• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: CORRUPTION

బక్కచిక్కుతున్న రూపాయి పాపాయి జనంపై మోయలేని భారం : పదేండ్లుగా పల్తెత్తు మాట్లాడని నరేంద్రమోడీ !!

08 Sunday Dec 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Causes of Inflation, CORRUPTION, India Price Rise, Inflation in India, Narendra Modi Failures, Rupee depreciation, Rupee fall under Modi rule

ఎం కోటేశ్వరరావు

మన జనానికి నిజంగానే మతిమరపు ఎక్కువా లేదా పట్టించుకోవట్లేదా ? కోరి చేసుకున్నోడు గనుక ఎగిరెగిరి తన్నినా కిమ్మనటం లేదనే సామెతను నిజం చేస్తున్నారా ? మనది కర్మభూమి అనుకుంటున్నాం గనుక తప్పదు ! పదేండ్ల క్రితం డాలరుతో మారకంలో రూపాయి విలువ పతనం గురించి నరేంద్రమోడీ మొదలు బిజెపి నేతలందరూ ఎన్ని మాట్లాడారు ! ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పతనమైనా పల్లెత్తు మాటల్లేవేమి ? రూపాయి పతనం, జిడిపి వృద్ధి రేటు పతనం, ఎగుమతుల్లో ఎదుగుదల పతనం ఇలా పదేండ్ల పాలనలో అవే ఎక్కువ. మరక మంచిదే అని ఒక వాణిజ్య ప్రకటనలో చెప్పినట్లుగా రూపాయి విలువ తగ్గటం మనకు మంచిదే అని కొంత మంది సమర్థిస్తారు. కొన్ని అంశాలలో వాస్తవమే, ఎగుమతిదార్లకు, విదేశాల నుంచి డబ్బు పంపేవారికి లబ్ది, దిగుమతిదార్లకు, తద్వారా జనాలందరికీ భారం. కానీ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్న లోకోక్తి తెలిసిందే. మన దేశంలో అదే జరుగుతోంది. మన కరెన్సీ పతనం కొంత మందికి కాసుల వర్షం కురిపిస్తుండగా అత్యధికుల జేబులు గుల్లవుతున్నాయి. ఏటా వేల కోట్ల డాలర్లను విదేశాలకు సమర్పించుకుంటున్నాము. ఉదాహరణకు 202223లో రు.21,45,690, 202324లో రు.19,54,060 కోట్లు విదేశాలకు సమర్పించుకున్నాము. దీనిలో ఎక్కువ చైనాకే రు.6,73,0006,97,000 చొప్పునవెళ్లింది. దీన్ని మరో విధంగా చెప్పాలంటే ఈ భారం మొత్తాన్ని మన జనం మీద మోపారు. కార్పొరేట్లు లేదా ప్రభుత్వ కంపెనీలు లాభాలతో సహా దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలను వినియోగదారులనుంచే కదా వసూలు చేసేది.


కొందరు వర్ణిస్తున్నట్లుగా ముచ్చటగానో లేదా మరికొందరంటున్నట్లుగా దేశానికి మూడిగానీ మోడీ పాలనలో పదకొండో ఏడులో ఉంది. 2014లో ఒక వస్తువు ధర రు.106 ఉంటే ద్రవ్యోల్బణం పెరిగిన కారణంగా అదే ఇప్పుడు రు.156 పెట్టి కొనాల్సి వస్తోంది.ద్రవ్యోల్బణం సగటున 5.12శాతం పెరిగిన ఫలితమే. ఈ నిర్వాకం సంగతేమిటి ? ఈ మేరకు జనానికి రాబడి పెరుగుతోందా ? 2024 అక్టోబరులో పద్నాలుగు నెలల గరిష్టం 6.21శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం అంతకు మించి 15నెలల గరిష్టం 10.87శాతానికి చేరింది.ఏడాది క్రితం అక్టోబరు నెలలో 6.61శాతమే ఉంది. వినియోగదారులు కొనేటట్లు లేదు కడుపు నిండాతినేట్లు లేదు. అన్నదాతల పరిస్థితి ఏమిటి ? ప్రస్తుతం రబీ సీజన్‌ నడుస్తున్నది, దేశమంతటా ఈ పంటలకు ముఖ్యమైన డిఏపి ఎరువుల కొరత, దాన్ని ఆసరా చేసుకొని అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.యూరియాయేతర ఎరువుల కోసం రబీ తరుణంలో ఎరువుల సబ్సిడీ నిమిత్తం రు.24,474 కోట్ల సబ్సిడీ ఇవ్వనున్నట్లు, అది గత ఏడాది కంటే పదిశాతం ఎక్కువ అని గొప్పగా కేంద్ర పెద్దలు చెప్పారు. డిఏపి మే నెలలో టన్ను దిగుబడి ధర 510 డాలర్లు ఉండగా నవంబరు మొదటి వారంలో 645కు పెరిగింది.అది రు.54,000కు సమానం. ఈ స్థితిలో కేంద్రం గరిష్ట ధరగా రు.27వేలు నిర్ణయించి సబ్సిడీగా రు.21.911గా ప్రకటించింది. కొరత ఏర్పడిన స్థితిలో మరో మూడున్నరవేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ ఏ వ్యాపారి 54వేలు చెల్లించి దిగుమతి చేసుకుంటాడు ? ఒకవేళ దిగుమతి చేస్తే అంత ధరలో రైతులు కొనుగోలు చేయగలరా ?

గతేడాది అక్టోబరు ఒకటి నాటికి 30లక్షల టన్నుల మేర నిల్వలుండగా ఈ ఏడాది 16లక్షలకు తగ్గింది. పోనీ దేశీయంగా ఉత్పత్తి పెరిగిందా అంటే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఏడు శాతం తగ్గింది. దిగుమతులను చూస్తే గతేడాది ఏప్రిల్‌సెప్టెంబరు మధ్య 34.5లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది అది 19.6లక్షలకు పడిపోయింది. ఏడాదికి 100 నుంచి 110లక్షల టన్నులు అవసరం కాగా దీనిలో 60శాతం దిగుమతి చేసుకుంటున్నాము. ఈ ఏడాది ఇప్పటి వరకు దిగుమతులు సగం తగ్గటానికి కేంద్రం ఎరువుల మీద సబ్సిడీలో భారీ కోత విధించటమే అసలు కారణం. 202223లో రు.2.51లక్షల కోట్లు కేటాయించిన మోడీ సర్కార్‌, 202324లో రు.1.88, 202425లో ఆ మొత్తాన్ని రు.1.64లక్షల కోట్లకు కోత పెట్టింది. యుపిఏ సర్కార్‌ 2010లో అమల్లోకి తెచ్చిన విధానం ప్రకారం నిర్ణీత మొత్తాన్ని మాత్రమే సబ్సిడీగా ఇస్తారు, దాన్ని విమర్శించిన నరేంద్రమోడీ తనదాకా వచ్చేసరికి దాన్నే అమలు జరిపారు. అయితే మధ్యలో అంతర్జాతీయంగా ధరలు విపరీతంగా పెరగటం, రైతాంగం ఏడాది పాటు ఢల్లీి శివార్లలో ఉద్యమించిన నేపధ్యంలో సబ్సిడీ మొత్తాన్ని పెంచారు. తిరిగి పైన పేర్కొన్న విధంగా కోత మొదలు పెట్టారు.ద్రవ్యోల్బణం అదుపులో ఉండాలంటే సబ్సిడీలకు కోతపెట్టి ప్రభుత్వ ఖర్చు తగ్గించటానికి పూనుకున్నారు. ఎరువుల సబ్సిడీ తగ్గటానికి దిగుమతి చేసుకొనే ఎరువులు, గ్యాస్‌ ధర తగ్గటమే అని కొందరు చెబుతున్నారు. అదే ప్రాతిపదిక అయితే అవసరాలకు అనుగుణంగా డిఏపి దిగుమతి చేసుకొని పంటలు పండేందుకు తోడ్పడాల్సిందిపోయి, ధరలు పెరిగాయనే పేరుతో దిగుమతులు ఎందుకు తగ్గించినట్లు ?


