• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

అచ్చేదిన్‌ నుంచి ఆత్మనిర్భరత వరకు….ఆరేండ్ల మోడీ పాలన ?

25 Monday May 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

India economy slowdown, Modi Six Years regime, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు
తారీఖులు, దస్తావేదులు ఇవి కాదోరు చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అలా చూస్తే ఈనెల 30 తేదీకి నరేంద్రమోడీ2.0పాలనకు ఏడాది పూర్తి, ఖాతాలో ఆరేండ్లు జమ చేసుకోవటం తప్ప ఏం సాధించారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. సాధారణంగా చివరి సంవత్సరంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాలకుల వైఫల్యాల గురించి చర్చ ప్రారంభం అవుతుంది. కానీ చిత్రం ఏమిటంటే మోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన తొలి ఆరునెలల్లోనే దిగజారుతున్న దేశ ఆర్ధిక స్ధితికి కారకులు ఎవరనే ప్రశ్న ముందుకు వచ్చింది. దిగ్గజాలనిపించుకుంటున్న మన మంత్రులు హాస్యభరితమైన సమాధానాలు చెబుతుండగా కరోనా వైరస్‌ పుణ్యమా అంటూ అది వెనక్కు పోయింది. కరోనా వైరస్‌ పేరుతో వైఫల్య వైరస్‌ బయటకు రాకుండా ఎంతకాలం, ఎలా కాపాడతారో దేశం చూడనుంది.
ఏడాది పాలన మంచి చెడ్డల కంటే ముందుగా కరోనా నిరోధ చర్యల విషయంలో ప్రభుత్వ వైఫల్యం గురించి వచ్చిన విమర్శలకు అధికారపక్షం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సామాజిక మాధ్యమంలో బిజెపి మరుగుజ్జులు విన్యాసాలు చేసేందుకు భయపడుతున్నారు.ఎంత ఎక్కువ తప్పుడు ప్రచారం చేస్తే అంత ఎక్కువగా జనంలో పలచనౌతారు. ఏడాది పాలన ఉత్సవాలను ఎలా చేసుకుంటారో, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో, జనం ఏవిధంగా చూస్తారో చూద్దాం. క్రికెట్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రెండవ ఇన్నింగ్స్‌లో తరచూ విఫలమయ్యాయరన్నది ఒక విశ్లేషణ. రాజకీయాల్లో రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మోడీకి ఇది వర్తిస్తుందా?
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో చేతులు కడుక్కోవటం ఒకటి.పేరుకు 20లక్షల కోట్ల రూపాయల పాకేజ్‌ అని ప్రకటించినప్పటికీ రెండున్నర లక్షల కోట్లకు మించి ఖజానా నుంచి ఖర్చు చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేతులు కడిగేసుకోవటాన్ని చూశాము. అదే విషయాన్ని ప్రతిపక్షాలు ఎత్తి చూపితే అదిగో చూడండి పాకేజ్‌ను అర్ధం చేసుకోకుండా లోపాలు వెతికేందుకు పూనుకున్నారు అంటూ నిర్మలమ్మ ఎగిరి పడ్డారు.
2024 నాటికి మన ఆర్ధిక వ్యవస్ధను ఐదు లక్షల కోట్ల డాలర్ల స్ధాయికి పెంచాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. సర్వేజనా సుఖినో భవంతు మాదిరి ఐదు కాదు ఆయన మంత్రదండంతో పదిలక్షల కోట్లకు పెంచినా మంచిదే, దాంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలా సాధిస్తారన్నదే కదా సమస్య. దానికంటే ముందు 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామన్న వాగ్దానం గురించి మాట్లాడటం మానేశారు. ఒకసారి చెప్పినదాని గురించి మరోసారి మాట్లాడకపోవటమే కదా అనితర సాధ్యమైన నరేంద్రమోడీ ప్రత్యేకత. గతంలో కాంగ్రెస్‌, ఇతర పార్టీలు, చివరికి బిజెపికే చెందిన వాజ్‌పారు ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు విమర్శిస్తే ఎక్కడ దేశ ద్రోహి అంటారో, తుకడే తుకడే గాంగ్‌ అని ముద్రవేస్తారో అని ప్రముఖ పారిశ్రామికవేత్తల మొదలు మేథావుల వరకు ఎవరూ ప్రభుత్వ విధానాలు,వాటి పర్యసానాల గురించి మాట్లాడేందుకు భయపడి చస్తున్నారు.
సిఎఎ, ఎన్‌ఆర్‌సి సంబంధిత అంశాలు, ఢిల్లీ మతదాడులతో మలివిడత తొలి ఏడాది ప్రారంభంలో ఆర్టికల్‌ 370, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రం, ముమ్మారు తలాక్‌ రద్దు వంటి విజయగానాలు మూగపోయాయి. ఏదో ఆరోజు అలా అనుకున్నాం అని గాక ఆర్టికల్‌ రద్దు, కాశ్మీర్‌ రాష్ట్ర రద్దు వలన ఆ రాష్ట్ర ప్రజలకు, మొత్తంగా దేశ ప్రజలకు జరిగిన మంచి ఏమిటో మోడీ లేదా మద్దతు ఇచ్చిన ప్రాంతీయ పార్టీలు జనానికి ఈ సందర్భంగా చెప్పాలి. ఏదో ఒక రోజు కరోనా లాక్‌డౌన్‌ ఎత్తివేత జరుగుతుంది తప్ప గత ఏడాది ఆగస్టు 5న ప్రకటించిన కాశ్మీర్‌ లాక్‌డౌన్‌ ఎత్తివేత కనుచూపు మేరలో కనిపించటం లేదు. దాన్ని సమర్ధించిన పార్టీలేవీ మాట్లాడటం లేదు. అది ఇంక శాశ్వతం అన్నట్లుగా జనాలు కూడా ఆలోచించటం మానుకున్నారు. దాని గురించి మాట్లాడేందుకే పాలక పార్టీ భయపడుతోంది. ఆర్ధిక వ్యవస్ధ మరింత సంక్షోభంలోకి కూరుకుపోకుండా చూసేందుకు ఊబిలో ఉన్న జనాలను రక్షించేందుకు గాక వెలుపల ఉన్న పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. అయితే కొత్తగా పెట్టుబడులు పెడితే తాము కూడా ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందని వారు ముందుకు రావటం లేదు. బంగారు బాతులను కోసి గుడ్లు తీసుకున్నట్లుగా ఎల్‌ఐసి, చమురు సంస్ధల వాటాల విక్రయం, ప్రయివేటీకరణ అజెండా గురించి వేరే చెప్పనవసరం లేదు.
దేశంలో హిందువులున్న ప్రతి గ్రామంలో రామాలయం ఉంది, వాటి సరసన ఆయోధ్యలోని వివాదాస్పద స్ధలంలో మరో ఆలయ నిర్మాణానికి సుప్రీం కోర్టు తీర్పు అవకాశం ఇచ్చింది. రాముడి మనోభావాలకు విలువ ఇచ్చిన ఉన్నత న్యాయస్ధానం వలస కార్మికుల విషయంలో మేమేం చేస్తామంటూ కడిగేసుకుంది. తమ స్వస్ధలాలకు వెళ్లేందుకు అవకాశం, వ్యవధి ఇవ్వకుండా ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా కోట్లాది మంది పడిన ఇబ్బందులు మోడీ సర్కార్‌కు తొలి ఏడాది పాలనలో మాయని మచ్చగా మారాయి. ఎన్ని మరకలు పడితే అంత మంచిది అని భావించే వారిని అవి బాధించవు. అన్నింటికీ మించి 20లక్షల కోట్ల జుమ్లా పాకేజ్‌ మోడీ సర్కార్‌ బూటకాన్ని మరోసారి బట్టబయలు గావించింది. మన ప్రజారోగ్య వ్యవస్ధ ఎంత బలహీనంగా ఉందో మహమ్మారుల సమయంలో వైద్యులు, సిబ్బందికి కనీసం అవసరమైన ముఖతొడుగులు, పిపిఇ కిట్స్‌ కూడా అందించలేని దుస్ధితిని కరోనా వెల్లడించింది. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్లతో వైరస్‌ను అరికట్టవచ్చని ముఖ్యమంత్రులే చెప్పారు.
ఏడాది పాలన సందర్భంగా వందిమాగధులు చప్పట్లు కొట్టే పరిస్ధితి లేదు, అభిమానులు దీపాలు వెలిగించి హారతులు పట్టేంత గొప్పలేమీ లేవు. పూలు చల్లి పూజలు చేసే మహిమలేవీ మోడీ బాబా ప్రదర్శించలేదు. కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాలలో చేయలేని దానిని లేదా చేసిన నిర్వాకాలను మేము ఐదు సంవత్సరాలలో సరిదిద్దామని బిజెపి నేతలు చెప్పుకున్నారు. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని ఒక కవి చెప్పిన మాటలను ఆ పార్టీకి అన్వయించుకోవలని వారే స్వయంగా రుజువు చేసుకున్నారు. మచ్చుకు ఒకదానిని చూద్దాం. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ స్వదేశీ, విదేశీ అప్పు మొత్తం రూ. 46,15,250 కోట్లు కాగా 2019-20కి రూ.100,18,120 కోట్లు. సెంచురీ సాధించిన ఘనత కచ్చితంగా మోడీదే. నాటి నెహ్రూ మొదలు మధ్యలో వాజ్‌పేయితో సహా మన్మోహన్‌ సింగ్‌ వరకు చేసిన అప్పుల బకాయిల కంటే అరు సంవత్సరాలలో మోడీ గారి ప్రగతి ఆకాశానికి ఎలా ఎగిరిందో వ్యాఖ్యలు అవసరం లేదు. జనానికి ఇస్తున్న లక్షల కోట్ల రూపాయల రాయితీల రద్దు తరువాత జరిగినది ఈ పురోగతి.
వృతం చెడ్డా ఫలం దక్కలేదు. నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. ఈ సమస్యను కరోనాకు ముందు, తరువాతగా చూసేట్లయితే మోడీ 2.0 రెండవ ఏడాది ఎదుర్కోబోయే సవాలు అర్ధం అవుతుంది.లాక్‌డౌన్‌ ప్రకటించిన తరువాత మార్చి 25న దేశంలో నిరుద్యోగుల శాతం 7.58శాతంగా ఉందని సిఎంఐయి విశ్లేషణ పేర్కొన్నది. అదే మేనెల 24న 24.6శాతంగా తెలిపింది. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఇది ఎలా మారుతుందో చూడాల్సి వుంది. ఏప్రిల్‌ నెలలో పెద్ద రాష్ట్రాలలో గరిష్టంగా తమిళనాడులో 49.8శాతం ఉంది, కేంద్ర పాలిత రాష్ట్రమైన పుదుచ్చేరిలో 75.8శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌లో 20.5, తెలంగాణాలో 6.2శాతం ఉన్నట్లు సిఎంఐయి తెలిపింది. దేశ ఆర్ధిక రంగంలో వైఫల్యాలు లేదా ఎదురువుతున్న సవాళ్ల గురించి మచ్చుకు ఇవి చాలు. ఈ పరిస్ధితికి కారకులు ఎవరు ?
గాంధీ, నెహ్రూలే అని ఆరు సంవత్సరాల ఏలుబడి తరువాత మోడీ పరివారం చెబితే నడవదు, భక్తులు కూడా మరీ అంతగా కమలం పువ్వులు ఎక్కువ కాలం పెట్టుకోలేరు. మోడీ సర్కార్‌ చెప్పుకున్నట్లు చైనా కంటే అధిక వృద్ధి రేటు అంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా, ఎక్కువగా ఉన్న మన దేశం ఒక్కసారిగా తిరోగమనంలోకి జారిందన్నది కాదనలేని వాస్తవం. త్వరలో మాంద్యంలోకి పోబోతున్నదని అందరూ అంగీకరిస్తున్న అంశం. అనాలోచితంగా మోడీ ప్రకటించిన 2016నాటి పెద్ద నోట్ల రద్దు,తరువాత తగినంత కసరత్తు లేకుండా ప్రవేశపెట్టిన జిఎస్‌టి, తదితర అంశాలు అంతగా అంతుబట్టని ఆర్ధిక గొలుసుకట్టు రాతను జనం అర్ధం చేసుకొనే తరుణం వచ్చింది.
యుపిఏ హయాంలో ముడుపులు తీసుకొని కాంగ్రెస్‌ మంత్రులు ఫోన్లు చేసి లక్షల కోట్ల రూపాయలను ఆశ్రిత పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రుణాలుగా ఇప్పించారని, తీసుకున్నవారంతా ఎగవేస్తున్నారని, దానికి బాధ్యత కాంగ్రెస్‌దే, ఫోన్‌ బ్యాంకింగ్‌ అంటూ ఇప్పటి వరకు ప్రచారం చేస్తున్న బిజెపి తన ఏలుబడిలో ఆ అప్పులను రద్దు చేస్తున్నది లేదా ఎంతో కొంత వసూలు చేసి లావాదేవీలను మూసివేయమంటున్నది. నాడు అప్పులు ఇప్పించినందుకు కాంగ్రెస్‌కు ఎన్ని ముడుపులు ముట్టాయో వాటిని రద్దు చేస్తున్నందుకు ఇప్పుడు అంతకంటే ఎక్కువే బిజెపికి ముడుతూ ఉండాలి. లేకుంటే ఉత్తి పుణ్యానికే రద్దు చేస్తారా ? కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బిజెపి నేత నళిన్‌ కోహ్లీతో చెప్పినట్లుగా బిజెపి సోషల్‌ మీడియా వేదికలు వెల్లడించిన సమాచారం ప్రకారం సిబిఐ, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌.కాగ్‌(మూడు సి’లు) గురించి భయపడాల్సిన పనిలేదని, అర్హులైన వారికి ఉదారంగా రుణాలివ్వాలని, నిర్ణయం తప్పయినా, ఏదైనా నష్టం జరిగినా ప్రభుత్వం నూరుశాతం హామీగా ఉంటుందని బ్యాంకు, ఆర్ధిక సంస్ధల అధికారులకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఎక్కడా ఖండించినట్లు కనిపించలేదు. అంటే ఆర్ధిక సంస్ధల ఉన్నతాధికారులు, బడాబాబుల బంధం మరింత గట్టిపడి రాబోయే రోజుల్లో జనం సొమ్ము లూటీ చేసేందుకు హామీ ఇవ్వటం తప్ప ఇది వేరు కాదు. కాంగ్రెస్‌ నేతలు అనధికారికంగా సిఫార్సులు చేసినా మేం చూసుకుంటామని ఎక్కడా చెప్పలేదు, పోయినోళ్లే మంచోళ్లు అనిపిస్తున్నారు బిజెపి నేతలు.
మన దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం లేదా మాంద్యానికి ద్రవ్య వ్యవస్ధను ప్రయివేటీకరించకపోవటమే అని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారీ లాబీ చెబుతోంది. రుణాల వృద్ది రేటు బలహీనంగా ఉందని, మూడింట రెండు వంతుల బ్యాంకింగ్‌ ఆస్ధులను ప్రభుత్వ రంగబ్యాంకులే అదుపు చేస్తున్నాయని, గత ఆకస్మిక రుణ వృద్ధి తరువాత నిరర్ధక ఆస్తుల్లో 90శాతం ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఉన్నాయని, ప్రభుత్వరంగ బ్యాంకులను తెగనమ్మకుండా వాటిని సంస్కరించటానికి పూనుకున్నట్లు నిషఉ్ఠరాలాడుతున్నారు. 2008 సంక్షోభంలో ప్రయివేటు రంగ బ్యాంకులు ఇతర దేశాల్లో ఎలా కుప్పకూలాయో చూసిన తరువాత మన దగ్గర అలాంటి సంక్షోభం తలెత్తకపోవటానికి కారణం బ్యాంకింగ్‌ రంగం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండటం అన్నది తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యాంకులను దెబ్బతీసేందుకు, ప్రయివేటు పరం చేసేందుకు వత్తిడి తెస్తున్నారు.
ి ఏడవ వేతన సంఘ సిఫార్సుల ప్రభావం తొలి రోజుల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ అది తగ్గిపోవటం ప్రారంభమైందని ఆర్ధిక వ్యవస్ధ మందగించటానికి ఇది ఒక కారణమన్నది ఒక అభిప్రాయం. ఆర్ధిక పునరుద్దరణకు వడ్డీ రేట్ల తగ్గింపు జిందాతిలిస్మాత్‌ కాదు.పరిమిత ప్రయోజనాలు మాత్రమే ప్రతికూల పర్యవసానాలు కూడా వెంట ఉంటాయి. అనేక దేశాల్లో సున్నా లేదా ఒకటి రెండు శాతమే వడ్డీ రేటు ఉన్నా అవి ఆర్ధిక సుడిగుండాల నుంచి బయటపడటం లేదు.
ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత వేగంగా, చైనా కంటే అధికంగా నరేంద్రమోడీ హయాంలో దేశం అభివృద్ధి చెందుతున్నదని ఊదరగొట్టిన వారు, తిరోగమనం ప్రారంభం కాగానే మాట మార్చారు. మన మందగమనానికి కారణం ప్రపంచ వ్యవస్ధ లేదా అన్ని దేశాల మాదిరిగానే మనదీ సమస్యలను ఎదుర్కొంటోందంటూ విమర్శకులపై ఎదురుదాడి చేస్తున్నారు. మరోవైపు ప్రపంచ మందగమనానికి మన దేశం ప్రాధమిక కారణమని, సులభలెక్కల్లో అయితే 80శాతం అని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధికవేత్త గీతా గోపీనాధ్‌ జనవరినెలలో దవోస్‌ ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాల్లో చెప్పారు.భారత అభివృద్ధి మందగించిన కారణంగానే ప్రపంచ సూచికలను తగ్గించాల్సి వస్తోందన్నారు.
ప్రపంచ వాణిజ్యంలో భారత వాటా నామమాత్రమని అమెరికా-చైనాల మధ్య సాగుతున్న వాణిజ్యపోరు, అమెరికా-ఇరాన్‌ వైరం, అమెరికా నుంచి ఐరోపా, రష్యా వరకు ఏ ఒక్క దేశంలోనూ పురోగతి కనిపించటం లేదు, ఇవన్నీ మన దేశాన్ని దెబ్బతీస్తున్నాయి తప్ప మనం కారణం అనటం ఏమిటనిఅనేక మంది ఆర్దికవేత్తలు గీతపై రుసరుసలాడారు. ఇవన్నీ కరోనా వైరస్‌ వ్యాప్తి పర్యవసానాల గురించి అంచనాలు లేక ముందు జరిగిన చర్చ అంశాలు. కరోనాకు ముందు 2019లో మన ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటు అక్టోబరు అంచనాలో 6.1శాతం కాగా తరువాత 4.8శాతానికి ఐఎంఎఫ్‌ తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం 6.8శాతం నుంచి జనవరిలో ఐదు శాతానికి తగ్గించింది. వాస్తవంలో ఎంతో ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు 2020లో మనదీ, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. రిజర్వుబ్యాంకు గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఎంత శాతమో ఇంకా తెలియదు గానీ తిరోగమనమే అని చెప్పగా పదిహేనవ ఆర్ధిక సంఘం చైర్మన్‌ ఎన్‌కె సింగ్‌ మాత్రం మైనస్‌ ఆరు నుంచి ఒకశాతం మధ్య ఉంటుందన్నారు. చైనాకు సంబంధించి గణనీయంగా తగ్గినా పురోగమనమే తప్ప తిరోగమం కాదని అంచనాలు వెలువడిన విషయం తెలిసిందే.
క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ధ ప్రధాన ఆర్ధిక వేత్త డికె జోషి ప్రపంచ ఆర్ధిక మందగమనానికి భారత్‌ కారణం అనటాన్ని తోసిపుచ్చారు. మూలము ధనిక దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పాకుతుంది అన్నారు.భారత మందగమనానికి స్ధానిక అంశాలే మొత్తంగా కారణం అన్నారు. అంకెల రీత్యా భారత్‌ ప్రభావం చూపినట్లు కనిపించవచ్చుగానీ భౌతికంగా కాదు అన్నారు. కొనుగోలు శక్తి తుల్యత(పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ) ప్రాతిపదికన అభివృద్ధి రేటును లెక్కిస్తే ప్రపంచంలో భారత్‌ మూడవ పెద్ద దేశం.(2020 అంచనాల ప్రకారం చైనా 27.8, అమెరికా 20.29, భారత్‌ 11.32, జపాన్‌ 5.45, రష్యా 4.18 లక్షల కోట్ల డాలర్ల వంతున తొలి ఐదు స్ధానాల్లో ఉన్నాయి. కరోనా ఈ అంకెలను ఎలా మారుస్తుందో తెలియదు.) భారత మందగమనం కానసాగటానికి కారణం ద్రవ్య రంగ సమస్యలు. వస్తు ఉత్పత్తి, సేవలు, ద్రవ్య రంగం ఒకదానికి ఒకటి సాయపడాల్సి ఉంది. ఆర్ధికవ్యవస్దకు ఉత్తేజం, ఉల్లాసం కలిగించే సామర్ధ్యం దేశ ద్రవ్యవిధానాలకు పరిమితంగా ఉంది, కాబట్టి ముడి చమురు ధరలు, రుతుపవనాల మీద అదృష్టం ఆధారపడి ఉంటుందని జోషి చెప్పారు.
ప్రపంచ-భారత ఆర్ధిక సంస్ధలు పరస్పర ఆధారితమైనవి.అనేక మంది ఆర్ధికవేత్తలు చెప్పినట్లు వర్తమాన భారత మందగమనాన్ని బయటి అంశాలు తీవ్రం చేశాయి. అయితే స్ధానిక సమస్యలే దానికి మూలం అన్నది ముఖ్యమని గుర్తుకు తెచ్చుకోవాలి. వ్యవసాయ సంక్షోభం, గ్రామీణ ప్రాంతాలలో దారిద్య్రం, గిరాకీ(డిమాండ్‌) పడిపోవటం, పెట్టుబడుల రేటు తీవ్రంగా పడిపోవటం, పెద్ద నోట్ల రద్దు, లోపాలతో కూడిన జిఎస్‌టి భారత వృద్ధి రేటు పడిపోవటానికి ప్రాధమిక కారణాలు అని ఆర్ధికశాఖ మాజీ కార్యదర్శి అరవింద్‌ మాయారామ్‌ చెప్పారు.
పారిశ్రామిక ఉత్పత్తి, వ్యవసాయ రంగాలలో అమెరికా, ఐరోపా యూనియన్‌ అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలే మన దేశీయ అభివృద్ధికి ప్రతికూలంగా మారాయని బిజెపి ఆర్ధిక వ్యవహారాల ప్రతినిధి గోపాల కృష్ణ అగర్వాల్‌ చెప్పారు. దేశ ఆర్ధిక వృద్ధి కంటే నరేంద్రమోడీ తన రాజకీయ, సామాజిక అజెండాను నెరవేర్చుకోవటం మీదే కేంద్రీకరించిన పర్యవసానమే మందగమనం అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యానించారు.
దేశ ఆర్ధిక మందగమనానికి నెహ్రూ, ఇందిరా గాంధీలే కారణం అని చెప్పవద్దని శివసేన పత్రిక సామ్నా వ్యాఖ్యానించింది. అధికారాలన్నీ చేజిక్కించుకొని మంత్రులకు అధికారం లేకుండా చేసిన ప్రధాన మంత్రి కార్యాలయమే ఒక ప్రధాన కారణమని, ఆర్ధికం అంటే షేర్‌ మార్కెట్‌ జూదంగా భావిస్తున్న బిజెపి నాయకత్వం ఆర్ధికవేత్తలు చెప్పేది వినటం లేదని పేర్కొన్నది.
” టీవీలలో చూపే లెక్కల జోలికి మీరు పోవద్దు, దేశం ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధగా ఎదగాలంటే పన్నెండుశాతం వంతున ఎదగాలి. ఈరోజు ఆరుాఏడుశాతం చొప్పున పెరుగుతున్నది. మీరు ఆలెక్కల్లోకి పోవద్దు గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని కనుగొనేందుకు ఐనిస్టీన్‌కు లెక్కలు ఎప్పుడూ ఉపయోగపడలేదు ” (ఐనిస్టీన్‌ పుట్టటానికి దాదాపు రెండు వందల సంవత్సరాల ముందే న్యూటన్‌ ఆ సిద్దాంతాన్ని కనుగొన్నాడు. ఐనిస్టీన్‌ సాధారణ సాపేక్ష సిద్దాంతాన్ని కనుగొన్నాడు. అవి రెండూ లెక్కల ప్రాతిపదికగా చెప్పినవే ) అని చెప్పిన మంత్రి పియూష్‌ గోయల్‌, ఆటోమొబైల్‌ పరిశ్రమలో మాంద్యం ఎందుకు వచ్చిందంటే జనాలు ఊబర్‌,ఓలాలు వినియోగించటమే కారణం అని చెప్పిన నిర్మలాసీతారామన్‌, మూడు సినిమాలు కిక్కిరిసిన ప్రేక్షకులతో నడుస్తుంటే ఇంకా ఆర్ధిక మందగమనం ఎక్కడ అని ప్రశ్నించిన రవిశంకర్‌ ప్రసాద్‌ వంటి వారు నరేంద్రమోడీ కొలువులో మంత్రులుగా ఎన్ని ఉత్సవాలు చేసుకున్నా, ఎంతకాలం పదవుల్లో ఉన్నా దేశ మందగమనానికి అసలైన కారణాలు, బాధ్యుల గురించి వారి నోట వినగలమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అన్నీ శుభసూచనలే అయినా నరేంద్రమోడీకి ఎందుకీ అపశకునాలు !

22 Friday May 2020

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Economic Crisis In India, Economic reforms In India, Failed Economic Reforms in India, India Economic slowdown, Narendra Modi, PM Modi, Unemployment Crisis In India

Slowdown blues: State of Indian economy and its fragile-five past ...

ఎం కోటేశ్వరరావు
కరోనా విపత్తు సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ఇస్తున్న పిలుపులు, వాటి తీరుతెన్నులను చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మోడినోమిక్స్‌ ద్వారా అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్ధిక వృద్ధికి గాను చేసిన కృషికి చరిత్రలో మన ప్రధానుల్లో ఎవరూ పొందని విధంగా రెండు సంవత్సరాల క్రితం సియోల్‌ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తి, ప్రస్తుత మోడీ ఒకరేనా అన్న అనుమానం కలగకపోదు. గత ఆరు సంవత్సరాల కాలంలో ఎన్ని పిలుపులు, ఎంత హడావుడి చేశారు. గతంలో మాదిరి స్వదేశీ వస్తువులనే కొనండి అన్న పిలుపు తిరిగి ఇస్తే తన ప్రత్యేకత ఏముంటుంది అనుకున్నారేమో ” స్వదేశీ వస్తువులనే అడగండి ”(వోకల్‌ ఫర్‌ లోకల్‌ ) అని ఇచ్చిన పిలుపు నిజంగానే వీనుల విందుగా ఉంటుంది. నరేంద్రమోడీ, ఆయన మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్ద పెద్ద స్వదేశీ లేదా భారతీయ నామాలు పెట్టుకొని జనం ముందు ప్రదర్శిస్తున్నా ఆచరణలో ఎక్కువగా విదేశీ వైపు మొగ్గుచూపటం నగ సత్యం. ప్రపంచ దేశాల వారందరూ వచ్చి మన దేశంలో ఖాయిలా పడిన లేదా అమ్మకానికి పెట్టిన కంపెనీలను కొనుగోలు చేసేందుకు ఎలాంటి ఆంక్షలు విధించని, కొన్ని రంగాలలో నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచిన కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడుల విషయంలో తాజాగా కొన్ని నిబంధనలు విధించింది. అది ప్రపంచ వాణిజ్య సంస్ధ, స్వేచ్చా వాణిజ్య విధానాలకు వ్యతిరేకం అని చైనా విమర్శించింది. అయితే ఇదే మోడీ సర్కార్‌ చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులపై ఇంతకాలం ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధించలేదు అన్న ప్రశ్నకు జవాబు లేదు. పెట్టుబడులు వద్దు-దిగుమతులు ముద్దు అని చెబుతారా ? పళ్లూడ గొట్టుకొనేందుకు అమెరికా రాయి హాయి నిస్తుంది, చైనా రాయి బాధనిస్తుంది అంటారా ?
మన దేశ ఆర్ధిక సంస్కరణల చరిత్రను చూసినపుడు అవి బాధ ఉపశమనానికి పైపూత ఔషధాల మాదిరిగా పని చేశాయి తప్ప చైనా మాదిరి మన దేశం ఒక ఆర్ధిక శక్తిగా ఎదగటానికి గానీ, సామాన్యుల జీవన స్ధితిగతులు మెరుగుపడేందుకు గానీ తోడ్పడలేదు. మన దేశమే కాదు అనేక లాటిన్‌ అమెరికా దేశాలు సంస్కరణల పేరుతో అనేక చర్యలు తీసుకున్నాయి ఏ ఒక్కటీ చైనా మాదిరి లబ్ది పొందలేదు. చైనా కమ్యూనిస్టు దేశం, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, మనది ప్రజాస్వామ్యం అక్కడి మాదిరి మనకు కుదరదు అని ఎవరైనా చెప్పవచ్చు. అలాంటపుడు చైనాతో పోల్చుకోవటం ఎందుకు? త్వరలో చైనాను అధిగమిస్తామని ప్రగల్భాలు పలకటం ఎందుకు ? కమ్యూనిస్టు చైనా మాదిరిగాక పోతే మిగతా దేశాల మాదిరి పురోగమించకుండా అడ్డుకున్నదెవరు ? అత్యంత పేద దేశం, ఫ్రెంచ్‌, జపాన్‌, అమెరికన్‌ సామ్రాజ్యవాదుల దురాక్రమణ యుద్ధాలు సాగిన వియత్నాం సాధించిన మేరకు అయినా మనం ఎందుకు ఎదగలేకపోయాం.2018లో ప్రపంచ ఎగుమతుల్లో మన దేశం 323,056,409,000 డాలర్లతో 18వ స్ధానంలో ఉండగా వియత్నాం 290,395,445,000 డాలర్లతో 22వ స్ధానంలో ఉంది. తొమ్మిదిన్నర కోట్ల జనాభాగల ఆదేశం ఎక్కడ 140 కోట్లు గల మనం ఎక్కడ ?

