• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Congress

నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !

05 Friday Dec 2025

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, IMF about India, India economy, India GDP, India growth rates, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

పరీక్షల్లో మార్కులు తగ్గితే విద్యార్దుల గ్రేడ్‌ (నాణ్యత) తగ్గుతుంది.సమాధానాల పేరుతో పేజీల కొద్దీ రాసినా అసలు విషయాలు లేకపోతే మార్కులు పడవు. పదకొండు సంవత్సరాల పాలనలో నరేంద్రమోడీ సర్కార్‌ అందచేస్తున్న జిడిపి వృద్ధి అంకెల నాణ్యతను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) గతంలో ప్రశ్నించింది. ఎలాంటి స్పందన మార్పులు లేకపోవటంతో కొద్ది రోజుల క్రితం సి గ్రేడ్‌కు తగ్గించింది.దీని గురించి గురువారంనాడు (2025 డిసెంబరు 4) లోక్‌సభలో సమర్ధించుకుంటూ వచ్చే ఏడాదినుంచి 2022-23 సంవత్సరాన్ని నూతన ప్రాతిపదికగా తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఎన్‌సిపి సభ్యురాలు సుప్రియా సూలే అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ గణాంకవిధానం గురించి ఐఎంఎఫ్‌ చెప్పింది తప్ప అభివృద్ధి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అనేక అంకెలకు బి గ్రేడ్‌ ఇచ్చిందని నిర్మలమ్మ అన్నారు.మన అంకెల నాణ్యత నాలుగు గ్రేడ్లలో దిగువ నుంచి రెండవదిగా ఉంది.దీనికి అభివృద్ధి అంచనాలకు సంబంధం లేదు, వాటికి చెబుతున్న భాష్యం మీదనే పేచీ. గణింపుకు మీరు తీసుకున్న ప్రాతిపదిక, పద్దతి తప్పు, పాతబడిన సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని భాష్యాలను చెబుతున్నారంటూ 2025 ఆర్టికల్‌ నాలుగు నివేదికలో తలంటింది. మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానం గురించి ఇంటా బయటా గత పదేండ్ల నుంచి అనేక విమర్శలు వచ్చినప్పటికీ ఎలాంటి చలనం లేదు. ప్రస్తుతం 2011-12 సంవత్సర అంకెలను ప్రాతిపదికగా తీసుకొని గణాంకాలను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి 2022-23 ప్రాతిపదికగా కొత్త సూచీలను రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వ గణాంక మరియు కార్యక్రమాల అమలు శాఖ ప్రకటించింది. అయినప్పటికీ ఐఎంఎఫ్‌ మనదేశ సమాచార నాణ్యత గ్రేడ్‌ను తగ్గించింది. అంతర్జాతీయంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొత్త ప్రాతిపదికన నూతన సూచీలను తయారు చేస్తారు. ఐఎంఎఫ్‌ చర్యతో మరోసారి కేంద్రం చెబుతున్న అభివృద్ధి అంకెల విశ్వసనీయత గురించి మీడియా, సామాన్య జనంలో చర్చలేకపోయినా ఆర్థికవేత్తలలో మొదలైంది.

మన దేశ జిడిపి గురించి ప్రభుత్వం చెప్పే అంకెలకు ఐఎంఎఫ్‌ అంచనాలకు తేడా ఉంది. అది విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిజమైన జిడిపి వృద్ధి రేటు 6.5శాతం కాగా 2025-26 తొలి మూడు మాసాల్లో 7.8శాతం ఉంది. అయితే ఐఎంఎఫ్‌ మాత్రం 2025-26లో 6.6శాతం ఉంటుందని, మరుసటి ఏడాది 6.2శాతమని అంచనా వేసింది.మన ప్రభుత్వం అనుసరిస్తున్న గణాంక, విశ్లేషణ పద్దతులపై ఐఎంఎఫ్‌ చాలా సంవత్సరాల నుంచి విబేధిస్తున్నప్పటికీ సంస్థ నిబంధనల ప్రకారం సభ్యదేశాలు ఇచ్చిన అధికారిక సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకొని తన విశ్లేషణలను అందిస్తున్నది. వాటి గురించి తన భిన్నాభిప్రాయాన్ని చెప్పవచ్చు తప్ప సమాచారాన్ని తిరస్కరించేందుకు వీల్లేదు. కొద్ది సంవత్సరాలుగా వెల్లడిస్తున్న అభిప్రాయాలను జనం దృష్టికి తేలేదు. ఇప్పుడు కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.గత పదేండ్లలో పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, కరోనా తరువాత చెప్పే అంకెలకు, వాస్తవానికి తేడా ఉంటోందని ఐఎంఎఫ్‌ భావించింది. కొద్ది సంవత్సరాలుగా అంతర్గతంగా తన విబేధాలను వెల్లడిస్తూనే ఉంది, చివరికి 2025లో సమాచారం నాణ్యత గురించి గ్రేడ్‌ను తగ్గించింది. ఇప్పుడెందుకు ఆపని చేసింది. ముందే చెప్పుకున్నట్లుగా వచ్చే ఏడాది 2022-23 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని కొత్త సిరీస్‌ను విడుదల చేయనుంది గనుక ఇప్పటి వరకు గమనించిన లోపాలను సరిదిద్దాలనే ఉద్దేశ్యంతోనే ఈ పనిచేసిందని చెబుతున్నారు.ప్రస్తుతం ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలు ఇచ్చే సమాచారాన్నే ప్రాతిపదికగా తీసుకుంటున్నది తప్ప సంఘటిత, అసంఘటితరంగ సమాచారాన్ని నిర్దిష్టంగా సేకరించటం లేదనే విమర్శ ఉంది. ద్రవ్యోల్బణాన్ని లెక్కించేందుకు టోకు ధరలను ప్రామాణికంగా తీసుకుంటున్నది, దీనికి బదులు ఉత్పత్తి ధరలు, రంగాల వారీ ధరలను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. మొత్తం మీద ఆర్థిక రంగం గురించి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు కదా, నాణ్యత లేని సమాచారం ఆధారంగా తీసుకోవటాన్ని ఐఎంఎఫ్‌ తప్పుపట్టిందని మాత్రమే కొందరు సూత్రీకరిస్తున్నారు. రుణాలు, విదేశీమారకద్రవ్యం, ఖర్చు గురించి సరైన లెక్కలే చెబుతున్నారు కదా అంటున్నారు. ముఖం ఎలా ఉందో ఎవరికైనా తెలుస్తుంది,దాన్ని వేరేగా చెబితే వెంటనే బండారం బయటపడుతుంది. శరీరం అంతర్భాగంలో ఉన్నవాటిని ఎవరో ఒక నిపుణుడు చెబితేనే కదా మనకు తెలిసేది, ఆ చెప్పటంలోనే నిపుణుల మధ్య ఏకాభిప్రాయం, నాణ్యత లేదన్నది సమస్య. కేవలం చెయ్యి చూసి అంతాబాగానే ఉందంటే కుదురుతుందా ? నాణ్యత లేని వస్తువును కొన్నపుడు అది ఎంతకాలం మన్నుతుందో తెలియదు, నాణ్యత లేని సమాచారం ప్రాతిపదికగా ఏ రంగమైనా దీర్ఘకాలిక వ్యూహాలను ఎలా రూపొందించుకుంటుంది ?

జిడిపి వృద్ధి రేటు ఎక్కువగా ఉందని చూపుతున్నపుడు దానికి తగినట్లుగా కార్పొరేట్‌ ఫలితాలు కనిపించటం లేదన్నది కొందరి ప్రశ్న. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో జడిపి వృద్ధి రేటు 7.4శాతం ఉంటుందని, పబ్లిక్‌ ఫైనాన్స్‌ మరియు విధాన జాతీయ సంస్థ(ఎన్‌ఐపిఎఫ్‌పి) చెప్పింది.మూడీస్‌ రేటింగ్‌ సంస్థ 2026, 2027 సంవత్సరాలలో ప్రపంచ వృద్ధి రేటు 2.5 -2.6శాతం మధ్య, భారత వృద్ధి 6.4 మరియు 6.5, చైనా 4.5శాతం ఉంటుందని పేర్కొన్నది. ఇవి చూడటానికి బాగానే ఉన్నాయి.పశ్చిమ దేశాల సూత్రం ప్రకారం జిడిపి వృద్ధి రేటు కంటే కార్పొరేట్‌ లాభాల రేటు మూడు, నాలుగుశాతం ఎక్కువగా ఉంటుంది.మనదేశంలో కూడా దశాబ్దాల పాటు అలాగే ఉంది. కానీ సెప్టెంబరుతో ముగిసిన మూడు మాసాల్లో నిఫ్టీ 50 సూచికలో పెరుగుదల కేవలం ఏడుశాతమే. మొత్తం లాభాలు 13శాతం కాగా పన్నులు పోను నిఖర లాభం తొమ్మిదిశాతమే ఉంది. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించకపోవచ్చుగానీ దాన్ని విస్మరించలేము.నిప్టీ మైక్రోకాప్‌ 250 అమ్మకాల వృద్ధి 12శాతం ఉన్నా, మొత్తం లాభాలు ఆరుశాతమే ఉన్నాయి. జిడిపి వృద్ధి రేటు స్థిరంగా ఉంటే ఈ ఫలితాల సంగతేమిటి ? ఏ అంకెలు వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు ? ఆసియన్‌ పెయింట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ 2024 మేనెలలో జిడిపి అంకెలు ఎలా వస్తున్నాయో నాకు నమ్మకం లేదు అని వ్యాఖ్యానించాడు. ఆ మాటలు వైరల్‌ కావటంతో ఒక్క రోజులోనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. ఎక్కడి నుంచి వత్తిడి వచ్చిందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు.

పిండికొద్దీ రొట్టె అన్నారు.కుండలో కూడు కూడు అసలుందో లేదో ఉంటే ఎంత ఉందో,పిల్లాడు తిన్నాడో లేదో తెలియదు గానీ దుడ్డులా ఉన్నాడు అని చెబుతున్నట్లుగా అభివృద్ధి గొప్పగా ఉందని భాష్యం చెబుతున్నారు. జిడిపికి దోహదం చేసేవాటిలో వినియోగవృద్ధి ఒకటి.దేశంలో నిజవేతనాలు పడిపోవటం లేదా గిడసబారి పోయినట్లు చెబుతుండగా గృహస్తుల వినియోగం పెరిగిందని చెప్పటం మీద అనుమానాలు ఉన్నాయి. రెండవ అంశం పెట్టుబడులు, మొత్తం పెట్టుబడుల్లో ప్రైవేటు పెట్టుబడులు నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు జిడిపిలో 31.3శాతం ఉంటే 2024-25లో 29.6శాతం ఉన్నాయి. మధ్యలో ఒక ఏడాది మాత్రమే 31.2శాతం నమోదయ్యాయి. మిగిలిన అన్ని సంవత్సరాలలో అంతకంటే తక్కువే.ఈ కాలంలో కార్పొరేట్‌ పన్ను మొత్తం ప్రైవేటు రంగానికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని చూస్తే కార్పొరేట్‌ పన్ను విధింపు 30శాతం నుంచి 15కు తగ్గించారు. అయినా పారిశ్రామికరంగం వాటా జిడిపిలో 2014తో పోల్చితే తగ్గింది లేదా స్థిరంగా ఉంది తప్ప పెరగలేదు. చైనాలో సాధారణ కార్పొరేట్‌ రేటు 25శాతం కాగా మన దేశంలో కొత్త సంస్థలకు 15శాతంగా రాయితీ ఇచ్చినప్పటికీ చైనా నుంచి కంపెనీలు ఆశించిన స్థాయిలో రాలేదు. మేకిన్‌ ఇండియా విధానంతో 2022 నాటికి జిడిపిలో పారిశ్రామిక రంగం వాటా 25శాతం లక్ష్యంగా చెప్పారు.తరువాత దాన్ని 2025కు పొడిగించామన్నారు. వాస్తవ పరిస్థితి ఏమిటి 2006లో 17.3శాతం ఉండగా మోడీ అధికారానికి వచ్చినపుడు 2014లో 15.07 నమోదైంది తరువాత నేటి వరకు చూస్తే 13శాతానికి పడిపోయింది. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా పదవ స్థానంలో ఉన్న జిడిపిని ఐదుకు తెచ్చామంటారు, మరి దీని సంగతేమిటి ? జిడిపిని 2022 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామన్నారు, పారిశ్రామిక ఉత్పాదకత పెరగకుండా అదెలా సాధ్యం ? ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోయాయి, ప్రభుత్వ పెట్టుబడులు పెట్టటం లేదు. ఆర్థిక మాంద్యం వచ్చినపుడు అమెరికాలో భారీ మొత్తంలో రోడ్లు, వంతెనలు, రైల్వే వంటి మౌలిక సదుపాయాల మీద అక్కడి ప్రభుత్వం ఖర్చు చేసి కొనుగోలు శక్తి పెంచేందుకు చూసింది. అక్కడి మాదిరి మాంద్యాలు లేకపోయినా మందగమనం కారణంగా మనదేశంలో కూడా జరుగుతున్నది అదే. ప్రైవేటు రంగంలో తనకు లాభం ఉంటుందా లేదా అని ఆచితూచి పెట్టుబడులు పెడుతోంది.వాజ్‌పారు నుంచి మధ్యలో మన్మోహన్‌ సింగ్‌, ఇప్పుడు నరేంద్రమోడీ వరకు భారీమొత్తాలను కేటాయించి జాతీయ రహదారులనిర్మాణం, రైల్వే విస్తరణ, సరిహద్దుల్లో రోడ్లు, వంతెనల వంటివి నిర్మిస్తున్నారు.అవి లేకపోతే పరిస్థితి మరింత దిగజారి ఉండేది, బిజెపి నేతలు రోడ్లను చూపి చూశారా మా ప్రతిభ అంటున్నారు. అదే సామర్ధ్యాన్ని ఉత్పాదకరంగంలో ఎందుకు చూపలేకపోతున్నారు ? మోటారు వాహనాలు, ఎలక్ట్రానిక్స్‌ వంటి వాటి ఉత్పాదకతను పెంచకపోయినా పడిపోకుండా చూసేందుకు ఇటీవల తగ్గించిన జిఎస్‌టి కూడా ఆయా రంగాలకు ఉద్దీపనలో భాగమే.చిత్రం ఏమిటంటే జిఎస్‌టి తగ్గించిన రెండు నెలల తరువాత నవంబరు మాసంలో పన్ను వసూలు పెరగకపోగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువగా నమోదైంది. అందుకే నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి భజనబృందాలు ఇప్పుడు మూగపోయాయి.

జిఎస్‌టి తగ్గింపు గురించి గతేడాదే సంప్రదింపులు మొదలయ్యాయి. తగ్గింపుతో డిమాండ్‌ పెరిగి ప్రైవేటు రంగానికి పెద్ద ఊపువస్తుందన్న అంచనాతో 2025-26 బడ్జెట్‌లో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించేందుకు పూనుకుంది. వాటిలో గ్రామీణ ఉపాధిపథకానికి నిధుల కోత ఒకటి.2023-24లో రు.89,154 కోట్లు ఖర్చు చేస్తే 2025-26లో రు.86వేల కోట్లకు కుదించారు.2025 జనవరిలో చూస్తే ఏడు రాష్ట్రాలలో ప్రకటించిన వేతన సగటు రు.294 కాగా చెల్లించిన మొత్తం రు.257 మాత్రమే. తెలంగాణాలో రు.319కిగాను రు.276, ఆంధ్రప్రదేశ్‌లో రు.300కు గాను రు.258 చెల్లించారు. జిడిపిలో ప్రభుత్వ ఖర్చు వాటాను 15.6 నుంచి 15శాతానికి తగ్గించారు. వాస్తవంలో ఇంకా దిగజారుతుందేమో తెలియదు. మొత్తంగా దేశమంతటా శ్రామికుల నిజవేతనాలు పెరగకుండా వస్తు, సేవలకు గిరాకీ పెరగదు. ఉద్యోగులకు వేతన సవరణ చేసినంత మాత్రాన మొత్తం గిరాకీ మీద దాని ప్రభావం పెద్దగా ఉండదు. ఉదాహరణకు రెండు తెలుగు రాష్ట్రాలలో చూస్తే కోట్లాది మంది రాబడిని పెంచే అసంఘటిత రంగ కార్మికుల వేతనాలను ఉమ్మడి రాష్ట్రంలో మాత్రమే పెంచారు. ఐదేండ్లకు ఒకసారి సవరిస్తే ఈ పాటికి మూడుసార్లు పెరిగేవి.ప్రభుత్వాల ఖర్చు అంటే ఏదో ఒక రూపంలో జనాలకు చేరే మొత్తాలతో పాటు పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకూ లబ్ది చేకూరుతుంది. ప్రైవేటు పెట్టుబడులలు అలాంటివి కాదు, వాటి లాభాలే ప్రాతిపదికగా ఉంటాయి. అందువలన ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పు రానున్న రోజుల్లో ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.అధికారంలో ఎవరున్నా చేసింది అంకెల గారడీ గనుకనే సామాన్యుల స్థితిలో పెద్దగా మార్పులేదు, వచ్చే ఏడాది నూతన సీరీస్‌ అంటున్నారు గనుక మరో జిమ్మిక్కు చేయనున్నారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

30 Sunday Nov 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

14th Dalai Lama, 1962 India–China war, Anti China Media, Arunachal Pradesh Dispute, CIA on Tibet, CPI, CPI(M), Jawaharlal Nehru, Mao Zedong, Narendra Modi, USSR

ఎం కోటేశ్వరరావు

ఇటీవల చైనాతో సంబంధం ఉన్న రెండు వార్తలు, విశ్లేషణలు మీడియాలో వచ్చాయి.ఒకటి, 1962లో చైనాతో వచ్చిన యుద్ధం సరిహద్దు సమస్యల మీద కాదు, రెండవది అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన మన పౌరురాలి పాస్‌పోర్టు, వీసా చెల్లదు అని చైనా విమానాశ్రయంలో ఇబ్బంది పెట్టారు అన్నది రెండవది. మొదటి అంశాన్ని మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు, రెండవదాని మీద పెద్ద ఎత్తున స్పందించింది, ఎందుకు ?చైనాతో వచ్చిన యుద్దం గురించి వచ్చిన విశ్లేషణ మీద కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది, దాని మనసెరిగి, కనుసన్నలలో నడుస్తున్న మీడియా కావాలనే విస్మరించింది. రెండవ ఉదంతం మీద దానికి భిన్నంగా జరిగింది. చరిత్ర దాస్తే దాగేది కాదు, చెరిపితే పోయేది కాదు.రెండు దేశాల మధ్య యుద్ధం ప్రాధమికంగా సరిహద్దులపై ఏకాభిప్రాయం లేకపోవటం లేదా దౌత్యపరమైన వైఫల్యాల వలన జరగలేదని, పథకం ప్రకారం 1950 మరియు 60దశకాల్లో అమెరికా అనుసరించిన వ్యూహంలో భాగంగా చోటు చేసుకుందని సిఐఏ, దౌత్యకార్యాలయాల పత్రాలు, ప్రచ్చన్న యుద్ద అంతర్జాతీయ చరిత్ర ప్రాజెక్టు పత్రాలు వెల్లడించాయి. కొన్ని ప్రధాన మంత్రి మ్యూజియం మరియు లైబ్రరీలో కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

చైనాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని సంప్రదింపులతో పరిష్కరించుకోవాలన్న వైఖరిని వెల్లడించినందుకు తరువాత సిపిఐ(ఎం)గా ఏర్పడిన నాయకులను యుద్ధ సమయంలో ప్రభుత్వం, నాడు జనసంఘం రూపంలో ఉన్న నేటి బిజెపి నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర పార్టీలు, సంస్థలు దేశద్రోహులుగా చిత్రించాయి. ప్రభుత్వం జైల్లో పెట్టింది. యుద్దాన్ని సమర్ధించి నాటి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన సిపిఐతో ఇతరులను దేశభక్తులుగా చిత్రించారు, జనం కూడా అత్యధికులు నిజమే అని నమ్మారు. అది జరిగి ఆరు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు వెలువడిన నిజానిజాలేమిటి ? యుద్ధానికి కారణం సరిహద్దు సమస్య కాదని, టిబెట్‌ కేంద్రంగా అమెరికా జరిపిన కుట్రలో భాగంగా జరిగిందని ఇటీవల బహిర్గత పరచిన నాటి రహస్య పత్రాలను అధ్యయం చేసిన వారు చెప్పిన మాట ఇది. వారెవరూ కమ్యూనిస్టులు కాదు. ఆ పత్రాలన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి గనుక దీనికి భిన్నమైన విశ్లేషణను ఎవరైనా జనం ముందు పెట్టవచ్చు. అప్పటి వరకు కమ్యూనిస్టుల మీద నిందవేయటం తప్పని దాన్ని వెనక్కు తీసుకుంటామని ఎవరైనా నిజాయితీతో అంగీకరిస్తారా ?

” 1962 చైనా-భారత్‌ సంఘర్షణ భౌగోళిక రాజకీయ పరిణామాల వెల్లడి : చైనాా-భారత్‌ విభజనను అమెరికా ఎలా మలచింది ? ” అనే శీర్షికతో అమెరికాలోని పబ్లిక్‌ ఎఫైర్స్‌ జర్నల్‌ ఏప్రిల్‌ 2025 సంచికలో వెల్లడించారు. దాని రచయిత జిందాల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌లో పని చేస్తున్న డాక్టర్‌ లక్ష్మణ కుమార్‌. ది హిందూ బిజినెస్‌లైన్‌ పత్రికతో ఆయన సంభాషించిన అంశాలను ఆ పత్రిక ప్రచురించింది. సోషలిస్టు దేశాలపై అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దం, సోవియట్‌ యూనియన్‌-చైనా మధ్య తలెత్తిన సైద్ధాంతిక వివాదాలను ఆసరా చేసుకొని టిబెట్‌ అంశాన్ని ముందుకు తెచ్చి భారత్‌-చైనా మధ్య వివాదాన్ని రగిలించేందుకు అమెరికా రూపొందించిన దీర్ఘకాలిక కుట్రకు రెండు దేశాలూ గురయ్యాయి. నాటి నుంచి నేటి వరకు తరువాత కాలంలో సాధారణ సంబంధాలు ఏర్పడినప్పటికీ పరస్పరం నమ్మకంలేకుండా గడుపుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికా ఎత్తుగడ నిజానికి టిబెట్‌ తిరుగుబాటుదార్లకు ఏదో చేద్దామని కాదు, వారికి సాయపడే ముసుగులో భారత్‌-,చైౖనా మధ్య వైరం పెంచటమే అసలు లక్ష్యంగా రహస్య పత్రాల్లో వెల్లడైంది.

