• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: media credibility

గాజాలో మారణకాండకు ఏడాది : ఆయుధాలతో ఇజ్రాయెల్‌,తప్పుడు వార్తలతో మీడియా దాడి !

09 Wednesday Oct 2024

Posted by raomk in Asia, COUNTRIES, Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

fake news, Hamas Israel, Israel genocide, Joe Biden, media bias, media credibility, Netanyahu, Palestinians, Propaganda War, Western media propaganda


ఎం కోటేశ్వరరావు


తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని ధర్మంగా చెప్పాలన్న లోకోక్తి తెలిసిందే. వర్తమాన ప్రపంచంలో అలా జరుగుతోందా ? నూటికి నూరుశాతం లేదు. పక్షపాత తీర్పులు, వైఖరులే వెల్లడౌతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ ప్రారంభమై అక్టోబరు ఏడవ తేదీతో ఏడాది గడిచింది. ప్రపంచ ప్రధాన స్రవంతి మీడియా ఇజ్రాయెల్‌ మీద హమస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడికి సంవత్సరం నిండిరది అంటోంది. హమస్‌దాడిని ఎవరూ సమర్ధించటం లేదు. ఐక్యరాజ్య సమితి 1948లో ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసిన తరువాత అప్పటి వరకు ఉన్న పాలస్తీనా ఉనికిలో లేకుండా పోయింది. ఏదో ఒకసాకుతో దానికి కేటాయించిన ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకోవటంతో పాటు వేలాది మందిని చంపి, లక్షల మందికి నిలువనీడ లేకుండా చేస్తూ పాలస్తీనా దేశం ఏర్పడకుండా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికాతో సహా పశ్చిమదేశాలన్నీ మద్దతు ఇస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్న బృందాలలో హమస్‌ ఒకటి. దాని దాడులు గత ఏడాదే ప్రారంభం కాలేదు. కానీ అది చేసిన దాడి సాకుతో గాజాలో ఏడాది కాలంగా మారణకాండ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 42వేల మందిని చంపారు.పదివేల మంది జాడ తెలియటం లేదు, లక్ష మంది వరకు గాయపడ్డారు.లక్షలాది ఇండ్లను నేలమట్టం గావించారు. గాజాలోని 23లక్షల మందిని ఇండ్ల నుంచి వీధుల్లోకి నెట్టారు. మారణకాండ ఇంకా కొనసాగుతోంది. వెస్ట్‌బాంక్‌ ప్రాంతానికి విస్తరించారు. ఇదంతా ఎందుకు అంటే హమస్‌ జరిపిన దాడిలో 815 మంది సాధారణ పౌరులతో సహా 1,195 మంది ఇజ్రాయెలీలు మరణించారు, ఆ సందర్భంగా కొందరు విదేశీయులతో సహా 251 మందిని బందీలుగా పట్టుకున్నారు, వారిలో కొందరిని విడుదల చేశారు, మరికొందరు మరణించగా మరో 95 మంది హమస్‌ వద్ద బందీలుగా ఉన్నారు. దీనికి ప్రతీకారం అని చెబుతున్నారు. ఏ రీత్యా చూసినా ఇజ్రాయెల్‌ చర్య గర్హనీయం, అంతర్జాతీయ న్యాయస్థానంలో యుద్ధ నేరాల కింద దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలి.


ఈ దారుణకాండ గురించి ప్రపంచ మీడియా వార్తలు ఇస్తున్న తీరు కూడా సభ్యసమాజం ఆమోదించేదిగా లేదు. అంతర్జాతీయ వార్తా సంస్థలన్నీ పశ్చిమ దేశాలకే చెందినవి కావటంతో అవి అందచేసిన తప్పుడు సమాచారాన్నే వాస్తవాలుగా చెబుతున్నారు. అయితే తప్పుడు, వక్రీకరణ, కుహనా వార్తలను ఇవ్వటం కొత్తగా జరుగుతున్నది కాదు. ప్రపంచం మీద ప్రచారదాడి జరుగుతున్నది. గాజాలో తలెత్తిన మానవ సంక్షోభ తీవ్రత అక్కడి నుంచి వార్తలు పంపుతున్న పశ్చిమదేశాల విలేకర్లలో ఎక్కడా కానరాదు. ప్రపంచానికి వారు అందచేస్తున్నవి తప్ప ప్రత్యామ్నాయ సంస్థలు లేవు. గాజాలో మరణించిన, గాయపడిన వారిలో నూటికి 80శాతం మంది నిరాయధులైన మహిళలు, పిల్లలే ఎందుకు ఉన్నారో ఏ మీడియా అయినా చెబుతోందా? హమస్‌ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో చూడండి అంటూ అందచేస్తున్న వీడియోలలో ఒక శాతమైనా ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు సంబంధించి లేవంటే అతిశయోక్తి కాదు. వైమానికదాడులు, టాంకుల ఫిరంగి గుళ్లకు 128 మంది జర్నలిస్టులు మరణించగా వారిలో 123 మంది పాలస్తీనియన్లు, ఇద్దరు ఇజ్రాయెలీలు, ముగ్గురు లెబనీస్‌ ఉన్నారు. మరో 35 మంది గాయపడ్డారు. ఏకపక్షంగా జరుగుతున్న మారణకాండకు ఇది ఒక నిదర్శనం.ఎక్కడో ఏసి గదుల్లో కూర్చొని కంప్యూటర్‌ గ్రాఫిక్‌లు సృష్టిస్తున్నదెవరో, యుద్ధరంగంలో ప్రాణాలకు తెగించి వాస్తవాలను నివేదించేందుకు పని చేస్తున్నదెవరో అర్ధం అవుతోంది. మేము సైతం అన్నట్లుగా సాధారణ పౌరులతో పాటు పాలస్తీనా జర్నలిస్టులు పని చేస్తున్నారు, ప్రాణాలర్పిస్తున్నారు.


ఇజ్రాయెల్‌ మిలిటరీ, ప్రభుత్వ పెద్దలు అందిస్తున్న సమాచారాన్ని స్వయంగా చూసినట్లు పశ్చిమదేశాల విలేకర్లు, సంస్థలు చిత్రిస్తున్నాయి. ఐరోపాలో అతి పెద్ద మీడియా సంస్థ జర్మన్‌ యాక్సెల్‌ స్ప్రింగర్‌ అప్‌డే అనే ఒక యాప్‌ను రూపొందించింది. ఇజ్రాయెల్‌ ప్రతినిధులు చెప్పే కథనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పాలస్తీనీయుల మరణాలను తగ్గించి చూపాలని తన సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు దాని అంతర్గత పత్రాల ద్వారా వెల్లడైందని ఇంటర్‌సెప్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది. అంతేకాదు మరీ తప్పనిసరైతే తప్ప పాలస్తీనియన్ల గురించి ప్రస్తావించవద్దని అమెరికా న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక కూడా తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. యజమానులే అలాంటి వైఖరి తీసుకున్నతరువాత నిజం రాసినా, చూపినా అవి పాఠకులు, వీక్షకుల వద్దకు చేరుకోవు అన్నది మీడియాలో పని చేసేవారందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే హమస్‌ను ఒక రాక్షసిగా, దాన్ని మట్టుపెట్టేందుకు పూనుకున్న అపరశక్తిగా, బాధిత దేశంగా ఇజ్రాయెల్‌ను చిత్రించారు. సెంటర్‌ ఫర్‌ మీడియా మోనిటరింగ్‌ ( మీడియా పరిశీలక కేంద్రం) అనే సంస్థ అంతర్జాతీయ మీడియా ఛానల్స్‌ ప్రసారం చేసిన లక్షా 80వేల వీడియోలు,బ్రిటీష్‌ మీడియా సంస్థలు రాసిన 26వేల వ్యాసాలను వడగట్టి తేల్చింది కూడా ఇదే. అక్టోబరు ఏడు నుంచి జరుగుతున్నదాడులకు ముందు కూడా మీడియా తీరు ఇలాగే ఉంది, పాలస్తీనా కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదులుగా చిత్రించించటం తెలిసిందే. ఇటలీ మీడియా 2019`21 సంవత్సరాల తీరుతెన్నులను ఐరోపా సమాఖ్య నిధులతో ఒక పరిశోధన చేశారు. మూడు పత్రికలను పరిశీలించగా అంతర్జాతీయ వార్తలలో 32శాతం ఇజ్రాయెల్‌ ప్రధాని, నరహంతకుడు నెతన్యాహు చుట్టూ తిరిగాయని తేలింది. గతేడాది కాలంగా సాగిస్తున్న మారణకాండ ఇటాలియన్‌ మీడియాకు పట్టలేదు. ‘‘ గాజా నుంచి రాకెట్ల ప్రయోగం, గాజా నుంచి 430 రాకెట్లతో దాడి, ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉంది ’’ ఇలాంటి శీర్షికలతో జనాన్ని తప్పుదారి పట్టించారు. దాని దుర్మార్గాలను సమర్ధించారు.


