• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: MSP

రైతులపై మోడీ సర్కార్‌ యుద్ధం : పాక్‌, చైనా సరిహద్దుల్లో కూడా ఇలాంటి ఏర్పాట్లు లేవేమో !

17 Saturday Feb 2024

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

#Farmers matter, #i stand with farmers, 2024 Farmers Protest, Anti Farmers, BJP, Delhi farmers agitation, Delhi Police, MSP, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


సరిహద్దు భద్రతా దళాల నుంచి 30వేల బాష్పవాయు గోళాలను రప్పించారు.
వాటిని ప్రయోగించేందుకు డ్రోన్లను సన్నద్దం చేశారు.
ఒళ్లు మంటలు పుట్టేందుకు రసాయనాలు కలిపిన నీటిని చిమ్మే ఫిరంగుల దుమ్ముదులిపారు.
చెవులు చిల్లులు పడే శబ్దాలు చేసి వినికిడి శక్తిని పోగొట్టే సోనిక్‌ ఆయుధాలను సిద్దం చేశారు.
ఎవరైనా గుర్రాల మీద వస్తే అవి జారి పడే విధంగా గ్రీజు వంటి వాటిని వెదజల్లేందుకు డ్రమ్ములతో సిద్దంగా ఉన్నారు.
రోడ్ల మీద పెద్ద గోతులు తవ్వారు. ఎక్కడబడితే అక్కడ ఇనుప మేకులు కొట్టారు.
ముళ్ల కంచెలు, వాటిని దాటుకొని వస్తే నిరోధించటానికి పెద్ద కంటెయినర్లలో మట్టి, రాళ్లు, ఇటుకలతో నింపారు.
సిమెంటు దిమ్మెల వరుసలు ఏర్పాటు చేశారు. రోడ్ల పక్కనే నిర్బంధ శిబిరాలను తయారు చేశారు.
ఇవన్నీ ఎందుకనుకుంటున్నారు ?
సరిహద్దుల్లో పాకిస్థాన్‌ లేదా చైనా, మరొక దేశం దాడి చేస్తుందనో వాటిని ఎదుర్కొందామనో కాదు.
వివిధ రాష్ట్రాల నుంచి రాజధాని ఢిల్లీకి వచ్చే రోడ్ల మీద ఈ ఏర్పాట్లు ? ఎందుకనుకుంటున్నారు ?


తమ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను అడిగేందుకు వస్తున్న అన్నదాతలను అడ్డుకొనేందుకు !
ఇన్ని ఏర్పాట్లు చేసిన పోలీసుల బాస్‌ ఏం చెప్పారో తెలుసా ? ఒక వేళ వీటన్నింటినీ దాటుకొని రైతులు గనుక వస్తే మీరేమీ వెనుకా ముందు చూడనవసరం లేదు, ఆత్మరక్షణ గురించి ఆలోచించవద్దు అన్నారు. దీని అర్ధం వేరే చెప్పాలా ? ప్రస్తుతం అనేక ఐరోపా దేశాల్లో వేలాది మంది రైతులు రాజధానులు, ఇతర ప్రధాన పట్టణాలకు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ వాహనాల మీద ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పోలీసులు కాపలాకాసేందుకు ఉన్నారు తప్ప అడ్డుకున్నది గానీ చేయి చేసుకున్న ఉదంతంగానీ ఒక్కటంటే ఒక్కచోట కూడా జరగలేదు. కానీ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని చెప్పుకుంటున్న చోట రైతులను శత్రువులుగా చూస్తున్న అపర ప్రజాస్వామిక పాలకుల తీరిది.


ఇంతకూ రైతులు చేసిన పాపం ఏమిటి ?
2011లోనే నరేంద్రమోడీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీ చేసిన సిఫార్సులో ఒకటైన కనీస మద్దతుధరలకు చట్టబద్దత కల్పించమని కోరటం. క్షమాపణలు చెప్పి మరీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకంటూ కనీస మద్దతు ధరలకు చట్టబద్దతతో పాటు ఇతర సమస్యలను పరిశీలించేందుకు 2022 జూలైలో నరేంద్రమోడీ సర్కార్‌ ఏర్పాటు చేసిన కమిటీ ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నది, ఎప్పుడు నివేదిక ఇస్తారు, స్వామినాధన్‌ కమిటీ చేసిస సిఫార్సులతో సహా ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారు అని నిలదీయటమే అన్నదాతల అపరాధం. ఇప్పటికే పంజాబ్‌-హర్యానా సరిహద్దులో రైతుల వీపులు పగలగొట్టారు, జర్నలిస్టులతో సహా అనేక మంది గాయపడ్డారు. గురువారం నాడు చర్చల ప్రహసనం చోటు చేసుకుంది. ఆదివారం నాడు మరోసారి మాట్లాడతామని చెప్పారు. ఈలోగా కుట్ర సిద్దాంతాలు. వాట్సాప్‌ యూనివర్సిటీలో నరేంద్రమోడీ సర్కార్‌ను కూలదోసేందుకు అంటూ ఊదరగొట్టటం ప్రారంభించారు.హర్యానాలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ నిలిపివేశారు. ఢిల్లీలో 144వ సెక్షన్‌ విధించారు. సభలు, ప్రదర్శనలకు అనుమతి లేదు.


2020-21లో సాగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం తరువాత 2022 జూలై 18న కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పి ఇతర అంశాల గురించి పరిశీలనకు ఒక కమిటీని వేసింది. ఇప్పటి వరకు అదేమి చేస్తున్నదో తెలియటం లేదు గనుక మరోసారి రైతులు ఢిల్లీ చలో పిలుపు ఇచ్చారు. సాధారణంగా సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని అనేక మంది అనుకున్నారు. అదేమిటో తెలియదు గానీ మరోసారి రైతులు ఆందోళన చేస్తే అణచి వేసేందుకు పోలీసులకు కొత్త పద్దతులను నేర్పించారు.దేశ రాజధాని వద్ద చేసిన ఏర్పాట్లు బహుశా చైనా సరిహద్దులో కూడా చేసి ఉండరేమో అని కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ వ్యాఖ్యానించారు. ” ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అంశం కూడా,దీనికి పరిష్కారం కనుగొనాలంటే వ్యవధి అవసరం. ” మరోసారి ప్రారంభమైన రైతు ఉద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్ల మీద కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా ఫిబ్రవరి పదమూడున చెప్పిన మాట. గురువారం రాత్రి రైతు ప్రతినిధులతో జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాలు లేకుండా ముగిశాయి. ఆదివారం సాయంత్రం మరోసారి చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. స్వామినాధన్‌కు భారత రత్న అవార్డు ఇచ్చిన పెద్దలు ఆయన చేసిన సిఫార్సుల అమలు మాత్రం కుదరదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంఎస్‌పి కమిటీలో సభ్యులుగా ఎలాంటి వారిని నియమించిందో తెలిస్తే జరిగేదేమిటో ఊహించుకోవచ్చు.


రైతుల నిరసన రాజకీయపరమైదని, హింసాకాండ వ్యాప్తి చేస్తారేమో అనే ఆందోళన కలుగుతోందని, అందుకే తాము భాగస్వాములం కావటం లేదని ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన ఎంఎస్‌పి కమిటీ సభ్యుడు ప్రమోద్‌ చౌదరి ఆరోపించారు.ఈ పెద్ద మనిషి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన భారతీయ కిసాన్‌ సంఫ్‌ు నేత గనుక ఇంతకంటే ఏం మాట్లాడతారు ! మరో కమిటీ సభ్యుడి పేరు వినోద్‌ ఆనంద్‌. ఆందోళన చేస్తున్న వారిని గూండా రైతులని వర్ణించిన ఘనుడు.వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ (ప్రపంచ సహకార ఆర్థికవేదిక ) కార్యనిర్వాహక అధ్యక్షుడు. అసలు ఈ సంస్థ గురించి రైతులు ఎప్పుడైనా విన్నారా ? ” దేశ ఆర్థిక పురోగతికి, రైతుల సంక్షేమానికి కనీస మద్దతుధరలకు చట్టబద్దత కల్పించటమే ఏకైక పరిష్కారం అయితే ఆ పని చేసేందుకు చేయాల్సిందంతా చేస్తాము. ఎంఎస్‌పికి గతంలో ఎప్పుడు చట్టబద్దత ఉంది. దాని గురించి ప్రధాని ఎన్నడూ చెప్పలేదు.వీరంతా గూండా రైతులు, రాజకీయంగా ఉత్తేజం పొందిన కొద్ది మంది…ఒక రాష్ట్రానికి చెందిన వారు తమ రాజకీయ ప్రత్యర్ధుల మీదకు రైతులను ఈ విధంగా ఉపయోగిస్తున్నారు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత గురించి ఎన్నడూ చెప్పలేదు. 2075వరకు పనికి వచ్చే విధంగా ఉండే వ్యవసాయ విధానాలను మనం రూపొందించుకోవాల్సి ఉంది, తద్వారా ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. కనీస మద్దతు ధర ఒక సంక్లిష్టమైన అంశం.వారు(రైతులు) ముందుకు వచ్చి మాతో కూర్చొని చర్చించాలి.వారి ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెప్పలేకపోతే కమిటీ నుంచి రాజీనామా చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇదంతా ఒక నాటకం, పక్కదారి పట్టించేందుకు, దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు చేస్తున్న వ్యవహారం ” అని వినోద్‌ ఆనంద్‌ అన్నట్లు ఎఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొన్నది.


ఉత్తరాది రాష్ట్రాల శ్వాస నిలిపివేసేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారని, తమ రాష్ట్రంలో భయ వాతావరణం ఏర్పడిందని హర్యానా ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొన్నది. పరిష్కారం తేలేవరకు ఆందోళన కానసాగుతుందని రైతు సంఘాలు వెల్లడించాయి. నరేంద్రమోడీ సర్కార్‌ను దించేందుకే రైతులు మరోసారి వీధుల్లోకి వచ్చారని ఆరోపిస్తున్నారు. అంటే మోడీ సర్కార్‌ మీద తిరుగుబాటు చేస్తున్నట్లు చిత్రించటమే. అదే రైతుల అజెండా అయితే నిరాయుధులుగా ఎందుకు వస్తారు.తాము ప్రయాణిస్తున్న ట్రాక్టర్లలో గతంలోగానీ ఇప్పుడు గానీ ఆహార పదార్దాలు తప్ప ఎలాంటి మారణాయుధాలు లేవే. ఢిల్లీ చలో అన్న నినాదంతో గతంలో సాగిన ఉద్యమానికి ఇచ్చిన పిలుపుకు మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా 2023 నవంబరు 26 నుంచి 28వరకు చండీఘర్‌లో నిరసన తెలపాలని పంజాబ్‌ రైతులు పిలుపు నిచ్చారు. దాని కొనసాగింపే తాజా ఢిల్లీ చలో నిరసన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? మంత్రి మాటలను బట్టి ఏదో విధంగా కాలయాపన చేసి ఆందోళనను అణచివేసేందుకు లేదా మరో విధంగా ముగించేందుకు కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది. నవంబరులోనే కేంద్రం ఎందుకు చర్చలు జరపలేదు ?

పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని రైతులే ఎందుకు ఆందోళన చేస్తున్నారంటూ కొందరు ఉద్యమాన్ని తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. నిద్రపోతున్నవారిని లేపగలం గానీ నటిస్తున్నవారిని లేపటం కష్టం. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. పండిన పంటలో స్థానిక వినియోగం పోను మిగిలిన దాన్ని మార్కెట్‌ మిగులుగా పరిగణిస్తారు.2005లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం దేశవ్యాపిత సగటు 55.46శాతం మార్కెట్‌ మిగులు ఉంది. ఇది ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో పంజాబ్‌ 94.43,హర్యానా 90,11,రాజస్థాన్‌లో 90శాతం ఉంది. ఉత్తర ప్రదేశ్‌ మొత్తంగా చూసినపుడు 49.18శాతమే ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలు పంజాబ్‌, హర్యానా మాదిరిగా ఉంటాయి. స్వల్ప మార్పులు తప్ప ఇప్పటికీ అదే పరిస్థితి. అందుకే మార్కెటింగ్‌, గిట్టుబాటు ధర సమస్య వచ్చినపుడల్లా ఈ ప్రాంతాల రైతులే వెంటనే స్పందించటం ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. అందుకే గతంలోనూ, ఇప్పుడూ ఈ ప్రాంతాల వారే ముందుకు వస్తున్నారు. ఆ సమస్య పెద్దగా లేని రాష్ట్రాల రైతుల్లో పెద్దగా స్పందన ఉండదు. హిమచల్‌ ప్రదేశ్‌, కాశ్మీరులో ఆపిల్‌ రైతులు, కొబ్బరి ధర పడిపోతే కేరళ, ఇతర కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతాల రైతులే స్పందిస్తారు. వర్జీనియా పొగాకు ధర పడిపోతే ఆంధ్రప్రదేశ్‌లో దాన్ని సాగు చేసే ప్రాంతాల్లో రైతులే రోడ్ల మీదకు వస్తారు, మిగతా రైతులు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే అర్ధం లేదు.


ఇంతకీ రైతులు కోరుతున్నదేమిటి ? స్వామినాధన్‌ కమిటీ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి. రైతుల రుణాలను పూర్తిగా రద్దు చేయాలి.రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్‌ పధకాన్ని వర్తింప చేయాలి.విద్యుత్‌ సవరణ బిల్లు 2020ని రద్దు చేయాలి.భూసేకరణ చట్టం 2013ను తిరిగి తేవాలి. దాని ప్రకారం భూసేకరణకు రైతుల ఆమోదం తీసుకోవాలి, జిల్లా కలెక్టర్‌ నిర్ణయించిన ధరకు నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలి.ఉత్తర ప్రదేశ్‌ లఖింపూర్‌ ఖేరీలో హత్యకు గురైన రైతులకు న్యాయం జరగాలి.దోషులను శిక్షించాలి. గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం ఏడాదికి రెండువందల రోజులు పని కల్పించాలి, వ్యవసాయానికి అనుబంధం చేయాలి.2021 ఉద్యమం సందర్భంగా మరణించిన కుటుంబాల వారికి పరిహారంతో పాటు కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం కల్పించాలి. ఇవి కేవలం పంజాబ్‌, హర్యానా రైతుల డిమాండ్లేనా, మిగతా ప్రాంతాల రైతులు కోరటం లేదా ? ఆందోళనను పక్కదారి పట్టించి నిందలు వేస్తున్నవారిని ఎక్కడికక్కడ రైతాంగం నిలదీసే రోజులు రానున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత వ్యవసాయ రంగం – నరేంద్రమోడీ : ఇంతకాలం రైతు ఉద్యమం – ఇక కార్పొరేట్ల వత్తిడి ప్రారంభం !

09 Thursday Dec 2021

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

agriculture in india, Farmers agitations, Minimum Support Prices, MSP, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


ఏడాదికి పైగా సాగిన మహత్తర రైతు ఉద్యమం మూడు సాగు చట్టాల రద్దుతో ఘన విజయం సాధించింది. సింహం లాంటి నరేంద్రమోడీ ఎత్తుగడగా ఒక అడుగు వెనక్కు తగ్గారు తప్ప తగు సమయంలో తిరిగి అదే అజండాతో ముందుకు వస్తారని మోడీ అభిమానులు వెంటనే స్పందించటాన్ని చూశాము. వారికి రైతు ఉద్యమం మీద ఉన్న అవగాహన కంటే నరేంద్రమోడీ మీద పెంచుకున్న విశ్వాసం బలంగా ఉందన్నది స్పష్టం. రైతుల పోరాటం ముందుకు తెచ్చిన ఇతర ప్రధాన అంశాలు ఇంకా పరిష్కారం కావలసి ఉంది. కొన్నింటిపై ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీల మేరకు ఉద్యమ విరమణ ప్రకటన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి చర్చ, అవసరమైతే తదుపరి కార్యాచరణ గురించి చర్చించేందుకు జనవరి 15న సమావేశం జరపనున్నట్లుసంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేతలు ప్రకటించారు. సమస్యల తీవ్రత, సంక్లిష్టత, అనుమానాల దృష్ట్యా 378 రోజుల పోరులో ఒక విరామంగానే దీన్ని చెప్పవచ్చు.