1962 అక్టోబరు 20న చైనా దాడి ప్రారంభించి నవంబరు 20న ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి అరుణాచల్‌ ప్రదేశ్‌లో తన ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల నుంచి సేనలను ఉపసంహరించుకొని వాస్తవాధీన రేఖకు పరిమితమైంది. అవి తన ప్రాంతాలని అంతకు ముందునుంచి చెబుతున్నప్పటికీ చైనా వెనక్కు తగ్గింది. టిబెట్‌లో జరిగిన కుట్రల క్రమ సారాంశం ఇలా ఉంది.1956లో అక్కడ దలైలామా పలుకుబడిలో ఉన్న ప్రభుత్వ మద్దతుతో తిరుగుబాటుకు నాందిపలికారు. సిఐఏ దాన్ని అవకాశంగా తీసుకొని ముందే చెప్పుకున్నట్లు 1957 నుంచి 1961వరకు వారికి శిక్షణ, ఆయుధాలు,రేడియోలు, ఇతర పరికరాలను ఇచ్చింది.విమానాల ద్వారా 250టన్నుల మిలిటరీ సరఫరాలు చేసింది.నిఘావిమానాల ద్వారా సమాచారాన్ని అందచేసింది. చైనా మిలిటరీ తిరుగుబాటును అణచివేయటంతో 1959లో దలైలామాను టిబెట్‌ నుంచి తప్పించి అరుణాచల్‌ ప్రదేశ్‌ ద్వారా భారత్‌కు చేర్చారు.దీనికి నాటి నెహ్రూ సర్కార్‌ పూర్తి మద్దతు ఇచ్చింది, అధికారులను పంపి మరీ స్వాగత ఏర్పాట్లు చేసిందంటే అమెరికా సిఐఏతో సమన్వయం చేసుకోకుండా జరిగేది కాదు. అంతేనా మన దేశంలో ఆశ్రయం కల్పించటమే గాక తిరుగుబాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చింది. దీన్ని రెచ్చగొట్టటం, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంగా చైనా పరిగణించింది.1961లో ఉత్తర నేపాల్లోని ముస్టాంగ్‌కు సిఐఏ తన కార్యకలాపాలను విస్తరించింది. దలైలామా పరారీ తరువాత అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా మిలిటరీ మన సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.చైనాను నిలువరించాలని ప్రధాని నెహ్రూ నాటి సోవియట్‌ నేతలను కోరారు. అయితే తాము తటస్థంగా ఉంటామనే సందేశాన్ని వార్తల ద్వారా సోవియట్‌ పంపింది. తరువాత దాని నేత కృశ్చెవ్‌ 1959 అక్టోబరు రెండున బీజింగ్‌ పర్యటనలో నెహ్రూ మంచివాడని, భారత్‌తో వైరం వద్దని మావోకు సూచించటంతో ఈ వైఖరి చైనా-సోవియట్‌ మధ్య విబేధాలను పెంచింది. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుంటామని అది పెద్ద సమస్య కాదని, అసలు అంశం టిబెట్‌ అని ఈ విషయంలో భారత్‌తో రాజీపడేది లేదని మావో చెప్పినట్లు కథనాలు వచ్చాయి. దాని పర్యవసానాలు మనదేశంలో కూడా ప్రతిబింబించాయి. అవిభక్త కమ్యూనిస్టు పార్టీలోని ఒక వర్గం సోవియట్‌ వైఖరికి అనుగుణంగా నెహ్రూ అనుకూల, చైనా వ్యతిరేక వైఖరిని తీసుకుంది.దానికి భిన్నంగా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే వైఖరిని మరో వర్గం తీసుకుంది. అందుకు వారిని జైలుపాలు చేశారు. తరువాత వారే సిపిఐ(ఎం)గా ఏర్పడ్డారు. నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు సిపిఐ(ఎం) వైఖరే సరైనదని రుజువు చేశాయి.సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌, బిజెపి ఎవరు అధికారంలో ఉన్నా వాటి మీద ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉంటూనే చైనాతో సంబంధాలను కొనసాగించారు. ఏ ప్రధానీ కలవనన్ని సార్లు చైనా నేతలతో భేటీ అయి నరేంద్రమోడీ ఒక రికార్డు సృష్టించారు.చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులలో మోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు.

అసలు రెండు దేశాల మధ్య యుద్దానికి దారితీసిన పరిస్థితి ఏమిటి ? తెరవెనుక అమెరికా సృష్టించిన టిబెట్‌ చిచ్చుకాగా బయటికి సరిహద్దు వివాదంగా ముందుకు వచ్చింది.1954లో చైనా-భారత్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. అయితే అప్పటికే అమెరికా కుట్ర మొదలైంది. దాన్లో భాగంగా బుద్ద జయంతిని జరుపుకొనే పేరుతో 14వ దలైలామా భారత్‌ వచ్చాడు. ఆ సందర్భంగా అంగీకరిస్తే భారత్‌లో ఆశ్రయం పొందుతానని చేసిన వినతిని నెహ్రూ తిరస్కరించారు. కానీ అదే నెహ్రూ సిఐఏ పధకం ప్రకారం టిబెట్‌ నుంచి పారిపోయి 1959 ఏప్రిల్‌ 18న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తేజ్‌పూర్‌ చేరుకున్న దలైలామాకు మానవతాపూర్వక కారణాల సాకుతో ఆశ్రయం ఇవ్వటమేగాక ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకూ అనుమతించించారు. వేలాది మంది టిబెట్‌ నుంచి వచ్చిన వారికీ ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. కాలనీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.సరిహద్దులో మన ప్రభుత్వం 1961 కొన్ని పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి ఆ ప్రాంతం తమ అదుపులోనే ఉందని ఉద్ఘాటించింది. అప్పటికే దలైలామా ప్రవాస ప్రభుత్వం చైనా వ్యతిరేక కార్యకలాపాలను సాగిస్తోంది.దీనికి తోడు సరిహద్దుల్లో కొత్తగా పోస్టులను ఏర్పాటు చేయటాన్ని అవకాశంగా తీసుకొని చైనా వాటిని తొలగించేందుకు పూనుకోవటం, మన మిలిటరీ ప్రతిఘటించటంతో అది తరువాత నెల రోజుల యుద్ధంగా మారింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ మహిళ ప్రేమా వాంగ్‌జోమ్‌ థోంగ్‌డాక్‌ దగ్గర ఉన్న పాస్‌పోర్టు చెల్లదంటూ షాంఘై పుడోంగ్‌ విమానాశ్రయ అధికారులు కొన్ని గంటల పాటు నిలిపివేశారంటూ వచ్చిన వార్తలకు మన మీడియా పెద్ద ఎత్తున ప్రచారమిచ్చిన సంగతి తెలిసిందే.మనదేశం, చైనాల మధ్య సరిహద్దులంటూ మాపులపై బ్రిటీష్‌ అధికారులు గీచిన రేఖలు రెండు దేశాల మధ్య వివాదాన్ని సృష్టించాయి. వివిధ సందర్భాలలో ప్రచురించిన మాప్‌ల ప్రకారం ప్రస్తుతం మన దేశంలో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ చైనాకు చెందినది, చైనా ఆధీనంలో ఉన్న లడఖ్‌ సమీపంలోని ఆక్సారుచిన్‌ ప్రాంతం మనదిగా చూపాయి. అందువలన రెండుదేశాలూ అవి తమ ప్రాంతాలని మాపుల్లో చూపుతున్నాయి. అరుణాచల్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతమైన జాంగ్‌నాన్‌ అని చెబుతుండగా ఆక్సారు చిన్‌ మా లే (లడఖ్‌) జిల్లాలో భాగమని అంటున్నాము. దలైలామా 2023లో తవాంగ్‌ పర్యటన చేస్తామని ప్రకటించగా అనుమతించకూడదంటూ నాడు చైనా అభ్యంతరం చెప్పింది.అంతకు ముందు కూడా అభ్యంతరాల మధ్య పర్యటించినా చివరిసారిగా గాల్వన్‌ ఉదంతాల తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపధ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌-భారత్‌ పేరుతో ఉన్న పాస్‌పోర్టు, వీసాలను చైనా తిరస్కరించటం ఇదే మొదటిసారి కాదు. పాస్‌పోర్టు మీద స్టాంప్‌ వేయటానికి నిరాకరించి ఒక తెల్లకాగితం మీద అనుమతి పత్రాన్ని జారీ చేస్తామని చైనా చెప్పింది. దానికి నిరాకరించిన మనదేశం చైనాలో జరిగిన ఆసియా క్రీడలకు మన క్రీడాకారులను పంపలేదు. తాజాగా ప్రేమ అనే మహిళ విషయంలో కూడా అదే జరిగింది, మీరు భారతీయురాలు కాదు, చైనీస్‌ అందువలన వీసా కోసం దరఖాస్తు చేసుకోండి అని చైనా అధికారులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

చిత్రం ఏమిటంటే మన దేశంలో ఆశ్రయం పొంది,ప్రవాస టిబెట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1959 నుంచి అన్ని సౌకరాలను అనుభవిస్తున్న 14వ దలైలామా 2003లో మాట్లాడుతూ అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో అంతర్భాగం అన్నాడు తప్ప మనదేశంలో భాగం అని గుర్తించలేదు. అయినప్పటికీ అతగాడికి సౌకర్యాలు కల్పించటం రాజకీయం తప్ప వేరు కాదు. మనదేశం తెచ్చిన వత్తిడి, విధిలేని పరిస్థితిలో 2008లో తన వైఖరిని మార్చుకున్నాడు. 1914లో బ్రిటీష్‌ వారు గీచిన మక్‌మోహన్‌ రేఖను భారత్‌-టిబెట్‌ సరిహద్దుగా నిర్ణయిస్తూ బ్రిటీష్‌ ఇండియా పాలకులు టిబెట్‌ పాలకులతో సిమ్లాలో ఒప్పందం చేసుకున్నారు.బ్రిటీష్‌ వారి పాలనకు చరమగీతం పాడారు, దాంతో ఉక్రోషం పట్టలేని బ్రిటన్‌ కుట్రకు తెరలేపింది. అప్పుడే స్వాతంత్య్రం పొందిన చైనాకు టిబెట్‌ మీద హక్కులేదని చెప్పేందుకు బ్రిటీష్‌ పాలకులు పన్నిన కుట్రలో భాగం సిమ్లా ఒప్పందమంటూ నాటి, నేటి చైనా ప్రభుత్వం అంగీకరించలేదు. టిబెట్‌ తమ సామంత దేశమని అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకొనేందుకు దాని పాలకులకు హక్కు లేదు, చెల్లదని చైనా చెబుతున్నది. ఉదాహరణకు, బ్రిటీష్‌ పాలనలో సామంత రాజ్యాలుగా ఉన్న కాశ్మీరు, నిజాం సంస్థానాలు స్వాతంత్య్రం ప్రకటించుకోవటాన్ని నాడు మన కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ పూర్వరంగంలో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటం తప్ప దగ్గరదారి లేదు. అప్పటి వరకు యథాతధ స్థితి కొనసాగించాల్సి ఉంది. రెండు దేశాలూ ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నప్పటికీ సాధారణ సంబంధాలకు ఢోకా ఉండదు. వివాదాన్ని కాలమే పరిష్కరించాల్సి ఉంది. యుద్ధాల ద్వారా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటం కుదిరే అంశం కాదు. ఆక్రమిత కాశ్మీరుపై మనకు తిరుగులేని హక్కు ఉంది, ఎలాంటి వివాదం లేకున్నా బలప్రయోగంతో స్వాధీనం చేసుకొనేందుకు పూనుకోలేదు. చైనా గురించి న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అమెరికా బడా పత్రికలు అనేక తప్పుడు వార్తలు ఇచ్చాయి. మీడియాలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు లేదా అధికారంలో లేని సంస్థలు, వ్యక్తులు చేసే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే అంశాలకు రెండు దేశాలకు చెందిన పౌరులు భావోద్వేగాలకు గురైతే బుర్రలు ఖరాబు చేసుకోవటం తప్ప జరిగేదేమీ ఉండదు. వివాదాలు పభుత్వాలు తేల్చాల్సిన, తేల్చుకోవాల్సిన అంశాలని గ్రహించాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిందూత్వ శక్తుల అడ్డగోలు వాదనలు – ముస్లింలే కదా అని మౌనంగా ఉంటే మహిళలు, బడుగులకూ ముప్పు !

22 Saturday Nov 2025

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

# Anti Muslims, BJP, Hindu Fundamentalism, hindutva, mata vaishno devi medical college, Muslims in Higher Education, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన జమ్మూ -కాశ్మీరు రాష్ట్రంలో మాతా విష్ణుదేవి పేరుతో కొత్తగా ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటయింది.నేషనల్‌ ఎలిజబులిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ ) ప్రతిభ ఆధారంగా ఆ రాష్ట్రంలోని వారికి సీట్లు కేటాయిస్తారు. ఇటీవలనే జమ్మూ ప్రాంతంలో ప్రారంభమైన ఆ కాలేజీలో 2025-26 సంవత్సరానికి తొలి బ్యాచ్‌ సీట్ల కేటాయింపు జరిగింది. యాభై సీట్లకు గాను 42 మంది ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారు సీట్లు పొందారు. దాని అనుబంధ ఆసుపత్రిలో వైద్యులు కూడా ముస్లింలే ఎక్కువగా ఉన్నారట. ఇంకేముంది అక్కడి హిందూత్వ వాదులు గుండెలు బాదుకుంటూ సీట్ల కేటాయింపు విధానాన్ని తాము అంగీకరించటం లేదని, మార్చాల్సిందే అని ఆందోళనకు దిగారు. షరా మామూలుగా బిజెపి వారు కూడా వారితో చేరారు. వారి వాదన ఏమిటి ? సీట్ల కేటాయింపు మత సమతూకం ప్రకారం లేదట. ఆ కాలేజీ నిర్వహణ మాత వైష్ణదేవి ఆలయానికి చెందిన బోర్డుది గనుక హిందూ భక్తులు ఇచ్చిన నిధులతో ఏర్పాటు చేసినందున మెజారిటీ సీట్లు, సిబ్బంది హిందువులతోనే నింపాలని రభస చేస్తున్నారు. మత ప్రాతిపదికన సీట్లు కేటాయించాలంటున్నారు. చిత్రం ఏమిటంటే దేశంలోని ఇతర ప్రాంతాల్లో వీరు మరోవిధంగా రెచ్చగొడుతున్నారు. వెనుకబాటు తనం ఆధారంగా ముస్లింలను ఓబిసి, బిసి జాబితాలో చేర్చి విద్య,ఉపాధి రంగాలలో రిజర్వేషన్లను కల్పించాలంటే ఇదే హిందూత్వ శక్తులు బరాబర్‌ వ్యతిరేకిస్తూ మత ప్రాతికన రిజర్వేషన్లు ఉండకూడదని రచ్చ చేస్తున్నాయి. ఏ రోటి దగ్గర ఆ పాట పాడుతున్నారు. వీరికి రాజ్యాంగం, చట్టాలు, నిబంధనల పట్ల నిబద్దత లేదు, వారు చెప్పిందే అమలు జరగాలి. ఈ అడ్డగోలు వాదన ఒక్క మాత వైష్ణదేవి సంస్థకే, ముస్లింలకే పరిమితం అవుతుందా ? దేశంలో పన్నులు చెల్లిస్తున్నవారిని మత, కుల ప్రాతిపదికన లెక్కించి అన్నీ ఆ ప్రకారమే చేయాలని కూడా రోడ్లెక్కరన్న గ్యారంటీ ఏముంది ?

ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మైనారిటీ మతాలకు చెందిన వారు నిర్వహించే సంస్థలలో ఆ మతాలకు చెందినవారికే పెద్ద పీట వేస్తారని, అలాంటిది హిందువులు నిర్వహించే సంస్థలకు ఎందుకు వర్తించదని అమాయకత్వాన్ని నటిస్తున్నారు. మన రాజ్యాంగం మైనారిటీ సంస్థల నిర్వహణకు అలాంటి వెసులుబాటు కల్పించింది. వాటికీ నిబంధనలు ఉన్నాయి తప్ప అడ్డగోలు తనం కుదరదు. దేశంలో హిందువులు మైనారిటీలు కాదు.వైష్టదేవి ఆలయ బోర్డు తన విధానాలను మార్చుకొని మతానికే మాత్రమే పరిమితం కావాలని, హిందువులకు మాత్రమే సీట్లు, ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్లను కూడా కొందరు ముందుకు తెచ్చారు. మరికొందరైతే దేవాలయాలకు వెళ్లని వారిని ఆ కాలేజీలో పనిచేయనివ్వకూడదని కూడా డిమాండ్‌ చేశారు. వైద్యసేవలు అందించటానికి-దేవాలయాల సందర్శనకు అసలు సంబంధం ఏమిటి ? ఈ ఉన్మాదం అంతటితో ఆగుతుందా ? అడ్డబొట్లు, నిలువు బొట్ల వివాదాన్ని, చివరకు మనువాద చాతుర్వర్ణ వ్యవస్థను కూడా ముందుకు తీసుకువస్తుంది. మొగ్గగా ఉన్నపుడే మహిళలు, వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు ఈ ప్రమాదకర ధోరణుల గురించి ఆలోచించాలి. ముస్లింలే కదా మనకెందుకులే అనుకుంటే చివరికి ఈ తరగతుల వరకు వచ్చినపుడు అయ్యో అనేవారు ఉండరు. ఎందుకంటే చరిత్రలో మనువాద బాధితులు వీరే. హిందూత్వ శక్తుల ఆరాధ్య దైవం హిట్లర్‌ జర్మనీలో చేసింది అదే. ముందుగా కమ్యూనిస్టులను అణచివేస్తే, యూదులను ఊచకోత కోస్తే జనం పట్టించుకోలేదు, చివరికి తమదాకా వచ్చిన తరువాత ఎవరూ మిగల్లేదు.

మన రాజ్యాంగం దేశం మొత్తాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి మైనారిటీలను గుర్తించింది తప్ప రాష్ట్రాల్లో ఉన్న జనాభాను బట్టి కాదు. జమ్మూ కాశ్మీరులో మొత్తంగా చూసినపుడు మెజారిటీ ముస్లింలు, ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువ చోట్ల మెజారిటీ క్రైస్తవులు. అలాంటి చోట్ల ఇప్పుడు ఉనికిలో ఉన్న మన రాజ్యాంగం ప్రకారం హిందువులను మైనారిటీలుగా గుర్తించే అవకాశం లేదు. అందుబాటులో ఉన్న తాజా జనాభా జనాభా లెక్కలు 2011 ప్రకారం దేశ జనాభాలో 14.2శాతం మంది ముస్లిం మతానికి చెందిన వారు ఉన్నారు. విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ వంటి హిందూత్వ సంస్థలు కాశ్మీరులో డిమాండ్‌ చేస్తున్నట్లు మతప్రాతిపదికను తీసుకుంటే దేశమంతటా విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 14.2శాతం ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి ఏమిటి ? ఉన్నత విద్య గురించి 2020-21 సంవత్సరానికి సంబంధించి జరిపిన అఖిలభారత సర్వే(ఎఐఎస్‌హెచ్‌ఇ) ప్రకారం 4.326 కోట్ల మంది ఉన్నత విద్యలో చేరినట్లు నమోదు కాగా వారిలో ముస్లింలు కేవలం 4.87శాతమే(21,08,033) ఉన్నారు. ఇది హిందూ వ్యతిరేకులో కమ్యూనిస్టులో జరిపిన సర్వే కాదు. అంటే జనాభాకు అనుగుణంగా వారి శాతం ఉండాలంటే ఉన్నత విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించాల్సి ఉంది. మన రాజ్యాంగాన్ని రాసుకున్న సమయంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్న కారణంగానే మైనారిటీ విద్యా సంస్థలద్వారా వారి స్థాయిని పెంచేందుకు సాధారణ రిజర్వేషన్లకు భిన్నంగా వారికి ఎక్కువ అవకాశం కల్పించారు. అయితే వాటిని దుర్వినియోగం చేసి ఆ సంస్థలను కొంత మంది వ్యాపారంగా మార్చివేశారన్నది వేరే అంశం.ఈ సర్వే ప్రకారం కొన్ని వివరాలను చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూ-కాశ్మీరు జనాభాలో ముస్లింలు 68.8, హిందువులు 28.8శాతం ఉన్నారు. అన్ని రంగాలలో ఆ దామాషా ప్రతిబింబించాలి. కానీ సర్వే ప్రకారం అక్కడ నమోదైన విద్యార్ధుల్లో 34.5శాతమే ముస్లింలు ఉన్నారు. మరి జమ్మూలోని హిందూత్వ వాదులు, దేశంలో వారిని సమర్ధించేవారు దీనికి ఏం చెబుతారు ? లడఖ్‌ ప్రాంతంలో 25.8శాతం ముస్లింలు ఉన్నారు. రాష్ట్రాల వారీ ఉన్నత విద్యారంగంలో ముస్లింల శాతం దిగువ విధంగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభాకు అనుగుణంగా ఎక్కడా ప్రాతినిధ్యం లేదు. బ్రాకెట్లలోని అంకెలు 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లిం శాతాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2014లో విడిపోయిన కారణంగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రస్తుత ముస్లిం జనాభా శాతం అంచనాలుగా గమనించాలి)

ఆంధ్రప్రదేశ్‌ × 2.92(9.56), అరుణాచల్‌ ప్రదేశ్‌××0.16(1.95), అసోం ××12.5(34.22),బీహార్‌ ×× 6.58(16.87),చండీఘర్‌ ×× 0.62(1.95), చత్తీస్‌ఘర్‌ ×× 0.78(2.02),జమ్ము-కాశ్మీర్‌ ×× 34.50(68.31)ఢిల్లీ ×× 2.47(12.86), గోవా ×× 4.72(8.33),గుజరాత్‌ ×× 2(9.67), హర్యానా×× 0.99(7.03),హిమచల్‌ ప్రదేశ్‌×× 0.41(2.18)ఝార్ఖండ్‌×× 4.34(14.53)కర్ణాటక×× 6.05(2.18)కేరళ ×× 14.36(26.56)మధ్య ప్రదేశ్‌ ×× 1.4 (6.57)మహారాష్ట్ర ×× 3.38(11.54)మణిపూర్‌×× 1.5(8.40)మేఘాలయ××.2(4.40)మిజోరామ్‌ ×× 0.28(1.35)నాగాలాండ్‌ ×× 0.49(2.47)ఒడిషా ×× 0.79(2.17)పుదుచ్చేరి ×× 3.45(6.05)పంజాబ్‌ ×× 2.32(1.93)రాజస్థాన్‌ ×× 1.73(9.07)సిక్కిం ×× 0.48(1.62)తమిళనాడు ××3.50(5.86)తెలంగాణా ×× 7.60(12.56)త్రిపుర ×× 2.98(8.60)ఉత్తర ప్రదేశ్‌ ×× 4.68(19.26)ఉత్తరాఖండ్‌ ×× 2.96(13.95)పశ్చిమబెంగాల్‌×× 12.33(27.01)

పైన పేర్కొన్న వివరాల ప్రకారం విద్యా సంస్థలలో చేరిన వారు రెండంకెలు దాటిన రాష్ట్రాలు జమ్ము-కాశ్మీరు, కేరళ, పశ్చిమబెంగాల్‌, అసోం మాత్రమే.వీటిలో జనాభా రీత్యా ముస్లింలు మెజారిటీగా ఒక్క జమ్ము-కాశ్మీరు, కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌ మాత్రమే ఉన్నాయి. గణనీయ సంఖ్యలో ఉన్న వాటిలో 34 నుంచి 16.87శాతం వరకు ఉన్న రాష్ట్రాలు అసోం, పశ్చిమబెంగాల్‌, కేరళ,ఉత్తర ప్రదేశ్‌,బీహార్‌, మైనారిటీలుగా 14.53 నుంచి 5.86 శాతం మధ్య ఉన్న రాష్ట్రాలు ఝార్కండ్‌,ఉత్తరాఖండ్‌, కర్ణాటక,ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌,తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌,రాజస్తాన్‌,త్రిపుర,మణిపూర్‌, గోవా, హర్యానా,మధ్య ప్రదేశ్‌, పుదుచ్చేరి, తమిళనాడు ఉండగా మిగిలిన రాష్ట్రాలు 4.87 శాతం కంటే తక్కువగా ఉండి పెద్దగా లేనివిగా ఉన్నాయి. ఈ లెక్కలను గమనించినపుడు ముస్లింలు ఉన్నత విద్యలో ఎంత వెనుకబడి ఉన్నదీ కనిపిస్తున్నది. ముస్లింలను సంతుష్టీకరించేందుకు కాంగ్రెస్‌ పాలనలో వారికి అంతా దోచిపెట్టారన్న ప్రచారాన్ని చూసినపుడు అదంతా తప్పుడు ప్రచారం తప్ప వాస్తవం కాదని తేలుతున్నది. ఓట్ల కోసం మెజారిటీ ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ఎత్తుగడలో ఇది భాగం తప్ప వేరు కాదు. జమ్మూలో ఒక మెడికల్‌ కాలేజీలో అత్యధికులు ముస్లిం విద్యార్ధులు ఉన్నందుకే అదీ ప్రతిభ ఆధారంగా పొందినందుకే అంతగా యాగీ చేస్తున్న పెద్దలు దేశమంతటా నెలకొన్న పరిస్థితి గురించి ఏమంటారు ? సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ కేవలం మాటలకేనా ? పోనీ హిందువులను వీరు ఉద్దరించారా ? ఏం చేశారో చెప్పమనండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చెవిలో పూలు : పాకిస్థాన్‌ ప్రాజెక్టుల నుంచి చైనా తప్పుకుందా, కాషాయ దళాలు, మీడియా కథనాల్లో నిజమెంత !