హమస్‌ దాడిచేసి 40 మంది పసిపిల్లల గొంతు కోసిందంటూ ఇజ్రాయెల్‌ అల్లిన అవాస్తవ కథనాన్ని యావత్‌ ప్రపంచ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఖండిస్తూ మాట్లాడాడు. ఇలాంటి ప్రకటనలు చేసే ముందు నిర్ధారణ చేసుకుంటే మంచిది లేకుంటే పరువు పోతుంది ముసలోడా అంటూ అతగాడి సిబ్బంది తరువాత జాగ్రత్త చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఈ కట్టుకథ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతూనే ఉంది, ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు దాన్ని ఉదహరిస్తూనే ఉన్నారు. ముస్లింలు జీహాద్‌ ప్రకటించారు, ప్రపంచ మొత్తాన్ని కబళించేందుకు పూనుకున్నారు, తమ జనాభా సంఖ్యను పెంచుతున్నారు అంటూ సాగిస్తున్న అనేక కుట్ర కథనాలతో దశాబ్దాల తరబడి జరుపుతున్న గోబెల్స్‌ ప్రచారాన్ని బుర్రలకు ఎక్కించుకున్నవారిని ఇలాంటివి వెంటనే ఆకర్షిస్తాయి. అదేగనుక వాస్తవమైతే ఇజ్రాయెల్‌ చుట్టూ ఉన్నది ముస్లిం దేశాలే, అవన్నీ ఒక్కసారిగా దండెత్తి ఉంటే ఈ పాటికి అది అదృశ్యమై ఉండేది, పాలస్తీనియన్లు ఏడున్నర దశాబ్దాలుగా అష్టకష్టాలు పడి ఉండేవారు కాదు. కానీ అలా జరగలేదే ! అలాంటిది ముస్లింలు ప్రపంచం మొత్తాన్ని ఆక్రమిస్తారంటే నమ్మేవారికి బుర్రల్లో పదార్ధం లేదన్నది స్పష్టం.ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసి ప్రపంచానికి ప్రమాదం తెచ్చిపెట్టాడన్న నాటి జార్జి డబ్లు బుష్‌, మీడియా ప్రచారాన్ని అమెరికాతో పాటు అనేక దేశాల్లో జనం నమ్మారు. తరువాత అది వాస్తవం కాదని అదే అమెరికా అంగీకరించాల్సి వచ్చింది. పాలకులతో పాటు మీడియా కూడా విశ్వసనీయతను కోల్పోయింది.


అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలను నిజంగా ఒక్కరిని చంపినా ఖండిరచాల్సిందే. ఆగస్టు 15నాటికి గాజాలో 42వేల మందిని ఇజ్రాయెల్‌ చంపితే వారిలో 17వేల మందికి పైగా పిల్లలు, పదకొండువేల మంది మహిళలు ఉన్నారు. ఏ పశ్చిమదేశాల మీడియా సంస్థలైనా దీన్ని గురించి ఎన్ని వార్తలను ఇచ్చాయి. ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన తరువాత కూడా ఇంకా హమస్‌ గురించే అవి చెబుతున్నాయి.నలభై రెండువేల మందిని చంపి దాదాపు ఒక లక్ష మందిని గాయపరచి, పదివేల మందిని అదృశ్యం కావించిన యూదు దురహంకారులు పాలస్తీనియన్లను తిప్పికొట్టేందుకు చేసిన పనిగా అందమైన మాటలతో పచ్చి దుర్మార్గాన్ని పశ్చిమదేశాలు వర్ణిస్తున్నాయి. బిబిసి తీరును పరిశీలిస్తే గతేడాది అక్టోబరు 10 నుంచి డిసెంబరు రెండవ తేదీ వరకు 23సార్లు హమస్‌ సాయుధులు ఇజ్రాయెలీలపై మారణకాండ జరిపారని వర్ణిస్తే ఒక్కసారే పాలస్తీనియన్ల మీద మారణకాండ పద ప్రయోగం జరిగిందని తేలింది. అంటే దొంగే దొంగని అరచినట్లుగా బిబిసి తీరు ఉంది. ఈ తీరుకు నిరసనగా 2023 అక్టోబరులోనే ఇద్దరు ఆ సంస్థ జర్నలిస్టులు రాజీనామా చేశారు. గాజాపై దాడిని ఖండిస్తూ వెయ్యి మంది అమెరికా జర్నలిస్టులతో పాటు సంతకం చేసిన న్యూయార్క్‌ టైమ్స్‌ మాగజైన్‌ ఎడిటర్‌ జాజ్‌ హగ్స్‌ మీద యాజమాన్యం వత్తిడి తేవటంతో రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ జాబితానుంచి పేరు తొలగించాలని అసోసియేటెడ్‌ ప్రెస్‌ విలేకరిని యాజమాన్యం ఆదేశించింది. ఇలా లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ వంటి అనేక పత్రికలు, మాగజైన్లు కూడా ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వత్తిడి చేసి అనేక మంది జర్నలిస్టులను తొలగించటం, నోరు మూయించటం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డాయి. పాలస్తీనియన్ల మీద తప్పుడు వార్తలు ఒక ఎత్తయితే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే ప్రముఖ అమెరికా పత్రిక రాసిన ఒక ఆధారం లేని వార్త కారణంగా గాజాలో నిరాశ్రయులకు అందాల్సిన 45 కోట్ల డాలర్ల సాయం నిలిచిపోయింది. గాజాలో ఐరాస నిర్వహిస్తున్న శిబిరంలో పనిచేస్తున్న పన్నెండు మంది సిబ్బందికి హమస్‌తో సంబంధాలు ఉన్నాయని, వారంతా దాడుల్లో పాల్గ్గొన్నారని ఆ పత్రిక కేవలం ఇజ్రాయెల్‌ కట్టుకథనే తనదిగా రాసింది.నిజానికి దానికి ఎలాంటి ఆధారాలు లేవు.అమెరికా సిఎన్‌ఎన్‌, బ్రిటన్‌ బిబిసిలో పని చేస్తూ గాజా పరిణామాలపై వార్తలు ఇచ్చిన పది మంది విలేకర్లు ఇజ్రాయెల్‌ అనుకూల వైఖరితో పనిచేసినట్లు వెల్లడిరచారు.న్యూస్‌ రూముల్లో ఉన్న సీనియర్లు జోక్యం చేసుకొని ఇజ్రాయెల్‌ చేసిన దుర్మార్గాలను తక్కువ చేసి చూపాలని వత్తిడి చేసినట్లు వెల్లడిరచారు.ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన చిత్రం ద్వారా బిబిసి భాషలో పాలస్తీనీయన్ల మీద వ్యతిరేకతను ఎలా రెచ్చగొట్టారో జరిపిన ఒక పరిశీలన వచ్చింది. అదే మంటే మారణకాండకు గురైనట్లు 23సార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి మాత్రమే పాలస్తీనా పేరును ప్రస్తావించారు. ఊచకోతకు గురైనట్లు ఇరవైసార్లు ఇజ్రాయెల్‌ గురించి చెప్పగా ఒక్కసారి కూడా పాలస్తీనా పేరు రాలేదు.