Slowdown: Does the Narendra Modi govt even understand what is ...
మన దేశంలో అమలు జరిపిన ప్రతి దశ సంస్కరణల లక్ష్యం గురించి ఎన్ని తీపి కబుర్లు చెప్పినా, పర్యవసాన మన మార్కెట్‌ను విదేశీ కార్పొరేట్‌ సంస్ధలకు, ద్రవ్యపెట్టుబడికి మరింతగా తెరవటమే అన్నది చేదు నిజం. స్వాతంత్య్రానికి ముందు పరాయి బ్రిటీష్‌ పాలకులు మన దేశాన్ని ప్రత్యక్షంగా పరిపాలిస్తే విదేశీ కార్పొరేట్లు ఇప్పుడు మనలను పరోక్షంగా నడిపిస్తున్నారు. నాడు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు బ్రిటీష్‌ వారిని వ్యతిరేకిస్తే కాషాయ దళాలు వారికి సేవ చేస్తూ స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిస్టులు మాత్రమే విదేశీ పెత్తనం, కార్పొరేట్‌ దోపిడీని వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్‌, బిజెపి, ఆ ప్రాంతీయ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలు విదేశీ, కార్పొరేట్‌ సేవలో తరిస్తున్నాయి. మన దేశ ఫెడరల్‌ వ్యవస్ధ మౌలిక లక్ష్యాలను దెబ్బతీసే విధంగా వివిధ రంగాలలో రెగ్యులేటరీ వ్యవస్ధల ఏర్పాటుకు ఆద్యుడు బిజెపి నేత వాజ్‌పేయి, ఆయన హయాంలోనే నాంది పలికారు. తాజాగా కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల బిల్లు కూడా అలాంటిదే. నిత్యం ప్రభుత్వ కార్యాలయాలకు ఆ రంగు వేశారు, ఆర్‌టిసి బస్సులకు ఈ రంగు వేశారంటూ గుండెలు బాదుకుంటున్న, సమర్ధించుకుంటున్న తెలుగుదేశం-వైసిపిలు రాష్ట్ర అధికారాలను హరించి వేసే ఈ బిల్లు విషయంలో కేంద్రానికి భజన చేస్తున్నాయి. తెలుగుదేశం బహిరంగంగా ప్రకటిస్తే వైసిపి తన వైఖరిని ప్రకటించేందుకు భయపడుతోంది.
దేశమంతా కరోనా వైరస్‌ను ఎలా కట్టడి చేయాలా అన్న గొడవలో ఉంటే ఇక నరేంద్రమోడీ హయాంలో మరో దఫా సంస్కరణలకు ఇదే సరైన తరుణం అని కార్పొరేట్‌ మీడియా చెవిలో జోరిగలా తొలుస్తోంది. సినిమాల్లో క్లబ్‌డాన్సర్లు నృత్యం ప్రారంభం నుంచి ముగిసే వరకు ఒంటి మీది దుస్తులు ఒక్కొక్కటి తొలగిస్తూ జనాలకు మత్తు ఎక్కిస్తుంటారు. మన దేశంలో సంస్కరణల ద్వారా ఒక్కొక్క రంగాన్ని తెరుస్తూ అదే మాదిరి విదేశీ సంస్ధలకు కిక్కు ఎక్కిస్తున్నారు. ఒక మోజు తీరగానే కొంత కాలానికి మరో కొత్తదనం(సంస్కరణ) కావాలనే డిమాండు ముందుకు వస్తోంది. 1991 తరువాత ప్రతి సంస్కర్త పాలనాకాలం వైఫల్యంతోనే ముగిసింది. మరో ముఖ్య అంశం ఏమంటే 2014 ఎన్నికల్లో తప్ప అంతకు ముందు జరిగిన ప్రతి ఎన్నిక సంకీర్ణ కూటములకే తీర్పు ఇచ్చింది. ఏక పార్టీ ఆధిపత్యం లేదు. ఆ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన వారు తమ వైఫల్యాలకు దాన్నొక కారణంగా చెప్పుకున్నారు. కిచిడీ ప్రభుత్వాలంటూ రాజకీయంగా బిజెపి ఆ పరిస్ధితిని బాగా వాడుకుంది. ఈ నేపధ్యంలోనే నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపికి అలాంటి సమస్యలు లేకుండా ఒకటికి రెండు సార్లు జనం తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. మేము సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సి ఉంది, పూర్తి మెజారిటీ లేదు, ఉంటే మా తడాఖా ఏమిటో చూపే వారం అని చెప్పుకొనే అవకాశం లేకుండా చేశారు.
నిర్ణయాత్మక ప్రజాతీర్పే కాదు, నరేంద్రమోడీ నాయకత్వానికి గత ఆరు సంవత్సరాలలో అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. అత్యధిక రాష్ట్రాలలో ఆ పార్టీ పాలనే సాగుతోంది. అయినా అనేక అంశాలలో గత రికార్డులను తలదన్నే వైఫల్యాలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. వాటికి తగిన చికిత్సబదులు వేరే మార్గాలను ఎంచుకొంటోంది. వాటికి మరో తరం సంస్కరణలు అని ముద్దు పేరు పెడుతోంది. 1991 సంస్కరణలతో ఎన్నో ఆశలు పెంచుకున్న నాటి యువతీ యువకులకు వరుస వైఫల్యాలకు కారణాలు తెలియటం లేదు. ఆ తరువాత పుట్టిన నేటి యువతరానికి అసలేం చేయాలో తోచటం లేదు.
బంగారాన్ని తాకట్టు పెట్టి విదేశీ చెల్లింపులు చేయాల్సిన దుస్ధితిలో ఆర్ధిక వ్యవస్ధ ఉన్న సమయంలో పివి నరసింహారావు 1991లో ఆర్ధిక సంస్కరణలకు తెరతీశారు. ఆ సమయంలో మన విదేశీ అప్పులో కేవలం ఏడుశాతమే విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లో 68.2శాతం ఉండగా 2018లో అవి గరిష్టంగా 80.2శాతానికి పెరిగాయి, ఈ ఏడాది జనవరి 11న రిజర్వు బ్యాంకు ప్రచురించిన సమాచారం ప్రకారం 77.8శాతం ఉన్నాయి. పివి నరసింహారావు సంస్కరణలు ప్రకటించిన తరువాత అవి 23శాతానికి పెరిగాయి. అందువలన ఇప్పుడు విదేశీ మారక ద్రవ్యం కోసమైతే సంస్కరణలు అవసరం లేదు. సంస్కరణలో భాగంగా పివి తన పాలనా కాలంలో రూపాయి విలువను గణనీయంగా తగ్గించారు లేదా పతనం అయ్యేట్లు చూశారు. 1991 మార్చినెలలో డాలరుకు రు.19.64 ఉన్నది కాస్తా 1996 నాటికి రూ.34.35కు పతనమైంది. గత ఆరు సంవత్సరాల మోడీ పాలనలో రూపాయి విలువ రూ.61.14 నుంచి ప్రస్తుతం 75కు పడిపోయిన విషయం తెలిసినదే. వాజ్‌పేయి హయాం నాటి రూపాయి విలువ స్ధాయికి అయినా ఎందుకు పెంచలేదో , ఇలా ఎందుకు జరిగిందో, దాని వలన మనకు జరిగిన లాభ నష్టాలేమిటో అధికారం పక్షం చెప్పదు, ప్రతిపక్షం లేదా ఆర్ధికవేత్తలు చెప్పేదానిని అంగీకరించకపోగా ఎదురుదాడి చేసే ఒక నిరంకుశ పరిస్ధితిలో ఉన్నాం. బేటీ బచావో అని చెప్పిన నరేంద్రమోడీ పాపాయి వంటి రూపాయిని బజారులో(మార్కెట్‌ శక్తులకు) వదలి పెట్టి మరింత బలహీనపరచకుండా చూసేందుకు ఏమి చేస్తున్నారు? ఆయనలో మూర్తీభవించినట్లు చెప్పే భారతీయత, దేశభక్తి ఏమైనట్లు ?
ఇక పివి నరసింహారావు తరువాత పదమూడు రోజుల పాలనను పక్కన పెడితే 1998 నుంచి 2004వరకు అధికారంలో ఉన్న బిజెపి నేత వాజ్‌పేయి కూడా అనేక సంస్కరణలకు తెరతీశారు. ఆయన పాలనలో ప్రత్యేకత ఏమంటే మన విదేశీ అప్పులో 36శాతంగా ఉన్న విదేశీ మారక ద్రవ్యం 103శాతానికి పెరిగింది, అంతే కాదు ఆయన పాలన చివరి రెండు సంవత్సరాలలో మన విదేశీ వాణిజ్యం జిడిపిలో 1.5శాతం మిగులులో ఉంది. స్వాతంత్య్రం తరువాత అలాంటి పరిస్ధితి ఆయన ఏలుబడికి ముందూ, తరువాత కూడా లేదు. అయితే రూపాయి విలువ వాజ్‌పేయి హయాంలో రూ.37.16 నుంచి 45.95కు దిగజారింది. ఆయన పదవి నుంచి దిగిపోయే ముందు పెట్రోలు, డీజిల్‌ మీద సబ్సిడీలను రద్దు చేశారు. మొత్తంగా తమ పాలనలో దేశం వెలిగిపోయింది అనే నినాదంతో ఎన్నికలకు పోయిన బిజెపి 2004లో ఘోరపరాజయం పాలైంది.

Decoding Slowdown: Dip in household savings, investment an ...
వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ పరాజయాన్ని చూసిన తరువాత అధికారంలోకి వచ్చిన మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ చమురు సబ్సిడీలను తిరిగి ప్రవేశ పెట్టింది. తొలి ఏడాది రూ.5,430 కోట్ల నుంచి పదేండ్లలో రూ.1,60,000 కోట్లకు పెంచారు. యుపిఏ పాలనా కాలంలో ఎరువుల వినియోగం గణనీయంగా పెరిగింది. సబ్సిడీ దాదాపు సున్నా నుంచి 1,38,000 కోట్ల రూపాయలకు పెరిగింది. వాజ్‌పేయి హయాంలో దిగుమతి చేసుకున్న ఎరువులు పదిశాతం ఉంటే పదేండ్లలో 60శాతానికి పెరగటం దీనికి ఒక కారణం. ఈ కాలంలో చమురు ధరలు, దానికి అనుగుణంగానే దిగుమతి చేసుకున్న ఎరువుల ధరలు, వాటికి సబ్సిడీ విపరీతంగా పెరిగింది. మోడీ హయాంలో దిగుమతి ఎరువుల శాతం 30కి అటూఇటూగా ఉంటోంది. విపరీతంగా పెరిగిన చమురు, ఎరువులు, బొగ్గు దిగుమతి ఖర్చు కారణంగా యుపిఏ పాలనా కాలంలో వాణిజ్యలోటు విపరీతంగా పెరిగింది. పదేండ్లలో జిడిపిలో 1.5శాతం మిగులు నుంచి నుంచి 5.1శాతం లోటుకు చేరింది. పర్యవసానంగా విదేశీ అప్పుకు 103శాతంగా ఉన్న విదేశీ మారక ద్రవ్యం 68శాతానికి తగ్గిపోయింది. ఈ కాలంలోనే రూపాయి విలువ రూ .45.95 నుంచి 60.09కి దిగజారింది.
యుపిఏ పాలనా కాలంలో రూపాయి విలువ పతనం గురించి నానా యాగీ చేసిన బిజెపి నాయకత్వం 2014లో అధికారానికి వచ్చిన తరువాత ఆ పతనాన్ని కొనసాగించి ప్రస్తుతం 75కు దిగజార్చింది. మోడీ తొలి మూడు సంవత్సరాల కాలంలో చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా విదేశీ మారక నిల్వలు 80శాతానికి పెరిగాయి. ఈ ఏడాది మార్చి ఆరవ తేదీ నాటికి కరంట్‌ ఖాతా లోటు 0.2 ఒకశాతానికి తగ్గిపోయింది. ఇది మన విదేశీ చెల్లింపులకు ఢోకాలేని స్ధితిని తెలుపుతోంది. అయితే ఇదే పరిస్ధితి కొనసాగుతుందని చెప్పలేము. లోటు పెరిగే కొద్దీ రూపాయి విలువ మీద వత్తిడి పెంచుతుంది. ఈ ఏడాది ఆఖరుకు 1.6శాతానికి లోటు పెరగవచ్చని అంచనా వేశారు. అయితే అనూహ్యంగా చమురు, గ్యాస్‌ ధరలు రికార్డు స్ధాయిలో పడిపోవటంతో పరిస్ధితి ఎంతో మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇన్ని సానుకూల అంశాలు నరేంద్రమోడీ సర్కార్‌కు కలసి వచ్చినా అనేక రంగాలలో వైఫల్యం చెందటానికి కారణాలు ఏమిటి, దాన్నుంచి బయట పడేందుకు సర్కార్‌ తీసుకుంటున్న లేదా రాష్ట్రాలతో అమలు చేయిస్తున్న కార్మిక చట్టాల సవరణల వంటి సంస్కరణలు ఏమేరకు తోడ్పడతాయి అన్నది ప్రశ్న. కరోనా సంక్షోభం రాక ముందే అన్ని రంగాలలో తలెత్తిన సంక్షోభాన్ని ప్రభుత్వం దాచి పెట్టింది. మాంద్యం లేదు గానీ మందగమనం ఉందని సన్నాయి నొక్కులు నొక్కింది. గతంలోనే అనేక కార్మిక చట్టాలను నీరు గార్చటంలో బిజెపి పాలిత రాష్ట్రాలు ముందున్నాయి. ఇప్పుడు కేంద్రంలో కూడా వారే ఉన్నారు గనుక మరోసారి మిగిలిన వాటిని దెబ్బతీసేందుకు పూనుకున్నారు. ఓవర్‌ టైమ్‌ చేయించేందుకు వీలు కల్పించే పేరుతో పన్నెండు గంటల పని పద్దతిని అమలు చేయాలని అనేక చోట్ల ప్రతిపాదించారు. అంటే పని స్ధలాలకు దూరంగా ఉన్న కార్మికులు ఇండ్లకు వెళ్లేందుకు వీలు కలగదు, బ్రిటీష్‌ వారి కాలంలో మాదిరి పని చేసి ఇంటికి పోకుండా మరుసటి రోజు విధులకు వెళ్లేందుకు ఫ్యాక్టరీ గేట్ల ముందే విశ్రమించే రోజులు వచ్చినా ఆశ్చర్య ం లేదు.
1971లో ఇందిరా గాంధీ జనం దృష్టిలో దేవత దుర్గాదేవి. పాక్‌ సేనలను లొంగదీసుకొని బంగ్లాదేశ్‌ విముక్తికి తోడ్పడిన సమయంలో ఆమె తిరుగులేని నేత. బంగ్లా విముక్తికి కొద్ది నెలల ముందు గరీబీ హఠావో పేరుతో మధ్యంతర లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తిరుగులేని విజయం సాధించారు. కానీ రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే పరిస్ధితులు మారిపోయాయి. కాలేజీ ఫీజుల పెంపుదల, అధిక ధరలకు వ్యతిరేకంగా విద్యార్ధులు ప్రారంభించిన ఉద్యమాలు దేశ రాజకీయాలనే మార్చివేశాయి. బంగ్లా విముక్తి వంటి విజయం నరేంద్రమోడీ ఖాతాలో లేకపోయినా వివిధ కారణాలతో జనంలో పలుకుబడి కలిగి ఉన్నారు. సర్కార్‌ ఏలుబడిలో తీవ్ర సమస్యలున్నా అలాంటి ఉద్యమాలు లేవు.
1971లో పాక్‌ ఆర్మీతో తూర్పు పాకిస్ధాన్‌లో యుద్దం పదమూడు రోజులే జరిగినప్పటికీ అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న మన ఆర్ధిక వ్యవస్ధకు భారంగా మారిందంటే అతిశయోక్తి కాదు.1971-72 మన జిడిపి వృద్ధి రేటు 0.9శాతమే. తరువాత రెండు సంవత్సరాలలో అనేక చోట్ల కరవు, ఆహార ధాన్యాల కొరత, అధిక ధరలు, బంగ్లా శరణార్దుల రక్షణ వంటి అంశాలు చుట్టుముట్టాయి. విదేశీ మారక ద్రవ్యం కరిగిపోయింది. పరిశ్రమల మూత, నిరుద్యోగం పెరుగుదల, 1973లో పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం చమురు సంక్షోభానికి దారితీసి ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది కొద్ది వారాల్లోనే పీపా 60 నుంచి ఇరవై డాలర్లకు పడిపోతే నాడు కొద్ది రోజుల్లోనే మూడు నుంచి పన్నెండు డాలర్లకు పెరిగింది. మోడీకి ఎన్నో డాలర్లు మిగిలితే ఇందిరా గాంధీకి ఖర్చయ్యాయి. నాడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే జనానికి పెరిగాయి, నేడు గణనీయంగా తగ్గినా పెరిగాయి. మోడీకి యుద్ధం లేదు, చమురు బిల్లు గణనీయంగా తగ్గింది గానీ జిడిపి వృద్ధి రేటు దిగజారింది. ఇందిరా గాంధీ నాటి స్ధాయికి నిరుద్యోగం పెరిగింది. ద్రవ్యోల్బణం ఇరవైశాతం పైనే ఉంది, దానికి తగినట్లు ధరలు పెరిగాయి. ఇప్పుడు ఆ స్ధాయిలో ద్రవ్యోల్బణం లేదు. చమురు ధరలు తగ్గి ప్రభుత్వం మీద ఆర్ధిక వత్తిడి గణనీయంగా తగ్గినా చమురు పన్ను ఒక ఆదాయవనరుగా మార్చు కుంది.2014లో లీటరు పెట్రోలు మీద రూ.9.48 ఉంటే ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.32.98కి మోడీ సర్కార్‌ పెంచింది. పెట్రోలు, డీజిల్‌ మీద ఒక లీటరుకు ఒక రూపాయి పన్ను పెంచితే కేంద్ర ప్రభుత్వానికి ఏటా పదమూడు- పద్నాలువేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని అంచనా అంటే అదనంగా సాధారణ రోజుల్లో ఏటా మూడు లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ మొత్తం అదనం అయితే పెట్రోలు, డీజిల్‌ సబ్సిడీ ఏటా ఒక లక్ష కోట్ల రూపాయలు ఆదా అయింది. 2004-05 నుంచి 2018-19 వరకు పెట్రోలియం ఉత్పత్తుల మీద ఇచ్చిన సబ్సిడీ మొత్తం 10,99,234 కోట్ల రూపాయలు. అయితే 2014-15 నుంచి 2018-19 వరకు చూస్తే పెట్రోలియం ఉత్పత్తుల మీద వసూలు చేసిన పన్ను మొత్తం రూ. 11,90,777 కోట్లు అన్న పచ్చినిజం ఎంత మందికి తెలుసు ?
2014 మార్చి ఒకటవ తేదీన ముడిచమురు పీపా ధర 118 డాలర్లు ఉన్నపుడు వినియోగదారుడికి ఢిల్లీలో రూ.73.20 పెట్రోలు దొరికింది, ఈ ఏడాది మే 22న పీపాధర 33.25 డాలర్లకు పడిపోయినప్పటికీ పెట్రోలు ధర రూ.71.30 ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను బట్టి చమురు ధరల పెంపు తగ్గింపు అనే విధానాన్ని గత రెండునెలలుగా పక్కన పెట్టేశారు. ఇలాంటి పాలకులు సంస్కరణలతో బొందితో కైలాసానికి తీసుకుపోతామని చెపితే నమ్మటం ఎలా ?
ఒకవైపు జనం మీద బాదుడు, మరోవైపు చమురు బిల్లు తగ్గుదల, అనేక ఆర్ధిక సూచికలు గతంతో పోల్చితే బాగున్నప్పటికీ అభివృద్ధి జాడల్లేవు. ప్రపంచంలో అభివృద్దికి పలు నమూనాలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. దానితో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడదాం. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గుజరాత్‌ నమూనాను అభివృద్ధి చేశారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాన్ని దేశమంతటా విస్తరించకుండా విదేశాలు, విదేశీ కార్పొరేట్ల కోసం వెంపర్లాడటం ఎందుకు అన్న ప్రశ్నకు జవాబు చెప్పేవారు లేరు.

Economic Crisis: View: India's economic crisis can bring about ...రిజర్వుబ్యాంకు శుక్రవారం నాడు మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ తీరు చూస్తుంటే వడ్డీ సంగతి తరువాత ఒక రూపాయి అప్పు తీసుకుంటే మరో రూపాయి ఉచితం అనే రోజులు వస్తాయా అని పిస్తోంది. రుణాలు తీసుకొనే వారు లేరు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదు. గత ఆరు సంవత్సరాలలో మోడీ సర్కార్‌ సాధించినట్లు చెప్పుకుంటున్న అభివృద్ధి ఎంత బలహీనమైనదో అర్ధం అవుతోంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన జిడిపి వృద్ధి రేటు మైనస్‌ 2.5 నుంచి మైనస్‌ 3.6శాతానికి దిగజార నుందని రేటింగ్‌ సంస్ధ గోల్డ్‌మాన్‌ శాచస్‌ తాజా అంచనాలో పేర్కొన్నది. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసిన తరువాత ఈ అంచనా ఎలా మారుతుందో తెలియదు. 2020-21లో మన జిడిపి రేటు మైనస్‌ ఆరు, ప్లస్‌ ఒక శాతం మధ్య ఉండవచ్చని పదిహేనవ ఆర్ధిక సంఘం అధ్యక్షుడు ఎన్‌కె సింగ్‌ జోశ్యం చెప్పారు. ఇవన్నీ నిజానికి ఆందోళనకర వార్తలు. మరోవైపు చైనాలో వృద్ధి రేటు కనిష్టంగా 1.8శాతం ఉంటుందని అంచనాలు వెలువడతున్నప్పటికీ తాము ఒక లక్ష్యాన్ని నిర్దేశించే స్ధితిలో లేమని చైనా ప్రధాని శుక్రవారం నాడు ప్రకటించారు. గత ఆరు సంవత్సరాల కాలంలో బ్యాంకుల నిరర్దక ఆస్తులు విపరీతంగా పెరిగిపోవటం, ఎనిమిది లక్షల కోట్ల రూపాయల వరకు వాటిని రద్దు చేయటం చూశాము. వీటిలో కావాలని ఎగవేసిన వాటితో పాటు ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు కూడా కనిపిస్తోంది. మోడీ సర్కార్‌ గత ఏడాది కాలంలో క్రమంగా వడ్డీ రేట్లను ఎంత తగ్గించినా, తీసుకొనే వారు కనిపించకపోవటం పలుమార్లు కోత పెడుతోంది. మన మీద ఏ విదేశీ ఆంక్షలు లేవు, విదేశీ కంపెనీలు తమ లాభాలను స్వేచ్చగా తరలించుకుపోయేందుకు ద్వారాలను ఎప్పుడో తెరిచి ఉంచాము. అయినా పెట్టుబడులు రావటం లేదు.
మన రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ పోతే బ్యాంకులు డిపాజిట్లపై ఇచ్చే వడ్డీని తగ్గించాల్సి ఉంటుంది, అదే జరిగితే బ్యాంకుల్లో సొమ్ముదాచుకొనే వారు తగ్గిపోతారు. అది సరికొత్త సమస్యలకు దారి తీస్తుంది.దీన్ని ఆసరా చేసుకొని ద్రవ్యపెట్టుబడికి దారులు తెరిచేందుకు మోడీ సర్కార్‌ సరికొత్త వాదనలను ముందుకు తెచ్చింది. అదే విదేశాల్లో డాలర్‌ రుణాలను ప్రభుత్వమే తీసుకోవటం. ఇదొక ప్రమాదకరమైన క్రీడకు పూనుకోవటమే. రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించినా ఆ మేరకు బ్యాంకులు తమ ఖాతాదార్లకు బదలాయించటం లేదన్నది ఒక వాస్తవం.స్ధానికంగా ఉన్న వడ్డీ రేట్లలో సగానికంటే తక్కువకే విదేశీ సంస్ధల నుంచి రుణాలు తీసుకుంటే స్వదేశంలో బాండ్లకు గిరాకీ తగ్గుతుంది. దీని వలన స్ధానిక వడ్డీ రేట్లు, భారం తగ్గుతుంది. ఇది జరిగితే బ్యాంకులు ఆ మేరకు తమ దగ్గర రుణాలు తీసుకున్న ఖాతాదారులకు భారాన్ని తగ్గిస్తాయి. ప్రయివేటు రంగానికి రుణ లభ్యత పెరుగుతుందని చెబుతున్నారు.
ఏ దేశానికైనా ప్రాధాన్యతలు ఉంటాయి. ఉట్టికి ఎగరలేని వారు స్వర్గానికి ఎగురుతామంటే ఎలా ? కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అవసరమైన పిపిఇ, మాస్కులను కూడా దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.ఒక వైపు వలస కార్మికులు మాటిక్కెట్లను మా డబ్బులతో కొంటాం మా స్వంత ఊళ్లకు పంపండి మహాప్రభో అని వేడుకుంటున్నా పట్టించుకోని పాలకులు మన జనాన్ని చంద్రుడి మీదకు అంతరిక్షయానం చేయించేందుకు విదేశీ కంపెనీలతో ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతుంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు. అమెరికాతో సహా అనేక పశ్చిమ దేశాలు మనకు సాంకేతిక పరిజ్ఞానం అందచేసేందుకు తిరస్కరించినపుడు సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా సాయంతో మన ఇస్త్రో శాస్త్రవేత్తలు గణనీయమైన విజయాలు సాధించారు. ఇవాళ్లగాకపోతే రేపు ఇప్పుడు చౌకగా రాకెట్లను, ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నట్లే అంతరిక్ష యానం కూడా చేయించగల సత్తా ఉంది. వారిని అవమానించే విధంగా ఇప్పుడు ప్రయివేటు విదేశీ కంపెనీలను రమ్మంటున్నారు. సంస్కరణల్లో భాగంగా మన అంతరిక్ష పరిశోధనా సంస్ధ సౌకర్యాలను వినియోగించుకొనేందుకు ప్రయివేటు కంపెనీలను అనుమతిస్తూ కేంద్రం నిర్ణయించింది. మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సౌకర్యాలను వినియోగించుకోవటం అంటే పుట్టా గుట్టా కొట్టి పెంచిన చెట్లు కాయలు కాసే తరుణంలో వాటికి నీరు పోసి పండ్లు కోసుకుపోయేందుకు వేరే వారికి అప్పగించటం తప్ప మరొకటి కాదు.

Where Are The Jobs? There Is A Real And Growing Unemployment Crisis In India
కరోనా సహాయచర్యలకు డబ్బులేదు , కావాలంటే అప్పులు ఇప్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఈ సమయంలోనే ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ భవనం, సచివాలయం, ప్రధాని, ఉపరాష్ట్రపతి భవనాల నిర్మాణం పేరుతో ఇరవై వేల కోట్ల రూపాయలను తగలేయనుంది. ఇప్పుడు ఉన్నవాటితో వచ్చిన ఇబ్బంది ఏమిటి ? వర్షాకాలంలో మన ఇండ్ల మాదిరి అవేమీ కారటం లేదు, వేసవి వస్తే వాటిలో ఉండేవారికి వడదెబ్బ తగలటం లేదే ? న్యూఢిల్లీలో కొత్తగా పర్యావరణానికి, వారసత్వ నిర్మాణాలకు భంగం కలిగించే ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని అనేక మంది మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా ముందుకు పోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.1970 దశకంలో ఇందిరా గాంధీ కుమారుడు సంజరు గాంధీకి ఏడాదికి యాభైవేల మారుతీ కార్ల తయారీకి ఇందిర ప్రభుత్వం లైసెన్సు ఇస్తే ఆర్దిక సంక్షోభ సమయంలో కార్లు అవసరమా అంటూ ఆ రోజు ధ్వజమెత్తిన ప్రతిపక్షాలలో నేటి బిజెపి పూర్వరూపం జనసంఫ్‌ు కూడా ఉంది. అదేమీ ప్రభుత్వ పెట్టుబడితో సంజయ గాంధీ స్వంతానికి పెట్టే కంపెనీ కాదు. అదే విమర్శ ఇప్పుడు బిజెపికి సైతం వర్తించదా ? ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయం తరలింపును, తెలంగాణాలో నూతన సచివాలయ, అసెంబ్లీ భవనాల నిర్మాణాల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న బిజెపి న్యూఢిల్లీలో చేస్తున్నదేమిటి ? కరోనా పరీక్షలకు నిధులు కేటాయించని కేంద్రం ఆర్ధికంగా దిగజారిన స్ధితిలో ఒకవైపు జనాల మీద పన్నులు బాదుతూ అన్నివేల కోట్ల రూపాయలతో నూతన నిర్మాణాలు చేయటం అవసరమా ? రోమ్‌ తగులబడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తి వైఖరి కనిపించటం లేదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా సాయంలో ఇమ్రాన్‌ ఖాన్‌ కంటే మోడీ తక్కువ ఇచ్చారా ?

20 Wednesday May 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Greek, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA

≈ Leave a comment

Tags

COVID- 19 pandemic package, imran khan, Narendra Modi, narendra modi vs imran khan, World Bank on covid-19 packages

Did India handle Covid crisis better or Pakistan? The answer lies ...

ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన 20లక్షల కోట్ల కరోనా సంక్షోభ నివారణ పాకేజ్‌ గురించి ప్రస్తుతం దేశంలో మధనం జరుగుతోంది. ప్రభుత్వం, అధికారపార్టీ, దాని మిత్రపక్షాలు ఆ పధకం నుంచి అమృతం రానుందని చెబుతున్నాయి. అంతా ఒట్టిదే ఇదంతా జుమ్లా, పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి మూడనుకొని రెండువేయబోయి ఒకటి వేసి దాన్ని కూడా కొట్టి వేసి సున్నా చుట్టినట్లుగా ఉంటుందని, అమృతం రాదు, వచ్చేది ఏమిటో తెలియదు, అది ప్రాణాలు నిలుపుకొనేందుకు సైతం పనికి రాదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏం వస్తుందో, ఏం రాదో తెలియక జనాలు జుట్టుపీక్కుంటున్నారు. తమ స్వస్థలాలకు పోయేందుకు వలస కార్మికుల తెగింపు తీరు తెన్నులను చూస్తుంటే తమకు వచ్చేదేమీ లేదు, రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలియని నిరాశా, నిస్పృహలతో ఉన్నట్లు చెబుతున్నాయి.
పాకేజ్‌ ఎలాంటిదో ప్రతి అంశాన్ని చూడనవసరం లేదు. ఉదాహరణకు ఎంఎస్‌ఎంఇ( సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్ధలు లాక్‌డౌన్‌ ప్రకటించే సమయానికి ఐదున్నరలక్షల కోట్ల రూపాయల మేరకు బకాయిలు ఉన్నాయి. వాటిని వెంటనే చెల్లిస్తే ఆ పరిశ్రమలకు అంతకంటే వరం మరొకటి లేదు. ఆ బకాయిలను చెల్లించకుండా ఆ సంస్ధలకు మూడులక్షల కోట్ల రూపాయల హామీ లేని రుణం ఇప్పిస్తామని కేంద్ర ప్రకటించటం హాస్యాస్పదం. ఐదున్నర లక్షల కోట్ల బకాయిలే చెల్లించలేని వారు ఇరవై లక్షల కోట్ల పాకేజ్‌ అమలు జరుపుతామని చెబుతుంటే తల్లికి కూడు పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్న సామెత గుర్తుకు వస్తోంది. అందువలన పనికిరాని పాకేజ్‌ను కాసేపు పక్కన పెడదాం. ప్రపంచబ్యాంకు నిపుణులు ప్రతివారం వివిధ దేశాలలో అమలు చేస్తున్న, ప్రకటిస్తున్న కరోనా సంక్షేమ పధకాల గురించి సమాచారాన్ని సేకరించి మదింపు చేస్తున్నారు. వ్యాధి విస్తరిస్తున్నకొద్దీ ప్రతికూల ప్రభావాల తీవ్రత పెరిగే కొద్దీ పలు కొత్త పధకాలను ప్రకటించటం, అమల్లో ఉన్నవాటిని మెరుగుపరుస్తున్నారు. పాలకుల చిత్తశుద్ధి, శ్రద్ద ఎలా ఉంటుందో గ్రహించటానికి కరోనా సంక్షోభం పెద్ద అవకాశం కల్పించిందంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచ వ్యాపితంగా సంక్షేమ చర్యలన్నీ ఒకే విధంగా లేవు. నగదు బదిలీ, ఆహార పంపిణీ తక్షణ సహాయ చర్యలుగా ఉన్నాయి. విద్యుత్‌, నీటి బిల్లుల రద్దు, వాయిదా, రాయితీల మొదలు ఉద్దీపనలు, తక్షణ సాయాలు రకరకాలుగా అమలు జరుపుతున్నారు. తాజాగా మేనెల 15వరకు వచ్చిన సమాచారం మేరకు 181 దేశాల్లో 870 రకాల సంక్షేమ చర్యలను ప్రకటించి అమలు జరుపుతున్నారు. మొత్తంగా చూసినపుడు 30.3శాతం(264) నగదు బదిలీ పధకాలు ఉన్నాయి. ఇవి గణనీయంగా పెరిగాయి. వీటిలో 104 దేశాల్లో148 నగదు పధకాల కొత్తవి. నాలుగో వంతు పధకాల్లో ఇస్తున్న నగదును ఒకేసారి ఇస్తున్నారు. వస్తుసహాయ పధకాలు కూడా గణనీయంగా ఉన్నాయి. కొన్ని చోట్లా సామాజిక భద్రతా పధకాలకు వినియోగదారులు చెల్లించాల్సిన వాటాల మొత్తాన్ని ప్రభుత్వాలు రద్దు చేశాయి.
నగదేతర సంక్షేమ పధకాల్లో ప్రజాపనుల వంటివి 26.5శాతం, వస్తుపధకాలతో పోల్చితే నగదు పధకాలు రెట్టింపు ఉన్నాయి. నగదు అందచేత పధకాల సగటు వ్యవధి 3.1నెలలు, ఇది క్రమంగా పెరుగుతోంది. ఒక నెల నుంచి గరిష్టంగా ఆరునెలల వరకు ప్రకటించిన దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలలో వైరస్‌ సంక్షోభం ఎంతకాలం ఉంటే అంతకాలం అని కొన్ని దేశాలు ప్రకటించాయి. నగదు విషయానికి వస్తే మొత్తం మీద ఆయా దేశాలలోని తలసరి నెలవారీ జిడిపిలో సగటున 27శాతం ఉన్నాయి. ఉదాహరణకు మన దేశ తలసరి వార్షిక ఆదాయం 2020 అంచనాలో రు.1,76,976 ఉంది. దీన్ని నెలవారీ లెక్కిస్తే రూ.14,740 అవుతుంది. దీనిలో 27శాతం అంటే రూ.3,981. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం రూ.1,500 కనుక ప్రపంచ సగటులో సగానికంటే తక్కువే ఉంది. ఈ మాత్రానికే బిజెపి నేతలు ఎంతో గొప్ప సాయం అందించినట్లు చెప్పుకుంటున్నారు. పాకిస్ధాన్‌ తలసరి జిడిపి 2019లో 1388 డాలర్లు. దీన్ని మన రూపాయల్లోకి మారిస్తే 1,05,065. దీన్ని నెలవారీ చూస్తే రూ.8,755. దీనికి గాను పాక్‌ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం ఆరువేల రూపాయలు( పాక్‌ రూపాయల్లో పన్నెండువేలు), అంటే మనం ఎక్కడ ఉన్నాం ? పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కంటే మన ప్రధాని మోడీ తక్కువ ఇచ్చినట్లే కదా ! ఎంత చెట్టుకు అంతగాలి, ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి ఇస్తారు, ఇచ్చేది ఎంత అన్నది కూడా ముఖ్యమే కదా ! ప్రపంచ జిడిపిలో మన దేశాన్ని ఐదవ స్ధానంలోకి తీసుకుపోయామని చెప్పిన పెద్దలు సాయం విషయానికి వస్తే దరిద్రం తాండవించే దేశాల సరసన చేర్చారు. దీన్ని చూసి ఇంతకు ముందు ప్రశంసలు కురిపించిన వారు విస్తుపోతున్నారు. మనలను చూసి ప్రపంచం నేర్చుకొంటోందని చేస్తున్న ప్రచారం ఇలాంటి చర్యలతో గోవిందా ! మంగోలియాలో కరోనాకు ముందు పిల్లల నగదు సాయ ఆ దేశ కరెన్సీ ఎంవిటి పదివేలు ఉంటే కరోనా తరువాత లక్షకు పెంచారు. ఇలా అనేక దేశాలలో జరుగుతోంది. ఇలాంటి సాయం ప్రపంచం మొత్తం మీద 134శాతం పెరిగింది.మాల్డోవాలో కనిష్టంగా 43శాతం పెరిగితే గరిష్టంగా మంగోలియాలో 900శాతం ఉంది. మార్చినెల 27న నగదు బదిలీ పధకాలు 107 కాగా వస్తు సహా పధకాలు 22 ఉన్నాయి. అవి మే15నాటికి 264, 120కి పెరిగాయి.
కరోనానో నిమిత్తం లేకుండానే కొన్ని దేశాలలో నగదు బదిలీ పధకాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికింద చెల్లించే మొత్తాలు 45దేశాలలో పెరిగాయి, 157దేశాలలో పధకాన్ని ఎక్కువ మందికి వర్తించేలా విస్తరించారు. కేవలం నగదు సాయాన్ని పొందుతున్న వారు ప్రపంచంలో 130 కోట్ల మంది అయితే సామాజిక పధకాల సాయం పొందుతున్నవారు 170 కోట్ల వరకు ఉన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో పంపిణీ చేసే నగదు మొత్తం పెంచటం ఒక తక్షణ సవాలుగా ముందుకు వస్తోంది. నూట పదకొండు దేశాలలో సాధారణంగా రెండు రకాలుగా ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. కరోనా సంక్షోభానికి ముందే తమ వద్ద ఉన్న జాబితాలకు కొత్త కుటుంబాలను జత చేయటం, ఆన్‌లైన్‌ కంప్యూటర్లు లేదా ఫోన్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించటం, మూడవది ప్రభుత్వాలే అర్హులను గుర్తించటం.కొన్ని దేశాల్లో తమ వద్ద ఉన్న ఫోన్‌ నంబర్ల ద్వారా లబ్దిదార్లకు తెలియ చేస్తున్నారు.
నూటపదిహేడు దేశాలలో సామాజిక పధకాలకు లబ్దిదారులు చెల్లించాల్సిన వాటాల మొత్తాలను రద్దు చేయటం లేదా రాయితీలు ఇస్తున్నారు.సిక్‌లీవులకు చెల్లింపులు, నిరుద్యోగ భృతి వంటివి కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రకటించిన మేరకు సామాజిక భద్రతా పధకాలకు తలసరి ఖర్చు సగటున 44 డాలర్లు ఉంది. ఒక డాలరు చొప్పున ఎనిమిది దేశాల్లో , నాలుగు డాలర్లు 12చోట్ల, 25 దేశాలలో 25 డాలర్లు, 99 డాలర్ల చొప్పున 17దేశాలలో ఖర్చుచేస్తున్నారు. సామాజిక బీమా పధకాలు మన దేశంలో ఎనిమిదిశాతం మందికి వర్తింప చేస్తుండగా పాకిస్ధాన్లో నాలుగుశాతం ఉంది.
కొన్ని ముఖ్యమైన దేశాల్లో అమలు జరుగుతున్న పధకాల వివరాలు సంక్షిప్తంగా ఇలా ఉన్నాయి. చెల్లింపులు, ఇతర సాయం బాధితులు, అవసరమైన వారికే అని గమనంలో ఉంచుకోవాలి. అయితే పెట్టుబడిదారీ దేశాలలో కార్మికవర్గం ఎక్కువగా ఉంటుంది కనుక బాధితులూ ఎక్కువగానే ఉంటారు. మన దేశంలో వృద్ధాప్య, వికలాంగుల, ఒంటరి మహిళల పెన్షన్లు ఇస్తున్నట్లుగానే అనేక దేశాలలో అలాంటి పధకాలతో పాటు పరిమితంగా నగదు బదిలీ కూడా కరోనాతో నిమిత్తం లేకుండానే జరుగుతోంది. అనేక ఐరోపా దేశాలలో నిరుద్యోగ భృతి, నిరుద్యోగ బీమా పరిహారం వంటి పధకాలు ఉన్నాయి. మన వంటి అనేక దేశాలలో అవి లేవు.
అల్జీరియాలో రంజాన్‌ సందర్భంగా పేదలకు 79 డాలర్ల విలువగల పదివేల అల్జీరియన్‌ దీనార్‌లు చెల్లిస్తారు. గర్భిణులకు, పిల్లలను చూసుకోవాల్సిన మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు, తాత్కాలిక ఉద్యోగులకు 50శాతం సిక్‌ లీవు చెల్లింపు.ఆస్ట్రేలియాలో ప్రభుత్వ పెన్షనర్లకు ఒకసారి చెల్లింపుగా 750 ఆస్ట్రేలియన్‌ డాలర్లు(455 అమెరికా డాలర్లు), ఉద్యోగార్ధులకు, యువ అలవెన్సుకింద పదిహేనురోజులకు ఒకసారి 550 డాలర్లు చెల్లిస్తారు. కొత్తగా వలస వచ్చిన అర్హతగల వారికి వేచి ఉండే వ్యవధిని రద్దు చేసి అలవెన్సు ఇస్తున్నారు.తాస్‌మనానియన్‌ రాష్ట్రంలో అల్పాదాయం గల వారు స్వయంగా క్వారంటైన్‌లో ఉండేట్లయితే వ్యక్తికి 250, కుటుంబానికి1000 డాలర్లు అత్యవసర సాయంగా ఇస్తారు.
బంగ్లాదేశ్‌లో పేదలకు విక్రయించే బియ్యం రేటును కిలో 30టాకాల నుంచి ఐదుకు తగ్గించారు. బెల్జియంలో నిరుద్యోగ భృతి, అలవెన్సులను 60 నుంచి 70శాతం వరకు పెంచారు, గరిష్ట పరిమితిని నెలకు 2,754యూరోలుగా నిర్ణయించారు, మూడునెలల పాటు ఇస్తారు.కార్మికులకు నిరుద్యోగ భృతితో పాటు రోజుకు 5.63యూరోలు అదనంగా చెల్లిస్తారు. స్వయం ఉపాధి పొందుతున్న వారికి కరోనా కారణంగా ఏడాది పాటు వారు తమ సామాజిక బీమాకు చెల్లించాల్సిన మొత్తాన్ని రద్దు చేశారు. వారికి ఇచ్చే సాయంలో ఎలాంటి కోత ఉండదు. బ్రెజిల్‌లో నిరుద్యోగులైన అసంఘటిత రంగ కార్మికులైన పెద్దలకు మూడు నెలల పాటు 115 డాలర్లు లేదా కనీసవేతనంలో 60శాతం వంతున చెల్లిస్తారు.అయితే కుటుంబానికి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే వర్తిస్తుంది.వంటరి తల్లులకు 230 డాలర్లు ఇస్తారు.
కెనడాలో ఉపాధి హామీ బీమా వర్తించని వారికి నాలుగు నెలల పాటు రెండువేల డాలర్ల చొప్పున చెల్లిస్తారు.బ్రిటీష్‌ కొలంబియాలో కరోనా కారణంగా ఆదాయం కోల్పోయిన వారికి ఒకసారిగా వెయ్యి కెనడియన్‌ డాలర్లు చెల్లిస్తారు.అద్దెలకు ఉండేవారికి ఐదు వందల డాలర్లు ఇస్తారు, విద్యార్ధుల రుణాల వసూలును ఆరునెలలు వాయిదా వేశారు. ఛాద్‌లో ఆరునెలలు నీటి పన్ను, మూడు నెలలు విద్యుత్‌ బిల్లులను రద్దు చేశారు. చిలీలో మొదటి అసంఘటిత రంగ కార్మికులకు మొదటి నెల 340 డాలర్లు తరువాత దానిలో 85శాతం, మూడవ నెలలో 65శాతం నగదు చెల్లిస్తారు.
చైనాలోని ఊహాన్‌ నగరంలో వలస వచ్చిన కార్మికులకు గుండుగుత్తగా ఐదువందల యువాన్లు(మన రూపాయల్లో నాలుగువేలకు సమానం) ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు చైనాలో సామాజిక భద్రతా పధకాల కింద నమోదైన కంపెనీలన్నింటిలో హుబెరు రాష్ట్రంలో ప్రతి కంపెనీ యజమానులు చెల్లించాల్సిన వాటాను రద్దు చేశారు. మిగతా చోట్ల ఎంఎస్‌ఎంఇలకు రద్దు చేశారు. ఇదిగాక నిరుద్యోగ బీమా పధకం నుంచి వేతనాలు, సబ్సిడీలను చెల్లిస్తారు.ఈ మొత్తం అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. ఉదాహరణకు నాన్‌జింగ్‌లో రోజుకు ఒక కార్మికుడికి వంద యువాన్లు చెల్లిస్తారు. దారిద్య్ర నిర్మూలన పధకంగా చైనాలో కనీస జీవన ప్రమాణ హామీ పధకం అమల్లో ఉంది. దీన్ని దిబావో అనిపిలుస్తారు. దీని కింద ఒక వ్యక్తికి పట్టణాల్లో ఐదు వందలు,గ్రామాల్లో మూడు వందల యువాన్లు కనీసంగా చెల్లిస్తారు. ఇది కూడా అన్ని చోట్లా ఒకే విధంగా లేదు, ఎక్కువ మొత్తాలను చెల్లించే ప్రాంతాలు కూడా ఉన్నాయి. షెంజన్‌లో స్ధానిక దిబావో మొత్తాలకు రెండు నుంచి 18 రెట్లు పొందేవారు కూడా ఉన్నారు.
క్యూబాలో వృద్దులు,వ్యాధి గ్రస్తులు, కరోనా వైరస్‌ బాధితులై ఇంటి దగ్గరే ఉండిపోయిన వారికి మొదటి నెలలో వందశాతం వేతనం, రెండవ నెలలో 60శాతం చెల్లిస్తారు.డెన్మార్క్‌లో లేఆఫ్‌ ప్రకటించని పక్షంలో ప్రభుత్వం మూడు నెలలపాటు 75శాతం వేతనాలు చెల్లిస్తుంది.ఈ మొత్తం గరిష్టంగా 3,418 అమెరికన్‌ డాలర్లు ఉంటుంది.ఈజిప్టులో అసంఘటితరంగ కార్మికులకు నెలకు 500 ఈజిప్టు పౌండ్లు లేదా మన రూపాయల్లో 2400 మూడు నెలల పాటు చెల్లిస్తారు.
అమెరికాలో నాలుగు నెలల పాటు పెద్ద వారికి 1200, పిల్లలకు 500 డాలర్ల చొప్పున చెల్లిస్తారు. పాకిస్తాన్లో ఒక విడతగా పన్నెండువేల రూపాయలు, మన కరెన్సీలో ఆరువేలు చెల్లిస్తారు. జర్మనీలో కళాకారులు, నర్సుల వంటి వారికి మూడునెలల్లో 15వేల యూరోలు చెల్లిస్తారు. ఆదాయం కోల్పోయిన వారి పిల్లలకు మార్చినెల నుంచి సెప్టెంబరు వరకు 185యూరోలు చెల్లిస్తారు.వ్యాధి సోకిన వారికి ఆరువారాల పాటు సిక్‌ లీవు కింద పూర్తి వేతనం ఇస్తారు. సామాజిక బీమా పధకాలకు యజమానులు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే ఇస్తుంది. యజమానులు లేఆఫ్‌ చేయకుండా ఉన్న కంపెనీలలో పన్నెండు నెలల పాటు 60శాతం వేతనాలు చెల్లించవచ్చు, పిల్లలున్న కార్మికులకు 67శాతం ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రాన్స్‌లో అత్యవసర సాయం కింద కుటుంబానికి 150, పిల్లలకు వంద యూరోల చొప్పున చెల్లిస్తారు. స్వయం ఉపాధి పొందేవారికి 1500, విధుల్లో ఉన్న ఉద్యోగులకు వెయ్యి యూరోల బోనస్‌ చెల్లిస్తారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి మొత్తం వేతనంలో 70శాతం చెల్లిస్తారు, కనీసం వేతనం, అంతకంటే తక్కువ పొందేవారికి నూటికి నూరుశాతం చెల్లిస్తారు.

UN general assembly session: Imran Khan lashes out at Prime ...

దక్షిణ కొరియాలో నిరుద్యోగ భృతి అక్కడి కరెన్సీలో నెలకు రెండు నుంచి ఐదు లక్షలకు పెంచారు. రష్యాలో గర్భవతులకు నెలకు 63 డాలర్లు, నిరుద్యోగులకు మూడు నెలల పాటు 38డాలర్లు చెల్లిస్తారు. జపాన్‌లో ప్రతి పౌరుడికి 930 డాలర్లు ఇస్తున్నారు. ఇరాన్‌లో నాలుగు విడతలుగా 400 డాలర్లు, ఇరాక్‌లో ప్రతి ఒక్కరికి 253 డాలర్లు,హాంకాంగ్‌లో ఒక విడతగా 1,280 డాలర్లు, ఒక నెల సామాజిక భద్రత పధకం అలవెన్సు అదనం. గ్రీసులో మూతబడిన సంస్ధల సిబ్బందికి 800 యూరోలు చెల్లిస్తున్నారు. పాకిస్ధాన్‌లో ఒక విడతగా పన్నెండు వేల రూపాయలను ప్రకటించారు. ఇది మన ఆరువేల రూపాయలకు సమానం. ఈ నేపధ్యంలో ప్రతి దేశంలోనూ అందించాల్సిన సాయం, కోల్పోయిన ఉపాధి పునరుద్దరణ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఏ దేశంలో అయినా అందరికీ ఇవ్వాల్సిన అవసరమూ లేదు, అవకాశమూ ఉండదు. కొందరికి అయినా ఇచ్చే మొత్తం ఎంత అన్నది చూసినపుడు మనం ఇస్తున్నది చాలా తక్కువ. ఎంత ఇవ్వాలనే అంశంపై మన దేశంలో చర్చకు పాలకులు తావివ్వటం లేదు. చర్చ జరిగితే బండారం బయట పడుతుంది కనుక పాచిపోయినా సరే మూసి పెట్టటానికే సిద్దపడుతున్నారు.

కార్పొరేట్లకు కట్టబెట్టే సమయంలో ప్రదర్శించే ఉత్సాహం, ఉదారత, ఉద్దీపనలు సామాన్యుల విషయంలో కనిపించటం లేదు. ఏటా కనీసం ఐదు లక్షల కోట్ల రూపాయల మేర కార్పొరేట్లకు, ఇతర ధనికులకు రాయితీలు ఇస్తూ ఖజానాకు రావాల్సిన అంటే జనానికి ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని వదులుకుంటున్నారు. వేల కోట్ల రుణాలు తీసుకొని కావాలని ఎగవేసిన బడా సంస్ధలకు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు మన కళ్ల ముందే జరిగింది. అందువలన ఇలాంటి సమయాల్లో చప్పట్లు, దీపాలు వెలిగించటం, స్వదేశీ వంటి కబుర్లు కాదు, కార్యాచరణ కావాలని జనం కోరుకుంటున్నారు. సుభాషితాలు పెరిగే కొద్దీ చిరాకు నిరసనగా మారుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సంక్షోభ సమయాల్లోనే సంస్కరణలు- ఇందిరా గాంధీ హయాంలో ఏం జరిగింది !

19 Tuesday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

economic reforms during crisis, Indian Rupee devalue, Indira gandhi, Indira Gandhi regime, Narendra Modi, what happened in indira gandhi regime, World Bank

Did Indira Gandhi impose Emergency to escape economic crisis ...

ఎం కోటేశ్వరరావు
జిడిపిలో పదిశాతం విలువగల 20లక్షల కోట్ల రూపాయల పాకేజి ప్రకటించినప్పటికీ నరేంద్రమోడీ ఆ సంతోషాన్ని స్వయంగా మీడియాతో ఎందుకు పంచుకోలేదు అని ఒక మీడియా మిత్రుడికి సందేహం వచ్చింది. నరేంద్రమోడీకి ప్రచారం కండూతి లేదు, అది ఒక బాధ్యతగా చేశారు కనుక మీడియాలో డబ్బాకొట్టుకోవాలనుకో లేదు, మోడీగారీ నమ్రతకు అది చిహ్నం అని మరొకరు వ్యాఖ్యానించారు. యావత్‌ జాతికి కష్ట కాలం రావటం దేశంలో ఇదే ప్రధమం, అలాంటపుడు కూడా జర్నలిస్టులతో మాటా మంతీ కలపలేదంటే ఇంకెప్పుడు మాట్లాడతారు ? అని మరొకరి వ్యాఖ్య. ఇలా పలు అంశాలపై సాగిన సంభాషణల్లో కరోనా సమయంలో దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలకు బదులు ఆ ముసుగులో ” సంస్కరణ ”లకు ఎందుకు తెరలేపారు అన్న ప్రశ్న వచ్చింది. నిజమే కదా !
మేడంటే మేడా కాదు, గూడంటే గూడూ కాదు అన్నట్లుగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన 20లక్షల కోట్ల రూపాయల కరోనా పాకేజి ఒక పాకేజి కాదు, మోడీ గారి ఆత్మ అమిత్‌ షా మాటల్లో చెప్పాలంటే జుమ్లా ! అవసరానికేదో చెబుతాం అవన్నీ నిజమనుకుంటే ఎలా అన్నది జుమ్లా అనే పదానికి అర్ధం. తిరస్కరించిన దరఖాస్తులను కూడా పరిష్కరించిన లెక్కల్లో చూపే రోజులివి. పాకేజ్‌లో బడ్జెట్‌ పధకాలతో నిమిత్తం లేకుండా అదనంగా ఖర్చు చేసేది ఎంత? మామూలుగా లేదా అదనంగా ఇవ్వదలచిన అప్పుల మొత్తాన్ని ఇరవై లక్షల కోట్లలో చూపారా ? ఒక రోజులోనో రెండు రోజుల్లోనో మరచిపోవాల్సిన సమస్య కాదు గనుక ఇలాంటి వాటి మంచి చెడ్డల గురించి మరో సందర్భంలో చూద్ధాం.
కనీవినీ ఎరుగని సంక్షోభ సమయంలో వివాదాస్పద సంస్కరణలు ప్రకటించటం ఇదే మొదటిసారా ? మన దేశంలో సంస్కరణల పేరుతో తీసుకున్న దేశ, ప్రజావ్యతిరేక చర్యలన్నీ సంక్షోభ సమయాల్లో తీసుకున్నవే అన్నది నమ్మలేని నిజం. అదే విధంగా చేదు సంస్కరణలు చేపట్టిన ప్రతిసారీ జనం చేత వాటిని మింగించటానికి స్వదేశీ, స్వావలంబన, స్వయం సమృద్ధి నినాదాల పంచదార పూత పూయటాన్ని కూడా చూడవచ్చు. ఏదో ఒకటి చేసి ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని జనం భావిస్తారు, పాలకులు తీసుకొనే చర్యల మంచి చెడ్డలను విశ్లేషించే సంపూర్ణ పరిజ్ఞానం ఉండదు కనుక ఆ ముసుగులో తమ అజెండాను అమలు జరుపుతారు. ఇప్పటి వరకూ జరిగిన సంస్కరణల చరిత్రను చూస్తే ఆర్భాటంగా లేదా మోసపూరితం లేదా బలవంతంగా అమలు జరిపిన పాలకులందరూ తరువాత చరిత్ర చెత్తబుట్టలోకి జారిన వారే ! అయితే ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్నది సంస్కరణల కిందకే వస్తుందా ? అవును అంటే ఏమౌతారు ? కాకపోతే మరేమిటి, ఏం జరుగుతుంది? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న ! ఇప్పటికైతే, తినబోతూ రుచి అడగటం ఎందుకు అన్నదే సమాధానం !
దేశంలో కరోనా మహమ్మారి విస్తరణ ప్రారంభం అయినప్పటి నుంచి ముఖ్యంగా జాతీయ మీడియాను పరిశీలిస్తే మరిన్ని సంస్కరణలకు ఇదే మంచి తరుణం అని అనేక మంది మంచి చెడ్డల విశ్లేషణల పేరుతో సలహాలు ఇచ్చారు. నరేంద్రమోడీ 1.0లో ఘోరవైఫల్యం కారణంగా ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు ఐదు శాతం లోపుకు పడిపోయింది. దీనికి కరోనా కూడా తోడు కావటంతో సున్నా లేదా మైనస్‌ కావచ్చని కూడా అంచనాలు వెలువడుతున్నాయి. ఆ సూచనలు లోక్‌సభ ఎన్నికలకు ముందే కనిపించినా దాచిన మోడీ మరింత మెజారిటీతో అధికారానికి వచ్చిన దగ్గర నుంచి 2.0 ” సంస్కరణ”ల గురించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. కరోనా వైరస్‌ రూపంలో అలాంటి అవకాశం వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. గత ఏడాది కాలంలో వడ్డీరేట్లు తగ్గించినప్పటికీ పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో వైఫల్యం తప్ప పురోగతి లేదు. గత కొన్ని సంవత్సరాలుగా విదేశీ వస్తువులకే కాదు, విదేశీ నిధుల ప్రవాహానికి కూడా మన ద్రవ్య మార్కెట్‌ను తెరవాలని ద్రవ్య పెట్టుబడిదారులు డిమాండ్‌ చేస్తున్నారు.
దేశం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది కనుక బయటపడేందుకు ఏదో ఒకటి చేయాలని జనం భావిస్తున్నారు కనుక తమకు ఇదే మంచి అవకాశమని కేంద్ర పాలకులు గత ఏడాదే గ్రహించారు. ప్రభుత్వం తీసుకొనే అప్పులను బాండ్ల పేరుతో వేలం వేస్తారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసే బాండ్లను విదేశీ సంస్ధలు కొనుగోలు చేసేందుకు అనుమతించాలని తొలిసారిగా మోడీ సర్కార్‌ నిర్ణయించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 10బిలియన్‌ డాలర్ల వరకు డాలర్‌ రుణాలు తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఇది గత విధానాల నుంచి వైదొలగటమే. లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలు ఇలాంటి అప్పులు తీసుకొని తిప్పలను కొని తెచ్చుకున్నాయని తెలిసీ ఇందుకు పూనుకున్నారు. ప్రభుత్వాలకు అప్పులు కావాలంటే మన దేశంలోని వారి నుంచే తీసుకోవచ్చు. అయితే అమెరికా, జపాన్‌, ఐరోపా ధనిక దేశాలతో పోల్చితే వడ్డీ రేట్లు మన దేశంలో ఎక్కువ కనుక అప్పు ఖరీదు పెరుగుతుంది. దీన్ని సాకుగా చూపుతూ విదేశీ సంస్ధలకు తలుపులు తెరిచారు.
దీన్ని సమర్ధించుకొనేందుకు చేస్తున్న వాదనల సారాంశం ఇలా ఉంది. స్ధానికంగా ఉన్న వడ్డీ రేట్లలో సగానికంటే తక్కువకే విదేశీ సంస్ధల నుంచి రుణాలు తీసుకుంటే స్వదేశంలో బాండ్లకు గిరాకీ తగ్గుతుంది. దీని వలన స్ధానిక వడ్డీ రేట్లు, భారం తగ్గుతుంది. ఇది జరిగితే బ్యాంకులు ఆ మేరకు తమ దగ్గర రుణాలు తీసుకున్న ఖాతాదారులకు భారాన్ని తగ్గిస్తాయి. ప్రయివేటు రంగానికి రుణ లభ్యత పెరుగుతుంది. ప్రస్తుతం మన విదేశీ అప్పు జిడిపిలో ఐదోవంతు మాత్రమే ఉంది, అందువలన అదనంగా అప్పులు తీసుకున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మధ్యతరగతి జనాలకు ఈ వాదన వీనుల విందుగా ఉంటుంది. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. డాలర్‌ అప్పులన్నీ డాలర్లలోనే చెల్లించాలి తప్ప మన రూపాయల్లో చెల్లిస్తామంటే కుదరదు.
యుపిఏ హయాంలో మన దేశంలోని పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు చౌకగా వస్తున్నాయి కదా అని విదేశాల నుంచి డాలర్‌ రుణాలు పెద్ద మొత్తంలో తీసుకున్నాయి. అవి అనుకున్నదొకటి జరిగింది మరొకటి. అందరికీ తెలిసిన అనిల్‌ అంబానీ, జివికె, లాంకో వంటి సంస్ధలు విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీల పేరుతో అలాంటి అప్పులు తీసుకొని ఒక విడత వడ్డీ కూడా చెల్లించలేక దివాలా తీసిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. లాంకో కంపెనీ వడ్డీ రేటు 130శాతం, జివికేకు 55శాతం వరకు చేరింది. ఈ కంపెనీలన్నీ రూపాయి మారకపు విలువ పతనంతో మరింతగా అప్పులపాలయ్యాయి. రూపాయి రుణం తీసుకుంటే ప్రతి ఏటా లేదా చివరిలో వడ్డీ, అసలు కలిపి ఇచ్చినా రూపాయల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది, కానీ డాలర్ల వ్యహారం అలా కాదు. ఉదాహరణకు ఇలాంటి కంపెనీలు 2007-08లోవంద డాలర్లు అప్పులు తీసుకున్నాయనుకుందాం. ఆ ఏడాది రూపాయి సగటు మారకపు విలువ 40.24 కనుక వాటికి 4,024 రూపాయలు పెట్టుబడిగా అందుబాటులోకి వచ్చాయి. ఆ వందడాలర్లను 2013-14లో చెల్లించాల్సి ఉందనుకుంటే తీసుకున్న రోజు నుంచి తీర్చే వరకు ఏటా వడ్డీ, చివరిలో అసలు లేదా మొత్తం ఒకేసారి చెల్లించాలి అన్నది ఒప్పందం అనుకుందాం.ఆ ఏడాదిలో రూపాయి విలువ 60.50కి పడిపోయింది. అంటే తిరిగి డాలర్లలో చెల్లించాలి అంటే ఆ రోజు మార్కెట్లో వాటిని కొనుగోలు చేయాలంటే రూ.6,050 చెల్లిస్తే తప్ప వంద డాలర్లు రావు. అంటే అప్పు తీసుకున్నవారికి తడిచి మోపెడు అయింది. అప్పుతీసుకున్న నాటితో పోలిస్తే తరువాత ఆర్ధిక వ్యవస్ధ దిగజారటంతో అసలుకే మోసం వచ్చింది. అందుకే దివాలాతీసి రంగం నుంచి అంతర్ధానమయ్యాయి. అదే ప్రభుత్వాలు అలాంటి అప్పులు తీసుకుంటే అంతర్ధానం అయ్యే అవకాశం లేదు. దేశం మొత్తాన్ని విదేశీ కంపెనీలకు తాకట్టు పెట్టటం, తెగనమ్మటం తప్ప మరొక మార్గం లేదు. గతంలో ఈ కంపెనీలకు ఏం జరిగిందో తెలిసి కూడ అలాంటి ప్రమాదకర విధానాలను ఇప్పుడు నరేంద్రమోడీ అమలు జరుపుతున్నారు.
విదేశీ డాలర్‌ రుణాలను తీసుకున్నపుడు ఉన్న మారకం రేటు కంటే మన రూపాయి బలపడిందనుకోండి అప్పుడు మనకు లాభం. మన రూపాయి చరిత్రను చూస్తే పతనం తప్ప బలపడిన దాఖలా లేదు. బిజెపి, ఇతర పార్టీల చేత అసమర్ధ ప్రధాని అని ముద్రవేయించుకున్న మన్మోహన్‌ సింగ్‌ హయాంలో రూపాయి విలువ 44.93 నుంచి 60.50కి దిగజారింది. అత్యంత సమర్దుడని పొగిడించుకున్న నరేంద్ర మోడీ హయాంలో అక్కడి నుంచి ఇప్పుడు 75కు పతనమైన విషయం తెలిసిందే. ఇదింకా ఎంతకు దిగజారనుందో తెలియదు. గత ఆరు సంవత్సరాల పోకడ చూసినపుడు రూపాయి పతనాన్ని అరికట్టే సామర్ధ్యం లేదా చిత్తశుద్ది మోడీ సర్కార్‌కు లేదని తేలిపోయింది.ఎగుమతులను పెంచే పేరుతో రూపాయి పతనాన్ని ప్రోత్సహిస్తున్నారు.
చైనా కూడా సంస్కరణలు చేపట్టింది, దాని వలన అది ఎంతో లబ్దిపొందింది. మనమూ చేపట్టాం వాటితో మరింత దిగజారిపోతున్నాము. అందుకే వాటిని ఘనంగా చెప్పుకున్నవారూ, గట్టిగా సమర్ధించిన వారూ చరిత్రలో ప్రజావ్యతిరేకులుగా మిగిలిపోయారు. నరేంద్రమోడీ సర్కార్‌ కరోనా సంక్షోభ సమయంలో ప్రకటించిన సంస్కరణలు దేశాన్ని మరింతగా విదేశీ కార్పొరేట్లకు అప్పగించేవే తప్ప మన జనానికి ప్రయోజనకరం కాదన్నది స్పష్టం. మన సంస్కరణలన్నీ సంక్షోభ సమయంలో చేపట్టినవే. అవసరానికి ఎవరి దగ్గరకైనా వెళ్లినపుడు వారి షరతులకు మనం తలొగ్గాలి తప్ప మన మాట చెల్లదు. మన సంస్కరణలకూ చైనా సంస్కరణలకూ ఒక మౌలిక తేదా ఉంది. చైనాలో ప్రభుత్వరంగ ఆధిపత్యంలో ప్రయివేటు రంగాన్ని అనుమతించారు. ఇక్కడ ప్రభుత్వరంగాన్ని దెబ్బతీసి, ప్రయివేటీకరణ చేస్తూ విదేశీ, స్వదేశీ ప్రయివేటు పెట్టుబడులకు పెద్ద పీట వేస్తున్నారు. చైనాలో ప్రభుత్వరంగంలో వచ్చే లాభాలను తిరిగి పెట్టుబడులుగా పెడుతున్నారు. మన దగ్గర ప్రభుత్వరంగ సంస్ధలను తెగనమ్మి లోటు బడ్జెట్‌ను పూడ్చుకొనేందుకు, ప్రయివేటురంగానికి సబ్సిడీలు, ఇతర రూపాల్లో కట్టబెట్టేందుకు పూనుకున్నారు.
గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా దేశం ఆర్ధిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది. కారణం ఆశించిన స్ధాయిలో ఎగుమతులు పెరగలేదు, దిగుమతులతో వాణిజ్య లోటు పెరుగుతోంది. దేశీయంగా మన జనాల వినిమయ ఖర్చు తగ్గుతోంది, అంటే వస్తు వినిమయం తగ్గుతోంది.ఫలితంగా పరిశ్రమలు పూర్తి సామర్ధ్యంతో పని చేయటంలేదు, కార్మికులకు పనీ లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం లేదు.అభివృద్ధి రేటు పడిపోతోంది. వెరసి ఆర్ధిక సంక్షోభం ముసురుతోంది. ఈ ఆరేండ్ల కాలంలో చమురు దిగుమతి ఖర్చు గతంతో పోలిస్తే బాగా తగ్గింది. ఇదే సమయంలో పన్నుల వాత మోగిపోతోంది.ఆదా అయిన సొమ్ము ఏమౌతోందో, అదనంగా వసూలు చేస్తున్న డబ్బు ఏమౌతోందో తెలియదు. ఈ సంక్షోభం నుంచి ఎలా బయట పడాలా అని చూస్తున్న మోడీ సర్కార్‌కు కరోనా వైరస్‌ మంచి అవకాశం ఇచ్చిందనే చెప్పాలి.
గత ఆరు సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ లోటు బడ్జెట్‌ పెద్ద సమస్యగా ముందుకు వస్తోంది. అది జిడిపిలో 3.5శాతానికి లోపుగానే ఉంచుతామని చెబుతున్నప్పటికీ సాధ్యం కావటం లేదు. 2021 మార్చినాటికి 6.2శాతానికి చేరవచ్చని కొందరి అంచనా, కరోనా కారణంగా ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు. ఈ నేపధ్యంలో ప్రకటించిన సంస్కరణల పర్యవసానాల గురించి తరువాత చర్చించుదాం. మన దేశంలో సంస్కరణలకు ఆద్యురాలు ఇందిరా గాంధీ. అయితే ఆమె సంస్కరణలను బ్యాంకుల జాతీయ కరణ, గరీబీ హఠావో వంటి నినాదాల రూపంలోకి మార్చి జనంలోకి వెళ్లారు. ప్రతి పాలకుడూ అదే చేసినా మీడియాలో ఇప్పటి మాదిరిగాక సంస్కరణల పేరుతో చర్చ తక్కువగా జరిగింది. మీడియా మొత్తంగా గతంలో చేపట్టిన వాటినీ, ఇప్పుడు మోడీ ప్రభుత్వ సంస్కరణలనూ సమర్ధిస్తోంది గనుక విమర్శనాత్మక వైఖరికి బదులు భ్రమలను మరింత పెంచే విధంగా వ్యవహరిస్తోంది.