కనీస మద్దతు ధరల చట్టం గురించి ఒక కమిటీని వేస్తామని, దానిలో రైతు సంఘాల ప్రతినిధులు ఉంటారని కూడా చెప్పారు. ఆ కమిటీని వేస్తారు, వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోపు దాని నివేదిక వచ్చే అవకాశాలు లేవు. ఎన్నికల పబ్బం గడచిన తరువాత ఏం జరుగుతుందో చెప్పలేము.ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. కొన్ని అంశాలను చూద్దాం. కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి టి.నందకుమార్‌ డిసెంబరు 8వ తేదీన రాసిన విశ్లేషణాభిప్రాయంలో వెంటనే ఎంఎస్‌పి డిమాండ్‌ను భరించగలిగే స్ధితి దేశానికి లేదని, అరాజకత్వం, దీర్ఘకాలిక నష్టం జరుగుతుందంటూ గుండెలు బాదుకున్నారు. ఇదేమీ అనూహ్యమైంది కాదు, ఇలాంటి వారు సాగు చట్టాలకు ముందు-తరువాత చర్చలో – రద్దు తరువాత కూడా ఇదే వైఖరిని వెల్లడించారు. వీరంతా స్వదేశీ-విదేశీ కార్పొరేట్‌ లాబీకి చెందిన పెద్దమనుషులు. రైతులను విభజించే వాదనలను కూడా నందకుమార్‌ ముందుకు తెచ్చారు. మిగులు పంటను అమ్ముకొనే తరగతి రైతులు ఎవరు ? ఏ ప్రాంతాల్లో సేకరణకు అవసరమైన సదుపాయాలున్నాయి ? వర్షాధారిత రైతులకు పెట్టుబడి సబ్సిడీలు అందకపోతే, సేకరణ వ్యవస్తలు అందుబాటులో లేకపోతే ఏం జరుగుతుంది ? కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే ఆ మేరకు జరుగుతోందా లేదా అని ప్రతిలావాదేవీని తనిఖీ సిబ్బంది చూడాల్సి ఉంటుంది. ఉల్లంఘించిన వారిని శిక్షించాలి.అప్పుడు వ్యాపారులెవరూ మార్కెట్లో ఉండరు, ప్రభుత్వ విక్రయాల కోసం ఎదురు చూస్తారు. అప్పుడు ప్రభుత్వం ఏకైక వ్యాపారి అవుతుంది.అది విపత్తుకు దారి తీస్తుంది. ప్రస్తుత డిమాండ్‌ను చూస్తే విశ్వాస ప్రాతిపదిక వ్యవస్ధ బదులు హక్కుల వ్యవస్ధను కోరుతున్నారు. అదే జరిగితే పంజాబ్‌ మరికొన్ని రాష్ట్రాలకు పరిమితమైన దానిని దేశమంతటా విస్తరించాల్సి ఉంటుంది. ఆహారభద్రత హక్కు మాదిరి రైతులకు సేకరణ హక్కు లభిస్తుంది. అదే జరిగితే అదొక సేకరణ పధకం లేదా మద్దతు ధరకంటే తక్కువకు అమ్ముకుంటే ఆ తేడాను చెల్లించేది లేదా రెండూ అమలు జరపాల్సి రావచ్చు. అప్పుడేం జరుగుతుంది అని నందకుమార్‌ ప్రశ్నించారు.


మిగులు పంటను అమ్ముకొనే వారా లేకా స్వంత అవసరాల కోసం పండించుకొనే వారా అన్నది అసంబద్ద వాదన. అసలు ఎవరికీ సాగు గిట్టుబాటు కావటం లేదన్నది అసలు సమస్య. 75 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా 116 దేశాల్లో ఆకలిలో 101వ స్ధానంలో ఉన్నామనే అంశం ఇలాంటి వాదనలు చేసే వారికి తెలుసా ? ఎవరి అవసరాలకు సరిపడా వారు పండించుకుంటే మిగులు లేకుండా ఆకలిని తీర్చేదెవరు ? అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాలని-అక్కడి కార్పొరేట్లకు లబ్ది చేకూర్చాలని చెబుతున్నారా ? వర్షాధారిత ప్రాంతాల రైతులను ఆదుకొనేందుకు అవసరమైన పధకాలను అమలు జరిపితే సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు మరొకరెవరైనా అడ్డుకున్నారా ? పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలకు ధరలను నిర్ణయించే అవకాశం, హక్కు పారిశ్రామిక, వాణిజ్యసంస్ధలకు ఉన్నపుడు రైతులకు అలాంటి అలాంటి హక్కు ఎందుకు కలిగించకూడదు ? ప్రతి రైతుకు అలాంటి అవకాశం లేదు కనుక వారి తరఫున ఆ పని ప్రభుత్వమే చేయాలి. ఇన్నేండ్లుగా విశ్వాసాన్ని వమ్ము చేశారు కనుకనే రైతులు హక్కుల విధానాన్ని కోరుతున్నారు. పెట్టుబడులు రావాలంటే పారిశ్రామిక, వాణిజ్య సంస్దలకు కార్మిక చట్టాలు ఆటంకంగా ఉన్నాయి, ఇష్టం వచ్చినపుడు కార్మికులను నియమించుకొనే, తీసివేసే స్వేచ్చ ఇవ్వాలన్న వత్తిడికి లొంగి ఆ చట్టాలకు ఎసరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పంటల మద్దతు ధరలకు చట్టబద్దత కల్పిస్తే వ్యాపారులు మార్కెట్‌ నుంచి తప్పుకుంటారని చెప్పటం బెదిరింపు తప్ప మరొకటి కాదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధరలకంటే తక్కువ వెలకు వినియోగదారులకు అమ్మాలనే నిబంధనలేమీ లేనపుడు వారికి వచ్చే నష్టం ఏమిటి ?


నందకుమార్‌ ముందుకు తెచ్చిన మరికొన్ని వాదనలేమిటి ? ఇరవై మూడు పంటలకు ఇప్పటికే ఉన్న ఎంఎస్‌పికి చట్టబద్దమైన హామీ కల్పించాలని అడుగుతున్నారు. ఇతర రైతుల గురించి ఎలాంటి నిర్దిష్టత లేదు. అందువలన వారు కూడా ఎంఎస్‌పిని అడగరని ఏముంది ? (నిర్ధిష్టత లేకపోతే ప్రభుత్వం ఆ పని చేస్తే వద్దన్నదెవరు ? ఇతర పంటలకూ ఎంఎస్‌పి అడిగితే ఇవ్వాలి. సాగు చేయాలా వద్దా ? ఇతర పంటలు అవసరం లేదా ? పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలకు అలాంటి పరిమితులేమీ లేవుగా !) ప్రస్తుతం ఎంఎస్‌పి పరిధిలో ఉన్న 23 పంటల విలువ ఏడులక్షల కోట్ల రూపాయలు.చట్టబద్దత కల్పిస్తే అదనపు ఖర్చు రు.47,764(2017-18 సమాచారం) అవుతుందని కిరన్‌ విస్సా, యోగేంద్ర యాదవ్‌ చెప్పారు. వీరు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు.వాటిలో ఆహార సబ్సిడీ రు.2,40,000 కోట్లున్నాయి.(ఇంత సబ్సిడీ ఇచ్చిన తరువాత కూడా దేశం ఆకలి సూచికలో 116 దేశాల్లో 101వదిగా దిగజారిన స్ధితిలో ఉంది, ఈ సబ్సిడిని తగ్గిస్తే మరింతగా అన్నార్తులు పెరగరా ?) అందులో ఎక్కువ భాగం వినియోగదారులకే చెందుతోంది. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సేకరణ విధానాన్ని, ఆహార సబ్సిడీ కొనసాగించాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది ఎంఎస్‌పి పెరిగినపుడు సబ్సిడీ కూడా పెరుగుతుంది, జారీ ధరలు స్ధిరంగా ఉంటాయి.దీనికి ప్రతి ఏటా 50వేల కోట్లను జత చేస్తే మూడులక్షల కోట్లవుతాయి. గోధుమ, బియ్యం కాకుండా చిరు,పప్పు ధాన్యాలు, ఖాద్యతైలాలను కూడా సేకరించి బహిరంగ మార్కెట్‌ వేదికలద్వారా తక్కువ ధరలకు విక్రయిస్తారు.కనీస మద్దతు ధరలలో 40-45శాతం మేరకు నష్టం రావచ్చు.కనుక ఏ సేకరణ చేపట్టినా విలువలో సబ్సిడీ భారం 30శాతానికి తగ్గదు.

ఎంఎస్‌పికి హామీ ఇస్తే పరిమితంగా కొనుగోలు చేయాలి.పౌరపంపిణీ వ్యవస్ధతో సేకరణకు ఉన్న లంకె, వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మితే కష్టం, ఎంతో ఖర్చవుతుంది కనుక వాటి లంకెను విడగొట్టాల్సిన తరుణం వచ్చింది.కనీస మద్దతు ధరలేని పంటలను సాగు చేసేందుకు రైతులను ఒప్పించాలి, లేకపోతే వారు ఇతరులు కూడా ఎంఎస్‌పి పంటలను సాగు చేస్తారు. కొత్త సమస్యలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు పిఎం కిసాన్‌, ఎరువులు, ఇతర సబ్సిడీలతో పాటు ఆహార సబ్సిడీని రు.2,40,000 కోట్ల నుంచి మూడు లక్షల కోట్లకు ప్రభుత్వం పెంచగలదా ?(వీటిని నష్టాలుగా పరిగణించి గుండెలుబాదుకుంటున్నవారు, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఇస్తున్న ఇతర అనేక రాయితీల గురించి ఏమి చెబుతారు ? వారి సంపదలను పెంచితే జనానికి వచ్చేదేమిటి ? తిండి కలిగితే కండకలదోయి-కండకలవాడేను మనిషోయి అన్న గురజాడను మరిస్తే ఎలా ? కార్మికులు ఆరోగ్యంగా ఉంటే అది వారికే కాదు దేశానికీ లాభమే.) తాజా దారిద్య్రసమాచారం ప్రకారం ఆహార భద్రత వర్తింపును నలభైశాతానికి కుదించటం, చౌకదుకాణాల ద్వారా విక్రయించే వాటి ధరలను పెంచగలదా ? రైతుల ఆదాయాన్ని పెంచే ప్రాధమిక బాధ్యను తీసుకొనే విధంగా రాష్ట్రాలకు ప్రమేయం కల్పించాల్సిన అవసరం లేదా ?( రాష్ట్రాలను సంప్రదించుకుండా సాగు చట్టాలను మార్చినపుడు నందకుమార్‌ లాంటి వారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆ చర్చను ఎందుకు ముందుకు తెస్తున్నారు? )


నందకుమార్‌ లేదా జయప్రకాష్‌ నారాయణ లాంటి వారు చేస్తున్న వాదనలు ప్రపంచ వాణిజ్య సంస్ధకు అనుగుణ్యంగా ఉండటం ఆశ్చర్యం కలిగించదు. కనీస మద్దతు ధరలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా తదితర దేశాలు వేసిన కేసులు, వాదనల తీరు తెన్నుల గురించి మరో విశ్లేషణలో చూద్దాం. వాటికి అనుగుణ్యంగానే అమెరికా, ఐరోపా ధనిక దేశాలను సంతుష్టీకరించేందుకు, వాటి కార్పొరేట్లకు ద్వారాలు తెరిచేందుకు సంస్కరణలు-రైతుల పేరుతో హడావుడిగా నరేంద్రమోడీ సాగు చట్టాలను తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు కనీస మద్దతు ధరల మీద కమిటీ వేయగానే ఏదో జరిగిపోతుందనే భ్రమలకు లోను కానవసరం లేదు. ఆందోళనకు నాయకత్వం వహించిన ఎస్‌కెఎం ప్రతిపాదించిన వారిని మాత్రమే రైతు ప్రతినిధులుగా పరిగణించాలన్న డిమాండ్‌ను కేంద్రం అంగీకరించలేదు. అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ రైతు సంఘం, ప్రభుత్వ కనుసన్నలలో నడిచేవారిని రైతుల పేరుతో నియమించనున్నారన్నది స్పష్టం.అలాంటి వారితో కూడిన సుప్రీం కోర్టు కమిటీ రూపొందించిన నివేదికను నెలలు గడిచినా బహిర్గతం చేయలేదు, ఏముందో తెలియదు. బహుశా అది రైతులకు అనుకూలంగా లేనందున జనానికి అందుబాటులోకి రాకపోవచ్చు. ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వ కోర్టులో ఉంది. ఎస్‌కెఎంతో వాగ్దాన-ఒప్పంద భగ్నానికి పాల్పడితే మరింత తీవ్ర రూపంలో ఉద్యమం తిరిగి ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు తమకు వ్యతిరేకమైన చర్యల మీద రైతాంగం ఉద్యమించింది. అందినట్లే అంది చేజారిన వ్యవసాయ మార్కెట్‌ను తిరిగి చేజిక్కించుకొనేందుకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్‌ శక్తులు కేంద్ర ప్రభుత్వం మీద రైతులకంటే తీవ్రంగా వత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది. నరేంద్రమోడీ తమకు ఉపయోగపడే అవకాశాలు లేవనుకుంటే ఆ స్ధానంలో మరొకరిని రంగంలోకి తెచ్చినా లేదా తమ హిందూత్వ అజెండాకే ప్రమాదం ముంచుకువచ్చిందని సంఘపరివార్‌ భావించినా దాన్ని అమలు జరపగల సమర్ధుడిగా భావిస్తున్న నరేంద్రమోడీ మరో రూపాన్ని ప్రదర్శించినా ఆశ్చర్యం లేదు.


రైతులు డిమాండ్‌ చేస్తున్న అంశాలలో కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలన్నది ఒకటి. అదేమీ వారు కొత్తగా కోరిన గొంతెమ్మ కోరిక కాదు. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అంశాలలో ఒకటే. నెలవులు మారిన తరువాత పాతవాటిని మరచిపోయినట్లు నటించటం కొందరిలో చూస్తాము. కానీ మోడీ గారి విషయంలో అలా అనుకోలేము. అసలు కథవేరే ఉంది. అది బయటకు చెప్పలేరు-రైతులను మెప్పించలేరు, అందుకే అనేక మంది పాలకుల మాదిరే బలవంతంగా రుద్దేందుకు పూనుకొని మూడు సాగు చట్టాలను తెచ్చారు. అనుకున్నది ఒకటి-అయింది ఒకటి. చివరకు క్షమాపణలు చెప్పి మరీ వాటిని వెనక్కు తీసుకున్నారు. నిజానికి కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించేందుకు కాబినెట్‌లో చర్చించి ప్రస్తుత సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదం పొందటం క్షణంలో పని. జమ్ము- కాశ్మీరు రాష్ట్రం, ఆర్టికల్‌ 370ని ఒక్క రోజులో వేగంగా రద్దు చేయటంలో చూపిన సామర్ధ్యం జగమెరిగిందే. అలాంటిది కనీస మద్దతు ధరల చట్టం తేలేరా ?

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ ఏలుబడి : కార్పొరేట్లకు విశ్వాసం – రైతాంగంలో అవిశ్వాసం !