తమ పత్రికలు ఎన్ని తప్పుడు కథనాలు, అవాస్తవాలు రాసినా అమెరికా యువత ముఖ్యంగా విద్యార్థులు పాలస్తీనా అనుకూల వైఖరి తీసుకోవటం గమనించాల్సిన అంశం. వారు మీడియా కతలను నమ్మటం లేదన్నది వాస్తవం. ఇజ్రాయెల్‌ మారణకాండకు పాల్పడుతున్నదని నమ్మిన కారణంగానే ఈ పరిణామం. ఇది అక్కడి పాలకవర్గాలకు ఆందోళన కలిగించే అంశం. ప్రచారదాడి ఎదురు తిరిగితే వారి పునాదులను కదలించే కదన శక్తిగా యువత మారుతుంది.ప్రపంచ ప్రఖ్యాతిగాంచి పర్యావరణ ఉద్యమ కార్యకర్త 21 సంవత్సరాల స్వీడిష్‌ యువతి గ్రేటా థన్‌బెర్గ్‌ పాలస్తీనా అనుకూల ప్రదర్శనలో పాల్గొన్నందుకు కోపెన్‌హాగన్‌ నగరంలో అరెస్టు చేశారు. మీడియా కూడా ఆమె మీద పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది.యువతలో వచ్చిన ఈ మార్పును కూడా మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఒకసారి నీవు బాధితుడవైనందుకు గాను ఇతరుల మీద నిరంతరం దాడి కొనసాగిస్తానంటే కుదరదు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి గాజాలో పాలస్తీనియన్ల మీద ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు పాల్పడుతున్నది. పశ్చిమ దేశాల మీడియా దానికి మద్దతు ఇస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మీడియా కట్టుకథలు, పిట్టకతలను నమ్మని జనం !

03 Wednesday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, Latin America, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ 1 Comment

Tags

media bias, media credibility, Propaganda War, US imperialism, US MEDIA COCK AND BULL STORIES, US Media lies


ఎం కోటేశ్వరరావు


మొదటి ప్రపంచ యుద్ధానికి కారకులలో ఒకడు జర్మన్‌ చక్రవర్తి కైజర్‌ రెండవ విల్‌హెల్మ్‌.1917 ఫిబ్రవరిలో చైనాలో బ్రిటీష్‌ వారి పత్రిక నార్త్‌ చైనా డైలీ న్యూస్‌ ఒక వార్త ప్రచురించింది. కైజర్‌ సేనలు శవాల నుంచి గ్లిజరీన్ను తయారు చేస్తున్నారన్నది దాని సారాంశం. ఏప్రిల్‌ నాటికి లండన్‌ నుంచి వెలువడే టైమ్స్‌, డెయిలీ మెయిల్‌ పత్రికలు తమ ప్రతినిధులు శవాల నుంచి గ్లిజరీన్‌ తీస్తున్న ఫ్యాక్టరీలను చూసినట్లు వార్తలను ప్రచురించాయి. అదే నెలలో లండన్‌ నుంచి ప్రచురితమౌతున్న ఒక బెల్జియన్‌ పత్రిక శవాలకు సంబంధించిన వార్తను ప్రచురించింది. దానికి జర్మనీలో ప్రచురితమైన ఒక వార్త ఆధారం. జర్మన్‌ పత్రికలో గుర్రాలు, కంచరగాడిదల శవాలను కాల్చుతున్నట్లు విలేకరి పేర్కొన్నాడు. అది బ్రిటీష్‌ పత్రికల్లో మానవశవాలుగా మారింది. అలాంటిదేమీ లేదని జర్మనీ పేర్కొన్నప్పటికీ అప్పటికే జర్మనీ మీద కోపంతో ఉన్న జనం వార్తలను నిజమే అని నమ్మారు. గ్లిజరీన్‌ వార్తకు ఎలాంటి ఆధారం లేదని 1925లో బ్రిటన్‌ ప్రజాప్రతినిధుల సభలో ప్రభుత్వం పేర్కొన్నది. అదే ఏడాది కన్సర్వేటివ్‌ పార్టీ ఎంపీ జాన్‌ చార్టరీస్‌ అమెరికాలో పర్యటించినపుడు తానే ఈ వార్త సృష్టికర్తనని వెల్లడించాడు. అతగాడు పూర్వాశ్రమంలో ఇంటిలిజెన్స్‌ అధిపతిగా పని చేశాడు.1917లో బ్రిటన్‌ గూఢచార సంస్థ ఎం17 వివిధ పత్రికల్లో స్పెషల్‌ కరస్పాండెంట్లుగా పని చేసేందుకు 13 మంది అధికారులు, 25 మంది కిరాయి రాతగాళ్లను నియమించింది. వారిలో ఒకడు శవాల ఫ్యాక్టరీ కట్టుకధ గురించి అంగీకరించాడు.మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటన్‌ అనుసరించిన ఎత్తుగడలను తరువాత జర్మన్‌ నాజీ హిట్లర్‌ మరింతగా పెంచి నీవు నేర్పిన విద్య అన్నట్లుగా కట్టుకథలను ప్రచారంలో పెట్టించాడు. వాటికి మారు పేరుగా తన ప్రచారశాఖ మంత్రి గోబెల్స్‌ను ప్రపంచానికి అందించాడు.ఇప్పుడు గోబెల్స్‌ వారసులు తామరతంపరగా పెరిగారు.గత వంద సంవత్సరాలుగా మీడియా అబద్దాలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరుగుతున్నాయి.


