• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Prices

Most important demand is that of the CG employees is the minimum wage and fitment formula 

23 Thursday Jun 2016

Posted by raomk in Current Affairs, employees, INDIA, NATIONAL NEWS, Pensioners, Prices

≈ Leave a comment

Tags

7th CPC, 7th pay commission, CG employees, GOVERNMENT OF INDIA, minimum wage

 

“The formal announcement by the of the 7th CPC acceptance is likely to be made by the Government just before the 11th July strike by the CG employees indicating the actual minimum wage and fitment formula.”

7th CPC latest

Comrades,

The empowered committee of Secretaries headed by the Cabinet Secretary had discussion from past five months on the charter of demands raised by the staff side, The finance ministry is working out the financial implications arising out of the improved recommendations of the 7th CPC especially on the minimum wage and fitment formula being improved, granting two increment on promotion and having annual increment on 1st Jan and 1st July instead of just on 1st July. This will benefit a lot of persons on promotion. The other aspect is considering grant of advances, which the 7th CPC has recommended for abolition.

The formal announcement by the of the 7th CPC acceptance is likely to be made by the Government just before the 11th July strike by the CG employees indicating the actual minimum wage and fitment formula.

The cabinet Secretary will present the view of the empowered committee of Secretaries before the Union Cabinet meeting based upon the principle adopted in actual calculation of the minimum wage and fitment formula. The 7th CPC had adopted the Dr Aykroyd formula minimum wage is calculated on the basis of the 15th ILC norms. But erred in many aspects for example the average of prices of last 12 months was taken, The housing weight age , education weight age etc . The prices of essential items are rising from past many years, even in last six months the retail inflation is rising above 5.4%.

Secondly the prices quoted by the GOVERNMENT OF INDIA MINISTRY OF LABOUR & EMPLOYMENT LABOUR BUREAU CLEREMONV, SHIMLAHttp://Labourbureaunew.Gov.In/ , the Director of Economic & statics , Ministry of Agriculture and Farmers Welfare, Government of India, New Delhi & the retail market prices are varying .

If we calculate the minimum wage based upon the LABOUR & EMPLOYMENT LABOUR BUREAU taking prices as on 1st July 2015 the minimum wage works out to Rs 21,000 / and fitment formula works to 3.00. This will result in 34% wage hike without allowances.

If we calculate the minimum wage based upon the Director of Economic & statics , Ministry of Agriculture and Farmers Welfare, Government of India, New Delhi taking prices as on 1st July 2015 the minimum wage works out to Rs 23,000 / and fitment formula works to 3.30. This will result in 50% wage hike without allowances.

If we calculate the minimum wage based upon the retail market taking prices as on 1st July 2015 the minimum wage works out to Rs 28,000 / and fitment formula works to 4.00. This will result in 70% wage hike without allowances.

The most important demand is that of the CG employees is the minimum wage and fitment formula.

The Staff side had demand of minimum wage of Rs 26000/- & fitment formula of 3.71. Against this the 7th CPC had recommended minimum wage of Rs 18000/- & fitment formula of 2.57. The 7th CPC recommendations has provided only at 14% wage hike at Group “C” level it is only ranging from Rs 2240/- to Rs 3500/- increase per month, and at Group “B” level ranging from Rs 4000/- to Rs 6500/- increase per month. After deductions & income tax the net increase will be just from Rs 500/- to Rs 3000/- only.

This increase is lowest by any pay commission, hence vast changes are required as the prices of essential commodities have gone up and also the inflation rate has gone up.

Comrades it is the time to struggle, we should educate the members and prepare for struggle, so that we should get at least 50 % wage hike without allowances, as allowances are not taken into pension benefit.

Only struggle will get us benefit. Please don’t believe on rumours. Now it is now or never.

Comradely yours

(P.S.Prasad)
General Secretary

COC Karnataka

Source: www.karnatakacoc.blogspot.in

Share this:

  • Tweet
  • More
Like Loading...

పత్తి పంటపై కెసిఆర్‌ది తద్దినపు తంతా ?

27 Wednesday Apr 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Others, Prices

≈ Leave a comment

Tags

alternative crops, cotton, cotton cultivation, cotton subsidies, KCR, WTO

ఎం కోటేశ్వరరావు

     తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి కె. చంద్రశేఖరరావు ఏప్రిల్‌ 24వ తేదీన ఒక ప్రకటన చేశారు. ఒక విధంగా అది సాధారణం కాదు. రానున్న రోజుల్లో పత్తి పంట తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం వుంది కనుక రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సలహాయిచ్చారు. పత్తి ఎగుమతి సుంకాన్ని పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, నైరోబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్ధ సమావేశంలో పత్తి ఎగుమతులపై రాయితీలను రద్దు చేసే నిర్ణయంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా సంతకం చేశారని, అందువలన రానున్న రోజులలో పత్తి సంక్షోభం తీవ్రం కానుందన్నది ముఖ్య మంత్రి ప్రకటన సారాంశం.

    అసలేమీ పట్టించుకోకపోవటం కంటే ఆలస్యంగా అయినా మేలుకోవటం మంచిదే కదా అనే బి పాజిటివ్‌ (ప్రతిదీ మన మంచికే ) అనే దృక్పధానికి అనుగుణంగా వుందనుకుంటే కెసిఆర్‌ ప్రకటన ఓకే. మిగతా ముఖ్యమంత్రులు ఈ మేరకైనా మొక్కుబడి తీర్చుకున్నారో లేదో తెలియదు. బహుశా కేసిఆర్‌ ముఖ్య మంత్రి కాక ముందు ఒక్క తెలంగాణా రాష్ట్ర సాధన తప్ప మరొక విషయాన్ని పట్టించుకొని వుండరు. రాష్ట్రం వచ్చిన తరువాత మిగతా విషయాలన్నీ చూసుకుందామనుకొని లేదా చేసుకొందామని అనుకొని వుండవచ్చు. అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల తరువాత పత్తి రైతులను హెచ్చరించటం గుడ్డిలో మెల్ల. ఎనిమిది సంవత్సరాల వ్యవధిలో అంటే 2018 నాటికి భారత్‌ ఎగుమతులపై ఇచ్చే సబ్సిడీని క్రమంగా తగ్గించాలని, ఈ లోగా సబ్సిడీని పెంచరాదని ప్రపంచ వాణిజ్య సంస్ధ 2010లోనే భారత్‌ను కోరింది. అంటే పత్తి,పత్తి వుత్పత్తుల ఎగుమతులపై సబ్సిడీని కూడా ఎత్తివేయాల్సి వుంటుంది.

     అమెరికా అంటే వామపక్షాలు మినహా మన రాజకీయ పార్టీల నేతలకు అది సైకిలైనా, కారయినా, హస్తం, కమలం పువ్వయినా మరొకరికైనా మహా ప్రీతి. కొన్ని దేశాల వారు తొడకోసు కుంటే మనవారు మెడ కోసుకుంటారని యుపిఏ పాలనా కాలంలో అన్ని పార్టీల వారు కలసి అమెరికాతో ఒప్పందాలపై సై అంటూ పార్లమెంట్‌లో మైనారిటీ యుపిఏ ప్రభుత్వాన్ని గట్టెక్కించి మద్దతు పలికారు. అదే అమెరికా మన పత్తి సబ్సిడీలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా వత్తిడి తెస్తోన్న విషయాన్ని కూడా కెసిఆర్‌ తన ప్రకటనలో ఎందుకు పేర్కొనలేదో తెలియదు. బహుశా రాష్ట్రానికి అమెరికా నుంచి వచ్చే పెట్టుబడుల కోసం వ్యూహాత్మకంగా మౌనం దాల్చి వుంటారని మనం అనుకోవాలి.

    గతేడాది అక్టోబరు 29న కేంద్ర ప్రభుత్వం వస్త్రాలతో సహా వాణిజ్య వుత్పత్తుల ఎగుమతులపై ఇస్తున్న రాయితీలను పొడిగిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. అందుకు గాను కేటాయింపులను 18 నుంచి 21వేల కోట్ల రూపాయలకు పెంచినట్లు తెలిపింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత మన ఎగుమతులు దిగజారటం తప్ప పెరగని పూర్వరంగంలో ఈ చర్య తీసుకున్నారు. దీనిపై అమెరికాకు కోపం వచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో తలసరి ఆదాయం వెయ్యి డాలర్ల కంటే తక్కువ వున్నపుడు, ఆ దేశం నుంచి అన్ని రకాల వస్త్ర ఎగుమతులు వరుసగా ప్రపంచ వాణిజ్యంలో 3.25శాతం దాటితే ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధల ప్రకారం ఎగుమతి రాయితీలను రద్దు చేయాలన్న ఒక నిబంధనను అమెరికా వెలికి తీసి ఆ మేరకు ప్రపంచ వాణిజ్య సంస్ధకు ఫిర్యాదు చేసింది.ఆ తరువాతే నైరోబీలో జరిగిన సమావేశంలో కెసిఆర్‌ చెప్పినట్లు నిర్మలా సీతారామన్‌ సంతకం చేశారు. నిజానికి ఇది జరగబోతోందని గతేడాది జనవరిలోనే అధికార వర్గాలను వుటంకిస్తూ వార్తలు వచ్చాయి.(http://www.financialexpress.com/article/economy/textile-export-subsidy-under-wto-scanner/25566/

     ఇప్పుడు రైతులను హెచ్చరించిన ముఖ్య మంత్రి ఏడాది కాలంగా, కేంద్రం సంతకం చేసినపుడు ఎందుకు మౌనంగా వున్నట్లు ? ఇలాంటి సమస్యలపై టిఆర్‌ఎస్‌ పార్టీ లేదా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఇలా ఒక్కొక్క పంట సాగును మానివేస్తూ పోతూ వుంటే అప్పుడు కెసిఆర్‌ అండ్‌ కో ప్రభుత్వం ముందు పరిష్కరించాల్సిన సమస్యలే వుండవు, పోనీ ప్రత్యామ్నాయంగా మిగిలే పంటలేమి వుంటాయి? రైతులు ఏమైనా ఫరవాలేదనా ? అని ఎవరైనా అంటే వారు తెలంగాణా అభివృద్ధి వ్యతిరేకి అన్న ముద్ర సిద్ధంగా వుంటుంది కదా !