13 Sunday Dec 2020

Posted by raomk in AP NEWS, BJP, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#Farmers’ protest, CACP, Indian Farmer Protest 2020, MSP, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


మాకు మీరు చెబుతున్నదాని మీద విశ్వాసం లేదు మహా ప్రభో అని రైతాంగం గత 18రోజులుగా (డిసెంబరు 13) తమ రాజధాని ఢిల్లీ శివార్లలో తిష్టవేసి ఒక వైపు నిరసన తెలుపుతున్నది. మరోవైపు గత ఆరు సంవత్సరాలుగా భారత్‌ మీద ప్రపంచం చూపుతున్న విశ్వాసం గత కొద్ది నెలలుగా మరింతగా పెరిగింది నా ఏలుబడిని చూడండో అని ప్రధాని నరేంద్రమోడీ తన గొప్ప గురించి చెప్పుకున్నారు. అదీ ఎక్కడా ! వాణిజ్య, పారిశ్రామికవేత్తల ప్రతినిధి ఫిక్కీ సమావేశంలో మోడీ చెప్పారు. చర్చల పేరుతో కేంద్ర ప్రభుత్వం వేస్తున్న పిల్లిమొగ్గలను రైతులు పట్టించుకోవటం లేదు. గత ఆరు సంవత్సరాలుగా పలు తరగతులలో భాగంగా నరేంద్రమోడీ మీద రైతులు పెంచుకున్న భ్రమలు తొలగి గత కొద్ది నెలలుగా వేగంగా అవిశ్వాసాన్ని పెంచుకుంటున్నట్లు జరుగుతున్న ఉద్యమం వెల్లడిస్తోంది. మరి నరేంద్రమోడీ గారు చెప్పింది అబద్దమా ? అదియును సూనృతమే ఇదియును సూనృతమే.( రెండూ నిజమే ) తమకు దోచి పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నందుకు మోడీ గారి మీద దేశీ-విదేశీ కార్పొరేట్లలో విశ్వాసం పెరుగుతుంటే ఆ చర్యలు తమ కొంప ముంచుతాయని రైతాంగం భయపడటం ఎక్కువైంది.


బిజెపి చెప్పినట్లుగా రైతుల ఆదాయాలు రెట్టింపు అవలేదు, కనుచూపు మేరలో అయ్యే అవకాశాలు కనిపించటంలేదు. మాంద్యం లేదా కరోనా మహమ్మారి వచ్చినా మోడీ ఏలుబడిలో కార్పొరేట్ల లాభాలు పెరుగుతాయే తప్ప తగ్గవని తేలిపోయింది. అందుకే బిజెపి ఆదాయం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరుగుతోంది.కేంద్ర ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు అందచేసిన వివరాల ప్రకారం 2018లో రూ.1,027.37 కోట్లున్న బిజెపి ఆదాయం 2019 నాటికి రూ.2,410.08(134.59శాతం)కు పెరిగింది. అనధికారికంగా వచ్చే ఆదాయం గురించి చెప్పనవసరం లేదు. కార్పొరేట్‌ కంపెనీలు, ఇతర వ్యాపార సంస్ధలు ఇచ్చిన ఇంత డబ్బు ఉంది కనుకనే రైతులకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా 700 జిల్లాల్లో సభలు, ప్రచారం, 700 పత్రికా సమావేశాలు పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు చెప్పిన అసత్యాలు, అర్ధసత్యాలను జనం మెదళ్లకు ఎక్కించే ప్రయత్నమే ఇది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా ఎంత ఎక్కువగా చెబితే అంతగా జనం వాస్తవాలు తెలుసుకుంటారు. మీడియాలో బిజెపికి ఇచ్చినంత గాక పోయినా ఎంతో కొంత చోటు ఇవ్వక తప్పదు కదా !


రైతాంగ ఆందోళన అనేక అంశాలను ముందుకు తెస్తోంది. రాజకీయ పార్టీలు, మేథావులు, మీడియా ఎవరి అసలు రంగు ఏమిటో బయటపెడుతోంది. తొలి రోజుల్లో విస్మరించినా ప్రధాన స్రవంతి మీడియా రైతుల ఆందోళన వార్తలను అరకొరగా అయినా ఇవ్వకతప్పటం లేదు. సెప్టెంబరు నెలలో పార్లమెంట్‌లో అప్రజాస్వాకంగా ఆమోదించిన వివాదాస్పద చట్ట సవరణల మీద ముందుకు తెస్తున్న కొన్ని వాదనల తీరు తెన్నులను చూద్దాం. వాటిలో ప్రధానమైనది – వ్యవసాయ చట్టాలకు కనీస మద్దతు ధరలకు సంబంధం లేదు !


దేశంలోని మిగతా రాష్ట్రాలకూ కాశ్మీరుకు ఉన్న ఆర్టికల్‌ 370కి సంబంధం లేదు. అయినా సంబంధం అంటగట్టి దాన్ని రద్దు చేసేంత వరకు నిదురపోలేదు. దేశం మొత్తానికి వర్తించే కనీస మద్దతు ధరలకూ వ్యవసాయ చట్టాలకు ఇప్పటి వరకు సంబంధం లేదు నిజమే ! సంబంధం కలపమని, తమకు భరోసా కల్పించమనే కదా రైతులు కోరుతోంది. ఎందుకు నిరాకరిస్తున్నారో చెప్పమంటే సమాధానం చెప్పకుండా అడ్డగోలు వాదనలు ముందుకు తెస్తున్నారు ? మూడు చట్టసవరణలను పూర్తిగా వెనక్కు తీసుకోవాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. తాజా ఆందోళనతో నిమిత్తం లేకుండానే గత కొన్ని సంవత్సరాలుగా కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చిందా లేదా ? ఎన్నడూ లేని విధంగా రైతాంగానికి ఇప్పుడు బిజెపి మీద అనుమానాలు ఎందుకు బలపడ్డాయి ?
సంస్కరణల పేరుతో అన్ని వ్యవస్దలకు తిలోదకాలు ఇచ్చేందుకు, బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు, లాభాలు వస్తున్న ఎల్‌ఐసి, చమురు సంస్ధలను కూడా ప్రయివేటు పరం చేసేందుకు మోడీ సర్కార్‌ కుంటి సాకులు చెబుతున్నది. కనీస మద్దతు ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వ్యవస్ధలను ప్రభావితం చేసే మూడు చట్టాలలో ఎక్కడా కనీసం మద్దతు ధరల ప్రస్తావన లేదు. కనుకనే రైతాంగం కనీస మద్దతు ధరలను చట్టబద్దం చేయమంటోంది. గతంలో కూడా రైతు సంఘాలు ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి. చట్టాలకు ఎంఎస్‌పికి సంబంధం లేదని చెబుతున్న బిజెపి పెద్దలు గతాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటారా లేక దొంగ నిద్ర నటిస్తారా ? 2011లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని ఆషామాషీగా కేంద్రానికి సిఫార్సు చేసిందా ? ఈ కమిటీలో నాటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు ఇతర సభ్యులు. సిఎంగా ఉన్న మోడీ చేసిన సిఫార్సును పిఎం మోడీ ఎందుకు పక్కన పడేస్తున్నారు ? బిజెపి నేతలు అసలు ఆ ప్రస్తావనే ఎందుకు తేవటం లేదు. నాడు ఎందుకు సిఫార్సు చేసినట్లు ఇప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నట్లు ? మా దారే వేరు అని చెప్పుకుంటున్న నరేంద్రమోడీకి ఇతరులకు తేడా ఏముంది ?


వ్యవసాయ చట్టాలకు-కనీస మద్దతు ధరలకు సంబంధం ఉందా లేదా అన్నది అసలు చర్చే కాదు, సంబంధం కల్పించాలని రైతులు అడుగుతున్నారు. గతంలో కూడా లేదుగా అని బిజెపి అంటోంది. నిజమే, గతంలో లేని వాటిని మోడీ సర్కార్‌ అనేకం తెచ్చిందిగా దీన్నెందుకు తీసుకురాదు. తెస్తే వారికి పోయేదేముంది? రైతులు శాశ్వతంగా మద్దతుదారులుగా మారతారు కదా ! ఇంతకీ 2011 నివేదికలో మోడీ కమిటీ చేసిన సిఫార్సు ఏమిటి ? నివేదికలోని క్లాజ్‌ బి.3లో ఇలా ఉంది.” చట్టబద్దంగా ఎంఎస్‌పి అమలు : మార్కెట్‌ పని చేయటంలో మధ్యవర్తులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు మరియు ఆ సమయంలో వారు ముందుగానే రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు. అన్ని నిత్యావసర వస్తువులకు సంబంధించి చట్టబద్దమైన అంశాలతో శాసనం ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడాలి. అదేమంటే రైతు-వ్యాపారి లావాదేవీల్లో ఎక్కడా నిర్ణీత కనీస మద్దతు ధరలకు తగ్గకూడదు.” దీని అర్ధం ఏమిటి ? చట్టబద్దత కల్పించాలనే కదా ! అన్నింటికీ మించి సంబంధం లేదనటం పచ్చి అబద్దం. వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో జరిగే లావాదేవీలలో కనీస మద్దతు ధరలకంటే తక్కువకు కొనుగోలు చేయకూడదు. కొత్త చట్టం ఆ యార్డుల పరిధిని కుదించి దాని వెలుపల వ్యాపారులు ఎలాంటి పన్నులు, సెస్సులు చెల్లించకుండా కొనుగోళ్లు జరపవచ్చని చెప్పింది. ఏ ధరలకు కొనుగోలు చేయాలో చెప్పలేదు. కనీస మద్దతు ధరలు అమలు జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షించే యంత్రాంగం అక్కడ లేనపుడు ఏమి చేయాలో సవరించిన చట్టాల్లో ఎందుకు చెప్పలేదు?


అంతేనా 2014 మే 26న నరేంద్రమోడీ దేశ ప్రధాని అయ్యారు. అంతకు ముందు ఏప్రిల్‌ 14న చేసిన ట్వీట్‌లో మన రైతులు సరైన ధర ఎందుకు పొందకూడదు, వారేమీ అడుక్కోవటం లేదు, కష్టపడుతున్నారు, మంచి ధర పొందాలంటూ దానిలో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా రైతులు దేన్నీ దేబిరించటం లేదు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఏమంటున్నారు ? ” నిజమేనయ్యా మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కమిటీ చేసిన సిఫార్సు ప్రకారం ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించాలని ప్రతిపక్షం కోరుతోంది. నేను వారిని అడుగుతున్నా మీరు చాలా సంవత్సరాలు పాలన సాగించారుగా ఎందుకు చేయలేదు ” అని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది బిజెపి. గడ్డం లేని సమయంలో స్వయంగా మోడీఏ సిఫార్సు చేశారు. ఇప్పుడు గడ్డం పెంచటాన్ని చూసిన అనేక మంది మోడీలో పరిణితి, పెద్దరికం వచ్చింది అని చెబుతున్న తరుణంలో కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాల్లో చేయని దాన్ని ఇప్పుడెందుకు చేయరు అంటే ఉన్న ఆటంకం ఏమిటో చెప్పకుండా గతంలో ఎందుకు చేయలేదని ఎదురుదాడి చేయటం ఏమిటి ?


కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఎంఎస్‌పికి-వ్యవసాయ చట్టాలకు సంబంధం లేదనే పాటనే పాడారు. ఆమె మరొక అడుగు ముందుకు వేశారు.చట్టసవరణలు చేయబోయే ముందు సంప్రదింపులు, చర్చలు ఎందుకు జరపలేదు అని అడిగితే ఈ అంశాల మీద 2000 సంవత్సరంలో వాజ్‌పేయి సర్కార్‌ హయాం నుంచీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి పొమ్మన్నారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత గురించి కూడా చర్చ ఉన్నది దాన్నెందుకు పట్టించుకోవటం లేదు ? కిసాన్‌ ముక్తి బిల్లుల పేరుతో రుణభారం నుంచి విముక్తి కలిగించాలని, మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని కోరుతూ 2018 జూలై, ఆగస్టు నెలల్లో పార్లమెంట్‌లో రెండు అనధికార బిల్లులను ప్రవేశపెట్టారు. ఆలిండియా కిసాన్‌ సంఘర్ష సమితిలో భాగస్వాములైన స్వాభిమాని షేత్కారి సంఘటన నేత, ఎంపీ అయిన రాజు షెట్టి లోక్‌సభలో, ఆలిండియా కిసాన్‌సభ నేత, సిపిఎం ఎంపీ అయిన కెకె రాగేష్‌ రాజ్యసభలో వాటిని ప్రవేశ పెట్టారు. వాటిని ప్రభుత్వం తిరస్కరించింది.
స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేసినట్లు, ఉత్పాదక ఖర్చు మీద 50శాతం అదనంగా కనీస మద్దతు ధరలు అమలు జరుపుతున్నట్లు బిజెపి ప్రచారం చేస్తున్నది. దీన్ని చూసి నేను చచ్చినా నా సిద్దాంతం బతికి ఉన్నందుకు సంతోషంగా ఉందని అబద్దాల జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ ఆత్మ సంతోషపడుతూ ప్రత్యేక అభిమానంతో మన దేశం చుట్టూ తిరుగుతూ ఉండి ఉండాలి ( ఆత్మ గురించి విశ్వాసం ఉన్నవారి మనోభావాల మేరకు ). 2014 హర్యానా అసెంబ్లీ ఎన్నికల వరంగా స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేస్తామని బిజెపి చెప్పింది. అమిత్‌ షా భాషలో చెప్పాలంటే ఇదొక జుమ్లా (ఏదో అవసరానికి అనేకం చెబుతుంటాం). 2016 ఏప్రిల్‌ ఆరవ తేదీన కేంద్ర వ్యవసాయ శాఖ హర్యానాలోని పానిపట్‌ జిల్లా సమలఖాకు చెందిన పి.పి కపూర్‌ అనే సమాచార హక్కు కార్యకర్తకు ఇచ్చిన సమాధానం మోడీ ప్రభుత్వ నిజస్వరూపాన్ని వెల్లడిస్తున్నది. ” అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ ఖర్చులు మరియు ధరల నిర్ణాయక కమిషన్‌ (సిఏసిపి) కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. కనుక కనీస మద్దతు ధరలకు సంబంధించి స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సును ప్రభుత్వం తిరస్కరించింది. ఉత్పాదక ఖర్చు మీద 50శాతం కనీసంగా పెంచి నిర్ణయించటం మార్కెట్లో వక్రీకరణకు దారి తీస్తుంది.” అని పేర్కొన్నారు. గతంలో మాదిరే మద్దతు ధరలను కొనసాగిస్తున్నారు తప్ప స్వామినాధన్‌ కమిషన్‌ చెప్పినదాని ప్రకారం భూమి(విలువ) కౌలు మొత్తాన్ని కూడా ఖర్చులలో కలిపి మద్దతు ధరలను నిర్ణయించాల్సి ఉండగా మోడీ సర్కార్‌ దాన్ని వదలివేసింది.

సిఏసిపి మద్దతు ధరలను సూచించేందుకే పరిమితం తప్ప వాటి అమలు నిర్ణయం ప్రభుత్వానిదే. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం కనీస మద్దతు ధరకు విధిగా కొనుగోలు చేయాలని ప్రయివేటు రంగ వ్యాపారులను ఆదేశించే అవకాశం లేదు. కొంత మేరకు చెరకు విషయంలోనే ఏ రంగంలో ఉన్నవారైనా ఎఫ్‌ఆర్‌పి ధరలను అమలు జరపాల్సి ఉంది. దీన్నే ఇంతకు ముందు ఎస్‌ఎంపి అని పిలిచారు.2018-19లో సిఏసిపి తన ధరల విధాన నివేదికలో కనీస మద్దతు ధరలకు రైతులు అమ్ముకొనే హక్కును కల్పిస్తూ చట్టం చేయాలని ప్రతిపాదించింది. రైతుల్లో విశ్వాసం కల్పించేందుకు ఈ చర్య అవసరమని పేర్కొన్నది. అయితే దీన్ని కేంద్రం అంగీకరించలేదు. ఇప్పుడు విశ్వాస సమస్య మరింతగా ముందుకు వచ్చింది. రైతులు చేస్తున్న ఆందోళన ప్రభుత్వం మీద, పాలక వ్యవస్ధ మీద విశ్వాసరాహిత్యాన్ని సూచిస్తున్నది. 1966-67లో గోధుమలకు తొలిసారిగా మద్దతు ధర నిర్ణయం అధిక దిగుబడి వంగడాల సాగు, పెరిగిన ఉత్పత్తి మార్కెటింగ్‌పై రైతులకు విశ్వాసం కొల్పేందుకు ఉద్దేశించిందే అన్నది గమనించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముందస్తు ఎన్నికల కోసం కనీస మద్దతు ధరల పెంపు ఆలస్యం చేశారా ?

