• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: November 2016

Consumer Price Index Numbers for the Month of October 2016

16 Wednesday Nov 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

All India CPI, All-India Consumer Price Index, Consumer Price Indices, price index

 

Consumer Price Index Numbers on Base 2012=100 For Rural, Urban and Combined for the Month of October 2016

The Central Statistics Office (CSO), Ministry of Statistics and Programme Implementation has revised the Base Year of the Consumer Price Index (CPI) from 2010=100 to 2012=100 with effect from the release of indices for the month of January 2015.

  1. In this press note, the CPI (Rural, Urban, Combined) on Base 2012=100 is being released for the month of October 2016. In addition to this, Consumer Food Price Index (CFPI) for all India Rural, Urban and Combined are also being released for October 2016. All India Inflation rates (on point to point basis i.e. current month over same month of last year, i.e., October 2016 over October 2015), based on General Indices and CFPIs are given as follows:

All India Inflation rates (%) based on CPI (General) and CFPI

Indices October 2016 (Prov.) September 2016 (Final) October 2015 (Final)
Rural Urban Combd. Rural Urban Combd. Rural Urban Combd.
CPI (General) 4.78 3.54 4.20 5.04 3.64 4.39 5.54 4.28 5.00
CFPI 3.86 2.33 3.32 4.50 2.88 3.96 5.18 5.47 5.25

Notes: Prov.  – Provisional, Combd. – Combined

  1. 3.         Monthly changes in the General Indices and CFPIs are given below:

Monthly changes (%) in All India CPI (General) and CFPI: Oct. 2016 over Sep. 2016

Indices Rural Urban Combined
Index Value % Change Index Value % Change Index Value % Change
Oct.16 Sep.16 Oct.16 Sep.16 Oct.16 Sep.16
CPI (General) 133.8 133.4 0.30 128.6 128.0 0.47 131.4 130.9 0.38
CFPI 137.1 136.9 0.15 136.2 135.6 0.44 136.8 136.5 0.22

Note: Figures of October 2016 are provisional.

  1. 4.         Provisional indices for the month of October 2016 and also the final indices for September 2016 are being released with this note for all-India and for State/UTs. All-India provisional General (all-groups), Group and Sub-group level CPI and CFPI numbers for October 2016 for Rural, Urban and Combined are given in Annexure I. The inflation rates of important categories of items are given in Annexure II. State/UT wise provisional General CPI numbers for Rural, Urban and Combined are given in Annexure III. Inflation rates of major States, having population more than 50 lakhs as per population Census 2011, are given in Annexure IV. State/UT–wise Group CPIs are available on the Ministry’s website (mospi.gov.in).
  2. Price data are collected from selected towns by the Field Operations Division of NSSO and from selected villages by the Department of Posts. Price data are received through web portals, maintained by the National Informatics Centre.

Next date of release:  12th December 2016 (Monday) for November 2016.                    

Annexure I

All India Consumer Price Indices

(Base: 2012=100)

Group Code Sub-group Code Description Rural Urban Combined
Weights Sep. 16 Index
(Final)
Oct. 16 Index
(Prov.)
Weights Sep. 16 Index
(Final)
Oct. 16 Index
(Prov.)
Weights Sep. 16 Index
(Final)
Oct. 16 Index
(Prov.)
(1) (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11) (12)
  1.1.01 Cereals and products 12.35 130.8 131.4 6.59 128.1 128.7 9.67 129.9 130.5
  1.1.02 Meat and fish 4.38 138.2 137.6 2.73 137.7 138.3 3.61 138.0 137.8
  1.1.03 Egg 0.49 130.5 130.1 0.36 130.6 130.2 0.43 130.5 130.1
  1.1.04 Milk and products 7.72 135.5 136.0 5.33 132.6 132.7 6.61 134.4 134.8
  1.1.05 Oils and fats 4.21 120.2 120.6 2.81 111.9 112.5 3.56 117.2 117.6
  1.1.06 Fruits 2.88 139.2 138.5 2.90 132.5 130.4 2.89 136.1 134.7
  1.1.07 Vegetables 7.46 149.5 149.2 4.41 152.9 155.1 6.04 150.7 151.2
  1.1.08 Pulses and products 2.95 170.4 170.3 1.73 173.6 175.7 2.38 171.5 172.1
  1.1.09 Sugar and Confectionery 1.70 113.1 113.4 0.97 115.1 115.4 1.36 113.8 114.1
  1.1.10 Spices 3.11 135.8 136.3 1.79 144.8 145.3 2.50 138.8 139.3
  1.2.11 Non-alcoholic beverages 1.37 128.8 128.6 1.13 122.1 122.5 1.26 126.0 126.1
  1.1.12 Prepared meals, snacks, sweets etc. 5.56 141.5 142.5 5.54 138.8 139.6 5.55 140.2 141.2
1   Food and beverages 54.18 137.2 137.4 36.29 135.7 136.3 45.86 136.6 137.0
2   Pan, tobacco and intoxicants 3.26 139.9 141.0 1.36 143.9 144.3 2.38 141.0 141.9
  3.1.01 Clothing 6.32 138.5 139.6 4.72 128.7 129.1 5.58 134.6 135.5
  3.1.02 Footwear 1.04 133.5 134.3 0.85 121.6 121.9 0.95 128.6 129.1
3   Clothing and footwear 7.36 137.8 138.8 5.57 127.7 128.0 6.53 133.8 134.5
4   Housing 21.67 127.9 128.7 10.07 127.9 128.7
5   Fuel and light 7.94 129.7 129.8 5.58 114.8 115.1 6.84 124.1 124.2
  6.1.01 Household goods and services 3.75 131.1 131.8 3.87 124.3 124.5 3.80 127.9 128.4
  6.1.02 Health 6.83 127.8 128.7 4.81 121.4 121.8 5.89 125.4 126.1
  6.1.03 Transport and communication 7.60 117.0 117.8 9.73 111.8 112.8 8.59 114.3 115.2
  6.1.04 Recreation and amusement 1.37 125.7 126.5 2.04 120.8 121.2 1.68 122.9 123.5
  6.1.05 Education 3.46 132.2 133.1 5.62 131.6 131.9 4.46 131.8 132.4
  6.1.06 Personal care and effects 4.25 122.8 123.0 3.47 121.2 120.8 3.89 122.1 122.1
6   Miscellaneous 27.26 124.9 125.6 29.53 120.5 120.9 28.32 122.8 123.3
General Index (All Groups) 100.00 133.4 133.8 100.00 128.0 128.6 100.00 130.9 131.4
Consumer Food Price Index 47.25 136.9 137.1 29.62 135.6 136.2 39.06 136.5 136.8

Notes:

  1. Prov.        : Provisional.
  2. –               : CPI (Rural) for housing is not compiled.
  3. The weights are indicative to show relative importance of groups and sub-groups. However, all India indices have been compiled as weighted average of State indices.

Annexure II

All India annual inflation rates (%) for October 2016 (Provisional)

(Base: 2012=100)

Group Code Sub-group Code Description Rural Urban Combined
Oct. 15 Index
(Final)
Oct. 16

Index
(Prov.)

InflationRate
(%)
Oct. 15 Index
(Final)
Oct. 16

Index
(Prov.)

InflationRate
(%)
Oct. 15 Index
(Final)
Oct. 16

Index
(Prov.)

InflationRate
(%)
(1) (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11) (12)
1.1.01 Cereals and products 125.6 131.4 4.62 123.6 128.7 4.13 125.0 130.5 4.40
1.1.02 Meat and fish 130.4 137.6 5.52 128.6 138.3 7.54 129.8 137.8 6.16
1.1.03 Egg 120.8 130.1 7.70 115.9 130.2 12.34 118.9 130.1 9.42
1.1.04 Milk and products 129.4 136.0 5.10 128.5 132.7 3.27 129.1 134.8 4.42
1.1.05 Oils and fats 115.8 120.6 4.15 109.0 112.5 3.21 113.3 117.6 3.80
1.1.06 Fruits 133.2 138.5 3.98 124.1 130.4 5.08 129.0 134.7 4.42
1.1.07 Vegetables 157.7 149.2 -5.39 165.8 155.1 -6.45 160.4 151.2 -5.74
1.1.08 Pulses and products 154.2 170.3 10.44 187.2 175.7 -6.14 165.3 172.1 4.11
1.1.09 Sugar and Confectionery 93.7 113.4 21.02 89.4 115.4 29.08 92.3 114.1 23.62
1.1.10 Spices 126.6 136.3 7.66 135.8 145.3 7.00 129.7 139.3 7.40
1.2.11 Non-alcoholic beverages 122.3 128.6 5.15 119.4 122.5 2.60 121.1 126.1 4.13
1.1.12 Prepared meals, snacks, sweets etc. 133.1 142.5 7.06 132.9 139.6 5.04 133.0 141.2 6.17
1 Food and beverages 131.8 137.4 4.25 132.6 136.3 2.79 132.1 137.0 3.71
2 Pan, tobacco and intoxicants 131.5 141.0 7.22 135.3 144.3 6.65 132.5 141.9 7.09
3.1.01 Clothing 131.1 139.6 6.48 124.4 129.1 3.78 128.5 135.5 5.45
3.1.02 Footwear 127.3 134.3 5.50 118.8 121.9 2.61 123.8 129.1 4.28
3 Clothing and footwear 130.6 138.8 6.28 123.6 128.0 3.56 127.8 134.5 5.24
4 Housing – – – 122.4 128.7 5.15 122.4 128.7 5.15
5 Fuel and light 124.4 129.8 4.34 114.9 115.1 0.17 120.8 124.2 2.81
6.1.01 Household goods and services 125.1 131.8 5.36 120.7 124.5 3.15 123.0 128.4 4.39
6.1.02 Health 122.0 128.7 5.49 117.7 121.8 3.48 120.4 126.1 4.73
6.1.03 Transport and communication 113.8 117.8 3.51 109.3 112.8 3.20 111.4 115.2 3.41
6.1.04 Recreation and amusement 120.1 126.5 5.33 117.7 121.2 2.97 118.7 123.5 4.04
6.1.05 Education 125.1 133.1 6.39 126.5 131.9 4.27 125.9 132.4 5.16
6.1.06 Personal care and effects 114.2 123.0 7.71 113.5 120.8 6.43 113.9 122.1 7.20
6 Miscellaneous 119.2 125.6 5.37 116.5 120.9 3.78 117.9 123.3 4.58
General Index (All Groups) 127.7 133.8 4.78 124.2 128.6 3.54 126.1 131.4 4.20
Consumer Food Price Index 132.0 137.1 3.86 133.1 136.2 2.33 132.4 136.8 3.32

 

Notes:

  1. Prov.       : Provisional.
  2. –               : CPI (Rural) for housing is not compiled.

 

Annexure III

State/UT wise General Consumer Price Indices

(Base: 2012=100)

State/UT Code Name of the State/UT Rural Urban Combined
Weights Sep. 16 Index
(Final)
Oct. 16 Index
(Prov.)
Weights Sep. 16 Index
(Final)
Oct. 16 Index
(Prov.)
Weights Sep. 16 Index
(Final)
Oct. 16 Index
(Prov.)
(1) (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11)
01 Jammu & Kashmir 1.14 132.8 131.9 0.72 124.8 125.1 0.94 130.0 129.5
02 Himachal Pradesh 1.03 132.6 133.4 0.26 123.7 124.2 0.67 131.0 131.7
03 Punjab 3.31 129.8 130.0 3.09 126.6 126.7 3.21 128.4 128.5
04 Chandigarh 0.02 141.1 142.9 0.34 124.6 125.2 0.17 125.5 126.2
05 Uttarakhand 1.06 127.7 128.6 0.73 120.9 121.0 0.91 125.2 125.8
06 Haryana 3.30 130.1 131.3 3.35 124.1 124.5 3.32 127.3 128.1
07 Delhi 0.28 129.1 128.9 5.64 130.4 130.8 2.77 130.3 130.7
08 Rajasthan 6.63 135.4 135.6 4.23 129.4 130.1 5.51 133.3 133.6
09 Uttar Pradesh 14.83 132.2 132.3 9.54 128.7 128.9 12.37 130.9 131.1
10 Bihar 8.21 135.2 135.7 1.62 127.2 128.2 5.14 134.0 134.6
11 Sikkim 0.06 141.6 140.5 0.03 133.9 134.7 0.05 139.1 138.6
12 Arunachal Pradesh 0.14 139.7 140.3 0.06 — — 0.10 — —
13 Nagaland 0.14 140.9 141.8 0.12 128.3 128.5 0.13 135.5 136.1
14 Manipur 0.23 126.5 129.5 0.12 125.2 125.9 0.18 126.1 128.4
15 Mizoram 0.07 130.7 132.3 0.13 123.8 124.5 0.10 126.5 127.5
16 Tripura 0.35 138.2 140.0 0.14 132.2 132.6 0.25 136.7 138.1
17 Meghalaya 0.28 135.0 135.4 0.15 124.8 125.0 0.22 131.8 132.2
18 Assam 2.63 128.7 129.7 0.79 127.3 128.1 1.77 128.4 129.4
19 West Bengal 6.99 133.7 134.4 7.20 129.0 129.7 7.09 131.5 132.2
20 Jharkhand 1.96 137.5 139.1 1.39 127.2 128.3 1.69 133.6 135.0
21 Odisha 2.93 138.9 139.7 1.31 127.4 127.2 2.18 135.7 136.2
22 Chhattisgarh 1.68 138.7 139.2 1.22 127.8 127.8 1.46 134.5 134.8
23 Madhya Pradesh 4.93 129.7 129.6 3.97 127.5 128.1 4.48 128.8 129.0
24 Gujarat 4.54 136.2 136.0 6.82 125.5 125.8 5.60 130.1 130.2
25 Daman & Diu 0.02 142.0 144.7 0.02 129.0 129.4 0.02 136.6 138.3
26 Dadra & Nagar Haveli 0.02 136.6 137.1 0.04 123.8 124.6 0.03 128.1 128.8
27 Maharashtra 8.25 133.5 134.6 18.86 124.2 125.1 13.18 127.3 128.3
28 Andhra Pradesh 5.40 137.2 137.5 3.64 131.1 131.7 4.58 134.9 135.4
29 Karnataka 5.09 135.4 134.6 6.81 134.7 134.9 5.89 135.0 134.8
30 Goa 0.14 141.6 142.0 0.25 126.6 126.3 0.19 132.4 132.4
31 Lakshadweep 0.01 130.2 128.6 0.01 123.0 119.0 0.01 126.5 123.7
32 Kerala 5.50 130.5 130.5 3.46 131.2 131.2 4.55 130.7 130.7
33 Tamil Nadu 5.55 130.4 131.0 9.20 130.1 130.7 7.25 130.2 130.8
34 Puducherry 0.08 139.0 138.2 0.27 129.5 129.5 0.17 131.9 131.7
35 Andaman & Nicobar Islands 0.05 134.3 136.2 0.07 124.6 125.6 0.06 129.4 130.8
36 Telangana 3.16 133.5 135.5 4.41 129.5 130.2 3.74 131.3 132.6
99 All India 100.00 133.4 133.8 100.00 128.0 128.6 100.00 130.9 131.4

Notes:

  1. Prov.       :  Provisional.
  2. —             :  indicates the receipt of price schedules is less than 80% of allocated schedules and therefore indices are not compiled.

 

Annexure IV

Major State/UT wise annual inflation rates (%) for October 2016 (Provisional)

(Base: 2012=100)

State/UT Code Name of the State/UT Rural Urban Combined
Oct. 15 Index
(Final)
Oct. 16

Index
(Prov.)

InflationRate
(%)
Oct. 15 Index
(Final)
Oct. 16

Index
(Prov.)

InflationRate
(%)
Oct. 15 Index
(Final)
Oct. 16

Index
(Prov.)

InflationRate
(%)
(1) (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11)
01 Jammu & Kashmir 126.3 131.9 4.43 123.0 125.1 1.71 125.1 129.5 3.52
02 Himachal Pradesh 128.0 133.4 4.22 118.9 124.2 4.46 126.4 131.7 4.19#
03 Punjab 123.7 130.0 5.09 123.1 126.7 2.92 123.4 128.5 4.13
05 Uttarakhand 123.8 128.6 3.88 118.9 121.0 1.77 122.0 125.8 3.11
06 Haryana 124.7 131.3 5.29 121.1 124.5 2.81 123.0 128.1 4.15
07 Delhi 124.2 128.9 3.78 125.1 130.8 4.56 125.1 130.7 4.48
08 Rajasthan 128.7 135.6 5.36 125.1 130.1 4.00 127.4 133.6 4.87
09 Uttar Pradesh 126.5 132.3 4.58 125.2 128.9 2.96 126.0 131.1 4.05
10 Bihar 131.6 135.7 3.12 125.8 128.2 1.91 130.8 134.6 2.91
18 Assam 127.1 129.7 2.05 125.0 128.1 2.48 126.7 129.4 2.13
19 West Bengal 126.3 134.4 6.41 124.4 129.7 4.26 125.4 132.2 5.42
20 Jharkhand 129.3 139.1 7.58 123.7 128.3 3.72 127.2 135.0 6.13
21 Odisha 132.9 139.7 5.12 124.0 127.2 2.58 130.4 136.2 4.45
22 Chhattisgarh 136.0 139.2 2.35 124.6 127.8 2.57 131.6 134.8 2.43
23 Madhya Pradesh 126.1 129.6 2.78 124.7 128.1 2.73 125.5 129.0 2.79*
24 Gujarat 128.3 136.0 6.00 121.6 125.8 3.45 124.5 130.2 4.58
27 Maharashtra 127.2 134.6 5.82 120.9 125.1 3.47 123.0 128.3 4.31
28 Andhra Pradesh 129.7 137.5 6.01 127.0 131.7 3.70 128.7 135.4 5.21
29 Karnataka 130.1 134.6 3.46 129.4 134.9 4.25 129.7 134.8 3.93
32 Kerala 125.7 130.5 3.82 125.9 131.2 4.21 125.8 130.7 3.90
33 Tamil Nadu 126.1 131.0 3.89 126.9 130.7 2.99 126.6 130.8 3.32
36 Telangana 124.5 135.5 8.84 124.2 130.2 4.83 124.3 132.6 6.68
99 All India 127.7 133.8 4.78 124.2 128.6 3.54 126.1 131.4 4.20

Notes:

  1. Prov.               :  Provisional.
  2. #                      :  Less than those of Rural as well as Urban due to rounding.
  3. *                      :  More than those of Rural as well as Urban due to rounding.