రూపాయి పతనం అన్నది ఆర్థిక స్థిరత్వం మీద పెద్ద ప్రభావం చూపుతుంది.అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది.యుపిఏ పాలన మీద ధ్వజమెత్తటానికి బిజెపి ప్రచార కమిటీ నేతగా 2014 ఎన్నికలకు ముందు దీన్ని ఒక అయుధంగా వాడుకున్నారు. రూపాయి విలువ పతనమౌతుంటే గతంలో ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏమన్నారో తెలుసా ! ‘‘ ఆర్థికం లేదా రూపాయి విలువ పతనం గురించి ప్రభుత్వానికి ఎలాంటి చింత లేదు, తన కుర్చీని ఎలా కాపాడుకోవాలన్నదే దాని ఏకైక ఆందోళన. ఈ కారణంగా దేశం ఈ రోజు ఆశాభంగం చెందింది. గత మూడు నెలలుగా పతనం అవుతున్న రూపాయిని నిలబెట్టేందుకు ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదు. ఇలా పతనం అవుతుంటే ఇతర దేశాలు దాన్ని అవకాశంగా తీసుకుంటాయి. గడచిన ఐదు సంవత్సరాలుగా ధరలు తగ్గుతాయని, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెబుతున్నారు తప్ప జరిగిందేమీ లేదు ’’ (2013 ఆగస్టు 20, బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రికలో పిటిఐ వార్త). మోడీ ఈ ఆరోపణలు చేసిన రోజు డాలరుకు రూపాయి విలువ 64.11గా ఉంది. పదేండ్ల తరువాత ఇప్పుడు 84.73కు దిగజారింది.అడిగేవారు లేక గానీ పైన చెప్పిన అంశాలన్నీ మోడీకి వర్తించవా ? ఈ దిగువ ఆయా సంవత్సరాలలో రూపాయి సగటు విలువ ఎలా ఉందో చూడవచ్చు. 2024 విలువను రాసిన సమయానికి ఉన్నదిగా పరిగణించాలి.
సంవత్సరం = రూ.విలువ
2014 = 62.33
2015 = 62.97
2016 = 66.46
2017 = 67.79
2018 = 70.09
2019 = 70.39
2020 = 76.38
2021 = 74.57
2022 = 81.35
2023 = 81.94
2024 = 83.47
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు. యుపిఏ చివరి సంవత్సరాలలో ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం, ధరలు కూడా పెరిగాయి. మోడీ పదవిలోకి రాగానే ముడి చమురు ధర బాగాపడిపోయి దిగుమతి బిల్లు గణనీయంగా తగ్గింది, ఆ సమయంలో వినియోగదారులకు ఆ మేరకు లబ్ది చేకూరకుండా వివిధ సెస్సులను భారీగా విధించి, పెద్ద మొత్తంలో కేంద్రం రాబడిని పొందింది. రూపాయి విలువ తగ్గితే మన ఎగుమతులు పెరుగుతాయన్నది కూడా వాస్తవం కాదు. 2013లో మన ఎగుమతులు 472 బిలియన్‌ డాలర్లు కాగా 2023లో అవి 777 బి.డాలర్లకు పెరిగాయి. దీన్నే జిడిపిలో చూస్తే ఎందుకంటే దాన్ని పెంచిన ఘనత తమదే అని బిజెపి చెప్పుకొంటోంది గనుక25.43 నుంచి మధ్యలో 18.66శాతానికి పడిపోయినా 2023లో 21.89శాతంగా ఉంది. అంటే మొత్తంగా చూసినపుడు పతనం తప్ప పెరుగుదల లేదు. దిగుమతులు వినియోగదారులకు భారం కాకూడదు. వజ్రాలు, బంగారం వంటి వాటిని దిగుమతి చేసుకుంటే వాటి మీద పన్ను విధించవచ్చు, ఇబ్బంది లేదు, కానీ ముడిచమురు దిగుమతుల మీదకూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాభాలను పిండుకుంటున్నాయి.

నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాదికి ఇప్పటికీ తేడాను చూద్దాం. యుపిఏ పాలన చివరి ఏడాది నుంచి ఇప్పటి వరకు మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు పీపా సగటు ధరలు ఇలా ఉన్నాయి.
ఏడాది = డాలర్లు ——–ఏడాది = డాలర్లు
2013-14 =105.52 2014-15 = 84.16
2015-16 = 46.17 2016-17 = 47.56
2017-18 = 56.43 2018-19 = 69.88
2019-20 = 60.47 2020-21 = 44.82
2021-22 I 79.18 2022-23 = 93.15
2023-24 = 82.58

వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు 81.95 డాలర్లు ఉంది. దీనికి అనుగుణంగా ధరలు తగ్గించకుండా గడచిన రెండున్నర సంవత్సరాలుగా వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఆ ధరలను బట్టే రాష్ట్రాలు వ్యాట్‌ వసూలు చేస్తున్నాయి. కేంద్రం ధర తగ్గిస్తే ఆ మేరకు రాష్ట్రాలూ తగ్గిస్తాయి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత డీజిలు, పెట్రోలు మీద సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేశారు,గ్యాస్‌ మీద ముష్టి మాదిరి విదుల్చుతున్నారు. 201415 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 202021 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 202324 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు. 2024 ఆగస్టు ఒకటవ తేదీన ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన సమాచారం ప్రకారం 201920లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చమురు రంగంలో వచ్చిన పన్ను, తదితరాల రాబడి మొత్తం రు.5,55,370 కోట్లు కాగా దీనిలో కేంద్ర వాటా రు.3,34,315 కోట్లు, ఈ మొత్తాలు 202324 తాత్కాలిక అంచనాలో పెరిగిన మొత్తం రు.7,51,156 కోట్లు కాగా కేంద్ర వాటా రు.4,32,394 కోట్లు ఉంది. ఇంత మొత్తం సంపాదిస్తున్న కేంద్రం ఉజ్వల గాస్‌ పధకం పేరుతో ఒక్కొక్క వినియోగదారుకు ఏడాదికి ఇస్తున్న సబ్సిడీ రు.1,114 కాగా ఇతర వినియోగదారులకు ఇస్తున్న మొత్తం రు.670 మాత్రమే. దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచుతామంటూ కబుర్లు చెప్పే నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకం ఎలా ఉందో తెలుసా ? 201415లో ప్రభుత్వప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2023`24నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. ఇలాంటి పాలనతో 2047నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతున్నారు. అదుపులేని రూపాయి పతనం,ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరుగుతూ నడ్డి విరుస్తున్నాయి. పదేండ్ల క్రితం మోడీ చెప్పిన అచ్చే దిన్‌ ( మంచి రోజులు ) బిజెపి మద్దతుదార్లకైనా వచ్చాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిర్లా, సహారా డైరీలు – జవాబు లేని ప్రశ్నలు !

24 Saturday Dec 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Others, Political Parties

≈ Leave a comment

Tags

birla sahara diaries, BJP, cbi, CORRUPTION, it, Modi

ఎం కోటేశ్వరరావు

    తన దగ్గరున్న సమాచారం గనుక బయట పెడితే ఏదో జరిగి పోతుందన్నట్లుగా రాహుల్‌ గాంధీ బిల్డప్‌ ఇవ్వటం, అది తుస్సుమనటం తెలిసిందే. చీకట్లను పారద్రోలుతూ వెలుగుతుందనుకున్న ఒక మతాబా, బాగా పేలుతుందనుకున్న దీపావళి బాంబు ఒక్కోసారి తుస్సుమనొచ్చు. అయితే అవి తుస్సుమన్నప్పటికీ వాటి అవశేషాలను తొలగించి వీధిని శుభ్రం చేయాల్సిన బాధ్యత గృహస్తు మీదో స్ధానిక సంస్ధల పారిశుధ్య సిబ్బందిమీదో వుంటుంది. ఇప్పుడు రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలు, ఆ మాటకు వస్తే అవి ఆయన కొత్తగా కనుగొన్నవీ కాదు, తాజాగా బయటపడినవీ కాదు, ఇప్పటికే ప్రముఖ లాయర్‌ ప్రశాంత భూషన్‌ కోర్టులో వేసిన కేసులోనివే. ఇక్కడ రెండు అంశాలున్నాయి.

    ఒకటి నరేంద్రమోడీని సమర్ధిస్తూ బిజెపి నేతలు అత్యంత బలహీనమైన వాదనలు చేశారు. రెండు ఆయన స్వయంగా రాహుల్‌ గాంధీని అపహాస్యం చేశారు. తమ నేత గంగ అంతటి స్వచ్చమైన ముత్యం అన్నది ఒకటి. గంగతో సహా ఏ నది అయినా పుట్టుక స్థానంలో ఎంతో స్వచ్చంగా వుంటుంది. తరువాతే కలుషితంగా మారుతోంది. హిమాలయాల నుంచి బయటపడిన తరువాత గంగ ఎంత కాలుష్యంగా మారిందో మోడీ సర్కార్‌ ప్రకటించిన గంగ శుద్ధి ప్రణాళిక తెలిసిందే.ఎవరైనా పుట్టినపుడు, బాల్యంలో ఎలాంటి మచ్చ లేకుండా వుంటారు. పెరిగేకొద్దీ కథ ప్రారంభం అవుతుంది.మోడీ అయినా అంతే. డైరీల నిగ్గు తేలే వరకు సహారా, బిర్లాల దగ్గర ముడుపులు తన స్వంతానికి తీసుకున్నారా పార్టీ కోసమా అన్నది వేరే విషయం.