    కనీస మద్దతు ధరకంటే తక్కువ రైతాంగం అమ్ముకుంటున్నపుడు వారిని ఆదుకొనేందుకు చర్యలు తీసుకొని వుండుంటే అరే బయ్‌ ఇంక మనం చేయగలిగింది లేదు, వేరే పంటలు వేసుకోండి అంటే అర్ధం వుండి వుండేది. అదేమీ చేసినట్లు కనిపించటం లేదే ! మచ్చుకు గతేడాది నవంబరు మొదటి వారంలో పత్తి ధరలను చూసినపుడు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇటు తెలంగాణాలోనూ పెద్ద తేడాలేమీ లేవు. అంతకు ముందు కంటే తక్కువ లేదా స్ధిరంగా వున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. రైతాంగ ఆత్మహత్యలు ఎక్కడ ఎక్కువ ఎక్కువ తక్కువ అన్న చర్చలోకి పోనవసరం లేదు. ఒక అన్నదాత బలవన్మరణానికి పాల్పడినా అది పాలకుల విధానాల వైఫల్యం తప్ప మరొకటి కాదు.

   పత్తి పంట తమను అప్పుల వూబి నుంచి బయట పడవేస్తుందనే ఆశతో రైతాంగం సాగు చేస్తున్నారు. వారిని దాని నుంచి మళ్లించాలనుకోవటం తప్పుకాదు. మరికొద్ది వారాలలో సాగుకు సిద్ధం అవుతున్న తరుణంలో కేవలం ఒక ప్రకటనతో సరిపెట్టాల్సిన అంశంగా ప్రభుత్వం భావిస్తోందా ? గతేడాది పంట మొత్తం రైతుల చేతి నుంచి బయటకు పోయిన తరువాత అంతకు ముందుతో పోల్చితే పత్తి ధరలు పెరిగాయి. అందుకు అంతర్జాతీయ పరిస్థితులు కూడా తోడయ్యాయి. రైతాంగాన్ని మానసికంగా సిద్దం చేయాలంటే వారితో ప్రత్యక్షంగా చర్చించాలి, వున్న అనుమానాలను నివృత్తి చేయాలి. ప్రపంచ వాణిజ్య సంస్ధ, కేంద్ర ప్రభుత్వం, తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి మధనం జరపాలి. వేరే ప్రాంతాల మేథావులు తప్పుదారి పట్టిస్తారనుకుంటే తెలంగాణాలో కావాల్సినంత మంది వున్నారు. వారికే పరిమితం చేయవచ్చు. పత్తి విత్తనాల ధరల గురించి జరిగినంత చర్చ ప్రత్యామ్నాయ పంటల గురించి లేదంటే అతిశయోక్తి కాదేమో !

    ప్రత్యామ్నాయ పంటల గురించి ప్రతి ఏటా వ్యవసాయ ముద్రించే కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రి మొక్కుబడిగా వుంటోంది తప్ప రైతులను ఏమాత్రం ప్రభావితం చేయటం లేదు. రైతులు ప్రత్యామ్నాయంవైపు చూడాలంటే పత్తి కంటే అవి ఆకర్షణీయంగా వుండాలి. కనీసం తొలి సంవత్సరాలలో అయినా ప్రోత్సాహకాలు, మార్కెటింగ్‌ హామీ వుండాలి. ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి ఒక్కొక్కటిగా వైదొలుగుతున్న స్ధితిలో కేవలం ప్రకటనలు నమ్మి ముందుకు వస్తారా ? ఇప్పటికైనా పత్తి గురించి ఒక సమగ్రమైన శ్వేత పత్రాన్ని ప్రకటించి దానిని రాజకీయాలకు అతీతంగా చర్చించి రైతాంగం ముందుకు వెళ్లటం సముచితంగా వుంటుంది. లేకుంటే తద్దినపు తంతుగానే భావించాల్సి వుంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వచ్చేవి అచ్చేదిన్‌ కాదు జనానికి చచ్చే దినాలు : ప్రపంచ బ్యాంకు

26 Tuesday Apr 2016

Posted by raomk in Current Affairs, Economics, Farmers, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

Forecasts, gloomy days, World Bank

ఎంకెఆర్‌

   ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చేసిన అనేక వాగ్దానాలలో రెండు ప్రాధాన్యతగలిగినవి. ఒకటి విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వందరోజుల్లో వెనక్కు తెచ్చి ప్రతి వారి ఖాతాలో పదిహేనులక్షలు వేస్తామన్నది ఒకటి. రెండవది 2022 నాటికి రైతాంగ ఆదాయాలను రెట్టింపు చేస్తామన్నది మరొకటి. ఇవి రెండూ ఎంతో ముఖ్యమైనవి. మొదటి దాని గురించి అసలు సాబ్‌ అలా చెప్పలేదు అనే వారు కొందరు, ప్రాణ, విత్త, మాన భంగములందు అబద్దాలు చెప్పవచ్చు అన్నట్లుగా ఎన్నికల సమయంలో చెప్పిన వాటినన్నింటినీ అమలు జరపలేరంటూ సమర్ధించేవారు మరి కొందరు. ఇంకొందరున్నారు చెప్పినట్లు నల్లధనాన్ని వెనక్కు తీసుకురాలేకపోయినా కొత్తగా విదేశాలకు తరల కుండా చేశారంటారు. అయితే అది కూడా వాస్తవం కాదని, గత రెండు సంవత్సరాలలో కొత్తగా భారతీయులు బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు పనామా పత్రాలు వెల్లడించాయి కనుక అది కూడా వాస్తవం కాదని తేలిపోయింది. బహుశా వారికి అచ్చేదిన్‌ వచ్చి వుంటాయి. రెండవది రైతుల ఆదాయాలు రెట్టింపు చేయటం. ప్రపంచ వ్యాపితంగా వ్యవసాయ వుత్పత్తుల ధరలు పతనమౌతున్న తరుణంలో ఆదాయాలు రెట్టింపు చేస్తామని ఓట్లను కొల్ల గొట్టేందుకు నరేంద్రమోడీ చెప్పటం మరో నల్లధనం వెలికితీత వంటిదే. మోడీ అంతరంగమైన అమిత్‌ షా ఏదో మాయాజాలం చేసి వాగ్దానాలు అమలు చేస్తారు అని నమ్ముతున్నవారు ఇంకా వున్నారు. అయితే తాజాగా మంగళవారం నాడు ప్రపంచ బ్యాంకు 2016 జోశ్యం గురించి చేసిన ప్రకటన ఆ ఆశల మీద కూడా నీళ్లు చల్లింది.జనం మీద భారం మోపే చమురు ధరలు పెరుగుతాయన్నది ఒకటి. కోట్లాది మంది రైతులు నోట్లే రాబోయే రోజుల్లో కూడా మట్టే అని మరొకటి. జనవరి జోశ్యంలో 2016-17లో వ్యవసాయ వుత్పత్తుల ధరలు గతేడాదితో పోల్చితే 1.8శాతం పెరుగుతాయని ప్రపంచబ్యాంకు పేర్కొన్నది. మూడు నెలలు తిరిగే సరికి రెండవ సవరింపులో 2016లో 1.8, 2017లో 1.7శాతం మేరకు ధరలు పతనమౌతాయని పేర్కొన్నది. తదుపరి అంచనాలలో ఏం చెబుతుందో తెలియదు. ఇప్పుడు చెప్పిన రెండూ జనానికి అచ్చేదిన్‌ కాదు జనానికి చచ్చే దినాల రానున్నాయని వెల్లడిస్తున్నాయి.

    సరిగ్గా బ్యాంకు ఈ నివేదికను రూపొందిస్తున్న తరుణంలోనే ఇక నుంచి రైతులు తమ వుత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. అందుకు గాను ఏప్రిల్‌ 14న ‘ఇనామ్‌’ ప్రారంభించారు. దీన్ని ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ అని పిలుస్తున్నారు. రైతులు సమీప మార్కెట్లో అక్కడి వ్యాపారులు చెప్పిన అతి తక్కువ ధరలకు తమ వుత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తున్నదని ఇనామ్‌ ద్వారా కోరుకున్న ధరకు అమ్ముకొని అధికంగా సంపాదించుకోవచ్చని ప్రధాని ప్రకటించారు. తొలి దశలో ఎనిమిది రాష్ట్రాలలోని 22 మార్కెట్‌ యార్డులను అనుసంధానించారు.మొత్తం 585 వ్యవసాయ మార్కెట్‌ యార్డులను 2018 నాటికి పూర్తిగా అనుసంధానిస్తారు. అయితే ఇందుకు రాష్ట్రాలు చట్టాలను సవరించి అనుసంధానానికి ఆమోదం తెలపాల్సివుంటుంది. తొలి దశలో గుజరాత్‌, తెలంగాణా, రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, వుత్తర ప్రదేశ్‌, హర్యానా , జార్ఖండ్‌, హిమచల్‌ ప్రదేశ్‌కు చెందిన మార్కెట్లను అనుసంధానించారు. ఇరవై అయిదు రకాల పంటలను విక్రయించుకోవచ్చు. తొలి దశలో ఆయా రాష్ట్రంలోని మార్కెట్లలో మాత్రమే లావాదేవీలు జరుగుతాయి. వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో క్రయ విక్రయాల ద్వారా ఆయా రాష్ట్రాలకు ఆదాయం వస్తోంది. వాటిని కోల్పోవటానికి ఏ రాష్ట్రమూ అంగీకరించదు. అందువలన ఈ సమస్యను ఎలా పరిష్కరించేది చూడాల్సి వుంది. దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చన్న విధానం అమలులోకి రావటం అంత సులభం కాదని చెబుతున్నారు.

   గత కొద్ది సంవత్సరాలుగా వ్యవసాయ పంటలపై రైతాంగానికి వస్తున్న ఆదాయాలు పడిపోతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ విధానాలలో భాగంగా తమ బాధ్యతల నుంచి ఒక్కొక్క రంగం నుంచి క్రమంగా తప్పుకుంటున్నాయి. ఈ మార్కెట్లు కూడా దానిలో భాగమే. ఈ ఏడాది బడ్జెట్‌లో రైతాంగానికి పెద్ద పీట వేసినట్లు ప్రభుత్వం, మీడియా కూడా డబ్బా కొట్టాయి. బడ్జెట్‌ను అంకెల గారడీ అని కూడా వర్ణిస్తారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ 2022 రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని పదే పదే చెబుతున్నారు. దీనిలో రెండు అర్ధాలు వున్నాయి. ఒకటి ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఆ మేరకు రైతాంగ వుత్పత్తుల ధరలు పెరిగితే రైతులకు ఎక్కువ డబ్బు వచ్చినట్లు కనిపించవచ్చుగానీ అదే సమయంలో వారి పెట్టుబడులు కూడా అంతకంటే ఎక్కువ పెరుగుతాయి. స్ధిర ధరలలో పెరుగుదల ఎంత అన్నదే నిజమైన కొలబద్ద అవుతుంది. అలా జరగాలంటే ప్రభుత్వాలు అది కేంద్రమైనా, రాష్ట్రాలైనా ఎంత మేరకు బడ్జెట్‌ కేటాయింపులు జరిపాయన్నదానిని బట్టే వుంటుంది.

