• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Women

“ఆంధ్రా వలస పాలకులు” ఏ ప్రాంతాన్ని ఎలా తయారు చేశారు ?

23 Saturday Jan 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Education, Health, NATIONAL NEWS, Women

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, NFHS_4, Telangana

పదేళ్లలో వూబకాయులు రెట్టింపు-రక్త హీనత తగ్గినా ఆందోళనకరమే-ఏపి పురుషులలో ఎక్కువ

రెండు తెలుగు రాష్ట్రాలలో వూబకాయ సమస్య వేగంగా పెరుగుతోంది. పది సంవత్సరాల క్రితం పొడువు కంటే ఎక్కువ బరువున్న స్త్రీ ,పురుషుల పట్టణ, గ్రామీణ ప్రాంతాల సగటు 17.7, 17.6 వుండగా ప్రస్తుతం ఏపిలో 33.2, 33.5, తెలంగాణాలో 28.1,24.1 శాతానికి పెరిగింది. రెండు చోట్లా పట్టణాలలో ప్రస్తుతం ఏపిలో 45.6, 44.4 చొప్పున స్రీ, పురుషులలో వూబకాయం శాతాలున్నాయి.అదే తెలంగాణాలో 39.5,31.9గా వున్నాయి.

రక్త హీనత విషయానికి వస్తే రెండు రాష్ట్రాలలోనూ గతంతో పోల్చితే కొంత మెరుగు పడినప్పటికీ ఇంకా అందోళనకర స్ధాయిలోనే వుంది. పిల్లలు, స్త్రీలలో 79.6,62.7 నుంచి ఏపిలో 58.6,60.2కు తెలంగాణాలో 60.7, 56.7తగ్గింది.పట్టణాలలో వూబకాయాలు ఎక్కువుంటే గ్రామాలలో రక్తహీనులు ఎక్కువగా వున్నారు.పురుషులలో పదేళ్లనాడు 17.6శాతం రక్త హీనత వుంటే ప్రస్తుతం ఏపిలో వారిశాతం 26.9కి పెరగ్గా , తెలంగాణాలో 15.4కు తగ్గింది.

జన జీవితంలోని కొన్ని సూచికలు

ఎం కోటేశ్వరరావు

     అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ విడిపోయింది, వుద్రేకాలు తగ్గాయి. తాపీగా కాకపోయినా ఎవరి రాష్ట్రాన్ని వారు బాగు చేసుకోవాలంటే నిజాయితీగా ఆలోచించాల్సిన సమయమిది. రాష్ట్రం బాగు చేసుకోవటం అంటే వేళ్లమీద లెక్కించదగిన కొన్ని పారిశ్రామిక కుటుంబాలు లేదా సంస్ధల ఆస్తులు పెరగటం కాదు. ప్రజల జీవన సూచికలు అభివృద్ధికి కొలబద్దలుగా అంగీకరిస్తే వాటిని బట్టి సమగ్రంగా గాకపోయినా కొంత మేరకు మనం ఎక్కడున్నామో అర్ధం చేసుకోవచ్చు. వాటిలో ఆరోగ్యం, మరికొన్ని సూచికలను ప్రమాణాలుగా ఐక్యరాజ్యసమితి తీసుకుంది. అందువలన అంతకంటే మెరుగైన కొలబద్దలు రూపొందే వరకు వాటితోనే మనం కొలవాల్సి వుంటుంది. కొత్త రాష్ట్రం తెలంగాణా జనంలో ఎన్నో ఆశలు, ఇంకా సజీవంగానే వున్నాయి. మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేదు, రాదు అని అధికారికంగా చెప్పకపోయినా అక్కడి వారు మాట్లాడటం లేదంటే తెలుగుదేశం పార్టీ, బిజెపి, వారి కనుసన్నలలో మెలిగే మీడియా అంతకంటే ఎక్కువే ప్రయోజనం కలిగిస్తారని చెప్పిన మాటలను మరోసారి ప్రజలు నమ్మారని భావించాలి. ఎందుకంటే అమరావతి రాజధాని శంకుస్ధాపన సభకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ కుండలో పార్లమెంట్‌ ప్రాంగణంలోని కాస్తంత మట్టి ,మురికి యమునా నది నీళ్లు తేవటమే మహాభాగ్యంగా భావించారు మరి. వారిలో కూడా ఇంకా ఆశలు అలాగే వున్నాయి.

      అంధ్రవలస పాలకుల కారణంగా తెలంగాణా ప్రాంత ఆదాయానికి తగిన విధంగా అభివృద్ధి చెందలేదు కనుక ప్రత్యేక రాష్ట్రం కావాలన్నది ప్రధాన నినాదాలలో ఒకటి. ఇంకా అనేకం వున్నాయనుకోండి, సందర్భం వచ్చినపుడు ముందు ముందు పరిశీలించుకుందాం. ఈనెల 19న కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16కు సంబంధించి కొన్ని రాష్ట్రాల వివరాలను ప్రకటించింది. వాటిలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ మరికొన్ని రాష్ట్రాలు వున్నాయి.తొలిసారిగా జిల్లాల వారీ అంచనాలను అందచేశారు.స్ధానిక భాషలోనే సమాచారాన్ని సేకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది మేనెల ఆరవ తేదీ నుంచి ఆగస్టు నాలుగవ తేదీ వరకు, తెలంగాణాలో ఫిబ్రవరి 23 నుంచి మే నెల తొమ్మిదవ తేదీవరకు సర్వే నిర్వహించారు. అందుకని తప్పుడు సమాచారం అందచేయటానికి లేదా అందించటానికి ఆస్కారం లేదు.

పొగ, మద్యపానంలో స్త్రీలతో సహా తెలంగాణా టాప్‌

మద్యపానం విషయంలో తెలంగాణా రాష్ట్రం అగ్రస్ధానంలో వుంది. అక్కడ స్త్రీలలో సగటున 8.8శాతం మంది తాగుతుండగా గ్రామీణ ప్రాంతాలలో 14.3శాతం, పురుషులలో సగటున 53.9 శాతం వున్నారు. అదే ఏపి విషయానికి వస్తే స్త్రీలు 0.4, పురుషులు 34.9 శాతం వున్నారు. తెలంగాణాలో 2.8శాతం స్త్రీలు, 28.3శాతం పురుషులు పొగతాగుతుండగా ఏపీలో 2.3, 26.8శాతం వున్నారు

    తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ కలసి వున్నపుడు జరిగిన కార్యక్రమాలు, వాటి పర్యవసానాలే ఈ సర్వేలో వెల్లడైన సమాచారానికి ప్రాతిపదికలు. ఎవరైనా ఏడాది కాలంలో మా ముఖ్యమంత్రి అల్లా వుద్దీన్‌ అద్బుత దీపం మాదిరి అభివృద్ధి చేశారు, ఆ ఘనత వారికే చెందాలి అని వాదిస్తే అలాంటి వారికి రెండు రాష్ట్రాలకు కలిపి రెండు రెళ్లు నాలుగు దండాలు. ఈ సర్వేకు సంబంధించి జాతీయ స్థాయి సూచికలు ఎలా వున్నాయి, వాటితో రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటో పోల్చేందుకు ఇంకా మిగతా వివరాలు వెలువడలేదు. అందువలన దక్షిణాదిలో తమిళనాడుతో పోల్చితే రెండు రాష్ట్రాలలో కీలకమైన అభివృద్ధి సూచికలు ఇలా వున్నాయి. ఇది నిజమైన అభివృద్ధి కాదు అంటే వున్న పరిస్ధితి అనుకుందాం.గ్రామీణ, పట్టణాల మొత్తం,అంకెలు శాతాలలో వున్నాయి. మొత్తం 114 ప్ర శ్నలు వేసి సమాచారాన్ని రాబట్టారు. వాటిలో కొన్ని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి. ఎలాంటి వ్యాఖ్యలు లేకుండా ఈ సమాచారాన్ని ఇస్తున్నాం. గతంలో వుమ్మడి రాష్ట్రంగా వున్నపుడు వెల్లడైన సూచికలతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల సూచికలను పోల్చలేము. అందుకే అయితే వుమ్మడి రాష్ట్రంలో వున్న సూచికలతో పోల్చినపుడు రెండు ప్రాంతాలలోని తాజా పరిస్ధితులను బట్టి కొంతమేర అర్ధం చేసుకోవచ్చు. గతంలో కొన్ని వివరాలు సేకరించలేదు కనుక కొన్నింటితో పోల్చుకోలేము కనుక ఆ పరిమితులను గమనంలో వుంచుకోవాలి. గత సర్వే 2005-06లో జరిగింది. వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వివరాలు పదేళ్లనాటి సర్వే వివరాలని గమనించాలి. (వు.అ-వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ఏపి-ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌, టిజి-తెలంగాణా, టిఎన్‌-తమిళనాడు)

                                                                          వు.ఆ     ఏపి     టిజి   టిఎన్‌

1.ఆరేళ్లకు పైబడిన పురుషులలో స్కూళ్లకు వెళ్ళిన వారు                            62.0 62.2 77.2

2. పదిహేనేళ్ల లోపు జనాభా                                                         23.7 25.0 23.3

3వెయ్యిమంది పురుషులకు మహిళలు                                              1020 1007 1033

4.గత ఐదేళ్లలో పుట్టిన వెయ్యిమంది పురుషులకు మహిళలు                          914  874  954

5.అయోడిన్‌ వుప్పు వాడుతున్నవారు                                                81.6  95.8  82.8

6.మెరుగైన మరుగుదొడ్డి వున్నవారు                                                   53.6  50.2  52.2

7.మంచినీటి సౌకర్యం వున్నవారు                                                       72.7  77.6  90.6

8 వంటకు గ్యాస్‌, విద్యుత్‌ వాడుతున్నవారు                                             62.0  66.8  73.0

9.మహిళా అక్షరాస్యులు                                                                  62.9 65.2   79.4

10.పురుష అక్షరాస్యులు                                                                  79.4  83.4  89.1

11. పదేళ్లకు పైగా చదువుకున్న మహిళలు                                      21.9   34.3  43.3  50.9

12. పద్దెనిమిదేళ్లకు ముందే వివాహమైన యువతులు                            54.8   32.7  25.7  15.7

13.21ఏళ్లకు ముందే వివాహిత యువకులు                                      34.0   23.5   23.9  17.0

14.ప్రసవ సమయంలో మరణాలు                                                             35     28    21

15.ఐదేళ్లలోపు పిల్లల మరణాలు                                                              41      32    27

16.ఏదో ఒక కుటుంబనియంత్రణ                                                    67.6  69.5   57.2   53.3

17.మహిళలకు ఆపరేషన్లు                                                                  68.3   54.2     49.4

18.ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవానికి అదనపు ఖర్చు రు.                                 2,138 4,020 2496

20.సిజేరియన్‌ ఆపరేషన్లు                                                                      40.1  58.0  34.1

21.ప్రభుత్వ ఆసుపత్రులలో సిజేరియన్లు                                                        25.5   40.6  26.3

22.ప్రయివేటు ఆసుపత్రులలో సిజేరియన్లు                                                      57.0    74.9  51.3

23.ఎత్తుకు సరిపడా బరువులేని మహిళలు                                            30.8    17.6   23.1  14.6

24.ఎత్తుకు సరిపడా బరువులేని పురుషులు                                           24.8    14.8   21.4  12.4

25.అధిక బరువున్న మహిళలు                                                        17.7    33.2   28.1  30.9

26.అధిక బరువున్న పురుషులు                                                       17.6    33.5   24.2  28.2

27.పిల్లలలో రక్త హీనత                                                                 79.6     58.6  60.7  50.7

28.మహిళలలో రక్త హీనత                                                             62.7     60.0  56.7  55.1

29.పురుషులలో రక్త హీనత                                                             23.1    26.9   15.4 20.6

30.స్త్రీలలో మద్యపానం                                                                              0.4    8.8   0.4

31.పురుషులలో మద్యపానం                                                                      34.9   53.9  46.7

32.స్త్రీలలో పొగతాగేవారు                                                                              2.3    2.8   2.2

33.పురుషులలో పొగతాగేవారు                                                                      26.8  28.3 31.7

34.మహిళలలో స్వంతంగా సెల్‌ వున్నవారు                                                        36.2  47.8 62.0

35.బ్యాంకు ఖాతా వున్న మహిళలు                                                                 66.3 59.7 77.0

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిందూయిజంపై విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి ?