    పారిశ్రామిక సంస్ధలు, వ్యక్తులు ఇచ్చే విరాళాలు లేదా ముడుపులు ఎక్కడా ఖాతాలలో పక్కాగా రసీదుల వివరాలతో సహా రాయరు. డైరీలలోనో మరొక చోటో పొట్టి లేదా నిక్‌నేమ్స్‌ పేరుతోనో నమోదు చేస్తారు. ఎందుకంటే ఆ పని చేసే వారు ఆ సొమ్ము స్వంతదారులకు జవాబుదారీగా ఏదో ఒక ఆధారాన్ని చూపాలి. నమ్మకస్తుల ద్వారానే అలాంటి పని చేయిస్తారు. వుదాహరణకు రెండు దశాబ్దాల క్రితం హవాలా కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. అది కూడా ఎస్‌కె జైన్‌ అనే హవాలా వ్యాపారి నమోదు చేసిన డైరీల ఆధారంగా అని ఇక్కడ గుర్తు చేయాలి. ఆ డైరీలలో వామపక్షాలు తప్ప కాంగ్రెస్‌,బజెపి, జనతాదళ్‌ తదితర 18 పార్టీల నేతల పేర్లు వున్నాయి. ఆ వివరాలు బయటకు రాగానే ఆ జాబితాలో ఒకరైన బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ తన లోక్‌సభ సభ్వత్యానికి రాజీనామా చేసి ఆ మచ్చ తొలిగిన తరువాత గానీ తిరిగి సభలోకి అడుగు పెట్టనని ప్రకటించి నాడు ప్రశంసలు పొందారు. దాంతో అనేక మంది కాంగ్రెస్‌, బిజెపి నేతలు కూడా పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా ఆ కేసులో తేలిందేమీ లేదు, నిర్దోషులుగా ప్రకటించారు.

   చిత్రం ఏమిటంటే అద్వానీ శిశ్యుషుడినని, ఆయన సభ్యుడిగా వున్న మార్గదర్శక మండలి సలహామేరకు పని చేస్తున్నానని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ రాజీనామా సంగతి తరువాత, ముందసలు ఆ డైరీల సంగతి నిగ్గుదేల్చమని దర్యాప్తు సంస్ధలను ఆదేశించటానికి కూడా ముందుకు రాలేదెందున్నది అసలు ప్రశ్న. హవాలా డైరీలలో, సహారా, బిర్లా డైరీలలో బిజెపితో పాటు కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలందరూ వున్నారు. అందుకే తేలు కుట్టిన దొంగ మాదిరి మోడీ సర్కార్‌ మౌనంగా వుండిపోయిందా ? సరే వెంకయ్య నాయుడు తన పాండిత్యాన్ని మొత్తాన్ని వుపయోగించి ఆ డైరీలు బయట పడింది కాంగ్రెస్‌ హయాంలో అప్పుడెందుకు వాటి గురించి చెప్పలేదని చెట్టుకింద లాయర్‌ మాదిరి ప్రశ్న వేశారు. ఆ డైరీలు 2013 అక్టోబరులో, 2014 నవంబరులో నరేంద్రమోడీ అధికారానికి వచ్చాక సిబిఐ, ఆదాయపన్ను శాఖ దాడులలో బయట పడ్డాయి.తమకు దొరికిన వాటిపై ఏ చర్య తీసుకోవాలన్నది ఆ సంస్ధల విధి. తమకు దొరికిన వాటి గురించి ఎటూ తేల్చకుండా మీన మేషాలు లెక్కించటాన్ని చూసిన తరువాత కామన్‌ కాజ్‌ అనే ఒక స్వచ్చంద సంస్ద 2015లో సుప్రీం కోర్టుకు వెళ్లింది.అంటే సిబిఐ, ఆదాయపన్ను శాఖలపై తెరవెనుక నుంచి వత్తిడి వచ్చిందన్నది స్పష్టం. ‘అవినీతి వ్యతిరేక నరేంద్రమోడీ హయాం ‘ ఇలా జరగటం ఏమిటి ? గంగ మాదిరి కాలుష్యం సోకిందా ?

     ఈ డైరీలపై దాఖలైన కేసులో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల తర్కం అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. డైరీలలో పేర్లు వున్నంత మాత్రాన వాటిపై విచారించటం కుదరదని,ఇలాంటి వాటిపై దర్యాప్తులకు ఆదేశిస్తే పర్యవసానాలు తీవ్రంగా వుంటాయంటూ ఎవరైనా ఒకరు ప్రధానికి ఇంత డబ్బు ముట్టచెప్పామని తమ డైరీలలో రాసుకున్నంత మాత్రాన ఎలా విచారణ జరపాలి అంటూ మరింత స్పష్టమైన సాక్ష్యాలతో రావాలని చెప్పి చింతకాయల రవి సినిమాలో ప్రతిదానికీ సర్టిఫికెట్‌ల ఫ్రూఫ్‌ కావాలనే పాత్రధారిని గుర్తుకు తెచ్చింది. భవిష్యత్‌లో అక్రమంగా నిధులు ఇచ్చేవారు, పుచ్చుకొనే వారు కేసులు, శిక్షల నుంచి తప్పించుకొనేందుకు అనుసరించాల్సిన సులువైన పద్దతిని చెప్పినట్లు , తప్పించుకొనేందుకు అవసరమైన తర్కాన్ని సిద్ధం చేసినట్లుగా వుంది. బిర్లా డైరీలను నమోదు చేసిన వారు తమకు హవాలా మార్గంలో నగదు వస్తుందని, దానిని తమ యజమానుల ఆదేశాల మేరకు రాజకీయ నేతలకు అంద చేస్తాని విచారణలో చెప్పారు. బిర్లా కంపెనీ చైర్మన్‌ సుబేందు అమితాబ్‌ కూడా విచారణలో గుజరాత్‌ సిఎంకు 25 కోట్లు అందచేసినట్లు అంగీకరించారు. అయితే గుజరాత్‌ సిఎం అంటే గుజరాత్‌ ఆల్కలీస్‌ అండ్‌ కెమికల్స్‌ అని చెప్పారు. సి,ఎం అనే పదాలకు ఆ కంపెనీ పేరుకు పొంతన కుదరటం లేదు. దాని గురించి అడిగితే అదంతే అనటం తప్ప సరైన వివరణ ఇవ్వలేదు. పోనీ అక్రమ పద్దతుల్లో నగదు తీసుకున్న సదరు కంపెనీపై చట్టపరమైన చర్యలేమన్నా తీసుకున్నారా ? అదీ లేదు. దీని వాస్తవాలను తేల్చాల్సింది ఎవరు? అందుకే ఆ డైరీలపై దర్యాప్తు జరపాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్లు న్యాయవాది ప్రశాంత భూషన్‌ చెబుతున్నారు. హవాలా కేసులో దొరికిన డైరీలలో పొట్టి పేర్లు మాత్రమే వున్నాయి. అయినప్పటికీ దర్యాప్తు జరపటానికి అవి చాలని అప్పుడు సుప్రీం కోర్టు చెప్పింది. ఇప్పుడు పేర్లు, డైరీలు మరింత స్పష్టంగా వున్నప్పటికీ మరింత స్పష్టమైన ఆధారాలు కావాలని అదే కోర్టు వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలపై రాజకీయంగా అపహాస్యం చేయవచ్చు, సామాజిక మీడియాలోని తన భక్తులు, సైన్యానికి వుత్సాహం తెప్పించవచ్చు. అంతటితో అది అయిపోదు, కోర్టు లేదా మోడీ సర్కార్‌ దీనిపై ఏదో ఒక వైఖరిని వెల్లడించకతప్పదు. ఆ డైరీల నిగ్గు తేల్చనంత వరకు మోడీవైపు వేలు చూపుతూనే వుంటారు .