Indira Gandhi: If we tolerate communalism, how will we preserve ...
మన సంస్కరణల భారతం గురించి క్లుప్తంగా చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం ముగియటం, స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో తలెత్తిన అనిశ్చిత స్ధితిలో కొందరు స్వేచ్చా మార్కెట్‌ విధానాలను అనుసరించాలని ప్రతిపాదించగా మరికొందరు అంగీకరించలేదు. ప్రయివేటు రంగంలోని పరిశ్రమలను రక్షించుకోవాలంటే ప్రభుత్వ రంగ పరిశ్రమల ఏర్పాటు అవసరమని బోంబే క్లబ్‌ పేరుతో జెఆర్‌డి టాటా, జిడి బిర్లాతో సహా ఎనిమిది ప్రముఖ పారిశ్రామికవేత్తలు చేసిన సూచన మేరకు పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. తరువాత ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. తొలి ప్రణాళిక ఏడాది అమలు తరువాత విదేశీ చెల్లింపుల సమస్య తలెత్తింది. నాడు ఆర్ధిక సలహాదారుగా ఉన్న ప్రశాంత చంద్ర మహలనబిస్‌ స్వదేశీ లేదా స్వయం సమృద్ధి స్ఫూర్తిని ముందుకు తెచ్చారు. ఈ క్రమంలో పారిశ్రామికీకరణకు ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయటంతో దేశంలో ఆహారధాన్యాల కొరత ఏర్పడింది. వాటి దిగుమతికి విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగించాల్సి వచ్చింది. దీనికి తోడు చైనాతో యుద్దం మన సమస్యలను మరింత పెద్దవి చేసింది. తరువాత లాల్‌బహదూర్‌ శాస్త్రి అధికారానికి వచ్చారు. పాకిస్ధాన్‌తో జరిగిన యుద్దంలో విజయం-పర్యవసానాల నేపధ్యంలో ఆర్ధిక సంస్కరణలకు తెరతీశారు. దానిలో భాగంగా కేంద్ర ప్రణాళికా విధానం నుంచి వైదొలగాలని ఆలోచన చేశారు. దాంతో ప్రణాళికా సంఘ అధికారాలను పరిమితం చేసి విదేశీ పెట్టుబడులు, ప్రయివేటు పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఇదే సమయంలో ఆహార రంగంలో ఉత్పత్తి పెంపుదలకు జైజవాన్‌ జైకిసాన్‌ నినాదమిచ్చారు. ఇది హరిత విప్లవానికి నాంది పలికింది. ఆ ఉత్సాహంతో పాడి పరిశ్రమను ప్రోత్సహించి శ్వేత విప్లవానికి బాటలు వేశారు.
చైనాతో యుద్ధంలో ఓడినా, పాకిస్ధాన్‌తో గెలిచినా, పెట్టుబడులకు ఆహ్వానం పలికినా, నాడున్న అంతర్జాతీయ పరిస్ధితుల్లో అవి రాక మన ఆర్ధిక సమస్యలు తీవ్రమయ్యాయి. మన రాజకీయ,ఆర్ధిక వ్యవస్ధకు సవాళ్లు ఎదురు అయ్యాయి. లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణం, ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన వెంటనే ఆమెకు అటు పార్టీలో ఇటు ఆర్ధిక రంగంలో ప్రతిఘటన ప్రారంభమైంది. జనంలో తీవ్ర అసంతృప్తి తలెత్తింది. చైనా తరువాత అతి పెద్దదైన మన మార్కెట్‌ను ఆక్రమించుకొనే అవకాశం దక్కలేదన్న అక్కసుతో ఉన్న ధనిక దేశాలు ప్రపంచబ్యాంకు ద్వారా మన దేశంలో ప్రవేశించేందుకు అవకాశం కోసం కాచుకున్నాయి. కాంగ్రెస్‌ పాలకుల దివాలా కోరు విధానాలు అందుకు అవకాశం ఇచ్చాయి. 1964లో ప్రపంచ బ్యాంకు బృందం బెర్నార్డ్‌ బెల్‌ నాయకత్వంలో మన దేశంలో పర్యటించి మన రూపాయి విలువను తగ్గించాలని, విదేశీ వాణిజ్యంపై ఉన్న అనేక ఆంక్షలను ఎత్తివేయాలని ప్రతిపాదించింది. వాటిని నాటి ఆర్ధిక మంత్రి టిటి కృష్ణమాచారి తిరస్కరించారు. పాకిస్ధాన్‌ మద్దతుదారుగా ఉన్న అమెరికా అంతకు ముందు మనకు ప్రకటించిన సాయాన్ని యుద్దం కారణంగా ఆకస్మికంగా నిలిపివేసింది. 1965 లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణించటం, ఇందిరా గాంధీ ప్రధాని కావటం, ఆమె ప్రపంచ బ్యాంకు పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించటం దానికి నిదర్శనంగా కృష్ణమాచారిని పదవి నుంచి తొలగించటం, భారత్‌కు తిరిగి సాయం చేస్తామని అమెరికా ప్రకటించటం, ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు జరుపుతామని ఇందిరా గాంధీ అంగీకరించటం వంటి పరిణామాలు వెంటవెంటనే జరిగాయి.
1965 జూన్‌ 6న ఇందిరా గాంధీ డాలరుతో మారకంలో మన రూపాయి విలువను 4.75 నుంచి 7.50కి తగ్గించారు. అనేక దిగుమతి ఆంక్షలను, ఎగుమతి సబ్సిడీలను తగ్గించారు. ఇవన్నీ షరతుల్లో భాగం. వృతం చెడ్డా ఫలం దక్కలేదు. మన ఎగుమతులు పడిపోయాయి, దిగుమతులు పెరిగాయి. ప్రపంచ బ్యాంకు ఇస్తామని చెప్పిన మేరకు సాయం చేయలేదు. మరోవైపు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో జనం దృష్టిలో కాంగ్రెస్‌ పలుచనైంది. ప్రతిపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. పర్యవసానంగా 1967 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేంద్రంలో గెలిచినా తొలిసారిగా ఏడు ఉత్తరాది రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోయింది. పశ్చిమ దేశాలు మనల్ని మరింతగా తమ పాదాల ముందు మోకరిల్లేట్లు చేసుకొనేందుకు పూనుకున్నాయన్నది తేలిపోయింది. ఆ సమయంలో అమెరికా-సోవియట్‌ మధ్య తీవ్ర వైరం ఉండటంతో ఇందిరా గాంధీ సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకొని పశ్చిమ దేశాల మెడలు వంచి రెండు వైపుల నుంచి సాయం పొందాలని చూశారు. అధికారంలోకి రాగానే ఏ ప్రపంచబ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారో, ఏ అమెరికాతో చేతులు కలపాలని చూశారో వాటి బ్లాక్‌మెయిల్‌ కారణంగా వ్యతిరేకంగా ఇందిరా గాంధీ రాజకీయంగా వ్యవహరించాల్సి వచ్చింది.
పంచ వర్ష ప్రణాళికలను అమలు జరపలేని స్ధితి, దాంతో 1966 నుంచి మూడు సంవత్సరాల పాటు వార్షిక ప్రణాళికలను రూపొందించాల్సి వచ్చింది. పాలకపార్టీలో ముఠాపోరు ఒకవైపు, ఆర్ధికంగా అనిశ్చితి మరోవైపు, ఈ బలహీనతను ఆధారం చేసుకొని ప్రయివేటు బ్యాంకులు, ప్రయివేటు బీమా సంస్ధలు ప్రభుత్వ విధానాలకు అనుగుణ్యంగా వ్యవహరించటంగాక తమ ఇష్టానుసారంగా వ్యవహరించటం, అక్రమాలకు పాల్పడటం వంటి పరిణామాల నేపధ్యంలో రాజభరణాల రద్దు, బ్యాంకులు, బీమా కంపెనీల జాతీయం వంటి చర్యలతో ఇందిరా గాంధీ తిరిగి ప్రజల మన్ననలను పొందేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో కూడా పట్టు సాధించారు. చివరకు కాంగ్రెస్‌ రెండు ముక్కలుగా చీలిపోవటానికి పరిణామాలు దారి తీశాయి. స్వయం సమృద్ధి నినాదం మరోసారి ముందుకు వచ్చింది.

Indian Banks Nationalisation | Indira Gandhi's bank ...
ముందే చెప్పుకున్నట్లు ప్రపంచ బ్యాంకు చెప్పినట్లు చేసినా ఫలితం లేకపోవటమే కాదు, 1966లో విదేశీ చెల్లింపుల సమస్య మరోసారి ముందుకు వచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకొని ఉపయోగించుకొనేందుకు దెబ్బతిన్న సంబంధాలను మరింతగా దిగజారకుండా చూసుకొనేందుకు, అర్ధిక దిగజారుడును ఆసరా చేసుకొని 1967లో మరోసారి ప్రపంచ బ్యాంకు రంగంలోకి దిగింది. అప్పటికే హరిత విప్లవం ప్రారంభమైంది. దాన్ని ఆసరా చేసుకొని పెట్టుబడిదారీ తరహా వ్యవసాయాన్ని ప్రోత్సహించటం ఒకటైతే దానికి అవసరమైన ఎరువుల రంగంలో విదేశీపెట్టుబడులకు అనుమతి సాధించే ప్రతిపాదనలతో ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది.
ఒక వైపు ప్రపంచ బ్యాంకు వత్తిడికి లొంగి కొన్ని సంస్కరణలు చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ మరోవైపు దాని విధానాలకు వ్యతిరేకంగా స్ధానిక అంశాల కారణంగా 1969లో బ్యాంకుల జాతీయకరణ, 1972లో బీమా కంపెనీలు, 1973లో బొగ్గు, చమురు కంపెనీల జాతీయకరణ వంటి చర్యలను తీసుకుంది. ప్రయివేటు రంగం వైఫల్యం, అవినీతి అక్రమాలు, అవసరాలకు అనుగుణ్యంగా పురోగతి లేకపోవటం వంటి వివిధ కారణాలు ఇందుకు పురికొల్పాయి. ఈ చర్యలతో ఈ రంగాలలో విదేశీ పెట్టుబడులకు దారులు మూసుకుపోయాయి. అయితే ఇదే సమయంలో ఇతర రంగాలలో విదేశీ పెట్టుబడులను ఎలాంటి నియంత్రణ లేకుండా కొనసాగించటం కూడా చూడవచ్చు. ఒక వైపు ఈ చర్యలను జనమంతా హర్షించి కాంగ్రెస్‌, ఇందిరా గాంధీకి జనం బ్రహ్మరధం పట్టినట్లు ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడిన ఇందిరా గాంధీపై కేసులు, కోర్టు తీర్పు ప్రతికూలంగా రావటం వంటి పరిణామాలతో సానుకూల సంస్కరణ వాతావరణం ఉన్నప్పటికీ ఇందిరా గాంధీ తన పదవికోసం 1975లో అత్యవసర పరిస్ధితిని ప్రకటించి సరికొత్త రాజకీయ సంక్షోభానికి కారకురాలయ్యారు.
ఇందిరా గాంధీ-నరేంద్రమోడీని పోల్చటం కాదు, పరిస్దితులు అప్పుడూ ఇప్పుడూ ఒకే విధంగా లేవు గానీ ఒక రాజకీయవేత్త పలుకుబడికి-ఆర్ధిక సంక్షోభాలకు సంబంధం ఉండదు. వారు అనుసరించే ఎత్తుగడలు పలుకుబడిని తెచ్చిపెడితే అనుసరించే విధానాలు సంక్షోభాలకు కారణం అవుతాయి. ఇప్పుడు మన దేశంలో అదే పునరావృతం కానుందా ? ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం నరేంద్రమోడీ వ్యతిరేకులకే కాదు, ఆయన్ను పదికాలాల పాటు కాపాడుకోవాలనే అనుకూలురకు కూడా ఉంటుంది కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా కంపెనీలు : అరచేతిలో వైకుంఠం, అంతా భ్రాంతియేనా !

16 Saturday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

china boycott, China companies to India, coronavirus narendra modi, Make In India

Thousands of Companies from America, Japan and Korea leave China ...

ఎం కోటేశ్వరరావు
కష్ట కాలంలో కడుపు నిండా తిండి పెట్టకపోయినా కడుపు నింపే కబుర్లు చెబితే చాలు. చివరికి ఏమీ జరగకపోయినా ఎవరైనా ఏమి చేస్తారులే, మన ఖర్మ అలా ఉంది అని సర్దుకుపోయే స్ధితిలో మన సమాజం ఉంది. మనిషి ఆశాజీవి కనుక దారీ తెన్నూ కనిపించనపుడు ఏ చిన్న వెలుగు కనిపించినా , ఏ కాస్త శుభవార్త చెప్పినా పోయేదేముంది చూద్దాం అని గుడ్డిగా నమ్మేస్తారు. ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా నుంచి మన దేశానికి వాణిజ్య, పారిశ్రామిక సంస్ధలు ముఖ్యంగా అమెరికాకు చెందినవి తరలి రానున్నట్లు గత కొద్ది రోజులుగా ఊదరగొడుతున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీయే అందుకు తెరలేపారంటే అతిశయోక్తి కాదు. రాబోయే కంపెనీల కోసం ముందుగానే స్ధలాలు, పొలాలను సిద్ధం చేస్తున్నామని, అందరికంటే ముందుగా ఎగిరి అందుకోవటానికి సిద్ధంగా ఉండాలని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సన్నాహాలు చేస్తున్నారు.నమ్మిన వారు కలలు కంటున్నారు. గతంలో నమ్మి దెబ్బతిన్నవారు వెనుకా ముందూ ఆలోచిస్తున్నారు. అనుమానాలను వ్యక్తం చేస్తున్నవారి మీద మీరసలు దేశభక్తులేనా, ఒక వేళ వస్తే గిస్తే మీకేమైనా ఇబ్బందా, చైనాయే అభివృద్ది చెందాలా? మనం వెనుకబడిపోవాలాని అని కొందరు వీరావేశంతో ఎదురు దాడికి దిగుతున్నారు. వారిలో ఒక తెగ వృత్తినటులు, అవసరానికి తగినట్లు తమ నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారు. మరి కొందరు నటీనటుల హావభావాలు, విన్యాసాలకు పడిపోయి నటనే నిజమని భ్రమించి భుజానవేసుకొని వాదించే వారు. అసలు ఏం జరుగుతోంది ?
ఒక వైపు కరోనా వైరస్‌ కారణంగా తమ బతుకులు అతలాకుతలం కావటంతో పరాయి చోట దిక్కులేకుండా పడి ఉండటం కంటే స్వంత ఊళ్లో కడుపులో కాళ్లు పెట్టుకొని ఉండవచ్చని కోట్లాది మంది వలస కార్మికులు ప్రాణాలకు తెగించి వెళ్లిపోతున్నారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. పరిస్ధితులు ఎప్పుడు బాగుపడతాయో, మూతపడిన పరిశ్రమలు తిరిగి ఎన్ని తెరుచుకుంటాయో, వెళ్లిన వారు ఎంతకాలానికి తిరిగి వస్తారో తెలియదు. అందుకే తమ పనులకు అవసరమైన వారిని ఊళ్లకు పంపవద్దని నిర్మాణ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు పాలకులపై వత్తిడి తెస్తున్నారు. కొందరు పరోక్షంగా అందుకు సహకరిస్తే తెగించిన వారికి తెడ్డే లింగం అన్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్డియూరప్ప ఏకంగా బహిరంగంగానే మద్దతు ఇస్తూ శ్రామిక రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించారు. ముది మది తప్పిందా అని పార్టీ పెద్దల నుంచి అక్షింతలు పడటంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారనుకోండి.
ప్రపంచ వ్యాపితంగా కరోనాకు ముందే ఆర్ధిక సంక్షోభ ఛాయలు ముసరటం ప్రారంభమైంది. ఈ ఏడాది ప్రపంచ జిడిపి వృద్ధి రేటు ఎంతశాతమన్నది తప్ప తిరోగమన దిశలోనే ఉండబోతున్నది. కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగులకు మన దేశంలో కూడా పని ఉండదనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇది మన కొనుగోలు శక్తిని మరింత దెబ్బతీస్తుంది. ఇప్పటికే ఉన్న కంపెనీల ఉత్పత్తులనే కొనుగోలు చేసే వారు తగ్గిపోయినట్లు గతంలోనే నివేదికలు వెలువడిన విషయం తెలిసిందే. అలాంటపుడు చైనా, మరొక దేశం నుంచి వచ్చే కంపెనీలు తయారు చేసే వస్తువులను కొనే దెవరు? కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాలతో ఒక వేళ అవి చౌకగా తయారు చేస్తే పోటీకి తట్టుకోలేక ఉన్న కంపెనీలు మూత పడతాయి. సిమెంట్‌ రంగంలో ఏమి జరిగిందో చూశాము. కొత్త కంపెనీలకు ఇచ్చే రాయితీల కోసం పాత కంపెనీలను మూత పెట్టి విలువైన స్దలాలను రియలెస్టేట్‌తో సొమ్ము చేసుకొన్న కంపెనీలు మన కళ్ల ముందే ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో కొత్తగా పెట్టేవైనా, విదేశాల నుంచి వచ్చేవైనా కార్మికులు తక్కువ-యాంత్రీకరణ ఎక్కువ అన్నది తెలిసిందే. అందువలన అవి కొత్త సమస్యలను తీసుకువస్తాయి.

Thousands of companies mull China exit after Covid; India next ...
ఒక వైపు విదేశీ వస్తువులు వద్దు,స్వదేశీయే ముద్దు అనే కొత్త పల్లవిని మన పాలకులు అందుకున్నారు. తెలివి తేటలు ఏ ఒక్కరి సొత్తూ కాదు, చైనా నుంచి అరువు తెచ్చుకొని లేదా అనుకరించి మనం లాక్‌డౌన్‌ అమలు జరిపినట్లే మన స్వదేశీ పిలుపును చూసి ఇతరులూ అమలు జరపరా? ప్రపంచమంతటా కరోనా వైరస్‌ సమస్య ఉంది కదా ! కరోనా లేనపుడే మన మేకిన్‌ ఇండియా పిలుపు దారుణంగా విఫలమైంది, జనం చెవుల్లో కమలం పువ్వులు పెట్టటం గాకపోతే ఇప్పుడు మేకిన్‌ ఇండియా పిలుపు వలన ప్రయోజనం ఏమిటి? దానిలో భాగంగా తయారు చేసే వస్తువులను ఏ దేశానికి ఎగుమతి చేస్తాము? ఇవన్నీ ఆలోచించాలా వద్దా ? దున్న ఈనిందనగానే గాటన కట్టేయమన్నట్లు పాలకులు, వారికి వంత పాడే మీడియా ఏది చెబితే దాన్ని నమ్మటమేనా మన పని ?
గతాన్ని మరచిన జాతికి భవిష్యత్‌ ఉండదు. ఆరు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా తాను పొందిన అనుభవంతో గుజరాత్‌ అభివృద్ది నమూనాను దేశవ్యాపితంగా అమలు జరిపి అభివృద్ధి చేస్తా అన్నారు. మనమంతా నిజమే కదా అనుకున్నాం.తరువాత ఎన్నడైనా దాని గురించి నోరు విప్పారా ? విదేశీ, స్వదేశీ నల్లధనాన్ని వెలికి తీస్తామని, దాన్ని పంచితే ప్రతి ఒక్కరికీ పదిహేనులక్షల వరకు వస్తుందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణా వస్తే ఆంధ్రావారంతా వెనక్కు వెళ్లిపోతారని, హైదరాబాదులో వారు ఖాళీ చేసిన ఇండ్లు (దీనికి ప్రాతిపదిక లేకపోలేదు. నైజాం నవాబు మీద తిరుగుబాటు చేసిన సమయంలో అనేక మంది నవాబు వంశీకులు, ఇతరులు హైదరాబాద్‌, కొన్ని పట్టణాలలోని కొంపా గోడూ, పొలాలు, స్దలాలు వదలి పాకిస్ధాన్‌ లేదా మరోచోటకు పోయారు. ఆ ఆస్ధులను అనేక మంది ఆక్రమించుకున్నారు) తమకు వస్తాయని కొంత మంది భ్రమించినట్లుగా నిజంగానే అంతగాకపోయినా కొంతయినా అందిస్తారని చాలా మంది నమ్మారు, ఆశగా ఎదురు చూశారు అదేమైందో తెలియదు. అసలెంత నల్లధనం వెలికి వచ్చిందో, దానిలో ఖజానాకు ఎంత చేరిందో సంఘపరివార్‌ సామాజిక మాధ్యమ మరుగుజ్జు వీరులు చెబుతారా ?
అధికారానికి వచ్చిన కొత్తలో నరేంద్రమోడీ రకరకాల కొత్త కొత్త కోట్లు వేసుకొని వరుసబెట్టి విదేశీ ప్రయాణాలు చేస్తుంటే నల్లడబ్బు వెలికితీతకేమో అని జనం అనుకుంటే , కాదు, దేశానికి అవసరమైన పెట్టుబడులు తేవటానికని వెంకయ్య నాయుడు వంటి వారు చెప్పారు. నల్లడబ్బూ తేలేదు, అదనంగా విదేశీ పెట్టుబడులూ లేవు, మేకిన్‌ ఇండియా ఎటుపోయిందో తెలియదు. పెద్ద నోట్ల రద్దు నల్లధనం వెలికి తీత, దేశభక్తి అంటే కామోసనుకున్నాం. స్వాతంత్య్రపోరాటంలో జనం బ్రిటీష్‌ వారి తుపాకి తూటాలకు ,లాఠీలకు ఎదురొడ్డి నిలుచున్నట్లుగా కోట్లాది మంది తమ డబ్బు తాము తీసుకొనేందుకు బ్యాంకులు, ఎటిఎంల ముందు వరుసలు కట్టినిలుచున్నారు. పనులతో పాటు కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. నరేంద్రమోడీ ప్రపంచంలో ఎవరూ చేయని పిచ్చి పని చేశారని విమర్శించిన వారిని దేశద్రోహులు అన్నట్లుగా చూశారు. ఇప్పుడు వాటిని గుర్తు చేస్తే కొందరికి ఎక్కడెక్కడో కాలుతోంది నిజమే. మరి ఆ చర్యవలన వచ్చిన ఉపయోగాలేమిటో ఎన్నడైనా మోడీగారు నోరు విప్పి మాట్లాడారా ? విలేకర్లతో మాట్లాడే ధైర్యం ఎలాగూ లేదని తేలిపోయింది. పోనీ కనీసం మన్‌కీ బాత్‌లో అయినా చెప్పారా ? పైన చెప్పినవి, మరి కొన్నింటినీ కలగలిపి జనానికి అచ్చేదిన్‌ తెస్తామని అన్నారు. ఆచరణలో జనాలకు చచ్చే దినాలు వచ్చాయి. అన్నింటా విఫలమైనా ఐదేండ్లలో మోడీ మీద జనాలకు మోజు తీరక, నమ్మకం చావక, ప్రతిపక్షాల మీద విశ్వాసం లేక రెండోసారి మరిన్ని సీట్లు ఇస్తూ ఓటువేశారు.

