• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: vedas

వేదాలను ప్రశ్నించిన మహాకవి వేమన కూడా జాతి వ్యతిరేకి, కమ్యూనిస్టేనా ?

02 Wednesday May 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., Opinion, RELIGION

≈ 1 Comment

Tags

ANTI NATIONAL, communal forces, communalism, communist, everything lies in veda’s only, Religious Fundamentalists, vedas, Vemana

ఎం కోటేశ్వరరావు

వేదాల్లో అన్నీ వుంటే మన వారెందుకు విదేశాలకు పరుగులు తీస్తున్నట్లు అన్న శీర్షికతో నేను రాసిన వ్యాసంపై సామాజిక మాధ్యమంలోని ఫేస్బుక్‌లో సంస్కారయుతంగా స్పందించిన వారందరికీ ఒక దండం, అనాగరికంగా స్పందించిన వారికి వంద దండాలు. చర్చలో లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు స్పందించటం కనీస ధర్మంగా భావిస్తున్నా.

‘వేదాలు ఎందరు చాడుతున్నారు కమ్మీ’

జ: దీనిలో చాడు ను వాడు గా అనుకున్నా కమ్మీ అనే తిట్టు తప్ప ప్రశ్న అర్ధం కాలేదు.

‘ అబ్బే అన్నీ దాస్‌ కాపిటల్‌ లోనే ఉన్నాయి పోయి చదువుకోండి.’

జ: అంత వుక్రోషం వద్దులే మిత్రమా ! ప్రపంచంలో వేదాలు చదువుతున్న వారి కంటే దాస్‌ కాపిటల్‌ చదివేవారే ఎక్కువ . గత పది సంవత్సరాలుగా ధనిక దేశాలలో వచ్చిన సంక్షోభం తరువాత మరీ ఎక్కువగా చదువుతున్నారని వార్తలు. ప్రపంచంలో దాస్‌ కాపిటల్‌ చదివి తిరుగుబాట్లు చేశారు. వేదాలు చదివిన వారు అగ్రహారాలకే పరిమితం అయ్యారు , వాటిని కూడా సంస్కరించుకోలేకపోయారు అన్నది అంగీకరించక తప్పదు మరి. ఇదే సమయంలో ఒక కాలపు సాహిత్యంగా చరిత్రలో వేదాలకు స్ధానం వుంది.

‘రిజర్వేషన్‌ వల్ల రా కమ్మి. నీ వయసు కి విలువ ఇవ్వాలంపియట్లేదు’

జ: రిజర్వేషన్ల వ్యతిరేకత కనిపిస్తోంది. వేదాలు- మనువాదం రెండింటినీ విడదీయలేము. ప్రపంచంలో ఎక్కడా లేని రిజర్వేషన్ల విధానం రావటానికి జనాభాలో ఐదో వంతుగా వున్న దళిత, గిరిజనులను వేల సంవత్సరాలుగా అంటరాని వారిగా చూసినందువల్లనే ఇవి వచ్చాయి. ఆ దురాచారాన్ని రూపు మాపి వారిని కూడా తోటి మానవులుగా గుర్తించినపుడు రిజర్వేషన్లు వుండవు. కానీ ఇప్పుడు ఆధునిక మనువాదులు అంటరాని తనం వుండాలి, రిజర్వేషన్లు పోవాలి అంటున్నారు. ఇక నా వయస్సు, ఫేస్‌బుక్‌లో నేనే వివరాలు పెట్టాను, అందరికీ ఆధైర్యం వుండదు, అనేక మంది ఫేక్స్‌ వున్నారు. గురువు అద్వానీకే శిష్యుడు నరేంద్రమోడీ ఇచ్చిన విలువేమిటో చూశాము. వాదన, విషయంలో వున్నదానిని బట్టి విలువ ఇవ్వండి చాలు. కొంత మంది కుర్రవాళ్లు పేర్లకీ పుకార్లకీ నిబద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు. నేనైతే ఆ టైప్‌ కాదు. వయసుతో పని ఏముంది మనసులోనే అంతా వుంది అని నమ్ముతా.

‘కమ్మీలకు స్వంత సిద్దాంతాల్లేక విదేశాలనుంచి ఎందుకు దిగుమతి చేసికొన్నారు?స్వంతంగా సిద్దాంతాలే తయారుచేసికోలేని అనామకులా కమ్మీలు?కాస్తైనా జ్ఞానంలేని మూర్ఖులైన కమ్మీలను ప్రజలెలా ఆదరిస్తారు?

జ: వసుధైక కుటుంబం అనే భావనలో నమ్మకం వున్న వాడిని. మన రాజ్యాంగంతో సహా అనేక అంశాలను విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాము. ఇస్లాం, క్రైస్తవ మతాలను నిత్యం దుమ్మెత్తి పోసే వారు వారి దీనార్లు, డాలర్లు, ఇతర వస్తువులను తెచ్చుకోవటానికి, ఆ దేశాలకు వెళ్లి మరుగుదొడ్లు కడగటం నుంచి కంప్యూటర్ల వరకు ఏ పని అయినా చేయటానికి, కూలి డబ్బులు తెచ్చుకోవటానికి కోట్లాది మంది సిగ్గుపడటం లేదు. ఏం తెచ్చారో, ఎంత తెచ్చారో ఇంతవరకు తెలియకపోయినా నిత్యం నరేంద్రమోడీ విదేశాల నుంచి ఏదో ఒకటి తీసుకురావటానికే కేగా అందమైన సూట్లు వేసుకొని పైలా పచ్చీసుగా తిరుగుతోంది. భారతీయతకు ప్రతిబింబంగా కొందరు భావించే పిలక, పంచకట్టుతో ఎందుకు వెళ్లటం లేదు. ఇన్ని జరుగుతున్నపుడు, వాటికి అభ్యంతరం లేనపుడు కమ్యూనిస్టులు ఒక సిద్ధాంతాన్ని తమకు వర్తింప చేసుకుంటే తప్పేమిటట? బౌద్దం, ఇస్లాం, క్రైస్తవం, హిందూ మతం ఒక చోట పుట్టి అనేక దేశాలకు విస్తరించింది. కమ్యూనిజం కూడా అంతే .వాటికి లేని అంటూ సొంటూ కమ్యూనిజానికికే ఎందుకు?

‘ మీ బతుకులు ఈ దేశ గొప్పదనం తక్కువ చేయడానికే. పంది బురద మెచ్చు, పన్నీరుమెచ్చునా విశ్వదాభిరామ…’

జ: నాకు తెలిసినంత వరకు ఏ కమ్యూనిస్టూ ఈ దేశ గొప్పతనాన్ని తక్కువ చేయలేదు. అలా చేసినట్లు ఒక్క వుదంతం వున్నా చూపాలని చేసిన సవాలుకు ఇంతవరకు ఎవరూ బదులివ్వలేదు. అనేక మతాలు వచ్చాయి, పెరిగాయి, తరిగాయి. మధ్య యుగాల నాటి మాదిరి భీకర మత యుద్ధాలు మహత్తరమైన భారత గడ్డమీద జరగలేదు గాని మత యుద్ధాలు మనకు కొత్త గాదు. శైవులు-వైష్ణవుల మధ్య పరిమితంగా అయినా యుద్ధాలు జరిగాయి. జైన, బౌద్ధ మతాలను, హేతువాద, భౌతిక వాదులైన చార్వాకులను హిందూ మతంగా చెప్పుకొనే వారు అణచివేచిన చరిత్ర వుంది. ఇప్పుడు క్రైస్తవం, ఇస్లాం మతాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న మెజారిటీ మతోన్మాదులు, దానికి స్పందిస్తున్న మైనారిటీ మతోన్మాదులు దొందూ దొందే. పందులు పన్నీరు మెచ్చకపోయినా నష్టం లేదు. మతోన్మాదులు ఎందరు మగువల కన్నీరు ఒలికించటానికి నీ పేరుతో ప్రయత్నిస్తున్నారో వీలైతే వారిని ఆపేట్లు చూడు రామా అని కమ్యూనిస్టులు కాని వారెందరో మొక్కుకుంటున్నారు.

‘విదేశాలకు పరుగులు తీయాలని కూడా వేదాల్లోనే ఉందట’

జ: అన్నీ వున్నాయష అన్నపడు పరుగుల గురించి ఎందుకుండదు

‘ వీళ్ళు వీళ్ళ పిచ్చ…వేదాలని ప్రశ్నిస్తే కమ్మీలు అంటారు,వాళ్లంటే అంత భయమేంటో, వాళ్ళ పేరే కలవరిస్తారు.’

జ: ఇది తరతరాలుగా వస్తున్న భయం, గంగిరెద్దుల్లా తలాడించటం, మన్ను దిన్న పాముల్లా జనం పడి వుండాలని కోరుకొనే వారికి ప్రశ్నించే ఒక్కడు కనపడినా భయమే. వేద ప్రామాణ్యాన్ని ప్రశ్నించటం ఈ రోజు కాదు, వాటిని రాసిన నాటి నుంచీ ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే వున్నారు. ఒక్క వేదాలే కాదు, గీత, ఖురాన్‌, బైబిల్‌ వంటి ఏ మత గ్రంధమైనా, మరొకటైనా సమాజ పురోగతికి ఆటంకం కలిగించే ప్రతిదాన్నీ జనం ప్రశ్నిస్తారు. అలాంటి వారిని అణచివేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. దోపిడీ వర్గాన్ని సమర్ధించే వారే నాడు నేడు ఈ అణచివేతకు పాల్పడుతున్నారు.