 

 

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

India’s Foreign Trade: October, 2016

16 Wednesday Nov 2016

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Foreign Trade, India’s Foreign Trade

 

  1. MERCHANDISE TRADE

 EXPORTS (including re-exports)

In consonance with the revival exhibited by exports last month, during October 2016 exports have shown a positive growth of 9.59% in Dollar terms (12.43% higher in Rupee term). During October,2016 exports were valued at US$ 23512.70 million (Rs.156941.86 crore) as compared to US$ 21456.11 million (Rs.139589.17 crore) during October,2015. Cumulative value of exports for the period April-October 2016-17 was US$ 154913.20 million (Rs.1036417.49 crore) as against US$ 155179.35 million (Rs.998211.69 crore) in October 2015-16, registering a negative growth of 0.17 per cent in Dollar terms and positive growth of 3.83 per cent in Rupee terms.

Non-petroleum exports in October 2016 are valued at US$ 20797.13 million against US$ 18923.83 million in October 2015, an increase of 9.9 %. Non-petroleum exports during April to October 2016 are valued at US$ 138111.18 million as compared to US$ 135691.68 million for the corresponding period in 2015, an increase of 1.8%.

The growth in exports for USA (0.20%), EU (5.78%), Japan (10.03%) but China exhibited negative growth (-3.01%) for August 2016 over the corresponding period of previous year as per latest WTO statistics.

IMPORTS

Imports during October 2016 were valued at US$ 33673.53 million (Rs.224763.10 crore) which was 8.11 per cent higher in Dollar terms and 10.91 per cent higher in Rupee terms over the level of imports valued at US$ 31148.33 million (Rs.202644.79) in October,2015. Cumulative value of imports for the period April-October 2016-17 was US$ 208083.15 million (Rs.1392221.35 crore) as against US$ 233417.95 million (Rs.1501290.90 crore) registering a negative growth of 10.85 per cent in Dollar terms and 7.27 per cent in Rupee terms over the same period last year.

CRUDE OIL AND NON-OIL IMPORTS:

Oil imports during October, 2016 were valued at US$ 7141.48 million which was 3.98 percent higher than oil imports valued at US$ 6868.28 million in the corresponding period last year. Oil imports during April-October, 2016-17 were valued at US$ 46438.65 million which was 15.78 per cent lower than the oil imports of US$ 55139.39 million in the corresponding period last year.

Non-oil imports during October, 2016 were estimated at US$ 26532.05 million which was 9.28 per cent higher than non-oil imports of US$ 24280.05 million in October, 2015. Non-oil imports during April-October 2016-17 were valued at US$ 161644.50 million which was 9.33 per cent lower than the level of such imports valued at US$ 178278.56 million in April-October, 2015-16.

  1. TRADE IN SERVICES (for September, 2016, as per the RBI Press Release dated 15thOctober 2016)

EXPORTS (Receipts)

Exports during September 2016 were valued at US$ 13773 Million (Rs. 91917.83 Crore) registering a positive growth of 2.93 per cent in dollar terms as compared to positive growth of 4.74 per cent during August 2016 (as per RBI’s Press Release for the respective months).

IMPORTS (Payments)

Imports during September 2016 were valued at US$ 8,304 Million (Rs. 55418.99 Crore) registering a positive growth of 3.10 per cent in dollar terms as compared to positive growth of 8.71 per cent during August 2016 (as per RBI’s Press Release for the respective months).

III.TRADE BALANCE

MERCHANDISE: The trade deficit for April-October, 2016-17 was estimated at US$ 53169.95 million which was 32.04% lower than the deficit of US$ 78238.60 million during April-October, 2015-16.

SERVICES: As per RBI’s Press Release dated 15th November 2016, the trade balance in Services (i.e. net export of Services) for September, 2016 was estimated at US$ 5,469 million. The net export of services for April- September, 2016-17 was estimated at US$ 32358 million which is lower than net export of services of US$ 34042 million during April- September, 2015-16. (The data for April-September 2015-16 and 2016-17 has been derived by adding April-September month wise QE data of RBI Press Release).

OVERALL TRADE BALANCE: Overall the trade balance has improved. Taking merchandise and services together, overall trade deficit for April- October 2016-17 is estimated at US$ 20811.95 million which is 52.91 percent lower in Dollar terms than the level of US$ 44196.60 million during April-October 2015-16. (Services data pertains to April-September 2016 as September 2016 is the latest data available as per RBI’s Press Release dated 15th November 2016)

 

MERCHANDISE TRADE

 

EXPORTS & IMPORTS : (US $ Million)
(PROVISIONAL)  
  OCTOBER APRIL-OCTOBER
EXPORTS(including re-exports)  
2015-16 21456.11 155179.35
2016-17 23512.70 154913.20
%Growth2016-17/ 2015-16 9.59 -0.17
IMPORTS  
2015-16 31148.33 233417.95
2016-17 33673.53 208083.15
%Growth2016-17/ 2015-16 8.11 -10.85
TRADE BALANCE  
2015-16 -9692.22 -78238.60
2016-17 -10160.83 -53169.95
   
EXPORTS & IMPORTS : (Rs. Crore)
(PROVISIONAL)
  OCTOBER APRIL-OCTOBER
EXPORTS(including re-exports)  
2015-16 139589.17 998211.69
2016-17 156941.86 1036417.49
%Growth2016-17/ 2015-16 12.43 3.83
IMPORTS  
2015-16 202644.79 1501290.90
2016-17 224763.10 1392221.35
%Growth2016-17/ 2015-16 10.91 -7.27
TRADE BALANCE  
2015-16 -63055.62 -503079.21
2016-17 -67821.24 -355803.86

SERVICES TRADE

 

EXPORTS & IMPORTS (SERVICES) : (US $ Million)
(PROVISIONAL) September 2016-17
EXPORTS (Receipts) 13773.00
IMPORTS (Payments) 8304.00
TRADE BALANCE 5469.00
   
EXPORTS & IMPORTS (SERVICES): (Rs. Crore)
(PROVISIONAL) September 2016-17
EXPORTS (Receipts) 91917.83
IMPORTS (Payments) 55418.99
TRADE BALANCE 36498.85
Source: RBI Press Release dated 15th November 2016

 

 

MJPS

 

 

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనంపై నరేంద్రమోడీ పెట్రో సర్జికల్‌ దోపిడీ ఎంతో తెలుసా

11 Friday Nov 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices

≈ Leave a comment

Tags

Mody's sarkar, Narendra Modi, petro surgical looty, petrol price, petrol price build up, petrol price build up in india, subsidies

Image result for  petro  looty

మోడీ పాలనా విధానం దానికి గుజరాత్‌ నమూనా అంటారో లేక న్యూఢిల్లీ నమూనా అని పేరు పెడతారో తెలియదు గానీ జనం కోల్పోయిన సబ్సిడీల మొత్తం రు. 1,16,167 కోట్లు, తమ జేబుల్లోంచి అదనంగా చెల్లించింది లక్ష కోట్లు, అంటే మొత్తం జరిగిన లూటీ రు 2,16,000 కోట్లు, అదీ ఒక్క ఏడాదికి మాత్రమే సుమా ! ఇది ఒక్క పెట్రోలియం రంగంలో చేసిన మాజిక్‌ మాత్రమే. పోనీ పెట్రోలియం సబ్సిడీలు ఎత్తివేసి గతంలో లేని అదనపు సంక్షేమ కార్యక్రమం ఏదైనా ప్రారంభించారా అంటే లేదు. వుంటే చెప్పమనండి.

ఎం కోటేశ్వరరావు

   చెప్పింది వినటం, గొర్రెల్లా తలూపటం తప్ప ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు వేస్తే దేశద్రోహులుగా పరిగణించే రోజులివి. అయినా సరే గట్టిగా ఎవరైనా కాదంటే నరేంద్రమోడీ భక్తులు భౌతిక దాడులకు పాల్పడినా ఆశ్చర్యం లేదు. అంతగా అసహనం పెరిగిపోయింది. అలాంటి స్ధితిలో మన కంటే పాకిస్థాన్‌లో పెట్రోలు ధరలు ఎందుకు తక్కువగా వున్నాయి అని ఎవరైనా ప్రశ్నించి బతక్కగ్గలరా ? నిజంగా అక్కడ తక్కువగా వున్నాయా ? అయినా అడగక తప్పదు. అయితే వారి వద్ద సమాధానం వుండదు. లేదూ ఎవరైనా స్వంతబుర్రలు వున్నవారు వుంటే వారికి తెలిసినా చెప్పరు. సామాజిక మీడియాలో దీనికి సంబంధించిన చర్చ ప్రస్తావనకు వచ్చినపుడు వస్తున్న సమాధానాలు చదివిన తరువాత కలిగిన అభిప్రాయమిది. ఒక పోస్టులో పాకిస్థాన్‌లో పెట్రోలు లీటరు 26 రూపాయలు అని సామాజిక మీడియాలో తిరుగుతున్నది. కొందరు వాస్తవాలు సరిచూసుకోవాలని చెప్పారు. మరికొందరు పెంచిన పన్నులు యుపిఏ హయంలో నిర్ణయించినవి తప్ప మోడీ సర్కార్‌ పెంచలేదు అన్నారు. మరికొందరు జిఎస్‌టి అమలులోకి వచ్చిన తరువాత ధరలు తగ్గుతాయి అన్నారు.

    ఏ కారణం చేత అయినా మోడీ భక్తులలో తెలివిగల వారు, నిజాలు తెలిసిన వారు వాస్తవాలు చెప్పటానికి ఎందుకో జంకుతున్నారు. బహుశా వారికి కూడా ఏదో ఒక ముద్ర వేస్తారని భయం కావచ్చు. వారి పట్ల జాలి చూపుదాం. మన దేశానికి సంబంధించిన సమాచారాన్ని మన చమురు సంస్ధల నుంచే తీసుకోవచ్చు. ప్రధాన మంత్రిగా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ప్రపంచంలో చమురు రేట్లు గణనీయంగా తగ్గాయి. కావాలంటే దీన్ని కూడా ఆయన సాధించిన విజయాల ఖాతాలోకే వేద్దాం. మన చమురు సంస్ధల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణ విధానాన్ని ఎత్తివేసింది. ఎందుకంటే సంస్ధల మధ్య పోటీ పెరిగి పెట్రోలు, డీజిల్‌, కిరోసిన్‌ వంటి పెట్రోలియం వుత్పత్తుల ధరలు తగ్గుతాయని చెప్పింది. అదే సమయంలో జనాన్ని ఆకర్షించేందుకు ప్రపంచంలో ధరలు పెరిగితే ఆమేరకు ఆటోమేటిగ్గా మీకూ పెరుగుతాయి, తగ్గితే అదే మాదిరి తగ్గుతాయంటే జనమంతా నిజమే కదా అనుకున్నారు. ఆ ముసుగులో మన సర్కార్‌ చేసిందేమిటంటే అప్పటివరకు ఇస్తున్న సబ్సిడీలు తగ్గించేందుకు పూనుకుంది. అన్నింటి మీదా ఒకేసారి తొలగిస్తే వచ్చే ప్రతికూల పర్యవసానాలకు భయపడి క్రమంగా తగ్గించటం ప్రారంభించింది. తొలుత పెట్రోలుపై పూర్తిగా ,తరువాత డీజిల్‌పై క్రమంగా మొత్తం ఎత్తేశారు. ఇప్పుడు కిరోసిన్‌పై ప్రతినెలా కొంత మొత్తం తగ్గిస్తూ రబ్బరు సుత్తితో కొడుతున్నారు. సబ్సిడీలు ఎత్తివేసినప్పటికీ ప్రపంచ మార్కెట్‌లో తగ్గిన మేరకు మన వినియోగదారులకు ధరలు తగ్గకపోగా పెరిగాయి అన్న నిజాన్ని మోడీ భక్తులు ఒక పట్టాన అంగీకరించరు.

    పెట్రోలియం రంగం మన ఖజానాకు సంపాదించి పెడుతున్న సొమ్ము కాస్తా కూస్తా కాదు. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో అన్ని రకాల ఆదాయం రు. 3,05,360 కోట్లు (అక్షరాలా మూడు లక్షల ఐదువేల మూడు వందల అరవై కోట్లు) ఇది 2014-15లో 3,32,620 కోట్లు, 2015-16లో 4,18,652, వర్తమాన ఆర్ధిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో 1,02,711 కోట్లు. మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వం 2010 జూన్‌ 25 నుంచి పెట్రోల్‌పై సబ్సిడీని పూర్తిగా తగ్గించి వేసింది. మోడీ అధికారానికి వచ్చాక 2014 అక్టోబరు 18 నుంచి డీజిల్‌పై పూర్తిగా రద్దు చేశారు. ప్రస్తుతం ప్రజాపంపిణీ వ్యవస్ద ద్వారా సరఫరా చేసే కిరోసిన్‌పై మాత్రమే కొనసాగిస్తున్నారు. యుపిఏ హయాంలో 2013-14లో పెట్రోలియం వుత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం భరించిన సబ్సిడీ మొత్తం రు.1,43,738కోట్లు కాగా మోడీ వచ్చాక 2014-15లో 76,282 కోట్లకు 2015-16లో రు.27,571 కోట్లకు తగ్గిపోయింది. ఆదా రు. 1,16,167 కోట్లు. కిరోసిన్‌పై కూడా పూర్తిగా పుణ్యం కట్టుకుంటే ఏడాదికి రు.1,43,738కోట్లు మిగిలినట్లే . ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో 2013-14లో ఎక్సైజ్‌ పన్ను రూపంలో 77,982 కోట్లు, 2014-15లో 99,184 కోట్లు, 2015-16లో 1,78,591 కోట్లకు పెరిగింది. పెరిగిన ఆదాయం లక్ష కోట్లరూపాయలు. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు పెట్రోలియం వాడకం పెరిగింది కదా ఆ మేరకు ఆదాయం పెరిగి వుండవచ్చు అన్న సందేహం వెలిబుచ్చవచ్చు. రెండు సంవత్సరాలలో వినియోగం రెట్టింపు పెరగటం అనేది ఏ దేశ చరిత్రలోనూ లేదు. మన వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ మరియు విశ్లేషణ విభాగం (పిపిఏసి  http://ppac.org.in/content/147_1_ConsumptionPetroleum.aspx ) ప్రకారం 2013-14లో అన్ని రకాల పెట్రోలియం వుత్పత్తుల వినియోగం నెలవారీ సగటు 1,32,00,583 టన్నులు 2015-16లో 1,53,87,000 టన్నులు. వర్తమాన సంవత్సరంలో అక్టోబరు వరకు నెల సగటు 1,61,69,428 టన్నులు. మోడీ భక్తులేమో కొత్తగా పన్నులు పెంచలేదంటారు, అయితే ఆదాయం ఇంత పెరుగుదల ఎలా సాధ్యమైంది? మోడీ మంత్రం వేసి పెంచారా ? మోడీ పాలనా విధానం దానికి గుజరాత్‌ నమూనా అంటారో లేక న్యూఢిల్లీ నమూనా అని పేరు పెడతారో తెలియదు గానీ జనం కోల్పోయిన సబ్సిడీల మొత్తం రు. 1,16,167 కోట్లు, తమ జేబుల్లోంచి అదనంగా చెల్లించింది లక్ష కోట్లు, అంటే మొత్తం జరిగిన లూటీ రు 2,16,000 కోట్లు, అదీ ఒక్క ఏడాదికి మాత్రమే సుమా ! ఇది ఒక్క పెట్రోలియం రంగంలో చేసిన మాజిక్‌ మాత్రమే. పోనీ పెట్రోలియం సబ్సిడీలు ఎత్తివేసి గతంలో లేని అదనపు సంక్షేమ కార్యక్రమం ఏదైనా ప్రారంభించారా అంటే లేదు. వుంటే చెప్పమనండి. మన దేశంలోకి వుగ్రవాదులను పంపిన పాక్‌పై మన సైన్యం సర్జికల్‌ దాడులు చేస్తే మనమంతా అభినందించాం. దానికైన ఖర్చు వందల కోట్లు లేదా అంతకంటే తక్కువే కావచ్చు. కానీ మోడీ సర్కార్‌ ప్రతి ఏటా జనంపై పెట్రో రంగంలో జరుపుతున్న సర్జికల్‌ దాడులవలన జనానికి వదులుతున్న చేతి చమురు మాత్రం రెండు లక్షల కోట్లకు పైమాటే.