    ద్రవ్యోల్బణం కారణంగా గతేడాది కంటే విలువ తగ్గిన రూపాయల కేటాయింపు అంకెల్లో ఎక్కువగా కనిపించినా, దేశ స్ధూలాదాయంలో శాతాలలో చూస్తే గతేడాది కంటే వ్యవసాయంలో భాగమైన గ్రామీణ వుపాధికి కేటాయింపు 0.3శాతం తగ్గింది. వాటిలో గతేడాది బకాయిల మొత్తం, యంత్రాల వినియోగానికి అనుమతుల వంటి వాటిని చూస్తే వాస్తవానికి ఇంకా ఎక్కువ తగ్గుతుంది. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాలలో రైతుల ఆదాయంలో ఇది కూడా ఒక భాగంగా మారిన విషయం తెలిసిందే. అందువలన ఆదిలోనే హంసపాదు అన్నట్లు గ్రామీణ బడ్జెట్‌గా వర్ణించిన దానిలో దానికి ప్రాధాన్యత ఇవ్వలేదని తేలిపోయింది.

                                     వ్యవసాయ రంగంలో సంక్షోభం

     గత కొద్ది సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో సంక్షోభ తీవ్రత పెరుగుతోంది. అందువలననే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత కూడా రైతుల ఆత్మహత్యల తీవ్రత పెరిగింది తప్ప తగ్గటం లేదు.గత ఐదు సంవత్సరాలలో సగటున రోజుకు 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు తెలుపుతుండగా గతేడాది ఆ సగటు 52కు పెరిగింది.వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఏ హయాంలో వ్యవసాయరంగం తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నది. దానిని మరుగు పరచి దేశం వెలిగిపోతోంది అన్న ప్రచారంతో ఎన్‌డిఏ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటంతో తీవ్ర ఎదురు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే.సరిగ్గా అటు వంటి పరిస్థితి మరోసారి ప్రారంభమై దిగజారటం వేగం పుంజుకుంటున్న స్ధితిలో నరేంద్రమోడీ రైతాంగానికి ఆదాయాల రెట్టింపు వంటి అనేక ఆశలు చూపి అధికారంలోకి వచ్చారు. రైతాంగం సంక్షోభంలో భాగంగా రుణవూబిలో కూరుకుపోయిన కారణంగానే రుణాల రద్దు నినాదానికి ఆంధ్రప్రదేశ్‌లో రైతులు మొగ్గు చూపి చంద్రబాబు నాయుడికి పీఠం అప్పగించారు.

     2004ఎన్నికలలో ఎన్‌డిఏ రైతుల ఆగ్రహాన్ని చూసిన తరువాత కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నది. గ్రామీణ వుపాధి కార్యక్రమం దాని పర్యవసానమే. దీనికి తోడు ప్రపంచ వ్యాపితంగా వ్యవసాయ వుత్పత్తుల ధరల పెరుగుదల ప్రభావం మన దేశంపై కూడా పడి రైతుల ఆదాయాలు పెరిగాయి.అది మరో నిర్మాణ రంగం పెరుగుదలకు దోహదం చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వెళ్లిన వారికి వేతన రూపంలో ఆదాయాలు పెరగటానికి కూడా దారితీసింది. ఇది కొంత మేరకు సంక్షోభాన్ని పెరగకుండా చేసింది తప్ప పూర్తిగా పరిష్కరించలేదు. యుపిఏ రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత లోటు తగ్గింపు పేరుతో కోతలు విధించటం ప్రారంభించింది. ఇదే సమయంలో వ్యవసాయ వుత్పత్తుల ధరల పెరుగుదల ఆగిపోయి మరోసారి వెనుక పట్టు పట్టింది. బడ్జెట్‌ కోతలో భాగంగా వ్యవసాయానికి పెట్టుబడులు తగ్గాయి. 2010-11 నుంచి అప్పటి వరకు స్ధిరంగా వున్న వ్యవసాయ సంక్షోభం తిరిగి పెరగటం ప్రారంభమైంది. మోడీ హయాంలో ఇంకా పెరుగుతోంది. మాంద్యం లేదా సంక్షోభం తలెత్తినపుడు పెట్టుబడిదారులకు రాయితీలు తప్ప ప్రజా సంక్షేమానికి కోత పెడతారు. దానిలో వ్యవసాయం కూడా ఒకటని వేరే చెప్పనవసరం లేదు. వ్యవసాయ రంగం సంక్షోభంలో వున్న వర్తమాన తరుణంలో కొన్ని విభాగాలకు కొంత కేటాయింపులు పెంచినంత మాత్రాన రానున్న ఆరు సంవత్సరాలలో రైతుల అదాయాలు రెట్టింపు అవుతాయంటే అంతకంటే హాస్యాస్పదం మరొకటి వుండదు. నిజానికి ఎరువులు,డీజిల్‌, ఇతర పెట్టుబడులపై ఇస్తున్న రాయితీలను ఎత్తివేసిన తరువాత బడ్జెట్‌లో నామమాత్రంగా కేటాయింపులు పెంచినా దాని వలన రైతాంగానికి ఎలాంటి వుపయోగం వుండదు.

      నరేంద్రమోడీ సర్కార్‌ అన్ని రంగాలలో విదేశీ పెట్టుబడుల గురించి జపం చేస్తోంది. ఆయనను ప్రధాని గద్దెపై కూర్చొనేందుకు ఎంపిక చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ మరోవైపు స్వదేశీ జాగరణ మంచ్‌ పేరుతో కబుర్లు చెబుతోంది. ఆహార వుత్పత్తుల రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇస్తామని అరుణ్‌ జెట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పటం ఆచరణలో విదేశీ ఆదరణ మంచగా దేశాన్ని మార్చటమే. . ఇది చిన్న సన్నకారు రైతాంగానికేమీ వుపయోగపడదని ముఖ్యంగా పండ్లు, కూరగాయల రైతాంగానికేమీ ప్రయోజనం లేదని అనేక మంది నిపుణులు చెబుతున్నారు.ప్రభుత్వ రంగంలో పెట్టుబడులను పెంచితేనే వారికి లబ్ది చేకూరుతుంది. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు అంటే ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధన, పేదరిక నిర్మూలన కూడా ఇమిడి వుంది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించటం అంటే విదేశీ కార్పొరేట్‌, ప్రయివేటు శక్తులకు పెద్ద పీట వేయటమే. విదేశీ పెట్టుబడులు వ్యవసాయరంగంలో ప్రవేశించటం వాటి లాభాల కోసం తప్ప మన బాగుకోసం కాదు. బ్రిటీష్‌ వారు తమ ఆక్రమిత దేశాలైన భారత్‌, చైనా వంటి చోట్ల తమ లాభాల కోసం నల్లమందు సాగు, తయారీని ప్రోత్సహించి జనాన్ని నల్లమందు భాయీలుగా మార్చటమే కాదు చివరకు నల్లమందు యుద్ధాలు చేసిన విషయం చరిత్ర చెబుతోంది.

      అంతెందుకు వర్తమాన చరిత్రలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ వుగ్రవాదులను పెంచి పోషించేందుకు అమెరికన్లు అక్కడ వారిచేత అదే పని చేయించారు. ఇప్పుడు మత్తుమందుల రవాణాలో ఆఫ్ఘనిస్తాన్‌ ఒక కీలక ప్రాంతంగా మారింది. తాలిబాన్లకు అవసరమైన ఆదాయ వనరుగా మారింది. వ్యవసాయంలో విదేశీ పెట్టుబడులంటే మరో విధంగా చెప్పాలంటే ఈ విధానం వెనుక వున్న పరమార్ధం తన బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవటం, మార్కెట్‌ శక్తులకు రైతాంగాన్ని అప్పగించటమే. దానిలో అంతర్బాగంగానే రైతులకు ఏమాత్రం వుపయోగపడకుండా ఇప్పుటికే వున్న పంటల బీమా పధకంలో మార్పులతో అందుకు శ్రీకారం చుట్టింది. రైతాంగానికి రక్షణ కల్పించే అనేక అంశాలలో బీమా ఒకటి మాత్రమే. బీమా సంస్ధలు ప్రీమియం స్వీకరించే ముందు చెప్పే కబుర్లకు తరువాత చెల్లించాల్సిన సమయంలో పెట్టే షరతులకు ఎంత తేడా వుంటుందో తెలిసిందే. అయినా వ్యవసాయ సంక్షోభానికి సమగ్ర పంటల బీమా అన్నది ఒక తోడ్పాటు మాత్రమే తప్ప జిందా తిలిస్మాత్‌ కాదు. మరో విధంగా చెప్పాలంటే సామాజిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొని రైతాంగాన్ని ఒక ఆర్ధిక సరకుగా ద్రవ్య వ్యాపారులకు అప్పగించే నయా వుదారవాద విధానం తప్ప మరొకటి కాదు. పశ్చిమ దేశాలలో మనకంటే మెరుగైన వ్యవసాయ బీమా పధకాలు వున్నప్పటికీ ఏదో ఒక పేరుతో ప్రభుత్వాలు భారీ మొత్తంలో సబ్సిడీలు ఇవ్వటమే గత దశాబ్దన్నర కాలంగా దోహా చర్చలు ముందుకు పోకపోవటానికి అడ్డుపడుతున్న కారణాలలో ఒకటని గుర్తించాలి. మోడీ సర్కార్‌ ఆ సబ్సిడీల గురించి మాట్లాడటం లేదు, వున్నవాటిని క్రమంగా రద్దు చేస్తోంది.

    ప్రపంచ బ్యాంకు వ్యవసాయం గురించి తాజాగా చెప్పిన అంశాల గురించి చూద్దాం. గత ఎనిమిది త్రైమాసకాలుగా (రెండు సంవత్సరాలుగా) ప్రపంచంలో వ్యవసాయ వుత్పత్తుల ధరలు పడిపోతూనే వున్నాయి.గతేడాది కంటే తొమ్మిదిశాతం తక్కువ. ఎక్కువ భాగం వ్యవసాయ వుత్పత్తుల ధరలు ఈ ఏడాది పతనం అవుతాయి. ధాన్యం ధరలు 3.4శాతం తగ్గుతాయని జనవరిలో వేసిన అంచనాను తాజాగా 5.3శాతానికి పెంచింది. వ్యవసాయ ధరలు తగ్గటంతో పాటు చమురు, గ్యాస్‌ ధరలు పెరుగుతాయని చెప్పటం అంటే అంటే పరోక్షంగా రైతులపై మరింత భారం మోపటమే. ఎరువుల ధరలు తక్షణమే పెరుగుతాయి.ఇది ఒక విష వలయం. ఒకదాని ప్రభావం మరొకదానిపై పడి అన్నింటినీ దెబ్బతీస్తాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏం చెప్పారు మోడీజీ వహ్వా ! వహ్వా !!