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్భాటం ఎక్కువ-ఆచరణ తక్కువ

27 Friday May 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

CORRUPTION, failure Modi, MODI TWO YEARS RULE, Narendra Modi Failures, NDA Two years rule

 

రెండేళ్ల మోడీ పాలన

ఎం కోటేశ్వరరావు

    తన రెండు సంవత్సరాల పాలనలో అవినీతిని  చూపండంటూ మూడవ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తన రాజకీయ ప్రత్యర్ధులకు ఒక సవాలు విసిరారు. అవినీతి అంశాన్నే ప్రధాన సోపానంగా చేసుకొని అధికారానికి వచ్చిన మోడీ ఈ కాలంలో ఎన్ని అవినీతి కేసులను ఒక కొలిక్కి తెచ్చారు? ఎంతమందిని కటకటాల వెనక్కు పంపారు ? అందుకు తీసుకున్న ప్రత్యేక చర్యలేమిటి? అన్నింటి కంటే ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలను పంచుతానన్న నల్లధనం సంగతేమిటి ? దానిని దాచినవారిపై చర్యలేమిటి అన్న అసలు ప్రశ్నలకు రెండేళ్లు గడిచినా సమాధానం లేదేమిటా అని ఎదురు చూస్తున్నవారికి మోడీ సవాలు గానీ, ఎన్నో సంస్కరణలు అమలు చేశానని చెప్పుకోవటం గానీ అంతగా కిక్కు ఇవ్వటం లేదు. అన్నింటి కంటే పనామా పత్రాలలో పేరు చోటు చేసుకున్న అమితాబ్‌ బచ్చన్‌ న్యూఢిల్లీలో నరేంద్రమోడీ విజయాలను పొగుడుతూ ఒకవైపు కార్యక్రమం నిర్వహించుతున్నపుడు మరోవైపు అవినీతి అక్రమాలకు వ్యతిరేక పోరాట యోధుడిగా నరేంద్రమోడీ ఎన్నికబుర్లు చెప్పినా ప్రయోజనం ఏముంది ?

     మోడీ ప్రభుత్వ పని తీరు గురించి ఆయనను వ్యతిరేకించే పార్టీలు ఏదైనా చెబితే ఒక పద్దతి, ఆయన మిత్రపక్షం శివసేన ఏం చెబుతున్నది ? కొండంత రాగాలు తీయటమే తప్ప చేస్తున్నది తక్కువని ఆ పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించారు. నరేంద్రమోడీ ప్రకటించిన పధకాలన్నీ గత ప్రభుత్వం వేరే పేర్లతో అమలు చేసినవే అని కూడా గాలితీసింది. నల్లధనాన్ని వెలికి తీసి కనీసం పదిలక్షల రూపాయల వంతున పంచుతానని వాగ్దానం చేసిన మోడీ దాన్ని అమలు జరపటంలో విఫలమయ్యారని పేర్కొన్నది. సరిహద్దులలో పాక్‌ వుగ్రవాదం కొనసాగుతూనే వుంది, నిరంతరం మన సైనికులు మరణిస్తూనే వున్నారు, కానీ పొరుగు దేశంతో కౌగిలింతలు, ముద్దులు కొనసాగుతూనే వున్నాయని వ్యాఖ్యానించింది.మోడీ సర్కార్‌ ఐదు సంవత్సరాలకు ఎన్నికైంది కనుక ఆ గడువు ముగిసిన తరువాతే ప్రభుత్వ పని తీరు గురించి వ్యాఖ్యానించటం సబబుగా వుంటుంది, ఇప్పటికైతే మోడీకి మా శుభా కాంక్షలు అని ముగించింది.

     నరేంద్రమోడీ సర్కార్‌ ఏరి కోరి రాజ్యసభకు ఎంపిక చేసిన సుబ్రమణ్యస్వామి నోటి వెంట వచ్చిన నిజాలేమిటి ? దేశంలో అసహన వాతావరణం వుందని దీనికి బిజెపి ప్రభుత్వమే కారణమని రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురాం రాజన్‌ అభిప్రాయమని సుబ్రమణ్యస్వామి తాజాగా ప్రధానికి సంధించిన లేఖలో పేర్కొన్నారు.రాజన్‌ అసహనవాతావరణం గురించి మాట్లాడి వుండవచ్చు తప్ప దానికి బిజెపిఏ కారణమని బహిరంగంగా ఎక్కడా చెప్పలేదు.ఒక వేళ రాజన్‌ అలా అని వుంటే అధికారంలో వున్నంత మాత్రాన అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదా ? మొత్తం మీద స్వామి ఫిర్యాదు స్వభావం భావ ప్రకటనా స్వేచ్చను సవాలు చేస్తున్నట్లే ? అన్నింటి కంటే గత రెండు సంవత్సరాల కాలంలో రిజర్వుబ్యాంకు గవర్నరు హోదాలో రాజన్‌ వడ్డీ రేటు తగ్గించని కారణంగా పరిశ్రమలన్నీ కుప్పకూలాయని, నిరుద్యోగం పెరిగిందని అదీ మోడీ రెండేళ్ల సంబరాలు జరుపుకుంటున్న సమయంలో సుబ్రమణ్యస్వామి చెప్పటం గమనించాల్సిన అంశం.ఇక్కడే చిన్న కిక్కుంది. అదేమిటంటే ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ అనేక సందర్భాలలో మోడీ హయాంలో ఆర్ధిక వ్యవస్ధ తిరిగి పట్టాలెక్కిందని, చైనాను అధిగమించే దిశలో పురోగమిస్తోందని అనేక సందర్బాలలో చెప్పారు. అంటే మంత్రి అవాస్తవాలను చెబుతున్నట్లా ? స్వామి నిజాలను చెబుతున్నట్లా ?ఈ సంబరాల సమయంలో కాకపోయినా తరువాత అయినా మౌన ముని మోడీయే నోరు విప్పాలి.

   మోడీ, ఆయన అర్ధభాగం అమిత్‌ షా ఇతర పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో అనేక అంశాలు చెప్పారు. వాటి సంగతి ఏమంటే ఎన్నికలపుడు అనేకం చెబుతుంటాం అవన్నీ అమలు జరపటం ఎవరికైనా ఎలా సాధ్యం అని అమిత్‌ షా నల్లధనం వెలికితీత గురించి అడిగిన సందర్భంలో చెప్పారు.తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకున్న పార్టీ నేత ఆయన. మోడీ సర్కార్‌ పార్లమెంట్‌లో చెప్పిన వాటిని కూడా అమలు జరపటం లేదన్నదే ఇక్కడ అసలు సమస్య.

    లోక్‌సభ అధికారిక సమాచారం ప్రకారం మూడింట రెండువంతుల కేంద్ర మంత్రిత్వశాఖలు సగానికిపైగా హామీలను అమలు జరపలేదని వివరాలు వెల్లడిస్తున్నాయి. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో రోజుకు 250 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిస్తుంది. ప్రశ్నలు, చర్చలు, ఇతర ప్రస్తావనల సందర్భంగా మంత్రులు అనేక హామీలు ఇస్తారు. అవి అధికారికంగా నమోదు అవుతాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాటన్నింటినీ క్రోడీకరించి హామీల స్టాండింగ్‌ కమిటీకి పంపుతుంది. వాటిని మూడు నెలలలోగా అమలు జరిపించేందుకు కమిటీ ప్రయత్నిస్తుంది. అది ఎంత వరకు వచ్చిందనేది వారం, పదిహేను రోజులకు ఒకసారి సమీక్ష జరుగుతుంది. ఒకసారి హామీ ఇచ్చిన తరువాత ఏ కారణంతో అయినా లోక్‌సభ రద్దయితే తరువాత ఏర్పడే సభ, ప్రభుత్వానికి వాటిని అందచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా అలాంటి హామీలలో ఒకటి. అది ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా బిజెపి సర్కార్‌ కాదు అనటానికి లేదు. లేదా అధికారికంగా అది సాధ్యం కాదు అని అయినా చెప్పాలి.