18 Monday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

criticism against Hinduism, Hinduism, RSS

ఒక యజమాని తన ఫ్యాక్టరీలో ఏ రోజు ఎంత వుత్పత్తి చేయాలో, ఏ వుత్పత్తిని పెంచాలో తగ్గించాలో ఆదేశించినట్లుగా హిందూ మహిళలు ఎంత మందిని పిల్లలన్ని కనాలో చెబుతున్న సంఘపరివార్‌ యోగులు, యోగినులు, సన్యాసులు, సన్యాసినులు భోగులుగా మారి పదుగురికి ఆదర్శంగా తాము చెప్పిన సంఖ్యలో ఎందుకు పిల్లల్ని కనటం లేదు?

ఎం కోటేశ్వరరావు

      హిందూయిజాన్ని చులకనగా చూస్తున్నారని అనేక మంది వుద్రేకపడిపోతున్నారు. అంతకు ముందు లేని ఆసక్తిని కొందరు ప్రదర్శిస్తున్నారు. అలాగే ఇతర మైనారిటీ మతస్థులలో కూడా దానికి ప్రతి ధోరణి మొదలైంది. ఎవరికి వారు తమ మతచిహ్నాలను ప్రదర్శించుకోవటం ఎక్కువైంది. ఇతర విషయాలలో సమానత్వం, తోటి మనిషిగా చూడకపోయినా పేరు వరకు సమానత్వాన్ని పాటిస్తూ పేరు చివర కులాన్ని సూచించే తోకలను ఆడపిల్లలకూ తగిలించటం పెరిగి పోయింది (ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు పెరిగి పోతున్న కారణంగా ఇతర కులాల వారు ప్రేమించటం, తలిదండ్రులు అంగీకరించకపోవటం గొడవలు ఎందుకని ముందే ఆడపిల్లకు పేరు తగిలిస్తే ఇతర కులాల వారు వారివైపు చూడరని, ఎవరైనా చూసినా తోటి కులం లేదా తత్సమాన కులం వారే పూనుకుంటారనే వుద్ధేశ్యంతో ఇలా పెడుతున్నట్లు ఒక తల్లి వివరణ ఇచ్చింది). ఇది ప్రతి మారు మూల పల్లెలో కూడా కనిపిస్తోంది. ఏ తరానికి ఆ తరంలో తమ పబ్బం గడుపుకొనేందుకు ఆరోగ్యకర రాజకీయాలను వెనుకపట్టు పట్టించి కుల, మత రాజకీయాలను చొప్పించి తమ పబ్బం గడుపుకోవాలనే పాలకవర్గ శక్తుల ఎత్తుగడలు ఫలించిన పర్యవసానమే ఇది. సమాజంలో అస్థిత్వ ధోరణులు పెరగటం కూడా దీనికి తోడైంది.

      ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాల్సి వుంది? ఇతర మతాల మాదిరి హిందూ మతాన్ని ఏ ఒక్కరో స్ధాపించలేదు లేదా ప్రబోధించలేదు. బైబిల్‌,ఖురాన్‌ మాదిరి ఈ మతానికి ఒక ప్రామాణిక గ్రంధం లేదు. అందువలన వేల సంవత్సరాల కాలంలో ఎవరికి అవసరమైన మేరకు వారు కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించి నట్లు , ఎలాగంటే గతేడాది జరిగిన గోదావరి పుష్కరాలకు వెళ్లేవారు తలా కాస్త మట్టి తీసుకువెళ్లి స్నానఘట్టాల దగ్గర వేయాలని ఒక పెద్దమనిషి ప్రబోధించినట్లుగా అనేక అంశాలను జొప్పించారు. చొప్పిస్తున్నారు. వేదాలలో కానరాని చాతుర్వర్ణ వ్యవస్ధ, మను ధర్మ శాస్త్రం, మహిళల పట్ల వివక్ష వంటి తిరోగమన అంశాలన్నీ మధ్యలో చొప్పించినవే అనే ఒక బలమైన అభిప్రాయం వుంది. ఒక జీవన విధానంగా హిందూయిజమంటే అందరూ కలసి మెలసి జీవించటం. కానీ జరుగుతోంది అందుకు విరుద్ధం. హిందూత్వ వాదులుగా, హిందూయిజాన్ని పరిరక్షించే వారిగా ఫోజు పెడుతూ ఇప్పుడు రంగంలో వున్న శక్తులు, వ్యక్తులు నిజానికి కుహనా హిందువులు, నిజమైన వారు కాదు. దాయిష్‌(ఐఎస్‌) వుగ్రవాదులు, తాలిబాన్లు నిజమైన ముస్లింలు ఎలా కాదో వీరు కూడా అదే కోవకు చెందినవారు.

     కొంత మంది చెబుతున్నట్లుగా హిందూయిజాన్ని ఎక్కువగా విమర్శిస్తున్నారనే వాదనలో కొంత వాస్తవం కూడా లేకపోలేదు.కుహనా హిందుత్వ వాదులపై ఇంకా తగినంత లేదనేదే ఆందోళన కలిగించే అంశం.అసలు ఈ విమర్శ, ప్రతి విమర్శలకు కారణం ఏమిటి? ఎవరు దీనికి ఆద్యులు ? ఓటు బ్యాంకు రాజకీయాలు. స్ధిరమైన ఓటు బ్యాంకులను ఏర్పాటు చేసుకొనేందుకు కాంగ్రెస్‌, ఇతర కుహనా లౌకక పార్టీలు మైనారిటీలను బుజ్జగించేందుకు పూనుకున్నాయని పాడిందే పాడరా అన్నట్లు పాడుతోంది, ప్రచారం ప్రారంభించింది ఎవరు? ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం కింద పనిచేసే దాని అనుబంధ సంస్థలైన బిజెపి, ఏబివిపి, విశ్వహిందూపరిషత్‌ వంటివే కదా ! హిందువునని గర్వించు, హిందువుగా జీవించు అన్న నినాదం కనిపించని గోడ,ఫ్లెక్సీ, బ్యానర్‌లు ఎక్కడైనా వున్నాయా ? రాజకీయంగా దిగజారటంతో పాటు దేశాన్ని జనాన్ని దివాలా తీయించే ఆర్ధిక విధానాలను అనుసరించిన కాంగ్రెస్‌ పోతున్న తన పట్టును నిలుపుకొనేందుకు అనుసరించని తప్పుడు పద్దతులు లేవు.వాటిలో మైనారిటీలను బుజ్జగించటం ఒకటి అనటం నిస్సందేహం. అంతేనా బింద్రన్‌వాలే వంటి వుగ్రవాదులను పెంచి పోషించిన దుష్ట చరిత్ర కూడా ఆ పార్టీకి వుంది. చివరికి ఆ బింద్రన్‌వాలా దయ్యం పట్టిన వారే ఇందిరా గాంధీని బలితీసుకొనేందుకు సాధనాలయ్యారు. కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) తదితర వామపక్షాలు ఇలాంటి బుజ్జగింపు చర్యలకు వ్యతిరేకం అన్నది చరిత్ర చెప్పిన సత్యం. కాంగ్రెస్‌ మైనారిటీ మతాల వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తే బిజెపి చేసిందేమిటి ? మొదట జనసంఘం అన్నారు, తరువాత దానిని జనతా పార్టీలో కలిపామన్నారు, దాన్నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీని పెట్టామన్నారు. ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ అధికారంలోకి రాకపోవటంతో హిందూమతానికి అన్యాయం జరుగుతోందని ఒకవైపు రెండోవైపు వివాదాస్పద బాబరీ మసీదు, రామజన్మభూమి వివాదాన్ని ముందుకు నెట్టింది. మెజారిటీ మతం వారిని బుట్టలో వేసుకొని అధికార అందలాలెక్కేందుకు ప్రయత్నించింది, అధికారానికి వచ్చిన తరువాత దానిని సుస్ధిరం చేసుకొనేందుకు గుజరాత్‌లో ఎలాంటి దారుణాలకు పాల్పడిందో, ఇప్పుడు దేశంలో ఏ విధంగా వ్యవహరిస్తోందో మనం చూస్తూనే వున్నాం. అందువలన ఆ విమర్శ చేయటానికి బిజెపి లేదా సంఘపరివార్‌కు, వారిని బలపరుస్తూ, కాంగ్రెస్‌ పద్దతులను మక్కీకి మక్కీ అనుసరించే తెలుగుదేశం, తెరాస వంటి ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి నైతిక హక్కు లేదు.

అన్నీ త్యజించి సన్యాసులుగా మారాము, దేశం కోసం లేదా సంఘ్‌ కోసం వివాహాలు మానాము, తత్వం తలకెక్కిన తరువాత తెలియక అంతకు ముందు కట్టుకున్న భార్యనే త్యజించాము, బోధనలే మాకు ముఖ్యం అని చెప్పుకొనే వారికి అధికార, రాజకీయ పదవులు ఎందుకు ? బుద్దుడు, వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాల్సింది సామాన్య జనమేనా వారు కాదా ?

     ఈ దేశం హిందూ దేశమని, మతమార్పిడులు, పిల్లల్ని ఎక్కువ మందిని కనటం ద్వారా ఇతర మతాలు ముఖ్యంగా ముస్లింలు మెజారిటీగా మారేందుకు పెద్ద కుట్ర పన్నారని, హిందూయిజానికి ముప్పు వచ్చిందని ఆధారంలేని, ఊహాజనిత ప్రచారం ఎక్కువ చేసింది, చేస్తున్నదీ ఎవరు ? అది వాస్తవం కాదని చెప్పిన కమ్యూనిస్టులు, ఇతర అభ్యుదయశక్తులన్నింటినీ దేశ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు, విదేశీ సిద్ధాంతాలను పాటించేవారని తన యంత్రాంగం ద్వారా నిత్యం దాడులు చేస్తూ, జనాల బుర్రలను కలుషితం చేస్తున్నది ఎవరు ? సంఘపరివార్‌ కాషాయ కుహనా హిందుత్వ వాదులు కాదా ? ఒక యజమాని తన ఫ్యాక్టరీలో ఏ రోజు ఎంత వుత్పత్తి చేయాలో, ఏ వుత్పత్తిని పెంచాలో తగ్గించాలో ఆదేశించినట్లుగా హిందూ మహిళలు ఎంత మందిని పిల్లలన్ని కనాలో చెబుతున్న సంఘపరివార్‌ యోగులు, యోగినులు, సన్యాసులు, సన్యాసినులు భోగులుగా మారి పదుగురికి ఆదర్శంగా తాము చెప్పిన సంఖ్యలో ఎందుకు పిల్లల్ని కనటం లేదు? బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ హిందూ మతాన్ని కాపాడేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలంటాడా ?ఈ అంకెల ఆట అంతటితో ఆగలేదు. శ్యామల్‌ గోస్వామి అనే బిజెపి పెద్దమనిషి ఐదుగురు అంటే బదరికాశ్రమం శంకరాచార్య, శ్రీ వాసుదేవానంద సరస్వతి పదికి పెంచారు. మహిళంటే పిల్లల్ని కనే యంత్రాలనుకుంటున్నారా ? హిందూ మతాన్ని కాపాడి తరువాత ఏం చేస్తారు? వీరు పుట్టక ముందు నుంచి హిందూ మతాన్ని ఎవరు కాపాడుతున్నారు? ఎవరు వీరు ? హిందూయిజానికి ప్రతినిధులమని స్వయంగా నిర్దేశించుకున్నవారే కదా ?చెప్పే వారికి బాధ్యత లేదా ? దేశం కంటే సన్యాసం ఎక్కువా ? లేదు అన్నీ త్యజించి సన్యాసులుగా మారాము, దేశం కోసం లేదా సంఘ్‌ కోసం వివాహాలు మానాము, తత్వం తలకెక్కిన తరువాత తెలియక అంతకు ముందు కట్టుకున్న భార్యనే త్యజించాము, బోధనలే మాకు ముఖ్యం అని చెప్పుకొనే వారికి అధికార, రాజకీయ పదవులు ఎందుకు ? బుద్దుడు, వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాల్సింది సామాన్య జనమేనా వారు కాదా ? యోగులు, సన్యాసుల గురించి వివేకానందుడు చెప్పిందేమిటి ? సన్యాసులకు ఒక మతం వుండకూడదు, అన్ని మతాల నుంచి మంచిని తీసుకోవాలి. ఇపుడు జరుగుతోందేమిటి ?