30 Wednesday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

BJP, Farm prices, Farmers, MSP, Narendra Modi, Narendra Modi Failures, narendra modi namo mantra, Narendra Modi sarkar

యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్‌ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పేసింది

ఎం కోటేశ్వరరావు

     2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేయటానికి ఏడు సూత్రాల పధకాన్ని రూపకల్పన చేసినట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.గతంలో రైతుల ఆదాయాల గురించి కాకుండా వ్యవసాయ వుత్పత్తులు పెరగటానికి ప్రాధాన్యత ఇచ్చారు. నేను దీన్ని ఒక సవాలుగా తీసుకున్నాను, కేవలం సవాలే కాదు మంచి వ్యూహాన్ని కూడా రచించాను, పకడ్బందీగా రూపొందించిన కార్యక్రమాలు, తగినన్ని వనరులు, అమలులో సుపరిపాలన కారణంగా ఈ లక్ష్యాన్ని సాధించగలం అన్నారు. బ్లూమ్‌బెర్గ్‌ ఇండియా ఆర్ధిక

వేదిక కార్యక్రమంలో ప్రధాని ఈ విషయాలను చెప్పారు.ఆ ఏడు సూత్రాలు ఏవంటే

1. ఒక చుక్కనీటికి ఎంతో పంట లక్ష్యంగా సాగునీటి పధకాలకు భారీ బడ్జెట్‌

2. ఆహార ప్రక్రియ ద్వారా అదనపు విలువ చేకూర్చటం

3. 585 కేంద్రాలలో ఎలక్ట్రానిక్‌ ఫ్లాట్‌ ఫారాల ద్వారా ఒకే విధంగా వుండేట్లు చూడటం, జాతీయ వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటు

4. ప్రతి పొలం భూసారాన్ని బట్టి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు

5. భారీ పెట్టుబడులతో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటు ద్వారా పంట చేతికి వచ్చిన తరువాత నష్టాల తగ్గింపు

6.చెల్లించగలిగిన ధరలలో కొత్త పంటల బీమా పధకం

7. వ్యవసాయానికి అనుబంధంగా కోళ్లు, తేనెటీగలు, చేపల పెంపకాలకు ప్రోత్సాహం

    ఈ చర్యల ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు అవుతాయని ఎంతో విశ్వాసంతో వున్నట్లు ప్రధాని చెప్పారు. తన ప్రభుత్వ విధానాలు రైతుల కేంద్రంగా, నూతన ఆదాయ మార్గాలుగా వున్నాయని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాధన్‌ స్వయంగా తనకు లేఖ రాసినట్లు ప్రధాని చెప్పారు.

     ప్రధాని త్వరలో అధికారానికి వచ్చిన రెండో వార్షికోత్సవం జరుపుకోబోతున్నారు. రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. నిజానికి ఒక చొక్కా విప్పి రెండో చొక్కా తగిలించుకున్నట్లుగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్న మోడీ ఏకంగా ప్రధాని అయ్యారు. ఆందువలన ఆయనకు అనుభవం ప్రత్యేకంగా అవసరం వుందని ఆయనా అనుకోలేదు,జనం కూడా భావించలేదు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలలో రైతులకు వుత్పత్తి ఖర్చులపై కనీసం 50శాతం లాభం వుండేట్లు చూస్తామని బిజెపి తన ఎన్నికల వాగ్దానంలో పేర్కొన్నది. అది అమలులోకి రావాలంటే కనీస మద్దతు ధరల పెంపుదల, ఆ మేరకు అవసరమైతే ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దింపటం. రైతాంగానికి ఆ మేరకు ధరలు పెంచటానికి పార్లమెంటుతో పని లేదు, ప్రతిపక్షాల మద్దతు అంతకంటే అవసరం లేదు. అయినా నరేంద్రమోడీ సర్కార్‌ ఆ దిశగా యాభైశాతం ఒక్కసారిగా పెంచకపోయినా ఐదు సంవత్సరాలలో యాభై శాతం పెరిగేట్లుగా ఏటా పదిశాతం చొప్పున ఎందుకు పెంచలేదు. అంటే ప్రధాని మన్‌కి బాత్‌ వుపన్యాసం వినమని చెప్పటం తప్ప ఎదురు చూస్తున్న కిసానోంకి బాత్‌ గురించి చివరికి దేశానికి దిగివచ్చిన దేవదూత నరేంద్రమోడీ అని స్త్రోత్ర పారాయణం చేసిన మన వెంకయ్యనాయుడు కూడా ఎక్కడా సమాధానం చెప్పినట్లు మనకు తెలియదు.

     ప్రణాళికా సంఘం స్ధానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌కు వ్యవసాయంపై సలహాదారుగా వున్న అశోక్‌ గులాటీ ‘దేశంలో వున్న పరిస్థితి తీవ్రతను ఎన్‌డిఏ ప్రభుత్వం పూర్తిగా గ్రహించినట్లు లేదు, కొన్ని రాష్ట్రాలలో 20శాతం వరకు ఆహార ధాన్యాల వుత్పత్తి పడిపోయింది. ప్రభుత్వం నిరంతరం రైతాంగాన్ని ఆదుకొనే వ్యవస్ధను ఏర్పాటు చేయనట్లయితే 1960 దశకంలో మాదిరి ఆహార కొరత ఏర్పడే అవకాశం వుంది’ అని కొద్ది నెలల క్రితం వ్యాఖ్యానించారు.ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారమే అనేక వ్యవసాయ వుత్పత్తులకు రైతులు తక్కువ ధరలను పొందారు. గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు వ్యవసాయ ఖర్చుల మరియు ధరల కమిషన్‌(సిఏసిపి) ప్రకారం ఏ ఒక్క వుత్పత్తి ధర యాభైశాతం కాదు కదా ఆ సమీపంలో కూడా లేదు. అనేక రాష్ట్రాలలో ఆ ధరలు అమలు కాని స్ధితి కూడా వుంది. అసలు ఖర్చుల లెక్కింపు విధానమే లోపభూయిష్టం. జిడిపి లెక్కింపు విధానం, దారిద్య్రరేఖ ఎంత వుండాలి వుండకూడదు అని తర్జభర్జనలతో మార్పు గురించి ఆసక్తి చూపిన కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చే వ్యవసాయ ఖర్చుల లెక్కింపు విధానంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? ప్రధాని తన మనసులోని మాటలో గానీ ఇతర చోట్లగానీ ఈ విషయంపై ఎందుకు నోరు మెదపరు ? తాజాగా ఆయన చెప్పిన ఏడు సూత్రాలలో కూడా ముఖ్యమైన ఈ అంశం చోటు చేసుకోలేదు. గతేడాది మన ప్రభుత్వం గోధుమలకు ఇచ్చిన ధర టన్నుకు 226 డాలర్లయితే ఇదే సమయంలో పాకిస్థాన్‌ చెల్లించిన ధర 320 డాలర్లు.

    రైతాంగానికి కనీస మద్దతు ధరలను పెంచకపోవటానికి కారణాలు ఏమిటి ? రైతులకు మద్దతు ధరలు పెంచితే వినియోగదారులకు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది కనుక పెంచవద్దని ప్రభుత్వ ఆర్ధికవేత్తలైన అరవింద్‌ సుబ్రమణ్యం, పంగారియా వంటి వారు జారీచేసిన హెచ్చరికలకు లొంగిపోయింది మోడీ సర్కార్‌.పోనీ ద్రవ్యోల్బణం పెరగ కుండా స్ధిరంగా వుందా అంటే ఆరునెలలకు ఒకసారి వుద్యోగులకు పెంచుతున్న కరువు భత్యమే లేదనేందుకు పక్కా నిదర్శనం. పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో 2012-13నుంచి 2017-18 మధ్య కాలంలో సగటున ఏడాదికి నాలుగు శాతం వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇంతవరకు వాస్తవంలో రెండుశాతానికి మించలేదు. కొత్త బడ్జెట్‌లోగానీ, నరేంద్రమోడీ ఎన్నికల సభలు, రైతుల సభలలో గానీ ఎక్కడా తమ ఎన్నికల వాగ్దానం గురించి కనీస ప్రస్తావన కూడా చేయకుండా ఆరు సంవత్సరాలలో ఆదాయం రెట్టింపు గురించి చెబుతున్నారు. అసలు విషయం ఏమిటి ?

     గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు ప్రభుత్వం వాగ్దానం చేసిన వ్యవసాయ ఖర్చులపై 50శాతం లాభం చేకూర్చేవిగా లేవంటూ రైతు సంఘాల కూటమి గతేడాది సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దానికి వివరణ ఇస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో యాభై శాతం లాభం చేకూర్చటం సాధ్యం కాదని సరసమైన ధరలు వచ్చేట్లు చూడటం తప్ప రైతుల ఆదాయాల పెంపుదలకు కనీస మద్దతు ధరల విధానం వుద్ధేశించలేదని, అలా చేస్తే మార్కెట్‌ను వక్రమార్గం పట్టించినట్లు అవుతుందని, యాంత్రికంగా యాభై శాతం పెంపుదల చేస్తే కొన్ని సందర్భాలలో తిరోగామి పర్యవసానాలు వుంటాయంటూ అమలు జరిపేది లేదని నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పేసింది. అందుకే వ్యవసాయంతో పాటు కోళ్లు,చేపలు, తేనెటీగలు పెంచుకోండని నరేంద్రమోడీ వుచిత సలహాలు ఇస్తున్నారు. ఆయన పుట్టక ముందునుంచే రైతాంగం ఆ పని చేస్తున్నది.