‘ఎవడైనా సరుకున్నవాడినే రమ్మంటారు’

‘ వారికి నేర్పడానికి నాసా లో హిందువులేఎక్కువ ‘

జ: సరకున్నవాడినే ఎవరైనా రమ్మంటారన్నది కొంత వరకు నిజమే. తమకు అవసరమైన వాళ్లను కూడా రమ్మంటారు అని కూడా తెలుసుకోవాలి. అమెరికా, ఐరోపా వారు వస్తువులు తయారు చేసుకోలేకనా చివరకు …..తుడుచుకొనే కాగితంతో సహా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నది. కాదు, వ్యాపారికి లాభం కావాలి. చైనాలో తయారయ్యేందుకు అయ్యే ఖర్చు కంటే అమెరికాలో ఎక్కువ చెల్లించాలి. అందుకే ఎక్కడ శ్రమశక్తి తక్కువుంటే అక్కడి నుంచి దిగుమతులు చేసుకుంటున్నారు. అలాగే వైద్యులు, శాస్త్రవేత్తలు, కంప్యూటర్‌ ఇంజనీర్లు. అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు వారిని తయారు చేసుకోలేక కాదు. ఒక వైద్యుడు తయారు కావాలంటే అమెరికాలో అయ్యే ఖర్చు కంటే ఇండియాలో తక్కువ. మిగతావారు కూడా అంతే. మన దేశంలో వున్నన్ని జబ్బుల గురించి అమెరికా, ఐరోపాలో తెలుసుకోవాలంటే కుదరదు, అక్కడన్ని లేవు గనుక. అందుకే విదేశాల నుంచి రమ్ముంటున్నారు తప్ప మన మీద ప్రేమ వుండి కాదు, మనమే గొప్పవారం అని కాదు. ప్రపంచంలో విదేశాలలో నివసించే చైనా జాతీయులు ఐదు కోట్ల మంది అయితే మన వారు మూడు కోట్లకు పైబడి వున్నారు. అమెరికాలో కూడా భారతీయుల కంటే చైనీయులే ఎక్కువ. అందువలన మన గురించి చెప్పుకోవచ్చు తప్ప అతిశయోక్తులు చెప్ప కూడదు. నాసాలో పని చేస్తున్న మన సైంటిస్టులందరూ హిందువులే అని చెప్పటం అతిశయోక్తి. అంటే హిందువులందరూ మన దేశ పరిశోధనలను వదలి పెట్టి అమెరికన్లకు వూడిగం చేస్తున్నారను కోవాలి. ఇదేమీ దేశభక్తి ?

‘ఎప్పుడూ పక్కదేశం బానిసలుగా బతికేవారికి ఆత్మవిశ్వాసం లోపించి మనలో ఏమీ లేదు అనుకునే పర్సనాలిటీ డిసార్డర్‌, ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్‌తో బ్రతికే మానసిక రోగులు మన కమ్యూనిస్టులు. ముందు మీ పూర్వీకుల ఘనతను తెలుసుకుని,ఎవరైనా సైకాలజిస్ట్‌ దగ్గర కౌన్సిలింగ్‌ తీసుకోండి.

జ: కమ్యూనిస్టులు ఏ దేశం వారినైనా వారు దోపిడీ చేసేవారా, దోపిడీకి గురయ్యే వారా అని మాత్రమే చూస్తారు తప్ప మతం, కుల ప్రాతిపదికన చూడరు. పక్కన వున్న వాడికి ఒక కన్ను పోవాలనుకుంటే మనకు రెండూ పోతాయి. సమాజంలో కొంత మంది కంటే తాము గొప్ప వారమనే సుపీరియారిటీ రోగాన్ని పెంచిన మనువాదం మొత్తంగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధను ప్రోత్సహించి, నిర్మించి సమాజానికి చేసిన హాని అంతా ఇంతా కాదు. మహిళలను అణచివేసింది, వారికి విద్య, వివేకం లేకుండా చేసింది. పంచముల పేరుతో నాలుగోవంతు, ఇతర వృత్తుల పేరుతో మరి కొ ందరిని ఈ దేశం మాది అనుకొనే స్ధితి లేకుండా చేసింది. ఎందరు హిందూ రాజులు పాలించినా వేల సంవత్సరాలు అదే స్ధితి కొనసాగింది. అందువలన, విదేశీయులు, హూణులు, తరుష్కులు, యూరోపియన్లు ఎవరు దేశం మీద దాడులు చేసినా, మొత్తాన్ని ఆక్రమించుకున్నా మన బతుకులు మారేదేమీ వుండదని ఏం జరిగితే మనకెందుకు లెమ్మని మెజారిటీ జనం ప్రేక్షక పాత్ర పోషించబట్టే దేశం వందల సంవత్సరాలు పరాధీనమైంది. ఎక్కడ ఏమాత్రం గౌరవం, ఆదరణ, సాటి మనిషిగా గుర్తింపు వుంటుందని భావించినా అనేక మంది మతమార్పిడులకు సిద్దపడటానికి కూడా కారణమదే. ఇప్పటికీ అదే స్ధితి. అందుకు అంబేద్కరే ప్రత్యక్ష నిదర్శనం. అందువలన మన గత ఘనత గురించి మరీ ఎక్కువగా చెప్పుకొనే మానసిక రోగులకే ముందు కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. బుర్రలను మరమ్మతు చేయాలి.

ౖ’వేదాలలలో అన్ని ఉన్నాయి విదేశీయులు వఛ్చి అన్ని వేదిలేసేం ఇప్పటి అమెరికా వైద్యం కన్నా మంచి వైద్యం మన దగ్గర ఉండేది ఎంసెట్‌ రాంక్‌ వఛ్చినవాడు ఎం బి బి ఎస్‌ చదువుతాడుకాని ఆయుర్వేదం చదవడుకదా జెర్మనీ వాడు మానవేదాలని ఉపయోగించుకుని ఆయుధాలు మందులు చేసుకుంటున్నాడు మన రాజమండ్రి ఆయనని అక్కడకి తీసుకునివెళ్ళి మరి ఆయుధాల విద్య నేర్చుకున్నారు మనకి మాత్రం అలుసు మన పూర్వులగురించి తెలియదు తెలుసుకోము విదేశీయులంటే మోజు అన్ని ఉన్న విజ్ఞానం మనది

జ: ఇలాంటి నమ్మకాలు వున్న వారు రెండు తరగతులు.లోతైన అధ్యయనం, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, ఎక్కడ అనే ప్రశ్నలు వేయకుండా గుడ్డిగా నమ్మి ప్ర చారం చేసేవారు. కావాలని దురహంకారాన్ని రెచ్చగొట్టే వారు. ఈ దేశంలో ఇప్పుడు కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాలలో వున్నది వేదాలలో అన్నీ వునాయష అని నమ్మే తిరోగమన భావజాలం వున్న వారే. దేశీయ వైద్యాన్ని అభివృద్ధి చేయటానికి వారికి ఎవరు అడ్డుపడ్డారు. కార్పొరేట్‌ ప్రయివేటు వైద్య విద్య, చికిత్సను ప్రోత్సహిస్తున్నారు. మన రాజమండ్రి ఆయనని తీసుకొనివెళ్లి జర్మన్లు ఆయుధాల విద్య నేర్చుకున్నారని చెప్పటం అమాయకత్వం తప్ప మరొకటి కాదు.

‘చదువుకున్నా చదువుకు సరైన ఉపాదిలభించక ఉపాధిని పొందడమే జీవిత లక్ష్యం

వేదాలలో …. నిర్వేదం ఉంది కాబట్టి

అవి శుద్ద దండగా అని నిరూపించడానికి……….

ఇప్పుడు అభివ ద్ధిలో ఉన్న దేశాలు కొన్ని ఒకప్పుడు భారతదేశానికి వచ్చి బాగు పడిపోయినవి.

డబ్బు కోసం తెల్లోని తొత్తులాయ్‌ మతం మరి సలాం కొట్టి గులాం గిరి చేసారు

వాడు వచ్చి మనని దోచి మన వేదాలను బూడిద చేసి మన దేవాలయాలను కూలగొట్టి

మన దేశం లో మనకే రాజు గామారి న తరవాత మనం ఇప్పుడు వాణి దెగ్గర గులాం చేయక ఎం చేస్తారు

అదే మన వేదాలను మన దెగ్గర భద్ర పరిస్తే ఈ పరిస్థితి ఉండేదా.

వేదాలు చదివిన ఘనాపాఠిలను చూసి వాళ్ళు ఏ కొత్త టెక్నా జీని ఆవిష్కరించలేక పోతున్నారని వారే విదేశీయ ఉత్పత్తుల కొరకు ఆరాటపడి పోతున్నారని నిర్ధారించుకొని విదేశాలకు పరుగులు పెడుతున్నారు. ఏ దేశంలో లేని ఖనిజ సంపద వనరులు కలిగిన మన మాత  భూమిని భారతదేశాన్ని కాలదన్ని విదేశీ మోజుతో వెళ్ళిపోతున్నారు.

వేదాల్లో అన్నీ ఉంటే వేదాలు చదివిన వేద పండితులు ప్రపంచానికి అవసరమైన ఆవిష్కరణలు చేసి భారత ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో ఎగరవేసేవారు. ప్రపంచ ప్రజలు .. ఇది భారత వేద పండితులచే కనిపెట్టబడినదని చెప్పుకొనే కనీసం ఒక వస్తువైనా ఉందా

జ: నా వ్యాసంలోను వీటి గురించి కొంత చర్చించి నందున కొన్నింటిపై వ్యాఖ్య అవసరం లేదని భావిస్తున్నాను. చివరగా ఒక మిత్రుడు ప్రశ్న వేదిక వేదాల గురించి వేమన ఎలా స్పందించిందీ చూడండి అంటూ రెండు పద్యాలు పంపారు.

వేద విద్యలెల్ల వేశ్యల వంటివి

భ్రమలు పెట్టి తేట పడగ నీవు

గుప్త విద్య యొకటె కులకాంత వంటిది

విశ్వదాభిరామ వినుర వేమ.

వేన వేలు చేరి వెర్రి కుక్కల వలె

అర్ధ హీన వేద మరచు చుంద్రు

కంఠ శోష కంటె కలిగెడి ఫలమేమి

విశ్వదాభిరామ వినుర వేమ!