     వుదాహరణకు ముంబై వుగ్రవాద దాడుల సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం కోస్తా ప్రాంతాలలో పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు గురించి హామీ ఇచ్చింది. నరేంద్రమోడీ సర్కార్‌ దానిని వుపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అలాగే అణువిద్యుత్‌ కేంద్రాలను సకాలంలో పూర్తి చేస్తామన్న హామీకి కూడా అదే జరిగింది.పెద్దగా ఆర్ధిక భారం లేని హామీలను కూడా మోడీ సర్కార్‌ నెరవేర్చటం లేదు. దేశంలోని మరో 38 భాషలను రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలులో చేరుస్తామని 2014 ఆగస్టులో ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. ప్రస్తుతం మన దేశంలో అద్దె గర్భంతో పిల్లలను కనటం కూడా ఏటా రెండున్నర వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయింది. దీనిలో ఎక్కువగా బలహీన వర్గాలకు చెందిన మహిళలే దోపిడీకి గురి అవుతున్నారు. దీనిని క్రమబద్దీకరించేందుకు అవసరమైన చట్ట సవరణ చేస్తామని 2014 ఆగస్టులో ప్రభుత్వం ఇచ్చిన హామీకి ఇంతవరకు దిక్కులేదు. ఇలా అనేకం వున్నాయి.న్యాయ మంత్రిత్వశాఖ ఇచ్చిన హామీలలో కేవలం 27శాతమే అమలు చేసింది. ఇంకా అనేక మంత్రిత్వశాఖలు తరతమ స్దాయిలో హామీలు ఇ్వటమే తప్ప అమలు జరపటం లేదు. ఈ వైఖరిని ఏమనాలి? జవాబుదారీతనం లేక మోడీ చెప్పినట్లు ఇసాబ్‌(లెక్క)లేని తనం కాదా ఇది. మంత్రుల గురించి తరువాత చెప్పుకోవచ్చు ఏకంగా ప్రధాన మంత్రి ఇచ్చిన ఏకైక హామీకి ఇంతవరకు దిక్కులేదు. మంత్రిత్వశాఖల పనితీరు, మదింపు పద్దతి గురించి 2013-14 సంవత్సరానికి సంబంధించి నివేదికలు ఇస్తామని మోడీ స్వయంగా 2014లో హామీ ఇచ్చారు. వాటిని ఇంతవరకు ఇవ్వలేదు. అందువలన ఆర్భాటంగా పధకాలు ప్రకటించటం కాదు, అవి ఎంతవరకు అమలు జరిగాయన్నది కావాలి. ప్రతి పధకంపై అధికారిక శ్వేత పత్రాలు ప్రకటిస్తే అసలు రంగు తేలుతుంది.

   అవినీతికి పాల్పడబోమని, స్వచ్చమైన పాలన అందిస్తామని మంత్రులు ప్రమాణం చేస్తారు. అందువలన అలా వుండటం వారి విధి. దానిని మరిచి పోయి మేం అవినీతికి పాల్పడలేదు అని చెప్పుకోవటం ప్రత్యేకమే. అవినీతికి పాల్పడకపోవటం సంతోషమే, కానీ అవినీతికి పాల్పడిన వారిని వెలికి తీసి శిక్షించటం కూడా రాజధర్మమే. అందువలన మేము మా రాజధర్మాన్ని నిర్వర్తించామా లేదా అన్న సవాలు విసరాలి. అధికారాంతమందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌ అన్నారు. అసలు ఏదైనా పని చేస్తే కదా సక్రమంగా చేశారా అక్రమంగా చేశారా అనేది తేలేది. ఎరువులు, గ్యాస్‌ సబ్సిడీలను తగ్గించటం, బ్యాంకు ఖాతాలను తెరవటం వంటి వాటిలో అవినీతికి అస్కారం తక్కువ. ప్రజల సంపదలను కార్పొరేట్లకు కారుచౌక రేట్లకు కట్టపెట్టటం నీతా ? అవినీతా ? అది లంచం తీసుకొని చేశారా తీసుకోకుండా చేశారా అని కాదు, విధాన పరమైన అక్రమమా కాదా ?

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

పనామా కంపెనీ పత్రాలు – పెద్దల అవినీతి చిత్రాలు

12 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Political Parties

≈ Leave a comment

Tags

big shots corruption, CORRUPTION, panama, panama papers

ముందుగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసుకొని దానిలో దూరిపో , లెక్క తప్పి అధికారానికి రాకపోయినా ఫరవాలేదు, తరువాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సిగ్గూ ఎగ్గూ పక్కన పెట్టేసి అధికారానికి వచ్చిన పార్టీలో చేరిపో, మంచి పదవి కొనుక్కో , వెంటనే చూసుకో ఒక పన్ను స్వర్గం ! పెట్టుకో లేదా కొనుక్కో అక్కడో సూట్‌కేస్‌ కంపెనీ !! ఇక్కడ దండుకో అందినంత సొమ్ము !!! భారత మాతాకీ జై కొట్టు !!!!

ఎం కోటేశ్వరరావు

   లైసన్సులు, పర్మిట్లు ఇప్పించినందుకు లంచాలు తీసుకోవటం, బల్లకింద చెయ్యి పెట్టటం నాటి పద్దతి ! ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలు, భూములు, రుణాలు ఇప్పించి నీకది-నాకిది, నీకింత -నాకింత అని పంచుకోవటం నేటి పద్దతి !! ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకుంటుంటే అవినీతి నిరోధకశాఖ సిబ్బంది నాటకీయంగా వలపన్నటం లెక్కలేనన్ని సినిమాల్లో అందరూ చూసింది మోటు పద్దతి. ఇప్పుడు అంతా చట్టబద్దమే, బల్లమీది వ్యవహారమే.

    రాజకీయ నేత, పారిశ్రామికవేత్త, వ్యాపారి, సినిమా యాక్టర్‌ ఇలా ఎందరో మహాను భావులు , చిదిమితే దేశ భక్తి కారిపోతుంటుంది. ప్రతిదానినీ వ్యాపారం-లాభం లెక్కలలో చూసుకొనేవారు ఎవరైనా ఇదే పద్దతి. గజం పాతికవేల రూపాయల స్ధలాన్ని కంపెనీ పేరుతో పాతిక రూపాయలకే అప్పనంగా పొందవచ్చు. దీన్ని కేటాయించిన సదరు మంత్రి కుమారుడు, కుమార్తెల పేరుతో (ఎందుకంటే ఇప్పుడు బావమరుదులను కూడా నమ్మటం లేదు మరి) ముందుగానే ఏర్పాటు చేసిన సూట్‌ కేసు కంపెనీలలో పది రూపాయల వాటాను వెయ్యి రూపాయలకు కొనటం లేదా సదరు కంపెనీకి ఎలాంటి వడ్డీ లేకుండా వందల కోట్ల రుణం పేరుతో డబ్బు బదలాయించి చట్టబద్దంగానే లంచం చెల్లించటం నేటి పద్దతి.

     ఇక అలా సంపాదించిన దానిని స్నేహితులు, బంధువుల పేరుతోనో మరొక పేరుతోనో దాస్తే, ఎవరినీ నమ్మే రోజులు కావివి, తీరా గడ్డితిని సంపాదించిన దానిని వారు నొక్కేస్తే ? డబ్బూపోయె శనీ పట్టె అన్నట్లు ఎందుకొచ్చిన తిప్పలు ! విదేశాల్లో దాచుకుంటే ఏ గొడవా వుండదు. అందుకే ముందుగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసుకొని దానిలో దూరిపో , లెక్క తప్పి అధికారానికి రాకపోయినా ఫరవాలేదు, తరువాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సిగ్గూ ఎగ్గూ పక్కన పెట్టేసి అధికారానికి వచ్చిన పార్టీలో చేరిపో, మంచి పదవి కొనుక్కో , వెంటనే చూసుకో ఒక పన్ను స్వర్గం ! పెట్టుకో లేదా కొనుక్కో అక్కడో సూట్‌కేస్‌ కంపెనీ !! ఇక్కడ దండుకో అందినంత సొమ్ము !!! భారత మాతాకీ జై కొట్టు !!!!

     మనకు బాగా తెలిసి పన్నుల స్వర్గం స్విడ్జర్లాండ్‌. అక్కడి బ్యాంకుల నిబంధనల ప్రకారం ఎవరైనా ఎంతైనా డబ్బు దాచుకోవచ్చు. అది ఎక్కడిది, అక్రమమా, సక్రమమా అని ఎవరూ అడగటానికి వీలు లేకుండా నిబంధనలు రూపొందించారు.అందుకని ఎవరైనా స్విడ్జర్లాండ్‌ వెళ్లారంటే అక్కడ లావాదేవీలు చూసుకొని రావటానికే అని అనుమానించటం సహజం. ఇపుడు స్విడ్జర్లాండ్‌ నిబంధనలు మార్చారు.ఎవరైనాఅడిగితే సమాచారాన్ని తెలియచేయాల్సి వుంటుంది. ఏ సమాచారమూ ఇవ్వనవసరం లేని పనామా వంటి దేశాలు, దీవులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. డబ్బుంటే చాలు, దానిని ఎలా దాచుకోవాలో, ఎలా పన్నులు ఎగ్గొట్టాలో సలహాల సేవలు అందించే కంపెనీలు చాలా వున్నాయి. అదిగో అలాంటి వాటిలో పనామాలోని ఒక పెద్ద సంస్ధ మోసాక్‌ ఫొన్సెకా. దాని దగ్గర వున్న లక్షలాది లావాదేవీల పత్రాలు బయటికి వచ్చాయి. ఆ కంపెనీ పనామాలో వుంది కనుక వాటిని పనామా పత్రాలని పిలుస్తున్నారు.రెండులక్షలకు పైగా కంపెనీల వివరాలు ఇపుడు బయటకు వచ్చాయి. తమ కంప్యూటర్లను హాక్‌ చేశారని మొసాక్‌ ఫొన్సేకా ప్రకటించింది.