అభిప్రాయ సేకరణ సంస్థ గాలప్‌ తాజాగా విడుదల చేసిన జూలై మాస సర్వే ప్రకారం అమెరికాలో కేవలం పదకొండుశాతం మంది మాత్రమే టీవీ ఛానళ్ల వార్తలను నమ్ముతున్నారు.పత్రికలపై 16శాతం మందికి విశ్వాసం ఉంది.రెండవ ప్రపంచ యుద్దం, ఆ తరువాత అమెరికా జరిపిన యుద్దాల సందర్భంగా వాటిని సమర్ధించేందుకు అమెరికా సిఐఏ, దానితో చేతులు కలిపిన వివిధ దేశాల సంస్థలు వండి వార్చిన తప్పుడు వార్తలతో జనం విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంలో కుహనా వార్తలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆయుధాలతో పాటు అంతేశక్తి వంతంగా ప్రచారదాడులు సాగుతున్నాయి. సిఐఏ స్థాపక అధికారుల్లో ఒకడైన ఫ్రాంక్‌ విస్నర్‌ ఒక సందర్భంగా మీడియా ఒక సంగీత వాద్యం వంటిదని చెప్పాడు. ప్రపంచంలోని ప్రధాన మీడియా సంస్థల కార్యాలయాల్లో సంగీత దర్శకుల మాదిరి సిఐఏ అధికారులు, గాత్ర,వాయిద్యకారులుగా ఇతరులు చేరతారు. తప్పుడు వార్తలను వీనుల విందుగా, కనులపసందుగా రూపొందిస్తారు. ఇటీవల బిజెపి తమ భావజాలం ఉన్నవారిని ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున మీడియాలో ప్రవేశపెట్టింది. ప్రతి పార్టీ అలాంటి వారిని ప్రవేశపెట్టటం లేదా అప్పటికే ఉన్నవారిని తమకు అనుకూలంగా మార్చుకోవటం చేస్తున్నది. ఇలాంటి వారంతా తమ అజెండాలకు అనుగుణంగా పాఠకులు, వీక్షకులకు వినిపిస్తారు, చూపిస్తారు. అమాయకులను నిందితులుగా, నిందితులను అమాయకులుగా మార్చివేస్తారు. వీరికి పోలీసు, గూఢచార ఏజన్సీల మద్దతు పూర్తిగా ఉంటుంది. ఎంపిక చేసుకున్నవారికి లీకులు అందిస్తారు. అందుకే ప్రస్తుతం ప్రపంచ మీడియాలో జర్నలిజానికి బదులు ప్రచారదాడి తిష్టవేసిందని అనేక మంది చెబుతున్నారు. ఇది యజమానులకు పెద్ద లాభసాటిగా ఉంది.


పాలకవర్గ దోపిడీ, సామ్రాజ్యవాద కాంక్ష, విస్తరణకు మీడియా తన వంతు పాత్ర నిర్వహిస్తోంది. అమెరికా-స్పానిష్‌ యుద్దాలలో 1898లో క్యూబా, పోర్టోరికో, ఫిలిఫ్పీన్సును వలసలుగా చేసుకున్నపుడు అమెరికాను మీడియా సమర్ధించింది. దీన్ని అప్పుడే ఎల్లో జర్నలిజం అని పిలిచారు. అంతెందుకు జపాన్‌పై రెండు అణుబాంబులు వేసిన దుర్మార్గాన్ని కూడా అధికభాగం అమెరికన్‌ మీడియా సమర్ధించింది.యుద్దాన్ని ముగించేందుకు అణుబాంబులు వేయకతప్పలేదని పేర్కొన్నాయి. హిరోషిమా నాశనంలో రేడియోయాక్టివిటీ లేదు అని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక శీర్షిక పెట్టి మరీ రాసింది.అణుదాడితో ప్రమాదకరమైన అణుధార్మికత ఏర్పడదన్న మిలిటరీ అధికారిని ఉటంకించింది. వియత్నాంపై దాడి చేసేందుకు అమెరికా టోంకిన్‌ గల్ఫ్‌ దాడిని సాకుగా చూపింది. ఆ కట్టుకథకు మీడియా ఎంతో ప్రాచుర్యమిచ్చింది. 1980 దశకంలో నికరాగువాలో అమెరికా సిఐఏ ఏజంట్లు, కాంట్రా కిరాయి మూకలు చేసిన చిత్రహింసలు, హత్యలు, దుర్మార్గాలను శాండినిస్టా విప్లవకారులకు అంటగట్టి పత్రికలు ప్రచారం చేశాయి.1990 దశకంలో కువైట్‌పై ఇరాక్‌ దాడి చేసింది. అప్పుడు ఇరాకీ సైనికులు కువైట్‌ ఆసుపత్రుల్లో ఇంకుబేటర్లలో ఉన్న పిల్లలను కిందపడవేసి చంపారని అమెరికా పత్రికలు రాశాయి. ఇలాంటి కట్టుకథలను సాకుగా చూపి ఇరాక్‌ మీద అమెరికా దాడి చేసింది. తరువాత సద్దామ్‌ హుసేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోగేసినట్లు ప్రచారం చేసి దురాక్రమణకు పూనుకోవటం సద్దామ్‌ను హత్యచేసిందీ తెలిసిందే. 2011లో లిబియాపై నాటో దాడిచేసినపుడు కూడా కట్టుకథలు రాశారు. మహిళలపై అత్యాచారాలు చేసేందుకు ఆ దేశ నేత గడాఫీ సైనికులకు వయగ్రా మాత్రలు ఇచ్చాడని రాశారు. సిరియాలో సిఐఏ మద్దతు ఉన్న సలాఫీ జీహాదీ తీవ్రవాదుల దుర్మార్గాలను ప్రభుత్వానికి ఆపాదించారు.ఈ తప్పుడు ప్రచారాన్ని పులిట్జర్‌ బహుమతి గ్రహీత జర్నలిస్టు సేమౌర్‌ హెర్ష్‌ బయట పెట్టినందుకు అమెరికన్‌ కార్పొరేట్‌ మీడియా అతని రచనలను ప్రచురించకుండా నిలిపివేసింది.


అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులను లక్ష్యంగా చేసుకొని క్యూబా, చైనా, రష్యాలు ఎలక్ట్రోమాగటిక్‌ తరంగాలతో దాడులు చేయటంతో వారందరికీ చెవుల్లో గింగుర్లు, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపించినట్లు దీనికి హవానా సిండ్రోమ్‌ అనిపేరు పెట్టి పత్రికలు రాశాయి. ఇది ఒక మానసిక జబ్బు తప్ప మరొకటేమీ కాదని కొందరు నిపుణులు చెప్పారు.నిజానికి అలాంటి అవకాశమే ఉంటే అనేక దేశాల్లో ఉన్న అమెరికన్లందరి మీద ఆప్ఘనిస్తాన్‌ వంటి చోట్ల వాటిని ఇప్పటికే ప్రయోగించి ఉండేవారు. వర్తమానంలో ఉక్రెయిన్‌ సంక్షోభంలో అమెరికా, ఐరోపా మీడియా అల్లిన కట్టుకథలకు లెక్కే లేదు.వీడియో గేమ్‌లను రష్యా దాడులుగా చూపారు.