    పెట్రోలియం రంగం నుంచి ఒక్క ఏడాదిలో లక్ష కోట్ల అదనపు ఆదాయాన్ని ఎలా పిండారు ? 2014 మార్చినెల ఒకటవ తేదీన అంతర్జాతీయ మార్కెట్‌లో పీపా చమురు ధర రవాణా ఖర్చుతో సహా 118 డాలర్లు. ఒక డాలరుకు రూపాయి విలువ రు.62.12 లు. చమురు కంపెనీలు శుద్ధి కర్మాగారాలకు ఒక లీటరు పెట్రోలుకు చెల్లించిన ధర రు.47.18, డీలరుకు విక్రయించింది రు.49.50, ఎక్సయిజ్‌ పన్ను రు.9.48, డీలరు కమిషన్‌ రు.2.02, న్యూఢిల్లీలో వాట్‌ 20శాతం చొప్పున( రాష్ట్రాల రేటును బట్టి మారుతుంది) రు.12.20, మొత్తం వినియోగదారుడికి (హెచ్‌పి) ధర రు.73.20.

    తాజా పరిస్ధితికి వస్తే నవంబరు ఆరున హెచ్‌పి కంపెనీ వివరాల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్‌లో పీపా చమురు ధర రవాణా ఖర్చుతో సహా 61.87 డాలర్లు. ఒక డాలరుకు రూపాయి విలువ రు.66.81 లు. చమురు కంపెనీలు శుద్ధి కర్మాగారాలకు ఒక లీటరు పెట్రోలుకు చెల్లించిన ధర రు.26.64, డీలరుకు విక్రయించింది రు.29.39 ఎక్సయిజ్‌ పన్ను రు.21.48, డీలరు కమిషన్‌ రు.2.43, న్యూఢిల్లీలో వాట్‌ 27శాతం చొప్పున( రాష్ట్రాల రేటును బట్టి మారుతుంది) రు.14.39, మొత్తం వినియోగదారుడికి (హెచ్‌పి) ధర రు.67.70. ఎక్సయిజ్‌ పన్ను రు.9.48 నుంచి 21.48కి పెంచటమే ఆదాయ పెరుగుదల రహస్యం.

    యుపిఏ హయాంలో రూపాయి విలువ నాటి అర్ధిక మంత్రి వయస్సు పెరిగినట్లు పతనం అవుతోందని స్వయంగా నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు.http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2389308/India-2014-elections-Yes-Yes-Modi-launches-BJPs-poll-campaign-massive-rally-Hyderabad.html మోడీ చెప్పినట్లు 1947లో మన రూపాయి విలువ ఒక డాలరుకు ఒక రూపాయిగా వున్నమాట నిజం. కాంగ్రెస్‌ దిగిపోయే నాటికి అంటే రు.62.12కు దిగజారింది. అంటే 67 సంవత్సరాలకు సగటున ఏడాదికి 93 పైసలు పడిపోయింది. అదే మోడీ హయాంలో 62.12 నుంచి 66.81కి పతనమైంది. ఏడాదికి రు 2.34 తగ్గిపోయింది. ఇది కూడా మోడీ ఘనతే అంటారా ? మన దేశంలో పెట్రోలు ధరలు తగ్గకపోవటానికి ఇదొక కారణం. అన్నింటి కంటే పై వివరాలను బట్టి నరేంద్రమోడీ హయాంలో బాదిన ఎక్సయిజ్‌ పన్ను లీటరుకు పన్నెండు రూపాయలు. జనం జేబుల లూటీ ఇక్కడ జరుగుతోంది. దీన్ని కాదనే ధైర్యం ఎవరికైనా వుందా ?

   ఇక పాకిస్థాన్‌లో పెట్రోలు ధరలు తక్కువగా వున్నాయని మోడీ భక్తులు అంగీకరిస్తారో లేదో తెలియదు. వారు కూడా మన మాదిరే పెట్రోలు దిగుమతి చేసుకుంటారు. ఈనెల 9వ తేదీన పాకిస్ధాన్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇలా వున్నాయి. అక్కడ పెట్రోలు కంటే డీజిల్‌ ధరలు ఎక్కువ.http://www.hamariweb.com/finance/petroleum_prices/ దీనిలో వున్న వివరాల ప్రకారం పెట్రోలు ధర రు. 64.27, డీజిల్‌ ధర రు.72.52 వుంది. వీటిని చూసి మోసపోయే అవకాశం వుంది. రెండు చోట్లా కరెన్సీ రూపాయే అయినప్పటికీ విలువలు వేరు. పై ధరలను మన రూపాయిల్లోకి మారిస్తే డీజిల్‌ ధర రు.46.44, పెట్రోలు ధర రు.41.15 వుంటుంది. దీనికి కారణం అక్కడ పన్నులు తక్కువగా వుండటమే.http://www.globalpetrolprices.com/gasoline_prices/ ఈ లింక్‌లోని సమాచారం ప్రకారం వివిధ దేశాలలో డాలర్లలో పెట్రో వుత్పత్తుల ధరలు ఎలా వున్నాయో ఎవరైనా పోల్చుకోవచ్చు.

   ఇక చాలా మంది పెట్రోలియం వుత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తెస్తారని, దాంతో ధరలు తగ్గుతాయనే అభిప్రాయంతో వున్నారు. ఇప్పటి వరకు జరిగిన చర్చలు, వెల్లడైన అభిప్రాయాల ప్రకారం పెట్రోలియం వుత్పత్తులను వెంటనే జిఎస్‌టి పరిధిలోకి తీసుకురారు. ప్రస్తుతం పెట్రోలు కొనుగోలు ధర లీటరుకు రు.29.39 అయితే దానిపై విధిస్తున్న పన్నులు రు.35.87 వున్నాయి. జిఎస్‌టి పద్దతిలో పన్ను మీద పన్ను వుండటానికి వీలుండదు. ప్రస్తుతం అన్ని కలుపుకుంటే 122శాతం వసూలు చేస్తున్నారు. ఇంత మొత్తాన్ని వదులుకొని ఏ ప్రభుత్వమైనా పన్ను తగ్గిస్తుందని ఎవరైనా వూహించుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది. అలాంటి వారి భ్రమలను త్వరలోనే నరేంద్రమోడీ తొలగిస్తారని వేరే చెప్పాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎన్‌డిటివీపై నిషేధం- అసంబద్ద వాదనలు !

08 Tuesday Nov 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, emergency, Free press, Modi, ndtv, ndtv ban, press freedom, un declared emergency

మీడియా స్వేచ్ఛకు ప్రమాద ఘంటికలు

ఎం కోటేశ్వరరావు

    చచ్చిన చేప వాగు వాలున కొట్టుకుపోతుంది. బతికున్న చేప మాత్రమే ఎదురు ఈదుతుంది. దేన్నయినా ప్రశ్నిస్తేనే రచ్చ, చర్చ ప్రారంభమౌతుంది. ఫలానా రోజు ఫలానా చర్యను ఎందుకు ప్రశ్నించలేదు, దీన్ని మాత్రమే ఇప్పుడు ఎందుకు తప్పు పడుతున్నారు అంటే కుదరదు. హేతుబద్దత లేకుండా అసంబద్ధతో మరొకటో వుంటేనే ఎవరైనా నిలదీస్తారు. సమర్ధించుకోవటానికి సరైన కారణాలు దొరకనపుడే చర్చను పక్కదారి పట్టించేందుకు చూస్తారు. వ్యూహాత్మకమైన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారని ఆరోపించి ఎన్‌డిటివీ హిందీ ఛానల్‌ ప్రసారాలను నవంబరు తొమ్మిది-పది తేదీలలో ఒక రోజంతా నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం దండన విధించింది. అత్యవసర పరిస్థితి పేరుతో కాంగ్రెస్‌ నియంతృత్వ పోకడలను వ్యతిరేకించిన ఘనత తమకు వుందని కమలనాధులు తరచూ చెప్పుకుంటారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించటానికి ఒక కారణం, చట్టమూ, అధికారమూ కావాలి. కానీ అనధికారికంగా అమలు జరపటానికి అధికారం వుంటే చాలని నేటి కేంద్ర ప్రభుత్వం ఆచరణలో చూపింది. హేతుబద్దంగా ఆలోచించే వారందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించి నిషేధం ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఒక రోజు నిషేధం మీడియా స్వేచ్చకు, ప్రజాస్వామ్యానికి ముప్పని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి సమయంలో కాంగ్రెస్‌ నేతల మాదిరి తమ చర్యను సమర్ధించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి నాయకులు పెద్ద ఎత్తున ఎదురుదాడులకు పూనుకున్నారు. తమ ద్వంద్వ స్వభావాన్ని బయట పెట్టుకున్నారు.జనానికి విచక్షణా జ్ఞానం వుంటుందనే అంశాన్ని కూడా మరచిపోయి అసంబద్ద వాదనలను ముందుకు తెస్తున్నారు.

    కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌డిటివీ యాజమాన్యం సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దీంతో పాటు దేశ, విదేశాలలో నిరసన,మోడీ సర్కార్‌ అప్రజాస్వామిక చర్యపై విమర్శలతో భయపడిన కేంద్రం నిషేధం విషయమై ప్రభుత్వానికి విన్నవించిన కారణంగా ఎన్‌డిటివీ వాదనలు చెప్పుకొనేందుకు మరో అవకాశం ఇస్తున్నామంటూ నిషేధ నిర్ణయం అమలును వాయిదా వేసుకుంది. రద్దు చేయలేదు. ఈ ప్రకటన చేయబోయే ముందు సాయంత్రం వరకు నిషేధాన్ని సమర్ధించిన సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు రాత్రికి నిషేధాన్ని నిలిపివేసినట్లు అధికారుల చేత ప్రకటన చేయించారు. నవంబరు ఎనిమిదవ తేదీన ఎన్‌డిటివీ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన ఇద్దరు జడ్జీల సుప్రీం కోర్టు బెంచ్‌ తదుపరి విచారణను డిసెంబరు ఐదవ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం విధించిన నిషేధం అమలును వాయిదా వేసినందున ప్రసారంపై అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని వుభయపక్షాల అంగీకరించటంతో కోర్టు వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు ఈ వివాదం మరొక మలుపు తిరిగింది.

    సమస్య తాత్కాలికంగా సర్దుమణిగింది, నిషేధాన్ని వాయిదా వేశారు తప్ప ఎత్తివేయలేదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకీ చర్యకు పాల్పడింది. మీడియా, ప్రజాస్వామిక వాదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పర్యవసానాలేమిటి ? ఎప్పటి మాదిరే దీనిపై కూడా ప్రధాని నరేంద్రమోడీ ఈ వ్యాసం రాసే సమయం వరకు నోరు విప్పలేదు. కనీసం ట్విటర్‌ ద్వారా కూడా స్పందించలేదు. మన్‌కీ బాత్‌లో ఏమైనా బయటపడతారో లేదో చూడాలి. తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై నోరు విప్పకపోవటం నరేంద్రమోడీ వ్యవహార శైలి అన్నది గత రెండున్నర సంవత్సరాల అనుభవం రుజువు చేసింది.

    ప్రతి తరం అత్యవసర పరిస్థితి నాటి కాలాన్ని నిష్పక్షపాతంగా చూస్తే మరొక నేత ఎవరూ అటువంటి తప్పు చేయాలన్న తలంపుకే రారు అని ప్రధాని నరేంద్రమోడీ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక అవార్డుల సభలో వుద్బోధ చేశారు. చిత్రంగా ఆ మరుసటి రోజే అత్యవసర పరిస్థితిని ప్రకటించకుండానే ఎన్‌డిటివీపై ఆ కాలం నాటి నిరంకుశ వైఖరిని ప్రతిబింబిస్తూ ఒక రోజు నిషేధం విధించటం గమనించాల్సిన అంశం. నరేంద్రమోడీకి తెలియకుండానే ఇది జరిగిందా అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. ఇదొక ముఖ్యపరిణామం, అందునా మోడీ అంతరంగం అందరికంటే బాగా ఎరిగిన వెంకయ్య నాయుడు శాఖ, మీడియా స్వేచ్చకు సంబంధించింది, దీని పర్యవసానాల గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు అని ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రక్షణ, హోం, తదితర అంతర మంత్రిత్వశాఖల కమిటీ సిఫార్సుల మేరకు నవంబరు 9వ తేదీ అర్ధరాత్రి నుంచి పదవ తేదీ అర్ధరాత్రి వరకు కార్యక్రమాల ప్రసారాన్ని నిషేధించారు. ఈ ఏడాది జనవరి రెండు నుంచి ఐదువ తేదీ వరకు పఠాన్‌కోట్‌ సైనిక కేంద్రంపై పాకిస్ధాన్‌ వైపు నుంచి ప్రవేశించిన తీవ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఆ దాడికి సంబంధించి జనవరి నాలుగవ తేదీన ఎన్‌డిటివి ప్రసారం చేసిన అంశాలలో మన రక్షణ రహస్యాలను బహిర్గతం చేశారని ప్రభుత్వం ఆరోపించింది. అందుకు గాను 30 రోజుల పాటు నిషేధం విధించాల్సి వున్నప్పటికీ ఒక రోజుకు పరిమితం చేసినట్లు తెలిపింది.ఈ చర్య మీడియా స్వేచ్ఛను ప్రత్యక్షంగా వుల్లంఘించటమే అని, అత్యవసర పరిస్థితి నాటి అవశేషమిదని కూడా భారత సంపాదకుల మండలి (ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా) పేర్కొన్నది.

     జనవరి నాలుగవ తేదీన ఎన్‌డిటివి వార్తలను ప్రసారం చేయగా 29వ తేదీన సమాచార, ప్రసార శాఖ సంజాయిషీ నోటీసు జారీ చేసింది. వ్యూహాత్మకంగా రహస్యమైన సమాచారాన్ని ప్రసారం చేసినందున భద్రతా దళాలు చేపట్టిన ప్రతిక్రియలను అడ్డుకొనేందుకు నేరం చేసిన వారు వుపయోగించుకొనే అవకాశం వున్నందున, అది నిబంధనలకు విరుద్దమైనందునా ఎందుకు ప్రసారం చేశారో సంజాయిషీ ఇవ్వాలని దానిలో కోరింది.2015లో సవరించిన 1995 కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌(నియంత్రణ) చట్టం ప్రకారం భద్రతా దళాలు చేపట్టే ఏ విధమైన వుగ్రవాద నిరోధక చర్యలనైనా ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఆ చట్టం నిర్దేశించిన ప్రసార స్మృతిలో పేర్కొన్నారు. పఠాన్‌కోట్‌ వైమానిక స్ధావరంపై పాకిస్తాన్‌ నుంచి వచ్చిన వుగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు మిలిటరీ జవాన్లు, ఒక పౌరుడు మరణించారు. తీవ్రవాదులు దాడి కొనసాగుతుండగానే జనవరి నాలుగున ఎన్‌డిటివి రిపోర్టర్‌ ఆ వార్తలో చెప్పిన అంశం ఇలా వుందని ప్రభుత్వం పేర్కొన్నది.’ ఇద్దరు మిలిటెంట్లు ఇంకా సజీవంగానే వున్నారు, వారు మందుగుండు సామగ్రి డిపో పక్కనే వున్నారు. మిలిటెంట్లు మందుగుండు సామగ్రి డిపోను చేరుకున్నట్లయితే వారిని నిర్వీర్యం చేయటం కష్టమౌతుందని దాడిని ఎదుర్కొంటున్న జవాన్లు ఆందోళన చెందుతున్నారు.’ అని వ్యాఖ్యానించారని, ఆ ప్రసారంలో వైమానిక స్ధావరం గురించి కూడా సమాచారాన్ని వెల్లడించారంటూ ‘ దానిలో మిగ్‌ యుద్ధ విమానాలు, రాకెట్‌ లాంచర్లు, మోర్టార్లు, హెలికాప్టర్లు, ఇంధన నిల్వలు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు వున్నాయని కూడా పేర్కొన్నట్లు ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో తెలిపింది.ఈ సమాచారాన్ని స్వయంగా టెర్రరిస్టులు లేదా వారిని ప్రయోగిస్తున్నవారు గానీ వుపయోగించుకోవచ్చని పేర్కొన్నది.