07 Sunday Sep 2025

Posted by raomk in Africa, BJP, CHINA, Congress, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, BRI, China, CPEC, Narendra Modi Failures, pakistan, RSS, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


‘‘ పాకిస్థాన్‌ 60 బిలియన్‌ డాలర్ల ఆర్థిక నడవా ప్రాజెక్టు నుంచి వైదొలిగిన చైనా, నిధుల కోసం ఎడిబిని ఆశ్రయించిన ఇస్లామాబాద్‌ ’’ ఇది కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త శీర్షిక.ఇదే అర్ధం వచ్చేవి మరికొన్నింటిలో వున్నాయి. దీనికి కాషాయ దళం చెప్పిన భాష్యం మచ్చుకు ఒకటి ఇలా ఉంది. ‘‘ భారత జాతీయ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే కనెక్టివిటీని మోడీజీ వ్యతిరేకించిన తరువాత (సిపిఇసి ప్రాజెక్టులో స్పష్టంగా సూచించడం) చైనా పాకిస్తాన్‌ యొక్క 60 బిలియన్‌ డాలర్స్‌ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. ఇది భారతదేశానికి దౌత్యపరంగా అతిగొప్ప విజయం, పాక్‌కు చావు దెబ్బ ’’ అని పేర్కొన్నారు. ఇది నిజమా ? మొదటి అవాస్తవం ఏమిటంటే నరేంద్రమోడీ ప్రధాన మంత్రిగాక ముందే దానికి నాంది పలికిన 2013లోనే నాటి యుపిఏ ప్రభుత్వం ఈ పథకానికి అభ్యంతర తెలుపుతూ వ్యతిరేకించింది. ఎందుకు ? పాక్‌ ఆక్రమిత్‌ కాశ్మీరులో భాగమైన గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతంలో 600 కిలోమీటర్ల పొడవున పాకిస్థాన్‌ మరియు చైనా నడవా ప్రాజెక్టులో భాగంగా రోడ్డు మరియు రైలు మార్గ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు సాగుతుంది. అది చైనాలోని షింజియాంగ్‌ స్వయంపాలిత ప్రాంతం నుంచి మొదలై మూడువేల కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్‌ అరేబియా సముద్ర తీరంలోని గ్వాదర్‌ రేవు వరకు ఉంటుంది. గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతంపై మనదేశం హక్కును వదులుకోలేదు గనుక ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని మన ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అయినప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు.2014లో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ సర్కార్‌ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వివిధ సందర్భాలలో నిరసన తెలుపుతూనే ఉంది. వాస్తవం ఇది కాగా, కొత్తగా మోడీ వ్యతిరేకత తెలిపినట్లు దానికి తలొగ్గి ప్రాజెక్టు నుంచి చైనా వైదొలిగినట్లు చెప్పటం జనాల చెవుల్లో పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు. ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.


నిజానికి మన్మోహన్‌ సింగ్‌ గానీ, నరేంద్రమోడీ గానీ ఈ సమస్య మీద పెద్దగా చేసిందేమీ లేదు. వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇద్దరూ చైనాతో ఇతర సంబంధాలను కొనసాగించారు. షాంఘై సహకార సంస్థలో మనదేశం 2005 నుంచి పరిశీలకురాలిగా 2014వరకు ఉంది. ఆ ఏడాది మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది. మనదేశమూ, పాకిస్థాన్‌ రెండూ 2017లో ఒకేసారి సభ్యత్వం పొందాయి. అప్పుడు సిపిఇసి నడవాను ఒక సమస్యగా మోడీ ముందుకు తేలేదు. నరేంద్రమోడీ హయాంలో 2020 గాల్వన్‌లోయ ఉదంతాల ముందుకు వరకు చైనాతో సంబంధాలు మరింత ముందుకు పోయాయి.ఐదేండ్ల తరువాత తిరిగి సాధారణ స్థితికి వస్తున్నాయి. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) 25వ వార్షిక సమావేశాలకు నరేంద్రమోడీతో పాటు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా హాజరయ్యారు. మోడీ వెంటనే తిరిగి రాగా సెప్టెంబరు మూడున జపాన్‌పై రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా సాధించిన విజయం 80వ వార్షికోత్సవ మిలిటరీ పరేడ్‌లో ఒక అతిధిగా షరీఫ్‌ పాల్గొన్నారు.ఆ ఉత్సవానికి నరేంద్రమోడీకి కూడా ఆహ్వానం ఉన్నప్పటికీ హాజరు కాలేదు. ఎస్‌సిఓ సమావేశాలలో సిపిఇసి గురించి అభ్యంతరాలు తెలిపినట్లుగానీ, చైనా నేతలతో మాట్లాడినట్లుగానీ ఒక్కటంటే ఒక్క వార్త కూడా రాలేదు. కానీ కొద్ది రోజుల తరువాత మీడియాలో వచ్చిన కథనాలను పట్టుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ తనదైన శైలిలో రాసింది. ఆరు రోజులు పాటు చైనాలో ఉన్నప్పటికీ షెహబాజ్‌ షరీఫ్‌ సిపిఇసికి రెండవ దశ పెట్టుబడుల విషయంలో విఫలమయ్యారు.పరిమితమైన అవగాహన ఒప్పందాలు మాత్రమే చేసుకున్నారు.పెద్ద పెట్టుబడులేమీ లేవు. సిపిఇసి 2.0 ప్రారంభమైనట్లు షెహబాజ్‌ ఏకపక్షంగా ప్రకటించారు తప్ప చైనా వైపు నుంచి ఎలాంటి ప్రకటన లేదు.పరేడ్‌లో చైనా అధ్యక్షుడు తనతో పాటు పుతిన్‌, ఉత్తర కొరియా కిమ్‌ను తప్ప షెహబాజ్‌ను పట్టించుకోలేదు.పుతిన్‌తో సంభాషించినపుడు చెవులకు ఫోన్లను కూడా షరీఫ్‌ సరిగా అమర్చుకోలేకపోయారంటూ రాసింది. పాకిస్థాన్‌తో సిపిఇసి పెట్టుబడుల నుంచి వెనక్కు తగ్గినట్లు చైనా అధికారిక ప్రకటనను ఆర్గనైజర్‌ లేదా కథనాలు రాసిన ఇతర పత్రికలు చూపగలవా ?

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎటుతిప్పి ఎటురాసినా కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు రెండు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఇవ్వటం లేదని చైనా చెప్పిందని, గుట్టుచప్పుడు కాకుండా వెనక్కు తగ్గిందని, ఆ మొత్తాన్ని ఆసియన్‌ అభివృద్ధి బ్యాంకు (ఏడిబి) నుంచి తీసుకోవాలని పాక్‌ నిర్ణయించిందని రాశాయి. పదే పదే ఐఎంఎఫ్‌ నుంచి రుణాలు తీసుకుంటున్న పాకిస్థాన్‌కు తాము ఇచ్చిన రుణాలను చెల్లించే సత్తాదానికి ఉందా అనే అనుమానాలు చైనాకు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఒక స్నేహితుడి కోసం మరొకర్ని వదులుకోలేమని ఇటీవల పాక్‌ ఆర్మీ ప్రధాన అధికారి అసిమ్‌ మునీర్‌ చెప్పాడని, దాంతో చైనా పెద్దగా ఆసక్తి చూపటం లేదన్నట్లుగా వర్ణించారు. ఇదే సమయంలో 8.5 బిలియన్‌ డాలర్లను వివిధ పథకాలకు చైనా అందించేందుకు పాక్‌ ప్రధానితో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలను మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు. రెండు బిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు తిరస్కరించిన చైనా కొత్తగా 8.5బి.డాలర్లు ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించినట్లు ? ఈ మొత్తాన్ని సిపిఇసి 2.0లో ఐదు కొత్త కారిడార్లు, అదే విధంగా ఇతర రంగాలలో వినియోగించనున్నట్లు ప్రముఖ పాక్‌ పత్రిక డాన్‌ రాసిందని మనదేశ వార్తా సంస్థ పిటిఐ పేర్కొన్నది. తొలిసారిగా పశ్చిమ దేశాలతో చేతులు కలిపిన ఒక సంస్థ సిపిఇసిలో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిందని కూడా వార్తల్లో రాశారు.చైనాకు లాభదాయకం కాని వాటిలో అదెందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు ? సమాధానం ఉండదు.


నిజానికి ఇలాంటి కథనాలు రావటం ఇదే కొత్త కాదు. 2024 జూన్‌ 11న బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక రాసిన కథనానికి ‘‘ సిపిఇసి 2.0లేదు, భారీ పెట్టుబడులు లేవని పాకిస్థాన్‌కు చెప్పకనే చెప్పింది ’’ అనే శీర్షిక పెట్టింది. ఐదు రోజుల పర్యటన జరిపిన ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పర్యటనకు ముందు ఇస్లామాబాద్‌ అధికారులు సిపిఇసి మరొక ఉన్నత స్థాయికి తీసుకువెళతారని చెప్పారని అయితే ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని, పాక్‌ ఆశల మీద చైనా నీళ్లు చల్లిందని, పరిమిత లబ్దితోనే తిరిగి వెళ్లినట్లు నికీ ఆసియా రాసిందని దాన్లో పేర్కొన్నారు. ఏడాది క్రితం మోడీ చైనా వెళ్లలేదు, దానితో సాధారణ సంబంధాల స్థితి కూడా లేదు, అప్పుడెందుకు చైనా అలా వ్యవహరించిందో మీడియా ‘‘ వంట ’’ వారు, కాషాయ దళాలు చెప్పగలవా ? ‘‘పాకిస్థాన్‌ : ఎందుకు చైనా సిపిఇసి ప్రాజెక్టులు నిలిపివేసింది ?’’ అనే శీర్షికతో ఢల్లీి కేంద్రంగా పని చేస్తున్న అబ్జర్వర్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌ (ఒఆర్‌ఎఫ్‌) వెబ్‌సైట్‌లో 2020 నవంబరు 25వ తేదీన అయిజాజ్‌ వానీ రాసిన విశ్లేషణను ప్రచురించింది. అప్పుడు గాల్వన్‌లోయ ఉదంతాలతో చైనాతో మనదేశం వైరంలో ఉంది తప్ప మిత్రదేశంగా లేదు కదా, ఆ నాడే అలా ఎందుకు రాయాల్సి వచ్చినట్లు ? నరేంద్రమోడీ నిరసన లేదా పలుకుబడి ఏమైనట్లు ? అప్పటికే కొన్ని అంశాలను నిలిపివేసినట్లు అయిజాజ్‌ వానీ రాశారు. పాకిస్థాన్‌లో మాంద్యం, అవినీతి,బెలూచిస్తాన్‌ ఇతర తిరుగుబాట్లు వంటి అంశాలతో అనేక ప్రాజక్టులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు.


సిపిఇసి అవకాశాన్ని పాకిస్థాన్‌ వృధా కావించిందని, మద్దతు గురించి చైనా పునరాలోచనలో పడిరదని సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయ మాజీ ఫ్రొఫెసర్‌ సజ్దాద్‌ అష్రాఫ్‌ 2025 మే రెండవ తేదీన రాశారు. పదేండ్ల తరువాత పాకిస్థాన్‌ అసమర్ధత, రాజకీయ అవకతవకల వంటి కారణాలతో అనేక కీలక ప్రాజెక్టులు ఆలశ్యం,వాయిదా పడటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం.2015 ఏప్రిల్‌ 20న షీ జింపింగ్‌ ఇస్లామాబాద్‌లో ఎంతో అట్టహాసంగా ప్రాజెక్టును ప్రారంభించారు. పదేండ్ల తరువాత తలపెట్టిన 90 పథకాల్లో 38 పూర్తి కాగా మరో 23 నిర్మాణంలో ఉన్నాయి. మూడోవంతును ఇంతవరకు ముట్టుకోలేదు. దీనికి బాధ్యత పరిమితంగా చైనాది కాగా ఎక్కువగా ఇస్లామాబాద్‌దే ఉంది. అత్యంత కీలకమైన ప్రత్యేకించి సెజ్‌లు, పారిశ్రామికవాడలు పూర్తికాలేదు. దీనికి పాకిస్థాన్‌ రాజకీయ నేతలు, ఆసక్తి కనపరచని, సమన్వయం లేని ఉన్నతాధికారులదే బాధ్యత. వీటికి కేటాయించిన వనరులను ఆర్థికంగా పెద్దగా చెప్పుకొనేందుకు ఏమీ ఉండని లాహార్‌ మెట్రో రైలు ప్రాజక్టుకు మళ్లించారు. ఇలాంటి వాటికి తోడు 2021 నుంచి ప్రాజెక్టులలో పని చేస్తున్న చైనా సిబ్బందికి రక్షణ కల్పించటంలో తీవ్ర పరిస్థితి ఏర్పడిరది. అప్పటి నుంచి 14దాడులు జరగ్గా 20 మంది మరణించారు, 34 మంది గాయపడ్డారు. వీటిలో ఎక్కువ భాగం బెలూచిస్తాన్‌లో జరిగాయి. దౌత్యపరంగా ఇప్పటికీ సిపిఇసికి చైనా మద్దతు ఉన్నప్పటికీ 2023 తరువాత కొత్త పెట్టుబడుల పట్ల వెనక్కి తగ్గుతున్నది.


చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ(బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌) పెట్టుబడి పథకాన్ని ప్రారంభం నుంచి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, వాటి ఆధ్వర్యాన నడిచే ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌, గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ గుండా రోడ్డు, రైలు మార్గాల నిర్మాణాన్ని కారణంగా చూపినప్పటికీ మనదేశం కూడా దానికి వ్యతిరేకమే అనే చెప్పాలి. పాకిస్థాన్‌లో రాజకీయ, ఇతర కారణాలతో అక్కడి రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాయి. బెలూచిస్తాన్‌లోని ఉగ్రవాద శక్తులు చైనా జాతీయుల మీద చేసిన దాడుల వెనుక బిఆర్‌ఐని వ్యతిరేకించే దేశాలు ఉన్నాయని వేరే చెప్పనవసరం లేదు. ఇన్ని సమస్యలు, వాటి పరిణామాలు, పర్యవసానాల గురించి చైనాకు తెలిసినప్పటికీ ఎందుకు చేపట్టిందన్నది ప్రశ్న. ప్రపంచ ఫ్యాక్టరీగా తయారైన తరువాత దాని ఎగుమతులు, దిగుమతులు తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలో యూరేషియా, ఆఫ్రికా దేశాలకు చేరేందుకు గల మార్గాలను అన్వేషించినపుడు సిపిఇసి ముందుకు వచ్చింది. దక్షిణ చైనా సముద్రం, మలక్కా జలసంధి ద్వారా రవాణా కంటే పశ్చిమ చైనాలోని షిజియాంగ్‌(ఉఘిర్‌) స్వయంపాలిత ప్రాంతం నుంచి పాక్‌ అరేబియా సముద్రరేవు పట్టణం గద్వార్‌ వరకు రవాణా సదుపాయాల ఏర్పాటు లాభదాయకమని భావించింది. చరిత్రలో ఇంగ్లీష్‌ ఛానల్‌ ప్రాంతంలో బ్రిటన్‌ మరియు ఫ్రాన్సును కలుపుతూ ఏర్పాటు చేసిన భూగర్భ రైల్వే టన్నెల్‌, పనామా, సూయజ్‌ కాలవల తవ్వకం అలా జరిగిందే. ప్రస్తుత పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సోదరుడు నవాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో 51 ఒప్పందాల ద్వారా 46 బిలియన్‌ డాలర్ల ఖర్చుతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రారంభించారు. ఇప్పుడు అది 65 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని అంచనా. మధ్యలో కరోనా, ఇతర సమస్యలతో అనుకున్నంత వేగంగా పూర్తి కావటం లేదు. ఈ నేపధ్యంలో పాకిస్థాన్‌ నుంచి 60 బిలియన్‌ డాలర్ల ప్రాజక్టు నుంచి చైనా వైదొలిగిందని రాస్తే జనం నమ్మాలా ? ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా శాశ్వతంగా ఉంటుందని భావించి మనదేశం అక్కడ మూడు బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. మనకు కూడా చెప్పకుండా అమెరికన్లు 2021లో అక్కడి నుంచి బతుకుజీవుడా మమ్మల్ని ప్రాణాలతో పోనిస్తే చాలంటూ ఆయుధాలు, రవాణా వాహనాల వంటి వాటన్నింటినీ వదిలి కాలికి బుద్ది చెప్పటాన్ని చూశాము. అప్పటి నుంచి మనదేశం తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించకపోయినా తెరవెనుక వారితో మంతనాలు జరుపుతూ పెట్టుబడులను రాబట్టుకొనేందుకు చూస్తున్న సంగతి బహిరంగ రహస్యం. వదలివేసినట్లు ఎక్కడా ప్రకటించలేదు. జూలై మొదటి వారంలో తాలిబాన్‌ సర్కార్‌ను గుర్తించిన ఏకైక దేశం రష్యా. దానితో మనకున్న సంబంధాలను ఉపయోగిస్తామని వేరే చెప్పనవసరం లేదు. అలాంటిది 60 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను అర్ధంతరంగా పాకిస్థాన్‌కు వదలి వట్టి చేతులతో చైనా తిరిగి వెళుతుందని మీడియాలో కొందరు రాస్తే, నరేంద్రమోడీ అభ్యంతరంతోనే ఆపని చేసిందని కాషాయదళాలు జనాన్ని నమ్మించేందుకు చూడటం నిజంగానే దుస్సాహసం. జనాలు చెవుల్లో పూలు పెట్టుకొని లేరని వారికి చెప్పకతప్పదు !

. 

Share this:

  • Tweet
  • More
Like Loading...

జిఎస్‌టి స్లాబుల తగ్గింపు : మాయల మరాఠీలను తలదన్నే నరేంద్రమోడీ మహాగారడీ మామూలుగా లేదుగా !

28 Thursday Aug 2025

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

#GST jugglery, BJP, GST reforms, GST Revenue, GST Slabs cut, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


దీపావళి కానుకగా వస్తు,సేవల పన్ను(జిఎస్‌టి) భారాన్ని తగ్గించనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. దీనికి మీడియాలో ఇప్పటికే పెద్ద ప్రచారం వచ్చింది. సిద్దం సుమతీ అన్నట్లు కాచుకొని ఉండే కాషాయ దళాలు భజన ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం 12,28 పన్ను శ్లాబులను రద్దు చేసి ఐదు, 18శాతం స్లాబులకు అంగీకరించగా, జిఎస్‌టి మండలి నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే పన్నెండు, 28శాతాలలో ఉన్న వస్తువులను దేనిలో కలుపుతారు అన్నది ఇంకా ఖరారు కాలేదు. ఈ చర్యతో కలిగే లాభాలు, నష్టాల గురించి మీడియాలో విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాటి మంచి చెడ్డల గురించి మాట్లాడుకొనే ముందు ఇప్పుడున్న తీరు తెన్నులేమిటో చూద్దాం. ప్రతిదాన్లో ఉన్నట్లు మంచీ చెడు ఉంటాయి, ఏదెక్కువ అన్నదే గీటురాయిగా ఉండాలి.