అమెరికన్‌ మీడియా అనేక దేశాల్లో జరిగిన పరిణామాలను కూడా వక్రీకరించింది.ఇరాన్‌లో మహమ్మద్‌ మొసాద్‌ ప్రభుత్వం 1953లో బ్రిటీష్‌, అమెరికన్‌ చమురు కంపెనీలను జాతీయం చేసినపుడు సిఐఏ తప్పుడు ్పచారాలు చేసింది. 1973లో చిలీ అధ్యక్షుడు, సోషలిస్టు నేత సాల్వడోర్‌ అలెండీపై జరిగిన కుట్ర, తిరుగుబాటు, హత్యను ప్రజాగ్రహంగా వక్రీకరించి రాశారు.2019లో బొలీవియాలో ఎన్నికైన వామపక్ష నేత ఇవో మొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర జరిగింది.దాన్ని సమర్ధించేందుకు ఎన్నికల్లో మొరేల్స్‌ రిగ్గింగుకు పాల్పడినట్లు పత్రికలు రాశాయి. ఇలాంటి ఎన్నో ఉదంతాలు తమను తప్పుదారి పట్టించిన కారణంగానే అమెరికన్లు మీడియాను విశ్వసించటం లేదన్నది వాస్తవం. అంతే కాదు అమెరికన్లు తమ ప్రభుత్వాన్ని కూడా నమ్మటం లేదని జూన్‌ నెల గాలప్‌ పోల్‌ పేర్కొన్నది. ఎల్లవేళలా ప్రభుత్వం చేస్తున్నది సరైనదే అని నమ్ముతున్నవారు కేవలం రెండుశాతమే,ఎక్కువసార్లు మంచే చేస్తున్నదని నమ్మేవారు 19శాతమే ఉన్నారు. పార్లమెంటు మీద ఏడు,న్యాయవ్యవస్థపై 14, అధ్యక్ష వ్యవస్థపై 23, సుప్రీం కోర్టుపై 25,కార్పొరేట్లపై 14, పెద్ద టెక్నాలజీ కంపెనీలపై 26, పోలీసులపై 45శాతాల చొప్పున విశ్వాసం వెల్లడించినట్లు మరొక గాలప్‌ పోల్‌ పేర్కొన్నది.


ప్రపంచం మొత్తం మీద మీడియా విశ్వసనీయ తగ్గుతున్నది.ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన ఎడెల్‌మాన్‌ బారోమీటర్‌ విశ్లేషణ ప్రకారం 46శాతం మంది జర్నలిస్టులను నమ్మటం లేదని చెప్పారు.2021 నవంబరు నెలలో 28 దేశాల్లో 36వేల మందితో జరిపిన సంభాషణల్లో ఇది వెల్లడైంది.సమాజాలు చీలిపోవటానికి ఒక వనరుగా మీడియా ఉందని 46శాతం మంది చెప్పారు. కుహనా వార్తలు రాజకీయ ఆయుధాలుగా మారుతున్నట్లు 75శాతం మంది చెప్పారు. ఫేస్‌బుక్‌లో ఆరు రెట్లు అదనంగా కుహనా వార్తలు పుడుతున్నాయి.


మన దేశ మీడియాలో కొన్ని ఛానళ్లు సంచలన వార్తలకు పేరు మోసినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ డిజిటల్‌ న్యూస్‌ రిపోర్టు 2022 పేర్కొన్నది. దీని కోసం 2,035 మంది ఆంగ్ల పాఠకులను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అందువలన ఇది మొత్తం అభిప్రాయంగా పరిగణించకూడదు. వారి అభిప్రాయాల ప్రకారం వార్తలను మొత్తం మీద నమ్ముతున్నట్లు చెప్పిన వారు మన దేశంలో 38శాతం మంది ఉన్నారు. సర్వే చేసిన 46 దేశాల్లో మనది 20వ స్థానంలో ఉంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వార్తలను 75శాతం మంది, రేడియో 72, ది ప్రింట్‌ 61, రిపబ్లిక్‌ టీవి 57, ది వైర్‌ను 57శాతం మంది నమ్ముతున్నారు. వార్తల కోసం తాము ఆన్‌లైన్‌ మీడియా మీద ఆధారపడుతున్నట్లు 84శాతం మంది చెప్పగా ప్రింట్‌ మీడియా మీద 49, టీవీల మీద 59శాతం మంది ఆధారపడుతున్నట్లు వెల్లడించారు.టీవీ ఛానల్స్‌లో బహుళ ఆదరణ పొందినవిగా ఎన్‌డిటివీ, ఇండియా టుడే, బిబిసి ఉండగా పత్రికల్లో టైమ్స్‌ఆఫ్‌ ఇండియా, హిందూస్తాన్‌ టైమ్స్‌, హిందూ ఉన్నాయి. వార్తల కోసం యుట్యూబ్‌ చూస్తామని 53శాతం, వాట్సాప్‌ చూస్తామని 51శాతం చెప్పారు. క్లుప్తంగా కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.కేవలం 36శాతం మందే మీడియా మీద రాజకీయ ప్రభావం లేదని, 35శాతం మంది కార్పొరేట్ల ప్రభావం లేదని భావిస్తున్నారు. అమెరికాలో 30శాతం మంది వార్తల కోసం యాప్స్‌ మీద ఆధారపడుతుండగా భారత్‌లో 82శాతం ఉన్నారు.ఫేస్‌బుక్‌ను నమ్మేవారు 29-65శాతాలుగా ఉన్నారు. వర్గాల వారీ చీలికలు తెస్తున్న వాటిలో రిపబ్లిక్‌ టీవీ, జి న్యూస్‌ ముందున్నాయి. రిపబ్లిక్‌ టీవిని బిజెపి మద్దతుదార్లు 85శాతం మంది ఇతరులు 50శాతం నమ్ముతున్నారు, జి న్యూస్‌ను 85శాతం బిజెపి, 63శాతం ఇతరులు నమ్ముతున్నారు. మొత్తం మీద ఎన్‌డిటివీని 75శాతం మంది బిజెపి మద్దతుదార్లు, ఇతరులు 81శాతం మంది నమ్ముతున్నారు.


మనుషుల మధ్య సంబంధాలను కలిపేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా దోహదం చేసిందో అదే మానవులు అలవోకగా అబద్దాలు ఆడేందుకు,ప్రచారం, మోసం చేసేందుకు సైతం అవకాశం ఇచ్చిందన్నది కాదనలేని సత్యం. రాను రాను పత్రికలు, టీవీ ఛానళ్లతో కూడిన మీడియా మీద రానురాను జనాల్లో విశ్వాసం తగ్గుతున్నది. ప్రత్నామ్నాయంగా ముందుకు వచ్చిన సామాజిక మాధ్యమం కూడా ఇప్పుడు అదే దారిలో ఉంది. సంప్రదాయ మీడియా స్పందించినా లేకున్నా ప్రశ్నించేందుకు ఒక చిరునామా ఉంటుంది. సామాజిక మాధ్యమానికి అది కనిపించదు, పట్టుకోవటం సామాన్యులకు చాలా కష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జెఎన్‌యు ఘటనల్లో మీడియా విశ్వసనీయతను దెబ్బ తీసిన కొన్ని సంస్ధలు

08 Tuesday Mar 2016

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, Bjp nationalism, credibility, JNU, JNU ROW, journalists, Media, media credibility, nationalism

జెఎన్‌యు వుదంతంపై కొన్ని ఛానల్స్‌,పత్రికలు, జర్నలిస్టులు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు జాతీయ స్ధాయిలో మీడియా నిజాయితీని, తీరు తెన్నులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్ధితి రావటానికి కారకులెవరు ? పెట్టుబడులు పెట్టే యజమానులా లేక వారి కింద పని చేసే జర్నలిస్టులా ?