    ఏప్రిల్‌ మొదటివారంలో ఈ పత్రాలు వెలువడగానే దాదాపు అన్ని పత్రికలు ఆ వార్తను పతాక శీర్షికలతో పెట్టాయి. తరువాత వాటి గురించి దాదాపు మరిచి పోయాయి ? పెట్టుబడిదారుల పుత్రికలైన పత్రికలు కొనసాగింపు వార్తలను ఇస్తాయని ఎవరైనా ఆశిస్తే అది దురాశే.మన దేశానికి చెందిన పెద్దల పేర్లు కూడా పనామా పత్రాలలో వుండటంతో మన ప్రధాని నరేంద్రమోడీ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. వాటి వెనుక కారణాలు ఏవున్నప్పటికీ ఆ మేరకు స్పందించినందుకు కొంత మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు పంచుతామని ఎన్నికలకు ముందు చెప్పిన ప్రధాని రెండేళ్లు గడుస్తున్నా చేసిందేమీ లేదనే విమర్శలను తప్పించుకోవటానికే మొక్కుబడిగా ఆ ప్రకటన చేశారని ఎందరో భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వెల్లడైన సమాచారం చాలా పరిమితమే. రానున్న రోజుల్లో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ మరింత సమాచారాన్ని వెల్లడించనుంది.అందువలన ఇది అంతంకాదు ఆరంభం మాత్రమే. వస్తున్న విశ్లేషణలు, నిబంధనలను పరిశీలిస్తే ఎవరెంత మన దేశంలో దోచుకున్నారో విదేశాల్లో దాచుకున్నారో వివరాలు కొంతమేరకు తెలుసుకోవచ్చేమో తప్ప సరిహద్దులు దాటిపోయిన ధనం ఏమేరకు తిరిగి వస్తుందన్నది అనుమానమే.

     పనామా పత్రాలు ప్రపంచంలో అనేక మంది రాజకీయ నేతలకు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఐస్లాండ్‌ ప్రధాని రాజీనామా చేశాడు.నలభై లక్షల డాలర్ల అక్రమ బాండ్ల వివరాలు బయటకు రావటంతో తోకముడిచాడు. బ్రిటన్‌ ప్రధాని కామెరాన్‌ పన్నులకు సంబంధించి తప్పుడు సమాచారమిచ్చినట్లు బయటకు రావటంతో ఇబ్బందులలో పడ్డాడు. పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.ఇలాంటి వారు 45 దేశాధినేతల పేర్లు ఈ పత్రాలలో ప్రస్తావనకు వచ్చాయి.న్యూస్‌ వీక్‌ పత్రిక సమాచారం ప్రకారం ప్రపంచంలోని పన్నుల స్వర్గాలలో 21నుంచి 32లక్షల కోట్ల డాలర్ల మేరకు ప్రపంచ సంపన్నులు, కార్పొరేట్లు అక్రమంగా దాచుకున్నారు. స్విడ్జర్లాండ్‌, హాంకాంగ్‌, అమెరికా, సింగపూర్‌, కేమాన్‌ దీవులు ప్రధమ స్ధానాలలో వుండగా పనామా 13,బ్రిటన్‌ 15వ స్ధానంలో వుంది.బ్రిటన్‌ వర్జిన్‌ ఐలాండ్‌లో పన్ను చెల్లించనవసరం లేకపోవటంతో ఎఫ్‌డిఐలు అక్కడికి లక్షా ఇరవైవేల కోట్ల పౌండ్ల మేరకు వచ్చాయి. అక్కడ 6,72,500 కంపెనీలు లేదా ఖాతాలు వున్నాయి. దారి జనాభా 30వేలకు లోపు. ఇలాంటి అక్రమలావాదేవీలకు ప్రధాన కేంద్రంగా బ్రిటన్‌ వుంది. పనామా పత్రాల తీవ్రత ‘పెట్టుబడిదారీ విధానాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేదిగా వుందని’ టైమ్‌ పత్రిక వ్యాఖ్యానించింది.’21వ శతాబ్దపు పెట్టుబడిదారీ విధాన వాహనం అడ్డుగోడను ఢీకొట్టేందుకు శబ్దం చేస్తూ వెళ్లే దారిలో మొసాక్‌ ఫొన్సెకా వ్యవహారం ఒక మైలు రాయి అని ‘ జీన్‌ పెరీ లేమాన్‌ అనే పారిశ్రామికవేత్త వ్యాఖ్యానించాడు.

     ఆర్ధిక అసమానతలను పరిష్కరించని పక్షంలో మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్ధకే ముప్పు వస్తుందని తీవ్ర హెచ్చరిక చేసిన ఫ్రెంచి ఆర్ధికవేత్త థామస్‌ పికెటీ పన్నుల స్వర్గాలను అదుపు చేయని పక్షంలో మొత్తం ప్రపంచ వ్యవస్తే కుప్పకూలి పోతుందని అది జరగక ముందే వాటిని తక్షణమే అదుపు చేయాలని,నిబంధనలు పాటించని దేశాలపై అవసరమైతే ఆర్ధిక ఆంక్షలు విధించాలని పనామా పత్రాల వెల్లడి గురించి వ్యాఖ్యానించారు. పన్నుల స్వర్గాలలో జరుగుతున్న అక్రమాల గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయని ప్రభుత్వాలు చేసే ప్రకటనలకు, ఆచరణకు నక్కకూ నాగలోకానికి వున్నంత దూరం వుందని పికెటీ పేర్కొన్నారు. 2014లో లక్సెంబర్గ్‌ లీక్స్‌ లేదా లక్స్‌లీక్స్‌ దర్యాప్తులో ఐరోపాలోని కార్పారేట్‌ కంపెనీలేవీ పన్నులు కట్టటం లేదని తేలింది. పనామా పత్రాల ప్రకారం ధనిక, పేద దేశాల ఆర్ధిక, రాజకీయ పెద్దలు తమ ఆస్థులను ఎలా దాచుకుంటున్నారో వెల్లడి అయింది. జర్నలిస్టులు తమ విధి నిర్వహిస్తున్నందుకు మనం సంతోషించాలి.సమస్య ఎక్కడంటే ప్రభుత్వాలే తమపని తాము చేయటం లేదు. వాస్తవం ఏమంటే 2008లో ప్రారంభమైన సంక్షోభం తరువాత అసలు చేసిందేమీ లేదు.మరో విధంగా చెప్పాలంటే పరిణామాలు మరింతగా దిగజారాయి.తమ ఆధీనంలోని వర్జిన్‌ దీవులు, ఇతర ప్రాంతాలలో కొల్లగొట్టే పనులు చేస్తూనే బ్రిటన్‌ తన పన్ను రేటును 17శాతానికి తగ్గించబోతున్నది. ఒక పెద్ద దేశం ఇలా చేయటాన్ని ఎక్కడా వినలేదు. దీని గురించి ఏమీ చేయకపోతే మనమందరం ఐర్లండ్‌ మాదిరి 12శాతం లేదా సున్నా లేకపోతే పెట్టుబడులు పెట్టిన వారికి గ్రాంట్లు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అని కూడా పికెటీ వ్యాఖ్యానించారు.

      పన్నుల స్వర్గాలలో ప్రయివేటు ఆస్ధులను దాచుకోవటంపై ఇప్పటికీ పూర్తి పారదర్శకత లేదు, 2008 నుంచి ఆర్ధిక వ్యవస్ధల కంటే ఆస్తులు వేగంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే వారు ఇతరుల కంటే తక్కువ పన్ను చెల్లించటం ఒక కారణం.ప్రభుత్వం ఎలాగూ దర్యాప్తు చేయదనే భయంతో ప్రాన్స్‌లో ఒక జూనియర్‌ మంత్రి తనకు స్విడ్జర్లాండ్స్‌లో ఖాతాలు లేవని 2013లో మంత్రి తాపీగా చెప్పాడు. జర్నలిస్టులు వాస్తవాలను వెల్లడించారు. తమ దగ్గర వున్న సమాచారాన్ని వున్నది వున్నట్లు అధికారికంగా తెలియచేసేందుకు స్విడ్జర్లాండ్‌ అంగీకరించింది. పనామా ఇప్పటికీ తిరస్కరిస్తున్నది. సమాచారాన్ని వెల్లడి చేయటమంటే అదొక ప్రభావ వంతమైన సామాజిక నిరసన అనే సిద్ధాంతం గతంలో లేని విధంగా నేడు పరీక్షకు గురి అవుతోంది. అది పెట్టుబడిదారీ విధానం రానున్న రోజుల్లో మరింత తీవ్ర సంక్షోభంలో పడవేయటానికి తోడ్పడుతుందని పికెటీ హెచ్చరించారు.