జిఎస్‌టి కూడా ప్రపంచబ్యాంకు ఆదేశిత విధానమే. విదేశీ కంపెనీలు, వస్తువులకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అమ్మకపు పన్ను విధించటంతో వాటికి తలనొప్పిగా ఉండి దేశమంతటా ఒకే పన్ను విధానం తీసుకురావాలని వత్తిడి తెచ్చిన ఫలితమే ఇది. దీన్ని అమలు చేయాలని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 115వ రాజ్యాంగ సవరణ బిల్లును బిజెపి, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ వ్యతిరేకించారనే అంశం చాలా మందికి గుర్తు ఉండి ఉండదు. బిజెపికి మద్దతు ఇచ్చే వ్యాపారవర్గం పన్నుల ఎగవేతకు అవకాశాలు ‘‘ తగ్గుతాయని ’’ వ్యతిరేకించినట్లు కూడా చెబుతారు. రాజకీయ నేతలు ఎల్లవేళలా కుడి, ఎడమ జేబుల్లో పరస్పర విరుద్దమైన ప్రకటనలు పెట్టుకొని సంచరిస్తూ ఉంటారట. ఏది వాటంగా ఉంటే దాన్ని బయటకు తీస్తారు. జిఎస్‌టి బిల్లు తిరోగామి స్వభావం కలిగినదని, సమాఖ్య ఆర్థిక మూలాలకు పూర్తిగా వ్యతిరేకమని ముఖ్యమంత్రి పాత్రలో 2011 ఫిబ్రవరి 11న వాదించిన రాజనీతిజ్ఞుడు మోడీ. ప్రధాని హోదాలో దానికి పూర్తి విరుద్దంగా రెండో జేబులో ఉన్న ప్రకటన బయటకు తీశారు.(మోడీ కంటే రెండాకులు ఎక్కువ చదివిన చంద్రబాబు స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్ల గురించి ప్రతిపక్షంలో ఉండగా చెప్పినదానికి అధికారానికి వచ్చిన తరువాత మాట మార్చినట్లు ) తన ప్రభుత్వం ముందుకు తెచ్చిన జిఎస్‌టి బిల్లు గురించి 2016 ఆగస్టు 9న పార్లమెంటులో మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిగా తనకు సందేహాలు ఉండేవని ఇప్పుడు అవి ఒక ప్రధానిగా ఆ సమస్యలను పరిష్కరించటాన్ని సులభతరం చేసిందని చెప్పుకున్నారు. దానికి తోడు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీతో కూడా అనేక సార్లు చర్చించినట్లు చెప్పుకున్నారు.(మోడీ సందేహాలను ఆయన తీర్చని కారణంగానే బిల్లును వ్యతిరేకించారా) అదియును సూనృతమే ఇదియును సూనృతమే అని వంది మాగధులు తాళం వేశారు.2017 జూలై ఒకటి నుంచి జిఎస్‌టి అమల్లోకి వచ్చింది.తరువాత కొన్ని శ్లాబుల్లో వస్తువుల జాబితా మార్పు, పన్ను రేటు పెంపుదల వంటివి జరిగాయి.


ప్రతి వంద రూపాయల జిఎస్‌టి రాబడిలో ఏ స్లాబ్‌ నుంచి ఎంతవస్తున్నదంటే ఐదుశాతం ఉన్న వస్తువుల ద్వారా ఏడు రూపాయలు, పన్నెండు శాతం ఉన్నవాటితో ఐదు, పద్దెనిమిదిశాతం వాటితో 65, విలాసవస్తువుల జాబితాలో ఉన్న 28శాతం నుంచి పదకొండు రూపాయలు వస్తున్నాయి. మీడియా రాస్తున్న ఊహాగానాల ప్రకారం పన్నెండుశాతం శ్లాబులో ఉన్న జాబితాలో 99శాతం వస్తువులను ఐదు శాతం స్లాబులో చేరుస్తారు.తొంభై శాతం వస్తువుల మీద పన్ను మొత్తాన్ని 28 నుంచి 18శాతానికి తగ్గిస్తారు.పాపపు పన్ను వస్తువులు అంటే పొగాకు ఉత్పత్తులు, పాన్‌ మసాలా వంటి ఐదు లేదా ఏడు ఉత్పత్తులను 40శాతం మరియు సెస్‌ విధించే ప్రత్యేక శ్లాబులో ఉంచుతారు. బంగారం మీద మూడుశాతం మారదు, వజ్రాల మీద 0.25 నుంచి 0.5శాతానికి పెంచవచ్చు.ఈ కసరత్తు తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత రాబడి తగ్గుతుంది లేదా వినియోగదారులకు ఎంత మేరకు ఉపశమనం కలుగుతుంది అంటే ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ ఏటా 1.45శాతం అంటే రు.32 వేల కోట్లు మాత్రమే అని చెప్పారు. ఇతరులు రు.60 వేల నుంచి 1.8లక్షల కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఒక నిర్ణయం జరిగి కొన్ని నెలల రాబడి చూసిన తరువాత మాత్రమే ఏది వాస్తవం అన్నది చెప్పగలం. ఒకటి మాత్రం ఖాయం జనానికి తగ్గేది స్వల్పం.


దేశంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు అనుగుణంగా నిజవేతనాలు పెరగకపోవటంతో వస్తువినియోగం తగ్గుతున్నది. ఇది కార్పొరేట్‌ శక్తులకు ఆందోళన కలిగిస్తున్నది. అందువలన వినియోగాన్ని పెంచాలంటే హెలికాప్టర్‌ మనీ అంటే నేరుగా నగదు ఇవ్వాలని కరోనా సమయంలో కొందరు సూచించారు. మరొకటి పన్నుల తగ్గింపు ఒక మార్గంగా చెబుతున్నారు. అందుకే 28శాతం ఉన్న వస్తువులను 18శాతంలోకి మార్చేందుకు పూనుకున్నారు. గత ఏడాది కాలంగా శ్లాబుల తగ్గింపు గురించి మధనం జరుగుతున్నది. 2024 డిసెంబరులో 55వ జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో చర్చకు పెట్టారు. కొన్ని వస్తువుల మీద పన్ను తగ్గింపు ద్వారా వచ్చే దీపావళి పండుగ తరుణంలో రు.4.25 లక్షల కోట్ల మేర వినియోగాన్ని పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచిన సమాచారం ప్రకారం 2018లో జిఎస్‌టి ద్వారా వచ్చిన రాబడి రు.11,77,380 కోట్లు. సగటున నెలకు రు.98వేల కోట్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధరల పెరుగుదల, కొన్ని వస్తువుల మీద పన్ను పెరుగుదల వంటి కారణాలు కూడా తోడై 2024లో రు.20,12,720 కోట్లకు అంటే సగటున రు.183వేల కోట్లకు పెరిగింది. సహజన్యాయం లేదా సామాజిక న్యాయం ప్రకారం అధిక ఆదాయం కలిగిన వారు ఎక్కువ మొత్తం పన్ను చెల్లించాలి, ఆ మేరకు తక్కువ రాబడి కలిగిన వారికి ఉపశమనం కలగాలి. ఆదాయపన్ను విషయంలో అదే జరుగుతున్నది. అదే జిఎస్‌టికి ఎందుకు వర్తించదు ?


ఫ్రాన్సు రాజధాని పారిస్‌ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ పాలసీ రీసెర్చ్‌ (సిఇపిఆర్‌) సంస్థ మన జిఎస్‌టి మీద ఒక అధ్యయనం చేసింది. జనాభాలో దిగువ 50శాతం మంది నుంచి 25శాతం రాబడి వస్తుండగా వారు వినియోగిస్తున్న వస్తు, సేవల వాటా 20 నుంచి 25శాతం మధ్య ఉంది.ఎగువ మధ్యతరగతిలోని 30శాతం మంది నుంచి రాబడి 35శాతం కాగా వినియోగం 35 నుంచి 38శాతం ఉంది. అదే ఎగువ 20శాతం నుంచి వస్తున్న మొత్తం 40శాతం కాగా వినియోగిస్తున్నది 45శాతంగా ఉందని మన కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ దగ్గర ఉన్న గణాంకాలను విశ్లేషించి చెప్పింది. ఇప్పుడున్న విధానం ప్రకారం అంబానీ, అదానీ, వారి దగ్గర పని చేసే దిగువ సిబ్బందిలో ఇద్దరు ఒకే షాపులో పండ్లుతోముకొనే బ్రష్‌లను కొనుగోలు చేస్తే నలుగురి మీద విధించే పన్ను మొత్తం ఒక్కటే. మొదటి ఇద్దరు జేబులో ఎంత తగ్గిందో అసలు చూడరు, కానీ పనివారు ఒకటికి రెండుసార్లు మిగిలి ఉన్న మొత్తాన్ని లెక్కపెట్టుకుంటారు. ఎందుకంటే ఆదాయ అసమానత. చూశారా చట్టం ముందు అందరూ సమానులే, సమానత్వం ఎంత చక్కగా అమలు జరుగుతోందో అని కొందరు తమ భుజాలను తామే చరుచుకుంటారు.


ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త థామస్‌ పికెట్టీ, మరో ప్రముఖుడు ల్యూకాస్‌ ఛాన్సెల్‌ ఒక అధ్యయనం చేశారు. అదేమంటే 1922 నుంచి 2015 మధ్య కాలంలో మనదేశంలో జరిగిన ఆదాయ అసమానత పరిణామాలను పరిశీలించారు. బ్రిటీష్‌ రాజ్యం నుంచి బిలియనీర్ల రాజ్యం వరకు అంటూ తమ పరిశీలనకు పేరు పెట్టారు. పేరుకు మనది గణతంత్ర రాజ్యం అని రాసుకున్నప్పటికీ గతంలో బ్రిటీష్‌ వారు పాలిస్తే ఇప్పుడు వారి స్థానంలో బిలియనీర్లు ఉన్నారు.1922ను ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నారు అంటే అదే ఏడాది మనదేశంలో బ్రిటీష్‌ పాలకులు ఆదాయపన్ను చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.మన జనాభాలో ఎగువ ఒకశాతం మందికి 1930దశకంలో 21శాతం రాబడి రాగా, 1980దశకంలో అది ఆరుశాతానికి తగ్గింది. తరువాత నూతన ఆర్థిక విధానాలు వచ్చాయి. ఎగువ నుంచి దిగువకు ఊటదిగినట్లుగా జనాభాలో దిగువన ఉన్న వారికి రాబడి ఊట దించేందుకు ఈ విధానాలను అనుసరిస్తున్నట్లు ఊట సిద్దాంతం చెప్పారు. కానీ జరిగిందేమిటి ? జనాభాలో ఒక శాతం ఉన్న ధనికుల ఆదాయం తిరిగి 22శాతానికి చేరింది. అందుకే బ్రిటీష్‌ వారి ఏలుబడి కంటే స్వాతంత్య్రంలోనే అసమానతలు పెరిగినట్లు వారు వ్యాఖ్యానించారు.1950 నుంచి 1980 మధ్య కాలంలో దిగువన ఉన్న 50శాతం మంది రాబడి మొత్తం సగటుతో పోలిస్తే ఎక్కువగా 28శాతం వేగంతో పెరగ్గా ఎగువన ఉన్న 0.1శాతం మంది రాబడి తగ్గిపోయింది. కానీ 2015 నాటికి అది తారుమారైంది. దిగువ 50శాతం మంది వృద్ధి రేటు పదకొండు శాతం కాగా ఎగువన ఉన్నవారిది 12శాతం పెరిగింది. మధ్య తరగతిగా ఉన్న 40శాతం మంది 23శాతం పొందగా ఎగువున ఒక శాతం మందికి 29శాతం ఉంది.


మనదేశంలో తొలి బిలియనీర్‌ నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌. పారిశ్రామికవేత్తలలో 1991లో ఒక్కరే ఉన్నారు. ఇండియా టుడే విశ్లేషణ ప్రకారం 2014లో 70 మంది 2025 నాటికి 284కు పెరిగారు. ఎగువ ఒక శాతం మంది వద్ద దేశ సంపదలో 40.1శాతం పోగుపడిరది. ఇంతగా ధనికులు పెరిగిన తరువాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరింతగా సంపాదిస్తారే తప్ప మోడీ చెప్పినట్లు సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదాన్ని సాకారం కానిస్తారా ? పార్లమెంటు, అసెంబ్లీల్లో పెరుగుతున్న కోటీశ్వరులు సామాన్యుల కోసం విధానాలను రూపొందిస్తారా ? 2025`26 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ 50లక్షల కోట్లు అనుకుంటే బిలియనీర్ల వద్ద ఉన్న సంపద 98లక్షల కోట్లు. ఒక్క ముంబైలోనే 90 మంది ఉన్నారని వారి సంపద 39లక్షల కోట్ల రూపాయలని లెక్క. ప్రపంచ అసమానతల ప్రయోగశాల(వరల్డ్‌ ఇనీక్వాలిటీ లాబ్‌) 2024 మార్చినెలలో విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం మనదేశంలో 2022లో వార్షిక రాబడి ఇరవై ఏండ్లు పైబడిన 92 కోట్ల మంది సగటు రు.2.3లక్షలంటే నెలకు ఇరవై వేలు. మధ్యగత రేఖ(మెడియన్‌) వార్షిక రాబడి రు.లక్ష అంటే నెలకు సగటున రు.8,750 మాత్రమే వస్తున్నది. ఎగువున ఉన్న పదిశాతం మంది ఏడాదికి సగటున రు.13లక్షలు, ఎగువ ఒక శాతం రు.50లక్షలు, ఎగువన 0.1శాతం మంది రెండు కోట్లు, 0.01శాతం మంది పది కోట్ల వంతున సంపాదిస్తున్నారు. ధనికుల్లో అగ్రశ్రేణి వారిలో 9,223 మంది సగటున 50 కోట్లు సంపాదిస్తున్నారు. ఇక సామాజిక తరగతుల వారీ చూస్తే ఐశ్యర్యవంతుల్లో 90శాతం మంది ‘‘ సవర్ణులు ’’’ 2.6శాతం దళితులు, మిగిలిన వారు ఓబిసిలు ఉన్నారట.2014 నుంచి 2022 కాలంలో ధనవంతులైన ఓబిసి బిలియనీర్ల సంపద 20 నుంచి పదిశాతానికి తగ్గగా సవర్ణులకు 80 నుంచి 90శాతానికి పెరిగిందని ఇనీక్వాలిటీ లాబ్‌ పర్కొన్నది. జనాభాలో 25శాతంగా ఉన్న వీరు 55శాతం సంపద కలిగి ఉన్నారట. ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఏమంటే ఇలాంటి ఆర్థిక అసమానతల ఉన్నపుడు శతకోటీశ్వరులు, అల్పాదాయ వర్గాలకు ఒకే జిఎస్‌టి రేటు సామాజిక న్యాయానికి విరుద్దం. ధనికుల మీద సంపదపన్ను విధిస్తే వచ్చే రాబడితో ఖజాన నింపుకోవచ్చు. వస్తు, సేవల పన్ను తగ్గిస్తే భారం ఎంతో తగ్గుతుంది.వినియోగం పెరిగితే యువతకు ఉపాధి పెరుగుతుంది, తద్వారా ప్రభుత్వాలకు రాబడీ పెరుగుతుంది. కానీ ఆ పని చేయటం లేదు. మోడీ సర్కార్‌ మహామాయ జిమ్మిక్కులతో శ్లాబుల కుదింపును రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకొనేందుకు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది తాత్కాలికమే. వాస్తవాలను గ్రహించినపుడు జనాలు చివరికి మోడీ నిజం చెప్పినా నమ్మని స్థితి వస్తుంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిసి రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులు : కాంగ్రెస్‌ బాటలో బిజెపి ! మండల్‌ కంటే రోహిణీ కమిషన్‌ మరింత జాప్యం !!

14 Thursday Aug 2025

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Justice Rohini panel, Mandal commission, Narendra Modi Failures, OBC sub-categorisation, Rohini Commission, RSS


ఎం కోటేశ్వరరావు


తెలంగాణా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను 42శాతానికి చట్టబద్దంగా పెంచకుండానే ఎన్నికలు జరుపుతుందా ? పెంచేందుకు రాష్ట్రపతికి పంపిన బిల్లుకు ఆమోదం లేదా తిరస్కారం చేస్తున్నట్లు చెప్పలేదు. ఆర్డినెన్స్‌ ద్వారా అమలు చేద్దామని చూస్తే గవర్నర్‌ దాన్ని కేంద్రానికి సలహా కోసం పంపటంతో దాని పరిస్థితీ అంతే. దీని వెనుక బిజెపి రాజకీయం పక్కాగా కనిపిస్తున్నది. ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నందున అంగీకరించే సమస్యే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చెబుతారు. రాజ్యాంగబద్ధంగా అలాంటి అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి కూడా తిరస్కరించవచ్చు. రాష్ట్రాన్ని వివరణ అడగవచ్చు. అదేమీ చేయకుండా తొక్కి పెట్టారు. తెలంగాణా స్థానిక సంస్థల అంశాన్ని పక్కన పెడితే అసలు నరేంద్రమోడీ, బిజెపికి బిసి రిజర్వేషన్ల మీద ఉన్న చిత్తశుద్ధి ఎంత అన్నది ప్రశ్న. పద్నాలుగుసార్లు గడువు పొడిగించిన తరువాత 2023 జూలై 31న ఒబిసి రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందచేశారు. రెండు సంవత్సరాలు దాటింది. అసలు ఆ నివేదిక వెలుగు చూస్తుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 2017 అక్టోబరు రెండవ తేదీన ఢల్లీి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జి రోహిణీ ఆధ్వర్యంలో కమిషన్‌ ఏర్పడిరది.


రామనాధ్‌ కోవింద్‌ హయాంలో ఏర్పాటు చేసిన ఈ కమిషన్‌ కేవలం మూడు మాసాల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించగా ఆరేండ్లు పట్టించారు. ఈ నివేదిక ఇంకా తమకు ఇంకా అందలేదని కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయశాఖ 2025 మార్చి 26న లోక్‌సభకు తెలియచేసింది. ఈ ఏడాది ఆగస్టు ఐదవ తేదీన అడిగిన ప్రశ్నకు అదే సమాధానాన్ని పార్లమెంటుకు తెలిపింది. అనేక రాష్ట్రాలలో బిసి కుల సర్వేలు జరిగిన పూర్వరంగంలో నివేదికలోని అంశాలతో దేశ సామాజిక, రాజకీయ రంగాలపై భూకంప ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభలకు సమర్పించకుండా నివేదికను వెల్లడిరచటానికి కుదరదని 2024 మే మొదటి వారంలో అలహాబాద్‌ హైకోర్టు ప్రజాప్రయోజనవాజ్యం మీద తీర్పునిచ్చింది. అందువలన కోర్టుల ద్వారా కూడా అది వెలుగు చూసే అవకాశం లేదన్నది తేలిపోయింది. దీనికి ముందు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ 2015లోనే అత్యంత వెనుకబడిన, బాగా వెనుకబడిన, వెనుకబడిన తరగతులుగా మూడుగా విభజించి రిజర్వేషన్లు అమలు జరపాలని చేసిన సిఫార్సును మోడీ సర్కార్‌ పట్టించుకోలేదు. జాప్యం చేసే ఎత్తుగడతో రెండు సంవత్సరాల తరువాత రోహిణీ కమిషన్‌ ఏర్పాటు చేశారు. మండల్‌ కమిషన్‌ 1979లో ఏర్పాటు కాగా 1980లో నివేదిక ఇచ్చింది. పదేండ్లకు అది అమల్లోకి వచ్చింది. రోహిణీ కమిషన్‌ 2017లో ప్రారంభం కాగా 2023లో నివేదిక సమర్పించింది.2019లోనే ముసాయిదా నివేదిక సిద్దంగా ఉన్నట్లు కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి రాసినా గడువు పొడిగించటం గమనించాలి.2015 నుంచి తీరుతెన్నులను చూస్తే ఇప్పటికే పదేండ్లు దాటింది, ఓబిసి వర్గీకరణ మొత్తంగా 15 సంవత్సరాల తరువాతైనా జరుగుతుందా అన్నది అనుమానమే.


వెయ్యి పేజీలకు పైగా ఉన్న రోహిణీ కమిషన్‌ నివేదిక రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగంలో వర్గీకరణ ఎలా జరపాలి అని పేర్కొనగా, రెండవ భాగంలో దేశమంతటా గుర్తించిన 2,633 కులాల జాబితా ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. 2015 నుంచి 2018 వరకు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో లక్ష ప్రవేశాలు, లక్షా 30వేల ఉద్యోగాలను ఎలా ఇచ్చారన్నది కమిషన్‌ పరిశీలించినట్లు చెబుతున్నారు. నాలుగో వంతు వాటాను కేవలం పది ఓబిసి కులాల వారే దక్కించుకున్నారని, మరో నాలుగోవంతును 38 కులాల వారు, మరో నాలుగోవంతు 102కులాలు దక్కించుకున్నాయని, మరో 22.3శాతం 506 కులాలు పొందినట్లు, 994 కులాలకు కేవలం 2.68శాతం దక్కగా 983 కులాలకు అసలు ఎలాంటి లబ్ది దక్కలేదని తేలినట్లు వెల్లడైంది. విద్యా, ఉద్యోగ రంగాల వనరుల పంపిణీలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కొందరు మాత్రమే ఏ విధంగా వాటిని దక్కించుకుంటున్నారో ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి. దళితుల వర్గీకరణతో కొంత మేరకు పరిష్కారం కుదిరినా ఇంకా అమల్లోకి రాలేదు. బిసి, గిరిజనుల్లో ఇంకా అలాంటి అంతరాలు ఎక్కువగా ఉన్నాయి. రోహిణీ కమిషన్‌ బిసిలను నాలుగు తరగతులుగా వర్గీకరించాలని సిఫార్సు చేసినట్లు వార్తలు వచ్చాయి.