మహాకవి వేమన హేతువాద భావజాలాన్ని అనుసరించే, ముందుకు తీసుకుపోయే అనేక మందిపై మతోన్మాదశక్తులు దాడులు చేస్తున్నాయి, ప్రాణాలు కూడా తీస్తున్నాయి. జనంలో ప్రతికూల స్పందన వస్తుందని భయపడిపోయి గానీ వేమనను కూడా కమ్యూనిస్టు , జాతి, హిందూ వ్యతిరేకి అని వున్మాదులు తిట్టి పోసే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదు. భిన్నాభిప్రాయాన్ని అణచివేయాలని చూస్తున్న శక్తుల పట్ల ఎవరు వుపేక్షించినా వారు తమంతట తమ నోటిని మూసుకోవటమే. తరువాత తెరవాలన్నా తెరవనీయరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వేదాల్లోనే అన్నీ వుంటే మన వారెందుకు విదేశాలకు పరుగులు తీస్తున్నట్లు ?

30 Monday Apr 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

If everything lies in veda’s only, Indian science, vedas

ఎం కోటేశ్వరరావు

వేదాల్లోనే అన్నీ వున్నాయష అని ముందుగా ఏ మహానుభావుడు సెలవిచ్చాడో నాకైతే వివరాలు దొరకలేదు గానీ తెలుగు జాతి నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు తన మహత్తర రచన కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధాన్లతో వేదాల్లోనే అన్నీ వున్నాయష అనిపించి దాన్ని గ్రంధస్ధం చేశారు. అది నిజమే అంటూ నేడు వున్నత చదువులు చదివిన వారెందరో అతని కంటే ఘనులు అన్నట్లు ఆధునిక అగ్నిహోత్రావధానులుగా తయారయ్యారు. శనివారం నాడు మధ్య ప్రదేశ్‌లోని వుజ్జయిని పట్టణంలో జరిగిన గురుకుల సంస్ధల సమావేశంలో గురుకుల వ్యవస్ధను పునరుద్ధరించాలని, వాటికి తగిన విధంగా బోధనాంశాలను మార్చాలని, సైన్సు మరింత ముందుకు పోవాలంటే వేదాలను కూడా అధ్యయనం చేయవలసిన అవసరం వుందని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ సూచించారు. తల మీద ఒకవైపు పిలక, మరొక వైపు ఆధునిక క్రాఫ్‌ చేయించుకోవాలన్నట్లుగా వుంది. కుర్రకారు తేల్చుకోవాలి. గురుకుల, ఆధునిక విద్యలను అనుసంధానించేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ సెలవిచ్చారు. ఇప్పటికే ఆవు పేడ, మూత్రంలో ఏముందో చూడాలంటూ శాస్త్రవేత్తలను వాటిలో ముంచేందుకు పూనుకున్నారు. ఇలాంటి తిరోగామి శక్తులను ఇంకా అధికారంలో కొనసాగనిస్తే ఎలాంటి విపరీత ప్రయోగాలు చేయటానికైనా వెనుదీయరు. తస్మాత్‌ జాగ్రత్త.

వేదాలను బట్టీయం వేసి ఘనపాఠీలు, చదివిన వారు పండితులయ్యారు తప్ప ఒక్కరూ శాస్త్రవేత్త ఎందుకు కాలేదో మోహన్‌ భగవత్‌ చెబుతారా అని ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో ఒక చర్చను ప్రతిపాదించాను. ఒక గ్రూపులో భారతీయ సంప్రదాయాలను కాపాడుతున్నామని నిజంగా నమ్ముతున్న భగవత్‌ అభిమానులంతా పచ్చిబూతులతో ప్రతిస్పందించటం చూసి భరతమాతా చివరకు నీకు ఎంత దుర్గతి పట్టింది ఇలాంటి నీ బిడ్డలను సరిదిద్దుకుంటావో, లేక బూతులు తప్ప మరొకటిరాని ఈ సంతును ఇలాగే వదలి వేస్తావో నువ్వే నిర్ణయించుకోవాలమ్మా అని చెప్పాను. వదిలేస్తే తరువాత బూతులు నీవంతే నమ్మా అని కూడా చెప్పాను. (అదేమిటి నీకు భరత మాత కనిపించిందా అని కొందరు నన్నడిగినపుడు మిగతా వారికి నిత్యం ప్రత్యక్షం అవుతున్నపుడు నాకు అప్పుడపుడన్నా కనపడదా అని జవాబిచ్చాననుకోండి. ) చర్చలో వెల్లడైన అభిప్రాయాలను చూస్తే గుడ్డి అనుసరణ, నమ్మకం తప్ప ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు ఎవరు అనే ప్రశ్నలను వారు తమ దగ్గరకు రానివ్వరని తేలింది. నిజంగా వారిని చూస్తే జాలేసింది, ఎంతైనా వారు కూడా మనుషుల్లానే వున్నారు కదా అనిపించింది. అదే సమయంలో వారి బూతులు గుర్తుకు తెచ్చుకుంటే జాలి స్ధానంలో ఆగ్రహం కలిగింది. బూతులను ప్రస్తావించటం సంస్కారంకాదు కనుక అలాంటి పోస్టులను, వాటిలోని బూతులను మినహాయించి సారాంశం ఇస్తున్నాను.

వేదాల రిసెర్చే ఘనాపాఠీ అంటే, శాస్త్రవేత్త అంటెనే ఘనాపాఠీ, ఎందుకు కావాలి ఎవరి మార్గం వారిది, మీరెందుకు కాలేదు శాస్త్రవేత్తగా, ఆ వేదాలను ఆ పండిత పామరులను రీసెర్చ్‌ చేసినవారు శాస్త్రజ్ఞులు అయ్యారు, అట్లా బట్టీ పట్టక పోతే మీలాంటి వారు వాటిని ఎప్పుడో అంతం చేసేసి ఉండేవారు. ఇప్పటికైనా ఏదైనా కొద్దిగా ఉందీ అంటే అది బట్టీ కొట్టడం వలననే. ఆ స్వరాలు లో కొద్దిగా మార్పు వచ్చినా అర్థం మారిపోతుంది. అది బట్టీ కొట్టేది అందుకే, మొత్తం ప్రపంచానికి అందించిందే హిందువులు. టెక్నాలజీని అప్పుడు హిరణ్యకశిపుడు దొంగలించాడు. ఇప్పుడు ఈ హిరణ్యకసిపుళ్ళు దొంగిలించారు అందుకే వాళ్ళను రాక్షసులూ అంటారు, ఇప్పటికి వాళ్ళు కొన్నిటిని తెలుసుకోలేకఉన్నారు తెలుకోలేరు హిందువులు వాళ్లకు తెలనివ్వరు ఎందుకంటే ప్రక తి ని నాశనము చేవాళ్లకు ఇవ్వకూడదు సమయం వచ్చినప్పుడు వాటిని ఎలా ప్రయోగించాలో అపుడు ప్రయోగించడం జరుగుతుంది చివరిగా ఒక్కవిషయం ఏఏ దేశాలు అయితే మనదేశానికి వచ్చాయో ఇపుడు ఆదేశాలు నెంబర్‌ 1 స్తానం లో ఉన్నాయి స్వామి వివేకానంద, ఎంతో మంది మేధావులు,, శాస్త్రవేత్తలు జన్మించిన దేశం ,భారతదేశం.. నీకు తెలవదు,ఎందుకంటే నీకు మెదడు లేదు..ఓసారి చరిత్ర చూడు, భారతదేశం అనగానే ఒక సంస్క తీ, సంప్రదాయాలు, ఆచారాలు, ఆద్యాత్మిక భావాలు కలిగిన దేశంగా ప్రపంచం చూస్తుంది. విజ్ఞానము, సాంకేతిక విజ్ఞానం అంతగాలేని దేశంగా చూస్తారు, ప్రపంచమే కాదు మనదేశ ప్రజలకు కూడా తెలియదు. ఐతే ఈ మధ్య కాలాలలో ప్రపంచం కూడా ప్రాచీన భారతదేశం గొప్ప విజ్ఞానము, సాంకేతిక విజ్ఞానం ఉందని మనదేశ ప్రజలు, విదేశీయులు గుర్తిస్తున్నారు. భారతదేశంలో ఎన్నో ప్రాచీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వాటిలో ఎంతోమంది దేశ విదేశీయులు విధ్యనభ్యసించేవారు. అవన్నీ ఇప్పుడు చరిత్రగా మిగిలిపోయాయి. భారతదేశం అనగానే ఒక సంస్క తీ, సంప్రదాయాలు, ఆచారాలు, ఆద్యాత్మిక భావాలు ప్రాచీన భారతదేశ విజ్ఞానము, సాంకేతిక విజ్ఞానం వాటిలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు వారు ఏకాలనికి చెందిన వారు అనే విషయం అంతగా లేదు అది తెలుసుకోవడం ఎంతో అవసరం. 1 శుశ్రుత క్రీ.పూ 600 వైద్య శాస్త్రం, 2 చరక క్రీ.పూ 300 వైద్య శాస్త్రం.

3. బౌదాయన్‌ క్రీ.పూ 8-7 గణిత శాస్త్ర వేత్త.4 కన్నడ (ఆళుక్యుడు) క్రీ.పూ 8-7 ఖగోళ మరియి గణిత శాస్త్రవేత్త. 5. నాగార్జున క్రీ.శ 150-250 ఖనిజ శాస్త్రవేత్త.

ఇంతవరకూ సైన్సు వేదం లో తెలిపిన దానిలో 10% కూడా కనుక్కోలేదు. అక్షర సత్యం, సున్నా 0 లేకపోతే కంప్యూటరైజేషన్‌ అనేది ఉంది ఉండేది కాదని తెలుసుగా, హిందువుల మీద ఏడ్చి ఏడ్చి ఏప్పుడో పోయేట్టున్నావు లే, నువ్వు నమ్మే నీ దొంగ మతం..పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వెంట్రుకతో సమానం..

