక విధంగా వినోదంగా వుంది. అలారం కొట్టే గడియారాలు కొన్ని దశాబ్దాల క్రితమే మూగపోయినప్పటికీ ఇంకా అలారం కొడుతున్న గడియారాన్ని చూస్తున్నట్లుగా ఇది వుంది. అంటే మనం అప్పటి నుంచి మెల్లగా చేసే శబ్దాలను బట్టి సమయాన్ని గ్రహించే ఇంద్రియ సామర్ధ్యాన్ని మనం కోల్పోయాం. నుక మనం వర్తమాన కాల న్యాయా అన్యాయాలను మదింపు చేయటంలో కూడా విఫలమౌతున్నాం.ఈ రోజులు ఎలా వున్నాయనే భావన కలుగుతోందంటే మనం ఒక పరీక్ష హాలులో వున్నట్లు మనలో వున్న తప్ప చేసే వారిని ప్రత్యక్షంగా పట్టుకోవాలని పిలుస్తున్నట్లు, ధృడ నిశ్చయంతో దాడి చేసే నిఘా బృందాలు, ఆకస్మిక దాడుల దళాలు నిరంతరం దాడులు చేస్తున్నాయన్నట్లుగా వుంది. మనం పదే పదే శోధించబడుతున్నాం. ఎవరైతే తమ మనసులోని మాటలను స్వేచ్చగా వెల్లడిస్తామో వారిపై మరుగుజ్జు భూతాలు (ట్రోల్స్‌) తమ లక్ష్యంగా చేసుకుంటాయి.

కొత్త దాడి బృందం వచ్చి నపుడల్లా ‘పరీక్ష హాలులో ‘ వున్న వారి వెన్నులో వణుకుపుడుతోంది. ఏ నేరమూ చేయకుండానే భయం కొల్పుతున్నాయి. తప్పు చేసిన వారిని పట్టుకోవటం గాక అమాయకులను ఎక్కువగా భయకంపితులు గావిస్తున్నాయి. ఇది నకిలీ డిగ్రీలు-నిజమైన డిగ్రీల గురించి చర్చలు చేస్తున్న ఈ కాలంలో వివిధ రూపాలలో ధర్డ్‌ డిగ్రీ( సాధారణంగా పోలీసుల చిత్ర హింసలను ఆంగ్లంలో అలా సంబోధిస్తారు, టీవీ చర్చలు కూడా అంతే చిత్రహింసలు పెడుతున్నాయన్నది ప్రసంగకర్త విరుపు ) తిరిగి వచ్చింది. ఈ కాలంలో న్యూస్‌ యాంకర్‌ నూతన అధికార కేంద్రంగా మారారు. తాను కోరుకున్నదానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే హఠాత్తుగా విరుచుకుపడతారు. వ్యతిరేక అభిప్రాయం కలిగి వుండటం నేరం. ప్రత్యామ్నాయ అభిప్రాయం కలిగి వుండటం ఒక తీవ్రమైన నేరం, వాస్తవాలను ముందుంచటం అశ్లీల చర్య, నిజాయితీగా వుండటం పాపం. తొలుత టీవీలు మన సాయంత్రాలను మాత్రమే బందీలుగా చేశాయి. ఇప్పుడు ఈ ‘పోలీస్‌ స్టేషన్లు ‘ రోజంతా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. మీరు తొలి అవార్డుకు ఒక న్యూస్‌ యాంకర్‌ను ఎంపిక చేశారు.అంటే ఇంకా బతికుండేందుకు మీరు సాహసం చేస్తున్నారనేందుకు ఈ రుజువు చాలు. వారి బ్రతుకు ఒక భ్రమ అయినప్పటికీ మరో ఓటమిని ఎదుర్కొనే సాహసం చేయటానికి సిద్ధంగా వుండే జనాలు ఇంకా వున్నారు. నేను కృతజ్ఞుడనై వున్నాను.

గాంధీ పీస్‌ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు.ఈ అవార్డును చెమటోడ్చిన జర్నలిస్టులు ఏర్పాటు చేశారనే స్పృహ వున్న వాడిని. ఈ వృత్తిలో నాకంటే పెద్ద వారి నుంచి ఏది తీసుకున్నప్పటికీ దానినొక బహుమానంగా నేను భావిస్తాను. నా ప్రార్ధనలకు సమాధానం వంటిది. మన మందరం కులదీప్‌ నయ్యర్‌గారిని గౌరవిస్తాము. మీరు రాసిన వాటిని మిలియన్ల మంది చదివారు. ప్రతి రోజు ఎవరి పేరునైతే ద్వేషించారో, విషం చిమ్మారో వారి ఎల్లలలో మీరు జ్యోతులను వెలిగించారు. వాస్తవానికి మనలో ఎంత మందిమి కనీసం ప్రేమ గురించి మాట్లాడుతున్నాం, జనం ప్రేమ గురించి ఆలోచిస్తున్నారా అన్నది నాకు సందేహమే. మనం ఇంకేమాత్రం రోజూ వుషోదయాలతో లేవటం లేదు, దానికి బదులు వాట్సాప్‌లో మనకు శుభోదయాలు చెప్పారా అనే వెతుకులాటతో రోజును ప్రారంభిస్తున్నాం. దీనిని చూస్తుంటే వాట్సాప్‌లతో సూర్యుడు వుదయించటంతో ప్రపంచం ప్రారంభమౌతుందా అని పిస్తోంది. త్వరలో మనం గెలీలియోను మరోసారి శిక్షించబోతున్నాం, ఈ సారి దానిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తాం.