దేశవ్యాపితంగా బిసి జనాభా సంఖ్య అంచనాకు సర్వేచేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని రోహిణీ కమిషన్‌ కేంద్రానికి రాసినా పట్టించుకోలేదు.2018లో నాటి హోమ్‌ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ 2021 జనగణనలో ఓబిసి వివరాలు ఉంటాయని చెప్పారు తప్ప కులగణన చేస్తామని నిర్దిష్టంగా ప్రకటించలేదు. వెనుకబడిన తరగతుల కులగణన జరగాలన్న డిమాండ్‌కు ఇటీవలి సంవత్సరాలలో మద్దతు పెరుగుతున్నది. రాష్ట్రాలకు గణన చేసే అధికారం లేదు గనుక సర్వేల పేరుతో వారెంత మంది ఉన్నారో సుమారుగా లెక్కించేందుకు కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయి. వాయిదాపడిన 2021జనగణనలో కులగణన చేయాలన్న డిమాండ్‌ను బిజెపి, కేంద్ర ప్రభుత్వం మొండిగా తిరస్కరించాయి. రాష్ట్రాల మీద నెట్టాలని చూశాయి. మెజారిటీ రాష్ట్రాలలో తామే ఉన్నామని చెప్పుకొనే బిజెపి తమ పాలిత రాష్ట్రం ఒక్కదానిలో అయినా సర్వే చేసిందా అంటే లేదు. హిందువుల్లో చీలిక వస్తుందని మతాన్ని ముందుకు తెచ్చింది. లోక్‌సభ ఎన్నికలో ఇండియా కూటమి కులగణన అంశాన్ని, రిజర్వేషన్లపై 50శాత పరిమితి ఎత్తివేయాలన్న నినాదాన్ని ముందుకు తెచ్చింది. జనాల నుంచి వస్తున్న వత్తిడి, బీహార్‌ ఎన్నికల కారణంతో 2027లో చేపట్టే జనగణనలో కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. అప్పటి నుంచి బిజెపి నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. ఎలాగూ జనగణనలో కులాల వివరాలు వస్తాయి గనుక ఆ తరువాతే చర్యలు తీసుకోవచ్చు కదా అని చెబుతున్నారు. 2011 ఫిబ్రవరిలో గణన జరిగితే 2013 ఏప్రిల్‌లో అంతిమంగా దాన్ని ఖరారు చేశారు. ఇప్పుడు డిజిటల్‌ అంటున్నారు గనుక ఆ లెక్కన చూసినా 2028 వరకు ప్రతిపాదిత జనాభా గణన ఖరాయ్యే అవకాశం లేదు. అప్పటి వరకు రోహిణీ కమిషన్‌ నివేదిక వెలువడదా లేక వత్తిడికి తట్టుకోలేక వెల్లడిరచినా దాని మేరకు చర్యలు తీసుకొనే అవకాశం లేదా అన్నది ప్రశ్న.ఈ లోగా 2029 పార్లమెంటు ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు తొమ్మిది దశాబ్దాల నాటి (1931) కులగణన ఆధారంగా బిసిలు ఇంత మంది ఉండవచ్చని అంచనాగా చెబుతున్నారు. తరువాత జరిగిన సామాజిక మార్పులలో అనేక తరగతుల్లో జనాభావృద్ధిలో వచ్చిన హెచ్చు తగ్గులను పరిగణనలోకి తీసుకొనేందుకు సమాచారం లేదు.


2027 జనాభా లెక్కల్లో ఎవరెంత శాతం అన్నది తేలుతుంది తప్ప కులాల సంఖ్య, వాటిలో ఉన్న జనాభా స్థితిగతులు మారే అవకాశమే లేదు. అందువలన సదరు నివేదికను విడుదల చేసి పార్లమెంటు, అసెంబ్లీలు, ప్రజావేదికల మీద చర్చ చేస్తే తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి ఎవరేమనుకుంటున్నదీ వెల్లడి అవుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1953లో నాటి నెహ్రూ ప్రభుత్వం తొలిసారిగా కాకా కలేల్‌కర్‌ (దత్తాత్రేయ బాలకృష్ణ కలేల్‌కర్‌) వెనుకబడిన తరగతుల కమిషన్‌ ఏర్పాటు చేసింది. అది 2,399 కులాలను ఓబిసిలుగా గుర్తించింది, 70శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, 1961లో కులగణన చేయాలని సిఫార్సు చేసింది. ఆ నివేదికను గోడవున్లో భద్ర పరిచారు. తరువాత జనతా పార్టీ హయాంలో బిపి మండల్‌ ఆధ్వర్యాన 1979లో రెండవ కమిషన్‌ ఏర్పాటు చేశారు. 1980లో ఆ నివేదిక వచ్చే సరికి ఇందిరా గాంధీ తిరిగి అధికారానికి వచ్చారు. దాన్ని కూడా గోడవున్‌కు పంపారు. నేషనల్‌ ఫ్రంట్‌ నాయకత్వాన ఏర్పాడిన ప్రభుత్వం 1990 ఆగస్టులో నాటి ప్రధాని విపి సింగ్‌ ఆ నివేదికను వెలికి తీయించి అమల్లో భాగంగా 27 శాతం రిజర్వేషన్లను ప్రకటించారు. బిల్లు ఆమోదం పొందినప్పటికీ అది కోర్టు వివాదాలకు దారితీసింది. న్యాయవాది ఇంద్రా సహానే ప్రభుత్వ ఉత్తరువులను సవాలు చేశారు. దాని మీద విచారణ జరిపిన సుప్రీం కోర్టు 1992 నవంబరు 16న ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. తొమ్మిది మంది సభ్యులున్న ధర్మాసనంలో ఆరుగురు అనుకూలంగా, ముగ్గురు వ్యతిరేకంగా మెజారిటీ తీర్పు వచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే దేశంలో నూతన ఆర్థిక విధానాల పేరుతో నయా ఉదారవాద విధానాలకు తెరలేచింది.ఈ నేపధ్యంలోనే ఉద్యోగాల రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని అవి కూడా ప్రభుత్వరంగంలో మాత్రమేనని, ప్రయివేటు రంగానికి వర్తించవని పేర్కొన్నది. ఆ తీర్పు ఇప్పటికీ అమల్లో ఉంది. తరువాత 2007లో రిజర్వేషన్లను విద్యా సంస్థలకూ వర్తింప చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు 2019లో నరేంద్రమోడీ సర్కార్‌ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ చేసింది. దాన్ని కోర్టులో సవాలు చేయగా 2022 నవంబరు ఏడున 3:2 మెజారిటీతో సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది.


రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఉన్నత పోస్టులలో తగిన సామాజిక న్యాయం జరుగుతున్నదా, ఆ మేరకు ఆయా తరగతుల వారు లబ్ది పొందుతున్నారా అన్నది ప్రశ్నార్ధకంగా మారిన పూర్వరంగంలో 2017లో రోహిణీ కమిషన్ను ఏర్పాటు చేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల మాదిరిగానే మోడీ సర్కార్‌ ఇప్పటి వ్యవహరించింది తప్ప భిన్నంగా లేదు. పద్నాలుగుసార్లు నివేదిక పొడిగింపుతో వ్యవధి పెంచటం, నివేదిక సమర్పించి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం దాన్నే సూచిస్తున్నది. అది అమల్లోకి వస్తే తాను ఎంతో కాలంగా సాగిస్తున్న సోషల్‌ ఇంజనీరింగ్‌ పేకమేడలా కూలిపోతుందని బిజెపికి తెలుసు కనుక జాగు చేస్తున్నది. ఆర్థికంగా వెనుకబడిన వారి (ఇడబ్ల్యుఎస్‌) రిజర్వేషన్లను ఎన్నికల కోసం ఎంతో వేగంగా తీసుకువచ్చిన పెద్దలు ఓబిసి వర్గీకరణ విషయంలో ఎందుకు జాగుచేస్తున్నట్లు ? బిసి కులగణన చేస్తే హిందూ సమాజంలో చీలికలు వస్తాయని గతంలో చెప్పిన మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. మొత్తంగా చూసినపుడు ఓబిసి, షెడ్యూలు కులాలు, తరగతులు దేశంలో అణచివేత, దోపిడీకి గురవుతున్న సామాజిక తరగతులే. అయితే ఇతర కులాల్లో పేదలు ఉన్నట్లే ఈ సామాజిక తరగతుల్లో కూడా ధనికులు, ముందున్న తరగతులు లేకపోలేదు. అందుకే రిజర్వేషన్ల ఫలాలను కొందరే ఎక్కువగా అనుభవిస్తున్నారు. రోహిణీ కమిషన్‌ నివేదిక దాన్నే నిర్ధారించినట్లు తెలుస్తున్నది. కమిషన్‌ అడిగిన కీలక సమాచారాన్ని ప్రభుత్వ శాఖలు ఇవ్వలేదనే ఒక విమర్శ మీడియాలో వచ్చింది.ఐఐటి, ఐఐఎం, ఐఐఎస్‌ వంటి అగ్రశ్రేణి విద్యా సంస్థలలో ఓబిసి రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరగటం లేదనే విమర్శలు ఉన్నాయి.అదే గనుక నిజమైతే ఆ నివేదిక వెల్లడైన తరువాత దాన్ని వివాదాస్పదంగా మార్చే అవకాశం లేకపోలేదు. కోర్టుల్లో సవాలు చేయటం సరేసరి.


బిజెపిని వ్యతిరేకించే పార్టీలు సామాజిక న్యాయ నినాదాన్ని తీసుకున్నాయి. దాన్ని ఎదుర్కొనేందుకు నరేంద్రమోడీ తన మంత్రివర్గంలో, వివిధ రాష్ట్రాల బిజెపి మంత్రివర్గాల్లో ఓబిసిలకు గణనీయ ప్రాతినిధ్యం కల్పించి దాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు. ఇది మిశ్రమ ఫలితాలను ఇచ్చినట్లు చెప్పవచ్చు. వెనుకబడిన తరగతుల్లో వర్గీకరణ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నది. రోహిణీ కమిషన్‌ నివేదికలో లోపాల గురించి చెప్పాల్సి వస్తే 2018 తరువాత జరిగిన నియామకాలకు సంబంధించి ఎలాంటి పరిశీలన కమిషన్‌ చేయలేదు. వెల్లడి తరువాత కొన్ని సవాళ్లు కూడా ఎదురుకానున్నాయి.ఉత్తర ప్రదేశ్‌లో చేనేత, దూదేకటం వంటి కొన్ని వృత్తులు చేసే ముస్లింలు, బీహార్‌లో దర్జీలు ఓబిసి జాబితాలో ఉండగా హిందువులు లేరని రోహిణీ కమిషన్‌ గుర్తించినట్లు నిర్దారణగాని వార్త. వివిధ రాష్ట్రాలలో ఇలాంటి సమస్యలు, బిజెపి మత అజెండాకు దీనికి ఘర్షణ తలెత్తవచ్చు. అందుకే వెల్లడిరచటానికి జాగు చేస్తున్నట్లా ? నాడు అధికారంలో లేదు గనుక మండల్‌కు వ్యతిరేకంగా కమండలాన్ని ముందుకు తెచ్చిందని విమర్శలు ఎదుర్కొన్న బిజెపి ఇప్పుడు తానే అధికారంలో ఉందిగనుక ఏం చేస్తుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

దలైలామా వారసుడు : అడుసుతొక్కనేల కాలుకడగనేల ! చైనా అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టటం అవసరమా, దేశానికి ఒరిగేదేమిటి ?

06 Sunday Jul 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, UK, USA

≈ Leave a comment

Tags

anti china, China, Dalai Lama, Dalai Lama succession row, Kiren Rejiju, Narendra Modi Failures, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


పద్నాలుగవ దలైలామా 90వ జన్మదినోత్సవం హిమచల్‌ ప్రదేశ్‌ ధర్మశాలలో లిటిల్‌ లాసాగా పిలిచే మెక్‌లియోడగంజ్‌లో జూలై ఆరవతేదీ ఆదివారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు కిరణ్‌ రిజుజు, లాలన్‌ సింగ్‌ హాజరయ్యారు.ఒక భక్తుడిగా దలైలామా నిర్ణయమే తనకు శిరోధార్యమని, మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా కిరణ్‌ రిజుజు పునరుద్ఘాటించారు. దలైలామా వారసుడి గురించి కొద్ది రోజులుగా పెద్ద రచ్చే జరిగింది.పరిణామాలు, పర్యవసానాల గురించి భయపడిన టిబెట్‌ బౌద్ద దలైలామా టెంజిన్‌ జియాట్సో ఆ వివాదానికి తాత్కాలికంగా తెరదించారు. సుగలాగ్‌ఖాంగ్‌ ప్రధాన బౌద్ద ఆలయంలో దీర్ఘకాలం ఆయన జీవించాలని కోరుతూ జరిపిన ప్రార్ధనల సందర్భంగా మాట్లాడుతూ తాను మరో 30 నుంచి 40 సంవత్సరాలు జీవిస్తానని ప్రకటించారు. ‘‘ అనేక జోశ్యాలను చూసినపుడు అవలోకితేశ్వర ఆశీస్సులు ఉన్నట్లు భావించాను. ఇప్పటి వరకు చేయగలిగిందంతా చేశాను. ఇంకా 30`40 సంవత్సరాలు జీవించగలనని అనుకుంటున్నాను , ఇప్పటి వరకు మీ ప్రార్ధనలు ఫలించాయి. మనం దేశాన్ని కోల్పోయినప్పటికీ భారత్‌లో ప్రవాసం ఉంటున్నాము. ఇక్కడ నేను ఎన్నో పొందాను, ధర్మశాలలో నివసిస్తున్న వారంతా కూడా అలాగే లబ్దిపొందాలని, నేను చేయగలిగిన సేవ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. అంతకు ముందు తనవారసుడు చైనా వెలుపలే జన్మిస్తాడని చేసిన ప్రకటన వివాదాన్ని రేపింది.


దలైలామా తరువాత ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో తెలియదు గానీ మనదేశం చైనా అంతర్గత వ్యవహారమైన వారసుడి విషయంలో అనవసరంగా వేలుబెట్టి చైనాతో చెప్పించుకొని, సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇది గౌరవప్రదమా, అసలు అవసరమా ! ఐదు సంవత్సరాల తరువాత రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొంటున్న తరుణంలో చైనాను రెచ్చగొట్టటం ద్వారా మనదేశానికి ఒరిగేదేమిటని ప్రతివారూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వారసుడి విషయంలో దలైలామా ఆకాంక్షలను అనుసరించాలని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి, బౌద్దుడైన కిరెన్‌ రిజుజు చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది.చైనా తీవ్ర అభ్యంతరం తెలిపిన తరువాత మతవ్యవహారాల్లో ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్య చేయలేదని మనవిదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ వివరణ ఇచ్చారు. తన తదనంతరం దలైలామా వ్యవస్థ కొనసాగుతుందని, 2011లో తాను ఏర్పాటు చేసిన గాడెన్‌ ఫోడ్రాంగ్‌ ట్రస్టు తన వారసుడిని నిర్ణయిస్తుందని కొద్ది రోజుల క్రితం దలైలామా చేసిన ప్రకటనతో రచ్చ మొదలైంది. గతంలో చేసిన ప్రకటననే పునరుద్ఘాటించారు. గాడెన్‌ ఫోడ్రాంగ్‌ అనేది టిబెట్‌లోని లాసాలో ఉన్న 17వ శతాబ్దం నాటి డ్రెపంగ్‌ సంఘారామంలో ఉన్న దలైలామా నివాసం పేరు. ఆ ట్రస్టుకు దలైలామా చైర్మన్‌, ఆయన సన్నిహితులుగా ఉన్నవారు సభ్యులు, దలైలామా కార్యాలయమే దాని వ్యవహారాలను చూస్తున్నది.పదిహేనవ దలైలామా, తదుపరి పరంపరను నిర్ణయించాల్సింది ఆ ట్రస్టు మాత్రమే అని ప్రభుత్వంతో సహా మరొకరికి అధికారం లేదని దలైలామా ప్రకటించారు. ఈ ట్రస్టుతో పాటు న్యూఢల్లీి, జూరిచ్‌ నగరాల్లో కూడా ట్రస్టులను ఏర్పాటు చేశారు. మతానికి చెందిన లామాలు, ఇతర పెద్దలు వారసుడిని గుర్తించి ప్రతిపాదిస్తే అంతిమంగా ఈ ట్రస్టు ఆమోదిస్తేనే వారసత్వం ఖరారు అవుతుందని ట్రస్టు నిబంధనావళి పేర్కొన్నది.


ఇక్కడే అసలు సమస్య ఉంది. గతంలో ఎంపిక చేసిన వారసుల పేర్లను ఒక బంగరు కలశంలో వేసి లాటరీ పద్దతిద్వారా ఎంపిక చేస్తారు, ఆ పేరును చైనా కేంద్రప్రభుత్వం ఆమోదిస్తేనే అమల్లోకి వస్తుందని, గతంలో ఇలాగే జరిగిందని బీజింగ్‌ ప్రకటించింది.తన ఎంపిక అలాగే జరిగిందని తెలిసినప్పటికీ ఈ విధానాన్ని 14వ దలైలామా అంగీకరించటం లేదు. అతగాడి ప్రకటనపై తాము ఎలాంటి వ్యాఖ్య చేయబోమని, మత వ్యవహారాలపై ఎలాంటి వైఖరిని తీసుకొనేది లేదని మన కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దలైలామా ప్రకటన సంబంధిత వార్తలను చూశామని, మతాలకు సంబంధించిన విశ్వాసాలు, వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోవటం లేదని. మత స్వేచ్చకు కట్టుబడి ఉన్నామని విదేశాంగశాఖ పేర్కొన్నది. క్వింగ్‌ రాజరిక పాలన నాటి నుంచి బంగారు కలశంలో ఉంచిన పేర్లతో లాటరీ తీసి ఎంపిక చేసిన దానిని చైనా ప్రభుత్వ ఆమోదిస్తే దలైలామా, పెంచన్‌ లామాలను ఖరారు చేస్తారని, ఆ మేరకు ప్రభుత్వ అధికారం కొనసాగుతున్నదని, దానికి తిరుగులేదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ స్పష్టం చేశారు.ప్రస్తుత దలైలామాను కూడా అదే పద్దతిలో ఎంపిక చేయగా నాటి ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. తమ అంతర్గత వ్యవహారాల గురించి జాగ్రత్తగా వ్యాఖ్యానించాలని ఆమె మన కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు చేసిన ప్రకటన గురించి పేర్కొన్నారు. టిబెట్‌పై ప్రకటించిన వైఖరికి భారత్‌ కట్టుబడి ఉండాలని, టిబెట్‌ సంబంధిత వ్యవహారాలపై చేసే వ్యాఖ్యలు ఇరుదేశాల సంబంధాల మెరుగుదల, అభివృద్ధికి విఘాతం కలిగించకూడదని హితవు చెప్పారు. దలైలామా ప్రకటనను చైనా ఖండిరచిన తరువాత అతగాడికి మద్దతుగా కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు మాట్లాడటంతో చైనా స్పందించింది. దలైలామా వైఖరిని పునరుద్ఘాటిస్తూ వారసుడి నిర్ణయంలో మరొకరి పాత్ర లేదని మంత్రి మాట్లాడారు. గాల్వన్‌ ఉదంతం తరువాత రెండు దేశాల సంబంధాలు స్థంభించిన సంగతి తెలిసిందే. గతేడాది రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ భేటీ తరువాత ఏడాది కాలంలో సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. కైలాష్‌,మానస సరోవర్‌ యాత్రలను పునరుద్దరించారు.


టిబెట్‌ బౌద్ధ మతానికి ఉన్నత మతాధికారి దలైలామా. మన దేశంలో పీఠాధిపతులకు చాంతాడంత పేర్లు ఉన్నట్లే ప్రస్తుత దలైలామా మతపరమైన పేరు జెస్టన్‌ జాంఫెల్‌ గవాంగ్‌ లొబసాంగ్‌ యెషే టెంజిన్‌ గియాస్టో. పొట్టిగా టెంజిన్‌ గియాస్టో అని పిలుస్తారు. పుట్టినపుడు పెట్టిన పేరు లామో తోండప్‌. ఇతగాడు వివాదాస్పదమైన మతగురువు, 1935 జూలై ఆరున జన్మించారు. దలైలామాలను జీవించి ఉన్న బుద్ధుడు లేక బోధిసత్వుడు అని నమ్ముతారు. మరణానంతరం వారసులను ఎన్నుకుంటారు. దలై అంటే సముద్రం, ఇది మంగోలియన్‌ భాషా పదం.పదమూడవ దలైలామా మరణించిన నాలుగు సంవత్సరాల తరువాత 1937లో అతడి వారసుడిగా టెంజిన్ను ఎంపిక చేశారు, 1939లో దలైలామాగా ప్రకటించారు. మరుసటి ఏడాది ఫిబ్రవరి 22న చైనా ప్రభుత్వం ఆమోదముద్రవేసింది. అమెరికా, బ్రిటన్‌ కుట్రలో భాగంగా కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1959లో టిబెట్‌లో తిరుగుబాటు పేరుతో సాయుధులను రంగంలోకి దించారు. వారిని చైనా ప్రభుత్వం అణచివేసింది, తిరుగుబాటు కేంద్రంగా దలైలామా కార్యక్షేత్రాన్ని గుర్తించారు.దాంతో 1959 ఏప్రిల్‌ 29న సిఐఏ పథకం ప్రకారం దలైలామాను నేపాల్‌ ద్వారా దాటించి అసోంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న తేజ్‌పూర్‌ పట్టణంలో ప్రవేశపెట్టి ఆశ్రయం కల్పించారు.ఉత్తర ప్రదేశ్‌లోని ముస్సోరీలో దలైలామాతో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు, మరుసటి ఏడాది హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలకు రప్పించారు.చైనాపై సిఐఏ రూపొందించిన కుట్ర సిద్దాంతాన్ని నమ్మిలేదా అమెరికా వత్తిడికి లొంగి నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దలైలామాకు ఆశ్రయం కల్పించారు. మూడవ ప్రపంచ యుద్ధంలో టిబెట్‌ నుంచి చైనా భారత్‌ ఇతర దేశాల మీద దాడి చేసేందుకు పథకం రూపొందించిందన్నది సిఐఏ కట్టుకథ. అమెరికా, బ్రిటన్‌ కుట్రల కారణంగా కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం తొలి పది సంవత్సరాలలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. వాటిలో టిబెట్‌లో తిరుగుబాటు కుట్ర ఒకటి. దలైలామా అన్న గయలో తోండుప్‌ సిఐఏ ఏజంట్‌గా మారాడు. తెరవనుక ఉండి కథంతా నడిపించింది అతనే (97 సంవత్సరాల వయస్సులో ఈ ఏడాది ఫిబ్రవరి 8న పశ్చిమబెంగాల్లోని కలింపాంగ్‌లో మరణించాడు) అని, కుట్ర గురించి పూర్తిగా దలైలామాకు తెలియదని కూడా చెబుతారు. ఏమైనప్పటికీ తరువాత కాలంలో తెలిసినా అదే అమెరికా ప్రాపకంలో నాటి నుంచి నేటి వరకు చైనాకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉన్నాడు.2011వరకు టిబెట్‌ ప్రవాస ప్రభుత్వ అధినేతగా చలామణి అయ్యాడు. తరువాత వేరేవారికి బాధ్యతలను అప్పగించాడు.