China's mobile and digital dominance runs deep into Indian economy ...
జరిగిందేమిటి ? నరేంద్రమోడీ ఏలుబడిలో తట్టలోని సంసారం బుట్టలోకి వచ్చింది. దాన్ని దాచి పెట్టేందుకు ఇప్పుడు కరోనాను సాకుగా చూపుతున్నారు. ఆపేరుతో కార్మిక చట్టాలను మార్చేందుకు శ్రమజీవులను మరింతగా కట్టుబానిసలుగా మార్చేందుకు సిద్దం చేస్తున్నారు. ఏ దేశ చరిత్ర చూసినా ఆర్దికంగా సంక్షోభంలో ఉన్న సమయంలోనే దాన్నుంచి బయటపడవేసే సాకుతో, ప్రజా, కార్మిక వ్యతిరేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడూ జరుగుతోంది అదే. జనానికి జ్ఞాపకశక్తి తక్కువ గనుక గతంలో విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తామని ఎలా ఊరించారో ఇప్పుడు చైనా నుంచి ఫ్యాక్టరీలను తెస్తామని అంతకంటే ఎక్కువగా నమ్మబలుకుతున్నారు. దీని గురించి ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే అసలు మీరు దేశభక్తులేనా, చైనా నుంచి ఫ్యాక్టరీలు రావటం ఇష్టం లేదా అని ఎవరైనా అడ్డుతగలవచ్చు. చైనా నుంచే కాదు, యావత్‌ దేశాలలో ఇంకా మిగిలి ఉన్న ఫ్యాక్టరీలు, సంస్దలన్నీ వచ్చినా సంతోషమే.
నిద్రిస్తున్న మహా దేశం మేలుకొంటోంది, చైనా నుంచి వచ్చే ఫ్యాక్టరీలకు స్వాగతం పలికేందుకు రాష్ట్రాలు సిద్ధం కావాలని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యమంత్రులకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. అమెరికా-చైనాల మధ్య తలెత్తిన వాణిజ్యం యుద్దం, కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్ధితుల నేపధ్యంలో చైనా నుంచి కంపెనీలు రావాలనుకుంటున్నాయని వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల వంటివి కల్పిస్తే చైనాకు తగిన ప్రత్యామ్నాయం అవుతామని ప్రధాని చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. ఏ దేశానికి ఆదేశం మరొక దేశంతో పోటీబడి అభివృద్ది చెందితే అభ్యంతరం ఎవరికి ఉంటుంది. ఎదుటివారిని దెబ్బతీసి మనం లాభపడాలనుకుంటే ఎదుటి వారు కూడా మన గురించి అదే అనుకుంటారు అని గ్రహించటం అవసరం.
మనమహాదేశం మోడీ అధికారానికి వచ్చిన ఆరుసంవత్సరాల పాటు నిద్రలో ఉండటానికి కారణం ఎవరు? పోనీ దానికి కారణం కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలే అని అంగీకరిద్దాం. యాభై సంవత్సరాల పాటు కాంగ్రెస్‌ చేసిన తప్పిదాలను కేవలం ఐదు సంవత్సరాలలో సరిదిద్దామని చెప్పుకున్నవారు, దేశాన్ని నిద్రలేపటానికే ఆరు సంవత్సరాల వ్యవధి తీసుకుంటే, దాన్ని నడిపించటానికి ఎన్ని ఆర్లు కావాలి ? ఇలాంటి కబుర్లు గతంలోనే చాలా చెప్పారు. జరిగిందేమిటి ?
ఏప్రిల్‌ 22నాటి బిజినెస్‌ టుడే వార్త ప్రకారం వెయ్యి విదేశీ కంపెనీలు ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నాయని కనీసం 300 సంస్ధలను రప్పించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఒక అధికారి చెప్పినట్లుగా ఉంది. పోనీ ఇవన్నీ చైనా నుంచే వస్తాయని అనుకుందాం. అసలు చైనాలో ఉన్న విదేశీ కంపెనీలు ఎన్ని ? 2012లో 4,36,800 ఉండగా 2018లో 9,61,000 ఉన్నాయి. తరువాత పెరిగినా తరిగినా మొత్తం మీద స్ధిరంగా ఉన్నాయని అనుకుందాం. వీటిలో వెయ్యి కాదు మన మోడీ ఎంతో పలుకుబడి గలవారు గనుక మరో పది వేల కంపెనీలను రప్పించినా మన దేశం మరొక చైనా మాదిరి తయారవుతుందా ? చైనా దెబ్బకు అంత పెద్ద అమెరికాయే గిలగిల్లాడుతుంటే మనం తట్టుకోగలమా ? మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి ? గతంలో గ్రామాల్లో బుర్రకథలు చెప్పేందుకు వచ్చిన వారు గ్రామీణులను ఉబ్బించి ఎక్కువ బహుమతులను రాబట్టుకొనేందుకు వెళ్లిన ప్రతి ఊరిలో మీ గ్రామం చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు పోతుగడ్డ అని చెప్పేవారు. మన దేశం, రాష్ట్రాల గురించి అలాగే ఉబ్బవేస్తుంటే నిజమే అనుకుంటున్నారు.
చైనా కంపెనీలు విదేశాలకు పోక, మన దేశానికి రాక గురించి ఊరించటం కొత్త కాదు.చైనాలో వేతన ఖర్చు క్రమంగా పెరుగుతున్న కొద్దీ అంతకంటే తక్కువ ఖర్చయ్యే దేశాల గురించి వెతుకులాట గత ఐదు సంవత్సరాల నుంచి పెరుగుతోంది.2016-17 మన ఆర్ధిక సర్వేలో ” చైనాలో పెరుగుతున్న వేతన ఖర్చు కారణంగా దుస్తులు, తోళ్లు, పాదరక్షల తయారీ రంగాలలో ఉత్పత్తుల మార్కెట్లలో చైనా వాటా స్ధిరపడటం లేదా తగ్గుతున్న నేపధ్యంలో ఈ రంగాలను ప్రోత్సహించటానికి మన దేశానికి అవకాశం వచ్చింది. చైనాతో పోల్చితే భారత్‌లోని అత్యధిక రాష్ట్రాలలో వేతన ఖర్చు తక్కువగా ఉంది. చైనా నుంచి తరలిపోయిన వాటిలో వేగంగా దుస్తుల రంగం బంగ్లాదేశ్‌, వియత్నాంకు తరలిపోయింది. తోళ్లు,పాదరక్షల రంగం వియత్నాం, ఇండోనేషియాకు పోయింది. మన దేశంలోని దుస్తుల కంపెనీలు కూడా బంగ్లాదేశ్‌, వియత్నాం, మయన్మార్‌, చివరికి ఇథియోపియాకు కూడా తరలిపోతున్నాయి” అని పేర్కొన్నారు. మొన్నటికి మొన్న అంటే తాజా ఆర్ధిక సర్వేలో చైనా తరహా అభివృద్ది, ఆకర్షణ గురించి పేజీలకు పేజీలే రాసుకున్నాం. నిజానికి దానికీ కరోనాకు అస్సలు సంబంధమే లేదు. నాలుగేండ్ల నాటికి ఇప్పటికీ జరిగిన పెద్ద మార్పు ఏమిటో ఎవరైనా చెప్పగలరా ?
తమ రాష్ట్రాలలో ఏర్పాటు చేసే సంస్దలలో మెజారిటీ ఉద్యోగాలను స్ధానికులకే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాలు చట్టాలను చేశాయి. దీని మీద దేశీయంగా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. తమ కంపెనీలలో తాము ఎంపిక చేసుకున్న సిబ్బందినే పెట్టుకోవాలని కోరుకొనే కంపెనీలకు ఈ చట్టాలు ఆటంకంగానే కనిపిస్తాయి. ఇలాంటి చట్టాలను చేసిన రాష్ట్రాలు గానీ చేయని రాష్ట్రాలకు గానీ విదేశీ పెట్టుబడులు, సంస్ధలను ఆకర్షించటంలో పెద్ద తేడా కనిపించటం లేదు. గత మూడు సంవత్సరాలలో కొత్త కంపెనీల తీరుతెన్నులను చూసినపుడు పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. ఈ స్ధితిలో ఉన్న కంపెనీలు తమ సామర్ధ్యాన్ని పెంచుకొనేందుకు లేదా అదనపు సిబ్బందిని నియమించేందుకు ముందుకు రావటం లేదు. ఈ స్ధితిలో కొత్తగా వచ్చే కంపెనీలకు మన దేశంలో కనిపించే ఆకర్షణలు ఏమిటి ?
చైనా నుంచి వస్తాయని చెబుతున్న కంపెనీలలో ఎక్కువ భాగం అమెరికాకు చెందినవిగా చెబుతున్నారు. అవే ఎందుకు ఆసక్తి కనపరుస్తున్నాయి? ఒక వైపు ట్రంప్‌ అమెరికాలో పెట్టుబడులు, పరిశ్రమల స్ధాపనకు విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాడు. చైనా మీద ఆధారపడిన కారణంగానే అమెరికాలో ఇబ్బందులు తలెత్తాయన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అలాంటపుడు చైనాలోని అమెరికా కంపెనీలు తమ దేశానికి పోకుండా మన దేశానికి ఎందుకు రావాలని కోరుకుంటున్నాయి. వాటికి దేశభక్తి లేదా ? మన దేశాన్ని ఉద్దరించాలనే సదాశయంతో వస్తున్నాయా ? 2018 నుంచి డోనాల్డ్‌ ట్రంప్‌ చైనాతో వాణిజ్య యుద్ధం చేస్తున్నాడు. చైనాలోని అమెరికన్‌ కంపెనీలు తయారు చేసే వస్తువులను కూడా చైనావిగానే పరిగణించి వాటి మీద దిగుమతి పన్ను విధిస్తున్నాడు. అమెరికా దేశభక్త కంపెనీలు ఆ పన్ను భారాన్ని తాము భరించాలా లేక తమ దేశ వినియోగదారుల నుంచి వసూలు చేయాలా అనే సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఒక వేళ చైనా మరిన్ని ప్రతీకార చర్యలకు పూనుకుంటే తాము ముందు బలౌతామనే భయం అమెరికన్‌ కంపెనీల్లో కలుగుతోంది. దీనికి తోడు వేతన పెరుగుదల వంటి అంశాలు, చైనా సుంకాలను పెంచితే గిట్టుబాటు కావనే దిగులు, ఇలా అనేక అంశాలను గమనంలో ఉంచుకొని ముందుగానే జాగ్రత్త పడితే మంచిదనే ఆలోచనతో కూడా కొన్ని కంపెనీలు తరలిపోవాలనే ఆలోచనలు చేస్తున్నాయి.

Why Companies Shift From China To Vietnam More Than
అయితే అసలు చైనా నుంచి విదేశీ కంపెనీలు తరలిపోవటం లేదా ? లేదని ఎవరు చెబుతారు ?లాభాల కోసం తమ స్వంత దేశాలను వదలి చైనా వచ్చిన కంపెనీలు మరొక దేశంలో లాభం ఎక్కువ వస్తుందనుకుంటే అక్కడికి తరలిపోవటంలో ఆశ్చర్యం ఏముంది. పెట్టుబడి లక్షణమే అది. పెట్టుబడులను ఆకర్షించేందుకు మోడీ సర్కార్‌ అనేక చర్యలు తీసుకుంది, రాయితీలు ప్రకటించింది, కార్మిక చట్టాలను నీరుగార్చింది. సులభతర వాణిజ్యం ర్యాంకులో ముందుండటం కోసం పోటీ పడుతోంది. అయినా ఆకర్షణ కలగటం లేదు.2018 ఏప్రిల్‌ నుంచి 2019 ఆగస్టు వరకు 56 చైనా కంపెనీలు అక్కడి నుంచి బయటకు వచ్చాయి. వాటిలో 26 వియత్నాంకు,11 తైవాన్‌కు, 8 థారులాండ్‌కు తరలిపోగా మన దేశానికి మూడు, ఇండోనేషియాకు రెండు వెళ్లాయని జపనీస్‌ సంస్ధ నొమురా నివేదించింది. అంతెందుకు సిఎన్‌బిసి అనే అమెరికన్‌ టీవీ మే 14న ప్రసారం చేసిన ఒక సమీక్షలో చైనా నుంచి ఎలా తరలిపోవాలా అని కంపెనీలు చూస్తుంటే మరోవైపు ఎక్కువ విలువ కలిగిన వస్తు తయారీకి చైనా సాంకేతిక రంగం మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందని ఎర్నెస్ట్‌ అండ్‌ ఎంగ్‌ కంపెనీ ఆసియాపసిఫిక్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ పాట్రిక్‌ వింటర్‌ చెప్పారు. చైనాలో వేతన ఖర్చులు పెరగటం, అమెరికాతో వాణిజ్య యుద్దం కారణంగా చాలా కాలం నుంచి కంపెనీలు తరలిపోయే ఆలోచన చేస్తున్నాయన్నారు. బమ్మలు,కెమెరాల తయారీ మెక్సికోకు, పర్సనల్‌ కంప్యూటర్లు తైవాన్‌కు, ఆటోమోటివ్‌ కంపెనీలు థారులాండ్‌, వియత్నాం,భారత్‌కు తరలుతున్నాయని చెప్పారు. అంటే మనం కూడా మిగతాదేశాల్లో ఒకరం తప్ప చైనా కంపెనీలన్నీ ఏకంగా మన ఒళ్లో వచ్చి వాలిపోవటం లేదు.
సామాజిక మాధ్యమంలో మరుగుజ్జులు వేసే జిమ్మిక్కులు నిజమే అని నమ్మే జనం గణనీయంగా ఉన్నారు. అలాంటి ఒక పోస్టు ప్రస్తుతం వాట్సాప్‌లో తిరుగుతోంది. నిన్న నోయిడా వ్యాపారులు 150 మిలియన్‌ డాలర్ల చైనా ఆర్డర్‌ను రద్దు చేశారని దేశం మొత్తం నుంచి రెండు బిలియన్‌ డాలర్ల మేరకు రద్దు చేసి అనధికారికంగా చైనాను కాళ్లబేరానికి తెచ్చారని, గత సంవత్సరం దీపావళికి చైనా లైట్లను కొనుగోలు చేయనందున చైనా వస్తువులు 20శాతం నాశనం అయ్యాయని, అదే మొత్తం 62బిలియన్‌ డాలర్ల ఆర్డర్లు రద్దు చేస్తే ఏమౌతుందో చూడండి.90 రోజులు ఏ విదేశీ వస్తువులు కొనకండి, డాలరుతో రూపాయి మారకపు విలువ రెండు రూపాయలకు సమానం అవుతుంది అంటూ ఆ పోస్టు మహా రంజుగా సాగింది. చదివిన వారు లొట్టలు వేసుకుంటూ ఇతరులకు పంపుతున్నారు.
ఈ పోస్టులో నిన్న నోయిడా అంటే అది 2016 అక్టోబరు 13వ తేదీనాటి హిందూస్దాన్‌ టైమ్స్‌ వార్త. ఆ తరువాత మన దేశం చైనా నుంచి దిగుమతులను పెంచుకుందే తప్ప ఏమాత్రం తగ్గించలేదు. అంటే అనుమతించిన పాలకులు, దిగుమతి చేసుకున్న వ్యాపారులను దేశభక్తులనాలా, దేశద్రోహులనాలా ! ఇలాంటి పోసుకోలు కబుర్లు, పగటి కలలతో జనాన్ని ఎంతకాలం మభ్యపెడతారు. నరేంద్రమోడీ గారి ఏలుబడి తొలి ఏడాది 2014-15లో డాలరుతో రూపాయి సగటు మారకపు విలువ 61.14 ఉంటే ఇప్పుడు 75 రూపాయలు నడుస్తోంది. తిరిగే చక్రం మీద కూర్చున్న ఈగ తానే చక్రాన్ని నడుపుతున్నట్లు కలగంటుందట. మనం వస్తువులు కొనుగోలు చేయకపోతే చైనా కాళ్ల బేరానికి వస్తుంది, కుప్పకూలిపోతుంది అన్నది కూడా ఈగ బాపతే. 2019లో చైనా నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకున్న తొలి పదిహేను దేశాలలో మూడు శాతంతో మనది ఏడవ స్ధానంలో వుంది. అంటే మిగిలిన దేశాలన్నీ 97శాతం వాటా కలిగి ఉన్నాయి. మన మూడుశాతం నిలిపివేస్తే చైనాకు వచ్చే నష్టం ఏముంటుంది? అగ్రస్ధానంలో ఉన్న అమెరికాకు చైనా 16.8శాతం ఎగుమతి చేస్తోంది. అలాంటి దేశ అధ్యక్షుడు ట్రంప్‌ను చైనీయులు మూడు చెరువుల నీరు తాగించి తమ కాళ్ల బేరానికి తెచ్చుకుంటున్నారు. ఇక మన దేశ వాణిజ్య భాగస్వాములలో చైనా 2019లో 5.08శాతంతో మూడవ స్ధానంలో ఉంది. తొలి రెండు స్ధానాలలో అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఏమిరేట్స్‌ ఉన్నాయి. చైనా ఎగుమతి చేసే వందలో మూడు వస్తువులను మనం తెచ్చుకుంటుంటే, మనం ఎగుమతి చేసే వందలో చైనా ఐదింటిని తీసుకొంటోది. పరిస్ధితి ఇలా ఉంటే మనం చైనాను కాళ్లబేరానికి తెచ్చుకోవటం ఏమిటి? మతి ఉండే ఆలోచిస్తున్నామా ? మన ఘనమైన సంస్కృతి ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెప్పింది తప్ప దురహంకారానికి లోను కమ్మని చెప్పలేదు.

Foreign companies are coming to India leaving China, will settled ...
బాధ్యత కలిగిన వారెవరైనా వెనుకా ముందూ చూసుకోవాలి, చర్యకు ప్రతి చర్య పర్యవసానాల గురించి ఆలోచించకుండా ముందుకు పోతే గోతిలో పడతారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో విదేశీమారక ద్రవ్యం గణనీయంగా ఉన్న తొలి పది దేశాలలో మనది ఐదవ స్ధానం. అయితే తొలి స్ధానంలో ఉన్న చైనా దగ్గర 3,091, దాని ఏలుబడిలోని హాంకాంగ్‌లో 441, మకావులో 22 అంటే మొత్తం చైనా దగ్గర 3,554 బిలియన్‌ డాలర్లు ఉంటే, మన దగ్గర 485 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. మన దేశం అక్కడి పరిశ్రమలను ఆహ్వానించి చైనాతో వాణిజ్య యుద్దానికి దిగితే ఏమి జరుగుతుందో ఆలోచించుకోవాలి. మన దేశానికి చెందిన నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన ఆర్ధికవేత్త అభిజిత్‌ ముఖర్జీ మే 12న ఒక బెంగాలీ టీవీతో మాట్లాడుతూ ఒక వేళ చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే ఏం జరుగుతుంది ? దాని వస్తువుల ధరలు తగ్గుతాయి, జనాలు వాటినే కొంటారు అన్నారు. ఆలా చెప్పిన ఆయన దేశభక్తుడు కాదా ?
ఒక దేశ జీవన ప్రమాణాలకు తలసరి జిడిపి ఒక గీటు రాయి. 2019లో చైనాలో పదివేల డాలర్లకు పైబడితే మన దేశంలో రెండువేల డాలర్లు. అందువలన చైనాను మిగతా దేశాలు ఇబ్బందుల పాలు చేసినా తాను తయారు చేసిన వస్తువులను తన ప్రజలకే విక్రయించి తన కాళ్లమీద తాను నిలబడగదు. 2008 తరువాత ధనిక దేశాల్లో సంక్షోభం కారణంగా దాని ఎగుమతి ఆధారిత వ్యవస్ధకు ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఆ మేరకు తన అంతర్గత వినియోగాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకొని వాటి నుంచి కాచుకుంది.మనం అటువంటి స్ధితిలో ఉన్నామా ?
చైనాలో ఉన్నది కమ్యూనిస్టు నియంతృత్వం అని ఒక పాటపాడతారు. ప్రపంచ పెట్టుబడిదారులు మరి అక్కడకు ఎందుకు వెళుతున్నట్లు ? ప్రపంచ దేశాలన్నీ దాని నేతలను ఎందుకు ఆహ్వానిస్తున్నట్లు ? నిన్నగాక మొన్న చైనా జింపింగ్‌ను మోడీ గారు రావయ్యా జింపింగూ అజెండా ఏమీ లేదు గానీ మంచి చెడ్డలు మాట్లాడుకుందాం రమ్మని మహాబలిపురానికి ఎందుకు ఆహ్వానించినట్లు ? మోడీ గారు చైనా ఎందుకు వెళ్లినట్లు ? ప్రపంచంలో కమ్యూనిస్టులు లేని దేశాల్లో నియంతలు ఎందరో ఉన్నారు. మరి అక్కడికి పెట్టుబడులు ఎందుకు వెళ్లటం లేదు ? మన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది కనుక చైనా మాదిరి మనం అభివృద్ది చెందలేమని మరొక ముక్తాయింపు. అదే తర్కానికి కట్టుబడితే చైనా నుంచి కంపెనీలు వచ్చినా మనం ఎలా అభివృద్ధి చెందగలం ?
ఒక దేశంతో మరొక దేశం పోల్చుకోవటం అసంబద్దం. దేనికి ఉండే అనుకూల ప్రతికూలతలు దానికి ఉంటాయి. అందువలన అభివృద్ధి మార్గం కూడా భిన్నంగానే ఉండాలి తప్ప మరొక దాన్ని అనుసరించటం, అనుకరించటం వలన ప్రయోజనం ఉంటుందా ? ఆ రీత్యా చూసినపుడు మన భారతీయ విధానాలను అభివృద్ధి చేసుకోకుండా చైనాను అనుకరించటం భారతీయత ఎలా అవుతుంది. అసలు సిసలు దేశభక్తులం అని చెప్పుకొనే వారు ఆలోచించాలి మరి. చైనా అభివృద్ధి చైనా కమ్యూనిస్టు పార్టీ విధానాల కారణంగానే సాధ్యమైంది. మన దేశం అభివృద్ధి గాకపోవటానికి కాంగ్రెస్‌-బిజెపి వాటి విధానాలకు మద్దతు ఇచ్చే పార్టీలే కారణం. కమ్యూనిస్టులకు అధికారం ఉంటే కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో కమ్యూనిస్టుల ప్రత్యేక ఏమిటో మన దేశంలో కేరళ, ప్రపంచంలో చైనా, వియత్నాం, క్యూబా, ఉత్తర కొరియా వంటి దేశాలు నిరూపించాయి.
ప్రపంచంలో గత కొద్ధి సంవత్సరాలుగా దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితిని కరోనా వైరస్‌ తాత్కాలికంగా అయినా మరింతగా దిగజార్చనుంది. గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్ద(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకు చెప్పిన అనేక జోశ్యాలు, చూపిన రంగుల కలలు కల్లలయ్యాయి. అయినా అవి తప్ప మరొక ప్రత్యామ్నాయం లేనందున అవి చెప్పిన అంశాల ప్రాతిపదికనే అయితే, గియితే అనే షరతులు, హెచ్చరికలతో చర్చించుకోక తప్పటం లేదు.

COVID-19 and the new coronavirus: Fact versus fiction - COVID-19 ...
ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం 2020-21లో మన జిడిపి వృద్ధిరేటు 0.5శాతమే. మరొక అంచనా ప్రకారం 2020లో 1.9శాతం, ఇంకో అంచనా మైనస్‌ మూడుశాతం. ఇవన్నీ లాక్‌డౌన్‌కు ముందు, కొనసాగుతున్న సమయంలో వెలువడిన అంచనాలు. ఎంతకాలం కొనసాగుతుంది, ఆర్ధిక కార్యకలాపాలు తిరిగి ఎపుడు, ఎలా ప్రారంభం అవుతాయి అనేదాని మీద ఈ అంకెల్లో, వాస్తవంలో మార్పులు ఉంటాయి. ఈ నేపధ్యంలో చైనా నుంచి కంపెనీలు రావటం అంటే ఏటిఎంలో కార్డు పెట్టి వెంటనే నగదు తీసుకున్నంత సులభం కాదని గ్రహించాలి. అక్కడ 1978 నుంచి అనుసరించిన విధానాలు జిడిపిలో అమెరికాకు ధీటుగా చైనాను ముందుకు తెచ్చింది. తాము ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నామని, అందువలన మరింత అభివృద్ధి చెందేందుకు సంస్కరణలను కొనసాగిస్తామని, పెట్టుబడులకు మరిన్ని అవకాశాలిస్తామని చైనా ప్రకటించింది. అంతే కాదు, 1970దశకం వరకు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ సంస్ధలకు దూరంగా ఉంచిన అమెరికా, ఇతర దాని మిత్ర దేశాల మెడలు వంచి ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యరాజ్యమైంది. తరువాత ప్రపంచ వాణిజ్య సంస్ధలో అడుగుపెట్టి తన ఎగుమతి అవకాశాలను పెంచుకుంది.2049 నాటికి చైనాలో పూర్తిగా విలీనం కావాల్సిన హాంకాంగ్‌, మకావు దీవుల్లో పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగిస్తామని, అక్కడి ప్రయివేటు పెట్టుబడులకు రక్షణ కల్పిస్తామని చైనా హామీ ఇవ్వటం ప్రపంచ పెట్టుబడిదారుల్లో పెద్ద విశ్వాసాన్నిచ్చింది.స్ధిరమైన ప్రభుత్వం, స్ధిరమైన విధానాలను కొనసాగించటమే చైనా విజయ రహస్యం.ఆ కృషి వెనుక ఉన్న స్ధిరమైన విధానాలు ప్రపంచ పెట్టుబడిదారులను చైనా బాట పట్టించాయని అంగీకరిస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా అల్లిన 24 అబద్దాలు- చైనా చెప్పిన 24 నిజాలు !

12 Tuesday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Politics, USA

≈ 1 Comment

Tags

#US Lies, 24 American lies, 24 American lies- Chinese 24 truths, 24 ‘lies’ by US over Covid-19, Chinese 24 truths, COVID-19

Rob Rogers on Twitter: "Lies cartoon: https://t.co/SamLHmQDgA ...
ఎం కోటేశ్వరరావు
అగ్రరాజ్యం అమెరికా. దాని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. అమెరికా లేదా ప్రపంచ చరిత్రలో ఒక దేశాధిపతిగా ట్రంప్‌ మాట్లాడినన్ని అబద్దాలు మరొకరు మాట్లాడి ఉండరు. ఎన్ని అబద్దాలు చెబితే అంత బలం వస్తుందన్న నమ్మకం ఉన్న వ్యక్తిగా ఇప్పటికే విశ్లేషకులు తేల్చివేశారు. నోరు తెరిచి నాలుగు అంశాలు చెబితే వాటిలో మూడు పాక్షిక లేదా పూర్తి అబద్దాలే. అలాంటి వ్యక్తి, ఆయన యంత్రాంగం కరోనా వైరస్‌ గురించి అనేక కట్టుకథలు సృష్టించటం, వాటిని మీడియా ద్వారా ప్రచారంలో పెట్టటం తెలిసిందే. అనేక మంది తాము తటస్ధులం అని చెప్పుకుంటారు. ట్రంప్‌ అబద్దాల కోరని అంగీకరిస్తారు, అదే సమయంలో ఆ నోటి నుంచి లేదా సిఐఏ ఇతర కట్టుకథల ఫ్యాక్టరీల నుంచి వెలువడే అబద్దాల ఉత్పత్తులను ఉపయోగించుకొని ఏక పక్షంగా మరో దేశం మీద దాడి చేస్తారు. వీరిలో ఒక రకం తమకు తెలియకుండానే ప్రచార సమ్మోహన అస్త్రానికి పడిపోయిన వారు, రెండవ తరగతి అన్నీ తెలిసి కూడా రాళ్లేసే రకం. గతంలో ప్రచ్చన్న యుద్దం పేరుతో సోవియట్‌ యూనియన్‌, తూర్పుఐరోపా సోషలిస్టు వ్యవస్ధలకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం గురించి తెలిసిందే. ఇప్పుడు కరోనా వైరస్‌ సందర్భంగా అదే రకమైన ఏకపక్ష దాడి ప్రారంభమైంది. అమెరికా పాటపాడితే కొన్ని దేశాలు గొంతు కలుపుతున్నాయి, మరికొన్ని పక్కవాద్యాలు వాయిస్తున్నాయి.
తెలుగు మీడియా ఇచ్చే అంతర్జాతీయ వార్తలన్నీ అమెరికా, ఐరోపా దేశాల అదుపులో ఉండే వార్తా సంస్ధల నుంచి తీసుకుంటున్నవే. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించి రాసేవారు, చూపే వారు పోటీపడుతున్నారు. ఎంత సంచలనాత్మకంగా ఉంటే అంతకిక్కు, అంత రేటింగ్‌ ఉంటుంది మరి. దిగువ అంశాలు చైనా వార్తా సంస్ధ గ్జిన్హువా విడుదల చేసిన సమాచారం ఆధారంగా రాస్తున్నవే. నిడివి పెద్దది కాకుండా చూడటం కోసం సంక్షిప్తీకరించి ఇస్తున్నాను. దీనిలో 24 అంశాలపై తమ మీద వేస్తున్న అభాండాలు, చేస్తున్న అబద్ద ప్రచారం ఏమిటో చెబుతూనే దానికి సమాధానాలు ఇచ్చారు. అయినా దీన్ని ఏకపక్ష ప్రచారం అని ఎవరైనా అనుకుంటే అది వారి విజ్ఞతకే వదలి వేద్దాం. చైనా తాను చెప్పిన సమాధానాలకు, వివరణలకు, విమర్శలకు ఆధారాలతో సహా ఇచ్చింది. పాఠకుల సౌకర్యం, విశ్వసించని వారి నిర్ధారణ కోసం ఆ లింక్‌ను కూడా దిగువ ఇస్తున్నాను.
ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలియనంత కాలం జనం మోసపోతూనే ఉంటారని కమ్యూనిస్టు లెనిన్‌ చెప్పారు. ఆయన పుట్టక ముందే అమెరికా అధ్యక్షుడిగా పని చేస్తూ హత్యకు గురైన అబ్రహాం లింకన్‌ మరో విధంగా చెప్పారు. ఎవరైనా జనం మొత్తాన్ని కొంతకాలం, కొంత మందిని కొంతకాలమే వెర్రి వెంగళప్పలను చేయగలరు గానీ అందరినీ, ఎల్లవేళలా చేయలేరు అన్నారు. వెలుగు వచ్చేకొద్దీ చీకటి పారిపోతుంది, అబద్దాలు కూడా కూడా నిజం రానంతవరకే అది పెత్తనం చేస్తాయని పెద్దలు ఏనాడో చెప్పారు. ఇక ఆరోపణలు, వాటి మీద చైనా వార్తా సంస్ధ సమాధానాల సారాంశం చూద్దాం.
1.ఆరోపణ: కోవిడ్‌-19 అనేది చైనా లేదా ఊహాన్‌ వైరస్‌.
వాస్తవం : ఒక వ్యాధి పేరులో ప్రతికూల ప్రభావం చూపే అంటే అనవసరమైన భయాలు కలిగించే విధంగా ఒక ప్రాంతం, దేశం, ఆహారం, సంస్కృతి, జనాభా, పరిశ్రమ, వృత్తి లేదా జంతుజాతి పేరు ఉండకూడదని 2015 మే ఎనిమిదవ తేదీ ఐక్యరాజ్యసమితి సంస్ధలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. అంతకు ముందే కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ 2012లో తలెత్తిన ”మెర్స్‌” మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) పేరు మీద తలెత్తిన పరిస్ధితిని సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణ్యంగానే 2020 ఫిబ్రవరి 11న నోవెల్‌ కరోనా వైరస్‌ కారణంగా తలెత్తే న్యూమోనియా వ్యాధికి కరోనా వైరస్‌ డిసీజ్‌ 2019(కోవిడ్‌-19) అని పేరు పెట్టారు. అయితే బ్రిటీష్‌ సైన్స్‌ పత్రిక ఏప్రిల్‌ నెలలో ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘించి రాసిన సంపాదకీయాలలో కోవిడ్‌-19ను చైనా మరియు ఊహాన్‌తో జతచేసి ప్రస్తావించి తదుపరి క్షమాపణ చెప్పింది. బిబిసి, న్యూయార్క్‌ టైమ్స్‌, అమెరికన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ(ఏబిసి) వంటివి ఆసియా వాసులతో సంబంధాన్ని అంటగట్టి వార్తలను ప్రచారం, ప్రసారం చేయటంతో పశ్చిమ దేశాలలో ఆసియా వ్యతిరేకత, జాత్యంహాకార ధోరణులతో ఆసియా ఖండ పౌరులను వేధించిన ఉదంతాలు జరిగాయి.
2. ఆరోపణ: వైరస్‌ ఊహాన్‌లోనే పుట్టింది.
వాస్తవం: వైరస్‌ తొలిసారి ఊహాన్‌లో బయటపడినంత మాత్రాన అది అక్కడే పుట్టిందని అర్ధం కాదు, శాస్త్రవేత్తలు దాన్ని ఇంకా గుర్తించలేదు. ఉదాహరణకు ఎయిడ్స్‌ వ్యాధిని తొలుత అమెరికాలో గుర్తించారు. అది అక్కడ పుట్టింది కాకపోవచ్చు. అలాగే స్పానిష్‌ ఫ్లూ స్పెయిన్‌లో పుట్టలేదు అనేందుకు అనేక ఆధారాలు దొరికాయి. ఎక్కడ నుంచి తలెత్తిందన్నది శాస్త్ర అంశం. జనవరి 24న బ్రిటీష్‌ వైద్య పత్రిక లాన్‌సెట్‌లో ప్రచురితమైన విశ్లేషణలో డిసెంబరు 16 నుంచి జనవరి రెండవ తేదీ వరకు ఊహాన్‌ నగరంలో నిర్ధారణ అయిన 41కరోనా కేసులలో 27 మందికి ఊహాన్‌ సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లో సోకినట్లు తేలింది, మిగిలిన వారికి వేరే ప్రాంతాలలో సోకింది. తొలి రోగిని డిసెంబరు ఒకటవ తేదీన గుర్తించారు. అతనికీ మార్కెట్‌కు ఎలాంటి సంబంధం లేదు, కుటుంబ సభ్యులకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తలేదు. అతని నుంచి ఇతరులకు వ్యాపించిందనే ఆధారాలు దొరకలేదు. వైరస్‌ ఎక్కడ ఉద్బవించింది అనే అంశంలో అమెరికా నుంచి తమ సంస్ధకు ఎలాంటి సమాచారం లేదా నిర్ధిష్ట రుజువులు అందలేదని మే ఒకటవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ అత్యవసర కార్యక్రమాల డైరెక్టర్‌ డాక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ చెప్పారు. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని బెలెవిలే మేయర్‌ మైఖేల్‌ మెల్‌హామ్‌ తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఇదే వైరస్‌తోనే తాను 2019నవంబరులో కూడా అస్వస్తతకు గురై ఉండవచ్చని చెప్పారు. అంటే అది అమెరికాలో బయటపడిన తొలి కేసు జనవరి 20కి రెండునెలల ముందునాటి సంగతి. మే ఆరవ తేదీన యుఎస్‌ఏ టుడే వెల్లడించిన సమాచారం ప్రకారం ఫ్లోరిడాలో జనవరి ప్రారంభంలోనే 171 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి, అయితే వారెవరూ చైనాకు ప్రయణించిన వారు కాదు.
మే మూడవ తేదీన యాంటీమైక్రోబియల్‌ ఏజంట్స్‌ అనే అంతర్జాతీయ పత్రికలో ప్రచురించిన వ్యాసంలో 2019 డిసెంబరు చివరి నుంచే సారస్‌-కోవ్‌-2 వైరస్‌ ఫ్రాన్స్‌లో వ్యాప్తి చెందినట్లు పేర్కొన్నారు. డిసెంబరు రెండు నుంచి జనవరి 16వరకు ఫ్లూ లక్షణాలతో ఐసియులో చికిత్స పొందిన 14 మందికి ఏప్రిల్‌ ఆరు-తొమ్మిదవ తేదీల మధ్య ఆర్‌టి-పిసిఆర్‌ పరీక్ష చేశారు.వారిలో 42ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ బయటపడింది. అయితే అతనేమీ ఇటీవలి కాలంలో చైనా లేదా మరో విదేశీ ప్రయాణం చేయలేదు.