ఇంకా వేదాలు పండితులు అవసరం లేదు, అంతేలే అన్యమతాల వారి ఎంగిలి మెతుకులు కోసం ఆశపడి

ఈ రకమైన పనులు చేస్తున్నారు, హిందూ ధర్మం మీద ఎంత విషం చిమ్మినా కానీ, మన మన్నెం కోటేశ్వరరావు వలన మంచే జరుగుతోంది. అతను రెచ్చగొట్టడం వలన హిందువులు ఏకమౌతున్నారు, తిక్కల ప్రశ్న. పిహెచ్‌డి చేసిన ప్రతివాడు సైంటిస్ట్‌ ఎందుకు కావడంలేదు… ప్రొఫెసర్‌లుగా ఎందుకు మారుతున్నారు.. ఇదీ అంతే, భారత్‌ను ఏలుతున్న సమయంలో ఫ్రెంచి, బ్రిటీష్‌ పాలకులు మనవేదాలను తీసుకెళ్లి అధ్యనం చేసి వాటిఆధారంగా ప్రయోగాలు చేసి విధ్యుత్‌,రేడియో,విమానం లాంటి అనేక వస్తువులను రూపొందించారనేది కాదనలేని యదార్థం. శాస్త్రవేత్తలు కాలేదని వారు చెప్పారు అల్జెబ్రా ట్రిగ్నోమెట్రీ లాంటివి చాలా కనుక్కున్నారు మేము లీలావతి భస్కర్‌ అని ఆల్జీబ్రాలో శ్లోకాలని చదివేము ఆ రోజుల్లో ఈ దేశం గురించి వాళ్లకి తెలియదు వాళ్ళగురించి మనకి తెలియదు వాళ్ళ మ్యాగజిన్‌ లో ప్రచురించకపోతే విజ్ణాన శాస్త్రమే లేదంటే ఏళ్ళ అగస్త్యుడి కా లంలోనే విమానం ఎలానడపాలి అన్నవిషయం ఉండేది నలందా విశ్వవిద్యాలయంలో కొన్ని వేల గ్రంధాలు కాల్చేసేరు మనం మనల్ని కించపరుచుకునే దుస్థితి దాపురించింది. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు ఎవర్రా…… కళ్లు దొబ్బాయా. ఆధ్యాత్మిక ప్రపంచం లో సైన్స్‌ అనేది ఒక చిన్న ముక్కమాత్రమే.అధ్యాత్మికవేత్త అనే సముద్రం ముందు సైంటిస్ట్‌ అనే పిల్ల కాలువ పరవళ్లు తొక్కుతూ సముద్రం లో కలవాల్సిందే.పాచీనకాలంలో భారత దేశమే విజ్ఞాన భాండాగారం,నీకు ఇప్పుడు బ్రాహ్మణులు మాత్రమే కనిపెట్టినవి కావాలా,లేక భారతీయులు అయినా పర్వలేదా, ఎర్ర పకోడీ గాళ్లరా మీరు భారతీయులేన లేదా?? మీరు శాస్త్రజ్ఞులు కాదనుకొనేవారికి తెలిసిన శాస్త్రాలు మీరు శాస్త్రజ్ఞులనుకొనేవారిలో ఎంతమందికి ఎన్ని తెలుసు, అసలు శాస్త్రం అంటే ఏమిటి ? శాస్త్రవేత్త

వేత్త అనగా ఎవరు? ముందు దీనిని తెలుసుకొని ప్రశ్న వేయండి. మన పుష్పక విమానం ఫార్ములాతోనే రైట్‌ సోదరులు విమానం రూపకల్పనకు పూనుకొంది. స్ధూలంగా ఇదీ ధోరణి. వీటన్నింటినీ ఎప్పటి నుంచో మెదళ్లకు ఎక్కించుకొని ఒక పిచ్చిలో మునిగి తేలుతున్నట్లు కనిపిస్తోంది. అందువలన దాన్ని పోగొట్టాలంటే కొన్ని ఆసుపత్రులు చాలవు. పెద్దఎత్తున చర్చల కౌన్సిలింగ్‌ చేయకపోతే రాబోయే తరాలను కూడా చెడగొడతారు, మన దేశాన్ని మరింతగా వెనక్కు నెడతారు, నగుబాట్ల పాలు చేస్తారు.

తమకు నచ్చని, తెలియని అంశాన్ని ఎవరైనా చర్చకు పెడితే బూతులు తిట్టి నోరు మూయించేందుకు ప్రయత్నించటం ఒక చౌకబారు ఎత్తుగడ. తాలిబాన్లు వారికి ఆదర్శం. విమర్శకుల నోరు మూయించటానికి మేకిన్‌ ఇండియా చౌకబారు తయారీ. చిత్రం ఏమిటంటే ఆ బూతుల్లో కూడా వైవిధ్యం వుండదు. వారి భావ దారిద్య్రానికి నిదర్శనం ఇది. వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రాణాలనే తృణప్రాయంగా అర్పించటానికి సిద్దపడిన వారికి బూతులు, అవమానాలు ఒక లెక్క కాదు. తిట్టినంత మాత్రాన విమర్శలు ఆగిపోయేట్లయితే ఈ పాటికి అది ఎప్పుడో జరిగి వుండేది. ఇంతకు మించి ఏమి తిడతారు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేదేముంది అని అనేక మంది ఇప్పటికే రాటు తేలారు. ఇప్పటి వరకు తమను వ్యతిరేకించిన వారినే తిడుతున్నారు. ఇప్పుడు నువ్వు హిందువు కాదా, నువ్వు ముస్లిం కాదా, నువ్వు క్రైస్తవుడికాదా అని రెచ్చగొడుతున్నారు.బూతులు తిట్టకపోవటం సంస్కారం, తిట్టే వారిని అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో మాతో కలసి ఎందుకు తిట్టటం లేదని మౌనంగా వున్నవారి మీద కూడా తెగబడతారని గ్రహించటం మంచిది.

ఇక వేదాలలో అన్నీ వున్నాయష అంటూ ఇంకా టెక్నాలజీని బయటకు తీయని దేశ ద్రోహుల గురించి చూద్దాం. వేదాలను వెక్కిరించే వారిని వెధవలని ఒక పత్రిక సంపాదకుడిగా పనిచేసిన ఒక కాషాయ తాలిబాన్‌ నిందించాడు. విమర్శ రూపాలలో వెక్కిరింత ఒకటి. విమర్శకులను వెధవలు అనటం సరైనదే అయితే గుడ్డిగా సమర్ధించే వారు కూడా విమర్శకులకు బంధువులే.

వేదాలను వెక్కిరించే లేదా విమర్శించే వారు వుద్భవించటానికి కారకులు ఎవరు ? వేదాల్లోనే అన్నీ వున్నాయష అని చెప్పిన వెధవలే. 1760లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని పెద్ద మలుపు తిప్పింది. వివిధ దేశాలలోని వారు ఒకరిని చూసి మరొకరు సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు పోటీ పడ్డారు. అందుకు విరుద్ధంగా మన దేశంలో మన కంటే గొప్ప మేధావులు ప్రపంచంలో లేరని, ఎవరైనా కొత్త వస్తువును కనుగొంటే అవన్నీ మన వేదాల్లో, పురాణాల్లో ఎప్పుడో వున్నాయని తమ జబ్బలను తామే చరుచుకున్నారు. పారిశ్రామిక విప్లవాన్ని మరో మలుపు తిప్పిన పరిణామం 1900 శతాబ్ది ప్రారంభ దశకంలో రైట్‌ సోదరులు కనిపెట్టిన విమానం. ఆవిరి యంత్రాన్ని కనిపెట్టినపుడే మన వేద పారంగతులు, విజ్ఞానవేత్తలు మేల్కొని వుంటే అరే మన పురాణాల్లో వున్న పుష్పక విమానాలను పునరుద్దరించేందుకు పూనుకొని వుండేవారు. నిజంగా ఆ పని చేసి వుంటే మనకు ఎన్ని ప్రయోజనాలు సమకూరి వుండేవో.

ప్రపంచంలో అసలు పెట్రోలుతో పనిలేని విమానాలను మనమే తయారు చేసి మేకిన్‌ ఇండియా అని గొప్పగా చెప్పుకొని మనువాదులు చెబుతున్నట్లు కాలర్‌ చొక్కాలు వేసుకోవటం భారతీయం కాదు గనుక పిలకలు ఎగరేసి వుండేవారం. మన పుష్పక విమాన , కీలు గుర్రాలు, ఎగిరే కార్పెట్ల టెక్నాలజీని బయట పెట్టి వుంటే కార్లు, స్కూటర్లు, లారీల వంటి వాటితో పని వుండేది కాదు, అన్నింటికీ మించి ముస్లిం దేశాల నుంచి చమురు కొనుక్కోనే ఖర్మ పట్టేది కాదు, ఇప్పుడు వారి దగ్గర చమురు కొని, దానికి చెల్లించాల్సిన డాలర్ల కోసం కిరస్తానీ దేశాలను దేబిరించే దుర్గతి పట్టించింది కచ్చితంగా మన వేద విజ్ఞానాన్ని బయటికి తీసేందుకు ముందుకు రాని వెధవలే అన్నది స్పష్టం.

వేదాలను ప్రామాణిక సూత్రాల ప్రకారం సక్రమంగా చదవకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయని సెలవిచ్చారు. మన దేశంలో కొన్ని భాషాలలో కొన్ని పదాలు పలకవు. వుదాహరణకు బెంగాలీలకు వ, బ మాదిరి. ఇలా ప్రతి భాషకు వున్నాయి. దీని ప్రకారం వుచ్చారణ సరిగా లేకపోతే ఫలితాలు వ్యతిరేకంగా వుంటాయనుకోవాలి. మరి దీన్ని పరిష్కరించటం ఎలా అందువలన ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. డార్విన్‌, న్యూటన్‌ల సిద్ధాంతాలు, సూత్రాలు వద్దూ, వేదాలే ముద్దు అనే పాలకులే నేడు గద్దెల మీద వున్నారు. ఇప్పటికే మేకిన్‌ ఇండియా జయప్రదానికి ఆవుపేడ, మూత్రాలలో ఏముందో కనుగొనేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి పరిశోధనలు చేయిస్తున్నారు. వేదాలలో వున్న టెక్నాలజీని అందరికీ అర్ధం అయ్యేలా ఘనాపాఠీలకే పేటెంట్‌ హక్కులిచ్చి చమురుతో పైలెట్లు, డ్రైవర్లతో పనిలేని విమానాలు, కార్లు,ఇతర వాహనాలను తయారు చేయించండి, విమర్శకుల లేదా వెక్కిరించే వారి నోరు మూయించండి. అదేమీ లేకుండా ఎవడో కిరస్తానీవాడు కనిపెట్టిన ఫేస్‌బుక్‌లో సొల్లు కబుర్లు చెబితే లేదా విమర్శి ంచేవారిని తిడితేనో ప్రయోజనం వుండదు. అంతులేని మన టెక్నాలజీని బయటకు తీసి దేశాన్ని ముందుకు నడిపించకపోతే అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణిస్తారని మనవి.