అవకాశాలను కనుగొనే దశ ఇది. నూతన, మిగిలిపోయిన అవకాశాలకోసం మనం నిరంతరం చూస్తున్నాము, ఆ నూతన ఆశలు, అవకాశాలను రక్షించే, పెంచి పోషించే జనం కోసం కూడా చూస్తున్నాము. అయినప్పటికీ ఈ ఆశలు, అవకాశాలు నేడు సన్నగిల్లుతున్నాయి. వీటి మధ్య మన ఆశలు ఏకాంతంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మనం ఎంతకాలం బతికి వుంటామనేది మనందరినీ వేధిస్తున్నది. మన చుట్టూ ఎలా వున్నప్పటికీ అర్ధవంతంగా ఎలా జీవించాలనే అంశాన్ని మనం మరచిపోయాము. ఇటువంటి పరిస్ధితిలో మన శక్తిని, ఆవేశాన్ని తిరిగి రగిలించుకోవాల్సి వుంది. మీ ప్రశ్నలను సానపెట్టండి, మీరు నమ్మిన రాజకీయ బృందాలను ప్రశ్నించండి. ఆ బృందాలు మన విశ్వాసాన్ని దెబ్బతీశాయి. మీకు విశ్వాసం లేని వారిని కూడా ప్రశ్నించండి. మన సమాజంలో ఇతరులతో మాటా మంతీ పూర్తిగా నిలిచిపోయింది. నేడు సమాజం తన ఆశలన్నింటినీ మార్పు తెచ్చే రాజకీయ పార్టీలపై పెట్టుకుంది.రాజకీయంగా శక్తి వంతులైన వారు మాత్రమే ప్రమోదం లేదా ప్రమాదకరమైన మార్పులను గానీ తేగలరని సమాజానికి ఇప్పుడు తెలుసు. ఈ కారణంగానే రాజకీయపార్టీలపై పెట్టుకున్న ఆశలనుంచి వెనక్కు పోవటం లేదు. జనం ఈ సాహసం చేయటాన్ని కొనసాగిస్తారు. రాజకీయపార్టీలు ప్రతిసారీ వారిని విఫలం చేస్తాయి, అయినప్పటికీ మరోసారి వాటిపై నమ్మకం పెట్టుకుంటారు.

తమ సభ్యులు వివిధ మార్గాలను వెతుక్కొనేందుకు నిరంతరం తమ నుంచి వెళ్లిపోవటాన్ని రాజకీయపార్టీలు గమనించాయి. అలా వెళ్లేవారు సామాజిక మార్పునకు రాజకీయాలను ఒక సాధనంగా ఇంకే మాత్రం పరిగణించటం లేదు. అటువంటి వారు తగ్గిపోతున్న కారణంగా రాజకీయపార్టీలు నైతికంగా పతనం అవుతున్నాయి. రాజకీయ పార్టీలకు కొత్త రూపునిచ్చి పున:నిర్మాణం చేయాల్సి వుంది. దయచేసి మీ అంతర్గత వైరుధ్యాలను పక్కన పెట్టండి. గత 30,40 సంవత్సరాలుగా వాటిని చూస్తున్నాము. వామపక్షవాదులు, గాంధీవాదులు, అంబేద్కరిస్టులు మరియు సోషలిస్టులు వారి ప్రధాన రాజకీయ నిర్మాణాల నుంచి వైదొలిగారు. దీంతో ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయ రాజకీయాల ఆశయాలను కోల్పోయాయి. అటువంటి పార్టీలలోకి తిరిగి రండి, వాటి బాధ్యతలను స్వీకరించండి. గతాన్ని మరచిపోండి. నూతన రాజకీయాల కోసం కష్టపడండి. మన అసహాయత, పిరికితనాన్ని గుర్తించటానికి ఇది మంచి సమయం. మనల్ని మనం నిజాయితీతో విశ్లేషించుకోవటానికి ఈ చీకటి సమయాలు సరైన అవకాశం.

నా జర్నలిజం కారణంగా నాకు ఈ అవార్డునిచ్చారు. మీరు ఏదైనా వుందని ఆలోచిస్తున్నట్లయితే ఆ సంక్షోభం నేడు జర్నలిజంలో లేదని చెప్పటానికి ఇది నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. రాజధాని నుంచి చిన్న జిల్లా కేంద్రాల వరకు వున్న సంపాదకులందరూ ఒక రాజకీయపార్టీ సైద్ధాంతిక తుపానులో కొట్టుకుపోవటానికి సంతోషంగా వున్నారు. అయినప్పటికీ మనం వారిని విమర్శిస్తున్నాము. వారు ఎంతో సంతోషంగా వున్నారని మనం అంగీకరించాల్సి వుంది. తాము నేర్పుగల జర్నలిస్టులుగా వున్నామని ఈ కారణంగానే వారు భావించగలుగుతున్నారు. గత యాభై అరవై సంవత్సరాలుగా రాజకీయ వస్తువుతో మిళితం చేసేందుకు మీడియా నిరంతర ప్రయత్నాలు చేసింది. హోటళ్లు, దుకాణ సముదాయాలు, గనుల కౌలు మరియు ఇతర లైసన్సులు పొందటంద్వారా వారి ఆకలి తీరలేదు. వారి ఆత్మలింకా అసంతృతోనే వున్నాయి. ఇప్పుడు అవి శాంతిని పొందాయి. అంతిమంగా అధికార రాజకీయాలతో భాగంగా వుండాలన్న మీడియా కల నెరవేరింది.

భారతీయ మీడియా నేడు పారవశ్య స్ధితిలో వుంది. స్వర్గానికి చేరుకోవాలంటే మెట్లను కనుక్కోవాల్సి వుందని జనాలు మాట్లాడుకున్న రోజులున్నాయి. నేడు అలాంటి వారు భూమి మీదనే స్వర్గాన్ని కనుగొన్నారు.వారికి మెట్లదారి ఇంకేమాత్రం అవసరం లేదు. మీరు నా మాటలను విశ్వసించకపోయినట్లయితే మీరు ఏ వార్తా పత్రికనైనా చదవండి లేదా న్యూస్‌ ఛానల్‌ను అయినా చూడండి. ఒక ప్రత్యేక రాజకీయ అజెండాకు విశ్వాసపాత్రులుగా వుండేందుకు మీడియా తహతహలాడుతున్నట్లు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దశాబ్దాల నిరాశా నిస్పృల తరువాత మాత్రమే మీరు ఈ బ్రహ్మానందాన్ని చూడగలరు, ఎంతటి బాధనైనా తేలికగా తీసుకుంటారు. అలంకరించుకున్న ఈ యాంకర్లు మీకు ఇంతకు ముందెన్నడూ ఇంత అందంగా కనిపించి వుండరు. లేదా ఒక మహిళా యాంకర్‌ ప్రభుత్వాన్ని ఎంతో అందంగా పొగడటాన్ని చూసి వుండరు. ఇప్పుడు ప్రభుత్వం ఎలా వుందో జర్నలిస్టులు కూడా అలాగే వున్నారు.