    నేడు ప్రతి మతంలోనూ తాలిబాన్లు తలెత్తుతున్నట్లు ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం వుండే మన దేశాన్ని కూడా ఆ వైపు నడిపించటానికి పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఆ కారణంగానే ఇటీవలి కాలంలో మతాలపై ముఖ్యంగా హిందూ మతంపై చర్చ ఎక్కువగా జరుగుతోంది. అది వికటిస్తే పర్యవసానాలు భిన్నంగా వుంటాయి. కొంత మంది ముందుకు తెస్తున్న కొన్ని వాదనలను పరిశీలిద్దాం.

ఇస్లాం వంటి వాటిని విమర్శించటానికి వారికి( హిందూమతాన్ని విమర్శించేవారికి) భయం, వణికిపోతారు.

      మతాలన్నీ ఛాందసత్వంతో కూడుకున్నవే అన్నది ముందు గ్రహించాలి. వాటిలో సంస్కర్తలు మారుతున్న కాలానికి అనుగుణంగా మతాలు, ఆచారాలను వ్యాఖ్యానిస్తుంటే ఛాందసులు వాటిని అలాగే వుంచటం లేదా వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్నారు. కొన్ని దేశాలలో నూటికి 99శాతం ముస్లింలే వుంటారు. అయినా అక్కడ తాలిబాన్లు ఎందుకు పుట్టుకు వచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారేందుకు సిద్ధపడని ఛాందసులు షరియత్‌ పేరుతో మతోన్మాదులుగా మారుతున్నారు. మన సమాజంలో ఎప్పటి నుంచో వున్న ఆచారాల ప్రకారం ఇప్పటికీ దళితులు అంటరానివారే. రాజ్యాంగం దానిని నిషేధించింది. పాటిస్తే శిక్షార్హం అని చెప్పింది. ఆ హక్కును అమలు జరుపుకొనేందుకు ఎక్కడైనా దళితులు ప్రయత్నిస్తే అగ్రకులాలనబడేవారు దాడులకు తెగబడటాన్ని ఏమనాలి? హిందూ మతానికి చెందిన వారు హిందూమతాన్ని విమర్శిస్తే హిందూమతం వారే సహించటం లేదు. అటువంటుపుడు పూర్తిగా వివరాలు తెలియని అన్యమతాలను అన్యమతస్తులు విమర్శించటం సరైనది కాదు, సహేతుకంగా విమర్శించినా సహించే అవకాశం లేనపుడు ఏ మతానికి చెందిన వారు ఆ మతాన్ని విమర్శించటమే సరైనది. దాన్ని అంతవరకే పరిమితం చేయాలి.దీన్ని గురించి చౌకబారు అడ్డుసవాళ్లు విసిరే వారి వలలో పడాల్సిన అవసరం లేదు.దొంగబాబాలు, యోగినుల బండారాల గురించి అనేక సినిమాలలో ఎంతో చక్కగా చూపించారు, చూపుతున్నారు. కానీ ఎవరైనా ఒక బాబా లేదా యోగిని గురించి ప్రత్యక్షంగా విమర్శిస్తే వారిపైకి భౌతికదాడులకు జనాన్ని రెచ్చగొడుతున్న తీరు తెలిసిందే. నిజమైన విమర్శకులు శాంతి భద్రతల పరిస్ధితి తలెత్తాలని కోరుకోరు. మన దేశంలో నూటికి 80శాతం మంది హిందువులే గనక చర్చలలో కూడా ఆ వాటా అలాగే వుంటుంది. అందుకే మొత్తంగా దీనినే విమర్శించినట్లు కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు.అమెరికా,ఐరోపా వంటి దేశాలలో హేతువాదుల నుంచి 90శాతం విమర్శలు క్రైస్తవం మీద వుంటాయి తప్ప ఇతర మతాల మీద కాదు, ఇక్కడ కూడా అంతే.

తస్లీమా సస్రీన్‌, సాల్మన్‌ రష్డీలను వారు సహించటం లేదు అలాంటపుడు ఇక్కడ ఎందుకు సహించాలి?

    తస్లీమా, సాల్మన్‌ రష్డీ మొరటు పద్దతులలో మత ఛాందసులను విమర్శించారు కనుక వారు దాడులకు తెగబడుతున్నారు.ఇక్కడ కూడా అదేపని చేస్తామంటారా? అలాంటపుడు వారికీ వీరికి తేడా ఏముంటుంది? ఇతరులను విమర్శించటం లేదని అడిగే హక్కు వారికి వుండదు. అహింస, విమర్శ, సహనం భారతీయ సంప్రదాయం. దాన్ని ముందు మనం కాపాడు కుందాం. ముందు మెజారిటీ జనం వాటిని పాటిస్తే అందుకు భిన్నంగా వ్యవహరించేవారిపై కూడా వత్తిడి పెరుగుతుంది. వారు కూడా తమ వైఖరిని మార్చుకుంటారు. ఇతర మతాల దేవతలు దేవుళ్లపై సద్విమర్శలు చేయటం వేరు, కించపరచటం వేరు. కించపరిస్తే జరిగేది కొట్లాటలే అని అనేక అనుభవాలు తెలిపాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మహిళలకు అన్యాయం, వివక్షలో హిందూ-ముస్లిం దొందూ దొందే !!

17 Sunday Jan 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Women

≈ 3 Comments

Tags

Discrimination, Hinduthwa, Islam, Religious Fundamentalists

పశువులు పేడ వేస్తూ తిరుగుతున్నా వీధులలో అనుమతించారు తప్ప సాటి మనిషిని అంటరాని వారి పేరుతో వీధులలో తిరగనివ్వకుండా, ఒక వేళ తిరిగినా నోటికి ముంత, నడుములకు చీపుర్లు కట్టించి తిప్పిన రోజులు, వాటికి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం, ఆచారం అనే ముద్దు పేర్లు తగిలించి అమలు జరిపిన రోజులు లేవా ?

ఎం కోటేశ్వరరావు

      సామాజిక మీడియాలో ఇటీవలి కాలంలో మతాలను విమర్శించిన వారిని ముఖ్యంగా హిందూ మతాన్ని విమర్శించిన వారిపై కొందరు విరుచుకు పడుతున్నారు. విమర్శలు చేసే వారు రెండు రకాలు. ఒకటి గత వ్యాసంలో పేర్కొన్నట్లు తర్క బద్దమైన సైద్ధాంతిక విమర్శ, రెండవది ద్వేషంతో లేదా వుద్రేకంలో తెలియకుండానే మరో మతాన్ని కించపరిచే వ్యాఖ్యలతో సాగించే చర్చ. రెండవ తరగతిలో మొదటి వారిని మనం అదుపు చేయలేము. వుద్రేకంతో కించపరిచే వ్యాఖ్యలు చేసే వారు తమకు తెలియకుండానే ద్వేషంతో రెచ్చగొట్టే వారి వలలో పడుతున్నారని గ్రహించాలి. అందువలన వాటికి దూరంగా వుండాలి.

     ప్రపంచంలో మతాల చరిత్రను చూస్తే ప్రతి మతం ప్రజలకు దూరమైనపుడు కొత్త మతాలు పుట్టుకు వచ్చాయి. యూదుమతంపై తిరుగుబాటుతో క్రైస్తవం, దానిపై తిరుగుబాటుతో ఇస్లాం అవతరించింది. వీటిలో కొన్ని వుప శాఖలు వున్నాయి. అందుకే వీటన్నింటినీ కలిపి అబ్రహానిక్‌ మతాలని పిలుస్తారు. ఎందుకంటే ఈ మతాలన్నింటా అబ్రహాం అనే దేవుడు లేదా పాత్ర వుంది. ప్రపంచంలో ఈ మతాలకు చెందిన వారు 54శాతం మంది వున్నారు. ఇతర మతాలకు చెందిన వారు 32శాతం, ఒక సంఘటిత మతం లేదా అసలు మతాన్ని పాటించని వారు 14శాతం వున్నారు. క్రైస్తవం, ఇస్లాం మతాలలో ఒకటి , రెండు స్థానాలలో వున్నాయి. శైవం, వైష్ణవంలో దేవతలు, రూపాలు, పేర్లు వేరైనా ఆదిపురుషుడు ఒకరే అన్నట్లుగా యూదు, క్రైస్తవంలో అబ్రహాం కాస్తా ఇస్లాంలోకి వచ్చే సరికి ఇబ్రహీంగా మారిపోయారు. అలాగే హిందూమతంగా చెప్పబడుతున్న మతాలపై తిరుగుబాటుగా జైనం, బౌద్ధం అవతరించింది.

వేదాలపై వేల సంవత్సరాల నాడే చార్వాకులు విమర్శలు చేశారు. ఒక మతం వునికిలో వుండగా మరొక మతం వచ్చిందంటే పాత మతంపై విమర్శలు , వ్యతిరేకత లేకుండా వుండవు. శైవులు-వైష్ణవులు ఎలా కొట్లాడుకున్నదీ మనకు తెలిసిందే. అందువలన హిందూ మతంపై విమర్శ అన్నది కొత్తగా వచ్చింది కాదు, బయటి వారు లేదా వ్యతిరేకులు, మతంపై విశ్వాసం లేనివారు గానీ ప్రారంభించింది అసలే కాదు

      భోజపురి వంటి అనేక ప్రాంతీయ భాషలు హిందీతో సారూప్యత కలిగి వున్న కారణంగా వాటన్నింటినీ హిందీ అని పిలుస్తున్నట్లుగా హిందూమతంగా చెప్పబడే దానిలో శైవ,వైష్ణవం వంటి ప్రధాన స్రవంతి మతాలతో పాటు ఇతర అనేక చిన్న మతాలు సారూప్యత కలిగిన కారణంగా వాటన్నింటినీ కలిపి హిందూమతంగా లేదా ఇజంగా చెబుతున్నారు.భిన్నమైన విశ్వాసాలు, ఆచారాలున్న ఈ మతాల తత్వశాస్త్రాలపై గతంలో పరస్పరం అనేక విమర్శలు చోటు చేసుకున్నాయి. వీటన్నింటికి మూలమైన వేదాలపై వేల సంవత్సరాల నాడే చార్వాకులు విమర్శలు చేశారు. ఒక మతం వునికిలో వుండగా మరొక మతం వచ్చిందంటే పాత మతంపై విమర్శలు , వ్యతిరేకత లేకుండా వుండవు. శైవులు-వైష్ణవులు ఎలా కొట్లాడుకున్నదీ మనకు తెలిసిందే. అందువలన హిందూ మతంపై విమర్శ అన్నది కొత్తగా వచ్చింది కాదు, బయటి వారు లేదా వ్యతిరేకులు, మతంపై విశ్వాసం లేనివారు గానీ ప్రారంభించింది అసలే కాదు. రామలీల వుత్సవాలు జరిపేవారు కొందరైతే రావణుడిని అభిమానించేవారు మరికొందరు. దేవతలు-దానవులు ఇలా ఎన్నో భిన్నత్వాలు వున్నాయి.జైన మతం దేవుడిని సృష్టికర్త లేదా విధ్వంసకుడిగా అంగీకరించదు, వాటిన్నింటినీ మన సమాజం అంగీకరించింది. అంటే విమర్శలను సహించింది. భారతీయ సంస్కృతిలో అదొక భాగం. అందువలన విమర్శలపై వుద్రేక పడేవారు ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోవటం మంచిది. గతంలో శైవం, వైష్ణవం పేరుతో దెబ్బలాడుకున్నవారు రాజీపడి అసలు మతాలను మొత్తంగా విమర్శించేవారిపై సమైక్యంగా ఇప్పుడు తమ దాడిని మొదలు పెట్టారు. ఈ విషయంలో ఇతర మతాలవారితో జెఎసిని ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదు.