06 Friday Jul 2018

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Prices

≈ 1 Comment

Tags

Farm prices, loksabha midterm elections, MSP, msp announcement, NAENDRAMODI

Image result for why narendra modi delayed msp announcement

ఎం కోటేశ్వరరావు

ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని దేవులపల్లి కృష్ణ శాస్త్రి రాశారు. ఇది ముందస్తు ఎన్నికల తరుణమని అందుకే నరేంద్రమోడీ పంటల కనీస మద్దతు ధరలను ఆలస్యంగా ప్రకటించారని విమర్శలు ఎదుర్కొన్నారు.వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సిఏసిపి) 2018-19 ఖరీఫ్‌ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి మార్చి నెలలోనే సమర్పించింది. రేపేమవుతుందో తెలియని స్ధితిలో వున్నంతలో ఏ పంటకు ధర ఆకర్షణీయంగా వుంటే రైతాంగం వాటిని ఎంచుకొనేందుకు వీలుగా సాగుకు ముందే ప్రకటించాల్సిన వాటిని సాగు ప్రారంభమైన నెల రోజుల తరువాత కేంద్రం ప్రకటించింది. ఎన్నికల కోసం ఆలస్యం చేశారని విమర్శకులు తప్పుపడితే ఆశ్చర్యం ఏముంది, తప్పేముంది?

వెనుకో ముందో ప్రభుత్వం ఏదో ఒకటి చేసింది, పెంపుదలను అభినందిస్తారా లేదా అని మోడీ మద్దతుదారులు అడగటం సహజం. నాలుగు సంవత్సరాల పాలన తరువాత తన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చానని నరేంద్రమోడీ స్వయంగా ప్రకటించారు. అంటే స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులు అమలు జరిగినట్లే రైతాంగం భావించాలి. సగటు వుత్పత్తి ధరపై 50శాతం అదనంగా కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) నిర్ణయించాలన్నది 2004-06 మధ్య కాలంలో ఆయన సమర్పించిన నివేదికలలో చేసిన సిఫార్సులలో ఒకటి. దానిని ఇప్పుడు అమలు చేశామని మోడీ, బిజెపి నేతలు చెబుతున్నారు. దీన్ని అమలు జరిపేందుకు ప్రభుత్వానికి పదిహేను వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని కేంద్రహోం మంత్రి రాజనాధ్‌ సింగ్‌ ప్రకటించారు. ఇంత స్వల్ప భారం మాత్రమే పడేదానికి నాలుగు సంవత్సరాలు ఎందుకు పట్టిందన్నది ప్రశ్న.

ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రచారం, వాదన, ధరల నిర్ణయానికి తీసుకున్న ప్రాతిపదికలు మోసపూరితమైనవని ఆలిండియా కిసాన్‌సభ వంటి సంస్ధలు పేర్కొన్నాయి. ఎన్నికల తాయిలం అని కాంగ్రెస్‌ పేర్కొన్నది. క్వింటాలు ధాన్యం వుత్పత్తికి రైతుకు రు.1166 ఖర్చు అవుతుందని లెక్కగట్టి దాని మీద యాభైశాతం కలిపితే రు. 1750 వచ్చేందుకు గాను గత ఏడాది వున్న ధరమీద 200 రూపాయలు పెంచారు. ఇలాగే మిగతా పంటల ధరలను నిర్ణయించారు. వివిధ రాష్ట్రాలలో ఒకే పంటల వాస్తవ సాగు వ్యయం భిన్నంగా వుంటుంది. అందువలన కేంద్రం ప్రాతిపదికగా తీసుకున్న ధర శాస్త్రీయమైనది కాదన్నది స్పష్టం. తెలంగాణాలో వాస్తవ వ్యయం క్వింటాలుకు రు2,158 అని వ్యవసాయశాఖ లెక్క కడితే కేంద్రం తీసుకున్న సగటు ప్రాతిపదిక రు. 1166, నిర్ణయించిన ధర రు. 1745. ఇలాగే అన్ని పంటల విషయంలోనూ జరిగింది. పత్తి (పొట్టి, మధ్య రకం పింజ) సాగు ఖర్చు రు.3433 గా లెక్కించి మద్దతు ధరను రు.5150గానూ పొడవు పింజ( తెలుగు రాష్ట్రాలలో పండించే రకాలు)కు రు.5450గా నిర్ణయించారు. ఇవి వాస్తవ ఖర్చును ప్రతిబింబించేవి కాదన్నది వేరే చెప్పనవసరం లేదు.

ధరల నిర్ణయ ప్రాతిపదికలోపాల తీరుతెన్నులను చూద్దాం.వ్యవసాయ ధరల, ఖర్చుల కమిషన్‌(సిఏసిపి) వ్యవసాయ ఖర్చును లెక్కించేందుకు ఎంచుకున్న పద్దతిలోనే లోపం వుంది. అది మూడు రకాలగా ఖర్చులను చూపింది. వుదాహరణకు ధాన్య వుత్పత్తికి అది రు.865 వాస్తవ ఖర్చు ఎ2, రు.1166 వాస్తవ ఖర్చు ఎ2 ప్లస్‌ రైతు శ్రమ ఎఫ్‌ఎల్‌, రు 1560 సి2( దీనిలో వాస్తవఖర్చు ఎ2, రైతు శ్రమ ఎఫ్‌ఎల్‌, కౌలు, బ్యాంకు వడ్డీలు, ఇతరాలు సి2, అన్నీ వున్నాయి.) గిట్టుబాటు ధర నిర్ణయించేటపుడు ప్రభుత్వాలు సి2ను పరిగణనలోకి తీసుకోవాలి. దానికి బడుదు ఎ2ప్లస్‌ ఎఫ్‌ల్‌ 1166ను మాత్రమే తీసుకొని దానిలో యాభైశాతం కలిపితే వచ్చే మొత్తాన్ని కేంద్రం నిర్ణయించి, ఇదే గిట్టుబాటు ధర, మా వాగ్దానాన్ని నెరవేర్చామని చెబుతోంది. సి2ను పరిగణనలోకి తీసుకుంటే ధాన్యం ధర రు.2,340 కావాలి. కానీ కేంద్రం రు.1750,1770 వంతున నిర్ణయించింది. అన్ని పంటలకూ ఇదే తీరు. పత్తికి రు 6,771కి గాను 5150,5450 వంతున నిర్ణయించింది.కేరళ ధాన్యానికి క్వింటాలుకు రు.780 బోనస్‌గా ఇస్తోంది.1016-17లో కేరళలో రోజు వారీ వ్యవసాయ కార్మికుల సగటు వేతనం రు. 673 కాగా దేశ సగటు 270, అంతకంటే ఎక్కువగా తమిళనాడు 411, హిమచలప్రదేశ్‌ 394, హర్యానా 365, పంజాబ్‌ 314, కర్ణాటక 318, రాజస్ధాన్‌ 281, ఆంధ్రప్రదేశ్‌ 276లు దేశ సగటు కంటే తక్కువగా పశ్చిమ బెంగాల్‌ 259, మహారాష్ట్ర 258, అసోం 256, యుపి 249, బీహార్‌ 230, గుజరాత్‌ 223, ఒడిసా 217 ఎంపీ 202 ఇస్తున్నాయి. ఇలాంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా దేశమంతటికీ రూళ్ల కర్ర సిద్ధాంతాన్ని అమలు జరపటం శాస్త్రీయం అవుతుందా?

కనీస మద్దతు ధరలను నిర్ణయించటం ఒక ఎత్తు. దానిలో లోపాల సంగతి చూశాము. వాటిని అమలు జరిపే యంత్రాంగం లేదు, ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్దలు అరకొరగా కొనుగోళ్లు, అదీ ప్రయివేటు మార్కెట్‌ కనుసన్నలలో మాత్రమే చేస్తున్నాయి. కొన్ని పంటల ధరలు కనీస మద్దతు కంటే ఎక్కువ వుంటున్నాయి. వుదాహరణకు పత్తి విషయం తీసుకుందాం. కనీస మద్దతు కంటే ధరపడిపోయినపుడు సిసిఐ రంగంలోకి వచ్చి మద్దతు ధరకే పరిమితం అవుతోంది. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సిఏసిపి) 2018-19 ఖరీఫ్‌ నివేదికలో అందచేసిన వివరాల ప్రకారం 2013-17 మధ్య ఐదు సంవత్సరాల కాలంలో క్వింటాలు ముడి పత్తి(పొట్టి పింజ) కనీస మద్దతు సగటు ధర రు. 3,763. ఇదే కాలంలో దేశీయ మార్కెట్లో రైతుకు వచ్చిన సగటు ధర రు. 4616, అంతర్జాతీయ మార్కెట్లో లభించినది రు.4674. అంటే కనీస మద్దతు ధర మార్కెట్‌ ధర కంటే తక్కువగానే వుంది. కొన్ని త్రైమాసిక సగటు ధరలను చూసినపుడు కొన్ని సార్లు దేశీయ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే ఎక్కువగానూ, కొన్నిసార్లు తక్కువగానూ వున్నాయి. ఐదేండ్ల సగటు స్వల్పంగా ఎక్కువగా వున్నాయి. ప్రభుత్వ విధానాలు కూడా కొన్ని సార్లు రైతాంగాన్ని దెబ్బతీస్తున్నాయి.

ప్రభుత్వ నియంత్రణల విధానానికి స్వస్తిపలికినట్లు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడిన వుదంతాలు వున్నాయి. గత ఎన్‌డిఏ పాలనా కాలంలో 2001జూలై నుంచి పత్తి ఎగుమతులపై పరిమాణ ఆంక్షలను ఎత్తివేసి సాధారణ ఎగుమతుల జాబితాలో చేర్చారు. దేశీయంగా ధరలు పెరుగుతుండటంతో మిల్లు యజమానుల వత్తిడికి లంగిన యుపిఏ సర్కార్‌ 2010 ఏప్రిల్‌లో క్వింటాలు పత్తి (దూది) ఎగుమతిపై రు.2500 సుంకం విధించి నిరుత్సాహపరచింది. ఎగుమతులను పరిమితుల ఆంక్షల జాబితాలో పెట్టింది. అదే ఏడాది ఆగస్టు నెలలో ఎలాంటి పన్ను లేకుండా ఎగుమతులను అనుమతించింది. ఒక వైపు ఎగుమతులతో పాటు దిగుమతులను కూడా మన సర్కార్‌ ప్రోత్సహించింది. కొన్ని సంవత్సరాలు ఐదు, పదిశాతం దిగుమతి విధిస్తే కొన్నేండ్లు ఎలాంటి పన్ను లేకుండా అనుమతించింది. ఈ చర్య రైతాంగంపై ప్రతికూల ప్రభావం చూపింది. మన పత్తి ఎగుమతులలో ఎగుడుదిగుడులు కూడా రైతాంగానికి లభించే ధరపై ప్రభావం చూపుతున్నాయి. గరిష్టంగా 2013-14లో గరిష్టంగా 18.6లక్షల టన్నుల పత్తి ఎగుమతి జరిగింది. అది 2016-17 నాటికి 9.1లక్షలకు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం చైనా దిగుమతులను గణనీయంగా తగ్గించిందని చెబుతున్నారు. అది వాస్తవమే అయినప్పటికీ నరేంద్రమోడీ సర్కార్‌, సంఘపరివార్‌ నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటం పత్తి దిగుమతులపై ప్రభావం చూపిందా అన్న కోణంలో కూడా ఆలోచించటం అవసరం. వ్యవసాయ మన రైతాంగానికి గిట్టుబాటు గాకపోవటానికి ప్రభుత్వాలు పెట్టుబడిని తగ్గించటమే. దిగుబడులు పెంచటానికి అవసరమైన వంగడాల సృష్టికి ఖర్చుతోకూడిన పరిశోధనలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇవ్వటం లేదు. ఫలితంగా పత్తి దిగుబడి హెక్టారుకు మన దేశంలో గత పది సంవత్సరాలలో 5 నుంచి4.8 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రపంచ సగటు ఎనిమిది క్వింటాళ్లు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో 35.9 నుంచి 19.1శాతం వరకు దిగుబడులు తగ్గటం గమనించాల్సిన అంశం. 2008-12 మధ్య దేశ సగటు దిగుబడి ఐదు క్వింటాళ్లు కాగా తెలుగు రాష్ట్రాలలో 5.4 వుంది, అదే 2013-17 మధ్య దేశ సగటు 4.8 కాగా తెలుగు రాష్ట్రాలలో 4.4కు పడిపోయింది. పంటల దిగుబడులలో మన దేశం చాలా వెనుక బడి వుంది. ఇది కూడా మన రైతాంగాన్ని దెబ్బతీస్తోంది.(హెక్టారుకు కిలోలు)

పంట             ప్రపంచ సగటు     గరిష్టం               భారత్‌                రాష్ట్రాలు

ధాన్యం           4,636.6      చైనా6,932.4      2,400.2      పంజాబ్‌ 3974.1

మొక్కజన్న     5,640.1      అమెరికా10960.4  2,567.7      తమిళనాడు 7010

పప్పులు         731.2       ఆస్ట్రేలియా 5540.3    656.2       గుజరాత్‌ 931

కందిపప్పు       829.9      కెన్యా 1612.3         646.1       గుజరాత్‌ 1124.8

సోయాబీన్స్‌      2,755.6    అమెరికా 3,500.6     738.4         ఎంపి 831

వేరుశనగ      1,5,90.1      అమెరికా 4118.6       1,464.9  తమిళనాడు 2,574.3

ప్రపంచ మార్కెట్లో మన మొక్కజన్నల కంటే రేట్లు తక్కువగా వుండటంతో ఇటీవలి కాలంలో దాదాపు మొక్క జన్నల ఎగుమతి ఆగిపోయింది. 2012-13లో 47.9లక్షల టన్నులు ఎగుమతి చేస్తే 2016-17 నాటికి 5.7లక్షల టన్నులకు పడిపోయింది. పప్పు ధాన్యాలన్నీ అంతర్జాతీయ ధరలకంటే మన దేశంలో ఎక్కువగా వుండటంతో తక్కువ ధరలకు వ్యాపారులు దిగుమతిచేసుకుంటున్నారు. మన మార్కెట్లో కనీస మద్దతు ధర కూడా గతేడాది రైతాంగానికి రాలేదు. గత రెండు సంవత్సరాలలో బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధరలకంటే తక్కువకే రైతాంగం అమ్ముకోవాల్సి వచ్చింది. గత రెండు సంవత్సరాలలో పప్పుధాన్యాల ధరలు కనీస మద్దతు కంటే మార్కెట్లో తక్కువ వున్నాయి. వాటిని అమలు జరిపిన దిక్కులేదు. మన వ్యవసాయ ఎగుమతులు 2013-14 నుంచి 2016-17వరకు 268.7 నుంచి 233.6 బిలియన్‌ డాలర్లకు పడిపోగా, దిగుమతులు 109.7 నుంచి 185.3 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.

చివరిగా మోడీ సర్కార్‌ ప్రకటన ఎన్నికలకోసం చేసినదని స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి జిమ్మిక్కులు గత యుపిఏ ప్రభుత్వం చేసింది. అది నడచిన బాటలోనే ఎన్‌డిఏ నడుస్తోంది. వుదాహరణకు గత పద్దెనిమిది సంవత్సరాలలో పత్తి ధరలను పెంచిన తీరు చూద్దాం. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ అసలు రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసింది. 2000-01 నుంచి 2003-04 వరకు పొడవు పింజ పత్తి కనీస ధరను 1825,1875,1895,1925 మాత్రమే చేసింది. తరువాత అధికారానికి వచ్చిన యుపిఏ ఒకటి 2009 ఎన్నికలను దృష్టిలో వుంచుకొని 2007-08లో వున్న 2030 ధరను ఏకంగా 3000కు పెంచింది. తరువాత 3000,33300కు పెంచి తరువాత 2014 ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఆమొత్తాన్ని 4000 చేసింది.నరేంద్రమోడీ సర్కార్‌ దానిని 4050 నుంచి నాలుగు సంవత్సరాలలో 4,320కి పెంచి ఇప్పుడు రు.5450 చేసింది. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌, నరేంద్రమోడీ ఇద్దరూ దొందూ దొందే అంటే కరెక్టుగా వుంటుందేమో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

MSP for Rabi Crops of 2016-17 season

16 Wednesday Nov 2016

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

Minimum Support Prices, MSP, MSP for Rabi Crops, MSP for Rabi Crops of 2016-17 season

Cabinet approves enhanced MSP for Rabi Crops of 2016-17 season
Announces Bonus for Gram, Masur, Rapseed/Mustard and Safflower cultivation  

The Cabinet Committee on Economic Affairs, chaired by the Prime Minister Shri Narendra Modi has given its approval for the increase in the Minimum Support Prices (MSPs) for all Rabi Crops of 2016-17 Season. Further, to incentivise cultivation of pulses and oilseeds, in the country Government has announced a bonus on these crops, payable over and above the following approved MSP.