మీకు పోరాడాలని వుంటే వార్తా పత్రిక, టెలివిజన్‌తో పోరాడండి. మునిగిపోతున్న జర్నలిజం గురించి మీ ధృడ వైఖరిని కోల్పోకండి. జర్నలిస్టులు సైతం కాపాడాలని కోరుకోవటం లేదు. మిగిలి వున్న వారెవరైనా వుంటే వారిని కూడా సులభంగా తొలగించి వేస్తారు.ఏ ఒక్కరినైనా బతికిస్తే పరిస్ధితికి అది ఎలా తోడ్పడగలదు. సంస్ధలు మొత్తంగా మతపూరితం గావించబడ్డాయి. భారత్‌లో జర్నలిజం మతోన్మాదాన్ని వ్యాపింప చేస్తోంది.అది రక్తదాహంతో వుంది. ఏదో ఒక రోజు జాతి మొత్తాన్ని రక్తసిక్తం గావించనుంది. తన అజెండాను విజయవంతంగా ముందుకు తీసుకుపోయినట్లు ఈ రోజు కనిపించకపోవచ్చు. కానీ దాని ప్రయత్నాలను మనం విస్మరించకూడదు. అందువలన మనకు ఎదురైన వాటి గురించి ఎవరైనా, ప్రతివారూ దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. వార్తా పత్రికలు, టీవీ ఛానల్స్‌ రాజకీయ పార్టీల శాఖలుగా తయారయ్యాయి. రాజకీయ పార్టీల ప్రధాన కార్యదర్శుల కంటే యాంకర్లు ఇప్పుడు ఎక్కువ అధికారం కలిగి వున్నారు. ఈ నూతన నిర్మాణాలపై ప్రతి ఒక్కరూ పోరాడకుండా నూతన రాజకీయ ఆలోచనలు ఒక రూపం తీసుకోవు. జరుగుతున్న వాటిని నేనెందుకు ప్రశ్నించాలి అనే విధంగా ప్రతి వారి బుర్రలను తయారు చేసే విధంగా ఆధిపత్యం వహించటంలో వారు కృతకృత్యులయ్యారు. ఎవరైతే సిరా చల్లుతారో వారిని పార్టీ అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నారు. ఎవరైతే సిరాతో రాస్తారో వారు కేవలం ప్రచారంలో మాత్రమే పొల్గొంటున్నారు. వర్తమాన జర్నలిజం వర్తమాన ప్రచారంగా మారింది.

అయితే సాధ్యమయ్యేవాటిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న జర్నలిస్టులను మనం ఎలా విస్మరించగలం? ఈ అవకాశాలు చివరికి అంతరించుతాయి కానీ వారి వారసత్వ సొత్తు మాత్రం భవిష్యత్‌లో మనకు సాధికారతనిస్తుంది. ఈ జర్నలిస్టులు ఎప్పుడైతే ఇచ్చకాలమారితనంతో అలసి పోతారో లేదా వంచన ద్వారా ఓడిపోతారో అప్పుడు తమ గాఢనిద్ర నుంచి మేలుకుంటారు. ఈ అశాభావాలు మరియు అవకాశాలే వారిని రక్షిస్తాయి. అందుకే మన ఆశలను, అవకాశాలను కొనసాగించాలని నేను అంటాను. ఈ రోజులను ఇంద్ర ధనుస్సు వంటి ఆశలతోనో లేదా వైఫల్య దృష్టితోనో చూడవద్దు. మనం ఒక పెద్ద ఇంజను వస్తున్న రైల్వే లైనుపై వున్నాం, పారిపోవటానికి లేదా మనల్ని మనం రక్షించుకోవటానికి గాని సమయంలేని స్ధితిలో వున్నాము. ఆశ లేదా వైఫల్యానికి గాని అవకాశం లేదు. మనం స్వయంగా రంగంలోకి దిగాలి. మనకు సమయం తక్కువగా వుంది దాని వేగం ఎక్కువగా వుండాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎన్‌డిటివీపై నిషేధం- అసంబద్ద వాదనలు !

08 Tuesday Nov 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, emergency, Free press, Modi, ndtv, ndtv ban, press freedom, un declared emergency

మీడియా స్వేచ్ఛకు ప్రమాద ఘంటికలు

ఎం కోటేశ్వరరావు

    చచ్చిన చేప వాగు వాలున కొట్టుకుపోతుంది. బతికున్న చేప మాత్రమే ఎదురు ఈదుతుంది. దేన్నయినా ప్రశ్నిస్తేనే రచ్చ, చర్చ ప్రారంభమౌతుంది. ఫలానా రోజు ఫలానా చర్యను ఎందుకు ప్రశ్నించలేదు, దీన్ని మాత్రమే ఇప్పుడు ఎందుకు తప్పు పడుతున్నారు అంటే కుదరదు. హేతుబద్దత లేకుండా అసంబద్ధతో మరొకటో వుంటేనే ఎవరైనా నిలదీస్తారు. సమర్ధించుకోవటానికి సరైన కారణాలు దొరకనపుడే చర్చను పక్కదారి పట్టించేందుకు చూస్తారు. వ్యూహాత్మకమైన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారని ఆరోపించి ఎన్‌డిటివీ హిందీ ఛానల్‌ ప్రసారాలను నవంబరు తొమ్మిది-పది తేదీలలో ఒక రోజంతా నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం దండన విధించింది. అత్యవసర పరిస్థితి పేరుతో కాంగ్రెస్‌ నియంతృత్వ పోకడలను వ్యతిరేకించిన ఘనత తమకు వుందని కమలనాధులు తరచూ చెప్పుకుంటారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించటానికి ఒక కారణం, చట్టమూ, అధికారమూ కావాలి. కానీ అనధికారికంగా అమలు జరపటానికి అధికారం వుంటే చాలని నేటి కేంద్ర ప్రభుత్వం ఆచరణలో చూపింది. హేతుబద్దంగా ఆలోచించే వారందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించి నిషేధం ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఒక రోజు నిషేధం మీడియా స్వేచ్చకు, ప్రజాస్వామ్యానికి ముప్పని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి సమయంలో కాంగ్రెస్‌ నేతల మాదిరి తమ చర్యను సమర్ధించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి నాయకులు పెద్ద ఎత్తున ఎదురుదాడులకు పూనుకున్నారు. తమ ద్వంద్వ స్వభావాన్ని బయట పెట్టుకున్నారు.జనానికి విచక్షణా జ్ఞానం వుంటుందనే అంశాన్ని కూడా మరచిపోయి అసంబద్ద వాదనలను ముందుకు తెస్తున్నారు.

    కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌డిటివీ యాజమాన్యం సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దీంతో పాటు దేశ, విదేశాలలో నిరసన,మోడీ సర్కార్‌ అప్రజాస్వామిక చర్యపై విమర్శలతో భయపడిన కేంద్రం నిషేధం విషయమై ప్రభుత్వానికి విన్నవించిన కారణంగా ఎన్‌డిటివీ వాదనలు చెప్పుకొనేందుకు మరో అవకాశం ఇస్తున్నామంటూ నిషేధ నిర్ణయం అమలును వాయిదా వేసుకుంది. రద్దు చేయలేదు. ఈ ప్రకటన చేయబోయే ముందు సాయంత్రం వరకు నిషేధాన్ని సమర్ధించిన సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు రాత్రికి నిషేధాన్ని నిలిపివేసినట్లు అధికారుల చేత ప్రకటన చేయించారు. నవంబరు ఎనిమిదవ తేదీన ఎన్‌డిటివీ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన ఇద్దరు జడ్జీల సుప్రీం కోర్టు బెంచ్‌ తదుపరి విచారణను డిసెంబరు ఐదవ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం విధించిన నిషేధం అమలును వాయిదా వేసినందున ప్రసారంపై అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని వుభయపక్షాల అంగీకరించటంతో కోర్టు వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు ఈ వివాదం మరొక మలుపు తిరిగింది.

    సమస్య తాత్కాలికంగా సర్దుమణిగింది, నిషేధాన్ని వాయిదా వేశారు తప్ప ఎత్తివేయలేదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకీ చర్యకు పాల్పడింది. మీడియా, ప్రజాస్వామిక వాదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పర్యవసానాలేమిటి ? ఎప్పటి మాదిరే దీనిపై కూడా ప్రధాని నరేంద్రమోడీ ఈ వ్యాసం రాసే సమయం వరకు నోరు విప్పలేదు. కనీసం ట్విటర్‌ ద్వారా కూడా స్పందించలేదు. మన్‌కీ బాత్‌లో ఏమైనా బయటపడతారో లేదో చూడాలి. తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై నోరు విప్పకపోవటం నరేంద్రమోడీ వ్యవహార శైలి అన్నది గత రెండున్నర సంవత్సరాల అనుభవం రుజువు చేసింది.

    ప్రతి తరం అత్యవసర పరిస్థితి నాటి కాలాన్ని నిష్పక్షపాతంగా చూస్తే మరొక నేత ఎవరూ అటువంటి తప్పు చేయాలన్న తలంపుకే రారు అని ప్రధాని నరేంద్రమోడీ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక అవార్డుల సభలో వుద్బోధ చేశారు. చిత్రంగా ఆ మరుసటి రోజే అత్యవసర పరిస్థితిని ప్రకటించకుండానే ఎన్‌డిటివీపై ఆ కాలం నాటి నిరంకుశ వైఖరిని ప్రతిబింబిస్తూ ఒక రోజు నిషేధం విధించటం గమనించాల్సిన అంశం. నరేంద్రమోడీకి తెలియకుండానే ఇది జరిగిందా అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. ఇదొక ముఖ్యపరిణామం, అందునా మోడీ అంతరంగం అందరికంటే బాగా ఎరిగిన వెంకయ్య నాయుడు శాఖ, మీడియా స్వేచ్చకు సంబంధించింది, దీని పర్యవసానాల గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు అని ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రక్షణ, హోం, తదితర అంతర మంత్రిత్వశాఖల కమిటీ సిఫార్సుల మేరకు నవంబరు 9వ తేదీ అర్ధరాత్రి నుంచి పదవ తేదీ అర్ధరాత్రి వరకు కార్యక్రమాల ప్రసారాన్ని నిషేధించారు. ఈ ఏడాది జనవరి రెండు నుంచి ఐదువ తేదీ వరకు పఠాన్‌కోట్‌ సైనిక కేంద్రంపై పాకిస్ధాన్‌ వైపు నుంచి ప్రవేశించిన తీవ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఆ దాడికి సంబంధించి జనవరి నాలుగవ తేదీన ఎన్‌డిటివి ప్రసారం చేసిన అంశాలలో మన రక్షణ రహస్యాలను బహిర్గతం చేశారని ప్రభుత్వం ఆరోపించింది. అందుకు గాను 30 రోజుల పాటు నిషేధం విధించాల్సి వున్నప్పటికీ ఒక రోజుకు పరిమితం చేసినట్లు తెలిపింది.ఈ చర్య మీడియా స్వేచ్ఛను ప్రత్యక్షంగా వుల్లంఘించటమే అని, అత్యవసర పరిస్థితి నాటి అవశేషమిదని కూడా భారత సంపాదకుల మండలి (ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా) పేర్కొన్నది.

     జనవరి నాలుగవ తేదీన ఎన్‌డిటివి వార్తలను ప్రసారం చేయగా 29వ తేదీన సమాచార, ప్రసార శాఖ సంజాయిషీ నోటీసు జారీ చేసింది. వ్యూహాత్మకంగా రహస్యమైన సమాచారాన్ని ప్రసారం చేసినందున భద్రతా దళాలు చేపట్టిన ప్రతిక్రియలను అడ్డుకొనేందుకు నేరం చేసిన వారు వుపయోగించుకొనే అవకాశం వున్నందున, అది నిబంధనలకు విరుద్దమైనందునా ఎందుకు ప్రసారం చేశారో సంజాయిషీ ఇవ్వాలని దానిలో కోరింది.2015లో సవరించిన 1995 కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌(నియంత్రణ) చట్టం ప్రకారం భద్రతా దళాలు చేపట్టే ఏ విధమైన వుగ్రవాద నిరోధక చర్యలనైనా ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఆ చట్టం నిర్దేశించిన ప్రసార స్మృతిలో పేర్కొన్నారు. పఠాన్‌కోట్‌ వైమానిక స్ధావరంపై పాకిస్తాన్‌ నుంచి వచ్చిన వుగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు మిలిటరీ జవాన్లు, ఒక పౌరుడు మరణించారు. తీవ్రవాదులు దాడి కొనసాగుతుండగానే జనవరి నాలుగున ఎన్‌డిటివి రిపోర్టర్‌ ఆ వార్తలో చెప్పిన అంశం ఇలా వుందని ప్రభుత్వం పేర్కొన్నది.’ ఇద్దరు మిలిటెంట్లు ఇంకా సజీవంగానే వున్నారు, వారు మందుగుండు సామగ్రి డిపో పక్కనే వున్నారు. మిలిటెంట్లు మందుగుండు సామగ్రి డిపోను చేరుకున్నట్లయితే వారిని నిర్వీర్యం చేయటం కష్టమౌతుందని దాడిని ఎదుర్కొంటున్న జవాన్లు ఆందోళన చెందుతున్నారు.’ అని వ్యాఖ్యానించారని, ఆ ప్రసారంలో వైమానిక స్ధావరం గురించి కూడా సమాచారాన్ని వెల్లడించారంటూ ‘ దానిలో మిగ్‌ యుద్ధ విమానాలు, రాకెట్‌ లాంచర్లు, మోర్టార్లు, హెలికాప్టర్లు, ఇంధన నిల్వలు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు వున్నాయని కూడా పేర్కొన్నట్లు ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో తెలిపింది.ఈ సమాచారాన్ని స్వయంగా టెర్రరిస్టులు లేదా వారిని ప్రయోగిస్తున్నవారు గానీ వుపయోగించుకోవచ్చని పేర్కొన్నది.