ఎం కోటేశ్వరరావు

    చదువరులను చంపటానికి రచయిత తన పెన్నును గన్నుగా వుపయోగిస్తాడని ఒక పెద్దమనిషి చెప్పాడు.టీవీలు తలుచుకుంటే విద్యార్ధుల జీవితాలను అంతం చేయటానికి, విద్యా సంస్ధల పరువు ప్రతిష్టలను గంగలో కలపటానికి నకిలీ వీడియోలను వీక్షకుల ముందుంచుతాయని తాజాగా ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు) వుదంతాన్ని చూసిన తరువాత ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.కొన్ని టీవీ ఛానల్స్‌ ప్రసారం చేసిన రెండు వీడియోలు నకిలీవని తిమ్మిని బమ్మిని చేశారని హైదరాబాద్‌లోని ట్రూత్‌ లాబ్‌ వెల్లడించింది. దీంతో మొత్తం మీడియా పరువు కాలుష్య గంగలో కలిసింది . ఏప్రిల్‌ ఒకటవ తేదీన చదువరులను, వీక్షకులను ఫూల్స్‌ చేయటానికి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలు చేసేవిన్యాసాలలో అలాంటి ట్రిక్కులను ప్రయోగిస్తాయి, చివరిలో ఏప్రిల్‌ ఫూల్స్‌ డే సందర్భం అని చెబుతాయి. కానీ ఇప్పుడు అటువంటి దానికి అవకాశం లేకుండా పోయింది. వాటిని చూసి ఎవరైనా దాడులకు దిగినా ఆశ్చర్యం లేదు. అంతగా మీడియా విశ్వసనీయత కోల్పోయిందంటే అతిశయోక్తి కాదు.

   మీడియా నిష్పాక్షికంగా వుండదని తెలుగు నేలలో జనానికి 1940,50 దశకాలలోనే తెలుసు.కమ్యూ నిస్టులకు వ్యతిరేకంగా, మహత్తర తెలంగాణా సాయుధ పోరాటాన్ని దెబ్బతీసేందుకు కట్టు కధలకు మీడియా పుట్టినిల్లని అవగతమైంది.తరువాత నాలుగు దశాబ్దాల క్రితం అత్యవసర పరిస్ధితి సమయంలో కొన్ని పత్రికలు నిరంకుశత్వాన్ని, నియంతలను కూడా ఎలా బరపరుస్తాయో దేశమంతా చూసింది. బాబరీ మసీదు విధ్వంసం సందర్భంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు కూడా మీడియా వెనుకాడదని ఆ సమయంలో మరి కొన్ని పత్రికలు, టీవీలు రుజువు చేశాయి. కొన్ని రాజకీయ పార్టీలు టీవీ, పత్రికలను స్వయంగా ఏర్పాటు చేసుకుంటే, మరికొన్ని పార్టీలు స్వతంత్రముసుగులో పనే చేసే వాటిని తమ బాకాలుగా మలుచుకోవటమూ తెలిసిందే. ఇప్పుడు జెఎన్‌యు వుదంతంపై కొన్ని ఛానల్స్‌,పత్రికలు, జర్నలిస్టులు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు జాతీయ స్ధాయిలో మీడియా నిజాయితీని, తీరు తెన్నులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్ధితి రావటానికి కారకులెవరు ? పెట్టుబడులు పెట్టే యజమానులా లేక వారి కింద పని చేసే జర్నలిస్టులా ?

     ప్రతి కీలక సమయంలోనూ మీడియా రెండు తరగతులని వెల్లడి అవుతూనే వుంది. స్వాతంత్య్రానికి ముందు ప్రధాన స్రవంతి మీడియా రెండు రకాలు. ఒకటి స్వాతంత్య్రాన్ని కోరుకున్న దేశ భక్త తరగతి, రెండవది బ్రిటీష్‌ వారి పాలన కొనసాగాలని పాటుపడిన రాణీగారి ప్రతిపక్ష తరగతి. ఇప్పుడు కూడా మీడియా ఒకటిగా లేదు. ప్రజా వుద్యమాలు, ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిచ్చే ప్రచార మీడియా . మిగతా వాటిలో ఎన్నో వుప తరగతులున్నాయి. అన్నింటినీ ఒకే గాటన కట్టలేము. కొన్ని పెట్టుబడులతో నడిచేవే అయినప్పటికీ లౌకిక, వుదారవాద విలువలకు కట్టుబడుతున్నాయి. మరికొన్ని కుల, మతోన్మాద శక్తులకు , తిరోగమన భావాలకు పెద్ద పీట వేస్తున్నాయి. వీటి గురించి లోతైన విశ్లేషణ జరగాల్సి వుంది. ప్రస్తుతం జెఎన్‌యు సంబంధిత వ్యవహారాల సందర్బంగా మీడియా ఎలా వ్యవహరించింది అన్నదానికే పరిమితం అవుదాము.

   జెఎన్‌యు పరిణామాలను చూసిన అనేక మంది భారత్‌లో ఏదో అవాంఛనీయ పరిణామం జరగబోతోందని భయపడుతున్నారు, హెచ్చరిస్తున్నారు. వర్షం రాబోయే ముందు మట్టికి ప్రత్యేక వాసన వస్తుంది. అది మధురంగా వుంటుంది. కానీ జెఎన్‌యు పరిణామాల సందర్భంగా కొన్ని మీడియా సంస్ధలు వ్యవహరించిన తీరు అశుభాన్ని సూచించింది. ఇక్కడ శుభం-అశుభాల గురించి విశ్వాసం సమస్య కాదు. ఒక ప్రమాదకర, ఏకపక్ష భావజాలానికి అనుగుణంగా ఒక వర్గం మీడియా తన వంతు నృత్యం చేయటం నిజంగా భారత ప్రజాస్వామ్యానికి ప్రమాద సూచిక అని చాలా మంది భావిస్తున్నారు. ఇటువంటి ధోరణులు గతంలో లేవా అంటే బాబరీ మసీదు విధ్వంసం, గుజరాత్‌ మారణహోమం, అనేక ప్రాంతాలలో జరిగిన మత దాడులు, ఘర్షణల సందర్భంగా కూడా వెల్లడైంది. దానితో పోల్చి చూసినపుడు ఇది మరింత ప్రమాదకరం.బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులను ఎదిరించేందుకు మన దేశంలో ముందుకు వచ్చిన జాతీయ వాదానికి, ప్రపంచ ఆక్రమణకు హిట్లర్‌ ఎంచుకున్న జాతీయ వాదానికి తేడా వుంది. దానిని గుర్తించితే ఇప్పుడు దేశంలో ముందుకు తీసుకు వస్తున్న జాతీయ వాదం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. హిట్లర్‌ జాతీయ వాదంలోని కొన్ని ప్రమాదకర లక్షణాలు కాషాయ మార్కు జాతీయ వాదంలో వున్నాయి. పాకిస్ధాన్‌ వ్యతిరేకతే అసలైన దేశభక్తిగా , కొన్ని సమస్యలపై తమ వైఖరితో ఏకీభవించని వారందరినీ దేశద్రోహులుగా చిత్రించి, వారిపై రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తోంది. హిట్లర్‌ నాడు యూదు వ్యతిరేకతను రెచ్చగొడితే నేడు ముస్లిం వ్యతిరేకతను ముందుకు తెస్తున్నారన్నది ఒక అభిప్రాయం. నాడు అనేక మంది హిట్లర్‌ ప్రచారానికి ప్రభావితులై రాగల ప్రమాదాన్ని చూసేందుకు నిరాకరించి ఒక చివరకు వెళితే అదే జర్మనీలో నేడు హిట్లర్‌ పేరును పలకటానికి కూడా జనం ఇచ్చగించకుండా వుండం, జాతీయ వాదం అంటేనే ఆమడ దూరం పోవటం చూస్తుంటే చరిత్ర పునరావృతం అవుతుందా అనిపిస్తోంది. అయితే జర్మన్‌ జాతీయ వాదం ప్రపంచాన్ని ఎంతగా నాశనం చేసిందో, మన దేశంలో ముందుకు తెస్తున్న కుహనా జాతీయ వాదం అదే స్దాయిలో నష్టాలను కలిగించవచ్చు.