     కుండ కింద మంట పెట్టగానే నీరు ఆవిరి కాదు. వుష్ణోగ్రత పెరిగి వంద డిగ్రీలు దాటిన తరువాతే నీరు తన రూపం మార్చుకొని కొత్త రూపం ధరించి ఆవిరిగా మారుతుంది. అలాగే సమాజ మార్పులకు అనుగుణంగా మతాలు, ఆచారాలు మారనపుడు వాటిలో సంస్కరణలు రావాలని కోరుకుంటారు. వాటిని అడ్డుకుంటే అవి తీవ్రమై కొత్త మతాల ఆవిర్బావానికి నాంది పలుకుతాయి. హిందూమతంలో బాల్యవివాహాలు, కన్యాశుల్కం పేరుతో ఆడపిల్లలను అమ్ముకోవటం, పండు ముదుసలులకు పిన్నవయస్సు బాలికలనిచ్చి వివాహాలు చేయటం సాంప్రదాయంగా లేదా ఆచారంగా ఒక నాడు వున్నాయా లేవా ? పశువులు పేడ వేస్తూ తిరుగుతున్నా వీధులలో అనుమతించారు తప్ప సాటి మనిషిని అంటరాని వారి పేరుతో వీధులలో తిరగనివ్వకుండా, ఒక వేళ తిరిగినా నోటికి ముంత, నడుములకు చీపుర్లు కట్టించి తిప్పిన రోజులు వాటికి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం, ఆచారం అనే ముద్దు పేర్లు తగిలించి అమలు జరిపిన రోజులు లేవా ? చాతుర్వర్ణ వ్యవస్ధ పేరుతో శూద్రులకు విద్యను దూరం చేయలేదా ? ఆచారాలు, సాంప్రదాయాలు, విశ్వాసాలు, మనోభావాల పేరుతో ప్రస్తుతం విమర్శలను కూడా సహించలేక అసహనంతో రగిలి పోతున్నవారు పైన పేర్కొన్నవాటిని కూడా పునరుద్దరించాలని కోరుకుంటున్నారా ?

బాబరీ వివాదంలో కోర్టు తీర్పులను తాము ఖాతరు చేయబోమని తమ విశ్వాసాలే తమకు ముఖ్యమనే వాదనను ముందుకు తేవటానికి షాబోనో కేసులో ముస్లిం మతశక్తుల వైఖరే స్ఫూర్తి.

      తమ మత వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని చెప్పటంలో ఏ ఒక్క మతమూ తీసిపోలేదు. ఒకదాన్ని మరొకదానితో పోల్చి తమ చర్యలను సమర్ధించుకుంటున్నాయి. వుదాహరణకు షా బానో కేసునే తీసుకుందాం. విడాకులిచ్చిన తన భర్త భరణం చెల్లింపు గురించి మధ్యప్రదేశ్‌కు చెందిన షా బానో సుప్రీం కోర్టుకు వెళ్లింది.ఆ కేసులో ఆమె గెలిచింది. ఆ సందర్భంగా ఇస్లాం మత పెద్దలుగా వున్నవారు చేసిన వాదన ఏమిటి ? సుప్రీం కోర్టు తీర్పు ఖురాన్‌లో పేర్కొన్నదానికి అనుగుణంగా లేదు కనుక దానిని మేము అంగీకరించం అన్నారు. ముస్లిం ఛాందసుల వత్తిడికి లొంగిన కాంగ్రెస్‌ నేతలు 1986లో చట్ట సవరణ చేసి సుప్రీం కోర్టు తీర్పును నీరు గార్చారు. జస్టిస్‌ విఆర్‌ కృష్ణయ్యర్‌ ఆ చర్యను విమర్శిస్తూ అది ఖురాన్‌కు వ్యతిరేకమని, చట్ట సవరణ తప్పని ఖండించారు. ముస్లింల సంతృప్తీకరణ చర్యగా బిజెపి దానిపై నానా యాగీ చేసింది. ఆ చట్ట సవరణను వుపయోగించుకొని మెజారిటీ పౌరుల సంతృప్తీకరణతో తానే సరికొత్త ఓట్ల రాజకీయానికి తెరతీసింది. బాబరీ మసీదు ప్రాంతంలోనే రాముడు పుట్టాడన్నది తమ విశ్వాసమని అందువలన బాబరీ మసీదు తాళాలు తీయాలి లేదా తామే పగలగొడతామని తన కనుసన్నలలో పనిచేసే విహెచ్‌పి ఇతర సంస్థలద్వారా ఆందోళనలకు ఆజ్యం పోసింది. బాబరీ వివాదంలో కోర్టు తీర్పులను తాము ఖాతరు చేయబోమని తమ విశ్వాసాలే తమకు ముఖ్యమనే వాదనను ముందుకు తేవటానికి షాబోనో కేసులో ముస్లిం మతశక్తుల వైఖరే స్ఫూర్తి. ఎందుకంటే ఖురాన్‌కు అనుగుణంగా ఆ తీర్పు లేదని వారు వాదించారు. ఇప్పుడు తమ విశ్వాసాలకు, ఆచారలకు, సంప్రదాయాలకు అనుగుణంగా లేనివాటిని అంగీకరించబోమని ఎబుతున్నారు. ఎద్దులను దారుణంగా హింసకు గురిచేసే మొరటు క్రీడ జల్లికట్టుపై సుప్రీం కోర్టు విధించిన నిషేధాన్ని వమ్ము చేస్తూ జల్లికట్టు నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించటానికి, కాంగ్రెస్‌ హయాంలో షాబానో కేసును నీరు గార్చేందుకు చేసిన చట్ట సవరణకు పెద్ద తేడా ఏముంది ? ముస్లిం ఆచారాలలో కోర్టులు జోక్యం చేసుకోరాదని ఆ మతశక్తులు కోరుతున్నట్లుగానే శబరిమల ఆలయంలో ఎప్పటి నుంచో వస్తున్న మహిళలకు ప్రవేశ నిషేధం కుదరదని కోర్టులు ఎలా నిర్ణయిస్తాయని ఇప్పుడు హిందూ మతశక్తులు ప్రశ్నిస్తున్నాయా లేదా ? అక్కడా అన్యాయానికి గురైందీ మహిళే, ఇక్కడా వివక్షకు గురవుతోందీ మహిళే.

       షాబోనో కేసు తీర్పును నీరు గార్చటానికి కాంగ్రెస్‌ నేతలు చట్టసవరణ చేయటాన్ని నిరసిస్తూ నాడు కేంద్ర మంత్రిగా వున్న ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మంత్రి పదవికి, కాంగ్రెస్‌కూ రాజీనామా చేశారు.నేడు జల్లికట్టు కేసులో అలాంటిదేమీ లేకపోగా జల్లికట్టు క్షత్రియతకు, పౌరుషానికి ప్రతీక అని బిజెపి తమిళనాడు నేత గణేశన్‌ వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం, జయలలిత వదిలే నాలుగు సీట్ల కోసం ఎద్దుల రాజకీయాలు తప్ప పౌరుషం పురుషులకేనా మహిళలకు అవసరం లేదా ? నిజానికి బిజెపికి చిత్తశుద్ధి వుంటే తరువాత తాను అధికారానికి వచ్చినపుడు లేదా ప్రస్తుతం పూర్తి మద్దతు వున్న స్దితిలో గానీ సుప్రీంకోర్టు తీర్పులను నీరుగార్చే అధికార దుర్వినియోగానికి తీసుకున్న చర్యలేమిటి ? కాంగ్రెస్‌ కనీసం పార్లమెంట్‌లో చట్టసవరణ చేసింది, మోడీ సర్కార్‌ ఆప్రజాస్వామిక తతంగం కూడా లేకుండా తన అధికారాన్ని వుపయోగించి జల్లికట్టు తీర్పును వమ్ము చేసేందుకు పూనుకుంది. అది తీసుకున్న నిర్ణయం దానికే పరిమితం అవుతుందా ? బిజెపి, సంఘపరివార్‌ సంస్ధలు చేస్తున్న వాదనలు, కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక అంతకంటే పెద్ద కుట్రకు నాంది పలికినట్లు చెప్పవచ్చు. రామజన్మభూమి ఆలయ వుద్యమం సందర్బంగా విశ్వాసం కోర్టులకు అతీతమని వాదించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ముఖమంత్రిగా బిజెపి నాయకుడు కల్యాణసింగ్‌ బాబరీ మసీదును రక్షిస్తామని సుప్రీం కోర్టుకు తెలిపారు. సంఘపరివార్‌ సేవకుడిగా దానిని వుల్లంఘించి 1992లో బాబరీ మసీదు కూల్చివేతకు సహకరించాడు. ప్రస్తుతం విశ్వహిందూపరిషత్‌ నేతగా వున్న ప్రవీణ్‌ తొగాడియా రామాలయం విశ్వాసానికి సంబంధించిందని, దాని నిర్మాణం కోసం పార్లమెంట్‌ ప్రతేక చట్టం చేయాలని చెబుతుండగా, సుబ్రమణ్యస్వామి వివాదాస్పద స్థలలోనే నిర్మాణం జరగాలని రెచ్చగొడుతున్నాడు. అందువలన ప్రస్తుతం కోర్టులో వున్న బాబరీ మసీదు వివాదంపై తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే దాన్ని వమ్ము చేసేందుకు అవసరమైతే చట్టం చేయాలని హిందూమతశక్తులు బహిరంగంగానే కోరుతున్నాయి. దీనిపై తీవ్రమైన చర్చ జరగాలా లేదా ? రాజ్యాంగానికి కట్టుబడి వుంటారా? దానికి అతీతంగా విశ్వాసాలు, ఆచారాల పేరుతో దాన్ని నీరుగారుస్తారా ?

   అన్యమతాలపై విమర్శ చేసేటపుడు ఎంతో బాధ్యతా యుతంగా వుండాలి.అది వివాదాలు, కొట్లాటలకు దారితీయకూడదు. అందుకే ఇతర మతాలపై వ్యాఖ్యానించటానికి నిజమైన హిందువు బాధ్యతాయుతంగా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు.అదే మతం తప్ప మరొక అజెండా,జెండా లేనివారు మతోన్మాద చితిపై ఓట్లు దండుకోవాలనుకునేవారి మాదిరి వ్యవహరించరు. అంతే తప్ప దమ్ము, ధైర్యమో మరొకటో లేక కాదు. అలాంటి వారికి ముంబై హైకోర్టు మార్గదర్శకాలు మరోసారి గుర్తు చేయకతప్పదు. ఈ దేశంలో నూటికి 80శాతంపైగా హిందువులు వున్నారు. అందువలన చర్చలో అదేమోతాదులో హిందూయిజంపైనే జరుగుతుంది. పరమత సహనం గల దేశంలో ఏ మతం వారు ఆమతం మంచి చెడ్డలను చర్చిస్తే అది సాధికారికంగా, విశ్వసనీయత వుంటుంది. లేకుంటే ముంబై పరమత న్యాయవాది ఇస్లాం, ముస్లింల గురించి రాసిన పుస్తకం నిషేధం, కోర్టుకు ఎక్కినట్లుగా, కోర్టు చెప్పిన అవాంఛనీయ పర్యవసానాలకు దారితీస్తుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రిపబ్లిక్‌ డే రోజున మహిళల దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకుంటామంటున్న సనాతన సంస్థ

16 Saturday Jan 2016

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Women

≈ Leave a comment

Tags

Gender Inequality, Hindu Janjagruti Samiti, Sanatan Sanstha, Shani Shingnapur

మహారాష్ట్రలో శని ఆలయ ఆంక్షలు

ఈ దేవాలయానికి తొలిసారిగా ఒక మహిళను  అధ్యక్షురాలిగా నియమించటం విశేషం.