 

Commodity MSP for 2015-16 Season (Rs / Quintal) MSP approved for 2016-17 (Rs / Quintal) Increase
Absolute (Rs / Quintal) percentage
Wheat 1525 1625 100 6.6
Barley 1225 1325 100 8.2
Gram 3500 (includes bonus of Rs.75 per quintal) 4000 (includes bonus of Rs.200 per quintal) 500 14.3
Masur (Lentil) 3400

(includes bonus of Rs.75 per quintal)

3950 (includes bonus of Rs.150 per quintal) 550 16.2
Rapeseed / Mustard 3350 3700 (includes bonus of Rs.100 per quintal) 350 10.4
Safflower 3300 3700 (includes bonus of Rs.100 per quintal) 400 12.1

The approval to increase MSPs is based on the recommendations of Commission for Agricultural Costs and Prices (CACP) which while recommending MSPs takes into account the cost of production, overall demand-supply, domestic and international prices, inter-crop price parity, terms of trade between agricultural and non-agricultural sectors, the likely effect on the rest of the economy, besides ensuring rational utilization of production resources like land and water.

The recommendation of CACP being the expert body, are generally accepted as such.  However, to incentivise cultivation of pulses and oilseeds, the Cabinet has decided to give a bonus of Rs.200/- per quintal for Gram, a bonus of Rs 150/- per quintal for Masur/Lentil and a bonus of Rs 100/- per quintal each for Rabi oilseeds viz. Rapeseeds/Mustards and Safflower, over and above the recommendations of the CACP. There is an increasing gap between the domestic demand and supply of pulses and oilseeds as a result of which reliance on import is increasing. Government has, therefore, announced this bonus on pulses and oilseeds to give a strong price signal to farmers to increase acreage and invest for increase in productivity of these crops. The increase in cultivation of leguminous pulses and oilseeds will also have additional environmental benefits as these crops are less water consuming and help in nitrogen fixation in the soil.

Food Corporation of India (FCI) will be the designated central nodal agency for price support operations for cereals, pulses and oilseeds. To supplement the efforts of FCI, the National Agricultural Cooperative Marketing Federation of India Limited (NAFED), National Cooperative Consumers’ Federation (NCCF), Central Warehousing Corporation (CWC) and Small Farmers Agri – Business Consortium (SFAC) may also undertake procurement of oilseeds and pulses as per their capacity.

Background:

 Besides increase in Minimum Support Prices (MSP) of Rabi crops, Government has taken several farmer friendly initiatives. These, inter-alia, include the following:

  • The Government had declared a bonus, over and above the MSP, of Rs 75 per quintal for Rabi pulses of 2016-17 marketing season, a bonus of Rs. 425 per quintal for Kharif pulses viz. Arhar, Moong and Urad, a bonus of  Rs 200 per quintal for Sesamum and a bonus of Rs. 100 per quintal for Groundnut, Sunflower, Soyabean and Nigerseed.
  • A new crop insurance scheme ‘Pradhan Mantri Fasal Bima Yojana’ has been launched by the Government. Under this scheme, the premium rates to be paid by farmers; are very low- 2% of sum insured for all Kharif crops, 1.5% for all Rabi crops’ and 5% for commercial and horticulture crops. The new insurance scheme involves use of simple and smart technology through phones & remote sensing for quick estimation and early settlement of claims. The Government has also launched a Mobile App “Crop Insurance” which will help farmers to find out complete details about insurance cover available in their area and to calculate the insurance premium for notified crops.
  • The Government has also launched a scheme to develop a pan India electronic trading platform under ‘National Agriculture Market’ (NAM) aiming to integrate 585 regulated markets with the common e-market platform. Each State is being encouraged to undertake three major reforms – allow electronic trading, have a single license valid throughout the State and a single entry point market fee. It will also enable farmers to discover better prices for their produce. 221 markets in 11 States| have already been brought on the e-NAM platform.
  • Soil Health Cards are being issued to farmers across the country. These will be renewed every two years. The card provides information on fertility status of soil and a soil test based advisory on use of fertilizers. As on 30th September, 2016, 295.56 lakh Soil Health Cards have been distributed.
  • Under Pramparagat Krishi Vikas Yojna (PKVY), the Government is promoting organic farming and development of potential market for organic products.
  • The Pradhan Mantri Krishi Sinchai Yojana is being implemented with the vision of extending the coverage of irrigation ‘Har Khet ko Pani’ and improving water use efficiency ‘Per Drop More Crop ‘ in a focused manner with end to end solution on source creation, distribution, management, field application and extension activities.
  • Government is focusing on improving production and productivity of crops such as rice, wheat, coarse grains and pulses under the National Food Security Mission.
  • A dedicated Kisan Channel has been started by the Doordarshan to provide 24 x 7 information in the hands of farmers regarding weather updates, agri-mandi data etc.
  • Government is encouraging formation of Farmer Producer Organisations.
  • To stabilize prices of pulses and onions, Government has decided to create buffer stocks of pulses and has imported pulses and onions under the Price Stabilization Fund.
  • A handbook for women farmers ‘Farm Women Friendly Hand Book’ containing special provisions and package of assistance which women farmers can claim under various on-going Missions/ Submissions/ Schemes of Department of Agriculture] Cooperation & Farmers Welfare has been brought out. Women farmers/beneficiaries could approach the nearest Project Director (ATMA) / Deputy Director (Agriculture) office at District or Block Technology Manager/Assistant Technology Managers at Block level for instant help and facilitation for availing the benefits.
  • With the above measures taken, the Government has set a target to double the farmers’ income by 2022.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

Enhancing Buffer Stock of Pulses to 20 LMT

12 Monday Sep 2016

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

Buffer Stock of Pulses, MSP, MSP of pulses, Pulses

Shri Ram Vilas Paswan, Minister of Consumer Affairs, Food and Public Distribution today here brief the media about the initiatives taken by the Government to check the price rise of pulses.

The Minister said that the main reason for unprecedented price rise in pulses has been two years of deficit rainfall and consequently drought-like situation in the entire country. Due to this, the production of pulses was less as compared to that in previous years, as a result of which there was huge demand-supply gap. This provided an opportunity for middlemen and hoarders to stock and speculate the price of pulses.

Highlighting the statistics, the Minister said that the production of pulses sharply declined from 192.5 LMT in the year 2013-14 to 171.4 LMT in 2014-15 and to around 165 LMT in 2015-16. Though the import figures increased to 45 LMT in 2014-15 and 58 LMT in 2015-16, there was a net deficit in supplies.

Shri Paswan said that fortunately, this year, there has been good rainfall and the acreage of pulses has gone up. It is expected that the production of pulses will exceed 200 LMT in the year 2016-17.

The Minister said that Government took various steps to check rising prices of pulses by banning export and allowing import of pulses at zero duty. In the last two years MSP of pulses has been increased considerably by providing bonus. The MSP for Arhar was increased from Rs. 4350 per qtl. in the year 2014-15 to Rs. 4625 per qtl. in the year 2015-16. This year, the MSP of Arhar has been increased by Rs. 425 per qtl. and now it is Rs. 5050 per qtl. Similarly, in case of Urad the MSP now is Rs. 5000 per qtl., an increase of Rs. 650 per qtl. in two years. The MSP for Moong is Rs. 5225 per qtl., an increase of Rs. 625 per qtl. in the last two years.

Buffer Stock

Shri Ram Vilas Paswan said that Government took a decision to create buffer stock of 1.5 LMT pulses. However, looking at the trend of prices and demand-supply gap, it was increased to 5 LMT and then to 8 LMT. Now as per the decision of Cabinet Committee on Economic Affairs today, the buffer stock has been increased to 20 LMT. The salient features of buffer stock are as follows:

10 LMT will be created through domestic procurement operations to be undertaken by FCI, NAFED and SFAC.

10 LMT will be created through import of pulses which will be through G2G contract and/or spot purchase from the global market.

The stock position of buffer stock at present is 3 LMT, out of which 1.81 LMT is imported pulses and 1.19 LMT is domestic procurement.

The allocation of pulses from buffer stock would be made to States and Central Agencies.

Pulses would be released through Open Market Sales as well.

Professional agency for management of buffer stock may be engaged.

Shri Paswan said that all this has been possible due to personal intervention of Prime Minister who took the issue of price rise on high priority and formed a High Level Committee under the Chairmanship of Finance Minister. Enhancing the buffer stock to 20 LMT was one of the recommendations of this Committee, which the Cabinet Committee on Economic Affairs approved today.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కనీస మద్దతు ధరలు-నరేంద్రమోడీ వాగ్దానం-వాస్తవం !

10 Friday Jun 2016

Posted by raomk in AP NEWS, CHINA, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

cotton, cotton subsidies, minimum support price, MSP, narendra modi promises, narendra modi promises and facts, Paddy

ఎంకెఆర్‌

   నయా వుదారవాదం పౌరుల స్ధానంలో వినియోగదారులను, సమాజాలకు బదులు షాపింగ్‌ మాల్స్‌ను తయారు చేస్తుందని ప్రఖ్యాత సామాజికవేత్త నోమ్‌ చోమ్‌స్కీ చెప్పారు. అంతిమ ఫలితం ఏమంటే నైతికంగా దెబ్బతిని,సామాజికంగా శక్తి కోల్పోయిన పనిలేని వ్యక్తులతో కూడిన సమాజంగా మార్చివేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నయా వుదారవాదం ప్రపంచవ్యాపితంగా నిజమైన ప్రజాస్వామ్యానికి తక్షణ శత్రువు అని కూడా చోమ్‌స్కీ చెప్పారు.

     కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 2016-17 సంవత్సర ఖరీఫ్‌ పంటల మద్దతు ధరలపై ఇప్పటికీ నూటికి 70శాతం వరకు వ్యవసాయంపై ఆధారపడుతున్న, గిట్టుబాటు కాని రైతాంగం నుంచి ఎలాంటి స్పందన వెల్లడి కాకపోవటాన్ని బట్టి మన సమాజాన్ని కూడా నయా వుదారవాద భ్రమలు పట్టి పీడిస్తున్నాయా ? నరేంద్రమోడీ, అనుంగు అనుచరులలో ఒకరైన చంద్రబాబు, అవకాశం దొరక్క దూరంగా వున్న కెసిఆర్‌ వంటి వారిమీద కూడా వున్న భ్రమలతో రైతాంగం కనీస మద్దతు ధరలు ఒక లెక్కా అని లేదా గతంలో ప్రకటించిన ధరలతో ఒరిగిన ప్రయోజనం ఏముందనే నిరాశా నిసృహలతో మనం చేయగలిగిందేమీ లేదన్న నిర్వేదంతో గానీ పెద్దగా స్పందించటం లేదా ? వ్యవసాయం గిట్టుబాటు గాని రైతుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతుండటాన్ని బట్టి ప్రభుత్వాలపై వారిలో విశ్వాసం కలగలేదన్నది మాత్రం స్పష్టం.

     2022వ సంవత్సరానికి రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామని, వుత్పత్తి ఖర్చుపై 50శాతం ప్రతిఫలం చెల్లిస్తామని నరేంద్రమోడీ అండ్‌కో వాగ్దానం చేసిన విషయాన్ని మోడీ ప్రభుత్వ విజయగానాలతో మునిగి తేలుతున్న వారికి ఇష్టం లేకపోయినా ప్రస్తావించక తప్పదు. యుపిఏ ప్రభుత్వం రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత ఏ గ్రేడ్‌ ధాన్యం కనీస మద్దతు ధర 2009-10 సంవత్సరానికి క్వింటాలు ధర రు.1035లు నిర్ణయించింది, ఆ మొత్తాన్ని 2013-14కు 1345కు పెంచింది. అంటే ఐదు సంవత్సరాలలో 310రూపాయలు లేదా 30శాతం పెంచింది. గత మూడు సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్‌ ఆ మొత్తాన్ని 1345 నుంచి1510కి అంటే 165 దీన్ని శాతంలో చెప్పాల్సి వస్తే 12.26 వుంది. కాంగ్రెస్‌ హయాంలో సగటున ఏటా ఆరుశాతం పెంచితే బిజెపి నాలుగు శాతానికి పరిమితం చేసింది. కాంగ్రెస్‌ స్ధాయికి చేరాలంటేనే రాబోయే రెండు సంవత్సరాలలో 18 శాతం పెంచాలి. మరి తాను చెప్పిన 50శాతం పెంపుదల ఎన్నటికి నెరవేరేను ? ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకోవటమేనా ? ఇక్కడ కాంగ్రెస్‌ పేరును ప్రస్తావించటం అదేదో రైతాంగానికి ఒరగబెట్టిందనే ప్రశంశ కాదు. పోలికకు ఏదో ఒక గీటురాయి వుండాలి, లేదా చేసిన వాగ్దానాన్ని ఆచరణతో అయినా పోల్చాలి. మోడీ సర్కార్‌ తన విజయాలను గత కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్వాకాలతోనే పోల్చుకుంటున్నదనే పచ్చినిజం తెలిసిందే.

    రెండు తెలుగు రాష్ట్రాలలో వరి తరువాత వాణిజ్య పంటలలో ప్రధానమైన పత్తి విషయానికి వస్తే పొడవు పింజ రకాల మద్దతు ధర పైన పేర్కొన్న కాంగ్రెస్‌ కాలంలో మూడు నుంచి నాలుగు వేలకు అంటే 33శాతం పెంచగా మోడీ మూడు సంవత్సరాలలో నాలుగువేల నుంచి 4160కి అంటే నాలుగు శాతం మాత్రమే పెంచారు.అయినా సరే చంద్రబాబు నాయుడికి నవనిర్మాణదీక్ష, మహాసంకల్పం పేరుతో జగన్‌ పారాయణం, కెసిఆర్‌ సైన్యానికి కొత్తగా కోడండరాంపై విమర్శలు తప్ప మరేమీ పట్టటం లేదు. పోనీ ప్రతిపక్షాల సంగతి చూస్తే వాటికీ కనీస మద్దతు ధరలు ఒక అంశంగా కనిపించినట్లు లేదు.

   వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ప్రధానమైనవి. ప్రపంచీకరణ పుణ్యమా అని అవన్నీ బహుళజాతి గుత్త సంస్ధల వ్యాపార సరకులుగా మారిపోయి డాలర్ల ప్రాతిపదికన రేట్లు వసూలు చేస్తున్నారు. అందువలన కొద్దిపాటి తేడాలు తప్ప ప్రపంచంలో ఎక్కడైనా రైతాంగానికి వాటి ధరలు దాదాపు ఒకే విధంగా వుంటాయి. పెట్రోలు, డీజిల్‌ వంటి వాటిని దిగుమతి చేసుకున్న ధర కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశంలో పన్నులు ఎక్కువ విధించిన కారణంగా రైతాంగానికి పెట్టుబడి ఖర్చులు ఇంకా ఎక్కువ వుంటాయి. వస్తువులను యంత్రాలతో తయారు చేసుకోవచ్చు తప్ప ఆహార ధాన్యాలను పండించటం ద్వారా తప్ప యంత్రాల నుంచి తయారు చేసుకొనే పద్దతి ఇంకా రాలేదు. అందువలన ప్రతి ప్రభుత్వం రైతాంగానికి ఏదో ఒక రూపంలో రక్షణ కల్పించటం అనివార్యం. కానీ మన దేశంలో వున్న రక్షణలను తొలగిస్తున్నారు, వ్య వసాయరంగంపై ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించివేస్తున్నారు. అనేక దేశాలలో వుత్పాదకతను పెంచటం ద్వారా ఆయా ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవటంతో పాటు వినియోగదారులకు సరసమైన ధరలకు ఆహార ధాన్యాలను అందిస్తున్నాయి. మన దేశంలో పరిస్ధితి అందుకు భిన్నంగా వుంది. కనీస మద్దతు ధరల పెంపు వాస్తవానికి అనుగుణంగా లేదని అంగీకరిస్తూనే అంతకంటే ఎక్కువగా వున్న వినియోగదారుల ప్రయోజనాలను గమనంలో వుంచుకోవాలనే వాదన ముందుకు తెస్తూ రైతాంగాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రభుత్వానికి వినియోగదారుల బాధ్యత కూడా వున్న మాట నిజమే. వుత్పాదకతను పెంచేందుకు అవసరమైన చర్యలు, పెట్టుబడులకు వినియోగదారులు ఏనాడైనా అభ్యంతరం చెప్పారా, వుత్పాదకత పెరిగితే తమకు ఇంకా తక్కువ ధరలకే ఆహార ధాన్యాలకు దొరికితే వారు సంతోషించరా ?