మన సాంకేతిక పరిజ్ఞానం నిక్షిప్తమై వున్న అనేక సంస్కృత గ్రంధాలను ఇస్లామిక్‌, క్రైస్తవులు నాశనం చేశారని ఒక నోటితో చెబుతూ దానిలోని విజ్ఞానాన్ని దొంగిలించారని మరో నోటితో చెబుతారు. వినేవారు నోట్లో వేలేసుకొని చెవులప్పగిస్తున్నారు. దేన్నయినా ఎందుకు అని ప్రశ్నించిన సమాజమే ముందుకు పోతుంది. ఎందుకు అని నువ్వు పెద్ద ప్రశ్నిస్తున్నావు మన పూర్వీకుల కంటే నువ్వు గొప్పవాడివా మానాన్నకు మాతాత చెప్పారు, మానాన్న నాకు చెప్పారు, నేను నీకు చెబుతున్నాను , నోరు మూసుకొని చెప్పింది చెయ్యి అంటూ తరతరాలుగా జిజ్ఞాసను అణచివేసిన ఆధిపత్య సమాజం మనది. అది వేదాలు, పురాణాలు, వుపనిషత్తులు, హిందూ ధర్మం ఏదైనా కావచ్చు. దేన్నీ ప్రశ్నించకుండా అణచివేశారు.

పురాతన కాలంలోనే అంటే క్రైస్తవం,ఇస్లామ్‌ మతాలు పుట్టక ముందే మన దేశంపై విదేశీయులు దండయాత్రలు చేశారు. క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్‌, క్రీపూ 200ల తరువాత శకులు, యవనులు, పహ్లవులు, క్రీస్తుశం 50లో కుషాణులు, క్రీశ 400లలో హూణులు దండయాత్రలు చేశారు. వారు మన వేద విజ్ఞానాన్ని నాశనం చేశారని ఎవరూ చెప్పలేదు. అలెగ్జాండర్‌ దాడి సమయంలోనే మన దేశానికి ప్రమాదం వుందని అర్ధమైంది. మరొకరు దాడికి పూనుకోకుండా ఎవరైనా ఏం చేయాలి, అందులోనూ దేశభక్తులు, అలెగ్జాండర్‌ నుంచి హూణుల వరకు మధ్యకాలం ఏడు వందల సంవత్సరాలలో ఏ ఒక్క సమయంలోనూ మన వేద విజ్ఞానులు విమానాలు లేదా అస్త్రాలను బయటకు తీసి సంధించి దురాక్రమణదారులను తరిమివేసి వుంటే తరువాత ముస్లింలు, క్రిస్టియన్లు దాడులు చేసి వుండేవారు కాదు. మహమ్మద్‌ ఘజనీ , ఘోరీలు అన్ని సార్లు దండయాత్రలు చేసి హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే మన అస్త్రాలను బయటకు తీయకుండా మన హిందూ ధర్మ పరిరక్షకులు ఏ గుడ్డి గుర్రానికి పండ్లుతోముతూ కూర్చున్నట్లు ?

మన నలంద విశ్వవిద్యాలయాన్ని ముస్లింలు తగుల బెట్టి మన విజ్ఞాన గ్రంధాలన్నింటినీ తగుల బెట్టారన్నది ఒక ప్రచారం. అనేక మంది చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం తగులబెట్టింది వాస్తవం. ఎవరు తగులబెట్టారు ? పాట్నా హిందుస్తాన్‌ టైమ్స్‌ 2014 సెప్టెంబరు ఒకటిన రాసిన దాని ప్రకారం క్రీస్తుశకం 455-467 మధ్య స్కంధగుప్తుని కాలంలో మిహిరకులుడనే హూణ రాజు నాయకత్వంలో విశ్వవిద్యాలయాన్ని నాశనం చేశారు. తరువాత గౌడాస్‌ నాయకత్వంలో ఏడవ శతాబ్ది ప్రారంభంలో మరోసారి నాశనం చేశారు. దాన్ని తరువాత హర్షవర్ధనుడనే రాజు పునరుద్దరించాడు.1193లో భక్తియార్‌ ఖిల్జీ సేనలు మరోసారి నాశనం చేసిన తరువాత దాని పునరుద్దరణ జరగలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారులు నడిపే పయనీర్‌ పత్రిక 2014 సెప్టెంబరు 20న రాసినదానిలో 1193లో టర్కీ సైన్యం దాడి చేసి విశ్వవిద్యాలయాన్ని తగుల పెట్టినట్లు పేర్కొన్నారు.

కొంత మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఖిల్జీ దాడుల నాటికే నలంద విశ్వవిద్యాలయం శిధిలమైంది. బౌద్ధంలో హీనయాన, మహాయాన శాఖల మధ్య వైరమే దీనికి కారణం అన్నది వారి వాదన. ఖిల్జీ సేనలు దాడి చేసింది నలంద జిల్లాలోనే వేరొక చోట వున్న మహావీర ఓదాంతపురి (నేటి బీహార్‌ షరీఫ్‌) కోటపై అన్నది ఒక అభిప్రాయం, నాటి చారిత్రక రచనల్లో అసలు నలంద ప్రస్తావన లేదని చెబుతున్నారు. డిల్లీ నుంచి బెంగాల్‌ వెళ్లే ప్రధాన మార్గంలో నలంద లేదని కూడా వాదించేవారున్నారు. చరిత్రకారులు ఎవరి భాష్యం వారు చెబుతున్నపుడు వాటి అధ్యయనానికి పరిమితం కావాలే తప్ప నిర్ధారణలకు రాకూడదు. ఇక్కడ సమస్య నలంద అనేది బౌద్ధ క్షేత్రం, బౌద్ధ విశ్వవిద్యాలయం అనేది నిర్వివాదం. బౌద్దులు వేద ప్రామాణ్యాన్ని నిరాకరించారు. అందువలన అక్కడున్నది వారి సాహిత్యం తప్ప వేద సంబంధిత సాహిత్యం ఎంత మాత్రమూ కాదు. ఒక వేళ వేద సాహిత్యమే నాశనం అయింది అనుకుంటే తరువాత ఎన్నో వందల సంవత్సరాల తరువాత వచ్చిన యూరోపియన్లు దొంగిలించటానికి అక్కడ ఏముంటుంది? వేదాలు, ఎంతో సాంకేతిక నైపుణ్యం వున్న సాహిత్యం సంస్కృతంలో వుందని చెబుతున్నవారు నలంద వంటి బౌద్ద విశ్వవిద్యాలయం మాదరి దేశంలో ఎక్కడా వేద విశ్వవిద్యాలయం ఎందుకు ఏర్పాటు చేయలేదు అన్నది ప్రశ్న.

వేదాలను బ్రహ్మ సృష్టించాడని చెబుతారు, అలాంటి వాటిని మానవ మాత్రులు నాశనం చేయటం ఏమిటి? శృతి, అనుశృతుల ద్వారా వేదాలు, వుపనిషత్తులు, పురాణాలను పరంపరగా తరువాతి తరాలకు అందించారు, అందువలన వాటిని భౌతికంగా నాశనం చేశారని చెప్పటం చెవుల్లో పూలు పెట్టటమే. చతుర్వేదాలు, పంచమ వేదంగా మహాభారతాన్ని చెప్పుకుంటున్నాం తప్ప నాశనం చేశారని, లేదా దొంగిలించారని చెబుతున్న వేదాల గురించి ఇంతవరకు ఎవరూ ఎందుకు చెప్పటం లేదు. పోనీ కాన్నింటినీ నాశనం చేశారని అనుకుందాం, అవన్నీ పోయిన తరువాత కూడా మన వారు వేదాల్లో అన్నీ వున్నాయష అన్నారు తప్ప కొన్నే వున్నాయష అన లేదు. అందువలన కొన్ని నాశనం చేశారని చెప్పటం ఇటీవలి కట్టుకధలు తప్ప మరొకటి కాదు. ముస్లిం పాలకులు మన దేశం మీద దండ యాత్రలు చేసినపుడు మన విజ్ఞానాన్నినాశనం చేశారని ఒక కధ, ఎవరైనా విజ్ఞానాన్ని గ్రహించి తాము వుపయోగించుకుంటారు. నిజంగానే వారు మన టెక్నాలజీని చోరీ చేసి వుంటే ముస్లిం దేశాలు నేడు సాంకేతిక పరంగా ఎంతో ముందుండాలి, దానికి బదులు పశ్చిమ దేశాల మీద ఎందుకు ఆధారపడుతున్నట్లు ? బ్రిటీష్‌, ఫ్రెంచి వారు అపహరించారంటారు. వారు మన దేశానికి రాకపూర్వమే ఐరోపాలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది కదా, దాంతో పెరిగిన వుత్పత్తి అయిన వస్తువులను అమ్ముకొనేందుకే కదా మన దేశం వచ్చింది. మరి వారికి ఆ టెక్నాలజీ ఎలా వచ్చినట్లు ? సున్నా కనిపెట్టింది భారతీయులంటారు, ఎవరు నిర్ధారించారు? మూడువేల సంవత్సరాలకు పూర్వమే ఈజిప్టులో దాని ప్రస్తావన వున్నట్లు, నేటి సున్నాకు రూపమిచ్చింది చైనీయులని చరిత్ర వుంది. మనది కూడా పురాతన సమాజాలలో ఒకటి కనుక సున్నా గురించి పురాతన ప్రస్తావనలు మనకూ వున్నాయి. వేదాల్లో అన్నీ వున్నాయని చెప్పిన తరువాత ప్రతి దానిని మన ఖాతాలో వేసుకుంటే ప్రపంచం నవ్విపోతుంది. అంతెందుకు విదేశీ విడి భాగాలు లేకుండా మనం ఫోన్‌, కారు, టీవీ వంటి వాటిల్లో ఒక్కదానినైనా స్వంతంగా తయారు చేస్తున్నామా ? మనకు వున్న కీలకపేటెంట్లు ఎన్ని? చివరికి పెద్ద విగ్రహం తయారు చేసుకొనేందుకు కూడా చైనా వద్దకు పరుగెడుతున్నామే ఎంత సిగ్గు చేటు ?