Political cartoons: Donald Trump blasts Google
3. ఆరోపణ: వైరస్‌ను ఊహాన్‌ వైరాలజీ సంస్ధలో తయారు చేశారు
వాస్తవం: అందుబాటులో ఉన్న రుజువులన్నీ సహజంగానే పుట్టినట్లు చూపుతున్నాయి. కృత్రిమంగా తయారు చేసింది కాదు. జనవరి 30వ తేదీ లాన్‌సెట్‌ వైద్య పత్రిక వ్యాసం ప్రకారం మిగతా వైరస్‌లతో పోల్చితే గుడ్లగూబల నుంచే వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19వ తేదీన ఎనిమిది దేశాలకు చెందిన 27 మంది ప్రముఖ నిపుణులు చేసిన ప్రకటనలో కరోనా వైరస్‌ మిగతా వాటి మాదిరే వన్య ప్రాణుల నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. మార్చి 17న అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాలకు చెందిన ఐదుగురు ప్రముఖ నిపుణులు వైరస్‌ను ప్రయోగశాలలో తయారు చేయలేదని, పని గట్టుకొని వ్యాపింప చేయలేదని తెలిపారు. మార్చి 26న అమెరికా జాతీయ ఆరోగ్య సంస్ధ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ కోలిన్స్‌ రాసిన వ్యాసంలో సహజంగానే కరోనా వైరస్‌ పుట్టిందని, ఎవరూ తయారు చేయలేదని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 21న ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రతినిధి ఫడేలా చాయిబ్‌ మాట్లాడుతూ వైరస్‌ జంతువుల నుంచే వచ్చిందని అయితేగబ్బిలాల నుంచి మానవులకు ఎలా వచ్చిందన్నది ఇప్పటికీ అంతుబట్టలేదన్నారు. ఏప్రిల్‌ 30న అమెరికా జాతీయ గూఢచార డైరెక్టర్‌ కార్యాలయం తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించిన ప్రకారం కరోనా వైరస్‌ కృత్రిమంగా తయారు చేసింది లేదా జన్యుమార్పిడి చేసింది కాదనే శాస్త్రవేత్తల అభిప్రాయంతో గూఢచార సమాజం ఏకీభవిస్తున్నదని పేర్కొన్నారు. మే ఒకటవ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ అత్యవసర కార్యక్రమ డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ మాట్లాడుతూ వైరస్‌ జన్యుక్రమం గురించి అనేక మంది శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం సహజంగా ఉద్భవించిందే అన్నారు. మే ఐదవ తేదీన అదే సంస్ధ ప్రతినిధి డాక్టర్‌ గువ్‌డెన్‌ గాలెయా కూడా అదే చెప్పారు. ఫ్రెంచి పత్రి వాలెర్‌ యాక్ట్యువల్‌ తమ దేశ గూఢచార వర్గాలను ఉటంకిస్తూ వైరస్‌ ఊహాన్‌లోని పి4లాబ్‌ నుంచి వెలువడలేదని పేర్కొన్నది.
4 ఆరోపణ : ఊహాన్‌ వైరాలజీ సంస్ధ నుంచి ప్రమాదవశాత్తూ వైరస్‌ లీకైంది.
వాస్తవం: ఊహాన్‌ నేషనల్‌ బయోసేఫ్టీ లాబరేటరీ(పి4) చైనా-ఫ్రెంచి ప్రభుత్వాల సహకారం కింద అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైంది. దీనిలో పనిచేసే తొలి బృందం సిబ్బందికి ఫ్రాన్స్‌, అమెరికాలోనే శిక్షణ ఇచ్చారు. ఇక్కడి సౌకర్యాలు, పరికరాలను మూడవ పక్షం ప్రతిఏటా తనిఖీ చేస్తుంది. తనిఖీలో అన్నీ సక్రమంగా ఉన్నట్లు నిర్ధారితమైన తరువాతే పని చేయటాన్ని అనుమతిస్తారు. ఆ లాబ్‌కు కృత్రిమ వైరస్‌ తయారు చేసే సామర్ధ్యం లేదు, వైరస్‌ లీకై సిబ్బందికి సోకిన రుజువులేదు. ఈ లాబ్‌ కార్యకలాపాల గురించి, కరోనా వైరస్‌ గురించి తెలుసుకొనేందుకు యావత్‌ ప్రపంచం నుంచి ఆరులక్షల మంది వెబ్‌సైట్‌ను దర్శించగా 2.1కోట్ల డౌన్లోడ్‌లు నమోదయ్యాయి. ఎలర్జీ మరియు అంటువ్యాధుల అమెరికా జాతీయ సంస్ధ డైరెక్టర్‌ ఆంథోనీ ఫౌసీ మే4న మాట్లాడుతూ చైనా లాబ్‌లో వైరస్‌ తయారు కాలేదని, ప్రకృతిలోనే పుట్టి జంతువుల్లోకి ప్రవేశించినట్లు కనిపిస్తోందని అన్నారు. జంతువుల నుంచి సోకిన వైరస్‌ను లాబ్‌కు తెచ్చినపుడు ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి లీకైందన్న కథనాన్ని తాను నమ్మటం లేదన్నారు. వైరస్‌ కృత్రిమ సృష్టి అని ఎలాంటి రుజువులు లేవని బ్రిటీష్‌ ఆరోగ్య మంత్రి మాట్‌ హనాక్‌ అక్కడి పత్రిక ఇండిపెండెంట్‌ ఇంటర్వ్యూలో చెప్పారు.
5. ఆరోపణ: ఊహాన్‌లో వైరస్‌ను అరికట్టిన చైనా తమ జాతీయులను మిలన్‌, న్యూయార్క్‌ ఇతర నగరాల్లో వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు పంపింది.
వాస్తవం: స్వల్ప వ్యవధిలోనే చైనా కఠిన చర్యలు తీసుకుంది. చైనా నుంచి బయటకు చాలా తక్కువగా వ్యాప్తి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జనవరి 23 నుంచి ఏప్రిల్‌ ఎనిమిది వరకు ఊహాన్‌ నగరం లాక్‌డౌన్‌లో ఉంది. ఈ సమయంలో నగర వాసులు బయటకు వెళ్లలేదు. జనవరి 23న అమెరికాలో ఒక కేసు నమోదైంది. ఫిబ్రవరి రెండున అమెరికా తన సరిహద్దులను మూసివేసింది. అంతకు ముందు కేవలం ఎనిమిది కేసులు మాత్రమే అమెరికాలో నమోదయ్యాయి. మార్చి 13న అమెరికా జాతీయ అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది. ఆరోజుకు 1,896 కేసులు నిర్ధారణ అయ్యాయి. చైనాలో లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన ఏప్రిల్‌ 8వ తేదీనాటికి అమెరికాలో కేసులు నాలుగు లక్షలకు పెరిగాయి. ఒకటి నుంచి పది లక్షలకు పెరగటానికి అమెరికాలో వందరోజుల కంటే తక్కువే పట్టింది. తమ రాష్ట్రానికి చైనా నుంచి వైరస్‌ రాలేదని నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిడీ పరిశోధన వెల్లడించినట్లు న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ కుమో చెప్పారు. న్యూయార్క్‌ కరోనా వైరస్‌ ఆసియా నుంచి వచ్చింది కాదని అమెరికా పరిశోధనను ఉటంకిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తను ప్రచురించింది. తమ దేశానికి అమెరికా సందర్శకులు వైరస్‌ను తీసుకు వచ్చినట్లు కెనడా సమాచారం వెల్లడించింది. గుర్తు తెలియని వనరు నుంచి ఫ్రాన్స్‌లో స్ధానికంగానే వైరస్‌ వ్యాపించిందని, చైనా, రష్యాల నుంచి రాలేదని ఫ్రెంచి పరిశోధనా సంస్ధ పాస్టర్‌ వెల్లడించింది.
6.ఆరోపణ: చైనీయులు గబ్బిలాలను తింటూ వైరస్‌ను వ్యాపింప చేశారు.
వాస్తవం: చైనీయుల ఆహారంలో ఎన్నడూ గబ్బిలాలు లేవు. ఒక చైనా మహిళ గుడ్ల గూబ చారు తాగుతున్నట్లు చూపే వీడియో ఇంటర్నెట్‌లో తిరుగుతోంది. ఒక చిన్న పసిఫిక్‌ దీవిలో విహార యాత్రల ప్రచారంలో భాగంగా ఆమె బృందం తీసిన వీడియో అది, దాన్ని 2016లోనే ఆన్‌లైన్‌లోనే పోస్టు చేశారు. గబ్బిలాల చారు అక్కడి ప్రత్యేకత.
7.ఆరోపణ: చైనా వన్య ప్రాణుల మార్కెట్లను తెరిచింది.
వాస్తవం: చైనాలో వన్య ప్రాణుల మార్కెట్లనేవి లేవు. వాటిని వేటాడటం, అమ్మకాలను చైనా నిషేధించింది. కోళ్లు, చేపల వంటి సముద్ర ఉత్పత్తులను మాత్రమే ప్రాణాలతో విక్రయించే మార్కెట్లు ఉన్నాయి. ఇలాంటివి ఒక్క చైనాలోనే కాదు అనేక దేశాలలో ఉన్నాయి. అలాంటి అమ్మకాలను నిషేధించే అంతర్జాతీయ చట్టాలు లేవు. రైతు బజార్లనే ఊహాన్‌లో తెరిచారు. ఊహాన్‌, హుబెరు, హునాన్‌లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్లు ఇప్పటికీ మూసివేసి ఉన్నాయి.
8 ఆరోపణ: వైరస్‌ వ్యాప్తి గురించి తొలి రోజుల్లో దాచి పెట్టింది, వెల్లడించటం ఆలస్యం చేసింది. దాంతో వ్యాప్తి పెరిగింది.
వాస్తవం: ఆకస్మికంగా గుర్తు తెలియని వైరస్‌ దాడి జరిగినపుడు అవగాహన, అధ్యయనం చేసేందుకు సమయం పడుతుంది. డిసెంబరు 27న న్యూమోనియాతో రోగులు ఉన్నట్లు గుర్తించారు. అదే రోజు వెల్లడించారు. మూడు రోజుల తరువాత కారణం తెలియని న్యూమోనియా గురించి ప్రకటించారు.డిసెంబరు 31న దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ధకు తెలిపారు. జనవరి మూడు నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్ధకు, అమెరికా ఇతర దేశాలకు క్రమం తప్పకుండా సమాచారాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి మూడు వరకు 30సార్లు అమెరికాకు సమాచారం తెలియచేశారు. జనవరి ఏడవ తేదీ నాటికి జన్యుక్రమాన్ని గుర్తించారు. పదకొండవ తేదీన ఆ సమాచారాన్ని ఇతర దేశాలకు అందచేశారు. వెంటనే నివారణ కిట్ల తయారీకి ఉపక్రమించారు. ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో సమాచారాన్ని వెల్లడిస్తున్నారు. చైనాలో వైరస్‌ గురించి ప్రకటన చేసిన 70రోజుల తరువాత అమెరికా అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది

Sack cartoon: In Trump we trust? | Star Tribune
9.వైరస్‌ వ్యాప్తిని గోప్యంగా ఉంచిందని బయట పెట్టిన డాక్టర్‌ లీ వెనలియాంగ్‌ను అరెస్టు చేశారు.
వాస్తవం: వెనలియాంగ్‌ స్వంత సంస్ధ అక్రమాలను బయట పెట్టే వ్యక్తి కాదు, అతన్ని అరెస్టు చేయలేదు. అంటు వ్యా ధులను నిర్ధారించటానికి కఠినమైన నిబంధనలు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. ఇది సాధారణ అంశం. అంటువ్యాధుల నిర్ధారణ గురించి వెల్లడించటానికి ఒక చట్టం, పద్దతులు ఉన్నాయి. డాక్టర్‌ ఝాంగ్‌ జిక్సియాన్‌ ఒక శ్వాసనిపుణుడు, కోవిడ్‌-19 గురించి తొలిసారి నివేదించాడు, అతనికి అవార్డును ఇచ్చారు. జిక్సియాంగ్‌ నివేదించిన మూడు రోజుల తరువాత డిసెంబరు 30న, అధికారికంగా విడుదల చేయటానికి ఒక రోజు ముందు డాక్టర్‌ లీ వెనలియాంగ్‌ అనే కంటి వైద్యుడు తన సహచరులకు ఉరు ఛాట్‌ గ్రూప్‌లో ఏడు నిర్ధారితమైన సారస్‌ కేసులు ఉన్నాయని, అయితే ఈ విషయాన్ని ప్రచారం చేయవద్దని పోస్టు పెట్టాడు. అయితే అది ఇంటర్నెట్‌లో బయటకు వచ్చి భయాన్ని కలిగించింది. జనవరి మూడవ తేదీన ఊహాన్‌ పోలీసులు అతన్ని స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపి నిర్ధారణ కాని సమాచారాన్ని వెల్లడించకూడదని, ప్రచారాన్ని ఆపాలని చెప్పి అధికారయుతంగా మందలిస్తూ ఒక లేఖను ఇచ్చి పంపారు. తరువాత అతనికి వైరస్‌ సోకింది, జనవరి 31న నిర్ధారణ అయింది. ఫిబ్రవరి ఏడవ తేదీన అతను మరణించాడు. అతనికి సంబంధించిన అంశాల మీద దర్యాప్తు జరపాలని ఒక బృందాన్ని నియమించారు. మార్చి 19న దర్యాప్తు నివేదికను వెల్లడించారు.అతని విషయంలో చట్టపరమైన అంశాలను తప్పుగా అన్వయించారని, మందలింపు లేఖను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. డాక్టర్‌ లీ మంచి వైద్యుడు, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు, ప్రభుత్వ వ్యతిరేకి కాదు, మార్చి ఐదున కరోనా వ్యతిరేక పోరులో మరణించిన ఆదర్శ జాతీయ ఆరోగ్య కార్యకర్తగా లీని ప్రకటించి ఒక అమర జీవిగా ఏప్రిల్‌ రెండున గౌరవించారు. ప్రభుత్వ వ్యతిరేకిగా లీని చిత్రించటం అతన్ని, అతని కుటుంబాన్ని అగౌరవ పరచటమే.
10.మనుషుల నుంచి మనుషులకు వైరస్‌ వ్యాపిస్తుందని వెల్లడించటంలో చైనా చాలా ఆలస్యం చేసింది. దాంతో తగిన సమాచారం లేక అమెరికా, ఇతర దేశాలు వెంటనే స్పందించటంలో విఫలమయ్యాయి.
వాస్తవం: చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి వర్తమానాలు సకాలంలోనే గట్టిగానే వెళ్లాయి, అమెరికాకు తొలి నుంచీ అన్నీ తెలుసు. ఒక కొత్త వైరస్‌ ఒక మనిషి నుంచి మరొక మనిషికి సోకుతుందా లేదా అని తెలుసుకొనేందుకు కఠినమైన శాస్త్రీయ క్రమం ఉంటుంది. జనవరి తొమ్మిదిన నోవెల్‌ కరోనా వైరస్‌ అని చైనా నిపుణులు ప్రకటించారు. ఇరవయ్యవ తేదీన ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకుతుందని నిర్ధారించారు. అప్పటికి అమెరికాలో నిర్దారిత కేసులు లేవు. ఇరవై మూడవ తేదీన కోటీ 20లక్షల మంది జనాభా ఉన్న ఊహాన్‌ నగరాన్ని లాక్‌డౌన్‌ చేసి ప్రపంచానికి గట్టి హెచ్చరికను పంపింది. ఆరోజుకు అమెరికాలో ఒకే ఒక్క కేసు నమోదైంది.అంతకు ముందు రోజు ప్రపంచ ఆరోగ్య సంస్ధ మానవుల్లో వ్యాప్తి గురించి వెల్లడించింది, 27వ తేదీ ప్రమాద తీవ్రతను పెంచింది, 30వ తేదీన మహమ్మారిగా మారినట్లు వెల్లడించింది. ఊహాన్‌లోని తన రాయబార కార్యాలయ సిబ్బందిని వెనక్కు పిలిపించి, జనవరి 25వ తేదీ నుంచి కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన తొలి దేశం అమెరికా. ఫిబ్రవరి రెండున తన సరిహద్దులను మూసివేస్తూ చైనా పౌరులు అంతకు ముందు 14రోజులు చైనాలో ఉన్న ఇతర దేశీయులకు ప్రవేశం లేదని నిషేధించింది. ఆరోజున అమెరికాలో కేవలం ఎనిమిది కేసులే ఉన్నాయి. మార్చి తొలి వారం వరకు అమెరికా తీవ్ర సమస్యగా పరిగణించలేదు. అమెరికా సమస్యలకు చైనా కారణమని చెప్పటం పెద్ద అబద్దం అని అమెరికా ప్రముఖ ఆర్ధికవేత్త జెఫ్రీ సాచ్స్‌ పేర్కొన్నారు. తాము డిసెంబరులోనే ప్రపంచ ఆరోగ్య సంస్ధను హెచ్చరించామని చైనా రాష్ట్రమైన తైవాన్‌ అధికారులు పేర్కొన్నారు. అయితే డిసెంబరు 31న తమకు తైవాన్‌ నుంచి వచ్చిన ఇమెయిల్‌లో ప్రత్యేక లక్షణాలు గల న్యూమోనియా కేసుల గురించి వచ్చిన వార్తలను ఉటంకిస్తూ తమకు దాని గురించి మరింత సమాచారం కావాలని అడిగారు తప్ప దానిలో హెచ్చరికలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్ద వివరణ ఇచ్చింది.
11.ఆరోపణ: చైనాలో కేసులు, మరణాల గురించి వాస్తవాలు చెప్పటం లేదు, ప్రకటించిన దాని కంటే 50రెట్లు ఎక్కువ.
వాస్తవం: కరోనా సమాచారం విషయంలో చైనా పారదర్శకంగా ఉంది. జనవరి 21 నుంచి ప్రతి రోజూ అధికారికంగా సమాచారాన్ని వెల్లడించింది.జాతీయ, ప్రాంతీయ స్ధాయిలో మూడువేలకు పైగా పత్రికా గోష్టులు నిర్వహించారు. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకున్నకారణంగానే కేసులు, మరణాలు తగ్గాయి. వ్యాధి గ్రస్తులను ఇతరుల నుంచి పూర్తిగా వేరుచేశారు. ఈ చర్యల కారణంగా ఏడు లక్షల కేసులను నివారించినట్లు సైన్సు పత్రిక అంచనా వేసింది.
12.ఆరోపణ: ఊహాన్‌లో వైరస్‌ కేసుల సంఖ్యను తరువాత సవరించటం కేసులను తొక్కిపెట్టారన్నదానికి నిదర్శనం.
వాస్తవం: సమాచార సమీక్ష, సవరణ అంతర్జాతీయంగా సాధారణంగా జరిగేదే. దీనికి కారణాలు ఇలా ఉన్నాయి. ఒక్కసారిగా ఆసుపత్రులు రోగులతో నిండిపోవటంతో అనేక మంది ఆసుపత్రులకు రాకుండానే ఇండ్ల దగ్గరే మరణించారు. ఆసుపత్రులన్నీ నిండిపోవటంతో ఆరోగ్య కార్యకర్తలు కేసులన్నీ నమోదు చేయలేని స్ధితి ఏర్పడింది లేదా ఆలస్యం అయింది. తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ ప్రయివేటు ఆసుపత్రులు, సంచార వైద్యశాలలు, కొన్ని సంస్ధలలో చికిత్స పొందిన వారు, మరణించిన వారిని జాబితాలకు అందచేయలేదు. కొన్ని కేసులు ఒకటికి రెండుసార్లు నమోదు కావటం, కొన్ని అసంపూర్ణంగా ఉండటం వంటి కారణాల వలన సమాచారాన్ని సరి చేసి సవరించారు. ఇది అంతర్జాతీయంగా జరుగున్నదే. ఉదాహరణకు బ్రిటన్‌లో ఆసుపత్రుల వెలుపల మరణించిన వారిని లెక్కించలేదు, తరువాత దాన్ని సరిచేశారు. స్పెయిన్‌ ప్రభుత్వం కూడా తమ సమాచారాన్ని సవరిస్తామని ప్రకటించింది.

trump lies
13. ఆరోపణ: కరోనా వైరస్‌ గురించి చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేస్తోంది.
వాస్తవం: తప్పుడు సమాచార బాధితురాలు చైనా. అమెరికా రాజకీయవేత్తలు, పండితులు, మీడియా చైనా వ్యతిరేక ప్రచారం చేస్తోంది.
14.ఆరోపణ:చైనా రాజకీయ వ్యవస్ధ సమస్యలకు మూలం.
వాస్తవం: సామాజిక వ్యవస్ధ లేదా భావజాలానికి వైరస్‌కు సంబంధం లేదు. వైరస్‌ను అరికట్టటంలో చైనా పౌరులు విజయం సాధించారు. నూటనలభై కోట్ల మందిని ఐక్యపరచటంలో రాజకీయ వ్యవస్ధ విజయం సాధించింది. ఒక అభివృద్ది చెందుతున్న దేశంగా చైనా సమస్యలను అధిగమించాల్సి ఉంది. వెయ్యి పడకల ఆసుపత్రిని పది రోజుల్లో, 1600 పడకల ఆసుపత్రిని 15 రోజుల్లో నిర్మించేందుకు చైనా రాజకీయ వ్యవస్ద పెద్ద ఎత్తున మానవ, వస్తుసామగ్రిని సమీకరించగలిగింది. రోజు లేదా ఒకటిన్నర రోజుల వ్యవధిలో 13వేల మంది రోగులను చేర్చేందుకు వీలుగా మరో 16 సంచార వైద్యశాలలను ఏర్పాటు చేసింది. వైరస్‌ నుంచి జనాన్ని రక్షించేందుకు గాను 13,800 గృహ సముదాయాలకు ఊహాన్‌ నగరంలో 44,500 మంది స్ధానిక పార్టీ కార్యకర్తలను సమీకరించి, భౌతిక దూరం పాటింపు, తదితర చర్యలను గట్టిగా అమలు జరిపింది. సింగపూర్‌లోని బ్లాక్‌బాక్స్‌ పరిశోధనా సంస్ద జరిపిన సర్వేలో 23దేశాల్లో తీసుకున్న చర్యల గురించి ప్రశ్నించగా చైనాకు నూటికి 85మార్కులు వచ్చి అగ్రస్ధానంలో నిలిచింది. సంక్షోభం నుంచి దేశం బయటపడగలదని 85శాతం మంది చైనీయులు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అదే అమెరికాలో 11, ఐరోపా యూనియన్‌లో 15,భారత్‌లో పదిశాతం మాత్రమే ఉన్నారు.
15. ఆరోపణ : నిజాలను బయట పెట్టకుండా అమెరికా విలేకర్లను చైనా నుంచి బహిష్కరించారు.
వాస్తవం: చాలా కాలంగా అమెరికా తీసుకుంటున్న చర్యలకు ప్రతిచర్య తప్ప మరొకటి కాదు. ఇటీవలి కాలంలో అమెరికా పరోక్ష చర్యల ద్వారా మీడియా సిబ్బందిని పరిమితం చేసి 60 మంది చైనా జర్నలిస్టులను బహిష్కరించింది. వీసాల విషయంలో కూడా అమెరికా అనుచితంగా వ్యవహరిస్తోంది.
16. ఆరోపణ: ప్రపంచ ఆరోగ్య సంస్దకు చైనా లంచాలు ఇచ్చి అదుపు చేస్తోంది.
వాస్తవం: చైనా ఎన్నడూ ఆ సంస్ధను అదుపు చేసేందుకు ప్రయత్నించలేదు.సంస్ధలో 194 దేశాలకు సభ్యత్వం ఉండగా ప్రధాన కార్యాలయంలో పని చేసే 21 మంది నాయకత్వ బృందంలో 11 మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా యూనియన్‌కు చెందిన వారే కాగా చైనా నుంచి ఒకే ఒక్కరు ఉన్నారు. వారందరూ నిపుణులే. 2018,19 సంవత్సరాలలో అమెరికా, జపాన్‌ తరువాతనే చైనా అతి పెద్ద దాతగా ఉంది. సభ్యత్వం, విరాళాన్ని పరిగణనలోకి తీసుకుంటే చైనా తొమ్మిదవ స్దానంలో ఉంది.చైనా వాణిజ్య సంస్ధలు, ప్రభుత్వేతర సంస్ధలు ఇచ్చిన మొత్తాలను మినహాయిస్తే చైనా స్ధానం ఇంకా దిగజారుతుంది.
17.ఆరోపణ: మనుషల నుంచి మనుషులకు సోకుతుందని డిసెంబరు 31వ తేదీనే తైవాన్‌ సమాచారమిచ్చినా ప్రపంచ ఆరోగ్య సంస్ద తీవ్రంగా పరిగణించలేదు.
వాస్తవం: తైవాన్‌ రాష్ట్రం ఆరోగ్య సంస్దకు ఎలాంటి హెచ్చరికను పంపలేదు.వ్యాధి గురించి ఊహాన్‌ మున్సిపల్‌ అధికారులు వెల్లడించిన తరువాత అదనపు సమాచారం కావాలని ఆరోగ్య సంస్దను తైవాన్‌ కోరింది. అదే విధంగా చైనా జాతీయారోగ్య సంస్ధకూ లేఖ రాసింది.తైవాన్‌తో ఆరోగ్యం, వైద్యానికి సంబంధించి ఉన్న ఒప్పందం మేరకు వెంటనే సమచారాన్ని పంపారు. అదే రోజు తైవాన్‌ ఆరోగ్య సంస్ధకు ఇమెయిల్‌ పంపింది.
18. ఆరోపణ: ప్రపంచ ఆరోగ్య సంస్ధలో చేరేందుకు తైవాన్‌ ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంది. తద్వారా అక్కడి పౌరుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చింది.
వాస్తవం: చైనాలో అంతర్భాగమైన తైవాన్‌కు ఆరోగ్య సంస్దలో చేరేందుకు హక్కు లేదు. సర్వసత్తాక దేశాలకు మాత్రమే దానిలో చేరే హక్కు ఉంది. సాంకేతిక సహకారం వాటి మధ్య నిరాఘాటంగా కొనసాగుతోంది. తైవాన్‌ నిపుణులు అనేక సమావేశాలకు హాజరయ్యారు. తైవాన్‌ నుంచి ఊహాన్‌కు సైతం నిపుణులు వచ్చారు.
19. ఆరోపణ: ప్రపంచ వ్యాపితంగా వైరస్‌ వ్యాపించటానికి చైనాయే కారణం కనుక, ఆ విషయాలపై దర్యాప్తు జరపాలి, పరిహారం చెల్లించాలి.
వాస్తవం: చైనాయే బాధ్యురాలని, పరిహారం కోరేందుకు చట్టపరంగా ఎలాంటి అవకాశాలు లేవు. స్ధానిక రాజకీయ అజెండా కారణంగా అమెరికా రాజకీయవేత్తలు చైనా మీద నెపం వేస్తున్నారు. చైనా కూడా బాధిత దేశమే. ఒక చోట తొలుత వెల్లడైనంత మాత్రాన ఆ దేశం నష్టపరిహారం చెల్లించాలని ఎక్కడా లేదు.1980దశకంలో ఎయిడ్స్‌ తొలుత అమెరికాలో బయటపడింది, అప్పటి నుంచి పరిహారం చెల్లించాలని దాన్ని ఎవరూ అడగలేదు. ప్రజారోగ్యం గురించి అమెరికాతో చైనాకు ఎలాంటి ఒప్పందమూ లేదు.
20. ఆరోపణ: వైరస్‌ నుంచి లబ్దిపొందేందుకు వైద్య సరఫరాలను చైనా దాచిపెట్టింది. అమెరికాలో వెంటిలేటర్ల వంటి వాటికి కొరత ఏర్పడటానికి ఇదే కారణం.
వాస్తవం: దేశీయంగా వైరస్‌ను ఎదుర్కొంటూనే ఇతర దేశాలకు సాయపడేందుకు చైనా తన శక్తికొద్దీ ప్రయత్నించింది. ఇప్పటికి 150దేశాలకు వైద్య సరఫరాలు చేసింది. మార్చి ఒకటి నుంచి ఏప్రిల్‌ 30వరకు 71.2బిలియన్ల వైద్య పరికరాలను ప్రపంచ దేశాలకు సరఫరా చేసింది. మార్చి ఒకటి మే అయిదవ తేదీల మధ్య అమెరికాకు చైనా నుంచి 6.6బిలియన్ల ముఖతొడుగులు,344 మిలియన్‌ జతల సర్జికల్‌ తొడుగులు, 44.09 మిలియన్ల రక్షణ సూట్లు, 6.75 మిలియన్ల కళ్లద్దాలు, ఏడున్నర వేల వెంటిలేటర్లను సరఫరా చేశారు. ఇవిగాక అమెరికాలోని 30 రాష్ట్రాలు, 55 నగరాలకు అనేక లక్షల కిట్లు, తొడుగులు మొదలైన వాటిని విరాళంగా పంపారు.
21. ఆరోపణ: ఇతర దేశాలకు మహమ్మారి వ్యతిరేక సాయంలో కూడా చైనా రాజకీయ, ప్రచార కండూతితో వ్యవహరించింది.
వాస్తవం: వైరస్‌ను ఎదుర్కోవటంలో ఇతర దేశాలు చైనాకు చేసిన సాయానికి ప్రతిగానే చైనా కూడా సాయం చేసింది. చైనా నిపుణులు 120 వీడియో కాన్ఫరెన్సుద్వారా 160దేశాల వారితో అనుభవాలను పంచుకున్నారు. పందొమ్మిది దేశాలకు 21 చైనా బృందాలు వెళ్లాయి.
22. ఆరోపణ: డోనాల్డ్‌ ట్రంప్‌ తిరిగి ఎన్నిక అవకుండా అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుంటోంది.
వాస్తవం: చైనా ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనే సూత్రానికి కట్టుబడి ఉంది. అమెరికాలోని కొందరు రాజకీయవేత్తలే అక్కడి ఎన్నికల్లో చైనా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చైనా మీద దాడిని ఎక్కుపెట్టాలని రిపబ్లికన్‌ పార్టీ సెనెటోరియల్‌ కమిటీ 57పేజీల పత్రాన్ని ప్రచార విభాగానికి అందచేసినట్లు పొలిటికో పత్రిక వెల్లడించింది. కరోనా వైరస్‌కు చైనాయే కారణమని, దాన్ని దాచిపెట్టిందని, డెమోక్రాట్లు చైనా పట్ల సానుకూలంగా ఉన్నారని, తాము ఎన్నికైన తరువాత వైరస్‌ను వ్యాప్తి చేసినందుకు చైనా మీద ఆంక్షలు విధిస్తామని ప్రచారం చేయాలని దానిలో పేర్కొన్నారు.