  చట్టం ముందు ఎన్‌డిటివీగానీ మరొక ఛానల్‌ గాని అమలులో వున్న నిబంధనలను పాటించాలనటంలో ఎలాంటి విబేధం లేదు, ఎవరూ అందుకు విరుద్ధంగా మాట్లాడటం లేదు. ఎవరైనా అలా చేస్త్తే చర్యతీసుకోవాలి, చట్టం తనపని తాను చేసుకుపోతుంది. అందుకు కోర్టులు, చట్టాలున్నాయి. చట్ట ప్రకారం తప్పుచేస్తే అందరికీ దండన విధించాలి. ఎన్‌డిటివీ, దానిపై విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న సంపాదకుల మండలి, ప్రయివేటు టీవీ ఛానల్స్‌ సభ్యులుగా వున్న నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ ఇతర అనేక జర్నలిస్టు సంఘాల అభ్యంతరం కూడా అలాంటి వార్తలనే ఇచ్చిన ఇతర సంస్ధలపై ఎలాంటి చర్య తీసుకోకుండా ఒక్కదానిపై మాత్రమే దండన ఎందుకు విధిస్తున్నారన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. ఏదైనా ఒక శిక్ష అది చిన్నదా పెద్దదా అనేదానితో నిమిత్తం లేకుండా తగిన అధికారాలుగల సంస్ధ లేదా పదవిలో వున్నవారు మాత్రమే విధించాలి. కానీ శిక్ష విధించే అధికారాన్ని సమాచార,మంత్రిత్వశాఖ తనకు తాను పుచ్చుకోవటం ఏమిటని కూడా మీడియా సంస్ధలు సవాలు చేశాయి.

    ప్రభుత్వం జారీ చేసిన నోటీసుకు ఫిబ్రవరి ఐదున ఎన్‌డిటివీ సమాధానమిచ్చింది. తమ వార్త బాధ్యతాయుతంగా,సముచితంగా వుందని, వార్తలో పేర్కొన్న అంశాలు తాము ప్రసారం చేయటానికి ముందే వార్తా పత్రికలలో వచ్చాయని తెలిపింది. వాటికి సంబంధించిన వివరాలను కూడా ప్రభుత్వానికి తెలిపింది. జనవరి మూడవ తేదీన ఐఎఎన్‌ఎస్‌ (వార్తా సంస్ధ) ఇచ్చిన వార్తను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిందని, దానిలో ‘మిగ్‌ 21 యుద్ధ విమానాలు, ఎంఐ 35 యుద్ధ హెలికాప్టర్లు, ఇతర ముఖ్యమైన సొత్తు ‘ వైమానిక స్ధావరంలో వుందని దానిలో పేర్కొన్నారు. జనవరి మూడున టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో వుపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, నిఘారాడార్లు వున్నాయని తెలిపారు. జనవరి నాలుగున ఒక సైనిక బ్రిగేడియర్‌ను వుటంకిస్తూ హిందుస్తాన్‌ టైమ్స్‌ పత్రిక ‘ ఇద్దరు వుగ్రవాదులు ఒక రెండంతస్ధుల భవనంలో వుండిపోయారని, అక్కడ వైమానిక దళ సిబ్బంది నివాసముంటారని ‘ పేర్కొన్నది. వాటిపై తీసుకోని చర్య తమకు ఎలా వర్తిస్తుందని ఎన్‌డిటివీ ప్రశ్నించింది.

     నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌బిఏ) సెక్రటరీ జనరల్‌ ఆనీ జోసెఫ్‌ ఒక ప్రకటన చేస్తూ ప్రభుత్వ చర్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వార్తలను ఇతర మీడియా కూడా ఇచ్చిందని అవన్నీ బహిరంగంగా అందుబాటులోనే వున్నాయని పేర్కొంటూ ఎన్‌డిటివీ ఒక్కదానిపైనే చర్య తీసుకోవటం ఆశ్చర్యంగా వుందన్నారు. అంతర మంత్రిత్వ శాఖల కమిటీ, సమాచార మంత్రిత్వశాఖ ఈ అంశాన్ని కేబుల్‌ చట్టంలోని పక్కా నిబంధనల మేరకు గాక రాజ్యాంగంలో హామీ ఇచ్చిన మీడియా స్వేచ్చ కోణం నుంచి చూడాలని, ఒక వేళ ఎన్‌డిటివీ నిబంధనలను వుల్లంఘించిదనుకుంటే ఆ విషయాన్ని ఎన్‌బిఏ ఏర్పాటు చేసిన స్వయం నియంత్రణ సంస్ధ న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్స్‌ అధారిటీ (ఎన్‌బిఎస్‌ఏ)కు నివేదించి వుండాల్సిందని, ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని ఎన్‌బిఏ కోరింది.

   ప్రభుత్వ నిర్ణయం అసాధారణమైందని ఖండిస్తూ తక్షణమే వెనక్కు తీసుకోవాలని భారత సంపాదకుల మండలి కోరింది.’ ఒక ఛానల్‌ను ఒక రోజు పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకోవటం మీడియా, తద్వారా దేశ పౌరుల స్వేచ్చపై ప్రత్యక్ష వుల్లంఘన, అంతేకాదు కఠినమైన సెన్సార్‌షిప్పును విధించటం అత్యవసరపరిస్థితి నాటి అవశేషమే. వార్తలు ఇచ్చిన తీరుతో ఎప్పుడైనా ప్రభుత్వం అంగీకరించకపోతే మీడియా పనిలో జోక్యం చేసుకొనే అధికారాన్ని స్వయంగా పుచ్చుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రసారాలను నిలిపివేయటం ఇదే మొదటిసారి. బాధ్యతా రహితంగా వార్తలను ఇచ్చినపుడు పౌరులు, రాజ్యానికి కోర్టు ద్వారా చర్యలు తీసుకోవటానికి చట్టపరమైన పలు పరిష్కార మార్గాలు వున్నాయి. న్యాయపరమైన జోక్యం లేకుండా నిషేధం విధింపు స్వేచ్చ, న్యాయమనే ప్రాధమిక సూత్రాలను వుల్లంఘించటమే.’ అని తన ప్రకటనలో పేర్కొన్నది. బ్రాడ్‌కాస్టర్స్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ కూడా ఒక ప్రకటన చేసింది.నిషేధం విధించటం భావ ప్రకటనా స్వేచ్చను వుల్లంఘించటమే అని, నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని కోరింది. ఈ వుదంతంపై తరువాత ఒక సమగ్రనివేదికను తయారు చేస్తామని తెలిపింది.

     ఎన్‌డిటీవిపై నిషేధాన్ని మీడియా రంగానికి చెందిన ఎడిటర్స్‌ గిల్డ్‌, బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌, అనేక జర్నలిస్టు సంఘాలు వ్యతిరేకించాయి. కారణాలు ఏమైనప్పటికీ కొంత మంది మౌనం పాటించారు. నిషేధాన్ని విమర్శిస్తే కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్‌డియే పక్షాల రాష్ట్ర ప్రభుత్వాలకు కోపం వస్తుందని కావచ్చు, కొన్ని మీడియా సంస్ధలు ఆ విషయాన్ని ప్రచురించకుండా లేదా అప్రాధాన్యత ఇచ్చిగానీ మొత్తం మీద ఏదో తప్పనిసరై వార్త ఇవ్వాల్సి వచ్చిందిగానీ ప్రభుత్వానికి మేం వ్యతిరేకం కాదన్న సందేశాన్ని చేరవేశాయి. జెఎన్‌యు విద్యార్ధుల జాతీయ వ్యతిరేక నినాదాల ఆరోపణల గురించి నకిలీ వీడియోలను ప్రసారం చేసిన జీ మీడియా , ప్రముఖ పారిశ్రామిక సంస్ధ ఎస్సెల్‌ గ్రూప్‌ అధిపతి, రాజ్యసభ సభ్యుడిగా వున్న సుభాష్‌ చంద్ర మాత్రం ఎన్‌డిటివీని ఒక రోజు నిషేధించటం అన్యాయం, చిన్న శిక్ష , అసలు పూర్తిగా నిషేధించాలని ప్రకటించారు. ఒక వేళ అది కోర్టుకు వెళ్లినా అక్కడ చీవాట్లు తింటుందని కూడా ముందే చెప్పారు. అంతేకాదు, యుపిఏ హయాంలో తమ జీ న్యూస్‌ను నిషేధించాలనే ప్రతిపాదన వచ్చినపుడు మేథావులు, ఎడిటర్స్‌ గిల్డ్‌, ఎన్‌డిటివీ కూడా మౌనం వహించాయని కూడా సుభాష్‌ చంద్ర పేర్కొన్నారు.

    నిబంధనలను వుల్లంఘించినందుకు గాను ప్రభుత్వం 2005 నుంచి 28సార్లు ఇలా నిషేధ నోటీసులు జారీ చేసిందని వాటిలో 21 యుపిఏ హయాంలో జారీ అయినవే అని అధికారుల ద్వారా ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకొనేందుకు చూసింది. దానిలో భాగంగానే ఎన్‌డిటీవీ తరువాత మరో రెండు ఛానల్స్‌పై తీసుకున్న చర్యలను వెల్లడించింది. ఇది జనాన్ని తప్పుదారి పట్టించే ఎత్తుగడ. నిబంధనలను వుల్లంఘించి అన్ని ఛానల్స్‌, పత్రికలపై చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టటం లేదు. ఒకే తప్పు చేసిన మిగతావారిని వదలి ఒక్క ఎన్‌డిటివీపై మాత్రమే ఎందుకు చర్య తీసుకున్నారు? అన్నదే ప్రశ్న. గతంలో చర్యలు తీసుకున్నపుడు ఆయా ఛానల్స్‌ నిషేధాన్ని సవాలు చేయలేదు. అంటే అవి తప్పు చేసినట్లు అంగీకరించినట్లే. వాటిలో బూతు దృశ్యాలను చూపించిన కేసులు కూడా వున్నాయి.

    మీడియాలోని ప్రభుత్వ భక్తులు కొందరు విచిత్ర వాదనలను ముందుకు తెస్తున్నారు. భారత్‌లో మీడియా స్వేచ్చ తక్కువగానే వుందని చెబుతారు. అయితే అంటూ చైనా, బంగ్లాదేశ్‌, టర్కీ వంటి దేశాలలో ఇంతకంటే దారుణంగా వున్నాయనే వాదనలను ముందుకు తెస్తున్నారు.అంటే నిషేధాన్ని సమర్ధిస్తున్నట్లా ? మనకు కావాల్సిన నేత ఎలా వుండాలంటే ఎవరైనా గాంధీ గురించి చెబుతారు తప్ప అనేక మందితో పోల్చితే గాడ్సే మంచివాడే అన్నట్లుగా వుంది ఈ సమర్ధన. మన కంటే పత్రికా స్వేచ్చ మెరుగ్గా వున్న దేశాలతో పోల్చుకుంటే మనం ఎక్కడ ? ఇలాంటి చర్యలతో మనం ఎక్కడకు పోతున్నాం అన్నది ప్రశ్న.

    తన తప్పుడు చర్యను సమర్ధించుకొనేందుకు ప్రభుత్వం అనేక అసంబద్ద కారణాలను చూపుతోంది. టీవీ ఛానల్స్‌లో విలేకర్లు చెప్పిన సమాచారాన్ని వుగ్రవాదులు వుపయోగించుకొని దాడులు చేసే ప్రమాదం వుందట. వెనుకటి కెవడో అమాయకుడు నా పేరు ఫలానా రెడ్డి నీకు తెలివి వుంటే నా కులం ఏమిటో కనుక్కో అన్నాడట. ఏ దేశంలో అయినా సైనిక శిబిరాలలో సైనికులు, ట్యాంకులు, విమానాలు, మందుగుండు సామాగ్రి వుంటుందని వేరొకరు చెప్పాల్సిన అవసరం వుంటుందా ? అంతెందుకు మన ప్రభుత్వం ప్రకటించినట్లు మన సైన్యం జయప్రదంగా నిర్వహించిన సర్జికల్‌ దాడులు ఎక్కడ జరపాలో మన సైన్యం ఏ టీవీ, పత్రికా వార్తలను చూసి నిర్ణయించుకుందో ఎవరైనా చెప్పగలరా ? గూగుల్‌ మాప్‌లను చూస్తే ఎక్కడ ఏ సంస్ధలు వున్నాయో, ఎలా వెళ్లాలో కూడా ప్రపంచానికంతటికీ తెలుసు. అయినా దాడికి తెగబడిన వుగ్రవాదులు గానీ లేదా వారిని అంతంచేసేందుకు పూనుకున్న సాయుధ బలగాలు గానీ టీవీ వార్తలు చూసి తమ దాడి, ప్రతిదాడి వ్యూహాలను నిర్ణయించుకుంటారా ? ప్రభుత్వ వాదన ప్రకారమైతే దాడులకు ఒక చేత్తో ఆయుధం, మరో చేత్తో టీవీ పట్టుకోవాలి. పోనీ టీవీలో ఒక ఛానల్‌ కాదుగా అనేక ఛానల్స్‌ వుంటాయి. ఏ ఛానల్‌ ఏ సమాచారం తెలుస్తుందో రిమోట్‌లు నొక్కుతూ కాలక్షేపం చేస్తారా ? ఫఠాన్‌ కోట సైనిక శిబిరంపై దాడికి తెగబడ్డ వుగ్రవాదులను అంతం చేసిన మన సైన్యం వారి శవాల వద్ద టీవీ సెట్లు వున్నట్లు చెప్పలేదు. అత్యాధునికమైన ఇతర పరికరాలతో వారు ప్రవేశించినట్లు కదా ప్రకటించారు.

     ఒక వుదంతం గురించి దాదాపు ఒకే విధంగా వార్తలు ఇచ్చిన పత్రికలు, ఛానల్స్‌లో ఒక్క సంస్ధను మాత్రమే వేరు చేసి చర్య తీసుకోవటం వెనుక ఇతర కారణాలు వున్నాయా ? మోడీ సర్కార్‌ వివక్షను ప్రదర్శించిందా ? ఢిల్లీలోని ఆంగ్ల పత్రికలు, న్యూస్‌ ఛానల్స్‌ తమ పార్టీకి వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ అన్యాపదేశంగా గతంలో తరచూ ఆరోపించేది. ఇప్పుడు కూడా మీడియా పట్ల ఆ పార్టీ, దాని మిత్రపక్షాలకు సదభిప్రాయం లేదు. విమర్శనాత్మకంగా వుండటమే దానికి కారణం.విలేకర్లను ప్రెస్టిట్యూట్స్‌ అని ఏకంగా కేంద్రమంతి వికె సింగ్‌ నిందించారు. ఇంతకాలమైనా ప్రధాని నరేంద్రమోడీ మీడియాను కలవకుండా తప్పించుకోవటానికి ఆంగ్ల భాషా సమస్యతో పాటు ఇదొక కారణమని కూడా చెబుతారు.

    ఎన్‌డిటివీ విషయానికి వస్తే ఆ ఛానల్‌ అన్నా, దానిలో పనిచేసిన కొందరు జర్నలిస్టులన్నా నరేంద్రమోడీకి పడదు. బిజెపికి వీరాభిమాని అయిన జర్నలిస్టు, రచయిత్రి అయిన మధు కిష్వెర్‌ 2013లో మోడీ నామా పేరుతో తన పత్రికలో నరేంద్రమోడీ గురించి ఆకాశానికెత్తుతూ అనేక వ్యాసాలు రాశారు, తరువాత వాటిని పుస్తకంగా ప్రచురించారు.2014లో ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ఆమెకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఇద్దరు జర్నలిస్టులు బర్ఖాదత్‌, రాజదీప్‌ సర్దేశాయి కారణంగానే 2002లో గుజరాత్‌లో ఘర్షణలు చెలరేగాయని మోడీ ఆరోపించారు. ‘తొలి 72 గంటలు(నాలుగు రోజులు) ఘర్షణలు అదుపులో వున్నాయి. తరువాత ఏమైంది ? కొన్ని సంఘటనలను జర్నలిస్టులు సంచలనాత్మకం గావించారు. సూరత్‌ నుంచి బర్ఖాదత్‌, ఒక దేవాలయ్యాన్ని విధ్వంసం చేశారని అంజార్‌ నుంచి సర్దేశాయి ప్రత్యక్ష ప్రసారాలలో వార్తలను అందించారు. సూరత్‌ నగరం ప్రశాంతంగా వుందని, అక్కడ పోలీసులెవరూ లేనందున అలజడులు జరిగే అవకాశముందని బర్ఖాదత్‌ పదే పదే చెప్పారని, ఆమెను పిలిచి మీరు విధ్వంసకారులను సూరత్‌కు ఆహ్వానిస్తున్నారా అని నిలదీశానని, ఆరోజే ఆ ఛానల్‌ను తాను నిషేధించానని మోడీ చెప్పారు. అయితే తరువాత తానసలు సూరత్‌ వెళ్లలేదని బర్ఖాదత్‌ వివరణ ఇచ్చారని వార్తలు వచ్చాయి. నిజానికి గుజరాత్‌ మారణకాండ సందర్భంగా అనేక ఛానల్స్‌ సంచలనాత్మక కధనాలు ఇచ్చినప్పటికీ నరేంద్రమోడీ వాటిని పట్టించుకోలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ఒక్క ఎన్‌డిటీవితో తప్ప ఇతర అన్ని ఛానల్స్‌కు ఇంటర్వూ ఇచ్చారు.