మన జర్నలిస్టులూ భాగస్వాములే

      ఈ శతాబ్ది జర్నలిజం ప్రాజెక్టుగా పేరుతెచ్చుకున్న పనామా పత్రాలను బయట పెట్టిన జర్నలిస్టులలో మన దేశానికి చెందిన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన వారు ముగ్గురు వున్నారు. పి వైద్యనాధన్‌, రితు శరీన్‌, జయ్‌ మజుందార్‌ దాదాపు ఎనిమిది నెలల పాటు పనామా పత్రాల పరిశీలనలో నిమగ్నమయ్యారు.యాజమాన్యం వారిని అందుకు అనుమతించింది. విలేకర్లు తెచ్చిన సమాచారాన్ని తీసుకొని డబ్బున్న, అక్రమాలకు పాల్పడిన వారిని బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బు సంపాదించే మీడియా సంస్ధల యజమానులు విచ్చల విడిగా వున్న ఈ రోజుల్లో విశ్వసనీయత ముఖ్యమైనది. అందుకు గాను గతంలో వారి పరిశోధనలు, వెల్లడించిన సమాచారం, వ్యక్తిగత నిజాయితీల రికార్డు ఆధారంగా ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసిఐజె) తన బృందాన్ని ఎంపిక చేసుకుంటుంది. దీనిలో అలా రాటు దేలిన వారు 25 భాషలు, 70 దేశాలకు చెందిన 250 మంది జర్నలిస్టులు భాగస్వాములయ్యారు. వీరికి అందుబాటులోకి వచ్చిన సమాచారం గురించి వింటే పడిపోవాల్సిందే. 1977 నుంచి 2015 డిసెంబరు వరకు వున్న నలభై ఎనిమిది లక్షల ఇమెయిల్స్‌, 21లక్షల పిడిఎఫ్‌ పైల్స్‌ను వారు వడపోశారు.ఒక జర్మన్‌ పత్రిక సమాచారం ప్రకారం కోటీ 15లక్షల రహస్య పత్రాలు జర్నలిస్టులకు అందుబాటులోకి వచ్చాయి. తామేం చేస్తున్నామో, తాము పరిశీలిస్తున్న మొసాక్‌ ఫోన్సెకా పేరు కూడా తమ స్వంత సంస్ధలోని వారికి కూడా పత్రాలను బహిర్గతం చేసేవారికి కూడా తెలియదని రీతు శరీన్‌ చెప్పారు. ఆమె గత నలభై సంవత్సరాలుగా ఇలాంటి వార్తలను సేకరించటంలో నిమగ్నమయ్యారు.ఆమె అంతకు ముందు బ్రిటన్‌లోని పెద్ద బ్యాంకు అయిన హెచ్‌ఎస్‌బిసి-స్విస్‌ బ్యాంకు, వర్జిన్‌ ఐలాండ్‌లోని భారతీయుల ఖాతాల లోగుట్టును బయటపెట్టారు.ఇది ఐసిఐజెతో ఆమెకు మూడవ ప్రాజెక్టు. నీరారాడియా టేపులను బహిర్గతంలో చేయటంలో చేయితిరిగిన రీతు తన బృందంలో బ్యాంకింగ్‌, ఆర్ధిక రంగాలలో సమగ్రపరిజ్ఞానం వున్న వారిని ఎంపిక చేసుకున్నారు. వారికి మరో 22 మంది వివిధ రాష్ట్రాల రిపోర్టర్లు తోడ్పడ్డారు. అయితే వారంతా ఈ ముగ్గురు బృందం అడిగిన సమాచారం అంటే పనామా పత్రాలలో వున్న భారతీయుల చిరునామాలు, ఇతర సమాచారాన్ని ఇవ్వటం తప్ప తామెందుకు ఆ సమాచారం ఇస్తున్నారో కూడా వారికి తెలియదు. మన దేశానికి సంబంధించిన 36వేల పత్రాలను ఎక్స్‌ప్రెస్‌ బృందం పరిశీలించింది.ఎప్పటి కప్పుడు సమాచారం బయటకు పొక్కకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. రీతు రెండు అంతర్జాతీయ రహస్యసమావేశాలకు వెళ్లి పత్రాల పరిశీలనలో శిక్షణ కూడా తీసుకున్నారు.

      నరేంద్రమోడీ సర్కార్‌ విదేశాల్లో వున్న నల్లధనం తెస్తానని రంకెలు వేయటం, అక్రమార్కులను సర్దుకోమని చెప్పటం తప్ప మరొకటి కాదని తేలిపోయింది. పనామా పత్రాల ప్రకారం గతేడాది కూడా అనేక మంది నల్లధన కుబేరులు పనామాలో ఖాతాలు తెరిచినట్లు బయట పడింది. మన చట్టాలు ఎంత లోప భూయిష్టంగా వున్నాయంటే పనామా వంటి పన్ను స్వర్గాలలో కంపెనీలు తెరవటానికి అనుమతించవు గానీ వాటిలో వాటాలు, ఏకంగా కంపెనీలనే కొనుగోలు చేయవచ్చు. అంటే చట్టబద్దంగానే నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవటం సులభమైంది కనుకనే అనేక మంది తాపీగా తమ లావాదేవీలన్నీ చట్టబద్దమే అని చెబుతున్నారు. దాదాపు ఐదు వందల మంది భారతీయులకు పనామాలో ఖాతాలున్నట్లు అంచనా. వారిలో పద్మభూషన్‌ కౌశల్‌ పాల్‌ సింగ్‌ నుంచి ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైన గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ, కాంగ్రెస్‌కు సన్నిహితుడైన సమీర్‌ గెహ్లట్‌, బిగ్‌బి అమితాబ్‌,ఆయన కోడలు ఐశ్వర్యారాయ్‌ తదితరులు ఈ జాబితాలో వున్నారు. వాణిజ్య వేత్తలు తాము అధికారులకు అన్నింటినీ వెల్లడించామని, అంతా చట్టబద్దంగానే జరిగిందని చెబుతుండగా అమితాబ్‌ మాత్రం అస్సలు తమకేమీ తెలియదని ప్రకటించారు.మరికొందరు ప్రవాస భారతీయులు తమకు భారత చట్టాలు వర్తించవని తమ దేశభక్తిని ప్రకటించుకున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Brazil’s Summer of Discontent

23 Wednesday Mar 2016

Posted by raomk in Current Affairs, Economics, INTERNATIONAL NEWS, Latin America, Left politics

≈ Leave a comment

Tags

Bolsa Família, Brazil, Class War, CORRUPTION, coups, Dilma Rousseff, Lula, neoliberalism, Workers’ Party

by VIJAY PRASHAD

  • shutterstock_260916803

Filipe Frazao | Shutterstock.com

Brazil’s modernist plazas have been filled with protesters over the course of the past week. They have come to ask for the resignation of the President — Dilma Rousseff of the Workers’ Party (PT). Crowds on Avenue Paulista in São Paulo held aloft a massive sign that read, “Impeachment já!” It is the slogan of this protest — if President Rousseff does not resign, then she should be impeached.

Why do these thousands of people want Ms. Rousseff to leave office? An eruption of corruption scandals that implicate the entire political elite comes at a time of Brazil’s economic stagnation. Brazil currently suffers its worst recession in half a century, with economic growth shrinking. Low commodity prices and slack demand from China are the main authors of this downturn. No relief is on the horizon, since China is not likely to expand its purchases. Nor, therefore, will commodity prices rise higher. Reliant upon both, an exit for Brazil’s crisis in that direction is closed. The PT, in power from 2002, had not been able to diversify the economy and so was vulnerable to commodity prices. Economist Alfredo Saad-Filho calls this a “confluence of dissatisfactions,” drawing in those with immediate worries — rising bus fares— and those with much greater anxieties — the loss of power of the dominant classes.