Cartoon Movement - Trump Lies
23.ఆరోపణ : కిట్స్‌, మాస్కులు, వెంటిలేటర్ల ఎగుమతుల గురించి ఎగుమతిదారులు కస్టమ్స్‌ వివరాలు వెల్లడించాలని చైనా కోరింది, ఎగుమతులపై నిషేధం విధించేందుకు అలా చేశారు.
వాస్తవం: నాణ్యతా ప్రమాణాల మెరుగుదల కోసమే ఆ సమాచారాన్ని అడిగారు. ఈ చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి. నాణ్యత లేని ఉత్పత్తులను నిరోధించటానికి, కనుగొనేందుకు తోడ్పడింది. త్వరగా కస్టమ్స్‌ అనుమతులు ఇవ్వటానికి వీలు కలిగించింది. ఎగుమతుల మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
24. ఆరోపణ: ఆఫ్రికన్ల విషయంలో గువాంగ్‌డోంగ్‌లో వివక్ష ప్రదర్శించారు.

వాస్తవం:చైనీయులు, విదేశీయులెవరైనా ఎలాంటి వివక్ష చూపలేదు. స్ధానికంగా ఎన్ని ఇబ్బందులు పడినా హుబెరు రాష్ట్రంలోని మూడువేల మంది ఆఫ్రికన్‌ విద్యార్ధుల సంక్షేమానికి చర్యలు తీసుకుంది. ఒక విద్యార్ధికి వైరస్‌ సోకితే వెంటనే చికిత్స అందించారు. ఏప్రిల్‌13న గ్వాంగ్‌డోంగ్‌లో విదేశాల నుంచి వచ్చిన వారిలో 26 మందికి వైరస్‌ ఉంది, వారిలో 19 మంది ఆఫ్రికన్లు ఉన్నారు.ఎవరినీ లక్ష్యంగా చేసుకొని చర్యలు తీసుకోలేదు. ఊహాన్‌ వీధుల్లో కెనియన్‌ దంపతుల మీద దాడి జరిగినట్లు బిబిసి ఏప్రిల్‌ 17న బిబిసి ప్రసారం చేసింది. నిజానికి అది అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో జరిగింది.

http://www.xinhuanet.com/english/2020-05/10/c_139044103.htm

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉత్తర కొరియా కిమ్‌పై కొనసాగుతున్న పిట్ట, కట్టుకథలు !

05 Tuesday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

DPRK Kim Jong Un, Kim Jong-un, North Korea, North Korea’s Kim Jong Un

Kim Jong-un 'speaks out' amid death claims, according to North ...

ఎం కోటేశ్వరరావు
ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ అన్‌ కొద్ది రోజులు కనిపించకపోవటం గురించి కట్టు కథలు అల్లి చివరకు ‘చంపేసిన’ మీడియా మే ఒకటవ తేదీన కనిపించిన తరువాత పిట్ట కథలు చెబుతోంది. ప్రపంచంలో అనేక దేశాధినేతలు, మీడియాలో కతలు వండే, చెప్పేవారిని, ఉత్తర కొరియా నుంచి ఫిరాయించి రాజభోగాలు అనుభవిస్తున్న విభీషుణులకు కిమ్‌ తీవ్ర ఆశాభంగం కలిగించారు. ప్రపంచంలో తమకు తెలియని రహస్యం ఉండదు అని విర్రవీగే సిఐఏ వంటి గూఢచార సంస్ధలు జరిగిన దాన్ని చూసి నోళ్లు వెళ్ల బెట్టాయి. అలాంటి పేరు మోసిన సంస్ధలు, జేమ్స్‌ బాండ్‌ వంటి గూఢచారులను కూడా ఉత్తర కొరియా వెర్రి వెంగళప్పలను చేసింది. అవాక్కయిన వారందరూ గుక్క తిప్పుకొని మరో రూపంలో దాడి చేస్తున్నారు. పిట్ట కథలు చెబుతున్నారు.
కిమ్‌ విషయంలో తెలుగు మీడియా కూడా తక్కువ తినలేదు. పోటీలు పడి అమెరికా సిఐఏ, దక్షిణ కొరియా సంస్ధలు, ఉత్తర కారియా వ్యతిరేకులు అందించిన సమాచారంతో కొద్ది రోజుల పాటు ఊహాగానాలతో కాలక్షేపం చేశారు. కొన్ని విదేశీ టీవీలు కిమ్‌ మరణించినట్లు వార్తలు చెప్పేశాయి. మన తెలుగు టీవీ ఉత్సాహవంతులెవరైనా ఆ పుణ్యం కట్టుకున్నారేమో తెలియదు. ఉత్తర కొరియా నుంచి ఫిరాయించిన ఒక మాజీ దౌత్యవేత్త థాయే ఎంగ్‌ హౌ మీడియాను రంజింప చేశాడు. కిమ్‌ నిలబడలేడు, నడవ లేని స్ధితిలో తీవ్రంగా జబ్బు పడ్డాడు అంటూ మే ఒకటవ తేదీకి మూడు రోజుల ముందు చెప్పాడు. అది వాస్తవం కాదని తేలటంతో ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు. ఇంతకూ ఈ పెద్ద మనిషి 2016లో దక్షిణ కొరియాకు ఫిరాయించాడు, గత నెలలో పార్లమెంట్‌ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు.ఉత్తర కొరియాకు సంబంధించిన అంశాలలో ఆకాంక్షలకు అనుగుణ్యంగా కచ్చితమైన విశ్లేషణ చేస్తానని, అంచనాలు వేస్తాననే నమ్మకంతో మీరు నన్ను పార్లమెంట్‌కు ఎన్నుకున్న కారణాలలో ఒకటని నాకు తెలుసు. కారణాలేమైనప్పటికీ నేను ప్రతివారికి ఇప్పుడు క్షమాపణ చెబుతున్నాను. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు బాధ్యత, తప్పు నాదే అని ప్రకటించాడు. కిమ్‌ చావు వార్త గురించి తాను ఎటూ చెప్పలేని కొద్ది రోజుల క్రితం చెప్పిన ట్రంప్‌ అంతర్గతంగా ఎదురు చూశాడని వేరే చెప్పనవసరం లేదు. అయితే మే ఒకటవ తేదీన కనిపించటంతో తనకు ఎంతో సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశాడు.

Kim Jong Un resurfaces on state media with mysterious mark on ...
అతనికి ఉన్న సిగ్గు, బిడియం మీడియాకు ఎందుకు లేకపోయింది ? తేలు కుట్టిన దొంగల మాదిరి ఏమీ ఎరగనట్లు కొత్త కథలు అల్లటంలో నిమగమయ్యారు. కిమ్‌కు అసలు ఎలాంటి ఆపరేషన్లు జరగలేదని దక్షిణ కొరియా చెబుతోంది. అయినా సరే కిమ్‌ చేతికి ఒక గాయం మాదిరి కనిపిస్తోందని జర్నలిస్టులు చెబుతున్నారు. తన వ్యతిరేకులను, కట్టు కథలను అల్లిన మీడియా జనాలను వెర్రి వెంగళప్పలను చేయటానికి అలాంటి చిహ్నంతో మేకప్‌ వేసుకొని కావాలని కనిపించేట్లు చేశారేమో ! మరొక ఫిరాయింపుదారు, పార్లమెంట్‌కు ఎన్నికైన జి సెయోంగ్‌ హౌ అయితే మరొక అడుగు ముందుకు వేసి గుండె ఆపరేషన్‌ జరిగిన కిమ్‌ మరణించాడని 99శాతం కచ్చితంగా చెబుతున్నా, మృతి వార్తను అధికారికంగా శనివారం నాడు ప్రకటిస్తారు అని శుక్రవారం నాడు చెప్పాడు. ఇతగాడిని 2018లో అమెరికా పార్లమెంట్‌ ఉభయ సభలలో ప్రసంగించేందుకు ట్రంప్‌ ఆహ్వానించాడు. ఇలాంటి ఫిరాయింపుదార్లందరినీ అమెరికా సర్కార్‌ పెంచి పోషిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఈ పెద్దమనిషి ఇప్పుడు మీడియాను తప్పించుకు తిరుగుతున్నాడు.
చీకట్లో బాణాలు వేసే ఇలాంటి వారి మాటలను నమ్మి జనానికి మీడియా కట్టుకధలు అందిస్తోందని మరోసారి రుజువైంది. నిజం చెప్పకపోగా ఉత్తర కొరియాతో సంబంధాలను మరింతగా చెడగొట్టినందుకు గూఢచార, రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీల నుంచి వారిని తొలగించాలని అధికార పక్షంలో కొందరు సూచించారు.న్యూస్‌ వీక్‌ వంటి పత్రికల్లో రాసే వారు కూడా ఫేక్‌ న్యూస్‌ను పాఠకుల ముందు కుమ్మరించారు. హయాంగ్‌సాన్‌ రాష్ట్రంలోని మౌంట్‌ కుమగాంగ్‌లో ఒక విల్లాలో కిమ్‌ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని రాసింది. నిజానికి అలాంటి రాష్ట్రం ఉత్తర కొరియాలో లేదు. అది మౌంట్‌ మోయోయాంగ్‌ ప్రాంతంలోని ఒక ఆసుపత్రి పేరు. ఇలాంటి వాటిని చూసి జనంలో నగుబాట్ల పాలౌతారని కామోసు ఒక వ్యాఖ్యాత కిమ్‌ గురించి వార్తలు రాయటం కంటే రాయకపోవటమే మంచిది అని పేర్కొన్నాడు.
క్యూబా ప్రజల ప్రియతమ నేత ఫిడెల్‌ కాస్ట్రోను సిఐఏ లేదా అది కిరాయికి నియమించిన హంతకులు 634 పద్దతుల్లో లేదా అన్ని సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు హాలీవుడ్‌లో ఒక సినిమా కూడా తీశారు. సిఐఏ ఏజంట్లు, వారితో కుమ్మక్కైన వారు పలు దేశాలలో అనేక మంది నేతలను మట్టుపెట్టారు. మీకు కూతవేటు దూరంలో కేవలం 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యూబా అధినేత కాస్ట్రోను ఏమి చేయలేకపోయారు మీ గొప్పల గురించి మాదగ్గర చెప్పకండి అని అమెరికా మిత్రులు బహుశా ఎకసెక్కాలాడి ఉంటారు. అందుకే కసితో అన్ని సార్లు కాస్ట్రోను హతమార్చేందుకు యత్నించి ఉండాలి అనుకోవాల్సి వస్తోంది.అలాగే గత ఏడు దశాబ్దాలుగా ఆసియాలో కొరకరాని కొయ్యగా ఉన్న ఉత్తర కొరియా నాయకత్వాన్ని హతమార్చేందుకు అమెరికన్లు చేయని యత్నం లేదు. కిమ్‌ జోంగ్‌ అన్‌ మీద, తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌, తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ను హత్య చేసేందుకు అమెరికా, దక్షిణ కొరియా సంస్ధలు చేయని యత్నం లేదు. అనేక సార్లు మీడియాలో వారిని బతికి ఉండగానే చంపేశారు.
క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రో ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు, కొరియాలో కిమ్‌ ఇల్‌ సంగ్‌, ఆయన కుటుంబ సభ్యులు తమ తమ దేశాల్లో నియంతలు, దురాక్రమణదారులకు వ్యతిరేకంగా పోరాడిన ఘన చరిత్ర కలిగిన వారు తప్ప నియంతలు కాదు. ఏ సోషలిస్టు దేశంలోనూ లేని విధంగా ఉత్తర కొరియాలో కిమ్‌ ఇల్‌ సంగ్‌ వ్యక్తి పూజ గురించి, ఆయన తరువాత కుమారుడు, ఆ తరువాత మనుమడికి పట్టం కట్టటం గురించి ఎవరైనా విమర్శలు చేయవచ్చు. కుటుంబవారసత్వం అన్నది అది తప్పా ఒప్పా అన్నది ఆ దేశ పౌరులు తేల్చుకుంటారు, కానీ నియంతలని నిందించటం తగనిపని. అమెరికాకు లొంగని వారందరినీ నియంతలుగానే చిత్రిస్తారు. దాని మద్దతుతో గద్దెలెక్కి జనాన్ని అణచివేసిన నియంతలందరినీ అపర ప్రజాస్వామిక వాదులుగా చూపుతారు. వారితో బహిరంగంగా చేతులు కలపటాన్ని ప్రోత్సహిస్తారు. అమెరికా సిఐఏ, దానితో చేతులు కలిపిన అనేక సంస్ధలు, వ్యక్తులు కూడా నిఖార్సుగా నిలిచిన సోషలిస్టు దేశాల నేతలు, అంతర్గత విషయాలలో బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడూ అదే జరిగింది, ఊహాగానాలు తప్ప ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. ఫిరాయింపుదార్ల మాటలు నమ్మి ట్రంప్‌ వంటి వారు నగుబాట్ల పాలయ్యారు.
ఏప్రిల్‌ 11న ఉత్తర కొరియా పాలక వర్కర్స్‌ పార్టీ విధాన నిర్ణాయక కమిటీ సమావేశంలో కిమ్‌ పాల్గొన్నారు. పదిహేనవ తేదీన కిమ్‌ ఇల్‌ సంగ్‌ జయంతి కార్యక్రమానికి హాజరు కాలేదు.ఇరవై ఒకటవ తేదీన అమెరికా నిధులతో దక్షిణ కొరియా నుంచి నడిచే డెయిలీ ఎన్‌కె అనే దినపత్రిక కిమ్‌కు గుండె ఆపరేషన్‌ జరిగినట్లు రాసింది. ఇరవై మూడవ తేదీన కిమ్‌ ప్రయివేటు రైలు ఒక దగ్గర కనిపించిందంటూ కొన్ని చిత్రాలను విడుదల చేశారు, అదే రోజు అక్కడకు చైనా వైద్యులు వచ్చినట్లు కూడా వార్తలను రాశారు. మే ఒకటవ తేదీన ఒక ఎరువుల కర్మాగారంలో జరిగిన మేడే కార్యక్రమంలో పాల్గొన్న కిమ్‌ చిత్రాలు, వీడియోలను విడుదల చేయటంతో పుకార్ల మిల్లుల యంత్రాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఫిరాయింపుదార్లు, అమెరికా ఏజంట్లు వ్యాపింప చేసిన వార్తలను తాము నమ్మటం లేదని దక్షిణ కొరియా ప్రభుత్వం ఒకవైపు చెబుతున్నా, తప్పుడు సమాచారాన్ని ఖండించకపోవటంతో మీడియా రెచ్చిపోయింది. గతంలో ఉత్తర కొరియన్లు ఆకలితో చచ్చిపోతున్నారంటూ మీడియాలో చెప్పిన అంకెలను అన్నింటినీ కలిపితే ఆ దేశ జనాభాను మించి ఉన్నాయి. అసలు దేశమే అంతరించి పోయి ఉండేది. ఎవరికైనా ఇబ్బందులు రావటం వేరు, వాటిని బూతద్దంలో చూపి అంతా అయిపోయినట్లుగా చెప్పటాన్ని ఏమనాలి?

Kim Jong-un Resurfaces, State Media Says, After Weeks of Health Rumors
కిమ్‌ కనపడటం లేదంటూ చావుతో సహా రకరకాల ప్రచారం చేసిన పెద్దలు ఇప్పుడు అవే నోళ్లతో ఆరోగ్యంగా ఉన్నాను, ఇప్పటికీ అధికారంలో ఉన్నాను అని రుజువు చూపేందుకు ఇప్పుడు బయటకు వచ్చారంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒక వేళ తనకేదయినా జరిగితే అధికారం కోసం ఎవరు ఎలా ప్రవర్తిస్తారో, జనం ఎలా స్పందిస్తారో తెలుసుకొనేందుకు కిమ్‌ చావు నాటకం అడారని కొందరు ఇప్పుడు వీక్షకులకు కతలు వినిపిస్తున్నారు. అధికారం కోసం పాకులాడిన వారి తొలగింపు తదుపరి జరగనుందని చెబుతున్నారు. కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ ఇటీవల సోదరుడితో తరచూ కనిపిస్తున్నారని, తదుపరి ఆమే పీఠం ఎక్కవచ్చంటూ గతంలో ప్రచారం చేశారు. ఇతర దేశాల నేతల మాదిరి ప్రతి రోజూ సోషలిస్టు దేశాల నేతలు మీడియాలో కనిపించకపోవటం కొత్తేమీ కాదు.2014లో నలభై రోజుల పాటు కిమ్‌ బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు. అంతకు ముందు ఆయన తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ కొన్ని నెలల పాటు కనిపించని సందర్భం కూడా ఉంది. తన సమీప బంధువు కిమ్‌ కొయోంగ్‌ హురును విషమిప్పించి కిమ్‌ చంపించాడని ఫిరాయింపుదార్లు నమ్మబలికారు. ఆ తరువాత ఆమె చిరునవ్వుతో దర్శనమిచ్చింది. ఉత్తర కొరియాలో ఏమి జరుగుతోందో తెలియదని ఇనుపతెర ఉందని చెబుతారు. అదే నోటితో అమెరికాలోని పెంటగన్‌ లేదా సిఐఏ కార్యాలయాల్లో ఏమి జరుగుతోందో తెలియదని, అక్కడి పాలకులు నియంతలని మీడియాలో ఎందుకు వర్ణించరు? తాము మెచ్చింది రంభ-మునిగింది గంగ అంటే ఇదేనా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా ”మందు” రెమిడెసివిర్‌ -కందకు లేని దురద కత్తి పీటలకా !

28 Tuesday Apr 2020

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

Remdesivir, remdesivir clinical trial, remdesivir clinical trial coronavirus facts and myths

Gilead says Remdesivir trial posted online prematurely was ...

ఎం కోటేశ్వరరావు
చైనాకు వ్యతిరేకంగా ఏ చెత్తను మార్కెట్లో పెట్టినా ఆమ్ముడవుతుందా ? కొన్ని మీడియా సంస్ధలు అలాంటి చెత్త వార్తలను అమ్మి సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాయా ? ఏమో ! చైనా ” మందు ” జాగ్రత్త అనే శీర్షికతో ఒక ప్రముఖ తెలుగు పత్రిక సోమవారం నాడు ఒక వార్తను ప్రచురించింది. తప్పుడు వార్తలు రాసేందుకు, రాయించేందుకు కూడా ” సమగ్రశిక్షణ ” అవసరం అని కాస్త జాగ్రత్తగా చదివిన వారికి అర్ధం అవుతుంది. ఇంతకూ ఏమిటట?
జనవరి 20న కరోనా వ్యాప్తిపై ప్రకటన, తరువాతి రోజే రంగంలోకి ” వూహన్‌ లాబ్‌ ”, రెమ్‌డెసివిర్‌ ఔషధం పేటెంట్‌కు దరఖాస్తు. ఈ అంశాల మీద ఆ కథను అల్లారు. వైరస్‌ వ్యాప్తి గురించి ఆరు రోజుల పాటు బయటి ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వమే మోకాలడ్డిందని ఇంకా ఏవేవో రాసిన వాటిని పునశ్చరణ చేయనవసరం లేదు. దీనర్ధం ఏమంటే వైరస్‌ పరిశోధనలు చేస్తూ దాన్ని ఒక పధకం ప్రకారం బయటకు వదలిన చైనాలోని వూహాన్‌ వైరాలజీ సంస్ధ దాని నిరోధానికి అవసరమైన ఔషధాన్ని కూడా ముందే తయారు చేసి పెట్టుకుందని జనాల బుర్రలకు ఎక్కించే యత్నమే.
ఈ వార్తను లండన్‌ నుంచి ప్రచురితమయ్యే డెయిలీ మెయిల్‌ డాట్‌కామ్‌ 25వ తేదీ బిఎస్‌టి(బ్రిటీష్‌ సమ్మర్‌ టైమ్‌) రాత్రి పది గంటలకు ప్రచురించింది. దానికి మనం నాలుగున్నర గంటలను కలుపుకుంటే మన సమయం రాత్రి రెండున్నర అవుతుంది. ఆ వార్త లేదా ఏదైనా ఏజన్సీ వార్తను గానీ తీసుకొని పైన చెప్పిన కథను వండి వడ్డించి ఉండాలి. దాని సంగతి తరువాత చూద్దాం. ముందుకొన్ని విషయాలు ఇక్కడ చెప్పుకోక తప్పదు. చైనా గురించి మీడియాలో వచ్చేది, దాని వ్యతిరేక దేశాల నేతలు, శాస్త్రవేత్తలు చెప్పేదంతా నిజమే అని నమ్మేవారు నమ్మవచ్చు. అలా నమ్మకాన్ని ఖరారు చేసుకొనే ముందు భిన్న కథనాలు కూడా ఉన్నాయని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సవినయ వినతి. అవన్నీ ఎక్కడ కుదురుతాయి… మా వీనులకు విందు, చెవులకు ఇంపుగా ఉండేది, బుర్రకు కిక్కునిచ్చేదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం అనే వారి నిజాయితీకి జోహార్లు.
కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ప్రకటనలు బయటకు రాగానే చైనా గూఢచారులు కెనడా లాబ్‌ నుంచి అపహరించి వూహాన్‌ లాబ్‌ నుంచి బయటకు వదిలారు, చైనా ప్రమాదకర జీవ ఆయుధాలను తయారు చేస్తోంది అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజంగా బయటకు వదల దలచుకొంటే కెనడా లాబ్‌ నుంచే చైనా గూఢచారులు బయటకు పంప వచ్చు కదా ! దున్న ఈనిందంటే ముందు దూడను గాటన కట్టేయమన్నట్లుగా చాలా మంది నమ్మేశారు. నిజంగానే ఎవరైనా ఒక వైరస్‌ను బయటకు వదిలితే దానికి సరిహద్దులు,దేశాలు, రంగు బేధాల తేడాలుండవు, ఎక్కడ అనువుగా వుంటే అక్కడకు పాకి తన ప్రభావం చూపుతుందనే లోకజ్ఞానం ఈ సందర్భంగా పని చేసి ఉంటే ఇప్పుడు కరోనా ప్రళయ తాండవానికి కకావికలౌతున్న దేశాలన్నీ జాగ్రత్తలు తీసుకొని ఉండేవి. లక్షలాది ప్రాణాలను కాపాడేవి. కొంత మంది కావాలని కాదు గానీ ప్రమాదవశాత్తూ బయటకు వచ్చి ఉంటుందని సన్నాయి నొక్కులు నొక్కుతూ నమ్మింపచేసేందుకు ప్రయత్నించారు. ప్లేగు, మసూచిని కావాలని అంటించిన దేశాలను, రసాయన బాంబులు, గ్యాస్‌లో జనాన్ని మట్టు పెట్టిన దుర్మార్గాన్ని ప్రపంచం చూసింది. ఒక వైరస్‌ను సృష్టించి వదలిన దేశం గురించి చరిత్రలో నమోదు కాలేదు. కొన్ని అనుమానాలు వ్యక్తం అయినా ఎక్కడా రుజువు కాలేదు. ఒక కొత్త వైరస్‌ తొలుత ఎక్కడ బయటపడితే దాన్ని ఆదేశమే తయారు చేసింది అనే నిర్ధారణకు వచ్చేట్లయితే ఆ వరుసలో చైనా కంటే ముందు అనేక దేశాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి ఇంతకు ముందే తెలుసు. తాజాగా తలెత్తిన కోవిడ్‌-19 వైరస్‌ కొత్తరకం అని కృత్రిమ సృష్టి కాదని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధ, అనేక మంది ఆ రంగంలో పని చేస్తున్నవారు ప్రకటించినా, కొందరు పని గట్టుకొని చేస్తున్న ప్రచారానికి మీడియా ఎలాటి విమర్శనాత్మక దృష్టి లేకుండా ఏకపక్షంగా ప్రాధాన్యత ఇస్తోంది.
రెండవ అంశం ఈ వైరస్‌ను అమెరికన్లే తయారు చేసి తమ దేశం మీద ప్రయోగించినట్లు అనుమానిస్తున్నట్లు చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఒక విమర్శ చేశాడు. అమెరికా మిలిటరీ దాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నాడు. అమెరికాలోని మేరీలాండ్‌లో ఉన్న ఫోర్ట్‌ డెట్‌రిక్‌ అమెరికా మిలిటరీ లాబ్‌ నుంచి వైరస్‌లు బయటకు రాకుండా నివారించేందుకు తగిన రక్షణ ఏర్పాట్లు లేనందున ఏడాది క్రితమే దాన్ని మూసివేశారని వెంటనే వార్తలు వచ్చాయి. అయితే తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేశారు తప్ప మూసివేయలేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రకటించింది.
ఇక రెమిడెసివిర్‌ ఔషధం కధను చూద్దాం. కరోనా వైరస్‌ కొత్తది కాదు, గతంలోనే గుర్తించారు. దానిలో అనేక రకాలు ఉన్నాయి. తాజాగా తలెత్తినదానిని కోవిడ్‌-19 అని పేరు పెట్టారు. గతంలో తలెత్తిన కరోనా వైరస్‌, ఇతర వైరస్‌లకు వ్యాక్సిన్‌లు, ఔషధాలు తయారు చేసే సంస్ధలు ఎన్నో గతంలోనే పేటెంట్లకు దరఖాస్తులు చేశాయి. అంటే అవి ముందే మందులను తయారు చేసి వైరస్‌ను ఇప్పుడు సృష్టించాయని భావించాలా ? కుట్ర సిద్దాంతాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే కోవిడ్‌-19ను అమెరికానే సృష్టించిందని అనుకోవాలి? అది అలాంటి ప్రయత్నాలు చేయకపోతే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గిలీడ్‌ కంపెనీ నాలుగు సంవత్సరాల క్రితమే కరోనా వైరస్‌ చికిత్సకు రెమిడెసివిర్‌ను అనుమతించాలని పేటెంట్‌కు దరఖాస్తు ఎందుకు చేసినట్లు ? ప్రపంచ వ్యాపితంగా వినియోగించేందుకు నాలుగు సంవత్సరాల క్రితమే దరఖాస్తు చేసినట్లు గిలీడ్‌ కంపెన చెప్పినట్లు డెయిలీ మెయిల్‌ రాసింది. కోవిడ్‌-19కు అది పని చేస్తుందని తేలితే భవిష్యత్‌లో సరఫరా చేసేందుకు గాను ప్రస్తుతం చికిత్సలో దాని పని తీరును నిర్ధారించుకునే పనిలో ఉన్నామని గిలీడ్‌ చెబుతోంది. నిజానికి ఆ ఔషధాన్ని ఎబోలా వైరస్‌కోసం గిలీడ్‌ తయారు చేసింది. ఇది కరోనాకూ పని చేస్తుందేమో అని అది నిర్ధారించుకుంటోంది. అదే ఔషధం తయారీకి తమకు పేటెంట్‌ ఇవ్వాలని ఊహాన్‌ వైరాలజీ సంస్ధ జనవరి 21న దరఖాస్తు చేసిందట. అది నిజంగా కరోనా కోసమో కాదో తెలియదు, కరోనా కోసమే అయితే ఏ తరగతి కోసమో అంతకంటే తెలియదు, దరఖాస్తులోని వివరాలు ఏడాది తరువాత గానీ బయటకు రావు. అలాంటిది ముందే కరోనా మందుకు పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసినట్లు ఏ ఆధారాలతో రాస్తారు ? ఒక వేళ నిజంగానే రెమ్‌డెసివిర్‌కు చైనా సంస్ధ దరఖాస్తు చేస్తే అంతకు ముందే ఉన్న గిలీడ్‌ కంపెనీకి ఇవ్వకుండా చైనా సంస్ధకు ఎలా ఇస్తారు ? నిజంగా ఆ ఫార్ములాను ఎవరైనా తస్కరిస్తే మరొక పేరుతో దరఖాస్తు చేస్తారు తప్ప అదే పేరుతో ఎలా చేస్తారు ? మరీ అంత అమాయకంగా ఎవరైనా ఉంటారా ? ఎప్పుడో నాలుగేండ్ల క్రితం దరఖాస్తు చేసిన దానికే ఇంతవరకు అనుమతి రాకపోతే జనవరిలో చేసిన దానికి వెంటనే అనుమతి ఎలా వస్తుంది ? ఇదంతా చూస్తే కందకు లేని దురద కత్తిపీటకు అన్నట్లు గిలీడ్‌ కంపెనీ తాపీగా ఉన్నా జర్నలిస్టులు కొందరు గోక్కుంటున్నారు.
ఇక రెమ్‌డెసివవిర్‌ గత కొద్ది వారాలుగా వార్తల్లో ఉంది. ఆ ఔషధాన్ని తయారు చేశారు గానీ ఎక్కడా ఉత్పత్తి చేయటం లేదు. ఎబోలా కోసం తయారు చేసిన దానిని ఇప్పుడు కరోనాకు ఉపయోగపడుతుందేమో చూద్దాం అన్నట్లుగా గిలీడ్‌ కంపెనీ ఉంది.కోవిడ్‌-19 రోగులు 63 మంది మీద ప్రయోగిస్తే 36 మందికి కాస్త గుణం కనిపించిందని, ఇంకా ప్రయోగదశలోనే ఉందని, ప్రపంచంలో ఎక్కడా చికిత్సకు అనుమతించలేదని కంపెనీ సిఇఓ డేనియల్‌ ఓడే ఏప్రిల్‌ 10న ప్రకటించినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్త పేర్కొన్నది.ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఫలితాలు వెల్లడైన తరువాత వినియోగం గురించి పరిశీలిస్తామని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్‌) శాస్త్రవేత్త రామన్‌ గంగా ఖేద్‌కర్‌ చెప్పారు. 2015లో ఇదే కంపెనీ తయారు చేసిన హెపటైటిస్‌ సి ఔషధం గురించి చేతులు కాల్చుకున్న ఐసిఎంఆర్‌ అంత రెమ్‌డెసివర్‌ గురించి ఆసక్తి ప్రదర్శించటం లేదని కూడా వార్తలు వచ్చాయి. పనికి వచ్చేట్లయితే జనరిక్‌ ఔషధం తయారు చేసేందుకు గిలీడ్‌ కంపెనీ స్వచ్చందంగా అనుమతిస్తే తయారు చేయవచ్చని కొందరు అంతకు ముందు ఆలోచన చేశారు. మరికొన్ని వార్తల ప్రకారం ఇదే ఔషధంపై చైనాలోని రెండు ఆసుపత్రులలో 28 మగ చిట్టెలుకల మీద ప్రయోగాలు జరపగా వాటిలో వీర్య కణాల సంఖ్య తగ్గినట్లు, అసహజత పెరిగినట్లు ప్రాధమిక పరశీలనల్లో వెల్లడైంది.దీని గురించి ఎలాంటి నిర్దారణలకు ఇంకా రాలేదని ఏప్రిల్‌ 23న ఒక వెబ్‌సైట్‌ పేర్కొన్నది. ఇలాగే అమెరికా, బ్రిటన్‌, మరికొన్ని దేశాలలో కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది కోవిడ్‌-19కు పని చేయదని తేలినట్లు గిలీడ్‌ కంపెనీ గతశుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపిందని కూడా వార్తలు వచ్చాయి.
చైనా దరఖాస్తు గురించి తమకు తెలుసునని, అయితే వచ్చే ఏడాది ఆ వివరాలను ప్రచురించేంత వరకు దాని గురించి తామేమీ చెప్పలేమని గిలీడ్‌ చెప్పింది. ఎబోలాకు తయారు చేసిన తమ ఔషధం కరోనాకు పనికి వస్తుందా లేదా అన్న అధ్యయనాన్ని నిలిపివేసినట్లు కూడా పేర్కొన్నది. ఒక కంపెనీ తయారు చేసిన దాన్ని మరొక దేశంలో పేటెంట్‌ కోరినా మంజూరు కాదు.గిలీడ్‌ కంపెనీ తమ ప్రయోజనాలకు భంగం కలుగుతోందని ఫిర్యాదు అయినా చేసి ఉండేది, ఒక వేళ అదే నిజమైతే ఈ పాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశ కంపెనీ తయారు చేసిన దాన్ని చైనా తస్కరించిందని ఈ పాటికే నానా యాగీ చేసి ఉండేవాడు. బహుశా ఈ ఔషధ ప్రయోగాల గురించి చెప్పి ఉంటే అది నిజమని నమ్మి కొద్ది రోజుల్లో వాక్సిన్‌ తయారు చేయాలని రెండు నెలల క్రితం ట్రంప్‌ బహిరంగంగా విలేకర్ల సమావేశంలో చెప్పాడని అనుకోవాల్సి వస్తోంది. కోవిడ్‌ -19 చికిత్సకోసం అమెరికా, ఐరోపాల్లో వాక్సిన్ల పేటెంట్‌ గురించి నంబర్లతో సహా సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతోంది. ఎఎఫ్‌పి వార్తా సంస్ధ వాటి గురించి నిర్ధారణ చేసుకొని అవన్నీ నకిలీ అని తేల్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై విచారణ సరే ముందు అమెరికా, జర్మనీ నేరాల మాటేమిటి !