  చట్టం ముందు ఎన్‌డిటివీగానీ మరొక ఛానల్‌ గాని అమలులో వున్న నిబంధనలను పాటించాలనటంలో ఎలాంటి విబేధం లేదు, ఎవరూ అందుకు విరుద్ధంగా మాట్లాడటం లేదు. ఎవరైనా అలా చేస్త్తే చర్యతీసుకోవాలి, చట్టం తనపని తాను చేసుకుపోతుంది. అందుకు కోర్టులు, చట్టాలున్నాయి. చట్ట ప్రకారం తప్పుచేస్తే అందరికీ దండన విధించాలి. ఎన్‌డిటివీ, దానిపై విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న సంపాదకుల మండలి, ప్రయివేటు టీవీ ఛానల్స్‌ సభ్యులుగా వున్న నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ ఇతర అనేక జర్నలిస్టు సంఘాల అభ్యంతరం కూడా అలాంటి వార్తలనే ఇచ్చిన ఇతర సంస్ధలపై ఎలాంటి చర్య తీసుకోకుండా ఒక్కదానిపై మాత్రమే దండన ఎందుకు విధిస్తున్నారన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. ఏదైనా ఒక శిక్ష అది చిన్నదా పెద్దదా అనేదానితో నిమిత్తం లేకుండా తగిన అధికారాలుగల సంస్ధ లేదా పదవిలో వున్నవారు మాత్రమే విధించాలి. కానీ శిక్ష విధించే అధికారాన్ని సమాచార,మంత్రిత్వశాఖ తనకు తాను పుచ్చుకోవటం ఏమిటని కూడా మీడియా సంస్ధలు సవాలు చేశాయి.

    ప్రభుత్వం జారీ చేసిన నోటీసుకు ఫిబ్రవరి ఐదున ఎన్‌డిటివీ సమాధానమిచ్చింది. తమ వార్త బాధ్యతాయుతంగా,సముచితంగా వుందని, వార్తలో పేర్కొన్న అంశాలు తాము ప్రసారం చేయటానికి ముందే వార్తా పత్రికలలో వచ్చాయని తెలిపింది. వాటికి సంబంధించిన వివరాలను కూడా ప్రభుత్వానికి తెలిపింది. జనవరి మూడవ తేదీన ఐఎఎన్‌ఎస్‌ (వార్తా సంస్ధ) ఇచ్చిన వార్తను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిందని, దానిలో ‘మిగ్‌ 21 యుద్ధ విమానాలు, ఎంఐ 35 యుద్ధ హెలికాప్టర్లు, ఇతర ముఖ్యమైన సొత్తు ‘ వైమానిక స్ధావరంలో వుందని దానిలో పేర్కొన్నారు. జనవరి మూడున టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో వుపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, నిఘారాడార్లు వున్నాయని తెలిపారు. జనవరి నాలుగున ఒక సైనిక బ్రిగేడియర్‌ను వుటంకిస్తూ హిందుస్తాన్‌ టైమ్స్‌ పత్రిక ‘ ఇద్దరు వుగ్రవాదులు ఒక రెండంతస్ధుల భవనంలో వుండిపోయారని, అక్కడ వైమానిక దళ సిబ్బంది నివాసముంటారని ‘ పేర్కొన్నది. వాటిపై తీసుకోని చర్య తమకు ఎలా వర్తిస్తుందని ఎన్‌డిటివీ ప్రశ్నించింది.

     నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌బిఏ) సెక్రటరీ జనరల్‌ ఆనీ జోసెఫ్‌ ఒక ప్రకటన చేస్తూ ప్రభుత్వ చర్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వార్తలను ఇతర మీడియా కూడా ఇచ్చిందని అవన్నీ బహిరంగంగా అందుబాటులోనే వున్నాయని పేర్కొంటూ ఎన్‌డిటివీ ఒక్కదానిపైనే చర్య తీసుకోవటం ఆశ్చర్యంగా వుందన్నారు. అంతర మంత్రిత్వ శాఖల కమిటీ, సమాచార మంత్రిత్వశాఖ ఈ అంశాన్ని కేబుల్‌ చట్టంలోని పక్కా నిబంధనల మేరకు గాక రాజ్యాంగంలో హామీ ఇచ్చిన మీడియా స్వేచ్చ కోణం నుంచి చూడాలని, ఒక వేళ ఎన్‌డిటివీ నిబంధనలను వుల్లంఘించిదనుకుంటే ఆ విషయాన్ని ఎన్‌బిఏ ఏర్పాటు చేసిన స్వయం నియంత్రణ సంస్ధ న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్స్‌ అధారిటీ (ఎన్‌బిఎస్‌ఏ)కు నివేదించి వుండాల్సిందని, ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని ఎన్‌బిఏ కోరింది.