ఎం కోటేశ్వరరావు

     శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై విధించిన నిషేధం రాజ్యాంగ విరుద్ధమని దేశ అత్యున్నత న్యాయస్ధానం వ్యాఖ్యానించింది. దానిపై తమ వాదనలను వినిపించేందుకు ఆ దేవస్థాన యాజమాన్యం సిద్దం అవుతోంది. దానిపై విచారణ జరిగి అంతిమ తీర్పు ఎలా వస్తుందో తెలియదు. కానీ మహిళలపట్ల వివక్షకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలు చేసిన కేసు దరఖాస్తును వుపసంహరించుకోవాలని లేకుంటే చంపివేస్తామని న్యాయవాదులకు వందలాది బెదిరింపులు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా వుండగా మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌లోని శని దేవాలయంలోని దేవత వేదికపైకి తమను అనుమతించాలంటూ ఒక స్వచ్ఛంద సంస్ధ భూమాత బ్రిగేడ్‌ నాయకత్వంలో దాదాపు 400 మంది మహిళలు రిపబ్లిక్‌ దినోత్సవం రోజున దేవాలయ ప్రవేశం చేస్తామని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని సనాతన సంస్థ, హిందూ జనజాగృతి సమితి వాటి అనుబంధ మహిళా విభాగం రాణ రాగిణి శాఖ రెండువేల మంది మహిళలతో అడ్డుకుంటామని ప్రకటించి అక్కడ శాంతి భద్రతల పరిస్ధితులను సృష్టించేందుకు పూనుకున్నాయి. ఈ దేవాలయానికి తొలిసారిగా ఒక మహిళను దేవస్థాన అధ్యక్షురాలిగా నియమించటం విశేషం. ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని వుల్లంఘించటాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించనని ఆమె ప్రకటించారు.

Embedded image permalink

   దేవస్థాన అధ్యక్షురాలు

 మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్నవారు చెబుతున్న కధనం ప్రకారం శని ప్రభువు వుగ్ర దేవత. దేవత నుంచి వెలువడే ప్రకంపనలు మహిళలకు హాని చేస్తాయి, అందువలన దేవత మండపం దగ్గరకు వారి ప్రవేశాన్ని నిరోధిస్తున్నారు తప్ప దేవాలయ ప్రాంగణంలో ప్రవేశానికి నిషేధం లేదని, లింగ వివక్ష సమస్యతో కాదని వాదిస్తున్నారు. పురుషులను కూడా మండపం ఎక్కటానికి అనుమతించటం లేదని దూరం నుంచే పూజలను అనుమతిస్తున్నామని, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాన్ని వుల్లంఘించటమంటే భక్తుల మనోభావాలను గాయపరచటమే అని వాదిస్తున్నారు. ఆధ్యాయాత్మిక కారణాలను చూడకుండా కేవలం ప్రచారం ఎత్తుగడగా కొందరు మహిళలను ప్రోత్సహిస్తున్నారని హిందూ జనజాగృతి సమితి ప్రతినిధి సునీల్‌ ఘన్‌వాట్‌ ఆరోపించారు.

      నవంబరు నెలలో ఒక మహిళ శని దేవాలయ మండపంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా దేవాలయ ట్రస్టీలు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. దీనిపై రాష్ట్రంలోని పలు మహిళా సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఆ చర్యకు నిరసనగా డిసెంబరులో పూనా కేంద్రంగా పనిచేసే భూమాత రానరాగిణి బ్రిగేడ్‌ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్‌ నాయకత్వంలో మరో ముగ్గురు మహిళలు ప్రవేశించేందుకు పూనుకోగా ఆలయ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తాము వచ్చే వారం సతారా నుంచి బయలు దేరి రిపబ్లిక్‌ డే నాటికి దేవాలయం వద్దకు చేరుకుంటామని తృప్తి చెప్పారు.అందరికీ సమాన హక్కులు ఇచ్చిన రాజ్యాంగం అమలులోకి వచ్చినందున ఆ రోజును ఎంచుకున్నట్లు చెప్పారు. వివిధ మహిళా సంఘాలు, బృందాలతో సమావేశాలు జరిపి ప్రచారం, చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జల్లికట్టు లేకపోతే ఎద్దులు అంతరిస్తాయా ? మహిళలను అనుమతిస్తే అయ్యప్ప బ్రహ్మచర్యం పోతుందా ?

14 Thursday Jan 2016

Posted by raomk in Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Women

≈ Leave a comment

Tags

feminist, jallikattu, sabarimala ban

ఎం కోటేశ్వరరావు

ఈ వారంలో జల్లికట్టు, శబరిమల ఆలయంలో యువతుల ప్రవేశ నిషేధంపై వెలువడిన కోర్టు తీర్పులు, నిర్ణయాలు సంచలనం కలిగించాయి.కోర్టు తీర్పులపై ఎప్పుడూ ఏకాభిప్రాయం వుండదు. గెలిచిన వాడు న్యాయమైన తీర్పు అంటే ఓడిన వాడు అన్యాయం అని ఆక్రోశిస్తాడు.ఏ తీర్పు అయినా అవి వ్యక్తులు లేదా ఒక సంస్ధ వివాదాలలో అయినా ఇచ్చిన తీర్పులు మెజారిటీ ప్రయోజనాలను కాపాడుతుందా లేదా ? సమాజాన్ని ముందుకు తీసుకుపోయేందుకు దారి చూపుతుందా లేదా అన్నదే గీటురాయిగా వుండాలి. ఆ విధంగా చూసుకున్నపుడు కొన్ని సందర్బాలలో కోర్టు తీర్పులు కూడా తిరోగామిగా వుండవచ్చు. అన్నింటినీ ఒకేగాటన కట్టలేము. అందువలన దేనికి దానిని విడిగా చూడాలి.

ఈ ప్రాతిపదికన చూసినపుడు జల్లికట్టు, శబరిమల కేసులలో నిర్ణయాలను పురోగమనవాదులు హర్షిస్తుండగా తిరోగమనవాదులు చిందులు వేస్తున్నారు. విపరీత భావాలు, ఆచరణ సాధ్యం కాని సంస్ధగా సుప్రీం కోర్టు మారిపోతున్నదని కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఆలయంలోకి మహిళలను ఎందుకు రానివ్వటంలేదో చెప్పాలని, నిషేధించటం రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు దేవస్ధాన అధికారులను ప్రశ్నించింది. యువ న్యాయవాదులు వేసిన పదేళ్లనాటి ఒక కేసును కోర్టు విచారిస్తున్నది.ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం, ఆచారం, మనోభావాలను గాయపరచినట్లు , వాటిని ఒక్కరాత్రిలో మార్చివేయలేమని చెప్పటం తప్ప ఎలాంటి హేతుబద్దమైన సమాధానం మహిళల నిషేధాన్ని సమర్ధించేవారి వద్ద లేదు.

అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కనుక 10-50 మధ్య వయస్సు వున్న మహిళలు రుతుక్రమంలో వుంటారు కనుక వారిని ఆలయంలోకి అనుమతించటం’పాపం’ అని బోర్డు వాదిస్తున్నది. గతంలో అధికారంలో వున్న సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వమే కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసి దీనికంతటికీ కారణమైందని బోర్టు అధ్యక్షుడు ప్రయార్‌ గోపాల్‌కృష్ణన్‌ ఆరోపించారు. తిరువనంతపురంలోని అట్టుకల్‌ దేవీ ఆలయంలోకి పొంగలా పూజ చేసేందుకు పురుషులను అనుమతించరని, ఇలాగే ప్రతి దేవాలయానికి ఒక్కొక్క ఆచారం వుంటుందని, ఇది లింగవివక్ష సమస్య కాదు, సాంప్రదాయం అని వాదించారు. కోర్టు వీటిని పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించిందని విమర్శించారు. మహిళలను అనుమతించాలా లేదా అనేది భక్తులు నిర్ణయిస్తారని, తమ హక్కుల గురించి మహిళలు తేల్చుకుంటారు తప్ప కోర్టులపని కాదనే ఘనులు కూడా తయారయ్యారు. యధాతధ స్థితిని కొనసాగించాలని కోరాలని కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి నుంచో వున్న పాత ఆచారాన్ని తాము మార్చబోమని దేవాదాయశాఖ మంత్రి శివకుమార్‌ ప్రకటించారు. విశ్వహిందూ పరిషత్‌ వంటి సంస్ధలు ఇంక సరేసరి.

ఈ సమస్యపై కోర్టు తీరును వామపక్ష ప్రజాతంత్ర కూటమి స్వాగతించింది. దీనిపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని అభిప్రాయ పడింది. తిరువాన్కూరు మాజీ రాజకుటుంబానికి చెందిన మహిళలు దేవాలయాన్ని సందర్శించినట్లు గట్టి ఆధారాలున్నాయని సిపిఎం నాయకుడైన మాజీ దేవాదాయ శాఖ మంత్రి సుధాకరన్‌ చెప్పారు. మహిళలు దేవాలయంలోకి ప్రవేశిస్తే దేవుడి బ్రహ్మచర్యం పోతుందని వాదించటంలో అర్ధం లేదని ఇదొక సామాజిక రుగ్మత అని కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన వారు వాదిస్తున్నారు. గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయంలోకి ఇతర మతాలకు చెందిన వారికి ప్రవేశం లేదు, అయ్యప్పకు అటువంటి నిషేధం లేదు.వావర్‌ స్వామి అనే ఒక ముస్లిం అయ్యప్పకు ఎంతో ఇష్టమైన భక్తుడిగా ప్రాచుర్యంలో వుండటంతో అయ్యప్ప దేవాలయానికి వెళ్లే ముందు వావర్‌ స్వామి మసీదును కూడా భక్తులు సందర్శిస్తారు. హిందువులు పూజించేవారిలో హనుమాన్‌ కూడా ఒకరు. ఆయనా బ్రహ్మచారే. ఆయనకూ దేవాలయాలున్నాయి.వాటిలో మహిళల ప్రవేశంపై ఎలాంటి నిషేధం లేదు, ఆయన బ్రహ్మచర్యం పోయిన దాఖలాలు లేవు. మరి అయ్యప్పకే ఆంక్షలు ఎందుకు?

2006లో కన్నడ సినీనటి జయమాల తాను కుర్రవయస్సులో వున్నపుడు అయ్యప్పస్వామి దేవాలయాన్ని సందర్శించినట్లు ప్రకటించటంతో మహిళలపై నిషేధం వెలుగులోకి వచ్చింది. జయమాల అలాంటి ప్రకటన చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచిందంటూ కేసును దాఖలు చేశారు.ఆమెకు మద్దతుగా అనేక మంది ముందుకు వచ్చారు. ఆ వుదంతం జరిగిన సమయంలోనే దేవాలయ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ యువ న్యాయవాదులు సుప్రీం కోర్టులో కేసును దాఖలు చేశారు. నిషేధం రాజ్యాంగ బద్దం కాదని కోర్టు అభిప్రాయ పడటంతో ఈనెల 18న తమ వాదనలు వినిపిస్తూ దేవస్ధానం బోర్డు, కేరళ ప్రభుత్వం కూడా పిటీషన్లు దాఖలు చేయనున్నాయి.