చైనాను అస్థిరపరచటం సాధ్యం కాదని గ్రహించిన అమెరికా విస్తారమైన దాని మార్కెట్‌లో ప్రవేశించేందుకు పూనుకొని ఐరాసలో కమ్యూనిస్టు ప్రభుత్వమే అసలైన చైనా ప్రతినిధిగా గుర్తించటంతో పాటు సాధారణ సంబంధాలను ఏర్పరుచుకుంది. దాంతో టిబెట్‌ తిరుగుబాటుదార్లకు అందచేస్తున్న సాయాన్ని 1972 నుంచి తగ్గించింది తప్ప ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది.దలైలామాకు 1989లో నోబెల్‌ శాంతి బహుమతిని కూడా ఇప్పించింది.మనదేశంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ సకల వసతులు కల్పిస్తూ చైనా వ్యతిరేక ప్రచారానికి అన్ని రకాలుగా తోడ్పడుతున్నారు. దలైలామా తరువాత స్వతంత్రుడైౖన పెంచెన్‌ లామా బౌద్దులకు ముఖ్యుడు. అతగాడే పదమూడవ దలైలామా వారసుడిగా గుర్తించిన ముగ్గురిలో ఒకడు లామో ధోండప్‌ తరువాత 14వ దలైలామా అయ్యాడు.క్రీస్తుశకం 1642 నుంచి కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన 1949వరకు చైనా ప్రభుత్వానికి లోబడి పరిమిత అధికారాలతో టిబెట్‌ ప్రాంతంపై దలైలామాలు లేదా అతగాడి ప్రతినిధులు రాజకీయ అధికారాన్ని కూడా చెలాయించేవారు. దీన్నే టిబెట్‌ స్వతంత్రదేశమని వక్రీకరించారు.1912లో చైనాలో తలెత్తిన తిరుగుబాటుతో క్వింగ్‌ రాజరికం పతనమై స్వతంత్రదేశంగా అవతరించింది, ఆ సమయంలో బ్రిటీష్‌ వారి కుట్రలో భాగంగా టిబెట్‌ స్వాతంత్య్రాన్ని పదమూడవదలైలామా ప్రకటించాడు. అయితే సన్‌యేట్‌ సేన్‌ నాయకత్వంలోని జాతీయ ప్రభుత్వం గుర్తించలేదు, టిబెట్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని స్పష్టం చేసింది. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత కూడా అదే విధంగా కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో కొందరు టిబెటన్లు జపాన్‌కు అనుకూలంగా వ్యవహరించటంతో వారిని అణచివేసేందుకు నాటి పాలకుడు చాంగ్‌కై షేక్‌ మిలిటరీని పంపి అణచివేశాడు. తరువాత జరిగిన పరిణామాల్లో ఖామ్‌ అనే యుద్ద ప్రభువు ఆధీనంలో ఉన్న టిబెట్‌ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు కమ్యూనిస్టు ప్రభుత్వం 1950 అక్టోబరులో ప్రజాసైన్యాన్ని పంపి స్వాధీనం చేసుకుంది. అదే ఏడాది పదిహేనేండ్ల వయస్సులో 14వ దలైలామాను టిబెట్‌ పాలకుడిగా ప్రకటించినప్పటికీ కమ్యూనిస్టు ప్రభుత్వం అంగీకరించలేదు.1951లో చైనా ప్రభుత్వానికి లోబడి స్వయంపాలిత ప్రాంతంగా టిబెట్‌ ఉండేందుకు దలైలామా ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు.1954లో మావోతో భేటీ అయ్యాడు, చైనా పార్లమెంటు స్టాండిరగ్‌ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. మావో తనను ఒక కొడుకు మాదిరి చూశాడని దలైలామా తన ఆత్మకథలో చెప్పాడు.

1954 తరువాత సిఐఏ తనకుట్రను అమలు ప్రారంభించింది.1956లో దలైలామా భారత్‌ను సందర్శించినపుడు ఒకవేళ తాను రాజకీయ ఆశ్రయం కోరితే అంగీకరిస్తారా అని ప్రధాని నెహ్రూను కోరాడు.చైనా ప్రభుత్వంతో అప్పటికే ఒప్పందం ఉన్నందున అలాంటి పని చేస్తే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, రెచ్చగొట్టినట్లు అవుతుందని నెహ్రూ సున్నితంగా తిరస్కరించారు. ఆ తరువాత అమెరికా వత్తిడికి లొంగిన నెహ్రూ ఆశ్రయమే కాదు, తిరుగుబాటు ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సహకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అంశం రెండు దేశాల మధ్య ఒక ప్రధాన సమస్యగానే ఉంటోంది. మన ప్రభుత్వం టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తిస్తూనే వేర్పాటు వాదులకు అనధికారిక మద్దతు కొనసాగిస్తున్నది.మనదేశంలో కాలు పెట్టిన తరువాత 1967లో తొలిసారిగా దలైలామా విదేశీ పర్యటనకు జపాన్‌ వెళ్లారు. ఆయనకు వీసా ఇచ్చిన ప్రభుత్వం తమ గడ్డమీద ఉన్నంత వరకు చైనా వ్యతిరేక మాటలు మాట్లాడవద్దని షరతు విధించింది.కానీ మనపాలకులు మాత్రం పూర్తి స్వేచ్చ ఇచ్చారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా సరుకు తుస్సు మంటే మన విమానాలు ఎలా కూలాయి ? ఇరకాటంలో మోడీ, కాషాయ దళాలు ఏమంటాయో మరి !

01 Sunday Jun 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, CDS Anil Chauhan, China, China WEAPONS, Donald trump, Narendra Modi Failures, Op Sindoor losses, RSS, Shangri-La Dialogue, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


‘‘ ఆపరేషన్‌ సిందూర్‌లో భారత యుద్ధ విమానాల కూల్చివేతకు అంత ప్రాధాన్యత లేదు గానీ దానికంటే ఎలా కూలిపోయాయన్నది ముఖ్యం, తొలి రోజు వ్యూహాత్మక తప్పిదాలను 48గంటల్లోనే సరిచేసి పాక్‌ మీద దాడి చేశాం ’’ మన రక్షణ దళాల అధిపతి(సిడిఎస్‌) అనిల్‌ చౌహాన్‌ శనివారం నాడు సింగపూర్‌లో చెప్పిన మాటల సారాంశం. అయితే ఎన్నింటిని కూల్చారన్నది చెప్పటానికి నిరాకరించారు గానీ పాక్‌ ప్రధాని చెప్పినట్లుగా ఆరు అన్నది పచ్చి అవాస్తవం అన్నారు. పాక్‌తో ఘర్షణలో ‘‘ వైమానిక ఆస్తులను కొన్నింటిని కోల్పోయాం ’’ అని చెప్పారు, అంటే విమానాలు అని చెప్పనవసరం లేదు. పరిస్థితి అణుదాడుల వరకు వచ్చిందన్నది కూడా అవాస్తవం అన్నారు.మూడు రాఫేల్‌ విమానాలను పాక్‌ దళాలు కూల్చివేసినట్లు వచ్చిన తొలుత వచ్చిన వార్తలను మన అధికారులు ఖండిరచిన సంగతి తెలిసిందే. యుద్ధం అన్న తరువాత నష్టాలు ఉంటాయని, మన పైలట్లు అందరూ సురక్షితంగా తిరిగి వచ్చినట్లు కొద్ది రోజుల క్రితం మన త్రివిధ దళాల అధిపతులు విలేకర్ల సమావేశంలో చెప్పినపుడే సూచన ప్రాయంగా స్పష్టమైంది. ఇప్పుడు సిడిఎస్‌ మరింత స్పష్టంగా చెప్పారు. మరి ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ, ఒక్క విమానమూ కూలలేదని ఊరూవాడా ఊదరగొట్టిన కాషాయ మరుగుజ్జులు, వాటిని ప్రామాణికంగా తీసుకున్న మీడియా నిపుణులు ఏమంటారో తెలియదు. ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సెక్యూరిటీ స్టడీస్‌, సింగపూర్‌ సంస్థ షాంగ్రీ లా డైలాగ్‌(ఎస్‌ఎల్‌డి) పేరుతో ప్రతి ఏటా చర్చలు నిర్వహిస్తున్నది. 2001లో పురుడు పోసుకున్న ఈ సంస్థ 2002లో తొలి సారిగా అనధికార చర్చలు నిర్వహించింది. ఈ చర్చలను ఆసియా భద్రతా వ్యవహారాల సభగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో 22వ సభ మే నెల 30,31, జూన్‌ ఒకటిన జరిగింది. మన దేశం తరఫున 31వ తేదీన మన సిడిఎస్‌ అనిల్‌ చౌహాన్‌ అధికారయుతంగానే పాల్గొన్నారు.ఆ సభలో మాట్లాడటంతో పాటు వెలుపల రాయిటర్స్‌ వార్తా సంస్థ, అంతర్జాతీయ విలేకర్లతో కూడా ఆయన మాట్లాడారు. బ్లూమ్‌బెర్గ్‌ టీవీకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ సమావేశాలకు వివిధ దేశాల అధినేతలు, రక్షణ మంత్రులు,ఉన్నతాధికారులు రావటం జరుగుతున్నది. ప్రపంచమంతా తిరిగి పాకిస్తాన్‌ దుర్మార్గాలను ఎండగట్టాలని పార్లమెంటరీ ప్రతినిధి బృందాలను పంపి హడావుడి చేసిన ప్రభుత్వం కొద్ది ఖర్చుతో ఆసియా ఖండం, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రముఖులు పాల్గొనే ఈ సభలో ప్రభుత్వం ప్రధాని లేదా కనీసం రక్షణ మంత్రి లేదా విదేశాంగ మంత్రిని అయినా పంపలేదంటే వారికి ఎంత శ్రద్ద ఉందో వెల్లడి అవుతున్నది. పోనీ ఇంతకంటే దేశంలో ఉండి పొడుస్తున్నది ఏమైనా ఉందా ! సింగపూర్‌లో సిడిఎస్‌ చెప్పిన మాటలు అనేక అంశాలను ముందుకు తెచ్చాయి.మామ తిట్టినందుకు కాదు గానీ తోడల్లుడు తొంగిచూసి కిసుక్కున నవ్వినందుకు అన్నట్లు సిడిఎస్‌ మాటలపై చర్చ చేస్తే దేశద్రోహం అంటారేమో !

‘‘ మే ఏడవ తేదీన జరిగిందాన్ని గురించి నేను చెప్పగలిగిందేమిటంటే తొలి దశలో కొన్ని నష్టాలు ఉన్నాయి.సంఖ్య ముఖ్యం కాదు… ఆ నష్టాలు ఎందుకు జరిగాయి, ఆ తరువాత మనమేమి చేయాలనన్నది ముఖ్యమైన అంశం. మంచి విషయం ఏమంటే వ్యూహాత్మకంగా చేసిన తప్పిదాలను మేము అర్ధం చేసుకోగలిగాం, వాటికి పరిష్కారం ఉంది, వాటిని సరిదిద్దాం, రెండు రోజుల తరువాత దాన్ని అమలు జరిపాం, అన్ని రకాల మందుగుండుతో మన జెట్‌ విమానాలన్నీ మరోసారి దూరంగా ఉన్న లక్ష్యాలను చేధించేందుకు ఎగిరాయి. ఒక మీటరు అటూ ఇటూగా మూడు వందల కిలోమీటర్ల దూరంలోని పాకిస్తాన్‌ వైమానిక స్థావరాల మీద దాడి చేయగలిగాం, చైనా వారి ఆయుధాలు ఏమీ పని చేయలేదు. పాకిస్తాన్‌తో చైనా సన్నిహితంగా మెలిగినప్పటికీ వివాద సమయంలో చైనా నుంచి వాస్తవంగా సాయం అందిన సూచనలు లేవు. ఉత్తర సరిహద్దులో పరిస్థితులన్నీ సాధారణంగానే ఉన్నాయి. (వివాదం సందర్భంగా చైనా గూఢచార సమాచారం అందించిందా అన్న ప్రశ్నకు ) అలాంటి దానిని వాణిజ్యపరంగా చైనా నుంచి పొంది ఉండవచ్చు, చైనా లేదా అదేవిధంగా ఇతర వనరులనుంచి కూడా కావచ్చు ’’ అని సిడిఎస్‌ చెప్పారు. మొత్తం మీద సారాంశం ఇది.
ఇక చైనా ఆయుధాలు తుస్సుమన్నాయి, దేనికీ పనికిరానివని తేలిపోయింది, దీంతో మిలిటరీ అధికారులను చైనా జైల్లో పెట్టారని రాశారు. పాకిస్తాన్‌ వారే కొనుగోలు చేసేందుకు విముఖత చూపుతున్నారంటూ విశ్లేషణలు చేసిన వారు, వాటికి ప్రాధాన్యత ఇచ్చిన మీడియా యుద్ధ వీరులు ఇప్పుడు ఎలాంటి కతలు చెబుతారో తెలియదు. మన దగ్గర రష్యా ఇచ్చిన సుదర్శన చక్రం ఎస్‌`400 ఉంది, చైనా దగ్గర ఉన్నవి పని చేయటంలేదు, పనిలో పనిగా దాని ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవటానికి ఇదే తరుణం అని సలహాలు ఇచ్చిన వారు కూడా లేకపోలేదు. అసలు విమానాలు కూలలేదు, తప్పుడు సమాచారం వ్యాపింప చేస్తున్నారంటూ దాడులకు దిగిన సామాజిక మాధ్యమ మరుగుజ్జులు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు, కొన్ని నష్టాలు జరిగినా అంతిమంగా పాకిస్తాన్ను దెబ్బతీశామా లేదా అన్నది చూడాలంటున్నారు. ఈ వితండవాదానికి తిరుగులేదు.

విమానాలు కూలింది మన గడ్డమీదా లేక పాక్‌ భూమిలోనా అన్నది మరింత ఆసక్తికరంగా మారింది. మన పైలట్లు సురక్షితంగా వచ్చారని మన అధికారులు చెప్పటాన్ని బట్టి కూలింది మన దేశంలోనే అని చెప్పవచ్చు.2019లో బాలాకోట్‌ మెరుపుదాడుల సమయంలో పాక్‌ మిలిటరీ మన మిగ్‌ విమానాన్ని వారి భూభాగంలో కూల్చివేసి పైలట్‌ అభినందన్‌ వర్దమాన్ను బందీగా పట్టుకున్న సంగతి తెలిసిందే. మన భూభాగంలోనే మన విమానాల కూల్చివేత జరిగిందంటే అవి ఎగరగానే గతంలో చైనా నుంచి కొనుగోలు చేసిన పాక్‌ రాడార్లు పసిగట్టి కూల్చివేసినట్లు కనిపిస్తోంది. చైనా క్షిపణులు లేవలేదు, లేచినవి మన భూభాగంలో పేలకుండా పడ్డాయి అన్న వార్తలు తెలిసిందే. చైనా ఆయుధాలు పని చేయలేదని సిడిఎస్‌ కూడా చెప్పారు. అదే నిజమైతే అంటే పాకిస్తాన్‌ దగ్గర చైనా లేదా అమెరికా ఆయుధాలు తప్ప వేరే దేశానివి లేవు. అమెరికా వాటితోనే కూల్చివేసి ఉండాలి. వాటిని ఉపయోగించటానికి కొన్ని షరతులు పెట్టామని గతంలో అమెరికా ప్రకటించింది, ఈ సందర్భంగా ట్రంప్‌ వాటిని సడలించి ఉండకపోతే పాక్‌ మిలిటరీ ప్రయోగించి ఉండేది కాదు. ఆ విషయాన్ని చెప్పటం దేశద్రోహం కాదు, జరిగే నష్టమూ లేదు. రష్యా సుదర్శన చక్రంతో దెబ్బతీసినట్లు చెప్పుకున్న మనం అమెరికా ఆయుధాలతో దెబ్బతిన్నామని అంగీకరిస్తే కలిగే నష్టం ఏముంది ? ట్రంప్‌ అంటే భయమా ?


అసలేం జరిగిందో చెప్పాలన్న ప్రతిపక్షాల మీద సైన్యాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అంటూ ఎదురుదాడి చేసిన బిజెపి, కాషాయ దళాలు, సామాజిమాధ్య మరుగుజ్జులు ఇప్పుడెలా ఎగిరిపడతారో చూడాలి. పార్లమెంటు సమావేశం జరపాలన్న డిమాండ్‌ను బిజెపి తిరస్కరిస్తే చాలా మందికి అంతుబట్టలేదు గానీ అనిల్‌ చౌహాన్‌ ప్రకటనతో అసలు సంగతి అర్ధమైంది. నాలుగు రోజుల్లోనే ఆకస్మికంగా దాడులు ఆపివేసి కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవటం వెనుక కూడా విమానాలు కూలిపోయిన ప్రభావం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.మన తప్పిదాలను గుర్తించి సరి చేసుకున్నట్లే పాకిస్తాన్‌ కూడా తన తప్పిదాలను సవరించుకొని ఎదురుదాడులకు సిద్దమైందా ? ఇప్పటికైనా పార్లమెంటును సమావేశపరచి సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం లేదా !

యుద్ధం అన్న తరువాత రెండువైపులా నష్టాలు ఉంటాయనేందుకు రెండవ ప్రపంచ పోరు చక్కటి ఉదాహరణ అన్నది అందరికీ తెలిసిందే. పాక్‌తో జరిగిన యుద్ధాలు, చిన్న చిన్న జగడాలు అయినా అంతే దానికి మన దళాలను తప్పుపట్టాల్సింది గానీ నిరుత్సాహపరచాల్సిందిగానీ ఏమీ లేదు. పాక్‌ ఉగ్రవాదుల మీద కంటే మన జనం మీదనే బిజెపి దళాలు పెద్ద ప్రచారదాడి చేసినట్లు కనిపిస్తోంది. కొందరు నేతలు ఎలా నోరు పారవేసుకున్నదీ ఒక మధ్య ప్రదేశ్‌ మంత్రి మీద విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతీ తెలిసిందే. విదేశీ సంస్థలు ఇచ్చిన విమానాల కూల్చివేత వార్తలను చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఇచ్చింది. మాతో నిర్ధారించుకోకుండా నిరాధార వార్తలను రాస్తారా అంటూ మన విదేశాంగశాఖ నిరసన తెలిపింది. మరి ఇప్పుడు ఏమంటారు ? గతంలో ఇతర దేశాల మీడియా ఇచ్చిన సమాచారాన్ని గ్లోబల్‌ టైమ్స్‌ వార్తగా ఇచ్చినట్లే సిడిఎస్‌ చెప్పిన బ్లూమ్‌బెర్గ్‌ వార్తను ఉటంకిస్తూ అదే పత్రిక రాసింది.పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మన సైన్యం ప్రాణాలకు తెగించి దెబ్బకు దెబ్బ తీస్తే అదేదో మోడీ స్వయంగా చేసినట్లు చిత్రించారు.తన వ్యక్తిగత ప్రతిష్టను, దానికి లోబడి బిజెపిని జనంలో ప్రచారం చేసేందుకు నరేంద్రమోడీ పడిన తాపత్రయం, చేసిన ఖర్చు, మీడియాను గోడియాగా మార్చిన తీరు, సామాజిక మాధ్యమ సంస్థలకు ఇచ్చిన పాకేజీల గురించి తెలిసిందే.


జరిగిందాన్ని గురించి కాంగ్రెస్‌ అనేక ప్రశ్నలను సంధించింది.మిలిటరీ చర్యలను సమర్ధించింది. తెలంగాణా మంత్రి కెప్టెన్‌ ఉత్తమకుమార్‌ రెడ్డి, జయరామ్‌ రమేష్‌ విలేకర్లతో మాట్లాడారు. జరిగిందాని మీద ఒక సమీక్షా కమిటీని వేయాలని కోరారు. కార్గిల్‌ యుద్ధం జరిగినపుడు ప్రస్తుత విదేశాంగ మంత్రి జై శంకర్‌ తండ్రి, రక్షణ వ్యవహారాల నిపుణుడు కె సుబ్రమణ్యం అధ్యక్షతన 1999లో వాజ్‌పాయి ఒక సమీక్షా కమిటీని ఏర్పాటు చేసినట్లు జయరామ్‌ రమేష్‌ గుర్తు చేశారు.ఐదు నెలల తరువాత ఆ కమిటీ సమర్పించిన నివేదికను పార్లమెంటు ఉభయ సభలలో ప్రవేశపెట్టారని ఇప్పుడు కూడా సిడిఎస్‌ చెప్పిన అంశాలను సమీక్షించాలని కోరారు.


సింగపూర్‌ సమావేశానికి సిడిఎస్‌ అనిల్‌ చౌహాన్ను పంపి చాణక్యుడు అనుకుంటున్న నరేంద్రమోడీ పప్పులో కాలువేశారా ? సిడిఎస్‌ను సింగపూర్‌కు అనవసరంగా పంపారని అక్కడ ఆయన ఒక ప్రచార విజయాన్ని పాకిస్తాన్‌కు అందచేశారని రక్షణ రంగ వ్యూహకర్త బ్రహ్మ చెలానే విమర్శించారు.పాకిస్తాన్‌కు మనం కలిగించిన నష్ట వివరాలతో పాటు మన విమానాలను కోల్పోయినట్లు మన గడ్డ మీద మాత్రమే చెప్పాలని అన్నారు. సింగపూర్‌ సభకు పాక్‌ మిలిటరీ అధికారి కూడా వచ్చారని ఆ సందర్భంగా మన నష్టాల గురించి చెప్పటం పాకిస్తాన్‌తో అనుసంధానం చేయటమే అన్నారు.భారత నిర్ణయాత్మక విజయాన్ని వివరించేందుకు నరేంద్రమోడీ రోడ్‌ షోలు చేస్తున్నారు. అయినప్పటికీ వాణిజ్య ఆంక్షలు విధిస్తాననే బెదిరింపుతో మిలిటరీ శత్రుత్వాన్ని తానే ఆపినట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ పదే పదే చెబుతున్నాడు.మోడీ ప్రయత్నాలను బలహీనపరుస్తున్నాడు. సింగపూర్‌లో మీడియాతో మాట్లాడి సిడిఎస్‌ పరిస్థితిని మరింత సంక్లిష్టం కావించారని చెలానే వ్యాఖ్యానించారు. ఆపరేషన్‌ సింధూర్‌ లక్ష్యాలు ఏమిటో చెప్పకుండా కొన్ని విమానాలు నష్టపోవటం గురించి చెప్పటం ఏమిటని మరో విశ్లేషకుడు సుషాంత్‌ శరీన్‌ అన్నారు.కొన్ని విమానాలు నష్టపోవటం కొలమానం కాదన్నారు. మొత్తం మీద చూసినపుడు మిలిటరీ చర్యలను అధికారంలో ఉన్న పార్టీ తన ప్రతిష్టను పెంచుకొనేందుకు చూస్తే ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోవని ఇప్పటికే వెల్లడైంది. మణిపూర్‌ పర్యటించి అక్కడి పౌర సమాజంలో తలెత్తిన అపోహలను పొగొట్టేందుకు రెండు సంవత్సరాలుగా దాని మొహం చూడని ప్రధాని నరేంద్రమోడీ పాక్‌తో ఘర్షణపై పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు తిరస్కరించి అప్రజాస్వామికంగా వ్యవహరించారనే విమర్శను మూటగట్టుకున్నారు. నష్ట నివారణకు ఇప్పటికీ సమయం మించి పోలేదు. విదేశాల్లో పర్యటించి వచ్చిన పార్లమెంటరీ బృందాల అనుభవాల పేరుతో పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే పరువు దక్కుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాశ్మీరుపై నమ్మలేని నిజం, వాస్తవాలు : పాకిస్తాన్‌కు అప్పగించటానికి అంగీకరించిన వల్లభాయ్‌ పటేల్‌ !