    రోడ్లు వేసేందుకు విదేశాల నుంచి తెచ్చుకున్న అప్పులు చెల్లించేందుకు లేదా ఆ కంపెనీలు నిర్వహిస్తున్న టోల్‌ టాక్సును ద్రవ్యోల్బణం ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. విదేశీ అప్పులను మన రూపాయల్లో కాకుండా డాలర్లలో చెల్లిస్తున్నారు. వుద్యోగులకు ఆరునెలలకు ఒకసారి ద్రవ్యోల్బణం ప్రాతిపదికన కరువు భత్యం చెల్లిస్తున్నారు. అదే విధంగా అమలు జరిపినా లేకపోయినా పారిశ్రామిక కార్మికులు, ఇతరులకు కూడా ద్రవ్యోల్బణ ప్రాతిపదికన కరువు భత్యం నిర్ణయిస్తున్నారు. రూపాయి విలువ పతనమైతే రైతాంగం కొనే డీజిల్‌, పెట్రోలు, ఎరువులు, పురుగుమందులు ధరలు ఎప్పటికపుడు పెరుగుతాయి. విద్యుత్‌, బొగ్గు, వుక్కు వంటి సంస్ధల వుత్పత్తులకు కనీస లాభాలను నిర్ణయించే విధానం వుంది. కానీ రైతాంగం విషయానికి వచ్చే సరికి అడ్డగోలు వ్యవహారం తప్ప ఒక నిర్ణీత విధానం, ప్రాతిపదిక లేదు. ప్రతి పదిహేనురోజులకు ఒకసారి పెట్రోలు,డీజిల్‌ ధరలను సవరిస్తున్న కేంద్రం రైతాంగ వుత్పత్తులకు కొన్నింటికి అసలు మద్దతు ధరల నిర్ణయ విధానమే లేదు. వున్నవాటికి కూడా ఏడాదికి ఒకసారి నిర్ణయిస్తారు. అవి అమలు జరగనపుడు అమలు జరిపే యంత్రాంగం లేదు.ఎందుకీ పరిస్థితి?

    2015లో వార్షిక ఇంక్రిమెంట్లు గాక వుద్యోగులకు 13శాతం కరువు భత్యం పెరిగింది.అదే ధాన్యం కనీస మద్దతు ధర 3.25శాతం, గోధుమలకు 5.2శాతం పెరిగింది. విజయ మాల్య, కేంద్ర మంత్రి సుజనా చౌదరి వంటి వారి కంపెనీలు బకాయిలు చెల్లించకుండా వున్నపుడు ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ అనో పరిశ్రమలను ఆదుకొనే పాకేజి పేరుతోనో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు ఆదుకుంటున్నాయి. మరి వరుసగా కరువుల పాలవుతున్న రైతులకు ఇలాంటి పాకేజీలు ఎందుకు వుండవు?

    పప్పు ధాన్యాల ధరలు పెరిగాయని జనం గగ్గోలు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం వాటిని దిగుమతి చేసుకొనేందుకు 16వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీన్నే అప్పు చేసి పప్పుకూడు అంటారు. అదే మన రైతాంగానికి చెల్లిస్తే కావలసినన్ని పప్పులు పండించరా ? విలువైన మన విదేశీమారక ద్రవ్యం మిగులు తుంది, మనరైతుల జేబుల్లో నాలుగు డబ్బులు వుంటాయి. వాటిని ఇతర వస్తువుల కొనుగోలుకు వుపయోగిస్తారు కనుక, పరిశ్రమలు, వాణిజ్యాలు కూడా పచ్చగా వుంటాయా లేదా ? ఆ పని ఎందుకు చేయరు?

   పన్నెండవ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి లక్షా యాభైవేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు గొప్పగా చెప్పుకుంటారు. న్యూఢిల్లీ విమానాశ్రయ లావాదేవీలలో లక్షా 62వేల కోట్ల కుంభకోణం జరిగిందని కాగ్‌ పేర్కొన్నది . అరవై కోట్ల మంది రైతుల కుటుంబాల కంటే కొన్ని లక్షల మంది ప్రయాణించే విమానాశ్రయానికి ప్రాధాన్యత ఎక్కువ వున్నట్లు స్పష్టం కావటం లేదూ ? గత ప్రభుత్వ విధానాలతో పోల్చితే నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని మార్చిందేమీ లేదు. గత ఐదు సంవత్సరాలలో సగటున రోజుకు 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు తెలుపుతుండగా గతేడాది ఆ సగటు 52కు పెరిగింది. మరి తాజాగా నరేంద్రమోడీ ప్రకటించిన ఏడు సూత్రాలు ఈ సంఖ్యను తగ్గిస్తాయా?పెంచుతాయా? తగ్గించాలనే కోరుకుందాం .

Share this:

  • Tweet
  • More
Like Loading...

 additional instalment of Dearness Allowance  due from 1.1.2016

23 Wednesday Mar 2016

Posted by raomk in Current Affairs, employees, INDIA, NATIONAL NEWS, Pensioners, Prices

≈ Leave a comment

Tags

Dearness Allowance, Dearness Relief, Government employees, pensioners

The Union Cabinet, chaired by the Prime Minister Shri Narendra Modi, has approved release of an additional instalment of Dearness Allowance (DA) to Central Government employees and Dearness Relief (DR) to Pensioners w.e.f. 01.01.2016. This represents an increase of 6 percent over the existing rate of 119 percent of the Basic Pay/Pension, to compensate for price rise.

This will benefit about 50 lakh Government employees and 58 lakh pensioners.

The increase is in accordance with the accepted formula, which is based on the recommendations of the 6th Central Pay Commission (CPC). The combined impact on the exchequer on account of both Dearness Allowance and Dearness Relief would be of Rs. 6796.50 crore per annum and Rs.7929.24 crore respectively, in the financial year 2016-17 (for a period of 14 months from January, 2016 to February, 2017).

Share this:

  • Tweet
  • More
Like Loading...

దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దులలో

23 Wednesday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

Narendra Modi, Narendra Modi Failures, NDA, oil price, world oil prices

ఎంకెఆర్‌

పెట్రోలు ధరల పెరుగుదల ఎక్కడ ఎలా ?

    ప్రపంచ చమురు మార్కెట్‌లో 2015 జూన్‌ నుంచి 2016 జనవరి మధ్యకాలంలో ముడిచమురు ధరలు 48శాతం తగ్గాయి. ఆమేరకు ఎన్ని దేశాలలో చమురు ధరలు తగ్గాయి ? సమాచారం అందుబాటులో వున్న 96 దేశాల వివరాల ప్రకారం ఆ మేరకు ఏ దేశంలోనూ ధరలు తగ్గలేదు. పది దేశాలలో ఒకటి నుంచి 14శాతం మేరకు ధరలు పెరిగాయి. ఏడు దేశాలలో ఎలాంటి మార్పు లేదు. డెబ్బయి తొమ్మిది దేశాలలో ఒకటి నుంచి 29శాతం వరకు మాత్రమే ధరలు తగ్గాయి. మన దేశంలో 12, చైనాలో 15శాతం మేరకు తగ్గాయి.

     ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఒకే విధంగా వుంటాయి. అయితే ఆయా దేశాలలో విధించే పన్నులు, వాటి కరెన్సీల విలువ, ఇచ్చే రాయితీలను బట్టి వినిమయదారులకు వేర్వేరు ధరలు వుంటాయి.గతవారం మన ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ ధరలను భారీగా పెంచింది. మరి ఇదే సమయంలో ఇతర దేశాల్లో పెరిగాయా? చూడండి. ధరగా పేర్కొన్న మొత్తాలు స్ధానిక కరెన్సీలో అని, స్థానిక పన్నులతో ప్రతి వారం ఒక నిర్ణీత కేంద్రంలో సేకరించిన వివరాలుగా గమనించాలి. మన దేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ పన్నుల రేటు కారణంగా ధరలలో మార్పు గురించి తెలిసినదే. పెట్రోలు ధర మార్పు శాతాలలో.

దేశం         ప్రస్తుత ధర       వారంలో మార్పు       మూడు నెలల్లో మార్పు

భారత్‌         62.09             4.9                     -2.5

పాకిస్థాన్‌      62.77             0.0                    -17.7

శ్రీలంక       128.0               0.0                     0.0

మలేషియా   1.6                  0.0                    -17.9

చైనా           5.92               0.0                     -2.0

నేపాల్‌        99.00              0.0                      -4.8

సింగపూర్‌       1.8               0.0                     -5.0

   తాము అధికారంలోకి రావటం అంటే మంచి రోజులు వచ్చినట్లే అని నరేంద్రమోడీ చెబుతారు, రాష్ట్రాన్ని సింగపూర్‌, మలేషియా మాదిరి మారుస్తానని చెప్పే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, నరేంద్రమోడీ అడుగుజాడల్లో నడిచే చంద్రబాబు నాయుడు ఈ ధరల గురించి ఏం చెబుతారు? కనీసం పెట్రోలు,డీజిల్‌ విషయాల్లో ఎవరికి మంచి రోజులు వచ్చినట్లు ? మన దేశంలో ప్రపంచ మార్కెట్లకు అనుగుణ్యంగా ధరలు ఎందుకు తగ్గటం లేదు? కర్ణుడి చావుకు కారణాలు అనేక అన్నట్లు పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీని గత 22నెలల కాలంలో రెట్టింపునకు పైగా పెంచింది. తెలుగు రాష్ట్రాలలో వ్యాట్‌ను పెంచాయి.. దీనికి తోడు రూపాయి విలువను నిలబెట్టటంలో మోడీ సర్కార్‌ విఫలమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ ఎలాగూ నోరు విప్పరు, భక్తులైనా చెప్పాలి

04 Friday Mar 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Others, Prices

≈ Leave a comment

Tags

agrarian policy, Fertilizers, Fertilizers subcidies, kisan budget, MSP, Narendra Modi, NDA, urea

నేతి బీరలో నెయ్యి -మోడీ రైతు బడ్జెట్‌

మోడీ గారి రైతు సంక్షేమం గురించి చెప్పమని పరివారాన్ని అడిగితే మా దొరగారి వూరి మిరియాలు తాటికాయంత వుంటాయి బాబయ్యా అన్నట్లు తస్మదీయ మీడియా వంత సరేసరి.మోడీ భక్తులు ఇంకా మత్తు నుంచి బయటకు రాలేదు. ప్రతి పక్షాల విమర్శలు, మింగా కక్కలేని మిత్ర పక్షాల అవస్తలు, అధికార పార్టీ డబ్బాల సంగతి అలా వుంచుదాం. గత రెండు సంవత్సరాల నుంచి వారిని విస్మరించిన మోడీ సర్కార్‌  2016 బడ్జెట్‌ ద్వారా కేవలం రైతులకు క్షమాపణలు చెప్పిందా అని ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రిక ఒక శీర్షికతో వార్త ప్రచురించింది.