    ఇటీవలి కాలంలో ఢిల్లీ జెఎన్‌యు ఘటనలు, గుజరాత్‌లో అమిత్‌ షా సభను ఆటంక పరిచిన పటేళ్ల ఆందోళన, దళితులపై దాడులకు వ్యతిరేకంగా జరిగిన జరిగిన యాత్ర, గుజరాత్‌ దళితనేత జిగ్నేష్‌ మేవానీ, గుజరాత్‌లో అమ్‌ పార్టీ నేత కేజిరీవాల్‌ సభ గురించి బిజెపి, నరేంద్రమోడీ అండ్‌కోకు నచ్చని రీతిలో ఎన్‌డిటివీ వార్తలను ప్రసారం చేసింది. జెఎన్‌యు ఘటనల సందర్భంగా కొన్ని టీవీ ఛానల్స్‌ వ్యవహరించిన తీరును ఎండగడుతూ ఎన్‌డిటివీ హిందీ ఛానల్‌ అరగంటపాటు బొమ్మలు లేకుండా కేవలం అక్షరాలనే ప్రదర్శించి తనదైన శైలిలో వ్యవహరించింది. ఇది కూడా బిజెపి నేతలకు ఆగ్రహం తెప్పించింది. పాలకపార్టీ, ప్రభుత్వ తీరుతెన్నులను బహిర్గత పరుస్తున్న కారణంగానే ఎన్‌డిటివీ యాజమాన్య నిర్వహణ, ఆర్ధిక వ్యవహారాల గురించి వేధింపులకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. టేకోవర్‌ నిబంధనలను సరిగా పాటించలేదంటూ సెబి, విదేశీ మారక ద్య్రవ నిబంధనలను వుల్లంఘించారంటూ ఎన్‌ఫోర్స్‌డైరెక్టరేట్‌ ద్వారా ఒక నోటీసు పంపి వేధింపులకు పూనుకుందన్న విమర్శలు వున్నాయి.

    భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని వుపయోగించి అధికారుల ద్వారా ఈ విధమైన వేధింపులకు పాల్పడటంతో పాటు ఎన్‌డిటివీపై తన అనుచరగణాన్ని వుసిగొల్పి సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున దాడి చేయిస్తున్నది. ఇది ఒక విధంగా బ్లాక్‌ మెయిలింగ్‌ ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఒక సంస్ధ తప్పు చేస్తే దానిపై ఫిర్యాదు చేయవచ్చు, కేసులు దాఖలు చేయవచ్చు. కానీ ఆ సంస్ధలలో పనిచేస్తున్న సిబ్బంది వ్యక్తిగత జీవితాలపై సామాజిక మీడియాలో ప్రచారం చేయటం హేయం. అది ముదిరితే ఏదో ఒకనాటికి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు బిజెపి, దాని నేతలపైన కూడా దానిని ప్రయోగిస్తారని వారు తెలుసుకోవటం లేదు. వారు ఒక్క జర్నలిస్టుల గురించే కాదు, తమను వ్యతిరేకించే వారందరి పట్ల ఇదే విధంగా వ్యవహరిస్తారనే విమర్శ వుంది. స్వంత పార్టీలోనే నరేంద్రమోడీని వ్యతిరేకించిన సంజయ్‌ జోషి ఒక మహిళతో వున్నట్లు చూపే బూతు సీడీలను ఆ పార్టీ వారే పంపిణీ చేయించారనే విమర్శలు వున్న విషయం తెలిసిందే. ఆ సంజయ్‌ జోషికి తిరిగి పార్టీలో పదవి ఇచ్చినందుకు గాను పదవి నుంచి తొలగించే వరకు తాను పార్టీ సమావేశాలకు రానని 2009లో నరేంద్రమోడీ బెదిరించిన విషయం, అందుకు పార్టీ తలొగ్గిన విషయం తెలిసిందే. అందువలన ఒక ఛానల్‌, ఒక పత్రికపై జరుగుతున్న దాడిగా దీనిని చూస్తే రాబోయే ముప్పును విస్మరించినట్లే. అధికారంలో వున్న పార్టీ ఈ విధంగా తనకు నచ్చని మీడియాను వేధించటమంటే లొంగదీసుకొని భజన చేయించుకొనేందుకే తప్ప మరొకటి కాదు. ఈ రోజు ఒక పార్టీ అధికారంలో వుంటే రేపు మరొక పార్టీ రావచ్చు. అప్పుడు మరికొన్ని ఛానల్స్‌, పత్రికల పని పట్టవచ్చు. తెలంగాణాలో ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌ను కేబుల్‌ ఆపరేట్ల ద్వారా అడ్డుకోవటాన్ని ఖండించిన తెలుగు దేశం పార్టీ తాను అధికారంలో వున్న ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి ఛానల్‌ను కూడా అదే పద్దతుల్లో అడ్డుకున్న విషయం చూశాము. ఆంధ్రజ్యోతిని అడ్డుకున్నపుడు సాక్షి మౌనం వహిస్తే సాక్షిపై దాడి జరిగినపుడు ఆంధ్రజ్యోతి కూడా అదే పని చేసింది. ఇది మీడియాలో అవాంఛనీయ పోకడ. యాజమాన్యాల వైఖరి కారణంగా ఆయా సంస్ధలలో పని చేసే జర్నలిస్టులు ఇరకాటంలో పడుతున్నారు. యాజమాన్యాలతో పాటు వారిని కూడా శత్రువులుగా చూస్తున్నారు. ఇప్పుడు ఎన్‌డిటీవి విషయంలో కూడా కొన్ని మీడియా యాజమాన్యాల వైఖరి అలాగే వుంది. పాలకపార్టీలకు ముఖ్యంగా అన్ని వ్యవస్ధలను తమ చెప్పుచేతల్లో వుంచుకోవాలని చూస్తున్న శక్తులకు కావాల్సింది ఇదే. ముందు విమర్శనాత్మకంగా వున్న వాటిని తొక్కిపెడితే మిగిలిన వాటిని అదుపు చేయటం వాటికి చిటికెలో పని. అందుకే జర్నలిస్టులు యాజమాన్యాల వైఖరితో నిమిత్తం లేకుండా స్వతంత్ర వైఖరిని కలిగి వుండి, మీడియా, తద్వారా భావ ప్రకటనా స్వేచ్చపై జరిగే దాడిని ఎదుర్కోవటంలో ముందుండటం అవసరం.

గమనిక :నవంబరు నెల వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి మాస పత్రికలో ప్రచురణ నిమిత్తం రాసినది

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ సర్కార్‌పై మరో రేటింగ్‌ సంస్ధ క్రిసిల్‌ వత్తిడి

04 Friday Nov 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

CRISIL, Modi, Narendra Modi, narendra modi government, rating agency crisil, s&p

ఎం కోటేశ్వరరావు

    గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధిని దేశమంతటికీ వర్తింప చేస్తామని వూరూ వాడా ప్రచారం చేసిన నరేంద్రమోడీ అండ్‌ కో ఇప్పుడు దాని గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. అది మంచిదా, చెడ్డదా అన్న విషయాన్ని పక్కన పెడితే తాను అమలు జరిపినట్లు చెప్పుకున్న దానినే మోడీ ఎందుకు అమలు జరపటం లేదని అది మంచి విధానం అనుకొనే వారు కూడా మోడీని ప్రశ్నించటం లేదు. ఫలితాలు చూపకుండా ఎవరి డబ్బా వారు ఎంత కాలం కొట్టుకుంటారు, ఆ స్ధితిలో ఏదో ఒక సంస్ధ ఇచ్చే కితాబు కోసం ఎవరైనా ఎదురు చూస్తారు. ఇప్పుడు నరేంద్రమోడీ ఆ స్థితిలో వున్నారు కనుకనే ప్రపంచబ్యాంకు ర్యాంకింగుల  ఇండెక్సు, రేటింగ్‌ సంస్ధల రేటింగ్‌ల కోసం వెంపర్లాడుతున్నారు. గతంలో ఇందిరా గాంధీని ఏవమ్మా ధరలు పెరుగుతున్నాయేమంటే కారణం విదేశీ హస్తం అని చెప్పేవారని జోక్‌ చేసేవారు. ఎందుకంటే విదేశీ హస్తాన్ని ఆమె అంతగా వాడుకున్నారు. చివరకా విదేశీ హస్తానికే ఆమె బలికావటం విషాదం అనుకోండి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత మన ఎగుమతులు నెలనెలా పడిపోతున్నట్లు వార్తలు రావటమే తప్ప పెరిగినట్లు ఇంతవరకు వినలేదు. కారణం విదేశాలలో పరిస్ధితులు బాగోలేవు అని చెబుతున్నారు. అది ఒక్క మన దేశానికేనా మిగతా దేశాలకు వర్తించవా ? అని ఎవరైనా అడిగితే దేశద్రోహి అన్నట్లుగా విరుచుకుపడతారు.

     మరో రెండు సంవత్సరాల వరకు రేటింగ్‌ను మార్చాల్సినంత సీన్‌ లేదని స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ రేటింగ్‌ సంస్ద గాలి తీసింది. దాని కొనసాగింపా అన్నట్లుగా ఇప్పుడు క్రిసిల్‌ అనే మరో సంస్ధ మన ఎగుమతులు పడిపోవటానికి ప్రతికూల పరిస్ధితులే కారణమని సాకు చెపితే కుదరదని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవటంతో పాటు దేశీయంగా వినియోగాన్ని కూడా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తాజాగా రూపొందించిన ఒక విశ్లేషణ పత్రంలో పేర్కొన్నది. ప్రధాని ఇచ్చిన మేకిన్‌ ఇండియా పిలుపును జయప్రదం చేయాలంటే రెండు మార్గాలు అనుసరించాలని సూచిస్తూ ఆ పత్రానికి ‘బైఫోకల్‌ ప్లీజ్‌ ‘ ( దయచేసి రెండు మార్గాల్లో నడవండి ) అని పేరు పెట్టింది.http://www.thehindu.com/business/Economy/global-situation-not-to-blame-for-fall-in-exports-crisil-study/article9301285.ece గత కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరించిన దివాలా కోరు విధానాలను కొనసాగిస్తూ, సంక్షేమ చర్యలకు మరింత కోత విధిస్తూ, పౌరుల ఆదాయాల పెంపునకు అవసరమైన విధానాలు అమలు జరపకుండా దేశీయ వినియోగాన్ని పెంచటం నరేంద్రమోడీ సర్కార్‌కు సాధ్యమేనా అన్నది ప్రశ్న. కుండలో కూడు తరగ కూడదు పిల్లాడు మాత్రం బొద్దుగా తయారు కావాలంటే సాధ్యమేనా ? రేటింగ్‌ సంస్ధలు చేసే విమర్శలు, విశ్లేషణలన్నీ కార్పొరేట్లకు అనుకూలంగానే వుంటాయన్నది గమనంలో వుంచుకోవాలి. క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ధ విశ్లేషణతో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడితే అసలదేం చెప్పిందో చూద్దాం.

    ఎగుమతుల పోటీ తత్వాన్ని పెంచేందుకు కార్మిక చట్టాలలో వున్న కాఠిన్యతను తొలగించాలి, భూ సేకరణతో ముడిపడిన సవాళ్లను పరిష్కరించాలి, అరకొరగా వున్న రోడ్లు,రేవులు, విద్యుత్‌ వంటి వాటిని పుష్కలంగా సమకూర్చాలి, నైపుణ్యం లేని మానవశక్తి స్ధానంలో నిపుణులను అందుబాటులోకి తేవాలి. ప్రపంచబాంకు సమాచారం ప్రకారం 2014లో ఒక కంటెయినర్లో వస్తువులను ఎగుమతి చేయాలంటే భారత్‌లో ఖర్చు 1332 డాలర్లు, అదే బంగ్లాదేశ్‌కు 1281, చైనాకు 823, వియత్నాంకు 610, ఇండోనేషియాకు 572 డాలర్లుగా వుంది. చైనా తక్కువ విలువ ఆధారిత వుత్పత్తులైన వస్త్రాలు, దుస్తులు, పాదరక్షలు, బొమ్మల నుంచి వైదొలగి అధిక విలువ వుండే వస్తువుల వైపు మరలుతున్నందున దాని ఖాళీలో భారత్‌ ప్రవేశించాలంటే పైన పేర్కొన్న చర్యల వంటి వాటిని తీసుకోవాలి. అయితే ఇప్పటివరకు అందుబాటులో వున్న సమాచారం మేరకు ఇంతవరకు ఇలాంటి చర్యలు లేవు. వుదాహరణకు జౌళి రంగంలో భారత ఎగుమతులు 2001-15 మధ్య కాస్త అటూ ఇటూగా ఒకే విధంగా వున్నాయి. బంగ్లాదేశ్‌, వియత్నాం ఎన్నో రెట్లు పెంచాయి. పాదరక్షల విషయంలో కూడా భారత వాటా గిడసబారి పోగా వియత్నాం దూసుకుపోయింది.

      ఈ నివేదికలో పేర్కొన్న డిమాండ్లను విదేశీ, స్వదేశీ కార్పొరేట్లు ఇప్పుడేదో కొత్తగా తెచ్చినవి కాదు, ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చట్ట సవరణకు పూనుకుంది. రూపాయి విలువ పెంచకుండా, సాధ్యమైన మేరకు తగ్గించేందుకు నరేంద్రమోడీ తన సర్వశక్తులు ధారపోస్తున్నారు. ఈ పూర్వరంగంలోనే తెలంగాణా,ఆంధ్రప్రదేశ్‌లలో పూలింగ్‌ పేరుతో రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారు. ప్రశ్నించిన రైతులను అరెస్టు చేస్తున్నారు, బెదిరించి దారికి తెచ్చుకుంటున్నారు. కార్మిక చట్టాలు వున్నప్పటికీ వాటి అమలును పక్కన పడేశారు, ఎక్కడైనా కార్మికులు ప్రశ్నిస్తే పోలీసులను రంగంలోకి దించి పారిశ్రామిక, వాణిజ్య వేత్తలకు భరోసా, ధైర్యం కల్పించే చర్యలకు పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దివీస్‌ లాబ్‌ విస్తరణ, తుందుర్రులో రొయ్యల శుద్ధి కర్మాగారం ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారిపై జరుగుతోంది ఇదే. క్రిసిల్‌ చెప్పిన ఒక మార్గంలో ఇవన్నీ భాగమే. ఇక అది చెప్పిన రెండవ మార్గం స్ధానిక వినిమయం లేదా డిమాండ్‌ పెంచటం గురించి చూద్దాం. ఇక్కడే మన దేశానికి చైనాకు కనిపిస్తున్న ప్రధాన వైరుధ్యం. ఎవరైనా దీన్ని ప్రస్తావిస్తే అది కమ్యూనిస్టు నియంతృత్వ దేశం, మనది స్వేచ్చా ప్రజాస్వామిక దేశం అన్న సమాధానం టక్కున చెప్పేస్తారు. ప్రజాస్వామ్యంలో వేతనాల పెంపుదల ద్వారా ప్రజల ఆదాయాలు తద్వారా వినిమయాన్ని పెంచవద్దని ఎవరైనా చెప్పారా ? పోనీ కమ్యూనిస్టు నియంతృత్వంలో బలవంతగా వేతనాలు పెంచేట్లు చేశారనుకుందాం, ప్రజాస్వామ్యంలో స్వచ్చందంగా పెంచవచ్చు కదా ? ఎందుకు ఆ పని చేయటం లేదు.

   http://www.businesstoday.in/magazine/features/textile-sector-target-one-crore-jobs-in-three-years/story/238641.html బిజినెస్‌ టుడే తాజా సంచికలో జౌళి రంగం గురించి రాసిన వ్యాసంలో వివిధ దేశాలలో ఆ రంగంలో పని చేస్తున్న కార్మికుల వేతనాల గురించి ప్రస్తావన వుంది. దాని ప్రకారం చైనాలో నెలకు 314, వియత్నాంలో 145, భారత్‌లో 120, బంగ్లాదేశ్‌లో 68 డాలర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చైనాలో మన కంటే వేతనాలు తక్కువ కారణంగా అది చౌకగా దుస్తులను ఎగుమతి చేయగలుగుతున్నదని ఎవరైనా వాదిస్తే దీనికి ఏం జవాబు చెబుతారు ? ఒక్క ఈ రంగంలోనే కాదు అన్నింటా వేతనాలు పెరుగుతున్నాయని అమెరికా ఆర్ధికవేత్తలే చెబుతున్నారు. ఈ కారణంగానే 2008 నుంచి ధనిక దేశాలలో తలెత్తిన మాంద్మం కారణంగా చైనా ఎగుమతులు తగ్గిపోయినప్పటికీ, వాటి స్ధానాన్ని దేశీయ వినియోగం పెంచటం ద్వారా భర్తీ చేస్తున్నది. అందుకే పెద్దగా సమస్యలు రాలేదు. ఎగుమతి ఆధారిత విధానం నుంచి క్రమంగా దేశీయ డిమాండ్‌ పెంపుదలకు తీసుకుంటున్న చర్యలను విస్మరిస్తే సరైన అంచనాకు రాజాలము.http://www.sify.com/finance/struggling-indian-savers-threaten-modi-s-growth-ambition-news-economy-qk2eEhagffebf.html ఇది గతనెలాఖరులో రాయిటర్స్‌ ఇచ్చిన వార్త. చైనా నుంచి అభివృద్ధి పతాకాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తున్న భారత కలలకు పడిపోతున్న పొదుపు రేటు ఒక హెచ్చరిక అని మన స్ధూల జాతీయాదాయం (జిడిపి)లో జాతీయ పొదుపు మొత్తం 2003వ సంవత్సరం తరువాత అతి తక్కువగా ఈ ఏడాది 30.2శాతానికి పడిపోయిందని, రానున్న రెండు సంవత్సరాలలో కూడా ఇది తగ్గుతుందని అంతర్జాతీయ వాణిజ్య సంస్ధ అంచనా వేస్తున్నట్లు దానిలో వుంది. రాయిటర్స్‌గానీ, ఐఎంఎఫ్‌ గానీ మోడీ వ్యతిరేక సంస్ధలు కావని గుర్తించాలి. మన జనం పైసా పైసా కూడ బెట్టి బ్యాంకులు, పోస్టాఫీసులు తదితర సంస్ధలలో దాచుకుంటారు. వుద్యోగులు ప్రావిడెంట్‌ ఫండ్స్‌, బీమా పధకాల వంటి వాటిలో జమ చేస్తారు. ఈ మొత్తాలను పారిశ్రామిక వాణిజ్య వేత్తలు తమ పెట్టుబడులుగా వుపయోగించుకుంటారు. విజయ మాల్య, కావూరు సాంబశివరావు, సుజనా చౌదరి వంటి వారు కూడా వారిలో వుంటారనుకోండి, ఆ కథలు వేరే. దేశీయంగా పొదుపు మొత్తం తగ్గితే వారు మన కంటే తక్కువ వడ్డీకి వచ్చే విదేశీ పెట్టుబడులపై ఆధారపడతారు. అయితే దాని ఇబ్బందులు దానికి వుంటాయి.