30 Friday May 2025

Posted by raomk in BJP, Congress, Current Affairs, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

Annexation of Hyderabad, BJP, Facts vs Myths, Jammu and Kashmir, Jawaharlal Nehru, Kashmir problem, Narendra Modi Failures, Pakistan-Occupied Kashmir, POK, RSS, Sardar Vallabhbhai Patel

ఎం కోటేశ్వరరావు


ఆక్రమిత కాశ్మీరు(పిఓకె)ను పూర్తిగా స్వాధీనం చేసుకొనే వరకు యుద్ధాన్ని ఆపకూడదని నాటి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చెప్పిన అభిప్రాయాన్ని నాటి ప్రధాని నెహ్రూ అంగీకరించలేదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఆమోదించి ఉంటే పహల్గామ్‌ దారుణం జరిగి ఉండేది కాదని మే 27వ తేదీన గుజరాత్‌ పర్యటనలో చెప్పిన మాటలకు మీడియా పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించింది. కాశ్మీరును ఆక్రమించుకొనేందుకు నాటి ముజాహిదిన్‌ దాడుల కొనసాగింపే పహల్గామ్‌ ఉదంతం అని మోడీ వర్ణించారు. నెహ్రూ నాడు యుద్ధాన్ని మధ్యలోనే ఆపివేసి చారిత్రక తప్పిదం చేశారని సంఘపరివార్‌ సంస్థలలో ఒకటైన బిజెపి పదే పదే చెబుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిపిన ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగించి ఆక్రమిత కాశ్మీరును విముక్తి చేయకుండా నరేంద్రమోడీ సర్కార్‌ వచ్చిన మంచి అవకాశాన్ని విడిచిపెట్టిందని జనం భావిస్తున్నారు. కనీసం ఉగ్రవాదుల మీద పాకిస్తాన్‌ నుంచి ఎలాంటి హామీ పొందకుండా సిందూర్‌ను నిలిపివేసిందని తీవ్ర అసంతృప్తి, విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మోడీ జనం దృష్టిని మళ్లించేందుకు వల్లభాయ్‌ పటేల్‌ మాటున రక్షణ పొందినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గుడ్డిగా నమ్మేవారుంటే అది తాత్కాలికమే, వారు ఒకసారి కళ్లు తెరిస్తే నాన్నా పులి కథే. చివరికి నిజం చెప్పినా నమ్మరు.


కాశ్మీరు సమస్యను ఇరుదేశాలు పరిష్కరించుకోవాలన్నది సిమ్లా ఒప్పంద స్ఫూర్తి.దాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్‌ పాలకులు చిత్తశుద్దితో పనిచేసి పరిష్కరించలేదన్నది ఒక విమర్శ. వాస్తవమే, మరి బిజెపి చేసిందేమిటి ? జనతా పార్టీలో అది భాగస్వామి, వాజ్‌పాయి విదేశాంగ మంత్రిగా పని చేశారు. తరువాత ప్రధాని అయ్యారు. పదకొండు సంవత్సరాలుగా నరేంద్రమోడీ ఏలుబడి సాగుతున్నది. బిజెపి, దాని పూర్వ రూపమైన జనసంఫ్‌ు కాశ్మీరు సమస్యను ఓట్ల కోసం వాడుకోవటం తప్ప ఆక్రమిత కాశ్మీరును సాధించేందుకు మనదేశం వైపు నుంచి చేసిన ఒక్క ప్రయత్నాన్ని చూపమనండి. ఎందుకంటే ఆ సమస్య అలానే రావణకాష్టంలా కాలుతూ ఉండాలి. నెహ్రూ, కాంగ్రెస్‌ల మీద విమర్శలు చేస్తూ ఓట్లు దండుకొనేందుకు వినియోగించుకోవాలన్నది తప్ప బిజెపి చిత్తశుద్ది ఏమిటి ? 1994లోనే పార్లమెంటు ఆక్రమిత కాశ్మీరు మనదే అనే తీర్మానాన్ని కూడా ఆమోదించింది. మాకు అధికారమిస్తే పిఒకెను చిటికెలో వెనక్కు తీసుకువస్తాం అని తుపాకి రాముడు కబుర్లు చెప్పటం తప్ప పదకొండు సంవత్సరాల్లో ఒక్క అడుగువేసింది లేదు. ఆపరేషన్‌ సిందూర్‌తో వచ్చిన మంచి అవకాశాన్ని ట్రంప్‌ బెదిరిస్తే వెనక్కు తగ్గినట్లుగా జనం అనుకుంటున్నందున ముఖం మీద చెప్పకపోవచ్చుగానీ బిజెపి కబుర్లను ఇంకేమాత్రం నమ్మేస్థితి లేదు. దుకాణదారులు గోడమీద అప్పు రేపు అని రాసినట్లుగా రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ మరోమారు గురువారం నాడు అదే చెప్పారు. పిఓకెను మనకు పాక్‌ అప్పగించకపోతే ఏం చేస్తారో ఎప్పుడు చేస్తారో చెప్పాలన్న ప్రశ్నలకు సూటిగా చెప్పకుండా తెస్తాం అంటే మరో 75 ఏండ్లు ఆగాలని అర్ధమా !


పాకిస్తాన్‌లో భాగమైన తూర్పు బెంగాల్‌( నేటి బంగ్లాదేశ్‌)లో తలెత్తిన 1971 తిరుగుబాటును నాడు మనదేశం చక్కగా వినియోగించుకొని పాకిస్తాన్లోని ఒక ముక్కను విడగొట్టి ఒక తలనొప్పిని వదిలించుకుంది. నాడు పాకిస్తాన్‌కు మద్దతుగా అమెరికా మనలను బెదిరించేందుకు బంగాళాఖాతంలోకి తన సప్తమ నౌకాదళాన్ని దింపింది. అయినా ఖాతరు చేయకుండా ముందుకు పోవటమే కాదు, సోవియట్‌తో రక్షణ సంధి చేసుకున్నాం. మనకు మద్దతుగా తాను రంగంలోకి దిగాల్సి ఉంటుందనే సందేశం వెలువడటంతో అమెరికా వెనక్కు తగ్గింది. ఇప్పుడు పహల్గాం రూపంలో వచ్చిన అవకాశాన్ని నరేంద్రమోడీ ఎందుకు వినియోగించకోలేదు ? అన్నింటి కంటే ట్రంప్‌ జోక్యం లేదా బెదిరింపులతో వెనక్కు తగ్గి ఏమీ సాధించకుండానే పాకిస్తాన్‌తో రాజకీ కుదుర్చుకున్నట్లు జనం భావిస్తున్నారు. లేదూ పాక్‌ కోరికతో మనమే రాజీపడ్డామని చెబుతున్నారు, దాని ప్రకారమే అయినా ఏం సాధించారని సంధికి అంగీకరించారు. ఇప్పుడు కూడా రష్యాతో రక్షణ ఒప్పందం ఉంది అయినా 56 అంగుళాల ఛాతీ ధైర్యం చేయలేకపోయింది.


నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్లే కాశ్మీరుపై పటేల్‌ వైఖరిలో రెండూ ఉన్నాయి. పత్రికలు చదివేవారూ, టీవీలు చూసే ప్రతి ఒక్కరు చరిత్రలో ఏం జరిగిందనే శోధన చేయరనే గట్టి విశ్వాసంతో తమకు కావాల్సిందాన్నే కొందరు చెబుతారు.2018 ఫిబ్రవరి ఏడవ తేదీన ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో మాట్లాడుతూ ‘‘ సర్దార్‌ పటేల్‌ గనుక భారత తొలి ప్రధాని అయి ఉంటే మొత్తం కాశ్మీరు మనదే అయి ఉండేది ’’ అని చెప్పారు.కానీ అదే పటేల్‌కు అసలు కాశ్మీరు గురించి ఆసక్తి ఉందా ? ఉంటే నాటి రక్షణ మంత్రి బలదేవ్‌ సింగ్‌కు అలా లేఖ రాసేవారా ? కల్నల్‌ కటోచ్‌ను కాశ్మీరులో నియమించాలని, ఒకవేళ కాశ్మీరు గనుక వేరేదేశం(పాకిస్తాన్‌)లోకి వెళ్లిపోతే అతన్ని తిరిగి మనదేశానికి తీసుకురావాలని నరేంద్రమోడీ పుట్టక ముందే 1947 సెప్టెంబరు 13న లేఖ రాశారు. అది ఇంటర్నెట్‌లో అందరికీ అందుబాటులో ఉంది.


1947 ఆగస్టుఅక్టోబరు మధ్య తొలిసారిగా భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం జరిగింది. అనేక మంది చరిత్రకారులు, విశ్లేషకులు రాసినదాన్ని బట్టి కాశ్మీరును రాబట్టుకోవాలా లేదా అనే అంశంలో నెహ్రూ, పటేల్‌ మధ్య గందరగోళం ఉంది. కనుకనే సెప్టెంబరులో పటేల్‌ అలా లేఖరాశారన్నది స్పష్టం. పటేల్‌ వైఖరి గురించి నరేంద్రమోడీ నోరు విప్పక ముందే అనేక మంది తమ రచనల్లో చర్చించారు. అవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎవరికి వారు స్వంత అభిప్రాయాలకు రావచ్చు. 1984లో రాజేంద్ర శరీన్‌ ‘‘పాకిస్తాన్‌ ద ఇండియా ఫాక్టర్‌ ’’ అనేపేరుతో రాసిన పుస్తకంలో అనేక అంశాలను చర్చించారు. అబ్దుల్‌ రాబ్‌ నిష్తార్‌ అనే పాకిస్తాన్‌ మంత్రితో పటేల్‌ సంభాషిస్తూ ‘‘ భాయ్‌ హైదరాబాద్‌, జునాఘడ్‌ల గురించి మాటలొద్దు, కాశ్మీరు గురించి చెప్పండి, కాశ్మీరును తీసుకోండి సమస్యను పరిష్కరించండి ’’ అని చెప్పినట్లుగా పేర్కొన్నారు. మౌంట్‌బాటన్‌ పాక్‌ ప్రధాని లియాకత్‌ అలీతో భేటీ అయినపుడు పాక్‌ రాజ్యాంగపరిషత్‌ సభ్యుడు సర్దార్‌ షౌకత్‌ హయత్‌ కూడా ఉన్నాడు. పాకిస్తాన్‌ గనుక హైదరాబాద్‌ను వదులు కుంటే దానికి బదులుగా కాశ్మీరును భారత్‌ ఇస్తుందని మౌంట్‌బాటన్‌ పటేల్‌ సందేశంగా లియాకత్‌ అలీకి చెప్పాడు. దాని మీద సంభాషణల్లో ‘‘ సర్దార్‌ సాహెబ్‌ మీకేమైనా మతిపోయిందా పంజాబ్‌ కంటే పెద్దదైన ప్రాంతాన్ని మనం ఎందుకు వదులుకోవాలి, దానికి బదులుగా కొన్ని పర్వతాలున్న దాన్ని ఎందుకు తీసుకోవాలి ’’ అన్నాడు. అంతే కాదు రాజేంద్ర శరీన్‌ పుస్తకంలో ఇంకా ఏమి ఉటంకించిదీ చూద్దాం.1947 జూన్‌లో కాశ్మీరు రాజు హరిసింగ్‌తో మౌంట్‌బాటన్‌ భేటీ అయ్యాడు. ఆ సందర్భంగా మౌంట్‌బాటన్‌ మాట్లాడుతూ ‘‘ మీరు పాకిస్తాన్‌తో కలవదలచుకుంటే భారత్‌ దాన్ని ఒక తప్పుగా భావించదు, ఆ మేరకు సర్దార్‌ పటేల్‌ స్వయంగా గట్టి హామీ ఇచ్చారు ’’ అని చెప్పినట్లు నాడు పటేల్‌ రాజకీయ కార్యదర్శిగా ఉన్న వి శంకర్‌ ( సర్దార్‌ పటేల్‌తో నా జ్ఞాపకాలు 1974 ) అనేపుస్తకంలో రాశారు.‘‘ కాశ్మీరు పాలకుడు ఒకవేళ తాను, తన రాజ్యానికి పాకిస్తాన్‌తో కలవాలనే ఆసక్తి ఉంటే ఆ దారికి నేను అడ్డుపడను ’’ అని పటేల్‌ అన్నట్లుగా కూడా శంకర్‌ రాశారు.


కాశ్మీరు గనుక పాకిస్తాన్‌ వైపు వెళ్లాలని ఎంచుకుంటే దాని నిర్ణయాన్ని నేను నిరాక్షేపణీయంగా అంగీకరిస్తానని పేర్కొన్నారు. నిజంగా పటేల్‌ ప్రధాని అయివుంటే అన్నంత పనీ చేసి ఉండేవారు కాదా ! ఈ విషయాన్ని అదే పటేల్‌ ఉపప్రధానిగా ఉన్నపుడు ప్రభుత్వ కార్యదర్శిగా పని చేసిన విపి మీనన్‌ నిర్ధారించారని 1990లో ప్రచురితమైన ‘‘ పటేల్‌ ఏ లైఫ్‌( పటేల్‌ జీవితం ) అనే గ్రంధంలో మహాత్మాగాంధీ మనవడు, చరిత్రకారుడు రాజ్‌మోహన్‌ గాంధీ రాశారు. అదే విషయాన్ని మౌంట్‌బాటన్‌ అప్పుడే మహమ్మదాలీ జిన్నాకు కూడా చేరవేశారు. అంతే కాదు కాశ్మీరు స్వతంత్ర దేశంగా ఉన్నప్పటికీ దాన్ని వ్యతిరేకించబోమని చెప్పినట్లు కూడా మౌంట్‌బాటన్‌ చెప్పాడు. కాశ్మీరును తీసుకొని దాని బదులు జునాఘడ్‌, హైదరాబాద్‌ సంస్థానాలను మనం తీసుకోవాలన్నది పటేల్‌ వైఖరి. అయితే మూడు సంస్థానాలూ తమకే కావాలనే దురాశతో జిన్నా దానికి ఒప్పుకోలేదు. ఒకవేళ అంగీకరించి ఉంటే……
స్వాతంత్య్రం వచ్చిన సమయంలో సంస్థానాలు ఏ దేశంలో విలీనం కావాలో నిర్ణయించుకొనే స్వేచ్చను ఇచ్చారు. అది తప్పా ఒప్పా అంటే దానికి పటేల్‌ కూడా నాడు అంగీకరించారు. గట్టిగా పటేల్‌ అడ్డుపడి ఉంటే అసలు సమస్యే ఉండేది కాదు, కాశ్మీరు ఆక్రమణకు గురయ్యేదే కాదు. హైదరాబాద్‌ సంస్థానం, కాశ్మీరు స్వతంత్ర దేశాలుగా ఉంటామని ప్రకటించుకోగా జునాఘడ్‌(ప్రస్తుత గుజరాత్‌ రాష్ట్రంలో ఉంది) పాకిస్తాన్‌తో చేరాలని నిర్ణయించుకుంది.కాశ్మీరులో అత్యధికులు ముస్లింలు కాగా పాలకుడు హిందూ రాజు, జునాఘడ్‌, హైదరాబాదులో అత్యధికులు హిందువులు కాగా పాలకులు ముస్లింలు. పటేల్‌కు ఆ నాటికే ముస్లింలంటే పడదో లేక దేశవిభజనకు కారకులయ్యారనే కోపమో ఏమో హైదరాబాద్‌, జునాఘడ్‌లను వదులుకొనేది లేదు, కావాలంటే కాశ్మీరును పాకిస్తాన్‌ తీసుకుంటే వ్యతిరేకించం అని చెప్పినట్లు కనిపిస్తోంది. తరువాత పటేల్‌ వైఖరిలో మార్పు వచ్చిందంటే దానికి కారణం కాశ్మీరు గురించి నెహ్రూ ఇతర నేతలు గట్టిగా నిలవటం, పాకిస్తాన్‌ దురాక్రమణకు పూనుకోవటమే. కాశ్మీరు హిందూ రాజు స్వతంత్ర దేశమంటూ నాటి బ్రిటన్‌, అమెరికా పన్నిన కుట్రలో భాగంగా హడావుడి చేస్తే అక్కడి జనం ముస్లింలు మాత్రం నేషనల్‌ కాన్ఫరెన్సు నాయయకుడు షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో భారత్‌లో విలీనాన్ని కోరుకున్నారు. ఆ కారణంగానే మూడొంతుల కాశ్మీరు మనలో విలీనమైంది. దక్షిణాసియాలో అమెరికా, బ్రిటన్‌ చెప్పుచేతల్లో ఉండే పాకిస్తాన్‌, దానికి మరో స్వతంత్ర దేశంగా కాశ్మీరుకూడా తోడు కావటాన్ని నాటి సోవియట్‌,చైనా తదితర సమీప దేశాలేవీ అంగీకరించలేదు. అదే జరిగి ఉంటే ఎలాంటి ముప్పు వచ్చి ఉండేదో సిక్కిం అనుభవం తరువాత తెలిపింది.

చైనాభారత సరిహద్దులో సిక్కిం మనదేశంలో విలీనం కాలేదు. రాచరిక దేశంగా ఉంది. అక్కడ పాగా వేసేందుకు రాజుకు అమ్మాయిలను ఎరవేసి తనవైపు తిప్పుకోవాలని అమెరికా చేసిన యత్నాన్ని నాటి ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వంలోని యంత్రాంగం వమ్ముచేసింది. భారత్‌లో విలీనానికి అవసరమైన కథనడిపి విజయవంతమైంది.ప్రజాభిప్రాయం మేరకు 1975లో మన దేశంలో విలీనమైంది. లేకుంటే హిమాలయాల్లో అమెరికా తొత్తు దేశంగా ఇజ్రాయెల్‌ మాదిరి మనకూ, చైనాకూ సమస్యలను తెచ్చిపెట్టి ఉండేది. కాశ్మీరు సమస్యను ఐరాసకు తీసుకువెళ్లి జవహర్‌లాల్‌ నెహ్రూ పెద్ద తప్పుచేశారన్నది బిజెపి ఆరోపణ. తప్పో ఒప్పో జరిగిపోయింది. అలా తీసుకువెళ్లినందుకు నిరసనగా వల్లభాయ్‌ పటేల్‌ ఎందుకు రాజీనామా చేయలేదు ? అంటే ఆ నిర్ణయానికి ఆయన కూడా అంగీకరించినట్లే, కనుక నెహ్రూనే బాధ్యుడిని చేయటం వక్రీకరణ.భద్రతా మండలి ఒక తీర్మానం చేయాలని 1948 జనవరి ఒకటిన భారత్‌ కోరింది. దాని మీద అదే ఏడాది ఏప్రిల్‌ 21న 47వ నంబరు తీర్మానాన్ని ఆమోదించారు. దాని ప్రకారం ఉభయ దేశాలూ కాల్పుల విరమణ పాటించాలి. ఇతర ప్రాంతాల నుంచి పోరాటానికి వచ్చిన గిరిజనులు, పాక్‌ పౌరులు, ఇతరులు కాశ్మీరు నుంచి వెళ్లిపోవాలి.భారత ప్రభుత్వం తన ఆధీనంలోని ప్రాంతాలలో మిలిటరీని కనీస స్థాయికి తగ్గించాలి. తద్వారా పాకిస్తాన్‌, భారత్‌ ఏ దేశంలో చేరేదీ నిర్ణయించేందుకు ప్రజాభిప్రాయ సేకరణకు వీలు కల్పించాలి.అది 1949 జనవరి ఒకటి వరకు జరగలేదు. ఈలోగా ఐరాస కమిషన్‌ మూడుసార్లు కాశ్మీరు సందర్శించింది. పరిస్థితి మీద ప్రభావితం చూపే విధంగా కాశ్మీరులో పాకిస్తాన్‌ మార్పులకు పాల్పడిరది. అందువలన ముందుగా పాక్‌ తన మిలిటరీ, పౌరులను అక్కడి నుంచి ఉపసంహరించాలి.తరువాత భారత్‌ వెనక్కు తీసుకోవాలి. ఆ తరువాత ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని 1948 ఆగస్టులో కమిషన్‌ భద్రతా మండలికి నివేదించింది. దీన్ని మనదేశం అంగీకరించగా పాక్‌ తిరస్కరించింది. చట్టబద్దంగా కాశ్మీరు మనదేశంలో విలీనమైంది, అంటే పాక్‌ మిలిటరీ, అది మద్దతు ఇచ్చిన వారు కాశ్మీరులో ఉండటం అంటే శత్రుపూరిత చర్య, దురాక్రమణకు పాల్పడటమే, ప్రజాభిప్రాయ సేకరణ అంటే విలీనాన్ని నిర్ధారించేందుకు తప్ప అంతకు ముందే అన్ని లాంఛనాలు పూర్తయినట్లు మనదేశం వాదించింది. అయితే ఇతర దేశాలతో ఒప్పందం చేసుకొనే ముందు తొలుత తమతో కాశ్మీరు ప్రభుత్వం యథాతధస్థితి (కాశ్మీరు అంతకు ముందు మాదిరే ఉండేట్లు ) ఒప్పందం చేసుకుందని, కాశ్మీరు పౌరులు తిరుగుబాటు చేశారని, మహరాజు పారిపోయినందున అతగాడికి ఒప్పందం చేసుకొనే హక్కులేదని పాకిస్తాన్‌ వాదించింది. విముక్త కాశ్మీరు ఆందోళనలు, గిరిజనుల తిరుగుబాట్లు వాటికవే పుట్టినవి తప్ప వాటికి తమ మద్దతు గురించి విమర్శకు తావేలేదన్నది. ముందు పాకిస్తాన్‌ తన దళాలను ఉపసంహరించుకోవాలని భారత్‌ అంటే మేము తప్పుకున్న తరువాత భారత్‌ వైదొలుగుతుందన్న గ్యారంటీ ఏమిటి అంటూ పాకిస్తాన్‌ అడ్డం తిరిగింది. అంతే, తరువాత జరిగిందేమీ లేదు.బంగ్లా విముక్తి తరువాత 1972లో ఇరుదేశాలు పరస్పరం చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని సిమ్లా ఒప్పందంలో నిర్ణయించటంతో ఐరాస పాత్రకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పటి వరకు వాజ్‌పాయి, నరేంద్రమోడీ ఎవరు ఏలుబడిలో ఉన్నప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ చేసిందేమీ లేదు.