22 Wednesday Apr 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#China biological weapons, american crimes against humanity, COVID- 19 pandemic, Donald trump angry at China, German crimes against humanity

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ తొలుత బయట పడిన ఊహాన్‌ నగరంలో జరిగిందేమిటో తెలుసుకొనేందుకు తమ తనిఖీదార్లను అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశాడు. ఈ డిమాండ్‌ను చైనా తోసి పుచ్చింది. కరోనా గురించి సకాలంలో హెచ్చరించని కారణంగా తమ దేశానికి జరిగిన నష్టం 20లక్షల కోట్ల డాలర్లు చైనా చెల్లించాల్సిందే అని అమెరికన్లు కొందరు తమ దేశంలో దావా దాఖలు చేశారు. చైనా మీద కేసులు అమెరికా కోర్టుల్లో దాఖలు చేయటం ఏమిటో, అవి విచారణ జరిపే ప్రహసనం ఏమిటో రాబోయే రోజుల్లో చూద్దాం. ఇదే విధంగా తమకు 149 బిలియన్‌ యూరోల నష్టపరిహారం చెల్లించాలని జర్మన్‌ పత్రిక బిల్డ్‌ పేర్కొన్నది. రాబోయే రోజుల్లో ఇంకా ఇతర దేశాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్‌లు రావచ్చు. అవెంత ఉంటాయో తెలియదు. ఈ డిమాండ్లు న్యాయసమ్మతమేనా ? ఆచరణ సాధ్యమేనా ?
నావరకు అయితే కొన్ని చిన్న చిన్న షరతులతో న్యాయసమ్మతమే, ఆచరణ సాధ్యమే ! అదెలాగో తరువాత చూద్దాం.ఈ వార్తలను చూసి చాలా మంది చైనా తిక్క కుదిరింది అనుకుంటున్నారు. దాఖలు చేయని కేసులను కూడా వేసినట్లే సంబర పడుతున్నారు. ముందు తమ దేశాల్లో కరోనా నివారణ చేయకుండా ఇదేమిటి అనుకొనేవారు కూడా లేకపోలేదు. ఇలాంటి నష్ట పరిహారం కోరేవారు నిజంగా సాధించేందుకు అవకాశాలున్నాయని నమ్ముతున్నారా ? లేక ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు ట్రంప్‌ ఇలాంటి కేసులను వేయిస్తున్నాడా అన్నది అనుమానమే. అసలు ఇప్పుడున్న ప్రపంచ వ్యవస్ధలో అలాంటి అవకాశాలు ఉన్నాయా? ఐక్యరాజ్య సమితి నిర్ధారించిన మార్గదర్శక సూత్రాల మేరకు అంతర్జాతీయ నేరాలుగా పరిగణించిన వాటిని విచారించేందుకు అంతర్జాతీయ న్యాయ స్ధానం ఉంది. చైనాలో వెలువడిన కరోనా వైరస్‌ అలాంటి నేరంగా ఎవరూ ఎక్కడా నిర్ధారించలేదు. చరిత్రలో ఎప్పుడైనా నిజంగా తప్పు చేసిన ఏ దేశమైనా ఎవరికైనా పరిహారం చెల్లించిందా ?


అమెరికా ఏమిటి ఏ దేశమైనా దేని గురించి అయినా స్వంత విచారణలు జరుపుకోవచ్చు. కోరుకున్న తీర్పులు రాసుకోవచ్చు. రద్దు కింద అమ్ముకోవటానికి తప్ప అవి దేనికి పనికి వస్తాయి ? ఆ దేశాలన్నీ ముందు చైనాలో వైరస్‌ను ఎలా అరికట్టారో తమ దేశాలలో ఎలా జనం ప్రాణాలు తీస్తున్నారో తెలుసుకోవాలి. ఇతర దేశాల్లోకి స్వంత దర్యాప్తు బృందాలను పంపటానికి ఏ దేశానికీ హక్కు లేదు, అవకాశం అంతకంటే లేదు. అదే నిజంగా ఉంటే పాకిస్ధాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలను ఈ పాటికే మన కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసి ఉండేది, అదే విధంగా పాక్‌ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మన మీద చేసిన ఆరోపణలను విచారించే వారు. అమెరికాలో అత్యధిక కేసులు ఐరోపా నుంచి దిగుమతి అయ్యాయి. అందువలన ఆ దేశాల మీద ముందు అమెరికా దర్యాప్తు జరపాలి. ఇప్పటికే ప్రపంచ పోలీసుగా తనకు తాను బాధ్యత తీసుకున్న అమెరికా దాదాపు అన్ని చోట్లా చావు దెబ్బతిన్నది. ఇప్పుడు ప్రపంచ న్యాయమూర్తిగా మారదలచుకున్నట్లు కనిపిస్తోంది. అత్యాశగాకపోతే అది సాధ్యమేనా ?
చైనాలోని ఉహాన్‌ వైరాలజీ సంస్ధ అధిపతి, చైనా మిలిటరీ మేజర్‌ జనరల్‌ తమ దేశంలో కరోనా వ్యాప్తి, మరణాలకు కారకులని, నష్టపరిహారంగా 20లక్షల కోట్ల డాలర్లు చెల్లించాలని అమెరికాలోని ఒక లాయర్‌, మరో ఫొటోల కంపెనీ, మరో ఇద్దరు కేసులు దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ పిచ్చి కేసుకు ప్రపంచ వ్యాపితంగా ప్రచారం తప్ప మరొక లాభం ఉండదు. అది కోరిన మొత్తం చైనా జిడిపికంటే ఎక్కువ. అంటే చైనా మొత్తాన్ని అమ్మినా అంత సొమ్ము రాదు, అసలు కొనే వారెవరు అన్నది వేరే విషయం. ఆస్ట్రేలియా ఎలాంటి నష్ట పరిహారం కోరలేదుగానీ అమెరికా ఏది మాట్లాడితే దానికి వత్తాసుగా పలుకుతోంది. ఇక జర్మనీలో అత్యధిక ఆదరణ కలిగిన పత్రిక ” బిల్డ్‌ ” సంపాదకులు తమ దేశానికి చైనా కారణంగా వివిధ రంగాలకు 149 బిలియన్‌ యూరోల మేరకు నష్టం జరిగిందని ఆ మొత్తం చెల్లించాలని రాశారు. అయితే ఇందుకోసం ఎలాంటి కేసులు గట్రా దాఖలు చేయలేదు.
ఇక చైనా మీద విచారణ అంశాన్ని దానికి గాను నేను ముందే చెప్పిన షరతుల సంగతి చూద్దాం. ఎప్పుడో క్రీస్తు పూర్వం సంభవించిన వైరస్‌ల మూలాలు ఏదేశంలోనివో ఇప్పుడు నిర్ధారించటం కష్టం. ఎందుకంటే నాడున్న దేశాలు లేదా సామ్రాజ్యాలు నేడు లేవు గనుక నిందితులు ఫలానా అని నిర్దారించలేము. నిజానికి ఏ దేశం తప్పుచేసినా విచారణ జరిపేందుకు ప్రపంచ రాజ్యాలు ఏక క్రీవంగా అంగీరించి ముందు ఐరాస భద్రతా మండలిలో తీర్మానం ఆమోదించాలన్న చిన్న షరతును ముందు నెరవేర్చాలి. ఆ మేరకు ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కనుక మొదటి ప్రపంచ యుద్ధాన్ని తీసుకుందాం, లేదూ ఎవరైనా అంతకు ముందు నుంచే విచారణ ప్రారంభించాలి అంటే అభ్యంతరమూ లేదు.చైనాకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం లేదు.
కరోనా వైరస్‌ను చైనా తయారు చేసిందనటానికి ఎలాంటి ఆధారాలు లేవు. మానవాళి చరిత్రలో అతి పెద్ద మహమ్మారి ప్లేగు వ్యాధి అని తెలిసినా కొన్ని వందల సంవత్సరాలు గడచి నందున దానికి సంబంధించిన అంశాలు పూర్తిగా నిర్దారించలేము. మనకు బాగా తెలిసిన స్పానిష్‌ ఫ్లూ(ప్రపంచానికి తెలిసిన తొలి హెచ్‌1ఎన్‌1 వైరస్‌). మొదటి ప్రపంచ యుద్ధం చివరిలో ప్రబలింది. ఇది ఐరోపాలోనా, అమెరికాలోనా ఎక్కడ ప్రారంభమైంది అన్న అంశం మీద వివాదం ఉంది. భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఎక్కువ పరిశీలనలు అమెరికా వైపే వేలు చూపుతున్నాయి. నిజానికి ట్రంప్‌కు, జర్మన్‌ పత్రిక బిల్డ్‌ సంపాదకులకు, వారిని సమర్ధించే వారికి చిత్తశుద్ధి ఉంటే ఈ వైరస్‌ ఎక్కడ ప్రారంభమైందో ఇప్పుడు ఉన్న ఆధారాల ప్రకారం నిర్ధారించాలి. చైనాలో విచారణకు తమ నిపుణులను అంగీకరించాలని ట్రంప్‌ కోరాడు. అలా ఒక దేశం కాకుండా భద్రతా మండలిలో ఇప్పుడు అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా సభ్యరాజ్యాలుగా ఉన్నాయి కనుక వాటి ప్రతినిధులను ఎంపిక చేసి విచారణ జరిపించాలి. ఆ నివేదిక ప్రాతిపాదికన నష్టాలను నిర్ధారించి ఆ మొత్తాలను బాధిత దేశాలకు పంచాలి. ఇదేమీ పెద్ద షరతు కాదు, అసాధ్యమైంది అంతకంటే కాదు.


1918 జనవరి నుంచి 1920 డిసెంబరు వరకు ప్రపంచ వ్యాపితంగా నాడు ప్రపంచంలో ఉన్న మూడో వంతు జనాభా 50 కోట్ల మందికి సోకింది. కోటీ 70లక్షల నుంచి ఐదు కోట్ల మందికి, మరికొందరి అంచనాల ప్రకారం పది కోట్ల మంది దుర్మరణం చెందారు. ఇది మొదటి ప్రపంచ యుద్దంలో పాల్గొన్న దేశాలు గావించిన నష్టానికి అదనం, ప్రపంచ ఆధిపత్యం కోసం యుద్దాన్ని తెచ్చిన దేశాలు, స్పానిష్‌ ఫ్లూ నష్టాలను కలిపి లేదా విడిగా తేల్చి దానిలో ఎవరి వాటా ఎంతో ఎలా చెల్లిస్తారో అమెరికా, ఐరోపా దేశాలు ముందు తేల్చుకోవాలి. ఆ యుద్ధంలో స్పెయిన్‌ తటస్ధంగా ఉంది. అయితే ఆ సమయంలోనే తలెత్తిన ఫ్లూ సోకి రాజు 13వ ఆల్‌ఫోన్సో మరణించటంతో నేటి మాదిరే నాటి పత్రికలు కూడా వెనుకా ముందూ చూడకుండా స్పెయిన్‌లోనే పుట్టిందని దానికి స్పానిష్‌ ఫ్లూ అని రాశాయి. తరువాత స్పెయిన్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిసినా ఆ పేరు వాడుకలో ఉండిపోయింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్ద కరోనాకు కోవిడ్‌-19 అని పేరు పెట్టినా చైనా వైరస్‌ అని నిందిస్తున్న మాదిరి అన్నమాట. ఈ ఫ్లూ కొనసాగింపుగా 2009లో స్వైన్‌ ఫ్లూ వచ్చింది కనుక దీన్ని కూడా చేర్చి విచారణ జరపాలి. ఇది పుట్టింది అమెరికాలోనా, మెక్సికోలోనా మరొక చోటా అన్నది ఆ దేశాలు తేల్చాలి. పనిలో పనిగా ఎయిడ్స్‌ను ఎక్కడ తయారు చేసి ప్రపంచం మీద వదిలారో కూడా తేల్చి పరిహారం చెల్లించాలి.
మన కళ్ల ముందే ఇరాక్‌లో మారణాయుధాలు, జీవ రసాయన ఆయుధాల గుట్టలు ఉన్నట్లు ప్రచారం చేసిన అమెరికన్ల గురించి తెలుసు. ఆ పేరుతో ఇరాక్‌ మీద దాడి చేసి పదిలక్షల మంది ప్రాణాలు తీశారు. దేశాన్ని సర్వనాశనం చేశారు. తీరా తమ తనిఖీలో ఎలాంటి జీవ, రసాయన ఆయుధాలు లేవని స్వయంగా అమెరికన్లే ప్రకటించారు. అంతే కాదు ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రవేశించి అపార ప్రాణ నష్టానికి కారకులయ్యారు. ఇస్లామిక్‌ తాలిబాన్‌(ఉగ్రవాదులు)లను సృష్టించారు. ఈ రోజు వారు ప్రపంచ వ్యాపితంగా చేస్తున్న దుర్మార్గాలకు గాను ఎవరు పరిహారం చెల్లిస్తారు, ట్రంప్‌ మెడపట్టి బాధిత దేశాలన్నీ నష్టపరిహారం కోరాలి. విచారణకు డిమాండ్‌ చేయాలి. పాక్‌ ఉగ్రవాదులు తాలిబాన్ల శిక్షణలోనే తయారయ్యారు కనుక మన మోడీ గారు కూడా స్నేహితుడనే విషయాన్ని పక్కన పెట్టి ఈ విషయంలో అమెరికా, ట్రంప్‌ను పరిహారం కోరాలి.

American Crime Case #23: The Afghanistan and Iraq War Logs and the ...
రెండవ ప్రపంచ యుద్ధంలో మిగతా వన్నీ పక్కన పెడితే కొన్ని దేశాలు ప్రత్యేకంగా చేసిన నేరాలు ఉన్నాయి. వాటిని విచారణ జరిపి శిక్షలు కూడా వేశారు. ఆ యుద్దం ముగింపు దశలో అమెరికన్లు జపాన్‌లోని నాగసాకి,హిరోషిమా పట్టణాల మీద వేసిన రెండు అణుబాంబులు ఎంత మందిని బలితీసుకున్నాయో తెలుసు. తొలిసారి అవసరం లేకపోయినా చేసిన ఈ దాడికి అమెరికన్లు జపాన్‌కు ఎంత నష్టపరిహారం ఇస్తారో ముందు తేల్చాలి. అమెరికా మిత్ర దేశంగా జపాన్‌ ఉంది కనుక ఆ పరిహారాన్ని తీసుకోవాలా లేదా అన్నది వేరే విషయం. జపాన్‌ మిలిటరీ చైనా పట్టణాలపై ప్లేగు బాంబులు వేసి ప్లేగు వ్యాధిని వ్యాపింప చేసి దొరికి పోయి విచారణ ఎదుర్కొన్న విషయం దాస్తే దాగేది కాదు. అందువలన దానికి చైనాకు ఎంత నష్ట పరిహారం ఇస్తారో జపాన్‌ కూడా తేల్చాలి. వియత్నాం ఇతర ఇండో చైనా దేశాలేమీ ఎవరి మీదా దాడులు చేయలేదు, దురాక్రమణకు పాల్పడలేదు. అయినా జపాన్‌, ఫ్రెంచి, అమెరికా సామ్రాజ్యవాదులు దశాబ్దాలతరబడి దాడులు చేసి కలిగించిన అపార నష్టానికి ఆ మూడు దేశాలు నష్టపరిహారం చెల్లించాలి, ఎవరి వాటా ఎంతో అవే తేల్చుకోవాలి.
ఇక జర్మనీ సంగతి. రెండవ ప్రపంచ యుద్దం సందర్భంగా 60లక్షల మంది యూదులు, కోటీ పదిలక్షల మంది ఇతరులను బలిగొన్న నాజీ సైన్యాలను నడిపింది జర్మనీ. గ్యాస్‌ ఛాంబర్లలో ఏ రసాయనాన్ని పంపి హత్యలు చేశారో వెల్లడించాలి. దానికి ఎంతో నష్టపరిహారం చెల్లించాలో ముందు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బిల్డ్‌ సంపాదకుడు తగుదునమ్మా అంటూ ఆధారాలు లేని చైనాను నష్టపరిహారం అడుగుతున్నాడు.
మన దేశాన్ని బ్రిటన్‌ ఆక్రమించి మనక ఎంత నష్టం కలిగించిందో తెలిసిందే. అందువలన దాని మీద కూడా విచారణ జరిపి నష్టపరిహారాన్ని రాబట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వ్యక్తులు లేదా దేశాల మీద ఆపాదించినంత మాత్రాన నేరంచేసినట్లు కాదు. చైనా మీద కూడా ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు.పైన చెప్పుకున్న దేశాల నేరాలు ఇప్పటికే రుజువయ్యాయి. అందువలన నిందితులను, నష్టపరిహారాన్ని తేల్చి తరువాత చైనా సంగతి మాట్లాడాల్సి ఉంటుంది. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడిన చరిత్ర ఇప్పటి వరకు సామ్రాజ్యవాదులదే, ఏ సోషలిస్టు దేశానికి అలాంటి చరిత్ర లేదు. ఒక వేళ ఎవరైనా నిరూపిస్తే దానికి ఎలాంటి అభ్యంతరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆహారం కోసం ఆరు గంటలపాటు క్యూలో కార్లున్న అమెరికా ”పేదలు” !

20 Monday Apr 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

US food banks, US food stamps

Food Banks Are Overrun, as Coronavirus Surges Demand - The New ...

ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాతలు చేసే అన్నదానం ఇతర సాయం కోసం మన దేశంలోని పేదలు ఎలా ఎదురు చూస్తున్నారో నిత్యం చూస్తున్నాం. అత్యంత ధనిక దేశమైన అమెరికా పేదలు అదేపని చేస్తున్నారు. మనకు వారికీ తేడా ఏమిటంటే మన పేదలకు కాళ్లకు చెప్పులు కూడా ఉండవు. అమెరికా పేదలకు విలాసవంతమైన కార్లుంటాయి. అక్కడా ఇక్కడా పేదలు చేయి చాచటం ఒకేవిధంగా ఉంటుంది. మన పిల్లలు అనేక మంది ఇప్పుడు అమెరికాలో చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. వారికి కనీసం దాతలు లేదా ప్రభుత్వం అందచేసే ఆహారం ఏమేరకు అందుతోందో లేదో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలియదు. ఆహార కూపన్లకు అర్హులో కాదో కూడా చెప్పలేము. మన దేశంలోని వలస కూలీలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో అర్ధం చేసుకుంటే అమెరికా స్ధాయిలో అక్కడ ఉపాధి కోసం వెళ్లిన వారు కూడా ఇలాగే ఉండి ఉంటారు.
మన రైతాంగం పండించిన పంటలను విధిలేక అయినకాడికి అమ్ముకోవటం లేదా కూలీ ఖర్చులు కూడా రాకపోతే పొలాల్లోనే దున్నివేయటం కొత్త కాదు. ఇప్పుడు అమెరికాలో రైతులు అనేక చోట్ల ఇప్పుడు అదే చేస్తున్నారు. చికాగో సన్‌ టైమ్స్‌ పత్రిక ఏప్రిల్‌ 15న రాసిన సంపాదకీయం ప్రకారం పితికిన పాలను కొనే వారు లేక రైతులు గోతుల్లో పోస్తున్నారు. కూరగాయల పొలాలను దున్ని పంటను మట్టిలో కలిపివేస్తున్నారు. అమెరికా ఎదుర్కొంటున్న ఈ నూతన సవాలును కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అది కోరింది. ఇది రాస్తున్న సమయానికి ప్రపంచంలో కరోనా మరణాలు లక్షా 65వేలు కాగా ఒక్క అమెరికాలోనే 40వేల మంది చనిపోయారు. ప్రపంచంలో 24లక్షల మంది వైరస్‌బారిన పడితే అమెరికాలో ఏడులక్షల 65వేల మంది ఉన్నారు. తన ఏలుబడిలో ఇంత దారుణం ఎలా జరిగిందో దర్యాప్తు జరిపించాల్సిన అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం తమ నిపుణులను చైనా పంపి కరోనా వైరస్‌ ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో దర్యాప్తు చేయిస్తానని కబుర్లు చెబుతున్నాడు. అమెరికాలో ఇంతగా పరిస్దితి ఎందుకు దిగజారిందో ఏదో ఒక దేశం కాదు కనీసం ఐక్యరాజ్యసమితి బృందాన్ని అయినా అధ్యక్షుడు అనుమతిస్తాడా !
పరిస్ధితులు బాగున్నాయి అనుకున్నపుడే అమెరికాలో ఆహార భద్రత లేని కుటుంబాలు 1.43కోట్లు ఉన్నట్లు 2018 వ్యవసాయ శాఖ నివేదిక పేర్కొన్నది. గత నాలుగువారాల్లో నిరుద్యోగులుగా మారామని, భృతి ఇవ్వాలని కోరుతూ 2.2కోట్ల మంది లేదా అమెరికా కార్మికవర్గంలో 13శాతం దరఖాస్తు చేశారు.వీరిలో దాదాపు సగం మంది యజమానులు ఆరోగ్యబీమా కల్పించిన వారే. ఇప్పుడు నిరుద్యోగులు కావటంతో ఆ రక్షణ ఉద్యోగం నుంచి తొలగించిన మూడు నెలలవరకు మాత్రమే ఉంటుంది. తరువాత కొనసాగాలంటే కార్మికులు తమ జేబుల నుంచి ఆ మొత్తాన్ని చెల్లించాలి లేదా బీమా లేకుండా జీవించాలి. భృతి దరఖాస్తుదారుల్లో 59 మంది మహిళలు ఉన్నారంటే నిరుద్యోగం వారి మీద ఎలాంటి ప్రభావం చూపనుందో అర్ధం చేసుకోవచ్చు.రోడె ఐలాండ్‌లోని పదిలక్షల మంది జనాభాలో 1.66లక్షల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారు. రోజుకు నాలుగు వందల దరఖాస్తులు వస్తున్నాయి.
ఆహార భద్రత లేని వారు అమెరికాలో 2019లో 3.7కోట్ల మంది ఉన్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. వీరిలో కోటీ పదిలక్షల మంది పిల్లలు,54లక్షల మంది వృద్దులు ఉన్నారు. కరోనా కేసుల మాదిరి ఈ సంఖ్యలు రోజు రోజుకూ మారిపోతున్నాయి. పేదలకు ఆహారం అందచేసే ఫీడింగ్‌ అమెరికా అనే ధార్మిక సంస్థ ఇప్పుడు నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అంతే కాదు అవసరమైన ఆహారాన్ని నిల్వచేసేందుకు అది నిర్వహించే ఆహార బ్యాంకులు, ఇతర సామూహిక వంటశాలలకు తగిన విస్తీర్ణం కలిగిన గోడవున్లు కూడా లేవని వార్తలు వస్తున్నాయి. కొత్తగా ఆహారం కోసం లైన్లలో నిలుస్తున్నవారికి అధిక ధరల్లో ఆహారం కొనాల్సి వస్తోంది. సూపర్‌ మార్కెట్ల నుంచి వచ్చే విరాళాలు నాటకీయంగా పడిపోయాయి. గార్డియన్‌ పత్రిక విలేకర్లు సేకరించిన సమాచారం ప్రకారం పెన్సిల్వేనియా ఆహార బ్యాంకులు వారానికి పదిలక్షల డాలర్లు అదనంగా ఖర్చు చేస్తున్నా వచ్చిన వారందరికీ ఆహారం అందచేయలేకపోతున్నాయి. అనేక కేంద్రాల బడ్జెట్లు తారుమారవుతున్నాయి. బియ్యం ధరలు మూడు రెట్లు పెరిగాయి, అవి బంగారంలా మారాయి, డబ్బాల్లో నిల్వఉండే పండ్లు, కూరగాయలు దొరకటం లేదు.గత సంవత్సరం నాలుగు కోట్ల మంది అమెరికన్లు 200 ఆహార బ్యాంకులు, 60వేల వంటశాలల వండిన ఆహారం లేదా వంట వస్తువులను పొందారు.

Electric car drivers face queues and quarrels
లాస్‌ వేగాస్‌లో విలాసవంతమైన కార్లు వేసుకొని తెల్లవారు ఝామున నాలుగు గంటలకు వచ్చి ఆరుగంటల పాటు వరుసలో ఉండి ఆహారాన్ని తీసుకుపోతున్నవారు ఉన్నారు. గత వారం శాన్‌ ఆంటోనియోలో అసాధారణ రీతిలో పదివేల మంది కార్లలో ఆహారం కోసం వచ్చారు. అదే సాధారణ సమయాల్లో నాలుగు వందల మంది వచ్చే వారు. కంపెనీల్లో లేఆఫ్‌లు పెరగటమే దీనికి కారణం. అనేక చోట్ల ఆహార బ్యాంకుల వద్ద భద్రతా సిబ్బందిని నియమించాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఇండ్లకే ఆహారం సరఫరా చేస్తున్నారు. సియాటిల్‌ నగరంలోని ఒక ఆహారబ్యాంకు బడ్జెట్‌ ఇప్పటి తీరును బట్టి ఎనిమిది రెట్లు పెరిగే అవకాశం ఉంది. ట్రంప్‌ వాణిజ్య యుద్దం కారణంగా ఆహార బ్యాంకులకు 2019లో 0.54 మిలియన్‌ డాలర్లకు వచ్చిన సరకులను కొనుగోలు చేయటానికి 2018లో 1.1మిలియన్‌ డాలర్లు కాగా ఈఏడాది అదే సరకుల విలువ 1.71 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. కరోనాకు ముందు లూసియానాలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఆకలితో ఉంటే ఇప్పుడు ముగ్గురిలో ఒకరు ఉన్నారు.
అమెరికన్లకు పొదుపు అలవాటు లేదు, ఉద్యోగాలు లేదా అప్పులు చేసి అవసరమైనవి కొనుగోలు చేసి బతికే విధంగా తయారయ్యారు. గత ఏడాది వివరాల ప్రకారం అమెరికన్లు 14లక్షల కోట్ల డాలర్ల మేరకు అప్పులు కలిగి ఉన్నారు. వాటిలో కార్ల రుణాలు 1.3లక్షల కోట్ల డాలర్లు, క్రెడిట్‌ కార్డు బకాయిలు లక్ష కోట్ల డాలర్లు, విద్యా రుణాలు 1.48 లక్షల కోట్లు, 9.4లక్షల కోట్ల తనఖా రుణాలు ఉన్నాయి.కొరత పోషకాహార సహాయ పధకానికి ఆహార కూపన్ల కోసం దరఖాస్తు చేసే వారికి గత డిసెంబరులో ట్రంప్‌ సర్కార్‌ సవరించిన నిబంధనల కారణంగా కనీసం ఏడు లక్షల మంది అనర్హులయ్యారని అంచనా. విధించిన షరతులను బాధితులు రుజువు చేయటం కష్టంగా మారింది. పద్దెనిమిది-49 సంవత్సరాల మధ్య వయస్సు వారు తమ మీద ఎవరూ ఆధారపడిలేరని, తాము వారానికి 20గంటలు పనిచేశామని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇవి చేసినా వారు మినహాయింపులు పొందిన ప్రాంతాలు, రాష్ట్రాలలో ఉన్నవారై ఉండాలి. దారిద్య్రరేఖ కింద ఉన్న వారి సంఖ్యను తక్కువ చేసి చూపేందుకు,నిరుద్యోగ భృతి చెల్లింపును ఎగవేసేందుకు ఈ పని చేశారు.

Rice is like gold': US food banks face shortfalls of millions of ...
అమెరికాలో రోజు రోజుకూ వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. ఎప్పటికి అదుపులోకి వస్తాయో చెప్పలేని స్ధితి. మరోవైపు నవంబరులో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి కూరుకుపోతున్నట్లు ఆందోళన పెరుగుతోంది. కరోనాకు ముందు, వ్యాధి తొలి రోజుల్లో ఎన్నికల్లో ట్రంప్‌ విజయం ఖాయం అని భావించిన వారు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. ట్రంప్‌ వైఫల్యం, మూర్ఖత్వం పౌరుల ప్రాణాల మీదకు తెచ్చింది. మరోవైపు డెమోక్రటిక్‌ పార్టీ తరఫున జోబిడెన్‌ అభ్యర్ధిత్వం ఖరారైంది. ప్రస్తుతం దేశమంతా కరోనా కల్లోలంలో మునిగి ఉంది. ముఫ్పైకోట్ల మంది గృహబందీలో ఉన్నారు. ఎప్పుడు తొలగించేది తెలియని స్ధితి. ఒక వైపు ఆకలి మరోవైపు నిరుద్యోగం, ఆర్ధిక మాంద్యం పెరుగుతున్న స్ధితిలో వాటి మీద కేంద్రీకరించకుండా జనాన్ని తప్పుదారి పట్టించేందుకు ట్రంప్‌ చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్ధ మీద ప్రారంభించిన ప్రచార యుద్దం అతగాడికే ఎదురుతిరిగే అవకాశాలున్నాయన్నది ఒక అంచనా !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d