క్రీస్తుకు పూర్వమే వున్న చరకుడు, ఆర్యభట్టు, శుశ్రుతుడు అంటూ ఒక జాబితాను వల్లె వేస్తున్నారు. వారితో ఎవరికి పేచీ వుంది ? వారి పరిజ్ఞానం ఎంత అన్న మీమాంస ఎప్పుడూ వుంటుంది. అతిశయోక్తులు జోడిస్తేనే వెక్కిరింతలు వస్తాయి. వినాయకుడికి ఏనుగు తలను అతికించిన గొప్ప శస్త్ర నిపుణులున్నారని చెబుతారా ? మనిషికి మనిషి తలదొరక్కపోతే దానికి సమబరువుతో వుంటే మరో కుక్కో, నక్క తలో అంటించాలిగాని మోయలేని ఏనుగు తలను అంటించే మొరటు వారా నాటి వైద్యులు. మహాభారత కాలంలోనే ఇంటర్నెట్‌ వుందని ఒక ముఖ్యమంత్రి ప్రవచిస్తాడా ? అదే నిజమైతే ముస్లింలు, అంతకు ముందు ఇతరుల దండయాత్రల గురించి ఎందుకు హెచ్చరించలేదు, తలలో మెదడు వుండి చెబుతున్న మాటలేనా ? పురాతన సమాజాలలో ఒకటైన మన దేశంలో కొన్ని రంగాలలో పని చేసిన ప్రముఖులను గుర్తించటానికి, వారి ఘనతను పొగటానికి ఎవరికీ ఇబ్బంది లేదు. వారందరూ వేదాలనుంచే ప్రావీణ్యం పొందారని చెబుతుంటేనే సవాలక్ష ప్రశ్నలు వస్తున్నాయి. వారికీ వేదాలకు సంబంధం వుండి వుండదు. ఒక వేళ వుంటే అదే వేదాల నుంచి తరువాతి తరాలు మరింత నైపుణ్యంతో వైద్యం, ఇతర శాస్త్రాలను ఎందుకు మెరుగుపరచలేకపోయారు? వేదాలతో సంబంధం లేకపోయినా వారి అనుచరులు తరువాత ఎందుకు నిపుణులుగా రాణించలేకపోయారు అన్నది పరిశోధించాల్సిన అంశం. వేదాలలో ఏముంది, అది పనికి వచ్చేదా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఒక సాహిత్యంగా చూసినపుడు వాటిని కంఠోపాఠం చేసి తరతరాలకు అందించినందుకు ఘనపాఠీలను అభినందించాల్సిందే. అదే సమయంలో వారి చాదస్తాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. అణకువ, ఆసక్తి, తపన వున్న సమాజమే ఎప్పుడైనా ముందుకు పోతుంది. అహంకారం, గర్వం వుంటే ఎక్కడో అక్కడ బొక్కబోర్లా పడి ముక్కు బద్దలు చేసుకుంటాం. సాయంత్రం కాగానే సత్రాలకు చేరుకొని గంజాయి దమ్ముకొట్టి మనం తెల్లవారిన తరువాత అది చేయాలి, ఇది చేయాలి అని ప్రగల్భాలు పలికి తెల్లవారి మత్తుదిగగానే ఎవరి కర్రాబుర్రా పట్టుకుని అడుక్కొనేందుకు పోయే సోమరిపోతుల మాదిరి కబుర్లు కాదు కావాల్సింది. వేదాల్లోనే అన్నీ వున్నాయని చెబుతున్న వారు విదేశాలకు ఎందుకు పరుగులు తీస్తున్నట్లు ? తమ బిడ్డలకు శ్లోకాలు నేర్పించటం ఒక దేశభక్తిగా అనేక మంది ప్రదర్శించుకుంటున్నారు. డాలర్ల కక్కుర్తి తప్ప దేశభక్తి ఏమైనా వుందా ?

ఇక గురుకులాల వ్యవస్ధను పునరుద్ధరించాలని మోహన్‌ భగవత్‌ చెబుతున్నారు. మదర్సాలనుంచి తాలిబాన్లు వస్తున్నారని నిత్యం ప్రచార దాడులు చేస్తున్న వారే వాటికి పోటీగా గురుకులాలను ఏర్పరచాలని అంటున్నారు. అంటే మైనారిటీ తాలిబాన్లతో పాటు మెజారిటీ తాలిబాన్లను తయారు చేసి సమాజాన్ని మధ్యయుగాల నాటికి తీసుకు పోయి రక్తపుటేరులు పారిద్దామనా ? ఏమిటీ వున్మాదం ? దీన్ని నాగరిక సమాజం సహించాలా ? ఆర్‌ఎస్‌ఎస్‌ను సమర్ధిస్తున్న వారిలో తమ బిడ్డలను గురుకులాల్లో చేర్పించటానికి ఎందరు ముందుకు రాగలరో చెప్పగలరా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసలు ధర్మం అనేది వుంటే కదా రక్షించటానికి ?

20 Saturday Feb 2016

Posted by raomk in AP NEWS, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

budda, Dharma, Hinduism, Hinduthwa, vedas

కులాల ప్రస్తావన లేని క్రైస్తవ మతంలో అనేక మంది స్వాతంత్య్రానికి పూర్వమే చేరారు. వారిలో అన్ని కులాల వారూ వున్నారు. ఇప్పుడు చూస్తే మతం మారినా వారి కులాల్లో మార్పులు లేవు. కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు వివాహాలు వారి కులాల్లోనే జరుగుతున్నాయి. అలాగే ఆ మహానుభావుడు చెప్పినట్లు అందరికీ వుపనయనాలు జరిపి, గాయత్రీ మంత్రం వుపదేశించినా అదే జరిగి వుండేది. కనుక అది పరిష్కారం కాదన్నది స్పష్టం.

ఎం కోటేశ్వరరావు

      ధర్మాన్ని రక్షించటం అంటే ? అనే శీర్షికతో రిటైర్డ్‌ డిజిపి కె అరవిందరావు తన వ్యాసపరంపరలో భాగంగా ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. ఆయన ప్రస్తావించిన విషయాల మంచి చెడ్డలను పరిశీలించబోయే ముందు ధర్మాన్ని రక్షించటానికి ముగింపులో ఆయన చెప్పిన మార్గంతో ప్రారంభిద్దాం. దళిత, బలహీన వర్గాలను ప్రత్యేకంగా చూసి వారిని సమాజం నుంచి వేరు చేయటం కాకుండా వారితో అగ్రవర్ణాలు తమ సంస్కారాన్ని పంచుకోవాలని దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు చెప్పారని, అందరికీ వుపనయనం చేయాలని, గాయత్రీ మంత్రం నేర్పాలని ఆయన చెప్పిన మాట హాస్యాస్పదంగా కనపడవచ్చు కానీ లోతుగా ఆలోచించాల్సిస విషయం.పైన చెప్పిన వర్గాల వారికి మేలు చేస్తున్నామనే భావంతో వారిని వుద్యమాల్లోకి దింపి మన దేశాన్నీ, సంస్కృతిని ద్వేషించేట్లు చేసేవారిని అడ్డుకోవటానికి ఇదొక మార్గం అని అరవిందరావు గారు సూక్ష్మంలో ధర్మాన్ని రక్షించే మోక్ష మార్గం చెప్పారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య వంటి మహానుభావులు ఆనాటికి తమకు తోచిన దానిని నిజాయితీగానే చెప్పారు. మన సమాజం ఎంతగా చీలిపోయి వుందంటే కులాల ప్రస్తావన లేని క్రైస్తవ మతంలో అనేక మంది స్వాతంత్య్రానికి పూర్వమే చేరారు. వారిలో అన్ని కులాల వారూ వున్నారు. ఇప్పుడు చూస్తే మతం మారినా వారి కులాల్లో మార్పులు లేవు. కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు వివాహాలు వారి కులాల్లోనే జరుగుతున్నాయి. అలాగే ఆ మహానుభావుడు చెప్పినట్లు అందరికీ వుపనయనాలు జరిపి, గాయత్రీ మంత్రం వుపదేశించినా అదే జరిగి వుండేది. కనుక అది పరిష్కారం కాదన్నది స్పష్టం.