ఎం కోటేశ్వరరావు

       సుప్రసిద్ద లాయర్‌ అయిన కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అందమైన పదాలతో ఈనెల ఒకటిన ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌ గురించి కల్పించిన భ్రమలు లేదా ప్రచారంతో నిజంగానే రైతులు తమ ఆదాయాలు రెట్టింపు అవుతాయని ఆశపడుతున్నారు. తాను రావటమంటేనే రైతులకు మంచి దినాలు వచ్చినట్లని నరేంద్రమోడీ రెండు సంవత్సరాల క్రితం తెలిపారు. పాపం ఈ విషయం తెలియక లేదా చెడుదినాలు దాపురించి గాని స్వయంగా బిజెపి పాలనలోని మహారాష్ట్రలోనే మోడీ గద్దె నెక్కిన తరువాత 1130 మంది రైతులు బలవన్మరణం చెందారు. అదే రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ ఎంపీ గోపాల్‌ షెట్టి రైతులు ఆత్మ హత్య చేసుకోవటం ఒక ఫ్యాషన్‌గా మారిందని సెలవిచ్చారు. అది తమ పాలన అని కూడా మర్చిపోయారు పాపం. ఆత్మహత్యలు కొనసాగుతుండటంతో మహారాష్ట్రలోని 28 మంది మంత్రులు ఒకే రోజు పర్యటన జరిపి అసలేం జరుగుతోందో తెలుసుకొమ్మని ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ ఆదేశించారు.ఇదంతా మోడీ రైతు బడ్జెట్‌ ప్రకటించిన తరువాతే సుమా !

    మోడీ గారి రైతు సంక్షేమం గురించి చెప్పమని పరివారాన్ని అడిగితే మా దొరగారి వూరి మిరియాలు తాటికాయంత వుంటాయి బాబయ్యా అన్నట్లు తస్మదీయ మీడియా వంత సరేసరి.మోడీ భక్తులు ఇంకా మత్తు నుంచి బయటకు రాలేదు. ప్రతి పక్షాల విమర్శలు, మింగా కక్కలేని మిత్ర పక్షాల అవస్తలు, అధికార పార్టీ డబ్బాల సంగతి అలా వుంచుదాం. గత రెండు సంవత్సరాల నుంచి వారిని విస్మరించిన మోడీ సర్కార్‌ 2016 బడ్జెట్‌ ద్వారా కేవలం రైతులకు క్షమాపణలు చెప్పిందా అని ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రిక ఒక శీర్షికతో వార్త ప్రచురించింది. ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిన సూటూ బూటూ నలగ కుండా అలాంటి వారి మధ్యనే విదేశాలు, స్వదేశంలో తిరిగే ప్రధాని నరేంద్రమోడీ ఈ మధ్య కాలంలో తొలిసారిగా రైతుల గురించి మాట్లాడుతున్నారు. త్వరలో అనేక రాష్ట్రాలలో ఎన్నికలున్నాయి కదా అని ఎవరైనా అంటే వారి గోడు ఎవరు వినిపించుకుంటారు చెప్పండి. ప్రతివారికీ ఒక ప్రత్యేకత వుంటుంది. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ ద్వారా తాము చెప్పదలచుకున్నదానిని గోబెల్స్‌ మాదిరి పదే పదే చెప్పటం తప్ప ఎదుటివారి విమర్శలను విననట్లు ప్రవర్తించటం మోడీ గారికి బాగా అబ్బింది. అందుకే మన్‌కీ బాత్‌ పేరుతో నెల నెలా జన్‌కీ బాత్‌తో పని లేకుండా తాను చెప్పదలచుకున్నది చెబుతున్నారు.

    బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందు ఒడిషా, కర్ణాటకలోలో బిజెపి నిర్వహించిన రైతుల సభలో ప్రధాని ఒక విషయం చెప్పారు. అది కొందరికి స్వంత డబ్బాలాగా అనిపించవచ్చు, మరి కొందరికి ‘అబ్బ ఎంతబాగా చెప్పిండు’ అన్న పరవశం కూడా కలిగించవచ్చు. తన ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందంటూ చేసిన ఆరోపణల సందర్బంగా తన ప్రభుత్వం యూరియా దుర్వినియోగం కాకుండా దానికి వేపపూత పూస్తున్నందుకు అక్రమార్కులకు మంటగా వుందని, వారు తనను వ్యతిరేకిస్తున్నారని కూడా చెప్పారు.

   యూరియా మన దేశం నుంచి పక్కనే వున్న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు దొంగ రవాణా అవుతోందని చాలా కాలంగా వినిపిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే వుంటుంది కనుక దాన్ని అరికట్టటానికి మార్గాలు వెతకాల్సిన బాధ్యత కేంద్రంపై ఎక్కువగా వుంటుంది. ఒక్క యూరియా మాత్రమే ఎందుకు దుర్వినియోగం అవుతోంది, మిగతా ఎరువులు ఎందుకు తరలి పోవటం లేదు? దీని గురించి కూడా ప్రధాని చెప్పి వుంటే నిజాయితీగా వుండేది.

     అసలు విషయం ఏమంటే మన ప్రధాని నరేంద్రమోడీ (ప్రధానిగా) పుట్టక ముందే వేప పూత యూరియా తయారు చేస్తున్నారు. యూరియా నుంచి విడుదలయ్యే నైట్రోజన్‌ సామర్ద్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలంటే దానికి వేప పూత అవసరమని, అలాంటి యూరియా వలన దిగుబడులు పెరిగాయని కనుకొన్న మన శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు గత దశాబ్ది కాలంగా దాని వినియోగం, తయారీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఫలితంగా 2011-12లో 3.62 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు(ఎంఎంటి)గా వున్న వేప పూత యూరియా అమ్మకాలు 2013-14లో 6.34 ఎంఎంటికి పెరిగాయి. గత ప్రభుత్వమే వేప పూత యూరియా తయారీపై వున్న కొన్ని అంక్షలను తొలగించి సబ్సిడీ యూరియాను నూటికి నూరుశాతం వేప పూతతో తయారు చేయాలని స్వదేశీ వుత్పత్తిదారులను ఆదేశించింది. ఇతరంగా కూడా కనీసం 75శాతం వేప పూత యూరియా తయారు చేయాలని ఆదేశించింది.మోడీ అధికారానికి వచ్చిన 2014లో మన దేశంలో టన్ను యూరియా ధర 86.76 డాలర్లు వుండగా పాకిస్ధాన్‌లో 260.19, బంగ్లాదేశ్‌లో206.74, చైనాలో 264.82 డాలర్లుగా వుంది. అందువలన దొంగరవాణాను వేపపూత అడ్డుకుంటుందని చెబితే పిచ్చి బియ్యం పెడతానని బెదిరించే చిన్ననాటి అమ్మమ్మ కబుర్లు తప్ప మరొకటి కాదు.

     ఎరువుల ధరల విషయానికి వస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో డిఎపి ధర 2011 అగస్టు నెలలో 603 డాలర్లు వుండగా 2016 జనవరిలో 385 డాలర్లకు తగ్గింది. అదే మన దేశంలో 2010-11లో సగటున టన్ను ధర రు.10,750 వుండగా ఈ ఏడాది జనవరిలో 26 వేల రూపాయలు వుంది. ఇదే విధంగా ఎంఓపి ఇతర ధరల నియంత్రణ నుంచి తొలగించిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరిగాయి. యూరియా ధరలో పెద్ద మార్పులేదు. మిగతా దేశాలలో కూడా యూరియాఏతర ఎరువుల ధరలు పెరిగిన కారణంగా దొంగరవాణా లేదు. దీని అర్ధం ఈ కారణంగా మన దేశంలో యూరియా ధర పెంచమని కాదు, పెంచాలన్నా వీలు కాని స్ధితి అన్నది వేరే కధ.

      1997-98 వరకు డిఎపి, ఎంఓపి వంటి ఎరువుల ధరలు యూరియా కంటే కొంచెం తక్కువగానో ఎక్కువగానో వుండేవి. అందువలన రైతులు శాస్త్రవేత్తలు చెప్పినట్లు తగు పాళ్లలో వాటిని వినియోగించారు. తరువాత సబ్సిడీ భారాన్ని తగ్గించుకొనేందుకు నూట్రియంట్‌ ప్రాతిపదిక విధానాన్ని ఎప్పుడైతే అమలులోకి తెచ్చారో ఇతర ఎరువుల ధరలు యూరియా కంటే ఐదు రెట్ల వరకు పెరిగి అందుబాటులో లేకుండా పోయాయి.మన పాలకుల అసమర్ధత కారణంగా రూపాయి విలువ పతనమై అంతర్జాతీయ మార్కెట్‌లో డిఏపి, ఎంఓపి ధరలు తగ్గినా మన రైతాంగానికి పెద్దగా తగ్గలేదు.మరోవైపున సబ్సిడీ రద్దయింది.దీంతో రైతులు యూరియాను ఎక్కువగా వినియోగించటంతో రైతులకు నష్టదాయకమైన అనేక కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. అందువలన కాంప్లెక్స్‌ ఇతర ఎరువుల ధరలను యూరియా స్ధాయికి తగ్గిస్తేనే రైతాంగానికి అచ్చే దిన్‌ వచ్చినట్లు లేకుంటే పొలాల సారం దెబ్బతిని మరింతగా చచ్చే దినాలు వస్తాయి. గతేడాది ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ నిమిత్తం 72,447 కోట్లను ప్రకటించింది. ఎంత ఇచ్చిందీ తెలియదు. ఈ ఏడాది 70వేల కోట్లని పేర్కొన్నది. ఈ మొత్తంలో 51వేల కోట్ల రూపాయలు కేవలం యూరియాకు మాత్రమే ఇస్తున్నారు. మిగతా వాటిన్నింటికి కలిపి కేవలం 19వేల కోట్లే. ఇప్పుడు ఇస్తున్న సబ్సిడీని రైతుల వారీ లెక్కవేస్తే సాగు భూమి 14 కోట్ల హెక్టార్లుగా వున్నందున సగటున ఎకరానికి రెండువేల రూపాయలు వస్తుంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో వేసి ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని మోడీ సర్కార్‌ ఆలోచిస్తున్నది. ఇదే జరిగితే యూరియా ధరకు కూడా రెక్కలు వస్తాయని వేరే చెప్పనవసరం లేదు. దీని వలన కౌలు రైతాంగానికి అన్యాయం జరుగుతుంది. వారికి ఈ మాత్రం కూడా దక్కే అవకాశం లేదు. పది ఎకరాలు మించి పెద్ద రైతులకు సబ్సిడీ లేదన్నా లేదా తగ్గించి ఇస్తామన్నా వారి పొలాలను సాగు చేసే అరక్షిత కౌలుదార్లు అదనంగా ఖర్చు చేయాల్సిందే. నరేంద్రమోడీ ఈ విధానాలను సవరిస్తారా లేదా అనేదాన్ని బట్టి రైతుల సంక్షేమం వుంటుంది.అలాంటి సూచనేమీ బడ్జెట్‌లో లేదా ఆర్ధిక సర్వేలో లేదు కాబట్టి గత కాంగ్రెస్‌ బూట్లతోనే నడిచేందుకు పూనుకున్నారని అన్న వారిని దేశద్రోహులు అంటే కుదరదు.