రెండవ అంశం జల్లికట్టుపై నిషేధం. సుప్రీం కోర్టు విధించిన నిషేధాన్ని పూర్వపక్షం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మొరటు క్రీడను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దానిపై సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు కావటంతో జల్లికట్టును అనుమతించరాదని మరోసారి కోర్టు ఆదేశించింది.అయ్యప్ప ఆలయంలోకి మహిళలపై నిషేధం లింగవివక్ష సమస్య కాదని వితండ వాదం చేస్తున్నట్లుగానే జల్లికట్టులో ఎద్దుల పట్ల క్రూరంగా వ్యవహరించటం లేదని, అసలు ఇలాంటి పోటీలు, క్రీడలు లేనట్లయితే మన దేశంలో ఎద్దులను పెంచేవారే వుండరని, అసలా జాతే అంతరించి పోతుందనే అర్ధం లేని వాదనలు ముందుకు తెస్తున్నారు. జల్లికట్టును ఒక సాంస్కృతిక అంశంగా చూడాలని, మానవ ప్రాణాలు ఒక సమస్యగా తయారైతే తప్ప ఇలాంటి అంశాలపై తీర్పులు చెప్పటం కోర్టుల పని కాదని చెబుతున్నారు. ఒక వేళ దీనిని క్రూరమైన చర్యగా పరిగణిస్తే గుర్రపు పందాలలో గుర్రాలు కూడా గాయపడతాయని వాటిని నిషేధిస్తారా, ఇతర జంతు వధలను కూడా నిషేధించాల్సి వుంటుందన్న వాదనలు ముందుకు తెస్తున్నారు. క్రూరత్వ నిరోధ చట్టం మానవులు తయారు చేసింది తప్ప మరొకటి కాదని, రాజ్యాంగంలోని మౌలిక హక్కుల వంటిది కాదని కూడా అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు.కోర్టు వాదనల ప్రకారమైతే స్పెయిన్‌లో ఎద్దులతో యుద్ధాన్ని, అమెరికాలో కృతజ్ఞతల దినం రోజు టర్కీల వధను కూడా నిషేధించాల్సి వుంటుందని చివరికి మాంసం మానేసి పండ్లు, కూరగాయలు తినాల్సి వుంటుందని చెబుతున్నారు.అలాంటి వాదనలను ముందుకు తెచ్చేవారు ముందు వాటిపై తమ అభిప్రాయం ఏమిటో చెప్పకుండా అడ్డు సవాళ్లు విసిరితే కుదరదు. సంప్రదాయం, ఆచారాలు మనోభావాల పేరుతో రెచ్చగొట్టటం గాక ఆరోగ్యకరమైన చర్చ జరిపితే ప్రయోజనం వుంటుంది. జైనులు నడిచేటపుడు తమ కాలికింద పడి జీవులు ఎక్కడ నలిగిపోతాయో అని రోడ్లు వూడ్చుకుంటూ పోయిన తరువాతే నడుస్తారు.మరి వారు మాంసం కోసం జంతువధ చేయటం తమ మనోభావాలను గాయపరచటం కనుక కుదరదు, మా సాంప్రదాయం కాదు అంటే కుదురుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Maternity Leave Increasing to Encourage 2nd Kids

14 Thursday Jan 2016

Posted by raomk in CHINA, Current Affairs, INTERNATIONAL NEWS, Women

≈ Leave a comment

Tags

China, Maternity Leave, second child., womenofchina

By Hu YongqiEditor: Arnold Hou
Maternity Leave Increasing to Encourage 2nd Kids
Mothers in Beijing, Shanghai and Shandong Province will have more days off work after giving birth under the new national policy encouraging couples to have a second child. [Xinhua]

Mothers in Beijing, Shanghai and Shandong Province will have more days off work after giving birth under the new national policy encouraging couples to have a second child.

The amount of additional leave ranges from 30 to 60 days as many provincial-level regions are soliciting opinions from the public and will implement new regulations this year.

The three regions followed Guangdong Province, which was the first to overhaul maternity leave. From January 1, mothers giving birth in Guangdong will have 30 more days for maternity leave. Their husbands have five extra days compared with the original 10 to take care of their wives and babies.

On Friday, the Legal Affairs Office of Beijing released a draft amendment of the capital’s population and family planning regulation to solicit public opinion. The draft cancels the seven-day marriage holiday for older couples, and expands maternity leave from 98 days to 128 days for the mother. The draft for the first time gives the father 15 days off.

However, Shandong is planning to increase maternity leave by 60 days, according to a draft by the Legal Affairs Office of Shandong. Fathers will have seven days off.

According to the People’s Congress of Shanghai, mothers will have 30 extra days off in addition to the current 98 days. Their spouses have three days off.

“There should be clear regulations on maternity leave, including details on how many days mothers can take. Otherwise, mothers will face possible discrimination in employment,” said Zhai Zhenwu, professor of sociology and population studies at Renmin University of China in Beijing.

Also starting on January 1, newly married couples nationwide cannot get additional marriage holidays, as all have been deprived of privileges tied to late marriage, policies that gave extra days off for couples where the husband was older than 25 and the wife older than 23.

(Source: China Daily)

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

Number of Americans Who Identify as Bisexual on the Rise

08 Friday Jan 2016

Posted by raomk in International, INTERNATIONAL NEWS, Readers News Service, USA, Women

≈ Leave a comment

Tags

Americans, Bisexual, same-sex, sexual fluidit

By Kali Holloway / AlterNet

Razvan Raz / Shutterstock

It seems fitting that as we close out a year in which sexual fluidity was one of the most discussed topics, a new study finds that the number of adult Americans who identify as bisexual is on the rise.

That’s according to the Centers for Disease Control, which assessed sexual attitudes of more than 9,000 U.S. residents aged 18-44. The survey found that between 2011 and 2013, an increasing number of respondents reported same-sex sexual contact and bisexual self-identification.

As in other recent surveys, the CDC report found U.S. women outpaced men in reporting bisexuality. Two percent of men polled labeled themselves bisexual, up from 1.2 percent in the 2006-2010 survey. Women, at 5.5 percent, up from 3.9 percent in the previous poll, were nearly three times as likely to identify as bisexual than men.

Fittingly, the report notes an increase in the number of American women who report same-sex sexual contact. This was true of 14.2 percent of women polled in 2006-2010—a figure that rose to 17.4 in the most recent survey. Just 6.2 percent of men say they’ve had sexual contact with other men.

CNN notes that researchers identified some race-linked disparities among survey respondents. Hispanic and Latina women, at 11.2 percent, were least likely to have had sexual contact with other women. Conversely, 19.6 percent of white women and 19.4 percent of black women reported having had same-sex sexual contact.

In late 2015, a study at the University of Essex became somewhat controversial due to researchers’ determination that “100 percent heterosexual” women simply don’t exist. The study assessed women’s involuntary physical responses, such as pupil dilation, when shown sexually suggestive videos of both men and women. Overwhelmingly, women who identified as lesbian showed signs of arousal almost solely with images of women. But heterosexual women involved in the study responded to both.

“Even though the majority of women identify as straight, our research clearly demonstrates that when it comes to what turns them on, they are either bisexual or gay, but never straight,” said the study’s lead author Gerulf Rieger, in a statement that garnered a few interesting responses.

The 2014-2015 edition of the CDC study is slated for release this fall.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మనం ఎక్కడున్నాం ! నికితా అజాద్‌కు జేజేలు !!

22 Tuesday Dec 2015

Posted by raomk in Current Affairs, NATIONAL NEWS, Social Inclusion, Women

≈ Leave a comment

Tags

happytobleed, menstruation, Nikita Azad, sabrimala, temples

Sabrimala temple nikita azad

సత్య

మనం ఎక్కడున్నాం, మధ్యయుగాలలోనా ? ఇంకా అంతకు ముందు ఆటవిక దశలోనా ? ఆధునికంగా ఎంతో ముందుకు పోయాం, స్త్రీని భారత్‌లో మాదిరి మరే దేశంలోనూ గౌరవించరు అని చంకలు కొట్టుకొనే మనం ఎక్కడున్నాం ?

గౌరవం సంగతి దేవుడెరుగు ! అసలు ఒక మనిషిగా గౌరవిస్తున్నామా ? అదే నిజమైతే ప్రకృతి సిద్ధమైన రుతుక్రమ సమయంలో దూరంగా అంటరాని వ్యక్తిగా ఎందుకు చూస్తున్నాం ? ఆ సమయంలో దేవాలయాలలో ప్రవేశానికి ఎందుకు నిషేధిస్తున్నాం ? కొద్ది వారాల క్రితం కేరళలోని అయ్యప్ప స్వామి దేవస్ధాన బోర్డు అధ్యక్షుడు గోపాలకృష్ణన్‌ మహిళలను అవమాన పరిచే విధంగా చేసిన వ్యాఖ్య సామాజిక మీడియాలో తీవ్ర నిరసనలకు వేదికగా మారింది. సాహస యువతి నికితా అజాద్‌ ‘హేపీ బ్లీడ్‌ ‘ (సంతోష రుతుక్రమం) అన్న నినాదంతో రాసిన లేఖకు అపూర్వ స్పందన లభిస్తోంది.

మహిళలలో రుతు క్రమం అనేది ఒక ప్రకృతి ధర్మం. సకాలంలో అది ప్రారంభం కాకపోతే, సక్రమంగా నియమిత కాలంలో రాకపోతే అలాంటి యువతుల గురించి తలిదండ్రులు ఎంత ఆందోళన పడతారో, సమాజం అలాంటి వారిని ఎలా చూస్తుందో మనకు తెలియని అంశం కాదు. అలాంటి ప్రకృతి ధర్మం, పునరుత్పత్తికి నాంది అయిన ఆ క్రమాన్ని ఎవరైనా ఆహ్వానించాలి, అది లేకపోతే అలాంటి వారికి అవసరమైన వైద్య చికిత్సను అందించాలి. అలా ఆందోళన వ్యక్తం చేసే వారే మరోవైపున రుతుక్రమ సమయంలో మహిళల పట్ల వివక్షను కూడా ప్రదర్శించటం ద్వంద్వ స్వభావానికి నిదర్శనం. రుతు క్రమం సమయంలో దేవాలయాలకు వెళ్లవద్దని తల్లులే పిల్లలకు చెప్పటంలో ఎలాంటి హేతుబద్దత లేదు, అది సాంప్రదాయం, అది అంతే అన్న బండవాదన తప్ప మరొకటి చెప్పలేరు. ఇది తరతరాలుగా కొనసాగుతోంది. కొంత మంది భావిస్తున్నట్లుగా రుతుక్రమం మైల కాదు, ప్రతినెలా పునరుత్పత్తికి అండం విడుదల అవుతుంది. గర్భాశయ లోపలి గోడలలో ఒక పొర మాదిరి గర్భధారణకు అనుకూలంగా తయారవుతుంది. విడుదలైన అండం ఫలదీకరణ చెందనట్లయితే అప్పటి వరకు తయారైన పొర బహిష్టు స్రావరూపంలో బయటకు వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సమయంలో ప్రకృతి విరుద్ధంగా అధిక స్రావం అయితే వైద్యపరమైన సమస్య తప్ప పాపమో, మలినమో మరొకటో కాదు.