   అమెరికా వ్యవసాయ శాఖ రూపొందించిన నివేదిక ప్రకారం 2015లో వివిధ దేశాలలో వున్నధాన్య దిగుబడులు హెక్టారు(రెండున్నర ఎకరాలు)కు ఇలా వున్నాయి. పత్తి వివరాలు ఇండెక్స్‌ మండీ నుంచి తీసుకున్నవి. పత్తి దిగుబడులలో ఆస్త్రేలియా 1833,ఇజ్రాయెల్‌ 1633, మెక్సికో 1591, టర్కీ 1559 కిలోలతో తొలి నాలుగు స్ధానాలలో వున్నాయి.

దేశం       ధాన్యం టన్నులు     పత్తి కిలోలు

ఈజిప్టు         8.92                 740

అమెరికా       8.37                 862

చైనా           6.89                1524

బ్రెజిల్‌         5.52                1530

బంగ్లాదేశ్‌      4.40                605

శ్రీలంక        3.96                 218

పాకిస్తాన్‌      3.67                 560

భారత్‌         3.61                517

    మన దేశ రైతాంగం ఇంత తక్కువ దిగుబడులు, పెరుగుతున్న ఖర్చులతో ఎలా తట్టుకోగలదు ? అందువలన విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు ఎన్నో రాయితీలు ఇస్తూ ఎర్రతివాచీ పరుస్తున్న ప్రభుత్వాలు మన వ్యవసాయం స్వయం సమృద్ధం కావాలన్నా, ఎగుమతులు చేసి విదేశీ మారక ద్రవ్యం సంపాదించాలన్నా వ్యవసాయానికి మద్దతు,పెట్టుబడులు మినహా మరో మార్గం లేదు.

    2012,13 సంవత్సరాలలో అంతర్జాతీయ మార్కెట్‌లో ధాన్యం క్వింటాలు రు. 1900పైగా పలికిన సమయంలో మన ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రు.1080 మాత్రమే. ఎగుడుదు దిగుడులు వున్నప్పటికీ అంతర్జాతీయ ధరలు మన కనీస మద్దతు ధరల కంటే ఎప్పుడూ ఎక్కువే వుంటున్నాయి. ఎగుమతులు చేయాలంటే మనతో పోటీ పడే వారికంటే తక్కువ ధరకు అమ్మాలి కను మద్దతు ధరలను తక్కువగా వుంచుతున్నారు. అందుకోసం మన రైతాంగాన్ని బలిపెట్టాల్సిన అవసరం ఏముంది?

     ఈ ముఖ్యమైన సమస్యను పరిష్కరించకుండా మన వ్యవసాయ ఖర్చుల, ధరల కమిషన్‌ కొన్ని చిట్కాలను రైతుల ముందుంచుతున్నది. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే మరింత యాంత్రీకరణ చేయమని చెబుతున్నది. మన దేశంలో ఏటేటా యంత్రాల వినియోగం పెరుగుతూనే వుంది. అదే సమయంలో ప్రతి ఏటా మద్దతు ధరలు, మార్కెట్‌ ధరలు రైతాంగానికి న్యాయం చేయటం లేదన్న సంగతి తెలిసిందే. అనేక అభివృద్ధి చెందిన దేశాలలో మన కంటే ఎంతో ఎక్కువగా యంత్రాలను ప్రవేశపెట్టినా రైతాంగానికి గిట్టుబాటు గాక అనేక రాయితీలు కల్పిస్తున్న విషయాన్ని గమనించాలి. రెండవది సామాజిక కోణం వైపు నుంచి చూసినపుడు వ్యవసాయంలో యంత్రాలు ప్రవేశ పెట్టటం అంటే వ్యవసాయ కార్మికులకు దొరుకుతున్న పని రోజుల సంఖ్య తగ్గిపోవటమే. అందుకే గ్రామీణ ప్రాంతాలలో వుపాధి హామీ పనులకు డిమాండ్‌ పెరిగింది. ఈ పధకం వచ్చినప్పటి నుంచి తమకు చౌక ధరలకు దొరికే కూలీలు కరువుయ్యారని భూస్వాములు, ధనిక రైతులు దానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న విషయం తెలిసిందే. వారి వత్తిడి మేరకు అనేక చోట్ల ఆ పధకంలో ఇప్పుడు యంత్రాలను అనుమతిస్తూ గ్రామీణ ప్రాంతాలలో యంత్రాల యజమానుల లాభాల, ఆదాయ హామీ పధకంగా మార్చివేశారు.

     పత్తి రైతులు మన దేశంలో ఎంత దుస్థితిలో వున్నారో తెలిసిందే. చైనా ఎలా ఆదుకుంటున్నదో చూద్దాం. అంతర్జాతీయ పత్తి సలహా కమిటీ(ఐసిఎసి) 2015 డిసెంబరులో ప్రకటించిన నివేదిక ప్రకారం వివరాలు ఇలా వున్నాయి. దిగుమతి మొత్తాలు, విలువలను అదుపు చేయటం ద్వారా చైనా పత్తి వుత్పత్తిదారులకు మద్దతు ఇస్తున్నది. దిగుమతి కోటా పరిధిలోని పత్తి దిగుమతులపై 40శాతం పన్నులు విధిస్తున్నది.దీనికి తోడు పెద్ద ఎత్తున నిల్వలను నిర్వహిస్తున్నది. 2011-14 సంవత్సరాలలో చైనా అనుసరించిన పత్తి విధానం ప్రకారం కనీస మద్దతు ధరలను చెల్లించి పత్తి కొనుగోలు చేసింది.2013-14లో మద్దతు సేకరణ సగటున టన్ను 20,400 యువాన్లు లేదా పౌను అరకిలో దూది ధర 151 సెంట్ల చొప్పున 63లక్షల టన్నులు కొనుగోలు చేసింది. తరువాత విధానాన్ని మార్చింది. 2014-15లో టన్ను ధర లక్ష్యంగా 19,800 యువాన్లు లేదా పౌను 146 సెంట్లుగా నిర్ణయించింది. రైతులు ఇంతకంటే తక్కువకు అమ్ముకున్నట్లయితే ప్రభుత్వం ఆ తేడా మొత్తాన్ని రైతులకు నేరుగా చెల్లించే ఏర్పాటు చేసింది. పిల్లి నల్లదా తెల్లదా అని గాక అది ఎలుకను పడుతుందా లేదా అని చూడాలన్న సామెత మాదిరి పద్దతులు ఎన్ని మార్చినా అవి రైతాంగానికి ఏమేరకు వుపయోగపడ్డాయన్నది ముఖ్యం. ఆ విధంగా చూసినపుడు 2014-15లో గరిష్టంగా 8.2 బిలియన్‌ డాలర్ల మేరకు రైతులకు పలు రూపాలలో సబ్సిడీ అందించింది. అంతకు ముందు సంవత్సరం కంటే రెండు బిలియన్‌ డాలర్లు ఎక్కువ. మరి మన దేశంలో ఏం జరుగుతోంది. ఏదో ఒక పేరుతో ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకుంటోంది. సబ్సిడీలను ఎత్తివేసేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధలో వాగ్దానం చేసి వచ్చింది. రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామంటే నమ్మేదెలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏం చెప్పారు మోడీజీ వహ్వా ! వహ్వా !!

30 Wednesday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

BJP, Farm prices, Farmers, MSP, Narendra Modi, Narendra Modi Failures, narendra modi namo mantra, Narendra Modi sarkar

యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్‌ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పేసింది

ఎం కోటేశ్వరరావు

     2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేయటానికి ఏడు సూత్రాల పధకాన్ని రూపకల్పన చేసినట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.గతంలో రైతుల ఆదాయాల గురించి కాకుండా వ్యవసాయ వుత్పత్తులు పెరగటానికి ప్రాధాన్యత ఇచ్చారు. నేను దీన్ని ఒక సవాలుగా తీసుకున్నాను, కేవలం సవాలే కాదు మంచి వ్యూహాన్ని కూడా రచించాను, పకడ్బందీగా రూపొందించిన కార్యక్రమాలు, తగినన్ని వనరులు, అమలులో సుపరిపాలన కారణంగా ఈ లక్ష్యాన్ని సాధించగలం అన్నారు. బ్లూమ్‌బెర్గ్‌ ఇండియా ఆర్ధిక

వేదిక కార్యక్రమంలో ప్రధాని ఈ విషయాలను చెప్పారు.ఆ ఏడు సూత్రాలు ఏవంటే

1. ఒక చుక్కనీటికి ఎంతో పంట లక్ష్యంగా సాగునీటి పధకాలకు భారీ బడ్జెట్‌

2. ఆహార ప్రక్రియ ద్వారా అదనపు విలువ చేకూర్చటం

3. 585 కేంద్రాలలో ఎలక్ట్రానిక్‌ ఫ్లాట్‌ ఫారాల ద్వారా ఒకే విధంగా వుండేట్లు చూడటం, జాతీయ వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటు

4. ప్రతి పొలం భూసారాన్ని బట్టి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు

5. భారీ పెట్టుబడులతో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటు ద్వారా పంట చేతికి వచ్చిన తరువాత నష్టాల తగ్గింపు

6.చెల్లించగలిగిన ధరలలో కొత్త పంటల బీమా పధకం

7. వ్యవసాయానికి అనుబంధంగా కోళ్లు, తేనెటీగలు, చేపల పెంపకాలకు ప్రోత్సాహం

    ఈ చర్యల ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు అవుతాయని ఎంతో విశ్వాసంతో వున్నట్లు ప్రధాని చెప్పారు. తన ప్రభుత్వ విధానాలు రైతుల కేంద్రంగా, నూతన ఆదాయ మార్గాలుగా వున్నాయని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌ స్వయంగా తనకు లేఖ రాసినట్లు ప్రధాని చెప్పారు.

     ప్రధాని త్వరలో అధికారానికి వచ్చిన రెండో వార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. నిజానికి ఒక చొక్కా విప్పి రెండో చొక్కా తగిలించుకున్నట్లుగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న మోడీ ఏకంగా ప్రధాని అయ్యారు. ఆందువలన ఆయనకు అనుభవం ప్రత్యేకంగా అవసరం వుందని ఆయనా అనుకోలేదు,జనం కూడా భావించలేదు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలలో రైతులకు వుత్పత్తి ఖర్చులపై కనీసం 50శాతం లాభం వుండేట్లు చూస్తామని బిజెపి తన ఎన్నికల వాగ్దానంలో పేర్కొన్నది. అది అమలులోకి రావాలంటే కనీస మద్దతు ధరల పెంపుదల, ఆ మేరకు అవసరమైతే ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దింపటం. రైతాంగానికి ఆ మేరకు ధరలు పెంచటానికి పార్లమెంటుతో పని లేదు, ప్రతిపక్షాల మద్దతు అంతకంటే అవసరం లేదు. అయినా నరేంద్రమోడీ సర్కార్‌ ఆ దిశగా యాభైశాతం ఒక్కసారిగా పెంచకపోయినా ఐదు సంవత్సరాలలో యాభై శాతం పెరిగేట్లుగా ఏటా పదిశాతం చొప్పున ఎందుకు పెంచలేదు. అంటే ప్రధాని మన్‌కి బాత్‌ వుపన్యాసం వినమని చెప్పటం తప్ప ఎదురు చూస్తున్న కిసానోంకి బాత్‌ గురించి చివరికి దేశానికి దిగివచ్చిన దేవదూత నరేంద్రమోడీ అని స్త్రోత్ర పారాయణం చేసిన మన వెంకయ్యనాయుడు కూడా ఎక్కడా సమాధానం చెప్పినట్లు మనకు తెలియదు.

     ప్రణాళికా సంఘం స్ధానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌కు వ్యవసాయంపై సలహాదారుగా వున్న అశోక్‌ గులాటీ ‘దేశంలో వున్న పరిస్థితి తీవ్రతను ఎన్‌డిఏ ప్రభుత్వం పూర్తిగా గ్రహించినట్లు లేదు, కొన్ని రాష్ట్రాలలో 20శాతం వరకు ఆహార ధాన్యాల వుత్పత్తి పడిపోయింది. ప్రభుత్వం నిరంతరం రైతాంగాన్ని ఆదుకొనే వ్యవస్ధను ఏర్పాటు చేయనట్లయితే 1960 దశకంలో మాదిరి ఆహార కొరత ఏర్పడే అవకాశం వుంది’ అని కొద్ది నెలల క్రితం వ్యాఖ్యానించారు.ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారమే అనేక వ్యవసాయ వుత్పత్తులకు రైతులు తక్కువ ధరలను పొందారు. గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు వ్యవసాయ ఖర్చుల మరియు ధరల కమిషన్‌(సిఏసిపి) ప్రకారం ఏ ఒక్క వుత్పత్తి ధర యాభైశాతం కాదు కదా ఆ సమీపంలో కూడా లేదు. అనేక రాష్ట్రాలలో ఆ ధరలు అమలు కాని స్ధితి కూడా వుంది. అసలు ఖర్చుల లెక్కింపు విధానమే లోపభూయిష్టం. జిడిపి లెక్కింపు విధానం, దారిద్య్రరేఖ ఎంత వుండాలి వుండకూడదు అని తర్జభర్జనలతో మార్పు గురించి ఆసక్తి చూపిన కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చే వ్యవసాయ ఖర్చుల లెక్కింపు విధానంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ప్రధాని తన మనసులోని మాటలో గానీ ఇతర చోట్లగానీ ఈ విషయంపై ఎందుకు నోరు మెదపరు ? తాజాగా ఆయన చెప్పిన ఏడు సూత్రాలలో కూడా ముఖ్యమైన ఈ అంశం చోటు చేసుకోలేదు. గతేడాది మన ప్రభుత్వం గోధుమలకు ఇచ్చిన ధర టన్నుకు 226 డాలర్లయితే ఇదే సమయంలో పాకిస్థాన్‌ చెల్లించిన ధర 320 డాలర్లు.

    రైతాంగానికి కనీస మద్దతు ధరలను పెంచకపోవటానికి కారణాలు ఏమిటి ? రైతులకు మద్దతు ధరలు పెంచితే వినియోగదారులకు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది కనుక పెంచవద్దని ప్రభుత్వ ఆర్ధికవేత్తలైన అరవింద్‌ సుబ్రమణ్యం, పంగారియా వంటి వారు జారీచేసిన హెచ్చరికలకు లొంగిపోయింది మోడీ సర్కార్‌.పోనీ ద్రవ్యోల్బణం పెరగ కుండా స్ధిరంగా వుందా అంటే ఆరునెలలకు ఒకసారి వుద్యోగులకు పెంచుతున్న కరువు భత్యమే లేదనేందుకు పక్కా నిదర్శనం. పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో 2012-13నుంచి 2017-18 మధ్య కాలంలో సగటున ఏడాదికి నాలుగు శాతం వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇంతవరకు వాస్తవంలో రెండుశాతానికి మించలేదు. కొత్త బడ్జెట్‌లోగానీ, నరేంద్రమోడీ ఎన్నికల సభలు, రైతుల సభలలో గానీ ఎక్కడా తమ ఎన్నికల వాగ్దానం గురించి కనీస ప్రస్తావన కూడా చేయకుండా ఆరు సంవత్సరాలలో ఆదాయం రెట్టింపు గురించి చెబుతున్నారు. అసలు విషయం ఏమిటి ?

     గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు ప్రభుత్వం వాగ్దానం చేసిన వ్యవసాయ ఖర్చులపై 50శాతం లాభం చేకూర్చేవిగా లేవంటూ రైతు సంఘాల కూటమి గతేడాది సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దానికి వివరణ ఇస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్‌ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పేసింది. అందుకే వ్యవసాయంతో పాటు కోళ్లు,చేపలు, తేనెటీగలు పెంచుకోండని నరేంద్రమోడీ వుచిత సలహాలు ఇస్తున్నారు. ఆయన పుట్టక ముందునుంచే రైతాంగం ఆ పని చేస్తున్నది.

    రోడ్లు వేసేందుకు విదేశాల నుంచి తెచ్చుకున్న అప్పులు చెల్లించేందుకు లేదా ఆ కంపెనీలు నిర్వహిస్తున్న టోల్‌ టాక్సును ద్రవ్యోల్బణం ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. విదేశీ అప్పులను మన రూపాయల్లో కాకుండా డాలర్లలో చెల్లిస్తున్నారు. వుద్యోగులకు ఆరునెలలకు ఒకసారి ద్రవ్యోల్బణం ప్రాతిపదికన కరువు భత్యం చెల్లిస్తున్నారు. అదే విధంగా అమలు జరిపినా లేకపోయినా పారిశ్రామిక కార్మికులు, ఇతరులకు కూడా ద్రవ్యోల్బణ ప్రాతిపదికన కరువు భత్యం నిర్ణయిస్తున్నారు. రూపాయి విలువ పతనమైతే రైతాంగం కొనే డీజిల్‌, పెట్రోలు, ఎరువులు, పురుగుమందులు ధరలు ఎప్పటికపుడు పెరుగుతాయి. విద్యుత్‌, బొగ్గు, వుక్కు వంటి సంస్ధల వుత్పత్తులకు కనీస లాభాలను నిర్ణయించే విధానం వుంది. కానీ రైతాంగం విషయానికి వచ్చే సరికి అడ్డగోలు వ్యవహారం తప్ప ఒక నిర్ణీత విధానం, ప్రాతిపదిక లేదు. ప్రతి పదిహేనురోజులకు ఒకసారి పెట్రోలు,డీజిల్‌ ధరలను సవరిస్తున్న కేంద్రం రైతాంగ వుత్పత్తులకు కొన్నింటికి అసలు మద్దతు ధరల నిర్ణయ విధానమే లేదు. వున్నవాటికి కూడా ఏడాదికి ఒకసారి నిర్ణయిస్తారు. అవి అమలు జరగనపుడు అమలు జరిపే యంత్రాంగం లేదు.ఎందుకీ పరిస్థితి?

    2015లో వార్షిక ఇంక్రిమెంట్లు గాక వుద్యోగులకు 13శాతం కరువు భత్యం పెరిగింది.అదే ధాన్యం కనీస మద్దతు ధర 3.25శాతం, గోధుమలకు 5.2శాతం పెరిగింది. విజయ మాల్య, కేంద్ర మంత్రి సుజనా చౌదరి వంటి వారి కంపెనీలు బకాయిలు చెల్లించకుండా వున్నపుడు ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ అనో పరిశ్రమలను ఆదుకొనే పాకేజి పేరుతోనో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు ఆదుకుంటున్నాయి. మరి వరుసగా కరువుల పాలవుతున్న రైతులకు ఇలాంటి పాకేజీలు ఎందుకు వుండవు?

    పప్పు ధాన్యాల ధరలు పెరిగాయని జనం గగ్గోలు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం వాటిని దిగుమతి చేసుకొనేందుకు 16వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీన్నే అప్పు చేసి పప్పుకూడు అంటారు. అదే మన రైతాంగానికి చెల్లిస్తే కావలసినన్ని పప్పులు పండించరా ? విలువైన మన విదేశీమారక ద్రవ్యం మిగులు తుంది, మనరైతుల జేబుల్లో నాలుగు డబ్బులు వుంటాయి. వాటిని ఇతర వస్తువుల కొనుగోలుకు వుపయోగిస్తారు కనుక, పరిశ్రమలు, వాణిజ్యాలు కూడా పచ్చగా వుంటాయా లేదా ? ఆ పని ఎందుకు చేయరు?

   పన్నెండవ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి లక్షా యాభైవేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు గొప్పగా చెప్పుకుంటారు. న్యూఢిల్లీ విమానాశ్రయ లావాదేవీలలో లక్షా 62వేల కోట్ల కుంభకోణం జరిగిందని కాగ్‌ పేర్కొన్నది . అరవై కోట్ల మంది రైతుల కుటుంబాల కంటే కొన్ని లక్షల మంది ప్రయాణించే విమానాశ్రయానికి ప్రాధాన్యత ఎక్కువ వున్నట్లు స్పష్టం కావటం లేదూ ? గత ప్రభుత్వ విధానాలతో పోల్చితే నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని మార్చిందేమీ లేదు. గత ఐదు సంవత్సరాలలో సగటున రోజుకు 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు తెలుపుతుండగా గతేడాది ఆ సగటు 52కు పెరిగింది. మరి తాజాగా నరేంద్రమోడీ ప్రకటించిన ఏడు సూత్రాలు ఈ సంఖ్యను తగ్గిస్తాయా?పెంచుతాయా? తగ్గించాలనే కోరుకుందాం .

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ ఎలాగూ నోరు విప్పరు, భక్తులైనా చెప్పాలి

04 Friday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Others, Prices

≈ Leave a comment

Tags

agrarian policy, Fertilizers, Fertilizers subcidies, kisan budget, MSP, Narendra Modi, NDA, urea

నేతి బీరలో నెయ్యి -మోడీ రైతు బడ్జెట్‌

మోడీ గారి రైతు సంక్షేమం గురించి చెప్పమని పరివారాన్ని అడిగితే మా దొరగారి వూరి మిరియాలు తాటికాయంత వుంటాయి బాబయ్యా అన్నట్లు తస్మదీయ మీడియా వంత సరేసరి.మోడీ భక్తులు ఇంకా మత్తు నుంచి బయటకు రాలేదు. ప్రతి పక్షాల విమర్శలు, మింగా కక్కలేని మిత్ర పక్షాల అవస్తలు, అధికార పార్టీ డబ్బాల సంగతి అలా వుంచుదాం. గత రెండు సంవత్సరాల నుంచి వారిని విస్మరించిన మోడీ సర్కార్‌  2016 బడ్జెట్‌ ద్వారా కేవలం రైతులకు క్షమాపణలు చెప్పిందా అని ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రిక ఒక శీర్షికతో వార్త ప్రచురించింది.

ఎం కోటేశ్వరరావు

       సుప్రసిద్ద లాయర్‌ అయిన కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అందమైన పదాలతో ఈనెల ఒకటిన ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌ గురించి కల్పించిన భ్రమలు లేదా ప్రచారంతో నిజంగానే రైతులు తమ ఆదాయాలు రెట్టింపు అవుతాయని ఆశపడుతున్నారు. తాను రావటమంటేనే రైతులకు మంచి దినాలు వచ్చినట్లని నరేంద్రమోడీ రెండు సంవత్సరాల క్రితం తెలిపారు. పాపం ఈ విషయం తెలియక లేదా చెడుదినాలు దాపురించి గాని స్వయంగా బిజెపి పాలనలోని మహారాష్ట్రలోనే మోడీ గద్దె నెక్కిన తరువాత 1130 మంది రైతులు బలవన్మరణం చెందారు. అదే రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ ఎంపీ గోపాల్‌ షెట్టి రైతులు ఆత్మ హత్య చేసుకోవటం ఒక ఫ్యాషన్‌గా మారిందని సెలవిచ్చారు. అది తమ పాలన అని కూడా మర్చిపోయారు పాపం. ఆత్మహత్యలు కొనసాగుతుండటంతో మహారాష్ట్రలోని 28 మంది మంత్రులు ఒకే రోజు పర్యటన జరిపి అసలేం జరుగుతోందో తెలుసుకొమ్మని ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ ఆదేశించారు.ఇదంతా మోడీ రైతు బడ్జెట్‌ ప్రకటించిన తరువాతే సుమా !

    మోడీ గారి రైతు సంక్షేమం గురించి చెప్పమని పరివారాన్ని అడిగితే మా దొరగారి వూరి మిరియాలు తాటికాయంత వుంటాయి బాబయ్యా అన్నట్లు తస్మదీయ మీడియా వంత సరేసరి.మోడీ భక్తులు ఇంకా మత్తు నుంచి బయటకు రాలేదు. ప్రతి పక్షాల విమర్శలు, మింగా కక్కలేని మిత్ర పక్షాల అవస్తలు, అధికార పార్టీ డబ్బాల సంగతి అలా వుంచుదాం. గత రెండు సంవత్సరాల నుంచి వారిని విస్మరించిన మోడీ సర్కార్‌ 2016 బడ్జెట్‌ ద్వారా కేవలం రైతులకు క్షమాపణలు చెప్పిందా అని ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రిక ఒక శీర్షికతో వార్త ప్రచురించింది. ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిన సూటూ బూటూ నలగ కుండా అలాంటి వారి మధ్యనే విదేశాలు, స్వదేశంలో తిరిగే ప్రధాని నరేంద్రమోడీ ఈ మధ్య కాలంలో తొలిసారిగా రైతుల గురించి మాట్లాడుతున్నారు. త్వరలో అనేక రాష్ట్రాలలో ఎన్నికలున్నాయి కదా అని ఎవరైనా అంటే వారి గోడు ఎవరు వినిపించుకుంటారు చెప్పండి. ప్రతివారికీ ఒక ప్రత్యేకత వుంటుంది. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ ద్వారా తాము చెప్పదలచుకున్నదానిని గోబెల్స్‌ మాదిరి పదే పదే చెప్పటం తప్ప ఎదుటివారి విమర్శలను విననట్లు ప్రవర్తించటం మోడీ గారికి బాగా అబ్బింది. అందుకే మన్‌కీ బాత్‌ పేరుతో నెల నెలా జన్‌కీ బాత్‌తో పని లేకుండా తాను చెప్పదలచుకున్నది చెబుతున్నారు.

    బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందు ఒడిషా, కర్ణాటకలోలో బిజెపి నిర్వహించిన రైతుల సభలో ప్రధాని ఒక విషయం చెప్పారు. అది కొందరికి స్వంత డబ్బాలాగా అనిపించవచ్చు, మరి కొందరికి ‘అబ్బ ఎంతబాగా చెప్పిండు’ అన్న పరవశం కూడా కలిగించవచ్చు. తన ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందంటూ చేసిన ఆరోపణల సందర్బంగా తన ప్రభుత్వం యూరియా దుర్వినియోగం కాకుండా దానికి వేపపూత పూస్తున్నందుకు అక్రమార్కులకు మంటగా వుందని, వారు తనను వ్యతిరేకిస్తున్నారని కూడా చెప్పారు.

   యూరియా మన దేశం నుంచి పక్కనే వున్న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు దొంగ రవాణా అవుతోందని చాలా కాలంగా వినిపిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే వుంటుంది కనుక దాన్ని అరికట్టటానికి మార్గాలు వెతకాల్సిన బాధ్యత కేంద్రంపై ఎక్కువగా వుంటుంది. ఒక్క యూరియా మాత్రమే ఎందుకు దుర్వినియోగం అవుతోంది, మిగతా ఎరువులు ఎందుకు తరలి పోవటం లేదు? దీని గురించి కూడా ప్రధాని చెప్పి వుంటే నిజాయితీగా వుండేది.

     అసలు విషయం ఏమంటే మన ప్రధాని నరేంద్రమోడీ (ప్రధానిగా) పుట్టక ముందే వేప పూత యూరియా తయారు చేస్తున్నారు. యూరియా నుంచి విడుదలయ్యే నైట్రోజన్‌ సామర్ద్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలంటే దానికి వేప పూత అవసరమని, అలాంటి యూరియా వలన దిగుబడులు పెరిగాయని కనుకొన్న మన శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు గత దశాబ్ది కాలంగా దాని వినియోగం, తయారీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఫలితంగా 2011-12లో 3.62 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు(ఎంఎంటి)గా వున్న వేప పూత యూరియా అమ్మకాలు 2013-14లో 6.34 ఎంఎంటికి పెరిగాయి. గత ప్రభుత్వమే వేప పూత యూరియా తయారీపై వున్న కొన్ని అంక్షలను తొలగించి సబ్సిడీ యూరియాను నూటికి నూరుశాతం వేప పూతతో తయారు చేయాలని స్వదేశీ వుత్పత్తిదారులను ఆదేశించింది. ఇతరంగా కూడా కనీసం 75శాతం వేప పూత యూరియా తయారు చేయాలని ఆదేశించింది.మోడీ అధికారానికి వచ్చిన 2014లో మన దేశంలో టన్ను యూరియా ధర 86.76 డాలర్లు వుండగా పాకిస్ధాన్‌లో 260.19, బంగ్లాదేశ్‌లో206.74, చైనాలో 264.82 డాలర్లుగా వుంది. అందువలన దొంగరవాణాను వేపపూత అడ్డుకుంటుందని చెబితే పిచ్చి బియ్యం పెడతానని బెదిరించే చిన్ననాటి అమ్మమ్మ కబుర్లు తప్ప మరొకటి కాదు.

     ఎరువుల ధరల విషయానికి వస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో డిఎపి ధర 2011 అగస్టు నెలలో 603 డాలర్లు వుండగా 2016 జనవరిలో 385 డాలర్లకు తగ్గింది. అదే మన దేశంలో 2010-11లో సగటున టన్ను ధర రు.10,750 వుండగా ఈ ఏడాది జనవరిలో 26 వేల రూపాయలు వుంది. ఇదే విధంగా ఎంఓపి ఇతర ధరల నియంత్రణ నుంచి తొలగించిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరిగాయి. యూరియా ధరలో పెద్ద మార్పులేదు. మిగతా దేశాలలో కూడా యూరియాఏతర ఎరువుల ధరలు పెరిగిన కారణంగా దొంగరవాణా లేదు. దీని అర్ధం ఈ కారణంగా మన దేశంలో యూరియా ధర పెంచమని కాదు, పెంచాలన్నా వీలు కాని స్ధితి అన్నది వేరే కధ.

      1997-98 వరకు డిఎపి, ఎంఓపి వంటి ఎరువుల ధరలు యూరియా కంటే కొంచెం తక్కువగానో ఎక్కువగానో వుండేవి. అందువలన రైతులు శాస్త్రవేత్తలు చెప్పినట్లు తగు పాళ్లలో వాటిని వినియోగించారు. తరువాత సబ్సిడీ భారాన్ని తగ్గించుకొనేందుకు నూట్రియంట్‌ ప్రాతిపదిక విధానాన్ని ఎప్పుడైతే అమలులోకి తెచ్చారో ఇతర ఎరువుల ధరలు యూరియా కంటే ఐదు రెట్ల వరకు పెరిగి అందుబాటులో లేకుండా పోయాయి.మన పాలకుల అసమర్ధత కారణంగా రూపాయి విలువ పతనమై అంతర్జాతీయ మార్కెట్‌లో డిఏపి, ఎంఓపి ధరలు తగ్గినా మన రైతాంగానికి పెద్దగా తగ్గలేదు.మరోవైపున సబ్సిడీ రద్దయింది.దీంతో రైతులు యూరియాను ఎక్కువగా వినియోగించటంతో రైతులకు నష్టదాయకమైన అనేక కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. అందువలన కాంప్లెక్స్‌ ఇతర ఎరువుల ధరలను యూరియా స్ధాయికి తగ్గిస్తేనే రైతాంగానికి అచ్చే దిన్‌ వచ్చినట్లు లేకుంటే పొలాల సారం దెబ్బతిని మరింతగా చచ్చే దినాలు వస్తాయి. గతేడాది ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ నిమిత్తం 72,447 కోట్లను ప్రకటించింది. ఎంత ఇచ్చిందీ తెలియదు. ఈ ఏడాది 70వేల కోట్లని పేర్కొన్నది. ఈ మొత్తంలో 51వేల కోట్ల రూపాయలు కేవలం యూరియాకు మాత్రమే ఇస్తున్నారు. మిగతా వాటిన్నింటికి కలిపి కేవలం 19వేల కోట్లే. ఇప్పుడు ఇస్తున్న సబ్సిడీని రైతుల వారీ లెక్కవేస్తే సాగు భూమి 14 కోట్ల హెక్టార్లుగా వున్నందున సగటున ఎకరానికి రెండువేల రూపాయలు వస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో వేసి ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని మోడీ సర్కార్‌ ఆలోచిస్తున్నది. ఇదే జరిగితే యూరియా ధరకు కూడా రెక్కలు వస్తాయని వేరే చెప్పనవసరం లేదు. దీని వలన కౌలు రైతాంగానికి అన్యాయం జరుగుతుంది. వారికి ఈ మాత్రం కూడా దక్కే అవకాశం లేదు. పది ఎకరాలు మించి పెద్ద రైతులకు సబ్సిడీ లేదన్నా లేదా తగ్గించి ఇస్తామన్నా వారి పొలాలను సాగు చేసే అరక్షిత కౌలుదార్లు అదనంగా ఖర్చు చేయాల్సిందే. నరేంద్రమోడీ ఈ విధానాలను సవరిస్తారా లేదా అనేదాన్ని బట్టి రైతుల సంక్షేమం వుంటుంది.అలాంటి సూచనేమీ బడ్జెట్‌లో లేదా ఆర్ధిక సర్వేలో లేదు కాబట్టి గత కాంగ్రెస్‌ బూట్లతోనే నడిచేందుకు పూనుకున్నారని అన్న వారిని దేశద్రోహులు అంటే కుదరదు.