     రైతుల నేటి దుస్ధితికి గత పాలకుల విధానాలే కారణమని బిజెపి విమర్శించింది. దానిలో ఎలాంటి తప్పు లేదు. 1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్ధిక విధానాలు లేదా నయా వుదారవాద విధానాలు దీనికి నూటికి నూరు పాళ్లు కారణం, ఈ కాలంలో వాటిని గతంలో ఐదు సంవత్సరాలు అమలు జరిపిన బిజెపి ఎన్‌డిఏ ప్రభుత్వానికి కూడా వాటా ఇవ్వక తప్పదు. ఇప్పుడు సమస్య ఏమంటే ఆ విధానాలను మార్చ కుండా మోడీ రైతాంగానికి మంచి దినాలను ఎలా తీసుకు వస్తారు? గుజరాత్‌ మోడల్‌ అన్నారు. దాని ప్రకారం పెట్టుబడులైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు మిగతా రాష్ట్రాల కంటే తక్కువకు , మద్దతు ధరలు ఎక్కువ ఇచ్చారా ? లేదు దేశ వ్యాప్తంగా ఒకే ధరలు. మొదటి బడ్జెట్‌లో విధానపరమైన అంశాలేమీ పేర్కొన లేదు. రెండు, మూడవ బడ్జెట్లలో కూడా వాటి ప్రస్తావనే లేదు. గత పాలకుల విధానాలు మార్చకుండా రైతాంగానికి రెట్టింపు ఆదాయం ఎలా కల్పిస్తారు? మంత్రదండం ఏమైనా వుందా ?

      మన వ్యవసాయ రంగం కుదేలవటానికి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవటానికి కారకులు ఎవరు? మహారాష్ట్ర బిజెపి ఎంపీ చెప్పిన ప్రకారమైతే ఆత్మహత్య కూడా ఒక ఫ్యాషన్‌గా మారింది.అంటే తమ ఆత్మహత్యలకు తామే కారకులు. పాలకుల విధానాలు ఎలా దెబ్బతీస్తున్నాయో ఎరువుల గురించి చెప్పుకున్నాము. ప్రకృతి వైపరీత్యాలైన అతి వృష్టి,అనా వృష్టి అందుకు తోడ్పడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు కడితే వుప్పు సముద్రం పాలవుతున్న గోదావరి జీవ జలాలతో లక్షలాది బీడు భూములు పచ్చపచ్చగా మారతాయని, విద్యుత్‌ వెలుగులు విరజిమ్ముతాయని ఎప్పటి నుంచో ఆ ప్రాంత ప్రజలు కలలు కంటున్నారు. రైతు బడ్జెట్‌ అని అనేక మంది కీర్తిస్తున్న ఆ ప్రాజెక్టును తామే నిర్మిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం గంగ శుద్ధికి రెండున్నర వేల కోట్ల రూపాయలు కేటాయించిన పోలవరానికి కేటాయించిన మొత్తం వంద కోట్ల రూపాయలు. ఈలెక్కన కేటాయింపులు జరిపితే అది పూర్తి కావటానికి మరో 50-60 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు.అయినా ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తలుపు చెక్కతో కాకపోయినా తమలపాకుతో కూడా అంటించి గట్టిగా మాట్లాడటానికి సాహసించటం లేదు. విరోధంతో కంటే స్నేహంతో సాధించుకోవాలని కబుర్లు చెబుతున్నారు. విరోధం తెచ్చుకోమని, తొడగొట్టమని ఎవరు చెప్పారు. కనీస నిరసన తెలపటం బాధ్యత కాదా? గుడ్డి కన్ను మూస్తే ఏమిటి తెరిస్తే ఏమిటి అన్నట్లుగా స్నేహంగా వుండి, కొంత మందికి కేంద్ర మంత్రి వర్గంలో వుద్యోగాలిప్పించి సాధించింది ఏముంది ? గంగ శుద్ధికి నిధులు ఇవ్వవద్దని చెప్పటం లేదు. అది ఈనాటి సమస్య కాదు, అంత తేలిక కూడా కాదని హైదరాబాదులో మూసీ, హుస్సేన్‌ సాగర్‌ శుద్ధి పధకాలు వెల్లడించాయి. ముందు గంగను కలుషితం చేస్తున్న వారిని అదుపు చేసిన చర్యలున్నాయా ? జనానికి అవసరమైన ఆహారాన్ని పండించే ప్రాజెక్టులకా మొదటి ప్రాధాన్యత లేక మరొకదానికా ?

      వ్యవసాయరంగ పునరుద్దరణ అంటే ఖాయిలా పడినదానిని తిరిగి పనిచేయించటానికి వివిధ పధకాలకు 35,984 కోట్ల కేటాయింపుతో పాటు పన్నులు వేసే అన్ని సేవలపై 0.5శాతం కృషి కల్యాణ్‌ సెస్‌ వసూలు ద్వారా సమకూరే మొత్తాన్ని రైతుల కోసం ఖర్చు చేస్తారు. అంటే జనంపై అదనపు భారాలు మోపుతారు. జనంలో రైతులు కూడా వుంటారు కనుక కొత్త పెన్షన్‌ పధకం ప్రకారం వుద్యోగులు, కార్మికులు తమ పెన్షన్‌కు తామే నిధులు సమకూర్చుకున్నట్లుగా రైతులు కూడా తమ కల్యాణానికి తాము కూడా తమ వంతు నిధులు సమకూర్చుకోవాలి. నూతన పంటల బీమా పధకం గురించి రైతాంగంలో ఎన్నో ఆశలు కల్పించారు.అది అమలులోకి వచ్చిన తరువాత గానీ అసలు విషయం అర్ధం కాదు. ఈ పధకం అమలుకు కేంద్రం-రాష్ట్రాలు చెరి సగం నిధులు భరించాలి. ఏడాదికి 17,600 మేరకు అవసరమౌతాయని అంచనా వేశారు. కానీ బడ్జెట్‌లో రు.5500 కోట్లు మాత్రమే ప్రకటించారు. అంటే ఈ ఏడాది పూర్తిగా అమలు జరగదని అనుకోవాలి.

   మరో ముఖ్య సమస్య కనీస మద్దతు ధరలు. అవి వున్నా రైతాంగానికి పెద్ద వుపయోగం లేకుండా పోతోంది. ఒక్క యూరియా తప్ప మిగతా పెట్టుబడులన్నీ విపరీతంగా పెరిగి పోయాయి. వాటితో పోలిస్తే మద్దతు ధరలు ఏ మూలకు చాలవు. వాటిపై తమ విధానమేమిటో ఇంత వరకు వెల్లడించలేదు.మిగతా అంశాలకు సంబంధించి రైతాంగానికి భారాలు తగ్గించే లేదా ఆదాయాలు పెంచే నిర్దిష్ట పధకాలు, విధానాలేవీ బడ్జెట్‌లో లేవు.ఫలానా సమస్యపై మాది ఫలానా విధానం అంటే దాని గురించి ఒక అభిప్రాయమో అభినందనో చెప్పవచ్చు. అదేమీ లేదు. వాటి గురించి కారణ జన్ముడిగా భావిస్తున్న నరేంద్రమోడీ నోరు విప్పరని తేలిపోయింది. కనీసం ఆయన శిష్య పరమాణువులు లేదా భక్తులైనా చెప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏం చేయాలి ?

27 Saturday Feb 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

crude oil price, Economic Survey, Indian Railways, Narendra Modi, Narendra Modi Failures, NDA, NPA;s

ఎం కోటేశ్వరరావు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో దేన్నయినా తీసుకోండి, గతేడాది మా పాలన సజావుగా సాగి ఒకటి రెండు రంగాలు మినహా ఎన్నో రంగాలలో పురోగతి సాథించాం, కొన్ని ఇబ్బందులున్నా వచ్చే ఏడాది మరెంతో పురోగమించేందుకు ఒళ్లుదాచుకోకుండా పని చేస్తాం. ప్రజల సంక్షేమానికి కొత్తగా వేల కోట్ల రూపాయలను కొత్తగా కేటాయించనున్నాం. బడ్జెట్లను ప్రవేశపెట్టబోయే ముందు చెప్పే ఈ పోసుకోలు కబుర్లు వినీ వినీ బోరు కొడుతోంది. పార్టీలు మారే వారు కూడా అభివృద్ధి కోసమే అంటూ ఇవే సోది కబుర్లు చెప్పి జనానికి చెవుల్లో పూలు పెడుతున్నారు. ఎక్కడిక్కడ ‘అపరిచితులు’ తయారైతే తప్ప ఇలాంటి వారు నోర్మూసుకోరా అనిపిస్తోంది. ఇలా కబుర్లు చెప్పేవారు ఒక్కొక్కటిగా వున్న పధకాలను నీరుగారుస్తున్నారు. లేదా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. భారాలు మోపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గితే ఆ మేరకు ఎందుకు మనకు తగ్గటం లేదనే ప్రశ్న మరోసారి అడగాలంటే సిగ్గుగా వుంది.మన పాలకులు అంతలా తెగించారు. మన పక్కనే వున్న చిన్న దేశం శ్రీలంక దశాబ్దాల తరబడి అంతరుద్ధ్యంతో లేదా వుగ్రవాదరతో నాశనమైంది. అయినా అక్కడ పెట్రోలు, డీజిల్‌ ధర(ఈనెల 22న) మన కంటే తక్కువగా లీటరు 89,66 సెంట్ల చొప్పున వున్నాయి.( అంతర్జాతీయ కరెన్సీ డాలరు విలువలో సులభంగా వుంటుంది కనుక ఆ ధరలలో చెప్పాల్సి వస్తోంది. ఒక డాలరుకు వంద సెంట్లు) మన కంటే దరిద్రం వున్న పాకిస్తాన్‌లో 68,72 సెంట్ల చొప్పున వుండగా మోడీ గుజరాత్‌ మోడల్‌ పాలనలో మాత్రం 91,69 సెంట్ల చొప్పున చెల్లించాల్సిన దౌర్భాగ్యం మనకు ఎందుకు ? గోళ్లూడగొట్టి వసూలు చేస్తున్న ఈ సొమ్మంతటినీ ఎవరికి చెల్లిస్తున్నారు. చైనా కంటే మన దేశంలోనే అభివృద్ధి రేటు ఎక్కువ అని లెక్కలు చెబుతారు. ఓకే అంగీకరిద్దాం. మరి అభివృద్ధి ఫలితాలు జనానికి ఎందుకు అందటం లేదు. మనది ప్రజాస్వామ్యం అంటారా ?