      ఇక అరవిందరావుగారు ఆరోపించినట్లుగా మొదటి విషయం ఈ దేశంలో పుట్టిన వారెవరూ దేశాన్ని ద్వేషించటం లేదు. పుట్టుక అనేది ఒక ప్రమాదం వంటిది. ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎందుకు తెలియదు. యాదృచ్చికంగా ఒక కుటుంబంలో పుడితే అగ్రకులమని, మరొక కులంలో పుడితే అధమ కులమని వెంటనే ముద్రవేసే కుసంస్కృతిని, సామాజిక దుష్టత్వాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. అలాంటి కులాల అంతరాలను తరతరాలుగా కాపాడుతూ, అనుమతిస్తున్న ‘మను’ సంస్కృతిని కాపాడాలి అని ఎవరైనా అంటే ఏడునిలువులలోతున పాతి వేయాలంటూ దానిని ద్వేషిస్తున్న వారు మెజారిటీగా వున్నారు. సంస్కృతి పేరుతో ఇక్ష్వాకుల కాలం నాటి అడ్డగోలు వ్యవహారాలను రుద్దాలంటే కుదరదు. పనికిరానిదానిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఆరోగ్యకరమైన దానిని ప్రోత్సహించటమే మానవ సంస్కృతి. దేన్నయినా మూసిపెడితే పాచిపోతుంది. ప్రతిదాని మంచి చెడ్డలను విశ్లేషించినట్లే సంస్కృతిపై కూడా నిరంతరం చర్చ జరగాలి. నవీకరణ జరగాలి. కానీ అరవిందరావు గారు కొన్ని విశ్వవిద్యాలయాలూ, మీడియాలోనూ జరుగుతున్న చర్చను అసత్య ప్రచారంగా చిత్రిస్తున్నారు. విమర్శలకు రెండు కారణాలంటూ ఒకటి మన దేశాన్ని బలహీన పరచాలనే వ్యూహంలో భాగంగా వస్తున్న వుద్యమాలు, రెండోది నిజంగానే మన వ్యవస్ధలో రావాల్సిన మార్పు. మొదటి అంశాన్ని ఇక్కడ చర్చించటం లేదు, కొంత మంది వేదాలు చదవటానికి అనర్హులు అని గీత గీసినట్లు రెండవది మన పీఠాలు, ఆచార్యుల పరిధిలోది అని చెప్పేశారు.

      పోలీసు వ్యవస్ధలో దీర్ఘకాలం పనిచేసిన అరవిందరావు వంటి వారికి విశ్వవిద్యాలయాలూ, మీడియాలో జరుగుతున్న చర్చలు దేశాన్ని బలహీనపరచాలనే వుద్యమాలుగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. ఒక ఆరోపణ చేసి వాటిని ఇక్కడ చర్చించటం లేదు అని తప్పుకుంటే కుదరదు. మీ ఆరోపణ కూడా ఒక మీడియా వేదికలో చేసిందే అని గమనించండి. మీ దగ్గర ఆ చర్చలకు సరైన సమాధానం లేదని అనుకోవాల్సి వస్తుంది. రెండోది మన వ్యవస్ధలో రావాల్సిన మార్పులు పీఠాలు, ఆచార్యుల పరిధిలోనివి అన్నారు. ప్రపంచ మతాల చరిత్రలో ఏ పీఠం లేదా ఆచార్యులు కూడా మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మనకు ఎక్కడా కనపడదు. వారిపై తిరుగుబాటు చేసిన వారికి ప్రతి దేశం,ప్రతికాలంలోనూ సామాన్య జనం మద్దతు ఇచ్చారు. మన దేశంలో స్థూలంగా హిందూ మతం అని పిలిచేదానిపై తిరుగుబాటుగానే బౌద్దం,జైనం అవతరించాయి. ఆ హిందూ మతంలో భిన్న భావజాలంతో వున్న శైవ, వైష్ణవ శాఖలు ఎలా కొట్టుకున్నాయో, ఒకదానినొకటి అంతం చేసుకోవటానికి ఎంత రక్తపాతానికి పాల్పడ్డాయో, అవే రాజీపడి బౌద్ధ,జైనాలను, అసలు మతాలనే సవాలు చేసే చార్వాకులు, లోకాయతులను, వారి గ్రంధాలను ఎలా నాశనం చేశాయో చరిత్రలో నమోదయ్యే వుంది. అనేక బౌద్ధ,జైనాలయాలను శివాలయాలుగా మార్చిన చరిత్ర ఆంధ్రదేశంలో అడుగడుగునా కనిపిస్తుంది. అందువలన ఇసు నుంచి తైలాన్ని తీయవచ్చుగానీ పీఠాధిపతుల నుంచి సంస్కరణలు ఆశించటమా? ఇంతకు ముందు జరగలేదు, ఇక ముందు జరగవు. మొత్తంగా చెప్పాలంటే సంస్కృతి మంచి చెడ్డల గురించి చర్చించటానికి, మార్చుకోవటానికి అరవిందరావు వంటి వారు సిద్ధం కాదు.

     ‘ప్రస్తుతం ఎలాంటి ఘటన జరిగినా దాన్ని మన సంస్కృతితో ముడిపెట్టటం, హిందూమతం అంటేనే బ్రాహ్మణిజం అనీ, బ్రాహ్మణిజం అంటే కులతత్వం అనీ, కులతత్వం అంటే అణచివేత అనే ప్రచారాన్ని చూస్తున్నాం. దీన్ని కేవలం మన దేశంలోనే కాకుండా అనేక పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో కూడా చర్చించటం, అందుకు మన సమాజం మౌనం వహించటం ప్రమాదకరం.’ అని అరవిందరావుగారు వాపోయారు. పురాతన కాలంలో తక్షశిల, పాటలీ పుత్రవంటి మన విశ్వవిద్యాలయాలకు విదేశాల నుంచి విద్యార్ధులు వచ్చే వారని గర్వంగా చెప్పుకుంటాం. ప్రస్తుతం అంతకంటే విస్తృతమైన ప్రపంచీకరణ యుగంలో వున్నాము. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, అది ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా విమర్శలు సరైనవా కావా అన్నది పాయింటు. అనేక తూర్పు ఆసియా దేశాలలో హిందూమతం, ఆచారాలు వ్యాపించాయి. వర్తమానంలో అనేక దేశాలలో మన దేశం నుంచి వలస వెళ్లిన వారు అక్కడ స్ధిరపడుతున్నారు, దేవాలయాలు నిర్మిస్తున్నారు, మతాచారాలను మరింతగా రెచ్చిపోయి పాటిస్తున్నారు. అందువలన ఎవరు ఎక్కడ చర్చించాలో చర్చించకూడదో గీతలు గీయటం సంకుచితం.

    ప్రతిదానికీ సంస్కృతితో ఎవరు ముడిపెడుతున్నారు? మతం వేరు సంస్కృతి వేరు. అన్ని మతాలు,అలవాట్లు, ఆచారాలను సహించటం మన సంస్కృతి. దాన్ని తిరస్కరించటం మత సంస్కృతి.దానిలో భాగంగానే అది ఏమతమైనా ఎవరేం తినాలో, దుస్తులు ఎలా ధరించాలో, ఎలా కూర్చోవాలో, ఎలా పరుగెత్తాలో కూడా నిర్దేశించేందుకు పూనుకున్నారు. మీరే చెప్పినట్లు భారతీయ మూల సిద్ధాంతంలోనే సహనశీలత, విశాల భావాలు వున్నాయనేది నిర్వివాదాంశం అయినపుడు చర్చలపై సమాజం మౌనం వహిస్తున్నదంటే వాటిని అంగీకరించినట్లే, మీ కెందుకు అంత దుగ్ద, లేదూ మీరు మౌనం వీడి చర్చలు, విమర్శలు ఎలా సరైనవికాదో విమర్శించండి. ఇస్లాం పుట్ట ముందే భారత దేశంలో బ్రాహ్మణులు లేత గోమాంసాన్ని లొట్టలు వేసుకుంటూ తినటం గురించి రాసింది వాస్తవమా కాదా? గోవులు, కోడె దూడల మాంసం తినటం గురించి వేదాల్లో వుందా లేదా ? అలాంటపుడు గోవును హిందూ సంస్కృతికి ముడిపెట్టి గోవధ చేసిన వారిని చంపివేయాలని వేదాలు చెప్పాయని తప్పుడు వ్యాఖ్యానాలు చేసే వారి గురించి అరవిందరావు ఏమంటారు ? భారత్‌లో పురాతన కాలంలోనే హిందూ మత భావజాలాన్ని అనేక మంది సవాలు చేశారు. దాన్ని మన సమాజం అంగీకరించింది. అరవిందరావుగారే చెప్పినట్లు వైదిక సంప్రదాయంలోనే శంకరాచార్యులు, రామానుజులు, మధ్వాచార్యులు ఒకరి సిద్దాంతాన్ని ఒకరు విమర్శించుకున్నారు. అలాంటిది వీరందరి సిద్ధాంతాలను కమ్యూనిస్టులో మరొకరో ఎవరైనా విమర్శిస్తే ఎక్కడలేని అసహనం ఎందుకు వెల్లడి అవుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా మన దేశం వివిధ మతాల, మతరహిత భావజాలాల కేంద్రంగా వుంది. అలాంటి దానిలో జాతీయత అంటే హిందూయిజమే, హిందూయిజమే జాతీయత అన్న తమ భావాన్ని రుద్దేందుకు కాషాయ తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు.వాదనలో తమతో ఏకీభవించని వారిని అంతం చేసేందుకు కూడా వీరశైవులు వెనకాడలేదని చరిత్ర చెబుతోంది.ఇప్పుడు అది మరో రూపంలో పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది.

    పురాణాలు, ఇతిహాసాలపై విశ్వాసం వున్న వారి ప్రకారం నాలుగు యుగాలున్నాయి. వాటిలో మొదటిదైన సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడిచిందట. బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా సమాజం వున్నప్పటికీ ఎవరికి ఎవరూ తీసిపోయేవారు కాదని, ఎవరి వృత్తి వారికి గొప్పదని, అందరికీ దేవుడు ఒక్కడేనని, ఆయనను ,స్వర్గం చేరుకోవటానికి ప్రతి ఒక్కరికి తపస్సు చేసుకోవటానికి అవకాశం వుందని చెబుతారు.ఈ యుగాలు, సామాజిక తరగతుల గురించి ఎవరికి వారు తమవైన వ్యాఖ్యానాలు చేస్తున్నందున వాటిలో ఒకదానిని నేను ప్రస్తావించాను.త్రేతాయుగం నాటికి ధర్మం మూడు పాదాలు, ద్వాపర యుగంలో రెండు పాదాలు, కలియుగంలో ఒక పాదంతో నడుస్తుందని చెబుతారు. ఇది కలియుగ అంతం కనుక అసలు ఏకపాద ధర్మం అయినా వుందో లేదో తెలియటం లేదని బాధ పడేవారు కూడా లేకపోలేదు. అరవిందరావు వంటి వారు కలియుగ అంతంలో అసలు ధర్మం ఏమిటో అంత స్పష్టంగా తెలియని స్ధితిలో గడిచిపోయిన యుగాలలోని ధర్మాలను ఇప్పుడు అమలు జరపాలని చెబుతున్నారా అనిపిస్తోంది. ఎలా సాధ్యం ? మాతృగర్భం నుంచి ఒకసారి బిడ్డ బయటికి వచ్చిన తరువాత తిరిగి అమ్మకడుపులోకి వెళ్లటం ఎంత అసాధ్యమో గడచిపోయినట్లు చెబుతున్న యుగ ధర్మాలను ఇప్పుడు అమలు జరపటం అంత కష్టం.