    అభివృద్ధిలో చైనాను వెనక్కు నెట్టి వుద్యోగాలు కావాలనే వారి జాబితాలో ప్రతినెలా చేరు తున్న కోటి మంది యువతీ యువకులకు వుపాధి కల్పిస్తామనే నినాదంతో కదా నరేంద్రమోడీ అధికారానికి వచ్చింది. నూట ముఫ్ఫై కోట్ల జనాభాలో మూడింట రెండు వంతుల మంది 35 సంవత్సరాల వయస్సు లోపు వారే, ఇంత మొత్తం గతంలో ఎన్నడూ లేరు. వారందరికీ వుపాధి కల్పించాలంటే నిరంతర అభివృద్ధి జరిగేందుకు ప్రధాన షరతుగా చెప్పాలంటే దేశీయ పొదుపు మొత్తం 35శాతానికి తగ్గకూడదని సీనియర్‌ ఆర్ధిక వేత్త హన్నా లుచినకావా చెప్పారు. మన దేశంలో ఏడాది క్రితం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మన పొదుపు 29.6శాతానికి పడిపోయింది. చైనా, తూర్పు ఆసియా దేశాలలో దశాబ్దాల తరబడి పొదుపు రేటు 30శాతానికి మించే వుంటున్నది. ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలను మౌలిక సదుపాయాల కల్పన పేరుతో ఖర్చు చేశారు. ఇంకా అంతరం వున్నందున పూర్తిగా సమకూర్చాలంటే మరొక లక్షా 70వేల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు అవసరం అవుతాయని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది.

    పాలకులు అనుసరించిన విధానాల కారణంగా మరోవైపున సంవత్సరాల తరబడి కొనసాగుతున్న అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన వుద్యోగ కల్పన, వున్నవి కూడా అరకొరవేతనాలు, అభివృద్ధి మందగింపు వంటి అనేక అంశాలు జనం జేబులను ఖాళీ చేస్తున్నాయి. అప్పులలో ముంచుతున్నాయి. ఈ స్ధితిలో పొదుపు చేయటానికి వారి దగ్గర డబ్బెక్కడ వుంటుంది ? న్యూఢిల్లీలోని ఒక ఎలక్ట్రిక్‌ కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పని చేస్తున్న 50 ఏండ్ల టేక్‌ మోహన్‌లాల్‌ గత మూడు సంవత్సరాలుగా తనకు సగటున ఏడాదికి ఎనిమిదిశాతం వేతనం పెరిగిందని అయితే పిల్లల విద్య, తల్లికి మందుల ఖర్చు 40శాతం పెరిగిందని చెప్పినట్లు రాయిటర్స్‌ తెలిపింది. ప్రయివేటు వుద్యోగుల పరిస్ధితి దాదాపు అన్ని చోట్లా ఇంతే వుంది. ద్రవ్యోల్బణం తగ్గిందంటూ రిజర్వు బ్యాంకు ఇటీవలి కాలంలో 175 పాయింట్ల మేరకు వడ్డీ రేట్లను తగ్గించింది. దాంతో బ్యాంకులు కూడా ఆ మేరకు డిపాజిటర్లకు వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇవి పొదుపు చేసే వారిని ఆకర్షించటం లేదు. కొన్ని ధనిక దేశాలలో ఎవరైనా బ్యాంకులలో డబ్బు దాచుకుంటే వారే బ్యాంకులకు ఎదురు వడ్డీ ఇచ్చే పరిస్ధితి వుంది. మన దేశంలో అధిక వడ్డీ రేటు కోసం పొదుపర్లు చూసే విషయం తెలిసిందే. బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించిన కారణంగా గత 53 సంవత్సరాలలో తొలిసారిగా బ్యాంకు డిపాజిట్ల అభివృద్ధి రేటు తగ్గిపోయింది.

   2013 నుంచి సవరించిన వృత్తుల నూతన వర్గీకరణ సమాచారం ప్రకారం http://indianexpress.com/article/india/india-others/rural-wage-growth-lowest-in-10-years-signals-farm-distress-falling-inflation/ మన దేశంలో 2014 నవంబరు మాసంలో గత పది సంవత్సరాలలో అతి తక్కువ గ్రామీణ వేతనం నమోదైంది. సగటున గ్రామీణ ప్రాంత వేతనాలు నవంబరు నెలలో 3.8శాతం వార్షిక పెరుగుదల కాగా 2005 తరువాత అది కనిష్టంగా వున్నట్లు తేలింది. నిజానికి కార్మికశాఖ లెక్కలు వాస్తవ పరిస్ధితులను ప్రతిబింబించవు అనే అభిప్రాయం ఒకటి వున్నప్పటికీ వాటి ప్రకారం కూడా తగ్గింది. 2011 జూన్‌లో గరిష్టంగా 23శాతం వరకు పెరిగింది. తరువాత క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే బొగ్గులేరుకోవటానికి భలే అవకాశం వచ్చిందిలే అని మరొకడు సంబరపడినట్లుగా గ్రామీణ వేతనాల పెరుగుదల రేటు తగ్గుదల వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం కంటే తక్కువగా వున్నందున వడ్డీ రేట్లు ఇంకా తగ్గించటానికి అవకాశాలు మెరుగుపడ్డాయని రిజర్వుబ్యాంకు విధాన నిర్ణేతలు భావిస్తుండటం ఆందోళనకరం. గ్రామీణ వేతన రేట్ల పెరుగుదల తగ్గటం అంటే వారి ఆదాయాలు పడిపోవటమే, దాని పర్యవసానం కొనుగోలు శక్తి క్షీణిస్తుంది అది దేశీయ డిమాండ్‌ తగ్గటానికి దారితీసి పరిశ్రమల మూత వంటి పరిణామాలకు దారితీస్తుంది. గత ఐదు సంవత్సరాల కాలంలో గ్రామీణ వేతనాలు వేగంగా పెరిగినందున అది ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ పెరుగుదలకు దారితీసిందనే తప్పుడు సిద్ధాంతాన్ని చెబుతున్నారు. 2007 నుంచి గ్రామీణ వేతనాల పెరుగుదలకు కారణం వ్యవసాయేతర వుపాధి అవకాశాలు పెరగటం, దానికి తోడు వుపాధి హామీ పధకం తోడైందని, రైతాంగ పంటలకు మంచి ధరలు వచ్చినందున పెరిగిన వేతనాలను రైతాంగం భరించగలిగిందని సూత్రీకరిస్తున్నారు. ఇప్పుడు నిర్మాణ, వుత్పాదక రంగం బలహీనపడటం, పంటల ధరలు పడిపోవటం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాలలో వేతనాల పెరుగుదల రేటు పడిపోయింది. దానికి తోడు వుపాధి హామీ పధకానికి తూట్లు పొడుస్తున్నందున గ్రామీణ వేతన రేట్లు ఇంకా పడిపోయే అవకాశం వుంది.

   గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సామాన్య, మధ్యతరగతి వారి ఆదాయాలను హరిస్తున్నవాటిలో విద్య, వైద్య ఖర్చులు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు గాక రుణ వూబిలో కూరుకుపోవటం గురించి మాత్రమే తెలుసు ఇప్పుడు గ్రామీణ, పట్టణ పేదలు, సామాన్య రైతాంగం విద్య, వైద్య ఖర్చుల రుణ వూబిలో దిగబడిపోతున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లి బయటకు రావాలంటే అప్పులు చేయటం మినహా మరొక మార్గం లేదన్నది అందరికీ తెలిసిందే. ఇటు వంటి స్ధితిలో పొదుపు మరింతగా పడిపోవటం అనివార్యం. దానితో పాటు పారిశ్రామిక వస్తువుల డిమాండ్‌ కూడా పడిపోతుంది. అపుడు క్రిసిల్‌ పేర్కొన్న రెండవ రోడ్డు మార్గం మూసుకుపోతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రేటింగ్‌ మతలబులో మరిన్ని భారాలు, సబ్సిడీల కోతకు వత్తిడి !

03 Thursday Nov 2016

Posted by raomk in BJP, CHINA, Congress, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

failure Modi, india debt, Modi Sarkar, Narendra Modi, s&p india, s&p india rating, subsidy, subsidy cuts

ఎం కోటేశ్వరరావు

    వూహల పల్లకిలో తేలుతున్న ప్రధాని నరేంద్రమోడీకి వారం రోజుల్లోనే రెండు చెడువార్తలు. సరళతర వాణిజ్య సూచికలో ప్రపంచ బ్యాంకు మన స్ధానాన్ని 131 నుంచి కేవలం 130కి మాత్రమే తాజాగా సవరించింది. పులి మీద పుట్రలా ఆ దెబ్బ నుంచి కోలుకోక ముందే అమెరికా రేటింగ్‌ సంస్ధ స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ (ఎస్‌అండ్‌ పి) వచ్చే రెండు సంవత్సరాల వరకు ప్రస్తుతం అత్యంత నాసిగా వున్న భారత్‌ రేటింగ్‌ను సవరించేది లేదని తేల్చి చెప్పింది. అంటే మన ప్రధాని నరేంద్రమోడీ సర్కార్‌ ‘పని తీరు మీద అంతగట్టి విశ్వాసం ‘ ఏర్పరుచుకుందన్న మాట. తాను రాగానే అంతర్జాతీయ సమాజంలో గత ప్రభుత్వ హయాంలో గతించిన భారత ప్రతిష్టను ఎంతగానో ఇనుమడింప చేశానని తనకు తానే కితాబు ఇచ్చుకున్న నరేంద్రమోడీకి దీన్ని పెద్ద తిట్టు, అవమానంగా భావిస్తారా ? లేక సంతృప్తి పరచే చర్యలు తీసుకుంటారా ? ఆ సంస్ధ మనకు ఇచ్చిన రేటింగ్‌‘ BBB-/A-3’ . దీన్ని వాణిజ్య పరిభాషలో చెప్పాలంటే పెట్టుబడులకు సంబంధించి అత్యంత తక్కువ గ్రేడ్‌ ఇది. ఇప్పుడున్న స్ధితి, జోస్యాలను బట్టి ఈ గ్రేడ్‌ అయితే స్ధిరంగా వుంటుందని, వచ్చే ఏడాది కూడా దీనిని సమీక్షించే అవకాశం లేదని, ప్రభుత్వ సంస్కరణలు, ద్రవ్య పరిస్ధితిని మెరుగు పరిస్తే, ప్రభుత్వ రుణం జిడిపికి 60శాతం కంటే తగ్గితే అప్పుడు రేటింగ్‌ సవరణ గురించి సమీక్షిస్తామని చెప్పటం పుండుమీద కారం చల్లటం వంటిది. సెప్టెంబరు నెలలో మూడీస్‌ సంస్ధ కూడా ఇదే విధంగా ఒకటి రెండు సంవత్సరాల తరువాతే సమీక్షిస్తామని చెప్పటాన్ని మరిచిపోరాదు. ప్రస్తుతం మన ప్రభుత్వ రుణ భారం 69శాతం వుంది. అంటే మనకు వంద రూపాయల ఆదాయం వస్తుందనుకుంటే అప్పు 69 రూపాయలు వున్నట్లు. మన జిడిపి పెరుగుదల గురించి మంచి మాటలు చెప్పిన ఎస్‌ఆండ్‌ పి 2016లో 7.9శాతం, 2016-18 సంవత్సరాలలో సగటున ఎనిమిది శాతం పెరుగుదల వుంటుందని, జిఎస్‌టి వంటి చర్యల పట్ల అభినందనలు కూడా తెలిపింది. అయితే ఈ బలంతో పాటు తక్కువగా వున్న తలసరి ఆదాయం, ప్రభుత్వ ఖజనా బలహీనంగా వుండటం, బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల వంటి బలహీనతలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటదని తేల్చి చెప్పింది.

    ఈ ప్రకటనతో హతాశురాలైన ప్రభుత్వం పెట్టుబడిదార్ల ఆలోచన, రేటింగ్‌ ఏజన్సీల మధ్య సంబంధాలు లేనట్లు కనిపిస్తున్నదని ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ ద్వారా వ్యాఖ్యానించింది.ఆర్ధిక వ్యవస్ధను పటిష్ట పరిచేందుకు, జిడిపి అభివృద్ధిని పెంచేందుకు, వుద్యోగ కల్పనకు ప్రయత్నిస్తామని కూడా దాస్‌ చెప్పారు.రేటింగ్‌ను మెరుగు పరచనంత మాత్రాన ప్రభుత్వం పెద్దగా ఆందోళన చెందటం లేదని, సంస్ధ నివేదికలో పేర్కొన్నట్లుగా వివిధ అంశాలను పోల్చుకుంటే భారత్‌తో సమంగా మరొక ఆర్ధిక వ్యవస్ధ వుందా అని ప్రశ్నిస్తూ రేటింగ్‌ ఇవ్వబోయే ముందు ఆత్మావలోకనం చేసుకోవాలని కూడా దాస్‌ అన్నారు. భారత రేటింగ్‌ను తక్కువ చూపుతున్నారని ప్రపంచ మదుపుదార్లు భావిస్తున్నారని, వారి ఆలోచనలు- రేటింగ్‌ సంస్ధలకు మధ్య సంబంధం లేనట్లుగా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు.

    మన ప్రభుత్వ రుణ భారం 1991లో ఆర్ధిక సంస్కరణలు ప్రారంభించిన సమయంలో జిడిపిలో 75.33 శాతం వుండేది. అది 1998లో బిజెపి నేత వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్‌డిఏ అధికారానికి వచ్చే నాటికి 68.09 శాతానికి తగ్గింది. తమ పాలనలో భారత్‌ వెలిగిపోతోంది అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగి బిజెపి ఓడిపోయిన సమయానికి 2003లో అప్పును రికార్డు స్ధాయికి 84.24 శాతానికి బిజెపి సర్కార్‌ తీసుకుపోయింది. ఆ తరువాత 2013 నాటికి 67.96 శాతానికి తగ్గింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015 నాటికి 69.07 శాతానికి పెరిగింది.http://countryeconomy.com/national-debt/india 2015 వివరాల ప్రకారం ప్రపంచంలోని 184 దేశాల జాబితాలో జడిపి-రుణం నిష్పత్తిలో మన దేశం 140 స్ధానంలో తలసరి అప్పులో 69లో వుంది.

Image result for worried arun jaitly

    మన దేశంలో కొంత మంది దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో వుండేందుకు ప్రయత్నిస్తారు. అనేక సందర్భాలలో చైనా, పాకిస్తాన్‌లతో మన దేశాన్ని పోల్చుకుంటారు. తప్పులేదు. అందుకే మచ్చుకు కొన్ని పోలికలు చూడండి.http://countryeconomy.com/countries/compare/china/india సమాచారం ప్రకారం 2015వ సంవత్సరంలో కొన్ని వివరాలు ఇలా వున్నాయి. జిడిపి మిలియన్‌ డాలర్లలో, తలసరి ఆదాయం డాలర్లుగా గమనించాలి.