గడచిన మూడు నెలల్లో మన ఆసియాలోని వియత్నాంలో పెట్రోలు ధరలు 19.4, డీజిలు ధరలు 29.1శాతం తగ్గాయి. ఇంత మొత్తంలో ప్రపంచంలో ఏ దేశంలోనూ తగ్గలేదు. మరి ఇదే సమయంలో మన దగ్గర తగ్గింది 3.1,4.4శాతమే. పాకిస్ధాన్‌లో 6.6,9.5శాతం తగ్గాయి. ఇంత కంటే సిగ్గు చేటైన విషయం ఏముంది?ఈ కాలంలో బ్రెంట్‌ ముడిచమురు ధర పీపా 43 నుంచి 30 డాలర్లకు పడిపోయింది. మన మౌన బాబా మోడీ దీని గురించి తన మన్‌కీ బాత్‌లో ఎందుకు మాట్లాడరు ?నిఖార్సయిన జాతీయ వాదులు ప్రతిరోజూ ప్రతిదాని మీదా మాట్లాడరు అనుకుందాం అసలు మనం ఎందుకు అడగటం లేదు !

గత మూడు సంవత్సరాలు 2012-13, 13-14,14-15 సంవత్సరాలలో ప్రభుత్వ రంగ బ్యాంకు మొండి బకాయిల కింద రద్దు చేసిన మొత్తాలు 1,14,000 కోట్ల రూపాయలు.అంతకు ముందు తొమ్మిది సంవత్సరాలలో రద్దు చేసిన మొత్తం కంటే ఇది ఎక్కువ. అన్నింటి కంటే తాను చాయ్‌ వాలానని ప్రతి పైసాకు జవాబుదారీగా వుండటంతో పాటు బ్లాక్‌మనీ బయటకు లాగి తలకు 15లక్షలు చొప్పున పంచుతానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన నరేంద్రమోడీ సర్కార్‌ తొలి ఏడాది కాలంలో రద్దు చేసిన మొత్తం 53,100 కోట్లు కాగా రెండో ఏడాది ఈ మొత్తం మరో అంత వుంటుందని అంచనా, అంటే లక్ష కోట్ల రూపాయలు రద్దు చేసి మోడీ సర్కార్‌ రికార్డుల మోత మోగిస్తోంది. మంగళగిరి పానకాల స్వామికి ఎంత పానకం పోసినా పైకి కనపడదంటారు, మరి ఇదేమిటి ? బహిరంగంగా అప్పనంగా దొబ్బపెట్టటం కాదా ? చివరికి ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అన్నట్లుగా జనం పాటలు పాడుకోవటమేనా?

ఈ ఏడాది రైల్వేబడ్జెట్‌ను చూస్తే ఎప్పుడూ వచ్చే రైలు వచ్చిందీ, పోయింది అన్నట్లుగా వుంది. పరిస్ధితులన్నీ బాగుంటే ఈ ఏడాది రైల్వే మంత్రి కొత్త పధకాలను ఎందుకు ప్రకటించలేదు? డబ్బు లేకుండానే గతంలో ఎన్నో పధకాలు ప్రారంభించారు, వాటిని పూర్తి చేయటం ప్రధమ కర్తవ్యం కనుక వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం అని అందమైన కబుర్లు చెప్పారు. పోనీ గతం కంటే మెరుగ్గా కేటాయింపులేమైనా చేశారా అంటే అదీ లేదు. కాగితాల మీద వున్న పధకాల ఫైళ్లు కొనసాగించటానికి సరిపడా నిధులు కేటాయించారు తప్ప ఒక్కటంటే ఒక్క పధకమూ సకాలంలో ముగిసే విధంగా కేటాయింపులు లేవు. ప్రయాణీకులపై భారం పెంచలేదని మీడియాలో కొన్ని సంస్ధలు బాకాలు వూదాయి.గతంలో పెంచిన ఛార్జీలు, వివిధ సందర్భాలలో తత్కాల్‌, టిక్కెట్ల రద్దు పేరుతో భారీగా వసూలు చేస్తున్న విషయాన్ని దాచి పెట్టారు.కొన్ని తరగతుల టిక్కెట్ల ధరలు పెంచితే అవి విమాన ఛార్జీలకు దగ్గరగా చేరి ఆ బోగీలు ఖాళీగా వుండే ప్రమాదం పొంచి వుండబట్టి తప్ప ప్రయాణీకుల మీద ప్రేమతో కాదని గమనించాలి. సరకు రవాణా చార్జీలు పెంచితే ఇప్పటికే పెరుగుతున్న ధరలు మరింతగా పెరుగుతాయి, ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. రెండవది ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా రైళ్లను పెంచకుండా కేవలం చార్జీలు పెంచితే జనంలో వ్యతిరేకత కూడా వస్తుందన్న విషయం తెలిసిందే.

నరేంద్రమోడీ సర్కార్‌ గతేడాది కాలంగా రైల్వేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచిందేమీ లేదు. దేశ ఆర్ధిక వ్యవస్ధలో అల్లావుద్దీన్‌ అద్భుత దీపంతో దేశ ఆర్ధిక వ్యవస్థ రూపు రేఖలను మార్చివేస్తామని చెప్పిన పెద్దలు దీపం అరిపోయే విధానాలు అనుసరిస్తున్నారు. సరకు రవాణా, ప్రయాణీకుల నుంచి వస్తుందని అంచనా వేసిన మొత్తానికి వచ్చిన మొత్తానికి 17వేల కోట్ల రూపాయల లోటు ఏర్పడింది.ఇవిగాక ఏడవ వేతన కమిషన్‌ సిఫార్సులు అమలు జరిపితే రైల్వేలపై మరో 32వేల కోట్ల రూపాయల ఖర్చు మొత్తం 50వేల కోట్ల రూపాయల వరకు లోటు ఏర్పడ నుంది. ఈ లోటును పూడ్చుకొనేందుకు రైల్వే ఆస్ధులను అమ్మటం, ప్రయివేటీకరణ చేయటానికి పూనుకోవటం తప్ప చార్డర్డ్‌ ఎకౌంటెంట్‌ సురేష్‌ ప్రభుగారి బడ్జెట్‌ మరొకటి ఏమైనా వుందా ?

సాధారణ బడ్జెట్‌కు ముందు విడుదల చేసే ఆర్ధిక సర్వేలోనే బడ్జెట్‌ ఎలా వుండబోతోందో స్ధూలంగా తెలియ చేస్తారు. తాజా ఆర్ధిక సర్వేలో చెప్పిన అంశాలు సబ్సిడీలన్నీ ధనికులకే దక్కుతున్నాయన్న ప్రచార దాడి చూస్తే మిగిలిన వాటికి కూడా త్వరలో మంగళం పాడటం ఖాయంగా కనిపిస్తోంది. ఐరోపాలో ముందు సబ్సిడీలను రద్దు చేశారు.పోయింది సబ్సిడీలే కదా అని జనం పెద్దగా పట్టించుకోలేదు. తరువాత వేతన స్ధంభన, అది తాత్కాలికమే అనుకున్నారు, ఆ తరువాత పెన్సన్లలో కోత ,మంచి రోజులు రాకపోతాయా అని ఎదురు చూశారు. అన్న వస్త్రాలను అడిగితే వున్న వస్త్రాలనే లాగి వేసినట్లుగా ఒక్కొక్కదానిని లాగి వేసిన తరువాతే జనానికి తత్వం తలకెక్కి వీధులకు ఎక్కుతున్నారు. మరి మనం ఏం చేద్దాం ? ఏం చేయాలి? ఎలా చేయాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Global Crude oil price of Indian Basket was US$ 31.26 per bbl on 22.02.2016

23 Tuesday Feb 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

crude oil price, crude oil price of Indian Basket

 

The international crude oil price of Indian Basket as computed/published today by Petroleum Planning and Analysis Cell (PPAC) under the Ministry of Petroleum and Natural Gas was US$ 31.26 per barrel (bbl) on 22.02.2016. This was higher than the price of US$ 31.07 per bbl on previous publishing day of 19.02.2016.

In rupee terms, the price of Indian Basket increased to Rs 2142.93 per bbl on 22.02.2016 as compared to Rs 2127.88 per bbl on 19.02.2016. Rupee closed weaker at Rs 68.55 per US$ on 22.02.2016 as against Rs 68.49 per US$ on 19.02.2016.The table below gives details in this regard:

 

Particulars     Unit Price on February 22, 2016 (Previous trading day i.e. 19.02.2016) Pricing Fortnight for 16.02.2016

(28 Jan to  11 Feb, 2016)

Crude Oil (Indian Basket) ($/bbl)               31.26             (31.07)   30.05
(Rs/bbl           2142.93         (2127.88) 2040.70
Exchange Rate   (Rs/$)               68.55             (68.49)     67.91

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

Global Crude oil price of Indian Basket was US$ 26.95 per bbl on 11.02.2016

13 Saturday Feb 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

crude oil price of Indian Basket, PPAC

 

The international crude oil price of Indian Basket as computed/published today by Petroleum Planning and Analysis Cell (PPAC) under the Ministry of Petroleum and Natural Gas was US$ 26.95 per barrel (bbl) on 11.02.2016. This was lower than the price of US$ 27.72 per bbl on previous publishing day of 10.02.2016.

In rupee terms, the price of Indian Basket decreased to Rs 1833.30 per bbl on 11.02.2016 as compared to Rs 1881.77 per bbl on 10.02.2016. Rupee closed weaker at Rs 68.02 per US$ on 11.02.2016 as against Rs 67.88 per US$ on 10.02.2016.The table below gives details in this regard:

 

Particulars Unit Price on February 11, 2016(Previous trading day i.e. 10.02.2016) Pricing Fortnight for 01.02.2016

(14 Jan to 27 Jan, 2016)

Crude Oil (Indian Basket) ($/bbl) 26.95             (27.72) 26.05
(Rs/bbl 1833.30         (1881.77) 1763.06
Exchange Rate (Rs/$) 68.02             (67.88) 67.68

 

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d