      ఈ పూర్వరంగంలో చరిత్ర పాఠాలు తీసుకోవాల్సిన బాధ్యత మన జర్నలిస్టుల మీద లేదా ? వాస్తవాలకు విరుద్దంగా యాజమాన్యాల మనసెరిగి వార్తలనుమలచటం జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారందరికీ కొట్టిన పిండే.అది నైతికమా కాదా అన్న చర్చ వచ్చినపుడు వెల్లడౌతున్న ధోరణులేమిటి? మనకు వేతనాలిచ్చి పనిచేయించుకుంటున్నపుడు యజమానులు చెప్పినట్లు నడుచుకోకపోతే వుద్యోగాలు వుండవు కదా అన్నది ఒకటి. యజమానుల ఆదేశాలు ఎక్కడా రాతపూర్వకంగా లేదా సాక్ష్యాలకు ఆధారాలు లేకుండా వుంటాయి కనుక, వుద్యోగం కావాలంటే వారు చెప్పిన తప్పుడు పనులు చేయటం సర్వసాధారణంగా జరుగుతోంది. ప్రతి పదికిలోల బియ్యానికి ఒక కిలో మట్టి పెడ్డలు కలపమని మిల్లు యజమాని ఒకసారే చెపుతాడు. ఎప్పుడైనా పట్టుపడ్డారనుకోండి, కార్మికులే సరిగా మట్టి పెడ్డలను తొలగించలేదని జనం ముందు కేకలు వేస్తాడు, కేసులు వస్తే ఒకరో ఇద్దరో చిరుద్యోగులను బలి చేస్తాడు. అలాగే మీడియా సంస్ధలు కూడా తయారయ్యాయంటే అతిశయోక్తి కాదు. అందువలన వార్త పవిత్రమైనది కాదు. తెనాలిరామకృష్ణ సినిమాలో నియోగి అంటే ఎలా కావాలంటే అలా వినియోగ పడేవాడు అని భాష్యం చెప్పినట్లుగా ఇప్పుడు వార్త వున్నది. కనుక ఎవరైనా మేము పక్షపాత రహితంగా వార్తలు ఇస్తున్నాము అని చెప్పుకుంటున్నారంటే అనుమానించాల్సిందే. జాగ్రత్తగా పరిశీలించాల్సిందే. ఇటీవల మన కళ్ల ముందే జరిగిన రిలయన్స్‌ కంపెనీ గ్యాస్‌ దొంగతనానికి పాల్పడటం గురించిన వార్త అందరికీ ప్రాముఖ్యత కలిగినదే, కానీ కొన్ని పత్రికలు, టీవీలు ప్రముఖంగా ఇస్తే మరికొన్ని ఆ ఏదో జరిగిందటలే అన్నట్లు ఇచ్చాయి. ఏ కోర్టులైనా జోక్యం చేసుకొని సిగిరెట్‌ పాకెట్లు, మద్యం సీసాలపై చట్టబద్దమైన హెచ్చరికల మాదిరి మా వార్తలు మా యజమానుల ఆలోచనలకు లోబడే వుంటాయి అని ఆదేశిస్తే ప్రతివార్తకూ కాకపోయినా ప్రతి పేజీలో పాఠకులకు కనపడేట్లు, టీవీలలో అయితే కింద స్క్రోలింగ్‌ వేసుకోవాలి. అలాంటి హెచ్చరికలు వున్నా మద్యం, సిగిరెట్లు తాగే వారు లేరా అంటే ఆ విషయం ఆదేశించిన వారికీ తెలుసు.

    ఇప్పుడు అలా చేయటం లేదు అంతా నిఖార్సయిన పక్కా నిజమైన వార్తల పేరుతో నడుస్తోంది. అవి వివాదాస్పదం అయినపుడు లేదా కొందరికి కోపకారణమైనపుడు బలౌతున్నది జర్నలిస్టులు తప్ప యజమానులు కాదు. వేతనాలు తీసుకొని పని చేస్తున్నంతమాత్రాన తప్పుడు పనులు చేయాలని లేదు.మనం నాగరికులం, దేశ పౌరులం, మనకూ బాధ్యతలు కూడా వున్నాయని గుర్తించాలా లేదా ? జెఎన్‌యు వుదంతంలో ‘ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా వ్యవహరిస్తూ అనేక మంది విద్యార్ధుల కలలు,ఆశలూ, ఆకాంక్షలూ జీవితాలను నాశనం చేసేందుకు పూనుకున్న వైఖరికి నిరసనగా తన వుద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు జీ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ విశ్వదీపక్‌ తన లేఖలో పేర్కొన్నాడు. తనకు మరొక సంస్ధ వుద్యోగం ఇవ్వదని కూడా చెప్పాడు. వర్తమాన మీడియా పరిస్ధితులపై ఇంతటి తీవ్ర విమర్శ, వుద్యోగ భద్రత, స్వతంత్ర అభిప్రాయాలను సహించలేని యాజమాన్యాల ధోరణిపై విమర్శ, నిరసన ఇంతకు ముందు వెల్లడి కాలేదేమో. టీవీ ఛానల్స్‌ జబ్బు పడ్డాయని ఎన్‌డిటీవీ ఎడిటర్‌ రవీష్‌ కుమార్‌ తన నిరసన లేదా ఆవేదన వ్యక్తం చేసేందుకు తన కార్యక్రమాన్ని మొత్తంగా చీకట్లోనే నిర్వహించి మీడియాలో జీవితాలను నాశనం చేసే వారే కాదూ కాపాడాలని కోరుకొనే వారూ కూడా వున్నారని, అందుకు సహకరించే యాజ మాన్యాలు కూడా లేకపోలేదని లోకానికి తెలియ చెప్పారని అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. నలభై సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని విధించటానికి నిరసనగా కొన్ని పత్రికలు తొలి రోజులలో సంపాదకీయాల స్ధానాన్ని ఖాళీగా వుంచి పాఠకులకు అందించాయి. ఇప్పుడు జెఎన్‌యు విద్యార్దుల వ్యవహారంలో పోలీసులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నాటి పరిస్థితులను తలపిస్తున్నదని గానీ లేదా మీడియాలో కొందరి హానికరమైన పోకడలను ఎత్తి చూపేందుకు గానీ ఎన్‌డిటివీ ఇలా చేసి వుండవచ్చని వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ఏమైనా ఇది హర్షణీయమే. ఈ చర్యపై కూడా విరుచుకుపడుతున్నవారు లేకపోలేదు. కొన్ని వుదంతాలను పేర్కొని అప్పుడు అలా ఎందుకు చేయలేదు ఇలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చేసినది సరైనదే అని ముందు వారు అంగీకరిస్తే తరువాత గతంలో ఎందుకు చేయలేదు అని అడగటానికి వారికి నైతికంగా హక్కు వుంది. కానీ వారి తీరు అలా లేదు.అయినా ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం కావాలా లేదా ? చర్చ జరగనివ్వండి.