                                చైనా                    భారత్‌                 పాకిస్తాన్‌

జిడిపి                  11,181,556             2,073,002             271,050

జిడిపి తలసరి                8,141                   1,581                 1,428

జిడిపిలోరుణశాతం           42.92                   69.07                 63.57

జిడిపిలోలోటుశాతం            2.69                     6.91                   5.24

     నరేంద్రమోడీ లేదా గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వమైనా అనుసరిస్తున్నది విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ అనుకూల విధానాలే అన్నది స్పష్టం. వివిధ దేశాలలోని రేటింగ్‌ సంస్ధలన్నీ వారి కనుసన్నలలో నడిచేవే, వారి లాభాలను కాపాడేవే అన్నది గమనంలో వుంచుకోవాలి. ఈ పూర్వరంగంలో ప్రపంచబ్యాంకు సూచికను చూసినా, ప్రస్తుత ఎస్‌ఆండ్‌ పి రేటింగ్‌ను గమనించినా మన దేశ పాలకవర్గం నుంచి ఇంకా మరిన్ని రాయితీలు, మరింతగా మన ఆర్ధిక వ్యవస్ధను తెరవాలని వత్తిడి చేస్తున్నాయన్నది స్పష్టం. జిఎస్‌టి అమలు వలన సమీప భవిష్యత్‌లో ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడదని ఎస్‌ అండ్‌ పి పేర్కొన్నది. గత రెండు దశాబ్దాల తీరుతెన్నులను గమనిస్తే సంస్కరణలు అమలు జరుపుతున్నామని చెబుతున్నప్పటికీ రెండు దశాబ్దాలలో జిడిపిలో ద్రవ్యలోటు 8.8శాతం, గత ఐదు సంవత్సరాల సగటు ఏడు శాతంగా వుంది. దీని పర్యవసానంగా మన దేశ రుణ భారంతో పాటు దానికి చెల్లించే వడ్డీ కూడా గణనీయంగా పెరుగుతోంది. జిడిపిలో మన ఆదాయం 21శాతం తక్కువగా వున్నదని, ఖర్చులో సబ్సిడీలు గణనీయంగా వున్నట్లు తాజా నివేదికలో పేర్కొన్నారు. అంటే అర్ధం పన్నులు,సెస్సుల వంటి వాటిని పెంచి ఆదాయం పెంపు, సబ్సిడీలకు మరింత కోత విధించి పొదుపును పెంచాలని పరోక్షంగా వత్తిడి చేయటమే. జిఎస్‌టి ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరుగుతుందని అయితే అది వెంటనే ఫలితాలను ఇవ్వదని, సబ్సిడీ కోతలు ఆలశ్యమౌతాయని స్పష్టంగా చెప్పింది. బ్యాంకులు ప్రత్యామ్నాయ వనరుల ద్వారా పెట్టుబడులను సమకూర్చుకోలేని పక్షంలో బాసెల్‌-3 ప్రమాణాల ప్రకారం 2019 నాటికి 45 బిలియన్‌ డాలర్ల మేరకు ప్రభుత్వం పెట్టుబడి నిధులను సమకూర్చాల్సి వుంటుందని, ప్రస్తుతం ప్రభుత్వం వాగ్దానం చేసిన 11 బిలియన్‌ డాలర్లను గణనీయంగా పెంచాలని తెలిపింది. ద్రవ్యోల్బణం రేటును 2017 మార్చి నాటికి ఐదు శాతానికి రిజర్వుబ్యాంకు పరిమితం చేయగలదనే ఆశాభావాన్ని వెలిబుచ్చింది. సంస్కరణల నిలిపివేత, అభివృద్ధి గిడసబారటం, నిర్ధేశిత లక్ష్యాలను అమలు జరపటంలో వైఫల్యం లేదా విదేశీ చెల్లింపుల పరిస్ధితి దిగజారితే రేటింగ్‌ను తగ్గించే అవకాశం వుంది. వీటిపై మోడీ ప్రబుత్వం తీసుకొనే చర్యల పట్ల విశ్వాసం లేక లేదా గట్టిగా అమలు జరిపించేందుకు రేటింగ్‌ ఏజన్సీలు ప్రస్తుతం ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ప్రపంచబ్యాంకు,రేటింగ్‌ ఏజన్సీలను సంతృప్తి పరచే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పటమంటే రానున్న రోజులలో కార్మికులు, వుద్యోగులు, సామాన్య జనానికి మరిన్ని కష్టాలు మూడబోతున్నట్లే భావించాలి.

    రేటింగ్‌ ఏజన్సీల వత్తిడి ఇప్పుడేదో ఆకస్మికంగా ప్రారంభం అయింది కాదు. ద్రవ్య పరిస్ధితిని పటిష్ట పరచేందుకు రూపొందించిన పధకానికి కట్టుబడి వుండకపోతే అనుకున్న ప్రకారం ఆదాయం పెరగకపోవటం, సబ్సిడీల కోత ఆలస్యం కావచ్చని ఇదే ఎస్‌ అండ్‌ పి సంస్ధ ఈ ఏడాది జనవరిలోనే హెచ్చరించింది. http://articles.economictimes.indiatimes.com/2016-01-31/news/70222497_1_services-tax-subsidy-cuts-finance-minister-arun-jaitley సంస్ధ విశ్లేషకుడు కైరన్‌ కరీ పిటిఐ వార్తా సంస్ధతో మాట్లాడుతూ ద్రవ్యలోటు లక్ష్యం చేరుకోవటాన్ని ఒక ఏడాది పాటు వాయిదా వేసి 2015-16 బడ్జెట్‌లో ప్రభుత్వం దారి తప్పిందని, అనుకున్న విధంగా ఆదాయం రాకపోవటం, ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీల కోతపై ఆటంకాలను ఎదుర్కొన్నదని చెప్పాడు. కార్పొరేట్‌ సంస్ధల వత్తిడి, రేటింగ్‌ సంస్ధలను సంతృప్తి పరచటం కోసమే నరేంద్రమోడీ సర్కార్‌ పెట్రోలు, డీజిల్‌పై ఎక్సయిజ్‌ సుంకం, సేవాపన్ను పెంపు,కిరోసిన్ పై నెలవారీ సబ్సిడీ తగ్గింపు , స్వచ్చభారత్‌, కృషి కల్యాణ్‌ వంటి రకరకాల సెస్సులను ఈ కాలంలో విధించి మరో ఔరంగజేబుగా మారిన విషయం తెలిసిందే. అయితే జనంపై మరిన్ని భారాలు మోపి 2019లో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి, దాని మిత్ర పక్షాలు ఓట్ల కోసం జనం ముందుకు వెళతాయా? అధికారం కోసం విదేశీ, స్వదేశీ కార్పొరేట్లు కోరుతున్న సంస్కరణలను ఏం చేస్తారు అన్నది చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచీకరణకు అనుకూలమెవరు, వ్యతిరేకమెవరు ? ఎందుకు ?

01 Tuesday Nov 2016

Posted by raomk in BJP, CHINA, Economics, Environment, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Others, UK, USA

≈ Leave a comment

Tags

anti globalisation, anti globalization movement, anti-neoliberal, Doing business rankings, globalization, India-Pakistan, Narendra Modi, WB Doing business ranking

ప్రపంచీకరణ పర్యవసానాలు-2

     ప్రపంచీకరణ గురించి రెండు అభిప్రాయాలు వున్నాయి. అది ప్రపంచానికి మంచి చేస్తుందని కొందరంటే చెడు చేస్తుందని మరికొందరు చెబుతారు. చరిత్రలో వర్గాలు లేనటు వంటి ఆదిమ సమాజాన్ని( దాన్నే ఆదిమ కమ్యూనిస్టు సమాజం అని కూడా పిలుస్తారు) మినహాయిస్తే సమాజంలో వర్గ విభజన జరిగినప్పటి నుంచి ప్రతి కొత్త దశలోనూ దాని మంచి చెడ్డలపై రెండు అభిప్రాయాలు వెలువడుతూనే వున్నాయి. బానిస, అర్ధబానిస లేదా ఫ్యూడల్‌, పెట్టుబడిదారీ వ్యవస్థలన్నింటా ఒక వర్గానికి మేలు జరుగుతూనే వుంది. అలాంటి వారంతా దానిని కాపాడుకొనేందుకు అవసరమైన సాహిత్యం, మూఢనమ్మకాలు, నమ్మకాలు, తత్వశాస్త్రాలను అభివృద్ధి చేశారు. నష్టపోయిన వర్గం ఆ వ్యవస్ధలను కూల్చివేసేందుకు, జనాన్ని కూడగట్టేందుకు తనదైన సాహిత్యం, తత్వశాస్త్రాలను అభివృద్ధి చేసుకుంది. ప్రస్తుతం చర్చనీయాంశంగా వున్న ప్రపంచీకరణ భావన, పద్దతుల గురించి కూడా ఇదే విధమైన రెండు రకాల సాహిత్యాలు వెలువడుతున్నాయి. ఒక గుణాత్మక మార్పు పరిమాణాత్మక మార్పుకు దారితీయాలంటే అందుకు అనువైన పరిస్థితులు తయారు కావాలి. ఆవిరి రావాలంటే నీరు వంద డిగ్రీల వుష్ణోగ్రత వరకు మరగాల్సిందే. ఆలోగా కుండ లేదా పాత్ర లోని నీటిలో అనేక మార్పులు జరుగుతాయి తప్ప అవి మనకు కనిపించవు. అందరూ ఇష్టపడే అందమైన సీతాకోక చిలుక అవతరించటానికి ముందు అది అసహ్యించుకొనే గొంగళి పురుగు రూపంలో వుంటుంది. ప్రపంచీకరణ అన్నది పెట్టుబడిదారీ వర్గం రూపొందించిన తాజా అధునాతన దోపిడీ అస్త్రం.కార్మికవర్గం గుర్తించలేనంత సమ్మోహనంగా వుండి, వారి మద్దతు కూడా పొందేంత అంటే అతిశయోక్తికాదు. తెలిసో తెలియకో కార్మికవర్గం మద్దతు లేదా వుపేక్ష కారణంగానే అదింకా బతికి బట్టగలుగుతోంది. బానిస, ఫ్యూడల్‌ వ్యవస్ధలను అదుపు చేసిన వర్గాలు అవి కూలిపోయేంత వరకు శాశ్వతమనే భ్రమించాయి,భావించాయి. జనంలో చైతన్యం పెరుగుతున్న కొద్దీ ఆ వ్యవస్ధలలో కూడా పాలకవర్గం సంస్కరణలు ప్రవేశపెట్టకపోలేదు. ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్ధ కూడా అదే భావంతో, అదే బాటలో వుంది. సహజం.

     ప్రపంచీకరణను వ్యతిరేకించే వారు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారా ? కానే కాదు, ముందటి సమాజాలు, తరతరాల అనుభవసారం నుంచి దానిని గ్రహించారు.ఒక విధానం మంచిదా కాదా అని నిర్ధారించటానికి ఎంత కాలం కావాలి? ప్రాతిపదికలేమిటి ? ప్రపంచీకరణ పేరుతో తీసుకున్న లేదా ఇంకా ప్రతిపాదిస్తున్న చర్యలన్నీ సామాన్య జనానికి తక్షణం హాని చేసేవి, అయితే శరీరంలో దెబ్బతిన్న భాగాన్ని తొలగించాలంటే శస్త్ర చికిత్స చేయాలి, తొలుత బాధగానే వున్నప్పటికీ తరువాత జీవితాంతం సుఖం అనుభవిస్తారు కనుక తాత్కాలిక బాధను భరించాలని ప్రపంచీకరణ వాదులు నమ్మబలుకుతారు.చిత్రం ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచీకరణ కోరుకున్న వారే భిన్న స్వరాలు వినిపిస్తున్నారు.https://www.bloomberg.com/view/articles/2016-10-26/world-faces-long-period-of-stagnation-ahead  సత్యజిత్‌ దాస్‌ అనే ఒక బ్యాంకరు ‘ నిండుకున్న ప్రపంచ అమ్ముల పొది’ అనే పేరుతో బ్లూమ్‌బెర్గ్‌ వెబ్‌సైట్‌లో ఒక వ్యాసం రాశారు. ‘ పురోభివృద్ధిని పునరుద్దరించేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు తాము చేయగలిగినవి ఇంకా ఎన్నో వున్నాయని చెబుతూనే వున్న ప్రపంచ విధాన రూపకల్పనవేత్తలు ఎవరూ కూడా ఓటమిని అంగీకరించటానికి సిద్ధ పడటం లేదు. రెండు కాళ్లూ పొగొట్టుకొని దారిలో పడివున్న మల్లయ్య నేను లేస్తే మనిషిని కాను అని విజయం సాధించిన వారిని బెదిరించే మాదిరి వారి తీరు వుంది. వాస్తవం ఏమిటంటే ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకుల దగ్గర ఇంక ఆయుధాలేమీ మిగల్లేదు.’ ఇలా ప్రారంభమైంది.

     ‘ ప్రపంచవ్యాపితంగా డిమాండ్‌ మందగించటం, అనేక పరిశ్రమలు సామర్ధానికి మించి వుండటం వంటి పర్యవసానాలతో పెట్టుబడి నలిగిపోతోంది. కొన్ని బ్యాంకుల దగ్గర కొండల మాదిరి కారుచౌకగా దొరికే డబ్బు పేరుకుపోతున్నప్పటికీ రుణాలు తీసుకొనే వారు ముందుకు రావటం లేదు. ధన చలన వేగం చాలా తక్కువగా వుంది. తక్కువ లేదా ప్రతికూల వడ్డీ రేట్ల కారణంగా నిధులు సమకూర్చటం, బ్యాంకుల లాభాలు దెబ్బతింటున్నాయి. తమ పొదుపును మరోచోటికి బదలాయించుకోవటం, నగదుగా మార్చుకోవటం వంటి చర్యలను ప్రభుత్వాలు నిషేధించటం వంటి చర్యలు చేపడితే తప్ప వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు వాటిని ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదు. పెన్షన్‌ నిధులు, వుద్యోగ విరమణ తరువాత ఇచ్చే లబ్ది గురించి చేసుకున్న ఒప్పందాలు, బీమా కంపెనీల సామర్ధ్యాలను ఇప్పటికే ప్రతికూల వడ్డీ రేట్లు ప్రశ్నిస్తున్నాయి. అనేక ప్రభుత్వ, కార్పొరేట్‌ బాండ్లు, చివరికి కంపెనీల వాటాలను కూడా కొనుగోలు చేయటం ద్వారా విత్త మార్కెట్లను ప్రభావితం చేస్తున్నప్పటికీ జపాన్‌ రిజర్వు బ్యాంకు ఇప్పటికే ఆ పని చేసింది.ఆర్ధిక వ్యవస్ధపై ప్రభుత్వ పట్టు పూర్తిగా వుండేందుకు లెనిన్‌ హయాంలో సోవియట్‌ యూనియన్లో జరిగిన మాదిరి రిజర్వుబ్యాంకులు తమ అధికార కత్తులను ఝళిపించటం పెరిగిందన్నది నిజం. ఇదే సమయంలో ఈ విధానాల పరిమితులన్నీ అయిపోతున్నట్లు అందరికీ కనిపిస్తోంది. జపాన్‌, ఐరోపా దేశాల రిజర్వు బ్యాంకులకు కొనుగోలు చేసేందుకు తగిన బాండ్లు కనిపించటం లేదు. అంతా అనివార్యమని చెప్పలేముగాని వడ్డీ రేట్ల మరింత తగ్గింపు, పరిమాణాత్మక ఆంక్షలు మరింత సడలింపు మార్కెట్‌ రేట్లు, ఆస్థుల ధరలు లేదా నగదు విలువలపై పెద్ద ప్రభావమే చూపుతాయి.

     ఈ పరిస్ధితి మాంద్యంగా వున్న వాటికి ప్రభుత్వాలు ఆర్ధిక వుద్దీపనలు కలిగించటం అనే ఒక నూతన ఏకాభిప్రాయాన్ని పురికొల్పింది. ఇప్పటికే అనేక అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలు లోటుతో నడుస్తున్నాయి.కొన్ని వ్యవస్ధాగతమైన లోపాలతో వున్నాయి. వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు అదనంగా ఖర్చు చేస్తే తరువాత అది ప్రభావశీలంగా వుండాలంటే తరువాత కూడా కొనసాగించాల్సిందే. మౌలిక వసతుల వంటి వాటికి పెట్టుబడులు పెడితే తరువాత ప్రాజెక్టును బట్టి దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయి. ఎందుకంటే ప్రభుత్వాలు కృత్రిమంగా తక్కువ వడ్డీ రేటు లేదా ప్రతికూల వడ్డీ రేట్లతో డబ్బు తీసుకు వచ్చి ఖర్చు చేయటం అంటే దాని అర్ధం ప్రతిఫలం లభిస్తుందని కాదు. పెద్దగా ప్రయోజనం లేని ఆస్థులపై పెట్టిన పెట్టుబడిగా మారే ప్రమాదం వుంది.’