   ప్రభుత్వ నిర్ణయం అసాధారణమైందని ఖండిస్తూ తక్షణమే వెనక్కు తీసుకోవాలని భారత సంపాదకుల మండలి కోరింది.’ ఒక ఛానల్‌ను ఒక రోజు పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకోవటం మీడియా, తద్వారా దేశ పౌరుల స్వేచ్చపై ప్రత్యక్ష వుల్లంఘన, అంతేకాదు కఠినమైన సెన్సార్‌షిప్పును విధించటం అత్యవసరపరిస్థితి నాటి అవశేషమే. వార్తలు ఇచ్చిన తీరుతో ఎప్పుడైనా ప్రభుత్వం అంగీకరించకపోతే మీడియా పనిలో జోక్యం చేసుకొనే అధికారాన్ని స్వయంగా పుచ్చుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రసారాలను నిలిపివేయటం ఇదే మొదటిసారి. బాధ్యతా రహితంగా వార్తలను ఇచ్చినపుడు పౌరులు, రాజ్యానికి కోర్టు ద్వారా చర్యలు తీసుకోవటానికి చట్టపరమైన పలు పరిష్కార మార్గాలు వున్నాయి. న్యాయపరమైన జోక్యం లేకుండా నిషేధం విధింపు స్వేచ్చ, న్యాయమనే ప్రాధమిక సూత్రాలను వుల్లంఘించటమే.’ అని తన ప్రకటనలో పేర్కొన్నది. బ్రాడ్‌కాస్టర్స్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ కూడా ఒక ప్రకటన చేసింది.నిషేధం విధించటం భావ ప్రకటనా స్వేచ్చను వుల్లంఘించటమే అని, నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని కోరింది. ఈ వుదంతంపై తరువాత ఒక సమగ్రనివేదికను తయారు చేస్తామని తెలిపింది.

     ఎన్‌డిటీవిపై నిషేధాన్ని మీడియా రంగానికి చెందిన ఎడిటర్స్‌ గిల్డ్‌, బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌, అనేక జర్నలిస్టు సంఘాలు వ్యతిరేకించాయి. కారణాలు ఏమైనప్పటికీ కొంత మంది మౌనం పాటించారు. నిషేధాన్ని విమర్శిస్తే కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్‌డియే పక్షాల రాష్ట్ర ప్రభుత్వాలకు కోపం వస్తుందని కావచ్చు, కొన్ని మీడియా సంస్ధలు ఆ విషయాన్ని ప్రచురించకుండా లేదా అప్రాధాన్యత ఇచ్చిగానీ మొత్తం మీద ఏదో తప్పనిసరై వార్త ఇవ్వాల్సి వచ్చిందిగానీ ప్రభుత్వానికి మేం వ్యతిరేకం కాదన్న సందేశాన్ని చేరవేశాయి. జెఎన్‌యు విద్యార్ధుల జాతీయ వ్యతిరేక నినాదాల ఆరోపణల గురించి నకిలీ వీడియోలను ప్రసారం చేసిన జీ మీడియా , ప్రముఖ పారిశ్రామిక సంస్ధ ఎస్సెల్‌ గ్రూప్‌ అధిపతి, రాజ్యసభ సభ్యుడిగా వున్న సుభాష్‌ చంద్ర మాత్రం ఎన్‌డిటివీని ఒక రోజు నిషేధించటం అన్యాయం, చిన్న శిక్ష , అసలు పూర్తిగా నిషేధించాలని ప్రకటించారు. ఒక వేళ అది కోర్టుకు వెళ్లినా అక్కడ చీవాట్లు తింటుందని కూడా ముందే చెప్పారు. అంతేకాదు, యుపిఏ హయాంలో తమ జీ న్యూస్‌ను నిషేధించాలనే ప్రతిపాదన వచ్చినపుడు మేథావులు, ఎడిటర్స్‌ గిల్డ్‌, ఎన్‌డిటివీ కూడా మౌనం వహించాయని కూడా సుభాష్‌ చంద్ర పేర్కొన్నారు.

    నిబంధనలను వుల్లంఘించినందుకు గాను ప్రభుత్వం 2005 నుంచి 28సార్లు ఇలా నిషేధ నోటీసులు జారీ చేసిందని వాటిలో 21 యుపిఏ హయాంలో జారీ అయినవే అని అధికారుల ద్వారా ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకొనేందుకు చూసింది. దానిలో భాగంగానే ఎన్‌డిటీవీ తరువాత మరో రెండు ఛానల్స్‌పై తీసుకున్న చర్యలను వెల్లడించింది. ఇది జనాన్ని తప్పుదారి పట్టించే ఎత్తుగడ. నిబంధనలను వుల్లంఘించి అన్ని ఛానల్స్‌, పత్రికలపై చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టటం లేదు. ఒకే తప్పు చేసిన మిగతావారిని వదలి ఒక్క ఎన్‌డిటివీపై మాత్రమే ఎందుకు చర్య తీసుకున్నారు? అన్నదే ప్రశ్న. గతంలో చర్యలు తీసుకున్నపుడు ఆయా ఛానల్స్‌ నిషేధాన్ని సవాలు చేయలేదు. అంటే అవి తప్పు చేసినట్లు అంగీకరించినట్లే. వాటిలో బూతు దృశ్యాలను చూపించిన కేసులు కూడా వున్నాయి.

    మీడియాలోని ప్రభుత్వ భక్తులు కొందరు విచిత్ర వాదనలను ముందుకు తెస్తున్నారు. భారత్‌లో మీడియా స్వేచ్చ తక్కువగానే వుందని చెబుతారు. అయితే అంటూ చైనా, బంగ్లాదేశ్‌, టర్కీ వంటి దేశాలలో ఇంతకంటే దారుణంగా వున్నాయనే వాదనలను ముందుకు తెస్తున్నారు.అంటే నిషేధాన్ని సమర్ధిస్తున్నట్లా ? మనకు కావాల్సిన నేత ఎలా వుండాలంటే ఎవరైనా గాంధీ గురించి చెబుతారు తప్ప అనేక మందితో పోల్చితే గాడ్సే మంచివాడే అన్నట్లుగా వుంది ఈ సమర్ధన. మన కంటే పత్రికా స్వేచ్చ మెరుగ్గా వున్న దేశాలతో పోల్చుకుంటే మనం ఎక్కడ ? ఇలాంటి చర్యలతో మనం ఎక్కడకు పోతున్నాం అన్నది ప్రశ్న.