హైదరాబాద్‌ సంస్థాన విలీనం గురించి ఎందుకు పటేల్‌ అంతగట్టిగా పట్టుబట్టారనటం ఆసక్తి కలిగించే అంశం. దేశం మధ్యలో మరొక దేశం లేదా పాకిస్తాన్‌ ప్రాంతం ఉండటం అంటే కడుపులో కాన్సరే అని పటేల్‌ వర్ణించాడు. అది వాస్తవమే. మరొక కారణాన్ని కూడా కొట్టి పారవేయటానికి లేదు. నైజాం నవాబు మీద స్వాతంత్య్రానికి ముందు నుంచే కమ్యూనిస్టులు పాలనకు వ్యతిరేకంగా సాయుధపోరాటం చేస్తున్నారు. చైనాలో దీర్ఘకాలం సాగిన కమ్యూనిస్టుల లాంగ్‌ మార్చ్‌ మాదిరి భారత్‌లో కూడా నైజాం సంస్థానం మారితే ప్రమాదకరమని నెహ్రూ ప్రభుత్వాన్ని సిఐఏ హెచ్చరించిందని చెబుతారు. ఆపరేషన్‌ పోలో నాలుగు రోజుల్లోనే ముగిసింది కానీ తరువాత నెహ్రూపటేల్‌ సైన్యాలు కమ్యూనిస్టుల మీద మూడు సంవత్సరాల పాటు అణచివేతకు పాల్పడ్డాయి. నైజాం నవాబు, వాడితో చేతులు కలిపిన జాగీర్దార్లు, దేశముఖల కంటే మిలిటరీ ఎక్కువ మంది కమ్యూనిస్టులను చంపింది, ఒక్క తెలంగాణాలోనే కాదు, దానికి మద్దతు ఇచ్చిన ఆంధ్రప్రాంతంలో కూడా వందలాది మందిని పొట్టన పెట్టుకుంది. పాకిస్తాన్‌ వైపు నుంచి కాశ్మీరు ఆక్రమణకు పూనుకోవటం, భారత్‌లో విలీనానికి రాజు హరిసింగ్‌ అంగీకరించటం, కేంద్ర ప్రభుత్వం సైన్యాలను పంపిన తరువాత పటేల్‌ వైఖరిలో మార్పు రావటం అనివార్యం. ఉక్కు మనిషి, పట్టిన పట్టు వదలడు కదలడు అని పటేల్‌ గురించి చెబుతారు. కానీ నరేంద్రమోడీ చెప్పినట్లుగా ఆక్రమిత కాశ్మీరును విముక్తి చేసేంత వరకు యుద్ధం కొనసాగించి ఉండాల్సిందనే వైఖరి మీద గట్టిగా పట్టుబట్టినట్లుగానీ, దానికి తిరస్కరించిన నెహ్రూతో విబేధించి మంత్రివర్గం నుంచి బయటకు రావటం గానీ ఎక్కడా మనకు కనిపించదు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంలో 1949 జనవరి ఒకటి నుంచి రెండుదేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. పటేల్‌ కుమార్తె మణిబెన్‌ రాసిన డైరీలలో 1949 జూలై 23నమోదు చేసినదాని ప్రకారం ‘‘ మనం మొత్తం ప్రాంతం కావాలని కోరుతున్నాం… మొత్తం కాశ్మీరు కోసం పోరు సాగించాలి’’ అని ఉన్నట్లు బిజెపి నేత తరుణ్‌ విజయ్‌ రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. దానిలో నెహ్రూ నా మాట వినలేదు అనే భావం ఉందా ? అది కూడా యుద్దం ముగిసిన ఆరు నెలల తరువాత నిజంగానే నెహ్రూ వినలేదు అని చెప్పినందువలన ప్రయోజనం ఏముంది ? అంత పట్టుదలగల వ్యక్తి నిజంగా దేశానికి నష్టం జరిగిందని భావిస్తే రాజీనామా చేసి ఉండాలి. అటూ ఇటూ కాందిశీకులుగా వెళ్లిన వారు స్వస్థలాలకు వచ్చి తమ ఆస్తులను విక్రయించుకొనేందుకు వీలు కల్పించే ఒప్పందాన్ని నెహ్రూ పాకిస్తాన్‌తో చేసుకున్నారనే కారణంతో నిరనస తెలిపి వాణిజ్యశాఖ మంత్రిపదవికి శ్యామప్రసాద ముఖర్జీ రాజీనామా చేసి బయటకు వచ్చారు. తరువాత వెంటనే జనసంఘాన్ని ఏర్పాటు చేశారు. దానికే అంత పట్టుదల ఉంటే మరి ఉక్కు మనిషి పటేల్‌కు కీలకమైన కాశ్మీరు విషయంలో నెహ్రూతో విబేధాలు ఉంటే ఎందుకు బయటకు రానట్లు ? అందువలన కాశ్మీరు సమస్య మీద పటేల్‌ అసలు వైఖరిని వదలి నెహ్రూ మీద మరోసారి దాడి చేసేందుకు, తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.పోనీ నెహ్రూ, తరువాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఆక్రమిత కాశ్మీరు గురించి పట్టించుకోలేదని విమర్శిస్తున్న కాషాయ దళాలు తాము అమితంగా ప్రేమించే వల్లభాయ్‌ పటేల్‌ వాంఛను తీర్చాలనే చిత్తశుద్ది ఉంటే కబుర్లు కాదు, కార్యాచరణను ప్రారంభించాలి,యావత్‌ ప్రతిపక్షం, పౌరులూ సంపూర్ణ మద్దతు ఇస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిలో 4వ స్థానం మోడీ గొప్పతనం – తలసరిలో 136 స్థానం నరేంద్రమోడీ ఘోరవైఫల్యం !

26 Monday May 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, Germany, History, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, Donald trump, India GDP, India per capita GDP, Narendra Modi, Narendra Modi Failures, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

జపాన్ను వెనక్కు నెట్టేసి మనదేశం ప్రపంచ జిడిపిలో నాలుగో స్థానానికి చేరిందని, రెండున్నర లేదా మూడు సంవత్సరాల్లో జర్మనీని కూడా పక్కనపెట్టి మూడవ స్థానానికి వెళతామని నీతిఅయోగ్‌ సిఇవో బివిఆర్‌ సుబ్రమణ్యం చేసిన ప్రకటనకు మీడియాలో పెద్ద స్పందనే వచ్చింది. అనేక మంది సంతోషిస్తున్నారు. ఇదొక గొప్పా అని పెదవి విరిచేవారు కూడా ఉన్నారు.నూటనలభై కోట్ల జనాభాలో ఈలెక్కల ఆల్జిబ్రా ఎంతమందికి అర్ధం అవుతుంది ? ‘‘ నేను చెప్పినట్లుగా మనది నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, నాలుగు లక్షల కోట్ల ఆర్థికం, ఇది నేను చెబుతున్న సమాచారం కాదు. ఐఎంఎఫ్‌ చెబుతున్నది, జపాన్‌ కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ ’’ అని సుబ్రమణ్యం నీతి అయోగ్‌ పాలకమండలి పదవ సమావేశంలో ప్రకటించారు. మనం రూపొందించిన పథకం ప్రకారం జరిగితే రెండు, రెండున్నర, మూడు సంవత్సరాల్లో మనది మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అన్నారు. ఐఎంఎఫ్‌ ఏప్రిల్‌ 22 సమాచారం ప్రకారం వర్తమాన ధరల్లో సాధారణ(నామినల్‌) జిడిపి అమెరికా 30.51లక్షల కోట్ల డాలర్లు, చైనా 19.23, జర్మనీ 4.74,భారత్‌ 4.19, జపాన్‌ 4.19, బ్రిటన్‌ 3.84,ఫ్రాన్సు 3.21, ఇటలీ 2.42, కెనడా 2.23, బ్రెజిల్‌ 2.13 లక్షల కోట్లతో మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. 202526 నాటికి మన జిడిపి 4.187.017,జపాన్‌లో 4.186.431 బిలియన్‌ డాలర్లుగా అంచనా. వేసింది. బొమ్మను పాలకులు ఎలాగూ చూపించారు, వారు మూసిపెట్టే బొరుసు ఎలా ఉందో చూడాలి కదా !


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015లో 2.1లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025లో దేశ జిడిపి 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు, ఇది 105శాతం పెరుగుదల అని ఐఎంఎఫ్‌ కొద్ది నెలల క్రితం చెప్పింది.అదే సంస్థ తాజాగా విడుదల చేసిన అంచనాలో ఆ మొత్తాన్ని 4.187 లక్షల కోట్లకు తగ్గించింది. జపాన్‌ మొత్తం 4.186 గనుక దాన్ని పక్కన పెట్టి మనకు నాలుగో స్థానాన్ని ఇచ్చింది. తేడా ఎంత 0.001 లక్షల కోట్లు. చెవులప్పగించేవారుంటే కాకమ్మ కతలు చెప్పేవారికి కొదవ ఏముంది. బిజెపి పెద్దలు 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని గొప్పలు చెప్పుకున్న అంశం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి అభివృద్ధిని ఏ ప్రభుత్వమూ సాధించలేదని కూడా బిజెపి ఐటి సెల్‌ మాలవీయ చెప్పారు.అలా ప్రచారం చేయటమే కదా ఆ పెద్దమనిషి ఉద్యోగం. వాస్తవం ఏమిటి, 2004లో మన్మోహన్‌ సింగ్‌ అధికారానికి వచ్చినపుడు జిడిపి 709 బిలియన్‌ డాలర్లు కాగా 2014 నాటికి అది 2030 బిలియన్లకు పెరిగింది. యుపిఏ పాలనా కాలంలో పెరుగుదల రేటు 186 శాతమని, 105కంటే ఎక్కువని కాస్త నిజాయితీ ఉన్నవారు కూడా చెబుతారు.


గతంలో ప్రధాని చెప్పిన కొన్ని అతిశయోక్తుల గురించి చెప్పుకుందాం. ‘‘ గత పదేండ్లలో జిడిపిని రెట్టింపు చేయటం అంకెలు కాదు, 25 కోట్ల మందిని దారిద్య్రరేఖ దాటించి నూతన మధ్యతరగతిని సృష్టించాం. వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు, సచేతనంగా ఆర్థికవృద్ధికి తోడ్పడుతున్నారు ’’. ప్రధాని నోటి నుంచి జాలువారిన ఈ మాటలను చూసి నవ్వాలా ఏడవాలో తెలియటం లేదు. ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్య్రరేఖ నుంచి ఎగువకు లాగాం అంటూనే కనీసం ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న 140కిగాను 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార భద్రతా పధకం కింద గోధుమలు, బియ్యం ఇస్తున్నామని, మరికొన్నేండ్లు ఇస్తామని ఒక ఘనతగా చెప్పుకుంటారు. ప్రపంచ ఆకలి సూచికలో తాజాగా 127లో 105వ దేశంగా ఉన్నాం. ఆకలి లేని(9.9), స్వల్ప (10 నుంచి 19.9), తీవ్రం(20 నుంచి 34.9), ఆందోళనకరం(35నుంచి 49.9) , అత్యంత ఆందోళనకరం(50పైన) అనే ఐదు తరగతులుగా దేశాలను విభజిస్తే మన దేశం తీవ్ర తరగతిలో అంతకు ముందు, గత పదేండ్లుగా కూడా ఉంది. పదేండ్లలో జిడిపి రెట్టింపు అని ఇతర గొప్పలు కానీ పది సంవత్సరాల్లో 2014 నుంచి 2014వరకు మన ఆకలి సూచిక స్కోరు 28.2 నుంచి 27.3కు మాత్రమే తగ్గింది,దీనిలో అంత అభివృద్ధి ఎందుకు రాలేదు ? ఇదే కాలంలో పాకిస్తాన్‌ స్కోరు 29.6 నుంచి 27.9కి తగ్గింది, దీని గురించి చెబితే ఈ దేశంలో పుట్టీ, ఈ దేశంలో పెరిగీ, అన్నం తింటూ పక్కదేశాన్ని పొగుడుతున్నట్లు ఎదురు దాడి చేస్తారు. పాక్‌ రాంకు మన తరువాత 109, ఆకలిని ఎవరు ఎక్కువగా తగ్గించినట్లు ? గత పదేండ్లలో చైనా స్కోరు ఐదు కంటే తక్కువే ఉందన్న వాస్తవాన్ని చెబితే నానా యాగీ చేస్తారు. మోడీ సాధించిన విజయాలు మీకు పట్టవా అంటారు కొందరు. నిజమే 188 దేశాల జిడిపిలో మనలను నాలుగవ స్థానంలోకి తీసుకు వెళ్లినందుకు మోడీ ఘనత ఖాతాలో వేద్దాం. అదే తలసరి జిడిపిలో 136వ స్థానంలో ఉంచిన ఘనుడని కూడా కీర్తించాలా ! తలసరి జిడిపి కూడా నిజానికి ఒక మైండ్‌గేమ్‌ తప్ప మరొకటి కాదు. కొందరి దగ్గర సంపదలు పోగుపడటం అంటే ఆర్థిక అసమానతలు పెరుగుతున్నట్లే, మోడీ ఏలుబడిలో పెరిగినట్లు స్పష్టంగా తేలింది. సర్‌ గోచిపాతరాయుడు సంపద ఒక రూపాయి, 50,49 చొప్పున అంబానీ, అదానీల సంపదలు ఒక దగ్గర చేర్చి మూడుతో భాగిస్తే వచ్చే 33 గోచిపాతరాయుడి సంపద అంటే నవ్విపోతారు. అంబానీ ఇంట వివాహానికి విమానాలు,హెలికాప్టర్లు వేసుకొని వచ్చిన అతిధులు గోచిపాతరాయుడి ఇంటికి వస్తారా !


అసలు జిడిపి చర్చలోకి వెళితే బుర్ర బద్దలవుతుందంటే అతిశయోక్తి కాదు. దీన్ని సాధారణ(నామినల్‌), పిపిపి(పవర్‌ పర్చేజింగ్‌ పారిటీ) పద్దతుల్లో లెక్కిస్తున్నారు. రెండవదే వాస్తవానికి దగ్గరగా ఉంటుందన్నది కొందరి సమర్ధన. దాని ప్రకారం చూస్తే నరేంద్రమోడీ అధికారానికి వచ్చే నాటికే మన దేశం సాధారణంలో పది, రెండవ లెక్కలో మూడవ స్థానంలో ఉంది. మోడీ గణం రెండవ లెక్కలను ఎందుకు చెప్పటం లేదు. ఎందుకంటే దేశాన్ని ఇప్పటికీ అదే స్థానంలోనే మోడీ ఉంచారు గనుక. ఐఎంఎఫ్‌ 2025 పిపిపి అంచనా ప్రకారం చైనా 42.72, అమెరికా 30.51, భారత్‌ 17.65 లక్షల కోట్ల డాలర్లతో మూడవదిగా, రష్యా నాలుగు, జపాన్‌ ఐదవదిగా ఉంది. 2027 తొలి ఆరునెలల్లోనే సాధారణంలో 4.9లక్షల కోట్ల డాలర్లతో జర్మనీని కూడా దాటించేస్తారని ఊదరగొడుతున్నారు.అవన్నీ గిడసబారిన దేశాలుగా మారుతున్నాయి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఆంబోతుల్లో అన్నట్లుగా చెప్పుకుంటే కుదరదు. మనం పోల్చుకోవాల్సింది చైనాతో కదా ! మన వృద్ధి రేటు చైనా, అమెరికా, జర్మనీ కంటే ఎక్కువగా ఉందని, గడచిన పదేండ్లలో భారత్‌ 105శాతం పెరుగుదల సాధించగా చైనా 76, అమెరికా 66, జర్మనీ 44, ఫ్రాన్సు 38, బ్రిటన్‌ 28శాతం పెరుగుదల సాధించిందని ఐఎంఎఫ్‌ చెప్పింది. లక్ష కోట్ల డాలర్ల కిలోమీటర్‌(మైలు) రాయిని దేశం 2007లో దాటింది.తదుపరి 2014లో రెండు లక్షల కోట్లు, 2025లో నాలుగు లక్షల కోట్లు దాటింది. 2032నాటికి పదిలక్షల కోట్ల డాలర్ల జిడిపి కలిగిన దేశంగా మారుతుందని కొందరు ఆర్థికవేత్తలు జోశ్యం చెప్పారు. వారి తర్కం ఏమిటి ? 2021లో మూడు లక్షల కోట్లకు విస్తరించింది. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రతి 18నెలలకు ప్రస్తుత వేగంలో ఒక లక్ష కోట్ల డాలర్లు పెరుగుతున్నది. ఇదే కొనసాగితే 2032 నాటికి 10లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.


రానున్న కొద్ది సంవత్సరాల్లో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నందుకు ఇప్పటి నుంచి సంబరాలు జరుపుకుంటున్న వారిని చూసి ఆర్థిక నిపుణుడు డి ముత్తుకృష్ణన్‌ ఉత్సవాలు జరుపుకోవాల్సినంత ఘనత ఏమి సాధించామని 2024లోనే ప్రశ్నించారు. జిడిపిలో ఏ స్థానంలో ఉన్నామన్నది కాదు తలసరి రాబడిలో ప్రపంచంలో మనం 140వ స్థానంలో ఉన్నామని, మనకంటే 139దేశాలు ముందున్నాయని గుర్తించాలని చెప్పారు.(తాజాగా 136 గనుక 135 ముందున్నాయి) పిపిపి ప్రకారం చూసినా మన స్థానం 119 అని చెప్పారు. పదేండ్లలో మన జిడిపి 105శాతం పెరిగిందని ఏ ఐఎంఎఫ్‌ చెప్పిందో అదే సంస్థ 2025 తలసరి జిడిపిలో 141వ స్థానం అని కూడా జోశ్యం చెప్పింది. దివాలా తీసిందని చెప్పిన శ్రీలంక 133, బంగ్లాదేశ్‌ 143, పాకిస్తాన్‌ 159, షీ జింపింగ్‌ ఏలుబడిలో కుప్పకూలిపోయిందని కొంత మంది చెప్పే చైనా 71వ స్థానంలో (తాజాగా 70) ఉందని కూడా ఐఎంఎఫ్‌ చెప్పింది. మన తలసరి రాబడి పదివేల డాలర్లకు చేరాలంటే కనీసం 30 సంవత్సరాలు కష్టపడి పని చేయాలని, దానికి అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు ఉండాలని ముత్తు కృష్ణన్‌ చెప్పారు. చైనా తలసరి జిడిపి 2025లో 13,873 డాలర్లు, ఇప్పుడున్న మన 2,937 డాలర్ల నుంచి ఎదిగి ప్రధమ స్థానంలో ఉన్న మొనాకో 2,56,581( 2023 ప్రపంచ బ్యాంకు సమాచారం) లేదా డాలర్‌ దేవుడున్న అమెరికా 89,678(2025 ఐఎంఎఫ్‌) స్థాయికి, చివరికి పడకకుర్చీ మేథావులు చెబుతున్నట్లుగా అధిగమించే దూరం ఎంతో లేని చైనాను అయినా కనీసం అధిగమించాలంటే ఎంత సమయం పడుతుందో వేరే చెప్పనవసరం లేదు.


ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ నరేంద్రమోడీ నాయకత్వం కారణంగా ప్రపంచ వెలుగు దివ్వెగా భారత్‌ ముందుకు వచ్చిందని బిజెపినేత ప్రదీప్‌ బండారీ చెప్పిన మాటలు భజనరాయుళ్ల గళం తప్ప మరొకటి కాదు. పదకొండు సంవత్సరాలుగా వేసిన పునాదులే కారణమన్నారు. ఐరోపా దేశాలు, జపాన్‌ ఆర్థిక వ్యవస్థలు పెరుగుదల లేక గిడసబారిపోయాయి. రెండవ ప్రపంచయుద్ధానికి ముందు ఉన్న వలసలను కోల్పోయిన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మాజీ రాజుల వలే ఉన్నాయి. మిలిటరీలను నిషేధించిన కారణంగా అందుకు వెచ్చించే సొమ్మును పరిశోధనలకు మళ్లించి జర్మనీ, జపాన్‌, అమెరికా ఇచ్చిన దన్నుతో దక్షిణ కొరియా వేగంగా వృద్ధి చెందాయి. ఇప్పుడు వాటికి పరిమితి ఏర్పడిరది కనుకనే మనం ముందుకు వస్తున్నాం. ఒక నాడు మనకంటే వెనుకబడి ఉన్న చైనాతో తప్ప వాటితో పోల్చుకుంటే అవ్వతో వసంతమాడినట్లే ! అదేమంటే చైనా కమ్యూనిస్టు దేశమంటారు, మనది ప్రజాస్వామ్యం, స్వేచ్చ ఎక్కువ గనుక దాని కంటే ఎంతో ముందు ఎందుకు లేదు అంటే సమాధానం ఉండదు. ఒక ఐదు సంవత్సరాల పాటు ఐదులక్షల కోట్ల డాలర్ల గురించి ఊదరగొట్టారు. ఇప్పుడు పదిలక్షల కోట్ల గురించి చెప్పబోతున్నారు. 1950లో మన దేశంలో 20 కోట్ల మంది జనం ఉపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగు భూమి ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అన్న లెక్కలను పక్కన పెట్టి స్థిరంగా ఉందనుకున్నప్పటికీ అదే భూమి మీద 2023`24లో జనాభాలో 46.1శాతం మంది ఆధారపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే తెలిపింది. ఆరు సంవత్సరాల క్రితంతో పోల్చితే రెండు శాతం పెరిగారు. అంటే ఇప్పుడు 67 కోట్ల మంది పని చేస్తున్నారు.చైనాలో 24.1 శాతం లేదా 17.66 కోట్ల మంది(2023) పని చేస్తున్నారు. భూమి మీద ఆధారపడే వారు తగ్గటం అభివృద్ధి చెందిన దేశాల లక్షణం. వెనుకటికి ఒకడు మాది నూటొక్క అరకల వ్యవసాయం అని గొప్పలు చెప్పాడట. మీది అంటున్నావు ఎవరెవరికి ఎన్ని అంటే నాది ఒకటి మా అయ్యగారివి వంద అన్నాడట. జిడిపి కూడా అంతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d