      ప్రపంచీకరణ వెనక్కు నడుస్తోంది అనే పేరుతో మరొక సమర్ధకుడు ఒక విశ్లేషణ చేశారు.https://www.bloomberg.com/view/articles/2016-10-26/globalization-goes-into-reverse ఇది కూడా ఆసక్తి కలిగించేదే. నోవా స్మిత్‌ అనే రచయిత తన విశ్లేషణను ఇలా ప్రారంభించాడు.’ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా అనేక పశ్చిమ దేశాలలో ప్రతి క్రియ జరుగుతోంది. అంతర్జాతీయ వాణిజ్యం, వలసలకు సంబంధించి అమెరికన్లు ఇప్పటికీ సానుకూల అంశాల గురించి చెప్పవచ్చు, రాజకీయ అభ్యర్ధులైన ట్రంప్‌, బెర్నీ శాండర్స్‌ వంటివారు ఒక దశాబ్దం క్రితం వూహించటానికే అవకాశం లేని ఈ రెండింటిని వ్యతిరేకించే వారిని నుంచి ఒక పరిధి మేర ఎంతో మద్దతు పొందుతున్నారు. వాణిజ్య లావాదేవీలలో అంతగా తెలియని పసిఫిక్‌ సముద్ర రాజ్యాల భాగస్వామ్య (టిపిపి) ఒప్పందం ప్రమాదంలో పడింది. ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడాకులు తీసుకోవటాన్ని కూడా ప్రపంచీకరణకు తిరస్కరణే అన్నది ఏక కంఠంతో చెప్పిన భాష్యం. కానీ నేటి ప్రపంచీకరణ వ్యతిరేక యుద్ధ వీరులు నిన్నటి యుద్ధం గురించి పోరాడుతున్నారు. ఏ విధంగా చూసినప్పటికీ 2008 సంక్షోభం నాటి నుంచి ప్రపంచీకరణ పూర్తి తిరోగమనంలో వుంది. మొదటిది వాణిజ్య విషయానికి వస్తే 2008 వరకు ఆరోగ్యకరంగా పెరిగింది. సంక్షోభం, మాంద్యం తరువాత ఇంతవరకు పూర్వపు స్థాయికి చేరుకోలేదు. రెండవది వలసల విషయానికి వస్తే ప్రపంచవ్యాపితంగా నెమ్మదిగా వలసలు పెరుగుతున్నాయి. అమెరికాకు అనూహ్య పెరుగుదల ఆగిపోయింది. మెక్సికో నుంచి అమెరికాకు వలసలు ఒక పెద్ద రాజకీయ వివాదంగా వుండేవి కాస్తా ఆ సమస్య ఇప్పుడు అటుదిటు అయింది. 2008 నుంచి 2014 వరకు అమెరికాలో నివశించే మెక్సికన్ల జనాభా పదిలక్షల మంది తగ్గిపోయారు.కారణం, అధికారికంగా నమోదు కానటువంటి మెక్సికన్‌ వలసదారులు పెద్ద సంఖ్యలో తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. తరువాత ఆర్ధికం గురించి, సంక్షోభానికి ముందు వున్న స్ధాయితో పోల్చితే అంతర సరిహద్దుల మధ్య జరిగే నగదు బదిలీలు తగ్గినట్లు యుబిఎస్‌ బ్యాంకు వివరాలు వెల్లడిస్తున్నాయి. మరో మాటలో చెప్పాలంటే ప్రపంచీకరణ అనూహ్య పెరుగుదల ఇరవయ్యవ శతాబ్ది చివరి నాటికే అంతమైంది. ఇరవై ఒకట శతాబ్ది ప్రారంభం ముగిసింది, ప్రపంచీకరణ చుట్ట విడిపోవటం ప్రారంభం కూడా కావచ్చు. పది సంవత్సరాల ఆలస్యంగా ప్రపంచీకరణ అపస్మారకం గురించి ఆందోళన పడుతున్నట్లుగా వుంది.’

   ఇంత త్వరగా ప్రపంచీకరణపై పెట్టుబడిదారీ మేథావులలో భ్రమలు వైదొలగటం ప్రారంభం అవుతుందని ఎవరూ వూహించలేదంటే అతిశయోక్తి కాదు.మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలో వచ్చిన సంక్షోభాలు, తీవ్ర ఆర్ధిక మాంద్యం కారణంగా అనేక దేశాలు తమ పరిశ్రమలు, వాణిజ్య రక్షణ చర్యలను తీవ్రతరం చేశాయి.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి చిన్నా, చితకా దేశాలు తప్ప వలసలు పూర్తిగా అంతరించటంతో యుద్ధ సమయంలోనే అమెరికా-బ్రిటన్‌లు యుద్ధం ముగిసిన తరువాత వాణిజ్య ఏర్పాటు ఎలా వుండాలో చర్చలు ప్రారంభించాయి. వాటి ఫలితమే 1947 ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు జెనీవాలో 23 దేశాల చర్చలు ఫలించి ప్రపంచీకరణకు తెరతీసిన పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం (గాట్‌) కుదిరింది. అక్కడే అత్యంత సానుకూల దేశ హోదా కూడా పురుడు పోసుకుంది. ఒప్పందాన్ని అంగీకరించిన దేశాలు సభ్య దేశాల వస్తువులకు పన్నులు, ఇతర ఆటంకాలను తగ్గించటం, ఎత్తివేయటమే గాట్‌లోని కీలకాంశం. తరువాత 2000 సంవత్సరం నుంచి దాని కొనసాగింపుగా ప్రపంచ వాణిజ్య సంస్ద రంగంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

    ప్రపంచీకరణను ముందుకు తెచ్చిన ధనిక దేశాల ఆశలు, ఆకాంక్షలు, అంచనాలకు భిన్నంగా, వివిధ దేశాల మధ్య అసమాన ప్రయోజనాలు వస్తున్నాయని అనేక అంశాలు వెల్లడిస్తున్నాయి. చైనాను చూసి ప్రయివేటు పెట్టుబడులు అక్కడ పొందుతున్న లబ్దిని చూసి భారత్‌ సంస్కరణలు మొదలు పెట్టిందా లేక సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత పెట్టుబడిదారీ ధనిక దేశాలతో అంటకాగితే ప్రయోజనం వుంటుందని పాలకవర్గం భావించి సంస్కరణలకు శ్రీకారం చుట్టిందా అన్నది ఒక చర్చ నీయాంశం. సోవియట్‌ కూలిపోక ముందే 1988లో ప్రధాని రాజీవ్‌ గాంధీ చైనా పర్యటన జరపటం ఒక కీలకాంశం. నూతన ఆర్ధిక విధానం పేరుతో రాజీవ్‌ గాంధీ మాట్లాడిన పూర్వరంగం సంస్కరణలలో భాగమే. తరువాత సోవియట్‌, తూర్పు ఐరోపా రాజ్యాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత పీవీ నరసింహారావు రూపంలో సంస్కరణల పేరుతో మన మార్కెట్‌ను తెరిచేందుకు నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంస్కరణలు ఏ దేశానికి ఎక్కువ ప్రయోజనం కలిగించాయో తెలిసిందే. జపాన్‌కు చెందిన ‘రీతి’ సంస్ధ పరిశోధన ప్ర కారం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో మన వ్యవస్థను ముడివేసిన కారణంగా మన పరిశ్రమలు లబ్ది పొందటంతో పాటు వుపాధి అవకాశాలు కూడా పెరిగాయి. http://www.rieti.go.jp/en/publications/summary/16080003.html అయితే అవి చైనాతో పోల్చుకుంటే చాలా పరిమితం. ఈ రెండింటితో పాటు మరికొన్ని దేశాలు లబ్ది పొందితే ఆ మేరకు ధనిక దేశాలు నష్టపోయాయి. 1995-2011 మధ్య కాలంలో ప్రపంచ విలువ గొలుసులో భారత పరిశ్రమలు చేసిన వుత్పత్తిలో తమ ఆదాయ వాటాను దాదాపు రెట్టింపు చేసుకున్నాయి. అందువలన మిగతా పరిశ్రమలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాయని వేరే చెప్పనవసరం లేదు.ఈ విషయంలో మన పరిశ్రమలు రెండు నుంచి నాలుగుకు పెరిగితే చైనా నాలుగు నుంచి 16కు ఎదిగింది. ఇదే సమయంలో కేవలం విదేశాల కోసం చేసిన వుత్పత్తి విలువ మన దేశంలో 18 నుంచి 28కి పెరిగితే చైనాలో 35 నుంచి 42కు మాత్రమే పెరిగింది. అంటే చైనా కంటే విదేశాల కోసం తయారు చేసే సరకుల విషయంలో మన దేశం ఎంతో ముందుకు పోయింది. ఈ కారణంగానే మన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి వారు మేకిన్‌ ఇండియా, మేకిన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో భారత్‌లో సరకులు తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేసుకోండి మంచి అవకాశాలు కల్పిస్తామని వెంపర్లాడుతున్నారు. రాయితీలు ప్రకటిస్తున్నారు. కేవలం ఎగుమతుల మీద ఆధారపడి ఆర్ధిక వ్యవస్థలను నిర్మించుకోవటం మంచిది కాదని లాటిన్‌ అమెరికా అనుభవం గ్రహించిన చైనా 2008 సంక్షోభం తరువాత తన అంతర్గత డిమాండ్‌ను పెంచటంపై కేంద్రీకరించింది. ఈ కారణంగానే సంక్షోభ ప్రభావం దాని ఆర్ధిక వ్యవస్ధపై పరిమితంగా పడిందన్నది కొందరి విశ్లేషణ.

     వస్తూత్పత్తి రంగంలో నానాటికీ నిపుణులైన కార్మికుల అవసరం పెరుగుతోంది. ఈ విషయంలో కూడా మనం చైనాతో పోల్చుకోవటానికి లేదు. 1995-2011 మధ్య మన దేశంలో వున్నత నిపుణులైన కార్మికులు 106.8శాతం పెరిగితే చైనాలో 211.2 శాతం పెరిగారు, పరిమిత నిపుణులైన వారు చైనాలో 35.6, భారత్‌లో 49.4 శాతం పెరిగారు. నైపుణ్యం లేని కార్మికుల శాతాలు 6.3, 4.4 శాతం చొప్పున మాత్రమే పెరిగారు. మన దేశంలో మధ్య తరగతి, చివరికి కార్మికవర్గంలో కూడా ప్రపంచీకరణకు అనుకూలత వ్యక్తం చేయటానికి ఈ పరిణామం కూడా దోహదం చేసినట్లుగా కనిపిస్తున్నది. మిగతావారితో పోల్చితే నిపుణులైన కార్మికులకు వేతనాలు సహజంగానే ఎక్కువ వుంటాయి కనుక, అవి ప్రపంచీకరణ పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధను ప్రపంచ వ్యవస్ధతో ముడిపెట్టిన కారణంగానే వచ్చాయి కనుక ఆ విధానాలకు ఆకర్షితులు అవుతున్నారు. 1991-2014 మధ్య మన దేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులు పని చేసే పరిశ్రమల సంఖ్య గణనీయంగా పెరిగింది. నైపుణ్యం లేని కార్మికులు పని చేసే పరిశ్రమలు అంతకంటే ఎక్కువగా తగ్గిపోయాయి.

Image result for globalisation: why do people are opposing and supporting ?

    ఇదే సమయంలో ధనిక దేశాలలో పరిస్థితి ఏమిటి ? అమెరికాలో వున్నత నైపుణ్యం, పరిమిత నైపుణ్యం, నైపుణ్యం లేని కార్మికుల సంఖ్య స్ధిరంగా కూడా లేకపోగా 9.6,32.6,46.6 శాతాల చొప్పున, జపాన్‌లో 7.7, 29.8, 65.7 శాతాల చొప్పున తగ్గారు. ‘రీతి’ సర్వే చేసిన దేశాలలో ఒక్క చైనా, భారత్‌లో తప్ప మిగతా ప్రధాన దేశాలైన దక్షిణ కొరియాలో 66.5, తైవాన్‌లో 36.7, జర్మనీలో 17.7, ఇండోనేషియాలో 12.3 శాతం చొప్పున తగ్గారు. అందువలన సహజంగానే అక్కడి పౌరులలో ప్రపంచీకరణ వుత్పత్తి విధానం పట్ల తద్వారా ఆదాయాలు తగ్గటం వలన ప్రపంచీకరణ వ్యతిరేకత పెరుగుతోందన్నది స్పష్టం. చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన అక్కడ ఆర్ధిక అసమానతలు వున్నప్పటికీ కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగాయన్నది అందరూ అంగీకరిస్తున్న సత్యం. అక్కడ పెరుగుతున్న వేతనాలను చూస్తే http://money.cnn.com/2016/03/17/news/economy/china-cheap-labor-productivity/ అనుకున్నంత చౌక కాదని అమెరికన్లే చెబుతున్నారు. అమెరికాతో పోల్చితే నాలుగు శాతమే తక్కువని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ చెప్పిన విషయాన్ని నిర్ధారించుకోవాల్సి వుంది. చైనాతో పోల్చితే మన దేశంలో అత్యంత నిపుణులైన కార్మికులకు కూడా వేతనాలు తక్కువే అన్నది తెలిసిందే. ఇది కూడా మోడీ వంటి వారిని మేకిన్‌ ఇండియా నినాదాలకు పురికొల్పింది. ఒకవైపు ఇది పారిశ్రామికవేత్తలను వుత్సాహపరుస్తుంటే మరోవైపు ప్రపంచీకరణ ఫలితాలు కొంత మంది చెప్పినట్లు ఊట మాదిరి దిగువకు దిగటంలేదు. అందుకే ఆర్ధిక అసమానతలు తీవ్రం అవుతున్నాయి.నైపుణ్యం లేని, పరిమిత నైపుణ్యం గల కార్మికులందరూ కాంట్రాక్టు వుద్యోగులుగా, తక్కువ వేతనాలకు పని చేసే అసంఘటి పని వారిగా మారిపోతున్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమలన్నీ ఆటోమేషన్‌ కొద్ది మంది కార్మికులతో నడిచేవి తప్ప ఎక్కువ మందితో అవసరం వుండదు. అందువలన అంకెలలో అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ అది వుపాధి రహితంగా వుంటోంది. రానున్న రోజుల్లో ఈ ధోరణిని మరింతగా పెంచాలని, వున్న కార్మిక చట్టాలను కూడా క్రమంగా ఎత్తివేయాలన్నది పాలకుల లక్ష్యంగా వుంది.

    సరళీకరణ, ప్రపంచీకరణ వలన కలిగే లాభాలను ఎలా చూడాలి ? తాజ్‌ మహల్‌ కట్టించిందెవరు అని కాదు, దానికి రాళ్లెత్తిన కూలీల గురించి చూడాలని శ్రీశ్రీ చెప్పినట్లుగా మన దేశంలో ఏటేటా పెరుగుతున్న ధనికుల గురించి వార్తలను లొట్టలు వేసుకుంటూ చదువుతున్నాం, చూస్తున్నాం తప్ప అందుకు దోహదం చేసిన స్ధితి గురించి ఎందరు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రతి వ్యక్తికి ఎంత లాభం, నష్టం వచ్చిందని చూడటం సాధ్యం కాని మాట నిజమే. ఈ విధానాలకు అనుగుణ్యంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు, మినహాయింపులు ఇస్తున్నాయి. ప్రస్తుతం అవి ఏడాదికి ఆరులక్షల కోట్ల రూపాయలు దాటాయి. విద్య, వైద్యం వంటి సేవలకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలను చూస్తే మనకు పరిస్ధితి అర్ధం అవుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో కనీసం విద్యార్ధినులకు కూడా అన్ని చోట్లా మరుగుదొడ్ల సౌకర్యం లేకపోతే సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఆదేశాలు ఇవ్వాల్సిన దుస్ధితి ఈ సంస్కరణల కాలంలోనే జరిగింది.http://www.freshwateraction.net/content/all-govt-schools-must-have-toilet-november-end-supreme-court-india నిజానికి ఇతర సబ్సిడీలను కలుపు కుంటే అంతకంటే ఎక్కువే వుంటాయి.అన్నింటి కంటే దారుణం ఏమంటే కార్పొరేట్‌ కంపెనీలు సకల రాయితీలు పొందుతూనే చెల్లించాల్సిన పన్నులను కూడా ఏదో ఒక రూపంలో ఎగవేస్తున్నాయి.http://timesofindia.indiatimes.com/budget-2016/union-budget-2016/Budget-2016-Tax-forgone-gets-a-fancy-name-but-still-a-burden/articleshow/51202028.cms కార్పొరేట్‌ పన్ను 32.45 శాతం చెల్లించాల్సి వుండగా కేవలం 24.67 శాతమే చెల్లిస్తున్నాయని 2014-15 సంవత్సరం గురించి కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అంటే దయామయులైన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు రాయితీలు పొంది, పన్నులు పూర్తిగా చెల్లించటం లేదన్నది స్పష్టం. ధనికులకు మరిన్ని రాయితీలిచ్చేందుకు చూపుతున్న శ్రద్ధ ప్రభుత్వ స్కూళ్లలో కనీస వసతులు కల్పించేందుకు కూడా ప్రభుత్వాలకు లేకపోయిందంటే ప్రపంచీకరణ ఎవరికోసం ? ఎవరికి వుపయోగపడినట్లు ?  ధనిక దేశాలలో ప్రపంచీకరణ వ్యతిరేకత ఏ రూపాలలో వ్యక్తమౌతోంది ? వచ్చే భాగంలో చదవండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d