     సత్యయుగంలో అందరూ సమానమే అని చెబుతూనే శూద్రులు మిగతా తరగతులైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవలు చేయాలని కూడా చెప్పారు. ఇదొక వైరుధ్యం. సత్యయుగంలో శూద్రులు కూడా తపస్సు చేయవచ్చని చెప్పారు. కానీ త్రేతాయుగం వచ్చే నాటికి శూద్రులు తపస్సు చేయటం ధర్మవిరుద్ధంగా మారిపోయింది. వాల్మీకి రామాయణంలోని వుత్తరకాండలో రాసినదాని ప్రకారం ఒక రోజు ఒక బ్రాహ్మణుడు మరణించిన తన కుమారుడి శవాన్ని తీసుకొని శ్రీరాముడి వద్దకు వస్తాడు. నీవు కచ్చితంగా పాపం చేసిన కారణంగానే తన బిడ్డ మరణించాడని లేకుంటే బతికేవాడని ఆరోపిస్తాడు. ఆ సమయానికి ప్రత్యక్షమైన నారదుడు అసలు విషయం రాముడి పాపం కాదని ఒక శూద్రుడు తపస్సు చేస్తున్న కారణంగానే బ్రాహ్మణ బాలుడు మరణించాడని చెబుతాడు. వెంటనే రాముడు తనిఖీకి బయలు దేరి వెళ్లగా శంబుకుడు కనిపిస్తాడు. రామా నేను బొందితో కైలాసానికి వెళ్లటానికి ఈ తపస్సు చేస్తున్నానని చెబుతాడు.అది అధర్మం అంటూ శంబుకుడిని రాముడు వధిస్తాడు. తన కంటే ముందున్న సత్య యుగంలో శూద్రులు కూడా తపస్సు చేయటానికి అవకాశం వున్న విషయాన్ని రాముడెందుకు గ్రహించలేకపోయాడు. అప్పుడు కానిది తరువాత అధర్మం ఎందుకు అయింది అని ధర్మ చర్చకు ఎందుకు పెద్దలను సమావేశ పరచలేకపోయాడు? నియంతల పాలనలో మాదిరి అంతా రామరాజ్యంలో కూడా ఏకపక్షంగా నడిచినట్లు కనిపించటం లేదూ?అసలు శూద్రులు తపస్సు చేయటం ఎందుకు నిషిద్ధం ? అరవిందరావు వంటి వారు చెబుతున్నట్లుగా వేదాలలో చేసిన వృత్తులు బట్టి వర్ణాలు వచ్చాయంటున్నారే, రాముడి కాలంలో ఆ వేదాలలో చెప్పిన దాని ప్రకారం శూద్రులు తపస్సు చేయటం ఎలా అధర్మం అవుతుంది? అంటే వేదాల స్ఫూర్తిని రాముడి కాలంలోనే తోసిపుచ్చారా ? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవచేయటానికి శూద్రులు కట్టుబడి వుండాలి తప్ప ఇతరత్రా పనులు చేస్తే ఇదే జరుగుతుందని శంబుక వధతో రాముడు మిగతా శూద్రులను హెచ్చరించాడా ? నేటి దృష్టితో నాడు జరిగిన వాటిని ప్రశ్నించటం సమంజసమా అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. నిజమే ! అది ప్రశ్నించేవారికే కాదు, నాటి ఆదర్శాలను నేటికీ వల్లె వేస్తున్నవారికి అమలు జరపాలని చూస్తున్న వర్తించదా ?

     బ్రాహ్మలు కాని వారు పూజా పునస్కారాలు, పౌరోహిత్యం చేయటం వల్ల, కమ్యూనిస్టులు వేదమంత్రాలతో పనిలేకుండా వివాహాలు చేయటం వలన బ్రాహ్మలకు కష్టకాలం వచ్చిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే నారద మునీంద్రుల వంటి వారు నిజమే అని చెబితే ఏ ముఖ్యమంత్రి అయినా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటారా ? తనపైన ప్రశ్నించే మరొకరు లేరనే కదా ఎవడో ఏదో అన్నాడని శ్రీరాముడు గర్భిణీ అని కూడా చూడకుండా సీతను అడవులలో వదలి పెట్టి వచ్చాడు. ఇప్పుడు ఎవరైనా నేను రాముడిని అనుసరిస్తున్నాను, నా భార్య శీలం గురించి ఎవరో ఏదో అన్నారు కనుక నేను ఆమెను వదలి వేస్తున్నాను అంటే చెల్లుతుందా? లేదా నేను కృష్ణ భక్తుడిని ఆయన మాదిరి బహు వివాహాలు చేసుకుంటుంటే నిత్య పెళ్లి కొడుకు అని పోలీసులు జైల్లో పెట్టి నా మనోభావాలను గాయపరిచారు అని అంటే కుదురుతుందా ?

     ధర్మం నిర్వచనాన్ని ఎప్పుటి కప్పుడు పున:పరిశీలించాలి, మత పెద్దలు తప్ప మరెవరు చెప్పినా దీనికి ప్రామాణ్యం వుండదు అని అరవిందరావు అభిప్రాయపడ్డారు. అది జరిగేదేనా ? మత రాజ్యాలలోనే అలా జరగలేదు. అనేక మంది రాజులు మతాలు మారారు లేదా ఇతర మతాలను అనుమతించారు. ఇప్పుడు అది అసలు కుదిరేది కాదు.మత ప్రతినిధులుగా చెప్పుకుంటున్నవారు రాజ్యాంగాన్నే ధిక్కరిస్తూ మా విశ్వాసంలో న్యాయస్ధానాలు జోక్యం చేసుకోకూడదు, మా మనోభావాలు దెబ్బతినకూడదు అంటున్నారు.ఇటువంటి స్ధితిలో ధర్మాన్ని ఎవరు నిర్ణయించాలి శైవులా, వైష్ణవులా ఇతర శాఖల వారా ?పోనీ వీరంతా రాజీ పడినా, ఇతర మతాల వారి ధర్మాన్ని అంగీకరించే పరిస్ధితి వుందా ?

     చివరిగా అరవిందరావు గారి మరో ఆవేదన గురించి చూద్దాం. ‘ధర్మం గురించీ, మత సిద్ధాంతాల గురించీ ఎప్పుడు విమర్శలు వచ్చినా ఆ విమర్శలను ఎప్పటి కపుడు మన ఆచార్యులు ఎదుర్కొన్నారు…..ఎదుటి వాడి సిద్దాంతాన్ని సమీక్షించి తమ సిద్దాంతాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించారు. ఈ సంప్రదాయం గత నాలుగైదు శతాబ్దాలుగా పూర్తిగా లోపించటం, విమర్శలు వచ్చినా మన పండితులు, మత పెద్దలు స్దబ్దంగా వుండటం చాలా ఆశ్చర్యకరం ‘ అని వాపోయారు. మన మతం గురించి విదేశీ విశ్వవిద్యాలయాలలో చర్చించటాన్ని తప్పుపట్టిన అరవిందరావు ఈ విషయంలో పాశ్చాత్యులు కూడా వేలెత్తి చూపారని తన వాదనకు సమర్ధనగా తీసుకున్నారు. ఇది అన్యాయం కదా ? షెల్డన్‌ పోలాక్‌ అనే రచయిత ‘పదహారవ శతాబ్దం వరకు వున్న వాడి, వేడి మన పండిత లోకంలో నశించిందని ఆయన అభిప్రాయం. ఆయన చేసిన మిగతా విమర్శలు ఎలా వున్నా ఈ వ్యాఖ్యలో మాత్రం సత్యముంది అని ముక్తాయింపు నిచ్చారు.

     ‘ఈ కాలమందు మత త్రయము వారు( అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మత శాఖల్ని ప్రచారం చేసిన శంకర-రామానుజ- మధ్వాచార్వుల గురించి ) తమ తమ మత వ్యాప్తికై పరస్పర హింసా దూషణములతో వివాదపడి హిందూ రాజ్యముల దుర్బలతకు, తుదకు వినాశనమునకు బాగుగా తోడ్పడిరి. విజయనగర సామ్రాజ్య పతనమునదేకు, తర్వాతి యరాజక స్ధితికి దేశము య్కె అత్యంత దయనీయ స్ధితికి ఈ మతత్రయము వారెంత బాధ్యులో, ఎంత గొప్ప భాగస్వాములో నిరూపించుటకు ప్రత్యేక గ్రంధమవసరమగును’ అని సురవరం ప్రతాపరెడ్డి తన ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంధంలో రాశారు. విజయనగరం, కాకతీయ సామ్రాజ్యపతనాలకు ఈ మతాల చిచ్చు ఒక కారణంగా చెబుతారు. అవి పతనమైన తరువాత వాటి స్దానాన్ని నవాబులు, ఆంగ్లేయులు ఆక్రమించిన చరిత్ర తెలిసిందే. ఈ కాలంలో మత కొట్లాటలలతో లాభం లేదని ఆదరించే వారు వుండరని గ్రహించి ఒకరు కొకరు రాజీపడి కొత్త పాలకులను కొలవటానికి, బోగలాలసతకు అలవాటు పడిన మత పెద్దలు, పండిత లోకం వాడి,వేడిగా తిట్టుకోవాల్సిన అవసరం ఏముంది?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d