Angering the elite

What is striking about the protests against the Rousseff government is that these are not coming mainly from the slums — the favelas — of Brazil or from the industrial working class. In March last year, Brazil’s college educated, upper middle class went out onto the streets for a series of marches against the government. Luiz Carlos Bresser-Pereira, a former Finance Minister from the 1980s, characterised these protests as “collective hatred on the part of the elites, of the rich, against a party and a president.” What motivated the demonstrators, he said, was not worry, but “hatred.” What do the Brazilian elite hate about the government of the PT?

The PT has pushed a broad agenda to give capitalism a human face. Wretched poverty in parts of Brazil had to be ameliorated by a social welfare programme known as Bolsa Família. The World Bank said that this programme has “changed the lives of millions in Brazil.” For cash payments, Brazil’s impoverished families pledge to keep their children in school and take them for regular medical check-ups. The government argued that Bolsa Família would enhance the immediate lives of the poor — with the cash payments — and would break the cycle of intergenerational poverty — through education and health care.

Almost 50 million Brazilians — a quarter of the population — have benefited from Bolsa Família. Last year, the Brazilian Institute of Geography and Statistics announced that extreme poverty has been eradicated in the country. But, at that announcement, the institute pointed out that the budgetary cuts to the programme would reverse the trend. A third of the funds allocated to Bolsa Família had been removed from the 2016 budget. This is an indicator of the financial trials of the government.

What the elite hated was the rise in minimum wages, the expansion of rights to workers and the privileges now given to the working class for entry into public universities. Benefits to the working class in Brazil open up the social question of racial inequality. Brazil, a former slave state, has never really come to terms with the legacies of slavery and racism. Under the PT, issues of racial discrimination and the costs of racism on the workers became part of the national conversation. This was anathema to the elite.

Habits of coups

Over the course of the past century, at regular intervals, populist political movements have come to the fore in Brazil to challenge the iron grip of the elite. Each time, the people rally behind these leaders, the elite — with the assistance of the military and the United States — has undermined the revolt of the favelas and the countryside. Presidents Getúlio Vargas and João Goulart became standard-bearers of this popular frustration, but both had to be removed — Vargas by suicide in 1954 and Goulart by military coup in 1964. In both cases, the combination of the established dominant classes, the military and the U.S. created a crisis that overwhelmed the country and dispatched the populist leaders. Fear that this is part of the equation in Brazil today is not unfounded. It is etched into Brazil’s history.

Coups need not come from the barracks any longer. The media is sufficient. In Brazil, the Globo network — 50 years old — now controls more than half of the media — television networks and influential newspapers — including O Globo. “There is no other means of communication with similar influence in the country,” Professor Beatriz Bissio of the Universidade Federal do Rio de Janeiro tells me. The owner of the network, Dr. Roberto Marinho, has a very close alliance with the military regime. His channels have been fulminating against the Rousseff government, urging on the protests in the service not of anti-corruption but against the PT.

Issue of corruption

In Brazil, a familiar refrain is “the system is not corrupt; corruption is the system.” Systematic corruption has eaten into wide swathes of Brazil’s politicians, not only from among the prominent leaders of the PT but also of its opposition, including Aécio Neves who ran for president against Ms. Rousseff in 2014. Vast profits in the major government utilities, Eletrobras and Petrobras, provided opportunities to politicians for bribes. Politicians from PT did not resist the temptation. But they are not alone.

The media went after the PT as if it was the only one which was complicit in the corruption scandals. They ignored the corruption scandals of the right-wing opposition. Datafolha has done regular surveys of dissatisfaction in Brazil. Over a third of the population finds that corruption is their major grouse, although the rest of those surveyed complained about a lack of access to health care and education as well as jobs. The media is not interested in these complaints. They come to the heart of the PT programme. Much easier to poke a finger at “corruption,” an idea with an emotional appeal to people whose livelihood weakens as they see the elite becoming immune from the crisis.

The Lula factor

Ms. Rousseff, unlike Mr. Lula, did not cultivate a close link with the people. Compelled to make budgetary changes, she did not reach out to the public to explain the problems. Attacked by the media, Ms. Rousseff isolated herself from her supporters. Confusion led to disillusionment. Mr. Lula, from the factory, and Ms. Rousseff, from the prison, developed a party — the PT — that grew from Brazil’s powerful social movements, such as the Landless Workers’ Movement (Movimento dos Trabalhadores Rurais Sem Terra, or MST). Ms. Rousseff reached out to Mr. Lula to revive connections to the social movements. He is temperamentally of the trade unions, a salty man with popularity among the working class and peasantry.

But Mr. Lula had been under investigation as part of the Petrolão (Car Wash) scandal — money laundering around Petrobras. His role here is small scale compared to the other outrages. The detention of Mr. Lula and the release of taped phone conversations between him and Ms. Rousseff suggest a wider conspiracy at work here. It is in the habit of Brazil’s elite to foment such discord to prevent any threat to its stability. Mr. Lula’s return in a time of economic crisis might have signalled a sharp left turn from the PT. It had no other choice but to move in that direction. It would be suicidal for the PT to become the party of austerity. Mr. Lula’s brief was to help Ms. Rousseff change course. This is what the elite found abominable. Ms. Rousseff’s offer of a cabinet post to Mr. Lula would have immunised him from prosecution. A judge has now blocked the appointment.

On Friday, a million people joined the Popular Front of Brazil to repeat Mr. Lula’s call — não vai ter golpe, there’ll be no coup. The people, as the MST put it, went to the streets to defend democracy. This protest stands against the coup. Whether the emergence of these popular protests will change the ugly dynamic in Brazil is to be seen. Much is at stake in this important South American country.

This article originally appeared in The Hindu 

Share this:

  • Tweet
  • More
Like Loading...

CORRUPTION IN JUDICIARY WILL NOT BE TOLERATED: CJI THAKUR

06 Sunday Dec 2015

Posted by raomk in Current Affairs, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

CJI THAKUR, CORRUPTION, JUDICIARY

Corruption in judiciary will not be tolerated: CJI Thakur

Chief Justice of India Tirath Singh Thakur (Photo – The Hindu)

New Delhi, 06 Dec 2015: Chief Justice of India Tirath Singh Thakur on Sunday asserted that there would be no tolerance towards deviant behaviour and corruption by judges.

“We will be intolerant towards deviant behaviour and allegations of corruption and cleanse the institution,” he said on being asked about allegations of corruption against certain judges in the course of his interaction with media persons after assuming office as the CJI.

On being asked about Justice C.S. Karnan of Madras High Court who has been at loggerheads with his chief justice, Chief Justice Thakur, without mentioning any individual judge, said: “We will take note of it and take corrective action for any deviant behaviour coming (from judiciary) from Kashmir to Kanyakumari.”

“The system must react to what is not acceptable. We should not remain quiet on what is not acceptable,” he said, indicating the course that the top judiciary would take in dealing with errant judges during his tenure which would last just over a year.

Citing the difficulties in dealing with deviant judges, Chief Justice Thakur pointed out that “in case of doubtful situation, the benefit of doubt would go to the institution (of judiciary) and not to the individual”.

He said there were some misgivings about how certain judges conduct themselves and that brings into question the issue of credibility.

A strong and independent judiciary was capable of protecting people from attacks on the inclusive values of Indian society, Chief Justice T.S. Thakur said .

“As the head of the institution that upholds the rule of law and protects the constitution, the right of all sections of people will be protected,” Chief Justice Thakur said in his first media meet after assuming charge of the Supreme Court.

“Our existence is itself based on tolerance,” he said, wondering how some political people can twist it to their advantage.

Assuring that judiciary was there to protect and safeguard their rights, the chief justice said: “We are capable of protecting the rights of all sections of the people. It is our responsibility. Rule of law and constitutional guarantees are enshrined (in the constitution).

“What to talk of citizens, rights of all the people will be protected. There is nothing to fear.” He added: “The rule of law is even for non-citizens.”

Chief Justice Thakur said: “Itna badha desh hai, kuchh awaaj to uththi hai” (It is such a big country. Some discordant notes will be there.)

So long there was rule of law, constitutional guarantees and an independent judiciary, “tab tak kisi baat ka dar nahin hona chaiye” (till then one should not fear anything).

Pointing to the long, rich and all-inclusive traditions of India, he said: “This country has been a home for all religions of the world. People who were persecuted in other places have come here and flourished.”

Describing it as “our heritage”, Chief Justice Thakur gave the example of Parsis who came from Persia saying they gave India the best industrialists and “finest legal minds” — referring to Nani Palkiwala and Fali Nariman. (IANS)

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
 

Loading Comments...
 

    %d