     జెఎన్‌యుపై దాడి చేయటానికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన అక్కడ జరిగిన ఘటనలతో కేంద్ర ప్రభుత్వానికి ఒక సాకును సమకూర్చేందుకు తిమ్మిని బమ్మిని చేసి వీడియోలను తయారు చేశారు.వాటిలోని అంశాలు కొన్ని ఛానల్స్‌లో ప్రసారమయ్యాయి. అసలు వాటిని ఎవరు తయారు చేశారు, ఏ ప్రయోజనాల కోసం తయారు చేశారు అన్నది బయటకురావాల్సి వుంది. పోలీసులు జీ న్యూస్‌లో ప్రసారమైనదానిని బట్టి కేసు నమోదు చేశారు, అలాంటి వీడియో గురించి ఆ న్యూస్‌ అవుట్‌పుట్‌ ఎడిటర్‌ నిరసన తెలుపుతూ రాజీనామా చేయటాన్ని బట్టి జీ న్యూస్‌ పాత్ర వుందా అన్నది అనుమానం. తాను దోషిని కాదని, దానిలో తన పాత్ర లేదని అది నిరూపించుకోవాల్సి వుంది. ఢిల్లీ ప్రభుత్వం నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేయనున్నదని వార్తలు వచ్చాయి. నిజంగా చేస్తుందా, చేస్తే ఏం జరుగుతుంది అన్నది చూడాల్సిందే.

    ఆ వీడియోలను ప్రసారం చేయటం ఒక ఎత్తయితే మీడియా యాంకర్లు జెఎన్‌యు విద్యార్ధులను దేశద్రోహులుగా సంబోధించటం, అలాంటి వారికి ఆ సంస్ధ ఆలవాలంగా వుందని చిత్రించటం, వారిపైకి జనాన్ని వుసిగొల్పేలా వ్యవహరించటం తీవ్రమైన అంశం. దేశ ద్రోహం, లేదా దేశ వ్యతిరేకి అని కేసులు పెట్టే పోలీసులే నిందితుడు అని పేర్కొంటారు తప్ప నిర్ధారణగా రాయరు. అలాంటిది మీడియాలో పనిచేసేవారు అలా ఎలా చెబుతారు.ఎవరి మెప్పుకోసం ఈ పనిచేశారు అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వుంది. టైమ్స్‌ నౌ ఛానల్‌లో దానిని ప్రసారం చేశారు.దాని గురించి సీనియర్‌ జర్నలిస్టు సిద్ధార్ద వరదరాజన్‌ తన వ్యాసంలో ప్రస్తావించారు. తామసలు ఆ వీడియోను ప్రసారం చేయలేదని తమపై అభాండాలు వేసిందుకు క్షమాణలు చెప్పాలని ఆ ఛానల్‌ కోరింది.తొలుత బుకాయించిన సదరు ఛానల్‌ తరువాత చూసుకోకుండా ప్రసారం చేశామని చెప్పుకుంది. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నేతను ఆ వీడియోను ప్రదర్శించమని టైమ్స్‌ నౌ యాంకర్‌ గోస్వామి పదే పదే కోరటం, దానిని అధికారిక వీడియోగానే పరిగణించినట్లు చర్చను నడపటాన్ని చూస్తే జర్నలిస్టులు నిష్పక్షపాతంగా , విమర్శనాత్మకంగా వున్నట్లు ఎవరైనా ఎలా అనుకుంటారు? కొన్ని ఛానల్స్‌ అసాధారణరీతిలో జెఎన్‌యు వుదంతాన్ని పదేపదే ప్రసారం చేయటం యాదృచ్ఛికమా, ఒకపధకం ప్రకారం జరిగిందా అన్న అనుమానం ఎవరికైనా కలిగితే దానికి కారకులు ఎవరు ? రాజకీయ నేతలు లేదా సాంస్కృతిక సంస్ధగా చెప్పుకుంటూ రాజకీయాలు నడుపుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధల వారు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు మీడియా వారికి తేడా లేకుండా పోయిందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. యావన్మంది దీని గురించి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీసు,జడ్జి , తలారి పాత్రలను మీడియా పోషించుతోందన్న అభిప్రాయం మీడియాలో పనిచేస్తున్నవారికి ప్రయోజనకరమా, హాని కరమా ?

    తాము ప్రసారం చేసిన వీడియో సాధికారమైనదా కాదా అన్నది సరి చూసుకోలేదని టైమ్స్‌ నౌ యాంకర్‌ ఆర్నాబ్‌ గోస్వామి తప్పిదాన్ని తప్పించుకొనేందుకు చెప్పారని అనేక మంది భావిస్తున్నారు.కొత్త గనుక అనుభవం లేక చేశామంటే అర్ధం చేసుకోవచ్చు, కానీ ఎలక్ట్రానిక్‌ మీడియా మన దగ్గర కొత్తగా వచ్చింది కాదు. గోస్వామి చిన్నవాడూ కాదు, అనుభవం లేని యాంకర్‌ కాదు. దీని గురించి బిబిసిలో నకిలీ వీడియోలను ఏరివేసే విభాగంలో పనిచేస్తున్న మార్క్‌ ఫ్రాంకెనెల్‌ ఏమంటారంటే ఏది నకిలీ ఏది పక్కా అని తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఇలాంటి సమస్యలు ప్రతి చోటా వున్నందున ప్రతి ఛానల్‌ ఒక పద్దతిని పాటించి తనిఖీ చేసిన తరువాతే వాటిని ప్రసారం చేస్తుంది. పక్కా వీడియోలో ధంబ్‌నెయిల్‌ చిత్రాలు వుంటాయి, నకిలీ వీడియోలలో వాటిని తుడిపి వేస్తారు. దాన్ని బట్టి అది తిమ్మిని బమ్మిని చేసిందా కాదా అని తేలిపోతుంది. బడా మీడియా సంస్ధలు తమ స్వంత సిబ్బంది రూపొందించే వీడియోలతో పాటు వార్తా సంస్ధలు, జర్నలిస్టులు కాని పౌరులు పంపే వీడియోలను కూడా స్వీకరించి వుపయోగిస్తాయి. అందువలన అవి నకిలీవా, కాదా అనేది ప్రతిదాన్నీ తనిఖీ చేయాలి.ముఖ్యంగా బయటి నుంచి తీసుకున్న వాటి విషయంలో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని ఫ్రాంక్‌నెల్‌ చెప్పారు. మరి దీనిని మన మీడియా సంస్ధలు ఎందుకు పాటించటం లేదు.లేదా కాకపోతే ఖండిస్తారు, మనకు మరో వార్త వస్తుంది, సంచలనంతో రేటింగ్‌ పెరుగుతుంది అని చూసీ చూడనట్లు వూరుకుంటున్నాయా ?అదే అయితే మీడియాకు జవాబుదారీ తనం లేదా అన్న ప్రశ్న వెంటనే తలెత్తుతుంది.

   అనేక దేశాలలో దీని గురించి తీవ్ర చర్చ జరుగుతోంది.అయితే ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అన్నట్లుగా ఎవరికి వారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అయితే మొత్తంగా చూసినపుడు పాలక వర్గ ప్రయోజనాలు కాపాడేందుకే అంతిమంగా పెట్టుబడితో ముడిపడిన మీడియా పని చేస్తుందన్నది మనకు కనిపిస్తుంది. సామాన్య ప్రజా ప్రయోజనాలు, ఆ సంస్ధలలో పనిచేసే సిబ్బంది ప్రయోజనాలకంటే యజమానులే ఆ సంస్ధలకు ముఖ్యం. వారి ప్రయోజనాలకు భంగం కలగనంత వరకే స్వేచ్ఛను అనుమతిస్తారు.అన్నీ అలాంటి సంస్ధలేనా అంటే ఎప్పుడూ కొన్ని మినహాయింపులు వుంటాయి.అవెప్పుడూ మైనారిటీగా, పరిమిత సంఖ్యలో వుంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d