     రైతుల నేటి దుస్ధితికి గత పాలకుల విధానాలే కారణమని బిజెపి విమర్శించింది. దానిలో ఎలాంటి తప్పు లేదు. 1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్ధిక విధానాలు లేదా నయా వుదారవాద విధానాలు దీనికి నూటికి నూరు పాళ్లు కారణం, ఈ కాలంలో వాటిని గతంలో ఐదు సంవత్సరాలు అమలు జరిపిన బిజెపి ఎన్‌డిఏ ప్రభుత్వానికి కూడా వాటా ఇవ్వక తప్పదు. ఇప్పుడు సమస్య ఏమంటే ఆ విధానాలను మార్చ కుండా మోడీ రైతాంగానికి మంచి దినాలను ఎలా తీసుకు వస్తారు? గుజరాత్‌ మోడల్‌ అన్నారు. దాని ప్రకారం పెట్టుబడులైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు మిగతా రాష్ట్రాల కంటే తక్కువకు , మద్దతు ధరలు ఎక్కువ ఇచ్చారా ? లేదు దేశ వ్యాప్తంగా ఒకే ధరలు. మొదటి బడ్జెట్‌లో విధానపరమైన అంశాలేమీ పేర్కొన లేదు. రెండు, మూడవ బడ్జెట్లలో కూడా వాటి ప్రస్తావనే లేదు. గత పాలకుల విధానాలు మార్చకుండా రైతాంగానికి రెట్టింపు ఆదాయం ఎలా కల్పిస్తారు? మంత్రదండం ఏమైనా వుందా ?

      మన వ్యవసాయ రంగం కుదేలవటానికి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవటానికి కారకులు ఎవరు? మహారాష్ట్ర బిజెపి ఎంపీ చెప్పిన ప్రకారమైతే ఆత్మహత్య కూడా ఒక ఫ్యాషన్‌గా మారింది.అంటే తమ ఆత్మహత్యలకు తామే కారకులు. పాలకుల విధానాలు ఎలా దెబ్బతీస్తున్నాయో ఎరువుల గురించి చెప్పుకున్నాము. ప్రకృతి వైపరీత్యాలైన అతి వృష్టి,అనా వృష్టి అందుకు తోడ్పడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు కడితే వుప్పు సముద్రం పాలవుతున్న గోదావరి జీవ జలాలతో లక్షలాది బీడు భూములు పచ్చపచ్చగా మారతాయని, విద్యుత్‌ వెలుగులు విరజిమ్ముతాయని ఎప్పటి నుంచో ఆ ప్రాంత ప్రజలు కలలు కంటున్నారు. రైతు బడ్జెట్‌ అని అనేక మంది కీర్తిస్తున్న ఆ ప్రాజెక్టును తామే నిర్మిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం గంగ శుద్ధికి రెండున్నర వేల కోట్ల రూపాయలు కేటాయించిన పోలవరానికి కేటాయించిన మొత్తం వంద కోట్ల రూపాయలు. ఈలెక్కన కేటాయింపులు జరిపితే అది పూర్తి కావటానికి మరో 50-60 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు.అయినా ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తలుపు చెక్కతో కాకపోయినా తమలపాకుతో కూడా అంటించి గట్టిగా మాట్లాడటానికి సాహసించటం లేదు. విరోధంతో కంటే స్నేహంతో సాధించుకోవాలని కబుర్లు చెబుతున్నారు. విరోధం తెచ్చుకోమని, తొడగొట్టమని ఎవరు చెప్పారు. కనీస నిరసన తెలపటం బాధ్యత కాదా? గుడ్డి కన్ను మూస్తే ఏమిటి తెరిస్తే ఏమిటి అన్నట్లుగా స్నేహంగా వుండి, కొంత మందికి కేంద్ర మంత్రి వర్గంలో వుద్యోగాలిప్పించి సాధించింది ఏముంది ? గంగ శుద్ధికి నిధులు ఇవ్వవద్దని చెప్పటం లేదు. అది ఈనాటి సమస్య కాదు, అంత తేలిక కూడా కాదని హైదరాబాదులో మూసీ, హుస్సేన్‌ సాగర్‌ శుద్ధి పధకాలు వెల్లడించాయి. ముందు గంగను కలుషితం చేస్తున్న వారిని అదుపు చేసిన చర్యలున్నాయా ? జనానికి అవసరమైన ఆహారాన్ని పండించే ప్రాజెక్టులకా మొదటి ప్రాధాన్యత లేక మరొకదానికా ?

      వ్యవసాయరంగ పునరుద్దరణ అంటే ఖాయిలా పడినదానిని తిరిగి పనిచేయించటానికి వివిధ పధకాలకు 35,984 కోట్ల కేటాయింపుతో పాటు పన్నులు వేసే అన్ని సేవలపై 0.5శాతం కృషి కల్యాణ్‌ సెస్‌ వసూలు ద్వారా సమకూరే మొత్తాన్ని రైతుల కోసం ఖర్చు చేస్తారు. అంటే జనంపై అదనపు భారాలు మోపుతారు. జనంలో రైతులు కూడా వుంటారు కనుక కొత్త పెన్షన్‌ పధకం ప్రకారం వుద్యోగులు, కార్మికులు తమ పెన్షన్‌కు తామే నిధులు సమకూర్చుకున్నట్లుగా రైతులు కూడా తమ కల్యాణానికి తాము కూడా తమ వంతు నిధులు సమకూర్చుకోవాలి. నూతన పంటల బీమా పధకం గురించి రైతాంగంలో ఎన్నో ఆశలు కల్పించారు.అది అమలులోకి వచ్చిన తరువాత గానీ అసలు విషయం అర్ధం కాదు. ఈ పధకం అమలుకు కేంద్రం-రాష్ట్రాలు చెరి సగం నిధులు భరించాలి. ఏడాదికి 17,600 మేరకు అవసరమౌతాయని అంచనా వేశారు. కానీ బడ్జెట్‌లో రు.5500 కోట్లు మాత్రమే ప్రకటించారు. అంటే ఈ ఏడాది పూర్తిగా అమలు జరగదని అనుకోవాలి.

   మరో ముఖ్య సమస్య కనీస మద్దతు ధరలు. అవి వున్నా రైతాంగానికి పెద్ద వుపయోగం లేకుండా పోతోంది. ఒక్క యూరియా తప్ప మిగతా పెట్టుబడులన్నీ విపరీతంగా పెరిగి పోయాయి. వాటితో పోలిస్తే మద్దతు ధరలు ఏ మూలకు చాలవు. వాటిపై తమ విధానమేమిటో ఇంత వరకు వెల్లడించలేదు.మిగతా అంశాలకు సంబంధించి రైతాంగానికి భారాలు తగ్గించే లేదా ఆదాయాలు పెంచే నిర్దిష్ట పధకాలు, విధానాలేవీ బడ్జెట్‌లో లేవు.ఫలానా సమస్యపై మాది ఫలానా విధానం అంటే దాని గురించి ఒక అభిప్రాయమో అభినందనో చెప్పవచ్చు. అదేమీ లేదు. వాటి గురించి కారణ జన్ముడిగా భావిస్తున్న నరేంద్రమోడీ నోరు విప్పరని తేలిపోయింది. కనీసం ఆయన శిష్య పరమాణువులు లేదా భక్తులైనా చెప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో భారత్‌ కంటే ధాన్యానికి మద్దతు ధర రెట్టింపు

10 Sunday Jan 2016

Posted by raomk in Farmers, INDIA, NATIONAL NEWS, Uncategorized

≈ Leave a comment

Tags

FAO, MSP, Rice price

ఎంకెఆర్‌

చైనాలో ధాన్య మద్దతు ధర క్వింటాలుకు వారి కరెన్సీలో 270 యువాన్లు, ఆ మొత్తాన్ని మన రూపాయల్లోకి మార్చుకుంటే 2,740. రైతే రాజు రైతు లేనిదే బతుకు లేదు అని నిత్యం కబుర్లు చెప్పే మన దేశంలో 2015-16 సంవత్సరానికి ధాన్య మద్దతు ధర రు.1410, 1460. భారత ఆహార సంస్ధ కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన వున్నత స్ధాయి కమిటీ నివేదిక(పేజీ 61) ప్రకారం 2014లో చైనాలో బియ్యం మద్దతు ధర టన్నుకు 505 డాలర్లు కాగా భారత్‌లో 330.2 డాలర్లు. ఫిలిప్పైన్స్‌లో అత్యధికంగా 580.5, ఇండోనేషియాలో 408.3, బంగ్లాదేశ్‌లో 388.1 డాలర్లు. ప్రపంచంలో ధాన్యం ఎక్కువగా పండే దేశం చైనా, మనది రెండో స్ధానం. ఇదే సమయంలో అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలలో మనం ప్రధమ స్ధానంలో వుంటే దిగుమతి చేసుకొనే దేశాలలో చైనా మొదటి స్ధానంలో వుంది. దీన్ని బట్టి ఏం అర్ధం చేసుకోవాలి.

మనం పది కోట్ల టన్నుల బియ్యం పండిస్తుంటే చైనా 14 కోట్ల టన్నులు .మనకంటే పది కోట్ల మంది ఎక్కువ వున్న చైనా తన జనాభాకు కడుపు నిండా తిండి పెట్టాలంటే పండించే రైతులకు ఎక్కువగా గిట్టుబాటు ధర చెల్లిస్తోంది. పండిన పంటకు తోడు విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటోంది. చైనా కమ్యూనిస్టు దేశం గనుక అక్కడ రైతులకు ఎక్కువ చెల్లిస్తారు, అలాగే జనానికి బలవంతంగా తిండి పెడతారు, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం కనుక మన రైతులకు తక్కువ ధరలు ఇచ్చి విదేశాలకు చౌకగా బియ్యం ఎగుమతి చేస్తారు, మన జనాన్ని తిండికి మాడుస్తారు అనే సమాధానం చెప్పుకోవాలి.

రెండు తెలుగు రాష్ట్రాలలో పండిన ధాన్యం త్వరలో మార్కెట్‌కు రాబోతున్నది. నాగార్జునసాగర్‌ ప్రాంతంలో నీరు లేక పంట లేదు. పండిన చోట రైతులకు ఎలాంటి ధర వస్తుందో తెలియదు. గతేడాది చేదు అనుభవాలే పునరావృతం అవుతాయా, పరిస్ధితి మెరుగుపడుతుందా అన్నది చూడాల్సి వుంది. డిసెంబరు మాసంతో 2015 ధాన్య సీజన్‌ ముగిసింది. పండిన పంట, మిగిలిన నిల్వలకు సంబంధించి తుది అంచనాలు వెలువడటానికి కొంత సమయం పడుతుంది. ప్రపంచంలో అనేక దేశాలలో ఎల్‌నినో ప్రభావం ధాన్య వుత్పత్తిపై పడింది.రెండవ పంట దిగుబడులు ఎలా వుంటాయో ఇంకా పూర్తిగా స్పష్టం కాలేదు. ఇప్పటికే 2015 గురించి తొలుత వేసిన అంచనా కంటే అక్టోబరు తరువాత రెండు మిలియన్‌ టన్నులు తగ్గింది. ప్రపంచ ఆహార సంస్ధ తాజా అంచనా పకారం 740 మిలియన్‌ టన్నుల ధాన్యం ప్రపంచంలో పండింది. గతేడాది కంటే 4మిలియన్‌ టన్నులు తక్కువ. ప్రతికూల వాతావరణ పరిస్ధితులు, ధరలు తగ్గటం వంటి పలు కారణాలు వున్నాయి. హెక్టారుకు 4.6టన్నులు సగటు దిగుబడి. ప్రతికూల పరిస్ధితులు ఆసియాలో ఎక్కువగా వున్నందున (మొత్తం వుత్పత్తి 670 మిలియన్‌ టన్నులు) 3.1మిలియన్‌ టన్నులు ఇక్కడే తగ్గింది. భారత్‌, మయన్మార్‌,నేపాల్‌,పాకిస్తాన్‌,ఫిలిఫ్పీన్స్‌లో తగ్గితే చైనా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఇండోనేసియాలో పెరిగింది. ఎక్కువగా దిగుమతి చేసుకొనే దేశాలలో పంట బాగా పండటం, కొన్ని ఆఫ్రికన్‌ దేశాలు ఆర్ధిక ఇబ్బందుల కారణంగా దిగుమతులను తగ్గించిన కారణంగా మొత్తం మీద దిగుమతులు కూడా తగ్గాయి.భారత్‌ విషయానికి వస్తే రికార్డు స్ధాయిలో 11.7 మిలియన్‌ టన్నులు ఎగుమతి చేసింది.

ఇక 2016 విషయానికి వస్తే గతేడాది కంటే అంతర్జాతీయ ఎగుమతులు స్వల్పంగా పెరిగి 45. మిలియన్‌ టన్నులకు చేరవచ్చని అంచనా వేశారు. అనేక అనిశ్చితలను ఊహిస్తున్నారు. భారత్‌లో సరఫరా కష్టంగా వుండటం, ధర పోటీకి అనుగుణంగా లేకపోవటం వలన ఎగుమతులు తగ్గవచ్చు. ప్రపంచ వినియోగం తగ్గుతుందని అంచనా.జపాన్‌, థాయ్‌లాండ్‌ వంటి చోట్ల బియ్యాన్ని పశువుల దాణాగా వినియోగించటం పెరిగే అవకాశం వుంది. ఈ ఏడాది తలసరి బియ్యం వినియోగం 54.6 కిలోలకు పెరుగుతుంది. తాజా అంచనాలను బట్టి ప్రపంచ బియ్యపు నిల్వలు 5.7 మిలియన్‌ టన్నులు తగ్గి 2016లో 166.4 మిలియన్‌ టన్నులకు పడిపోతాయి.

గతేడాది చివరి మూడు నెలల్లో ప్రపంచ బియ్యం ధరలు స్థబ్దుగా వున్నాయి. పెద్దమొత్తంలో మార్కెట్‌కు పంట రావటమే కారణం. ఈ కారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో బియ్యం ధరలు పడిపోయాయి. ఎఫ్‌ఏవో బియ్యం ధర సూచిక 199,196 పాయింట్ల సగటు వుంది. కొన్ని దేశాలలో సేకరణ పెరగటం, ప్రధాన కొనుగోలు దారులు ఆసక్తి చూపటం వంటి కారణాలతో డిసెంబరులో 197 పాయింట్లకు పెరిగింది.ఎఫ్‌ఏఓ అన్ని రకాల బియ్యపు సూచిక 2015లో 2007 తరువాత అత్యంత కనిష్ట స్ధాయి 211 పాయింట్లకు పడిపోయింది.అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 10.5శాతం తక్కువ. బాస్మతి వంటి రకాల ధరలు 31శాతం పడిపోయాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d