ఒక వేళ మహిళలను అనుమతించాల్సి వస్తే అందుకు సరైన సమమా కాదా అని ఒక యంత్రంద్వారా పరీక్షించి,పరిశుద్ధులని తేలిన తరువాత అనుమతిస్తామని ఆలయ బోర్చు అధ్యక్షుడు అందునా అక్షరాస్యతలో అందరి కంటే ముందున్నదని పేరున్న కేరళవాసిగా చెప్పటం గర్హనీయం. దేవుడి దృష్టిలో అందరూ సమానమే అని చెబుతూ మరోవైపు మహిళలు మైల పడ్డారని ఎవరు చెప్పారు. అయ్యప్ప ఆలయ బోర్డు అధ్యక్షుడి అనుచిత ప్రకటన తరువాత కొంత మంది దానికి సమర్ధనగా పాతపడిన రోత వాదనలు ముందుకు తెస్తున్నారు. అయ్యప్ప స్వామి బ్రహ్మచారి, వివాహం చేసుకోని యోగి కనుక వయస్సులో వున్న యువతులకు ప్రవేశం నిషిద్ధమని టీకా తాత్పర్యం చెబుతున్నారు. అదే అయితే వివాహం అయిన పురుషులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? అయ్యప్ప దీక్ష పూనిన రోజులలో తప్ప మిగతా సమయాలలో ఎంతమందికి ఎలాంటి దురలవాట్లు వున్నాయో అందరికీ తెలుసు. వివాహం మానుకున్న లేదా వివాహం చేసుకోని వారికే పరిమితం చేయాలికదా ? వారికి దురలవాట్లు లేవని యంత్రాలను వుపయోగించి పరీక్ష చేయనపుడు యువతుల పట్ల వివక్ష ఎందుకు? అయ్యప్ప బ్రహ్మచారి అయినా ఒక అమ్మకొడుకే కదా ?

కేరళలోని కాశ్యప వేద పరిశోధనా సంస్ధను స్దాపించిన ఆచార్య రాజేష్‌ రుతు క్రమంలో వున్న మహిళలు మైలపడినట్లుగా ఏ వేదాల్లోనూ చెప్పలేదని వ్యాఖ్యానించారు. పందొమ్మిదవ శతాబ్ది సామాజిక సంస్కరణ వాది దయానంద సరస్వతి కూడా మహిళా భక్తులను శబరిమల ఆలయంలోకి అనుమతించాలని చెప్పారు.

రుతు క్రమం సమయంలో యువతులు ఏ పని చేయటం లేదు, పరీక్షలు రాస్తున్నారు, పరుగు పందాలలో పాల్గొంటున్నారు, అది ఇది అని లేకుండా చేయగలిగినవన్నీ చేస్తున్నపుడు భక్తి భావంతో దేవాలయాలకు వెళ్లటం తప్పెలా అవుతుంది. పుట్టుకతోనే మైలపడలేదు, పుట్టుక అన్నది ఒక యాదృఛ్చికం తప్ప కోరుకొని పుట్టింది కాదు. అందువలన ఏదో సంప్రదాయం దాన్ని మనం వుల్లంఘించటం ఎందుకు అని కాకుండా ప్రతి ఒక్కరూ శాస్త్రీయంగా ఆలోచించాలి. మూఢనమ్మకాలను మూలన పెట్టాలి తప్ప మైలపేరుతో మూలన కూర్చోవటం ఏమిటి ? అందుకే అందరూ నికితా అజాద్‌ మాదిరి తమ ప్రకృతి ధర్మానికి సిగ్గుపడకూడదు, సంతోషపడాలి.

అయ్యప్ప స్వామి ఆలయ ధర్మకర్తకు నికితా అజాద్‌ రాసిన బహిరంగ లేఖ

(దీనిని యూత్‌కి అవాజ్‌ వెబ్‌సైట్‌ ప్రచురించింది)

గౌరవనీయులైన అయ్యా,

నేను 20 సంవత్సరాల యువతిని, భూమ్మీద వున్న ఇతర మానవులకు మాదిరే నాకు కళ్లు, ముక్కు, చెవులూ, పెదవులు, చేతులు, కాళ్లు వున్నాయి. కానీ దురదృష్టం కొద్దీ నాకు స్తనాలు, పిరుదులు, రుతుస్రావం అయ్యే యోని కూడా వుంది. నా రక్తం శబరిమల ఆలయాన్ని కలుషితం చేస్తుందని ఈ మధ్యనే తెలుసుకున్నాను మరియు నేను రుతు క్రమంలో వున్న కారణంగా ఆలయ ప్రవేశానికి నన్ను నిరోధించారు.దీనిని ప్ర శ్నించినపడు మీరు ఇలా అన్నారు, ‘ ఏడాది పొడవునా మహిళలను దేవాలయంలోకి అనుమతించకుండా చూస్తే ఎలా వుంటుంది అని జనం అడిగే సమయం వస్తుంది. ఈ రోజుల్లో దేవాలయాల్లోకి ప్రవేశించేవారి దగ్గర ఆయుధాల కోసం శరీరాలను పరీక్షించే యంత్రాలు వున్నాయి. ఏదో ఒక రోజు మహిళలు కూడా ప్రవేశించటానికి ఇది సరైన సమయం( రుతు క్రమానికి కాదు) అని స్కాన్‌ చేసేందుకు అవసరమైన యంత్రాన్ని కనుగొనే రోజు వస్తుంది, అలాంటి యంత్రం కనుగొన్న తరువాత మహిళలను అలయంలోకి ప్రవేశించటం గురించి మనం మాట్లాడుకుందా అన్నారు.’

మీ ప్రకటనపైనేను ఆగ్రహించటం లేదు కానీ విచార పడుతున్నాను.నేను ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చాను. అనేక మంది దేవుళ్లు,దేవతల ముందు ప్రార్ధించమని నా తలిదండ్రులు ఎప్పుడూ చెబుతుంటారు. ప్రతి ఏడాది నా కుటుంబంతో కలసి నేను చింతా పుర్ణి, నైనాదేవి, వైష్ణోదేవి, చాముండా దేవి, జ్వాలా జీలను దర్శించటానికి వెళతాను. పురుషులు, స్త్రీలను దేవుడు సమానులుగా ఎలా సృష్టించాడో , ఎలా మానవులందరూ దేవుని పిల్లలో మా తలిదండ్రులు నాకు చెప్పారు. మీ ప్రకటన నాకు దేవుడిపై వున్న ప్రతి విశ్వాసాన్ని దెబ్బతీయటం ద్వారా షాక్‌ తిన్నాను.

ఆ సమయంలో(రుతుక్రమం) మహిళలు దేవాలయాలలో ప్రవేశించకూడదని మా అమ్మ చెప్పటం నేను విన్నాను. కానీ ఈ విశ్వాసం అర్ధంలేనిదని ఇటీవలి వరకు దీనిని నేను సాధారణంగా వదలివే శాను. ప్రత్యేక తరగతికి చెందిన మహిళలు రుతుస్రావంతో మైలపడవచ్చునేమో అని నేను ఆలోచించాను.కానీ ఇండియాలోని చారిత్రాత్మక దేవాలయలలో ఒకటైన దానిలో రుతుస్రావం పాపం అని పరిగణించటం విని నా హృదయం ముక్కలైంది.

నా గౌరవాన్ని కాపాడు కొనేందుకు నేను నల్ల ప్లాస్టిక్‌ కవర్‌లో శానిటరీ నాప్‌కిన్స్‌ తీసుకువెళుతూ వుంటాను. రక్తం నా దుస్తులకు అంటకుండా చూసుకొనేందుకు వాటిని జాగ్రత్తగా అమర్చుకుంటాను. ఆ సమయంలో ఒక వేళ మరక పడిందేమోనని చూసుకొనేందుకు పలుసార్లు మరుగుదొడ్డికి వెళతాను.ఎవరైనా ఎక్కడికి వెళుతున్నావని అడిగితే సిగ్గుతో చిరునవ్వులు విసురుతాను. మానాన్న, సోదరులు చూడకుండా వుండేందుకు చెత్తడబ్బా దగ్గరకు హడావుడిగా పరుగుదీస్తాను.మహిళలు పనిదుకాణాలలో శానిటరీ నాప్‌కిన్స్‌ కొనుగోలు చేసేందుకు పనిగట్టుకొని దుకాణాలను వెతుకుతాను.మన సమాజ పవిత్ర సంస్కృతిని నిలబెట్టేందుకు నేను ప్రయత్నించాను. నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు.

కానీ నేను ఒకందుకు విచార పడుతున్నాను. నాశరీరం నుంచి స్రవించే రక్తాన్ని నేను ఆపగలిగిన స్ధితిలో లేను. రుతుక్రమాన్ని చారిత్రాత్మకంగా సమర్ధించుకోవటం ద్వారా బ్రాహ్మణ హత్యా పాతకంగా నేను సంపాదించుకున్న శాపాన్ని నేను పోగొట్టుకోలేను. రక్తం స్రవిస్తూనే వుంటుంది. ఇది నా తప్పు, కరెక్టేనా ? తగు గౌరవంతో నా తప్పు గురించి కొన్ని ప్రశ ్నలు అడగటానికి సాహసిస్తున్నాను.

ఆలయాలలో ప్రవేశించే పురుషులందరూ స్త్రీ, పురుష సంభోగం ద్వారా పుట్టినవారే.బిడ్డను తొమ్మిది నెలలు స్త్రీ తన కడుపులో దాచుకుంటుంది, తన గర్బ సంచిద్వారా పోషకాహారాన్ని అందిస్తుంది, తన యోని ద్వారా బిడ్డకు జన్మనిస్తుంది.ఆలయాలలో ప్రవేశించే పురుషులందరూ తమ తల్లుల గర్బసంచులలో ఏర్పడే రక్తం ద్వారా పుట్టినవారు కాదా ?

ఒక చిన్న బిడ్డగా అష్టమి నాడు ఒక దేవిగా పరిగణించారు. కానీ నేను పెరిగిన తరువాత నేను అపవిత్రమైనట్లు చెప్పారు. తమ భారాన్ని వదిలించుకొనేందుకు నేను వివాహం చేసుకోవాలని పదే పదే నా తలిదండ్రులు కోరారు. సమాజం ఎంపిక చేసిన ఒక పురుషుడి వీర్యంతో నా అండం ఫలదీకరణం చెందాలని నాకు చెప్పారు. స్వయంగా వీర్యాన్ని ఎంపిక చేసుకోవటానికి నేను సాహసం చేస్తే నన్ను అనుమతించరు.అలాగే నా లుషితమైన రక్తాన్ని ఆలయంలోకి తీసుకురాకూడదని మీరు నిర్ణయించారు. నారక్తంతో నేను ఏం చేయాలో నిర్ణయించటానికి కొంత మందికి ఏ దేవుడు అధికారం ఇచ్చినట్లు ?

అయ్యా

తన స్వంత బిడ్డలను అపవిత్రులుగా పరిగణించే దేవుడిని నమ్మటానికి నేను అంగీకరించను, అలాంటి దేవాలయాలలోకి ప్రవేశించటానికి నాకు ఆసక్తి లేదు. కానీ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏ దేవుడి అనుమతితో మీరు నా స్వచ్చతÛను పరీక్షించాలని ప్రతిపాదిస్తున్నారు ? ఒక నాడు మీ దేవుడి ద్వారా వృద్ధిలోకి వచ్చి ఒక దేవుడు లేదా దేవాలయం ఒక యువతిని వివాహం చేసుకొని తరువాత అగ్రకులాల వారికి వ్యభిచారిణిగా చేసి దానిని క్రమంగా ఒక వ్యవస్దగా మార్చిన దేవదాసీ వ్యవస్ధ గురించి మీకు తెలిసే వుంటుందనుకుంటున్నాను. అమానుషమైన పూర్వకాలపు ఈ కుల వ్యవస్ధను ఎంతో కష్టంతో వదిలించుకున్నాము. కానీ స్వచ్ఛతను తనిఖీ చేసేందుకు యంత్రాలను ఏర్పాటు చేయటం ద్వారా మీరు అలాంటి వ్యవస్దనే ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు.

ఎక్కడైతే ప్రతి ఇరవై నిమిషాలకు ఒక మహిళ మానభంగం, ప్రతి క్షణానికి ఒక మహిళ గృహ హింసకు గురయ్యే ఒక దేశంలో మనం నివశిస్తున్నాము, ఒక ప్రజాస్వామ్య దేశం. మీ అభిప్రాయం ప్రకారం దీని వెనుక కారణం కూడా రక్తమే అయి వుంటుంది. రుతుస్రావం అ య్యే మహిళలను దేవాలయంలోకి ప్రవేశించనివ్వకుండా దాని పవిత్రను కాపాడేందుకు ఒక పరిష్కారమార్గాన్ని సూచించినట్లుగా , అలాంటి సంఘటనలు జరగకుండా నివారించేందుకు రుతుస్రావం అయ్యే మహిళలను ఇళ్లలో బందిఖానాలలో వుంచాలని మీరు ప్రతిపాదిస్తున్నారా ? బహుశా మీరు చేయండి. మీరు మీ స్నేహితుడు,ఢిల్లీలో సామూహిక మానభంగం చేసిన ముఠాను నిర్భయ గనుక అన్నా అని పిలిచి వుంటే అది జరిగేది కాదని చెప్పిన ఆశారాంబాపును మర్చిపోయి వుంటారనుకుంటున్నాను.