    తన తప్పుడు చర్యను సమర్ధించుకొనేందుకు ప్రభుత్వం అనేక అసంబద్ద కారణాలను చూపుతోంది. టీవీ ఛానల్స్‌లో విలేకర్లు చెప్పిన సమాచారాన్ని వుగ్రవాదులు వుపయోగించుకొని దాడులు చేసే ప్రమాదం వుందట. వెనుకటి కెవడో అమాయకుడు నా పేరు ఫలానా రెడ్డి నీకు తెలివి వుంటే నా కులం ఏమిటో కనుక్కో అన్నాడట. ఏ దేశంలో అయినా సైనిక శిబిరాలలో సైనికులు, ట్యాంకులు, విమానాలు, మందుగుండు సామాగ్రి వుంటుందని వేరొకరు చెప్పాల్సిన అవసరం వుంటుందా ? అంతెందుకు మన ప్రభుత్వం ప్రకటించినట్లు మన సైన్యం జయప్రదంగా నిర్వహించిన సర్జికల్‌ దాడులు ఎక్కడ జరపాలో మన సైన్యం ఏ టీవీ, పత్రికా వార్తలను చూసి నిర్ణయించుకుందో ఎవరైనా చెప్పగలరా ? గూగుల్‌ మాప్‌లను చూస్తే ఎక్కడ ఏ సంస్ధలు వున్నాయో, ఎలా వెళ్లాలో కూడా ప్రపంచానికంతటికీ తెలుసు. అయినా దాడికి తెగబడిన వుగ్రవాదులు గానీ లేదా వారిని అంతంచేసేందుకు పూనుకున్న సాయుధ బలగాలు గానీ టీవీ వార్తలు చూసి తమ దాడి, ప్రతిదాడి వ్యూహాలను నిర్ణయించుకుంటారా ? ప్రభుత్వ వాదన ప్రకారమైతే దాడులకు ఒక చేత్తో ఆయుధం, మరో చేత్తో టీవీ పట్టుకోవాలి. పోనీ టీవీలో ఒక ఛానల్‌ కాదుగా అనేక ఛానల్స్‌ వుంటాయి. ఏ ఛానల్‌ ఏ సమాచారం తెలుస్తుందో రిమోట్‌లు నొక్కుతూ కాలక్షేపం చేస్తారా ? ఫఠాన్‌ కోట సైనిక శిబిరంపై దాడికి తెగబడ్డ వుగ్రవాదులను అంతం చేసిన మన సైన్యం వారి శవాల వద్ద టీవీ సెట్లు వున్నట్లు చెప్పలేదు. అత్యాధునికమైన ఇతర పరికరాలతో వారు ప్రవేశించినట్లు కదా ప్రకటించారు.

     ఒక వుదంతం గురించి దాదాపు ఒకే విధంగా వార్తలు ఇచ్చిన పత్రికలు, ఛానల్స్‌లో ఒక్క సంస్ధను మాత్రమే వేరు చేసి చర్య తీసుకోవటం వెనుక ఇతర కారణాలు వున్నాయా ? మోడీ సర్కార్‌ వివక్షను ప్రదర్శించిందా ? ఢిల్లీలోని ఆంగ్ల పత్రికలు, న్యూస్‌ ఛానల్స్‌ తమ పార్టీకి వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ అన్యాపదేశంగా గతంలో తరచూ ఆరోపించేది. ఇప్పుడు కూడా మీడియా పట్ల ఆ పార్టీ, దాని మిత్రపక్షాలకు సదభిప్రాయం లేదు. విమర్శనాత్మకంగా వుండటమే దానికి కారణం.విలేకర్లను ప్రెస్టిట్యూట్స్‌ అని ఏకంగా కేంద్రమంతి వికె సింగ్‌ నిందించారు. ఇంతకాలమైనా ప్రధాని నరేంద్రమోడీ మీడియాను కలవకుండా తప్పించుకోవటానికి ఆంగ్ల భాషా సమస్యతో పాటు ఇదొక కారణమని కూడా చెబుతారు.

    ఎన్‌డిటివీ విషయానికి వస్తే ఆ ఛానల్‌ అన్నా, దానిలో పనిచేసిన కొందరు జర్నలిస్టులన్నా నరేంద్రమోడీకి పడదు. బిజెపికి వీరాభిమాని అయిన జర్నలిస్టు, రచయిత్రి అయిన మధు కిష్వెర్‌ 2013లో మోడీ నామా పేరుతో తన పత్రికలో నరేంద్రమోడీ గురించి ఆకాశానికెత్తుతూ అనేక వ్యాసాలు రాశారు, తరువాత వాటిని పుస్తకంగా ప్రచురించారు.2014లో ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ఆమెకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఇద్దరు జర్నలిస్టులు బర్ఖాదత్‌, రాజదీప్‌ సర్దేశాయి కారణంగానే 2002లో గుజరాత్‌లో ఘర్షణలు చెలరేగాయని మోడీ ఆరోపించారు. ‘తొలి 72 గంటలు(నాలుగు రోజులు) ఘర్షణలు అదుపులో వున్నాయి. తరువాత ఏమైంది ? కొన్ని సంఘటనలను జర్నలిస్టులు సంచలనాత్మకం గావించారు. సూరత్‌ నుంచి బర్ఖాదత్‌, ఒక దేవాలయ్యాన్ని విధ్వంసం చేశారని అంజార్‌ నుంచి సర్దేశాయి ప్రత్యక్ష ప్రసారాలలో వార్తలను అందించారు. సూరత్‌ నగరం ప్రశాంతంగా వుందని, అక్కడ పోలీసులెవరూ లేనందున అలజడులు జరిగే అవకాశముందని బర్ఖాదత్‌ పదే పదే చెప్పారని, ఆమెను పిలిచి మీరు విధ్వంసకారులను సూరత్‌కు ఆహ్వానిస్తున్నారా అని నిలదీశానని, ఆరోజే ఆ ఛానల్‌ను తాను నిషేధించానని మోడీ చెప్పారు. అయితే తరువాత తానసలు సూరత్‌ వెళ్లలేదని బర్ఖాదత్‌ వివరణ ఇచ్చారని వార్తలు వచ్చాయి. నిజానికి గుజరాత్‌ మారణకాండ సందర్భంగా అనేక ఛానల్స్‌ సంచలనాత్మక కధనాలు ఇచ్చినప్పటికీ నరేంద్రమోడీ వాటిని పట్టించుకోలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ఒక్క ఎన్‌డిటీవితో తప్ప ఇతర అన్ని ఛానల్స్‌కు ఇంటర్వూ ఇచ్చారు.

    ఇటీవలి కాలంలో ఢిల్లీ జెఎన్‌యు ఘటనలు, గుజరాత్‌లో అమిత్‌ షా సభను ఆటంక పరిచిన పటేళ్ల ఆందోళన, దళితులపై దాడులకు వ్యతిరేకంగా జరిగిన జరిగిన యాత్ర, గుజరాత్‌ దళితనేత జిగ్నేష్‌ మేవానీ, గుజరాత్‌లో అమ్‌ పార్టీ నేత కేజిరీవాల్‌ సభ గురించి బిజెపి, నరేంద్రమోడీ అండ్‌కోకు నచ్చని రీతిలో ఎన్‌డిటివీ వార్తలను ప్రసారం చేసింది. జెఎన్‌యు ఘటనల సందర్భంగా కొన్ని టీవీ ఛానల్స్‌ వ్యవహరించిన తీరును ఎండగడుతూ ఎన్‌డిటివీ హిందీ ఛానల్‌ అరగంటపాటు బొమ్మలు లేకుండా కేవలం అక్షరాలనే ప్రదర్శించి తనదైన శైలిలో వ్యవహరించింది. ఇది కూడా బిజెపి నేతలకు ఆగ్రహం తెప్పించింది. పాలకపార్టీ, ప్రభుత్వ తీరుతెన్నులను బహిర్గత పరుస్తున్న కారణంగానే ఎన్‌డిటివీ యాజమాన్య నిర్వహణ, ఆర్ధిక వ్యవహారాల గురించి వేధింపులకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. టేకోవర్‌ నిబంధనలను సరిగా పాటించలేదంటూ సెబి, విదేశీ మారక ద్య్రవ నిబంధనలను వుల్లంఘించారంటూ ఎన్‌ఫోర్స్‌డైరెక్టరేట్‌ ద్వారా ఒక నోటీసు పంపి వేధింపులకు పూనుకుందన్న విమర్శలు వున్నాయి.

    భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని వుపయోగించి అధికారుల ద్వారా ఈ విధమైన వేధింపులకు పాల్పడటంతో పాటు ఎన్‌డిటివీపై తన అనుచరగణాన్ని వుసిగొల్పి సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున దాడి చేయిస్తున్నది. ఇది ఒక విధంగా బ్లాక్‌ మెయిలింగ్‌ ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఒక సంస్ధ తప్పు చేస్తే దానిపై ఫిర్యాదు చేయవచ్చు, కేసులు దాఖలు చేయవచ్చు. కానీ ఆ సంస్ధలలో పనిచేస్తున్న సిబ్బంది వ్యక్తిగత జీవితాలపై సామాజిక మీడియాలో ప్రచారం చేయటం హేయం. అది ముదిరితే ఏదో ఒకనాటికి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు బిజెపి, దాని నేతలపైన కూడా దానిని ప్రయోగిస్తారని వారు తెలుసుకోవటం లేదు. వారు ఒక్క జర్నలిస్టుల గురించే కాదు, తమను వ్యతిరేకించే వారందరి పట్ల ఇదే విధంగా వ్యవహరిస్తారనే విమర్శ వుంది. స్వంత పార్టీలోనే నరేంద్రమోడీని వ్యతిరేకించిన సంజయ్‌ జోషి ఒక మహిళతో వున్నట్లు చూపే బూతు సీడీలను ఆ పార్టీ వారే పంపిణీ చేయించారనే విమర్శలు వున్న విషయం తెలిసిందే. ఆ సంజయ్‌ జోషికి తిరిగి పార్టీలో పదవి ఇచ్చినందుకు గాను పదవి నుంచి తొలగించే వరకు తాను పార్టీ సమావేశాలకు రానని 2009లో నరేంద్రమోడీ బెదిరించిన విషయం, అందుకు పార్టీ తలొగ్గిన విషయం తెలిసిందే. అందువలన ఒక ఛానల్‌, ఒక పత్రికపై జరుగుతున్న దాడిగా దీనిని చూస్తే రాబోయే ముప్పును విస్మరించినట్లే. అధికారంలో వున్న పార్టీ ఈ విధంగా తనకు నచ్చని మీడియాను వేధించటమంటే లొంగదీసుకొని భజన చేయించుకొనేందుకే తప్ప మరొకటి కాదు. ఈ రోజు ఒక పార్టీ అధికారంలో వుంటే రేపు మరొక పార్టీ రావచ్చు. అప్పుడు మరికొన్ని ఛానల్స్‌, పత్రికల పని పట్టవచ్చు. తెలంగాణాలో ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌ను కేబుల్‌ ఆపరేట్ల ద్వారా అడ్డుకోవటాన్ని ఖండించిన తెలుగు దేశం పార్టీ తాను అధికారంలో వున్న ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి ఛానల్‌ను కూడా అదే పద్దతుల్లో అడ్డుకున్న విషయం చూశాము. ఆంధ్రజ్యోతిని అడ్డుకున్నపుడు సాక్షి మౌనం వహిస్తే సాక్షిపై దాడి జరిగినపుడు ఆంధ్రజ్యోతి కూడా అదే పని చేసింది. ఇది మీడియాలో అవాంఛనీయ పోకడ. యాజమాన్యాల వైఖరి కారణంగా ఆయా సంస్ధలలో పని చేసే జర్నలిస్టులు ఇరకాటంలో పడుతున్నారు. యాజమాన్యాలతో పాటు వారిని కూడా శత్రువులుగా చూస్తున్నారు. ఇప్పుడు ఎన్‌డిటీవి విషయంలో కూడా కొన్ని మీడియా యాజమాన్యాల వైఖరి అలాగే వుంది. పాలకపార్టీలకు ముఖ్యంగా అన్ని వ్యవస్ధలను తమ చెప్పుచేతల్లో వుంచుకోవాలని చూస్తున్న శక్తులకు కావాల్సింది ఇదే. ముందు విమర్శనాత్మకంగా వున్న వాటిని తొక్కిపెడితే మిగిలిన వాటిని అదుపు చేయటం వాటికి చిటికెలో పని. అందుకే జర్నలిస్టులు యాజమాన్యాల వైఖరితో నిమిత్తం లేకుండా స్వతంత్ర వైఖరిని కలిగి వుండి, మీడియా, తద్వారా భావ ప్రకటనా స్వేచ్చపై జరిగే దాడిని ఎదుర్కోవటంలో ముందుండటం అవసరం.

గమనిక :నవంబరు నెల వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి మాస పత్రికలో ప్రచురణ నిమిత్తం రాసినది

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d