చివరి ప్రశ్న. రుతుక్రమాన్ని ఒక మైల కార్యక్రమంగా వర్ణించి మీరు మహిళలను మొత్తంగా అపహాస్యం చేశారు.కానీ అదే సమయంలో మా తోటి సోదరులు, సోదరీ మణులు రూపొందించిన దేవాలయాన్ని మీ పూర్వీకుల ఆస్తిగా చెప్పుకున్నారు. ఏ అధికారంతో శబరిమల ఆలయాన్ని మీ దేవాలయంగా చెప్పుకుంటారు? ఏ అధికారంతో నేను దేవాలయ ప్రవేశం చేయకూడదని చెబుతారు ?

చివరిగా , నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఊహాజనితమైన వుదారవాద స్వేచ్ఛను వదిలించుకొనేందుకు మహిళలకు ఒక అవకాశం ఇచ్చినందుకు, సమాజంలో వారి స్దితి గురించి పునరాలోచన చేసేందుకు తోడ్పడినందుకు మీకు కృతజ్ఞతలు.అంతే కాదు మీరు చెప్పినట్లుగా స్వచ్చతను నిర్ధారించే యంత్రాలను పెట్టలేరు కానీ ఇలాంటి తిరోగమన, అమానుష, మహిళా వ్యతిరేక ఆచారాలకు వ్యతిరేకంగా మహిళలు పోరాడేందుకు అవకాశం కల్పించినందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను.

మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్న

మీ విధేయురాలైన

రుతుక్రమంలో వున్న ఒక యువతి

నికితా అజాద్‌

Share this:

  • Tweet
  • More
Like Loading...

త్వశుంఠ ! త్వశుంఠ !!

18 Friday Dec 2015

Posted by raomk in AP NEWS, Current Affairs, NATIONAL NEWS, Women

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, call money, Vijayawada

సత్య

కాల్‌ మనీ అత్యాచారాల గురించి రోజు రోజుకూ కొత్త వుదంతాలు వెలువడుతున్నాయి. దీనికి బలైంది పేద, మధ్యతరగతి వారే కాదు, ధనికులు కూడా వున్నట్లు స్పష్టమౌతోంది. దీనిలో వడ్డీ మాఫియా, వాటికి బలైన అనేక కుటుంబాల మానవతుల మర్యాదలు మంట గలవటం గురించి బయటకు చెప్పుకోలేని వారెందరో వున్నారు. ఆ బలహీనతను ఆసరా చేసుకొని మాఫియాలు తమ పంజా విసురుతున్నాయన్నది స్పష్టం. ఈ దారుణాల గురించి అసెంబ్లీలో తొలి రోజే ప్రతిపక్షం, అధికారపక్షం బాహా బాహీ తలపడ్డాయి. ఇదెలా వుందంటే త్వశుంఠ అంటే త్వశుంఠ అన్నట్లుగా తయారైంది. బాధితులను రక్షించటం ఎలా, నేరగాళ్లపై చర్యలు తీసుకోవటం, ఇలాంటి దారుణాలను రాబోయే రోజుల్లో ఆపటం ఎలా అనే దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. మీ పార్టీ వారు, మీ అనుచరులే ఎక్కువ మంది వున్నారంటూ పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. అంటే అసలు సమస్యను రెండు పక్షాలూ పక్కదారి పట్టిస్తున్నాయి. వారి అనుచరులు కోరుకుంటున్నది ఇదే. ఇక్కడ ఒక విషయం స్పష్టం. ఏ పార్టీ వారు ఎందరున్నా వారంతా గతంలోనో, ఇప్పుడో అధికార ప్రాపకం వున్న వారు, లేదా సంఘవ్యతిరేక శక్తులు తప్ప మరొకరు కాదు. అలాంటి విభజన చేసేందుకు ప్రయత్నించటమంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలను ఏరే యత్నం తప్ప మరొకటి కాదు. రెండు పక్షాలకు మద్దతుదారులుగా పేరు పడిన మీడియా పత్రికలు లేదా టీవీ ఛానల్స్‌ తమ ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఎదుటి పక్షానికి చెందిన నేరగాళ్లనే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. అంటే అందరి గురించి తెలుసుకోవాలంటే రెండు పక్షాల మీడియా వార్తలను చదువుకోవాల్సి వుంటుంది.

గతంలో మద్యం, ఇసుక మాఫియాలు, వాటి అక్రమాల గురించి సంచలన వార్తలు వచ్చిన విషయాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. వాటిలో శిక్షలు పడిన వారెందరు? ఏ పార్టీ వారెందరో వున్నారో ప్రభుత్వం ప్రకటిస్తే తాజా కాల్‌ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటారనే నమ్మకం బాధితుల్లో కలుగుతుంది, మరిన్ని దారుణాలను నివేదించటానికి, ఫిర్యాదు చేయటానికి ముందుకు వస్తారు. అది చేయటానికి బదులు ఫలానా నిందితుడు ఫలానా నాయకుడితో ఫొటోలు దిగాడు, ఫలానా నిందితుడు ఫలానా నేత పర్యటనలకు ఏర్పాట్లు చేశాడు వంటి వాదనల ద్వారా సాధించేదేమీ వుండదు. ఇలాంటి నిందితులందరూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి ఫిరాయించటం జగమెరిగిన సత్యం. అలాంటి వారని తెలిసిన తరువాత కూడా పార్టీల కండువాలు కప్పుతున్నారా లేదా ? ఏదో సాకుతో సమర్ధిస్తున్నారా లేదా ?ఎక్కడ తిరిగినా సరే మా దొడ్లే ఈనితే చాలంటున్నారా లేదా ? అందువలన అసెంబ్లీలో,వెలుపలా పాలక, ప్రతిపక్ష పార్టీల వ్యవహారం అంతా లాలూచీ కుస్తీ తప్ప మరొకటి కాదని జనం అనుకుంటే తప్పేముంది?

విజయవాడ, కృష్ణాజిల్లాలోని తెలుగు దేశం పార్టీలోని ముఠా గొడవల్లో భాగంగా ప్రత్యర్ధి వర్గాన్ని ఇరుకున పెట్టేందుకు కాల్‌ మనీ దందాను ఒక వర్గం వుపయోగించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచిదే ! ప్రతిపక్షం చేయలేని పనిని ఎవరో ఒకరు చేశారు, వారు ఎందుకు చేసినా ‘అభినందిం’చాల్సిందే. ఇంకా అలాంటి విషయాలను బయటపెట్టేందుకు ప్రోత్స హించాల్సిందే. అప్పుడే అవతలి ముఠాలో ఏవైనా అక్రమాలుంటే ఇవతల ముఠా కూడా దెబ్బకు దెబ్బ అన్నట్లుగా బయటపెడుతుంది. జనానికి వాస్తవాలు తెలుస్తాయి, మీడియాకు సంచలన వార్తలు దొరుకుతాయి. విజయవాడకు అలాంటి చరిత్ర గతంలో వున్నది. కాంగ్రెస్‌లో జిఎస్‌ రాజు, వంగవీటి రంగా వర్గాలు అలా అనేక విషయాలను బయటపెట్టాయి. ఆ మంచి సాంప్రదాయాన్ని ఎవరు కొనసాగించినా అభినందించాల్సిందే.ఎందుకంటే అధికార యంత్రాంగం తానుగా అక్రమాలను వెలికితీసి, అక్రమార్కుల పని బట్టదు అని తేలిపోయింది. ఎందుకంటే వారికి ఎంతసేపూ పాలకపార్టీ సేవ తప్ప మరొకటి చేసే తీరిక వుండదు.

ఈ సందర్బంగా జనం బలహీనతలను చెప్పుకోకుండా సంపూర్ణం కాదు. విజయవాడ, రాష్ట్రం, దేశం ఎక్కడైనా ఇలాంటి మాఫియాలు, నేరగాళ్ల గురించి జనానికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అయినా సరే ఎన్నికలలో వారికి మద్దతు ఇస్తున్నారు. దీని వెనుక వున్న లాజిక్కు ఏమిటి ?ఏటిఎం మిషన్‌లో కార్డు అలా పెట్టి ఇలా డబ్బు తీసుకున్నంత సులభంగా తెల్లవారే సరికి డబ్బు సంపాదించాలి, నువ్వు ఎంత డబ్బు సంపాదించావన్నది ముఖ్యం తప్ప ఎలా సంపాదించావన్నది కాదు అన్నది నీతి నేడు సమాజాన్ని నడిపిస్తున్నది. అందువలన డబ్బు సంపాదించే వారే సమర్ధులు, జనం, సమస్యలు, పరిష్కారాలంటూ వీధుల్లో తిరిగే కమ్యూనిస్టుల వలన ప్రయోజనం లేదు. మనం కూడా ఎప్పుడైనా డబ్బు సంపాదించాలంటే మార్గం అధికార పార్టీని బలపరచటం, దాని నాయకుల చుట్టూ తిరగటం తప్ప మరొక మార్గం లేదు.

దీనికి తోడు వినియోగదారీ సంస్కృతి జన నరనరాల్లో ప్రవేశించింది. అత్యాశలకు పోవటం, ఆడంబరాలను పదర్శించటం, లేనిగొప్పలు చెప్పుకోవటం, పిల్లలకు వాస్తవాలు తెలియకుండా దాచటం, అందుకోసం అందినకాడికి అప్పులు చేయటం ఇలాంటి మాఫియాల చేతుల్లో చిక్కుకోవటం. దీన్నుంచి బయటపడనంత వరకు ఈ రోజు కాల్‌ మనీ రేపు మరొక మనీ, మరొక మాఫియా చేతుల్లో చిక్కుకోవటం. దీన్ని గురించి ఆలోచించకుండా, మంచి చెడ్డల వివేచన చేయకుండా రాజకీయాలలో నేరగాళ్లను, వారిని వెంటవేసుకు తిరిగే వారిని సమాజం అసహ్యించుకొని దూరంగా పెట్టనంత కాలం ఎండమావుల వెంట పరుగుపెడుతూనే వుంటారు, మోసపోతూనే వుంటారు. కాల్‌ మాఫియా చేతుల్లో అత్యాశకు పోయిన ఒక కుటుంబం గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. అదే నిజమైతే జనం ఎంతటి ప్రమాదకర పోకడలలో వున్నారో ఆందోళన కలిగిస్తోంది.

షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టటానికి కోట్ల రూపాయల అప్పుతీసుకొని కాల్‌మనీ మాఫియా వలలో చిక్కుకున్న ఒక కుటుంబం గురించి మీడియాలో వచ్చింది. లక్షల రూపాయలు తీసుకుంటేనే తీర్చలేని స్ధితి వున్నపుడు కోట్ల రూపాయలు అప్పు చేసి కాంప్లెక్సులు కట్టాలనుకోవటం ఏమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

71 Million Single Women, 39% Rise Over A Decade | IndiaSpend

14 Saturday Nov 2015

Posted by raomk in Women

≈ Leave a comment

Yatra naryastu pujyante ramante tatra Devata, Yatrai taastu na pujyante sarvaastatra falaah kriyaah.   (Where women are honoured, divinity blossoms, and where women are dishonoured, all action, no matter how noble, remains unfruitful.

Source: 71 Million Single Women, 39% Rise Over A Decade | IndiaSpend

Share this:

  • Tweet
  • More
Like Loading...
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d